clean
-
అసెంబ్లీలో ఎమ్మెల్యేల గలీజు పని.. స్పీకర్ ఫైర్
అసెంబ్లీకి వెళ్లిదే ఎవరు.. ప్రజా ప్రతినిధులు. వారు ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. వారి వ్యక్తిగత అలవాట్లను పక్కన పెడితే, అసెంబ్లీని మాత్రం శుభ్రంగా ల్సిన కనీస బాధ్యత వారిపై ఉంటుంది. అది కూడా ఎమ్మెల్యేలు చేయకపోతే, ఇక ప్రజలకు వారిచ్చే సందేశం ఏముంటుంది. మరి అటువంటి ఎమ్మెల్యేలు తమ బాధ్యతను మరిచి కనీసం అసెంబ్లీని శుభ్రంగా ఉంచడంలో నిర్లక్ష్యం వహిస్తే, ఇలానే ఉంటుంది. అసలు ఏమి జరిగిందనే విషయాన్ని ఒక్కసారి చూస్తే..ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఇవాళ ఆసక్తికరమైన ఉదంతం జరిగింది. అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా అసెంబ్లీ హాల్ను సిబ్బందితో కలిసి శుభ్రం చేశారు. అనంతరం విధాన సభలో ఆయన చేసిన ఓ ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. సభా ప్రాంగణంను శుభ్రంగా ఉంచాలని సభ్యులను కోరిన ఆయన.. తాను శుభ్రం చేయడానికి గల కారణం చెప్పడంతో ఎమ్మెల్యేలంతా తలలు దించుకున్నారు.సెషన్ ప్రారంభమైన వెంటనే స్పీకర్ సతీష్ మహానా సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ ఉదయం విధాన సభ హాల్లో జరిగిన ఓ ఘటన గురించి మీకు చెప్పాలి. సభ్యుల్లో ఒకాయన పాన్ మసాలా నమిలి ఉమ్మేశారు. విషయం తెలియగానే నేనే స్వయంగా వెళ్లి అక్కడ శుభ్రం చేశా. ఆ ఎమ్మెల్యే ఎవరనేది ఆ వీడియోలో నేను చూశా. కానీ, పేరు చెప్పి ఒక గౌరవ సభ్యుడి పరువు తీయాలని అనుకోవడం లేదు. తనంతట తానుగా ఆయన నా దగ్గరకు వచ్చి వివరణ ఇచ్చుకుంటే మంచిది. లేకుంటే నేనే పిలవాల్సి ఉంటుంది. ఈ సమయంలో దయచేసి మీ అందరికీ ఓ విజ్ఞప్తి. ఇక మీదట అలా ఎవరైనా చేస్తుండడం మీరు గమనిస్తే.. వాళ్లను అడ్డుకోండి. ఎందుకంటే.. అసెంబ్లీని శుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని అన్నారు. #WATCH | Uttar Pradesh Assembly Speaker Satish Mahana raised the issue of some MLA spitting in the House after consuming pan masala. He said that he got the stains cleaned, urged other MLA to stop others from indulging in such acts and also appealed to the MLA to step forward and… pic.twitter.com/VLp32qXlU8— ANI (@ANI) March 4, 2025 -
మేకప్ బ్రష్లు శుభ్రం చేస్తున్నారా..?
సాధారణంగా ముఖానికి మేకప్ వేసుకున్నాక, కొన్ని గంటల్లోనే దాన్ని క్లీన్స్ చేస్తుంటాం. చాలా శ్రద్ధగా చర్మం పాడవకుండా చూసుకుంటాం. మరి మేకప్ కోసం రోజూ వాడే బ్రష్ల సంగతేంటి? వాటిని క్రమం తప్పకుండా శుభ్రం చేస్తున్నారా? ఆ తర్వాత ఆరబెడుతున్నారా? బ్యాక్టీరియా చేరకుండా జాగ్రత్త పడుతున్నారా? లేదంటే యమ డేంజర్ అంటున్నారు నిపుణులు. కనీసం ప్రతి రెండు వారాలకు ఒకసారి మీ మేకప్ బ్రష్లను శుభ్రం చేసుకోమని హెచ్చరిస్తున్నారు. చేతులతో శుభ్రం చేస్తే బ్రష్లు పూర్తిగా శుభ్రపడవని అనుకుంటున్నారా? మేకప్ బ్రష్లను సులువుగా శుభ్రం చేయడానికే ఈ మేకప్ బ్రష్ క్లీనర్ అందుబాటులోకి వచ్చింది. చిత్రంలోని ఎలక్ట్రిక్ మేకప్ బ్రష్ క్లీనర్ తరచుగా మేకప్ వేసుకునే వారికి చక్కగా ఉపయోగపడుతుంది. ఇది అన్ని సైజ్లలోని కాస్మెటిక్ మేకప్ బ్రష్ కిట్లకు అనువుగా ఉంటుంది. ఇది బ్రష్లను పూర్తిగా శుభ్రం చేయడమే కాకుండా, వెంటనే పొడిగా ఆరబెడుతుంది కూడా! బ్రష్ కుచ్చు ఊడిపోకుండా, బ్రష్కు ఏమాత్రం డ్యామేజ్ కాకుండా శుభ్రం చేస్తుంది. మేకప్ అవశేషాలను, నూనె లేదా క్రీమ్స్తో వచ్చే జిడ్డును, మలినాలను పూర్తిగా తొలగిస్తుంది. దీనిని వాడుకోవడం చాలా తేలిక. ఐషాడో బ్రష్ల నుంచి పౌడర్ బ్రష్ల వరకు అన్నింటినీ దీనితో క్లీన్ చేసుకోవచ్చు. గర్ల్ ఫ్రెండ్, వైఫ్, మదర్ లేదా సిస్టర్ ఇలా రిలేషన్స్ ఏదైనా వారి స్పెషల్ డేకి ఈ డివైస్ని అందిస్తే పర్ఫెక్ట్ గిఫ్ట్ అవుతుంది. దీని ధర కేవలం రూ.600 మాత్రమే. ఇతర కంపెనీల్లో క్వాలిటీని బట్టి ధరల్లో తేడా ఉండొచ్చు. రివ్యూలను పరిశీలించి, ఇలాంటి పరికరాలను కొనుగోలు చేసుకోవచ్చు. (చదవండి: వాన చినుకులలో వడ్డన..!) -
Namami Gange గంగానదిపై మహిళా జవాన్లు
శుభ్రత ఎక్కడుంటే మహిళలు అక్కడుంటారు. లేదా, మహిళలు ఎక్కడుంటే శుభ్రత అక్కడ ఉంటుంది. శుభ్రంగా ఉంచటం అన్నది మహిళల సహజ నైజం. మహిళలే కాదు, దైవత్వం కూడా శుభ్రత ఉన్న చోట కొలువై ఉంటుంది. ‘క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్›్ట టు గాడ్లీనెస్’ అనే మాట వినే ఉంటారు.ఇంటిని, సమాజాన్ని శుభ్రంగా ఉంచటంలో కీలక బాధ్యతను వహిస్తున్న మహిళలే ఇప్పుడు తాజాగా దైవకార్యం వంటి ‘స్వచ్ఛ గంగా’ ఉద్యమ ప్రచారాన్ని చేపట్టారు. గంగానదిని ప్రక్షాళన చేయవలసిన అవసరం గురించి, గంగా ప్రవాహానికి అడ్డుగా ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించటం గురించి ప్రజల్లో అవగాహన కలిగించటం కోసం మొత్తం 20 మంది మహిళలు గంగానదిపై నవంబర్ 4న రెండు తెప్పల్లో ర్యాలీగా బయల్దేరారు! ఉత్తరాఖండ్, తెహ్రీ ఘరేవాల్ జిల్లాలోని దేవప్రయాగ పట్టణం నుంచి మొదలైన ఈ ‘ఆల్ ఉమెన్ రివర్ ర్యాఫ్టింగ్’... మొత్తం 2,500 కి.మీ. దూరాన్ని 53 రోజుల పాటు ప్రయాణించి డిసెంబర్ 26న పశ్చిమబెంగాల్లోని గంగా సాగర్ వద్ద ముగుస్తుంది. అందరూ మహిళలే ఉన్న ఇలాంటి ఒక సుదీర్ఘమైన రివర్ ర్యాఫ్టింగ్ దేశంలో జరగడం ఇదే మొదటిసారి. మరొక విశేషం కూడా ఉంది. వీళ్లంతా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బి.ఎస్.ఎఫ్) దళానికి చెందిన మహిళలు. బి.ఎస్.ఎఫ్. మహిళా విభాగం, ‘నమామి గంగే’ ప్రాజెక్టు కలిసి ఉమ్మడిగా ఈ రివర్ ర్యాఫ్టింగ్ను నిర్వహిస్తున్నాయి. ర్యాఫ్టింగ్ ప్రారంభానికి ముందు మహిళా శక్తికి, సాధికారతకు సంకేతంగా 11 మంది బాలికల పాదాలకు నమస్కరించి పూజలు జరిపారు. ఆ తర్వాత ‘తెప్పలు’ కదిలాయి. ఈ ప్రచారానికి బి.ఎస్.ఎఫ్. సబ్ ఇన్స్పెక్టర్ ప్రియా మీనా నాయకత్వం వహిస్తున్నారు. దేశ సరిహద్దుల్లో విధి నిర్వహణలో ఉన్న మహిళా జవాన్లలో 20 మందిని కఠిన ర్యాఫ్టింగ్ శిక్షణ తర్వాత ఇందుకోసం ఎంపిక చేశామని మీనా అన్నారు. ‘‘రెండు తెప్పలుగా సాగే ఈ బోటింగ్ యాత్రలో భాగంగా గంగా తీరం వెంబడి 43 పట్టణాలలో ఈ తరం యువతీ యువకులకు ‘పరిశుభ్రతకు, నిరంతరాయ ప్రవాహానికి’ అనువుగా గంగానదిని ప్రక్షాళన చేయాలన్న సందేశాన్ని అందిస్తాం’’ అని ఆమె తెలి΄ారు. మరొక విశేషం.. వీరితో జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగ’ చేతులు కలపటం. శుభ్రత దైవంతో సమానం అన్నప్పుడు, దైవ సమానంగా భారతీయులు కొలిచే గంగానదిని శుభ్రంగా ఉంచాలన్న సందేశంతో ప్రచారోద్యమం చేపట్టిన మహిళాశక్తి కూడా కొలవదగినదే. స్తుతించతగినదే. వారి మాట ఆలకించతగినదే. -
బ్లూజే ఏరో లాజిస్టిక్స్ ఎయిర్క్రాఫ్ట్ ఆవిష్కరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్లీన్ టెక్నాలజీ సంస్థ బ్లూజే ఏరో తాజాగా లాజిస్టిక్స్ కోసం ఉపయోగించే మానవరహిత వీటీవోఎల్ (వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్) ఎయిర్క్రాఫ్ట్ ’రీచ్’ను లైవ్లో ప్రదర్శించింది. ఇది దేశీయంగా రూపొందించిన తొలి హైడ్రోజన్–ఎలక్ట్రిక్ వీటీవోఎల్ అని సంస్థ సహ వ్యవస్థాపకుడు ఉత్తమ్ కుమార్ తెలిపారు. 100 కేజీల పేలోడ్ సామర్ధ్యంతో ఒక్కసారి చార్జ్ చేస్తే 300 కి.మీ. ప్రయాణించగలదని వివరించారు. అంతగా కనెక్టివిటీ లేని ప్రాంతాల్లో కూడా సత్వరంగా డెలివరీ చేసేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొన్నారు. తమ టెక్నాలజీతో సంప్రదాయ ఎయిర్పోర్ట్ మౌలిక సదుపాయాల అవసరం లేకుండా హైదరాబాద్–వరంగల్, ముంబై–పుణె వంటి కీలక రూట్లలో 30 నిమిషాల్లోపే వాయుమార్గంలో రవాణా సాధ్యపడుతుందని చెప్పారు. ఇప్పటివరకు రూ. 18 కోట్లు సమీకరించామని, మరో రూ. 250 కోట్లు సమీకరించే యత్నాల్లో ఉన్నామని ఉత్తమ్ కుమార్ వివరించారు. జిరోధాకు చెందిన రెయిన్మ్యాటర్ క్యాపిటల్, ఎండియా పార్ట్నర్స్ తదితర సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. -
కిచెన్ని కళాత్మకంగా సర్దుకోండిలా..!
వంటిల్లు అంటే నూనె జిడ్డు, మాడు వాసన కాదు. వంటిల్లు అంటే.. సమతూకంలో ఉడికే దినుసుల కమ్మదనం, ఆరోగ్యాన్ని వడ్డించే నైపుణ్యం! మనసుండాలే కానీ కిచెన్కూ కళాత్మకతతో పోపు పెట్టొచ్చు ఇలా..ఇండిపెండెంట్ ఇంట్లో సరే.. అపార్ట్మెంట్లలోనూ కిచెన్కి బాల్కనీ ఉంటుంది చిన్నదో పెద్దదో! ఇందులో తులసి సరే.. కొత్తిమీర, మెంతి, పుదీనా, పాలకూర, బచ్చలి వంటివి వేసి.. దీన్ని హెర్బల్ గార్డెన్గా మలచుకోవచ్చు. తాజా ఆకు కూరలతో ఆరోగ్యమే కాదు.. పచ్చదనంతో మనసూ మురుస్తుంది. స్వచ్ఛమైన ఆక్సిజన్తో వంటిల్లూ మెరుస్తుంది. కాస్తోకూస్తో ఖర్చూ కలిసొస్తుంది. అందమైన పాత్రలు ఇప్పుడు మళ్లీ రాగి, ఇత్తడి పాత్రలకు డిమాండ్ పెరుగుతోంది. యాంటిక్ డిజైన్లో దొరికే ఆ పాత్రలతో అరలను సర్దితే.. రాజసం ఉట్టిపడుతుంది వంటిల్లు. పింగాణీ పాత్రలతో దీనికి టచప్ ఇవ్వొచ్చు. ఫుడ్ థీమ్ ఆర్ట్కిచెన్ వాల్స్ని షెల్వ్స్తో నింపేయకుండా.. ఒక్క చోటనైనా ఖాళీగా ఉంచాలి. దాన్ని నచ్చిన వంటకాలు లేదా నట్స్.. లేదా ఫ్రూట్స్.. వెజిటబుల్స్ పెయింటింగ్స్తో అలంకరించాలి. కుక్ బుక్స్వంటింట్లో వంట సామాగ్రికే కాదు వంటకు సంబంధించిన పుస్తకాలకూ స్పేస్ ఇవ్వొచ్చు. స్థానిక సంప్రదాయ వంటల పుస్తకాల నుంచి వరల్డ్ ఫేమస్ షెఫ్లు రాసిన కుక్ బుక్స్ దాకా అన్నిటినీ ర్యాక్స్లో పేర్చుకుంటే.. కిచెన్కి ఇంటలెక్చువల్ లుక్ వస్తుంది. వెరైటీ వంటకాల పట్ల మనకు ఇంట్రెస్టూ పెరుగుతుంది. తెలుసు కదా.. కుకింగ్ అనేది ఆర్టే కాదు.. స్ట్రెస్ బస్టర్ కూడా! వంటలకు రుచెంతో.. అలంకరణకు అభిరుచీ అంతే! సో.. టేస్ట్కి తగ్గట్టు సర్దుకోండిక!.(చదవండి: 'లంగ్స్ ఆఫ్ చత్తీస్గఢ్'ని కాపాడిన యోధుడు!ఏకంగా గోల్డ్మ్యాన్..) -
కిచెన్ని క్లీన్గా ఉంచడంలో టూత్పేస్ట్ ఎలా పనిచేస్తందో తెలుసా..!
టూత్పేస్ట్ దంతాలు శుభ్రంగా ఉంచుకోవడానికే కాదు. మన కిచెన్ని శుభ్రంగా ఉంచుకోవడంలో కూడా చాలా బాగా ఉపయోగపడతుంది. ముఖ్యంగా స్టీల్ సింక్లు, ట్యాప్లు, ఎంత ఘోరంగా ఉంటాయో తెలిసిందే. అలాంటి వాటిపై ఉండే మొండి మరకలను క్లీన్ చేయడంలో టూత్పేస్ట్ చాలా చక్కగా పనిచేస్తుంది. ఎలా ఈ టూత్ పేస్ట్ మన కిచెన్లో ఉన్న వస్తువులను క్లీన్గా ఉంచుతుందో సవివరంగా తెలుసుకుందాం.! మన ఇంట్లో వేస్ట్గా మిగిలిపోయిన పాత పేస్ట్లు వస్తువులను శుభ్రం చేయడంలో చక్కగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నీటిలోని ఫ్లోరైడ్ కారణంగా కొన్ని రకాల స్టీల్ వస్తువులపై తెల్లటి మరకలు ఉండిపోతాయి. అవి ఓ పట్టాన పోవు. అలాంటి వాటిని వదలగొట్టడంలో టూత్పేస్ట్ అద్భతంగా పనిచేస్తుంది. అలాంటి వాటిని క్లీన్ చేయడంలో ఎలా సహకరిస్తుందంటే..స్టెయిన్లెస్ స్టీల్ సింక్లు..వంటగదిలోని సింక్ మిలమిల మెరుస్తు కాంతిగా ఉండాలంటే టూత్పేస్ట్ని ఉపయోగించటం మంచిది. దానిపై పడు గీతలు, ఒక విధమైన తెల్లటి మరకలను వదలగొట్టడంలో టూత్ పేస్ట్ భలే పనిచేస్తుంది. స్పాంజ్ సాయంతో కాస్త ప్రెజర్ ఉపయోగించి క్లీన్ చేస్తే సులభంగా మరకలు, గీతలు వదిలిపోతాయి. కుళాయిలు..నీటి కుళాయిలపై ఉండు మచ్చలు, మరకులతో కాస్త అసహ్యంగా కనిపిస్తుంటాయి. అలాంటి వాటిని టూత్పేస్ట్ని పూసి క్లాత్తో క్లీన్ చేస్తే చక్కగా మెరుస్తూ అందంగా ఉంటుంది. గ్లాస్ అండ్ సిరామిక్ స్టవ్లు..గ్లాస్ అండ్ సిరామిక్ స్టవ్ టాప్లపై మరకలు, వండిన పదార్థాల అవశేషాలను నీటిగా వదలించడంలో టూత్పేస్ట్ అద్భుతంగా పనిచేస్తుంది. మగ్స్పై కాఫీ, టీ మరకలు..కొన్ని రకాల టీ కప్పుల్లో కాఫీ, టీ మరకలు ఓ పట్టాన వదలవు. అలాంటప్పడు టూత్పేస్ట్ని ఉపయోగిస్తే నీటిగా వదిలిపోతాయి. కటింగ్ బోర్డ్..కూరగాయలు కోసే కటింగ్ బోర్డ్లు వివిధ రకాల ఆహార పదార్థాల వాసనలతో, మరకలతో ఉంటాయి. వాటిని టూత్పేస్ట్తో శ్రభం చేస్తే చూడటానికి అందంగానే గాకుండా మంచి సువాసనతో ఉంటుంది. టూత్పేస్ట్ల్ ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు, రాపిడి వాసనలను తొలగించి ఉపరితలాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది.(చదవండి: ఆమె క్రికెటర్స్ పాలిట దేవత..1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు కోసం..) -
భోజన సమయంలో కింద కూర్చుంటే రూ.220 జరిమానా..!
చైనాలోని ప్రజల జీనవ ప్రమాణాలు మెరుగుపరిచేందుకు నిత్యం కొత్త విధానాలను రూపొందించి అమలు చేస్తుంటారు. తాజాగా చైనాలోని ఓ కౌంటీలో అధికారులు తీసుకొచ్చిన నిబంధనపై అక్కడి సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. సిచువాన్ ప్రావిన్స్లోని పుగే కౌంటీలో ఇంటి పరిశుభ్రతను నిర్లక్ష్యం చేసిన వారికి జరిమానా విధిస్తామని అధికారులు ప్రకటించినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్(ఎస్సీఎంపీ) మీడియా సంస్థ తెలిపింది. ఈ నిబంధనల ప్రకారం కౌంటీలోని ప్రజలు తమ ఇళ్లను, వంట పాత్రలను శుభ్రం చేయకుంటే 1.4 డాలర్లు(రూ.120), భోజన సమయంలో కింద కూర్చుంటే 2.8(రూ.220) డాలర్లు జరిమానా విధించనున్నారు. ఈ జరిమానా కేటగిరీలను 14 భాగాలుగా విభజించారు. అధికారులు తనిఖీల కోసం వచ్చిన సమయంలో ఇంట్లో సాలె పురుగులు, ఇతరత్రా కీటకాలు, దుమ్ముధూళి ఉంటే మొదటిసారి మూడు నుంచి పది యువాన్లు జరిమానా విధించనున్నారు. రెండోసారి తనిఖీల్లో కూడా ఆ ఇంట శుభ్రత లేకుంటే జరిమానా మొత్తాన్ని రెట్టింపు చేస్తారని ఎస్సీఎంపీ కథనంలో వెల్లడించింది. ఈ నిబంధనపై కౌంటీ వైస్ డైరెక్టర్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. అపరిశుభ్రతను తగ్గించి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే దీని లక్ష్యమని తెలిపారు. ఇదీ చదవండి: నెలకు రూ.400 కోట్ల రుణాలిచ్చే కంపెనీ.. మూసివేస్తున్నట్లు షాకింగ్ కామెంట్లు.. ‘కౌంటీలో కొందరి ఇళ్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇల్లంతా బూజుతో అపరిశుభ్ర వాతావరణంలో ప్రజలు జీవిస్తున్నారు. వారు భోజనం చేస్తున్న ప్రదేశంలోనే కుక్కలు, దోమలు తిరుగుతున్నాయి. ఈ సమస్యను జరిమానాలు పరిష్కరించలేవు. కానీ, ప్రజలు తమ ఇళ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు మాత్రం ఈ నిబంధనలు దోహదపడతాయని భావిస్తున్నాం’ అని వైస్ డైరెక్టర్ తెలిపారు. -
సర్దుకు పోవద్దు.. సర్దుకుందాం ఇలా..!
కిచెన్ను శుభ్రంగా ఉంచుకోవడంలో మొదటి మెట్టు... వంట పూర్తి కాగానే.. కిచెన్ ప్లాట్ఫామ్, స్టౌను వెంటనే శుభ్రం చేసేసుకోవడం. స్టవ్ మీద, ప్లాట్ఫామ్ మీదా మనం వండిన వంటలోని చిందులు, నూనె మరకలు పడటం సహజం. అలాంటి వాటిని వంట అవగానే వెంటనే తుడిచేయాలి. గోరువెచ్చటి నీళ్లలో వెనిగర్ కలిపి శుభ్రం చేస్తే.. క్రిములు తొలగిపోతాయి. స్టౌ మీద పడిన నూనె మరకలను తొలగించడానికి, కిచెన్ ప్లాట్ఫామ్ శుభ్రం చేయడానికి యాంటీ బ్యాక్టీరియల్ వైప్స్ని ఉపయోగించచ్చు. అవి కాసింత ఖరీదైనవి కావడం వల్ల చాలామంది కిచెన్ టవల్స్నే వాడతారు. ఒకోసారి కిచెన్లో నూనె ఒలికిపోతుంటుంది. వెంటనే ఆ నూనె మీద గోధుమ పిండి లేదా బియ్యప్పిండిని చల్లి కాసేపటి తరువాత పేపర్తో తుడిస్తే జిడ్డులేకుండా శుభ్రపడుతుంది. కిచెన్ ప్లాట్ఫామ్పై మరకలు ఉంటే.. వంటసోడా వేసిన నీళ్లతో కిచెన్ ప్లాట్ఫామ్ తుడిస్తే చాలు. అంతేకానీ బ్లీచింగ్, అమోనియా లాంటివి వాడటం వల్ల క్యాబినెట్కున్న రంగులు, టైల్స్ దెబ్బతింటాయి. కూరగాయలు తరగడం పూర్తయిన వెంటనే ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయకపోతే అక్కడున్న తేమ, కాయగూరల అవశేషాలు వాతావరణంలో ఉన్న బ్యాక్టీరియా, వైరస్, ఇతర క్రిముల్ని త్వరగా ఆకర్షిస్తాయి. తరిగేటప్పుడే ఓ డబ్బా పెట్టుకొని, తొక్కలు, తొడిమల్లాంటివి దాంట్లో వేసి తర్వాత చెత్తడబ్బాలో పడేస్తే.. శుభ్రంగా ఉంటుంది. కిచెన్ టవల్స్ను కూడా... కిచెన్ ప్లాట్ఫామ్ని, స్టవ్నీ క్లీన్ చేసేందుకు ఉపయోగించే కిచెన్ టవల్ని సరిగా శుభ్రం చేయకపోతే దానికి ఉండే బ్యాక్టీరియా వల్ల అంతవరకు మనం చేసినదంతా నిరర్థకమవుతుంది. కిచెన్ టవల్స్ జిడ్డుగా ఉంటే గోరువెచ్చని నీటిలో సర్ఫ్, వాషింగ్ లిక్విడ్ వేసి కాసేపు నానబెట్టిన తర్వాత బట్టలుతికే బ్రష్తో క్లీన్ చేస్తే క్లీన్ అయిపోతాయి. కిచెన్ క్యాబినెట్ కిచెన్ ప్లాట్ఫామ్ కింద లేదా పైన సామాన్లు పెట్టుకోవడం కోసం ఉంచిన ర్యాక్స్, క్యాబినెట్ పుల్స్, హ్యాండిల్స్పై కూడా సూక్ష్మక్రిములు ఉంటాయి. వాటిని క్రిమిసంహారక వైప్తో క్లీన్ చేస్తే మంచిది. వెనిగర్ని క్లాత్పై స్ప్రే చేసి వాడండి. దీనివల్ల వేలిముద్రలు, నీటి గుర్తులు పోయి తెల్లగా మెరుస్తాయి. ఫ్రిజ్ క్లీన్గా.. ఫ్రిజ్లో మనం చాలా స్టఫ్ పెడుతుంటాం. కానీ, దానిని ఎప్పుడో ఓసారి క్లీన్ చేస్తుంటాం. అలా కాకుండా దీనిని కూడా మరకలు లేకుండా శుభ్రంగా తుడవడం మంచిది. ఫ్రిజ్ కింద, డోర్స్, లోపల గ్లాసెస్.. ఇలా అన్నింటిని తడిగుడ్డతో తుడిస్తే త్వరగా క్లీన్ అవుతుంది. ఇక మిగిలిపోయిన ప్రతిదానిని ఫ్రిజ్లో తోసేయకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం చాలా మంచిది. సింక్ క్లీన్.. కిచెన్ క్లీన్ చేయాలంటే ముందుగా సింక్ని క్లీన్ చేయాలి. సింక్ బేసిన్ నీట్గా ఉందో లేదో చూసుకోండి. కౌంటర్ చుట్టూ ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం వల్ల వైరస్, బ్యాక్టీరియా వంటివి దూరమవుతాయి. అందుకే, ముందు దీనిని క్లీన్ చేయండి. సింక్ సరిగ్గా లేకపోతే అందులో నుంచే ఎక్కువ బొద్దింకలు, వాటి ద్వారా వ్యాధులు వస్తాయి. కొద్దిగా బ్లీచింగ్ పౌడర్, డిష్వాష్, బేకింగ్ సోడాతో క్లీన్ చేస్తే సరి. సింక్లో మాంసాహారం కడిగిన తర్వాత దాన్ని సోప్ వాటర్తో శుభ్రం చేసేస్తే సింక్ దుర్వాసన రాకుండా ఉంటుంది. కాస్త తీరిక దొరికినప్పుడు ఓ క్లాత్ తీసుకుని వాటర్ స్ప్రే చేస్తూ కిచెన్ గోడలు, కౌంటర్స్ని క్లీన్ చేయండి. ఇందుకోసం మార్కెట్లో దొరికే స్ప్రేలను కూడా ఉపయోగించవచ్చు.. ఇప్పుడు డోర్ ఫ్రేమ్స్ని క్లీన్ చేయండి. వంటగదిని అన్ని వస్తువులు సులభంగా దొరికేలా సర్దుకుంటే వంట చేయడం ఈజీ అవుతుంది. ఎలాగో చూద్దాం... ట్రాన్స్పరెంట్ డబ్బాలు వంట చేసుకునేప్పుడు ఏ డబ్బాలో ఏముందా? అని వెతుక్కోవడానికే సమయం వృథా అవుతుంది. అలా కాకుండా షెల్ఫుల్లో ట్రాన్స్పరెంట్గా ఉండే ప్లాస్టిక్ డబ్బాలు లేదా స్టీల్ డబ్బాలూ గాజు సీసాలూ అందుబాటులో ఉంటాయి. వాటిని ప్రయత్నించి చూడండి. పని సులభం అవుతుంది. సరుకులనూ వేరు చేయడం వంట గదిలో షెల్ఫులలో అన్ని సరుకుల్ని అన్ని షెల్ఫుల్లో సర్దేయకుండా ఎక్కువగా వంటకు వాడే వాటిని ఒకచోట, తక్కువగా వాడే పదార్థాల్ని వేరే షెల్ఫులో, బేకింగ్ సామగ్రిని మరో దగ్గర పెట్టుకోవడం వల్ల చాలా సమయం ఆదా అవుతుంది. (చదవండి: కార్ డిజైనర్ థార్ డిజైనర్!) -
చదువుకోవాలా..? బాత్రూంలు క్లీన్ చేయాలా?
ఉట్నూర్రూరల్: ‘మేము చదువుకోవాలా..? లేక బాత్రూంలు క్లీన్ చేయాలా’’అంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లోని కేబీ ప్రాంగణంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో మంగళవారం చోటు చేసుకుంది. వైస్ప్రిన్సిపాల్ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఆగస్టు15వ తేదీన ఐటీడీఏ పీఓకు వినతిపత్రం అందించినా, ఎలాంటి మార్పు రాలేదంటూ గేటు బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు.పోలీసులు, వైస్ ప్రిన్సిపాల్ భూలక్ష్మి విద్యార్థినులను ఎంత బతిమిలాడినా వారు వినిపించుకోకుండా ఆందోళన కొనసాగించారు. విషయం తెలుసుకున్న గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ గంగాధర్ అక్కడకు చేరుకున్నారు. విద్యార్థినులను సముదాయించే ప్రయత్నం చేశారు. చివరకు వారు కళాశాల ప్రాంగణంలోకి వచ్చి ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ, వైస్ ప్రిన్సిపాల్ భూలక్ష్మి తమతో బాత్రూంలు శుభ్రం చేయిస్తుందని, స్నానపు గదులకు తలుపులు లేకపోవడంతో తలుపులు బిగించాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. మంచినీరు అందుబాటులో లేదని, అనారోగ్యానికి గురైతే సిక్రూం ఏర్పాటు చేయడం లేదని ఆరోపించారు. కొద్ది రోజుల క్రితం ఓ విద్యార్థిని తీవ్ర అనారోగ్యం పాలైనా చూసేవారు లేక ఇబ్బందులు పడ్డామని ఆరోపించారు. రీజినల్ కోఆర్డినేటర్ స్పందిస్తూ తక్షణమే పీఓ దృష్టికి తీసుకువెళ్లి వైస్ ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. వైస్ ప్రిన్సిపాల్ను ట్రాన్స్ఫర్ చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని గంగాధర్ చెప్పడంతో వారు శాంతించారు. ఈ విషయమై వైస్ ప్రిన్సిపాల్ భూ లక్ష్మిని వివరణ కోరగా.. తనపై కావాలని ఆరోపణలు చేస్తున్నారని ఎవరినీ ఇబ్బంది పెట్టలేదన్నారు. -
పెట్టుబడులకు విస్తృత అవకాశాలు
సాక్షి, అమరావతి: పర్యావరణహిత క్లీన్ ఎనర్జీకి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని.. గ్రీన్ హైడ్రోజన్, బయో ఇథనాల్ తయారీ ప్లాంట్లను ప్రోత్సహిస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ ప్రవీణ్కుమార్ తెలిపారు. దేశంలోనే అతిపెద్ద పెట్రోకెమికల్ కారిడార్ ఏపీలో విస్తరించి ఉందని.. దీన్ని వినియోగించుకుంటూ పెట్టుబడులు పెట్టాలని కోరారు. పెట్టుబడులకు ఏపీలో విస్తృత అవకాశాలున్నాయని.. వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఢిల్లీలో జరుగుతున్న మూడో ‘గ్లోబల్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్స్ ఇన్ ఇండియా’ సదస్సులో గురువారం ప్రవీణ్ పాల్గొన్నారు. దేశంలోనే అతిపెద్ద పెట్రో కెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ కంపెనీలతో చర్చలు జరుపుతోందని చెప్పారు. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా దీన్ని అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలిస్తోందని తెలిపారు. విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్లో పారిశ్రామిక పార్కులు, పోర్టులు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. పారిశ్రామిక పార్కుల ద్వారా తక్షణమే పెట్టుబడులు పెట్టడానికి 13,772 ఎకరాల భూమి అందుబాటులో ఉందని వివరించారు. ఇప్పటికే పెట్రో కెమికల్స్ రంగంలో హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఓఎన్జీసీ, కెయిర్న్, రిలయన్స్, ఆదిత్య బిర్లా, టాటా కెమికల్స్ తదితర దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టాయని తెలిపారు. బయో ఇథనాల్కు ఏపీ హబ్గా మారిందని ప్రవీణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ఇప్పటికే 20కి పైగా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయన్నారు. అనంతరం ప్రవీణ్కుమార్.. సౌదీ అరేబియా బేసిక్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ వైస్ ప్రెసిడెంట్, రీజనల్ హెడ్ జనార్దన్ రామాంజనేయులు, సుర్బానా జురాంగ్ డైరెక్టర్ డెన్నీస్ టాన్, దీపక్ నైట్రేట్ సీఎండీ దీపక్ సీ మెహతా, నయారా ఎనర్జీ ప్రెసిడెంట్ దీపక్ అరోరా, బేయర్ కార్పొరేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. వీటిలో కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, అనకాపల్లి కలెక్టర్ రవిసుభాష్ తదితరులు పాల్గొన్నారు. -
CM Jagan: క్లీన్ ఆంధ్రప్రదేశ్లో మరో ముందడుగు
సాక్షి, అమరావతి: రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్గా మార్చాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధృడ సంకల్పం. ఈ లక్ష్యంతో చిన్న మున్సిపాలిటీల్లోనూ చెత్త సేకరణకు పర్యావరణహితంగా ఉండే విద్యుత్తు ఆటోలను (ఈ–ఆటోలను) ప్రవేశపెట్టారు. తద్వారా ఆ మున్సిపాల్టి లకు నిర్వహణ భారం కూడా తగ్గుతుంది. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జెండా ఊపి వీటిని ప్రారంభించారు. రూ.4.10 లక్షల విలువైన 516 ఈ–ఆటోలను మొత్తం రూ.21.18 కోట్ల వ్యయంతో కొనుగోలు చేశారు. వీటిని 36 మున్సిపాల్టి లకు పంపిణీ చేస్తారు. ఈ ఆటో సామర్థ్యం 500 కిలోలు. మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తూ ‘ఈ– ఆటోల‘ డ్రైవర్లుగా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ఇప్పటికే రూ.72 కోట్లతో 123 మున్సిపాలిటీల్లోని 40 లక్షల కుటుంబాలకు తడి, పొడి, హానికర వ్యర్ధాల సేకరణకు నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లోని 120 లక్షల చెత్త బుట్టలను ప్రభుత్వం పంపిణీ చేసింది. గ్రేడ్–1 ఆపై మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు 2,525 పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గార్బేజ్ టిప్పర్లను వినియోగిస్తోంది. అలాగే గుంటూరు, విశాఖపట్నంలలో వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులు ప్రారంభించింది. చదవండి: సీఐడీ దర్యాప్తుపైనా..వక్రీకరణేనా రామోజీ? త్వరలో రోజుకు 400 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో మరో ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. రూ.157 కోట్లతో 81 మున్సిపాలిటీలలో 135 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లు నిర్మిస్తున్నారు. 71 సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులు, తడి చెత్త నిర్వహణకు 29 వేస్ట్ టు కంపోస్ట్, నాలుగు బయో మిథనేషన్ ప్రాజెక్ట్లు నడుస్తున్నాయి. లక్ష లోపు జనాభా ఉన్న 66 మున్సిపాలిటీల్లో రూ.1,445 కోట్లతో 206 టీపీఐఎస్లు, లక్ష లోపు జనాభా ఉన్న 55 మున్సిపాలిటీల్లో ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా చిన్న మున్సిపాలిటీల్లో ఈ–ఆటోలు ప్రవేశపెట్టారు. చదవండి: షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆ ఒక్కపని చేస్తే చాలు.. జీన్స్ ఉతకనవసరం లేదు!
దుస్తులు మన జీవితంలో ప్రధానభాగం. రోజువారీ జీవితంలో వీటి పాత్ర ఎంతో కీలకం. అయితే పురుషులకు, మహిళలకు వేర్వేరు రకాల దుస్తులు ఉంటాయనే సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ రోజుల్లో అటు పురుషులు, ఇటు మహిళలు జీన్స్ ధరిస్తున్నారు. రఫ్ అండ్ టఫ్గా ఉపయోగించేందుకు అనుకూలంగా ఉన్నందునే జీన్స్పై అందరూ మోజు పెంచుకుంటున్నారు. ట్రావెలింగ్ మొదలుకొని రోజువారీ ఆఫీసు వినియోగానికి సైతం అందరూ జీన్స్ వినియోగిస్తున్నారు. జీన్స్ ధారణ మనిషికి మంచి లుక్నిస్తుంది. కొందరు జీన్స్ను తరచూ ఉతుకుతుంటారు. అయితే ఇది సరైన విధానం కాదని నిపుణుల చెబుతుంటారు. జీన్స్ను జాగ్రత్తగా కాపాడుకునేందుకు దానిని ఫ్రిజ్లో ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. జీన్స్ను ఫ్రిజ్లో ఉంచడం వలన ఏమి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. జీన్స్ను తరచూ ఉతకడం వలన ఆ దుస్తులకు హాని కలుగుతుంది. ప్రపంచానికి తొలిసారి జీన్స్ పరిచయం చేసిన ప్రముఖ కంపెనీ లెవీస్ వెబ్సైట్లో తెలిపిన వివరాల ప్రకారం జీన్స్ను ఎప్పుడూ ఉతకకూడదు. చాలా అవసరమైతే తప్పు దానిని ఉతకవద్దు అని పేర్కొన్నారు. అయితే జీన్స్ను ఉతకకుండా దానిని శుభ్రపచడం ఎలా అనే సందేహం మనలో తలెత్తుతుంది. జీన్స్ను ఉతికితే ఆ దుస్తుల మెటీరియల్ పాడయిపోతుంది. అలాగే జీన్స్ను ఉతకడం వలన నీరు కూడా వృథా అవుతుంది. లెవీస్ సీఈఓ చిప్బర్గ్ తెలిపిన వివరాల ప్రకారం నూతన జీన్స్ను కనీసం 6 నెలల తరువాతనే వాష్ చెయ్యాలి. అయితే జీన్స్ను.. దానికి అతుక్కునే బ్యాక్టీరియా నుంచి కాపాడేందుకు దానిని రాత్రంతా ఫ్రిజ్లో ఉంచాలి. ఉదయాన్నే ఫ్రిజ్లో నుంచి జీన్స్ను బయటకు తీసి, ఎండలో లేదా స్వచ్ఛమైన వాతావరణంలో ఉంచాలి. ఫలితంగా అది బ్యాక్టీరియా రహితంగా మారుతుంది. అప్పుడు దానిని తిరిగి ధరించవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
క్లీన్ హార్బర్స్లో 1,000 కొలువులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పారిశ్రామిక వ్యర్ధాల నిర్వహణ సంబంధ సేవలు అందించే క్లీన్ హార్బర్స్ రాబోయే రోజుల్లో 1,000 మందిని పైగా రిక్రూట్ చేసుకోనుంది. వచ్చే ఏడాదిన్నర కాలంలోనే కొత్తగా 300 మందిని నియమించుకోనుండగా.. ఇందులో ఎక్కువ భాగం హైరింగ్ హైదరాబాద్ కార్యాలయం కోసం ఉండనుంది. సోమవారం హైదరాబాద్లోని తమ కార్యాలయ విస్తరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సంస్థ సీఈవో అలాన్ మెకిమ్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రెసిడెంట్ అవినాష్ సమ్రిత్ ఈ విషయాలు తెలిపారు. హైదరాబాద్తో పాటు బెంగళూరు, పుణెల్లో కార్యాలయాలు ఉన్నట్లు అవినాష్ చెప్పారు. ప్రస్తుతం క్లీన్ హార్బర్స్కు దేశీయంగా 1,200 మంది సిబ్బంది ఉండగా.. హైదరాబాద్లో 850 మంది ఉన్నారు. కొత్త కార్యాలయంపై దాదాపు రూ. 10 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు అవినాష్ చెప్పారు. ప్రస్తుతం భారత్లో తమ టర్నోవరు దాదాపు రూ. 150–రూ. 200 కోట్ల స్థాయిలో ఉన్నట్లు వివరించారు. 5 బిలియన్ డాలర్లుగా ఉన్న క్లీన్ హార్బర్స్ వచ్చే అయిదేళ్లలో 7 బిలియన్ పైగా డాలర్ల కంపెనీగా ఎదిగే క్రమంలో తమ వ్యాపారానికి అనువైన సంస్థల కొనుగోలు, విలీనాల యోచన కూడా ఉన్నట్లు మెకిన్ వివరించారు. -
ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్ క్లీన్ చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
-
ఏయే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి? బ్యాక్టీరియా ఎలా పోతుంది?
కొందరు చూడటానికి ఎంతో శుభ్రంగా ఉంటారు. ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకుంటారు. అయితే పరిసరాల పరిశుభ్రత గురించి మాత్రం పట్టించుకోరు. ఇల్లు మురికిగా ఉండి, వ్యక్తి మాత్రం శుభ్రంగా ఉన్నా; ఇల్లు, ఇంట్లోని మనుషులు మాత్రమే పరిశుభ్రంగా ఉండి పరిసరాలన్నీ అపరిశుభ్రంగా ఉన్నా ప్రయోజనం ఉండదు. అనారోగ్యం, అంటువ్యాధులు పొంచే ఉంటాయి. ఇంతకీ పరిసరాల పరిశుభ్రత అంటే ఏమిటో, పరిసరాలను ఏవిధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలో చూద్దాం. పరిసరాల పరిశుభ్రత అంటే ఇంటికి చుట్టుపక్కల ఉండే పరిసరాలన్నీ చెత్తాచెదారం, దుమ్ము, ధూళి లేకుండా శుభ్రంగా ఉండేలా చూసుకోవడమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంట్లో మురికిగా ఉండే ప్రదేశాలను శుభ్రం చేయడం కంటే.. హానికారక సూక్ష్మజీవులను నిరోధించడంపై దృష్టిపెట్టడం చాలా మేలని పర్యావరణ శాస్త్రవేత్తల అభిప్రాయం . సరైన సమయానికి చేతులు కడుక్కోవడం, బట్టలు ఉతకడం, ఫ్లోర్ని తుడవటం ఆరోగ్యవంతమైన వాతావరణానికి కీలకం. అయితే, ప్రతి నలుగురిలో ఒకరు మాత్రం వీటికి ప్రాధాన్యం లేదని భావిస్తున్నారని సర్వేలు తెలియజేస్తున్నాయి. . మురికి, క్రిములు, శుభ్రత, ఆరోగ్యవంతంగా ఉండడానికి మధ్య తేడాను అర్థం చేసుకోవాలి. ఒక సర్వే మేరకు 23 శాతం మంది.. హానికారక సూక్ష్మ క్రిముల వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని భావిస్తున్నారని తేలింది. అయితే, వారి నమ్మకంలో ఏమాత్రం నిజం లేదు. హానికారక సూక్ష్మక్రిములుండే పరిసరాలలో మెసలడం వల్ల్ల పిల్లలు ప్రమాదకరమైన అంటురోగాల బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు. దానికి బదులు, ఆయా ప్రదేశాలను శుభ్రం చేయడంపై దృష్టి పెట్టాలని, అవి శుభ్రంగా కనిపించినప్పటికీ తగిన శ్రద్ధ పెట్టి ఎలాంటి క్రిములూ లేకుండా చూడాలని, అప్పుడే హానికారక సూక్ష్మ క్రిముల వ్యాప్తిని అడ్డుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. శుభ్రత అంటే మురికి లేకుండా చేయడం. ఆరోగ్యవంతంగా పరిసరాలను ఉంచుకోవడం అంటే మురికితోపాటు రోగకారక క్రిములను అరికట్టడం. తద్వారా అంటువ్యాధులు సోకకుండా చూసుకోవడం. ముఖ్యంగా ఆహారాన్ని తయారు చేసేప్పుడు, మరుగుదొడ్డి వాడేప్పుడు, పెంపుడు జంతువులతో గడిపేటప్పుడు ఇది చాలా ముఖ్యం. ఆరుబయట స్నేహితులు, కుటుంబ సభ్యులు, పెంపుడు జంతువులతో గడపడం, ఆడుకోవడంతో ‘మంచి బ్యాక్టీరియా’ను పొందవచ్చు. ఆరోగ్యకరమైన సూక్ష్మజీవుల్ని పెంపొందించుకోవచ్చు. కానీ, అదే సమయంలో ప్రజలు చెడు బ్యాక్టీరియా బారిన పడకుండా చూసుకోవడం కూడా అంతే కీలకం. ‘‘పరిసరాలను ఆరోగ్యవంతంగా ఉంచుకోవడం ద్వారా అంటువ్యాధుల్ని నియంత్రించవచ్చు. ఇది చాలా సులభమైన, చౌక అయిన వ్యవహారం. ఇంట్లో ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించడం ద్వారా అంటురోగాలను తగ్గించొచ్చు. తద్వారా పిల్లల్ని రక్షించుకోవడంతో పాటు, ఆసుపత్రులపై ఒత్తిడిని కూడా తగ్గించవచ్చు’’ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంటిని మాత్రమే కాదు, ఇంటి పరిసరాలలో ఎక్కడైనా మురికిగుంటలు, చెత్తకుప్పలు, అపరిశుభ్ర వాతావరణం ఉంటే దానిపై దృష్టి పెట్టాలి. శ్రమ అనో, ఖర్చనో అనుకోకుండా చెత్తను క్లీన్ చేయాలి లేదా చేయించాలి. కొంతమంది తమ ఇంటిలోని చెత్తనంతటినీ తీసుకొచ్చి ఖాళీగా ఉన్న ప్రదేశాలలో పడేస్తుంటారు. క్రమేణా అవి చెత్తకు, ఆ తర్వాత అపరిశుభ్రతకు, అంటువ్యాధులకు ఆనవాళ్లుగా మారతాయి. అందువల్ల సంబంధిత శాఖ వాళ్లకు చెప్పి ఆ చెత్తను క్లీన్ చేయించాలి. అలాగే మురికిగుంటలపై కూడా దృష్టి సారించాలి. బ్లీచింగ్ పౌడర్ వేయాలి. పరిసరాలలో నీరు నిలవకుండా చూసుకోవాలి. చెత్తను, తడిచెత్త, పొడిచెత్తగా వేరు చేసి పడెయ్యడం, గాజుపెంకులు, ప్లాస్టిక్, పాలిథిన్ కవర్ల వంటి వాటిని విడిగానూ పడెయ్యాలి. ఇలాంటి వాటన్నింటినీ బాధ్యతగా చేసినప్పుడే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే సూక్ష్మక్రిములు, తద్వారా అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటాయి. తద్వారా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము. ఏయే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి? ►ఆహారాన్ని తయారు చేసే వంట శాలలు, వడ్డించే ఆహార శాలలు ప్రాంతాలు (డైనింగ్ హాల్స్) ►మరుగుదొడ్లు, వాటిని వాడిన తర్వాత చేతులు, ఇల్లు, వంటగదిలో ఉండే మురికి బట్టలు, మసిగుడ్డలు. ►పెంపుడు జంతువులతో ఉన్నప్పుడు. ►ఎవరైనా దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు, ముక్కును చీదేటప్పుడు. ►చెత్త, వ్యర్థాలను చేత్తో తాకినప్పుడు, పారేసేటప్పుడు. ►అంటువ్యాధి సోకిన వారికి సపర్యలు చేసేప్పుడు శుభ్రత పాటించడం అత్యవసరం. ►మాంసం వంటి వంటకాలు చేసినప్పుడు వంటగదిలోని నేలను, దిమ్మల్ని, మాంసం కోసిన చెక్క/బోర్డుల్ని శుభ్రం చేయడం చాలా కీలకం. ►అలాగే, శాండ్విచ్లు, చిరుతిళ్లు తయారు చేసేముందు కూడా ఇవన్నీ శుభ్రం చేసుకోవాలి. ►కలుషితమైన ప్రదేశాన్ని, పాత్రల్ని శుభ్రం చేశాక ఆయా గుడ్డలు, స్క్రబ్లను, బ్రష్లను కడగాలి. ఎందుకంటే ఇంట్లో నేలపైన, కుర్చీలు, బల్లల వంటి ఫర్నీచర్పైన పేరుకుపోయిన దుమ్ములో ఉండే క్రిములతో పోల్చితే ఇవి చాలా వరకు ఆరోగ్యానికి ఎక్కువ హాని చేకూర్చేవి కాబట్టి. బ్యాక్టీరియా ఎలా పోతుంది? ►ఇంట్లో నేలను కానీ, పాత్రల్ని కానీ వేడిగా ఉన్న సబ్బు నీటితో కడగడం ద్వారా బ్యాక్టీరియాను తొలగించవచ్చు. ఆ బ్యాక్టీరియా నీటితో పాటు కొట్టుకుపోతుంది. అయితే బ్యాక్టీరియాను పూర్తిగా చంపాలంటే మాత్రం నీటిని 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద కొద్దిసేపు మరిగించాలని ఆహార ప్రమాణాల సంస్థ చెబుతోంది. ►ఆహారాన్ని తయారు చేసిన తర్వాత నేలను, రాతి దిమ్మెలను శుభ్రం చేయడానికి గుడ్డకు బదులు పేపర్ టవల్స్ వాడి చూడండి. ఇలా చేయడం వల్ల వంటగదిలో ఉపయోగించే గుడ్డలు అపరిశుభ్రం కాకుండా, కలుషితం కాకుండా ఉంటాయి. -
సఫాయి అన్న.. నీకు సలాం అన్న
సాక్షి, సనత్నగర్(హైదరాబాద్): సఫాయి అన్న.. నీకు సలాం అన్న.. అంటూ వారి సేవలను గుర్తించి మూడుసార్లు వేతనాలు పెంచిన మొదటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మాత్రమేనని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. డ్రైవర్స్ కమ్ ఓనర్ స్కీం కింద సనత్నగర్ లేబర్ వెల్ఫేర్ సెంటర్ కేంద్రంగా నగర వ్యాప్తంగా 1,350 స్వచ్ఛ ఆటో టిప్పర్లను సోమవారం మంత్రులు ప్రారంభించారు. వీరిలో మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్లతో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం 250 మంది లబ్ధిదారులకు స్వచ్ఛ ఆటోలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బెస్ట్ సిటీగా హైదరాబాద్.. ► గతంలో 2015లో స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్లో భాగంగా 2,500 స్వచ్ఛ ఆటో టిప్పర్లను ఏకకాలంలో తీసుకువచ్చామని గుర్తుచేశారు. దేశంలో స్వచ్ఛభారత్, స్వచ్ఛ సర్వేక్షణ్ అమలుపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ర్యాంకింగ్స్లో హైదరాబాద్ బెస్ట్ సిటీగా నిలిచిందన్నారు. ► ఎప్పటికప్పుడు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు తెల్లవారుజామున 3– 4 గంటల నుంచే పరిశ్రమిస్తున్న మున్సిపల్ సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు, స్వచ్ఛ ఆటోడ్రైవర్లకు, ఇతర వాహనాల సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. స్వచ్ఛ ఆటో టిప్పర్లను ప్రవేశపెట్టకముందు నగరం నుంచి ప్రతిరోజూ 3,500 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అయ్యేదన్నారు. వీటిని ప్రవేశపెట్టిన తర్వాత 6,500 మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ జరుగుతోందన్నారు. దక్షిణ భారతంలోనే అతిపెద్ద ప్లాంట్.. ► వాహనాల ద్వారా సేకరించిన చెత్తను తడి, పొడి చెత్తను వేరు చేసి విద్యుత్పాదనకు జవహర్నగర్లో 20 మెగావాట్ల ప్లాంట్ను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. మరో 28 మెగావాట్ల ప్లాంట్కు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నుంచి అనుమతులు వచ్చాయన్నారు. దాని పనులు కూడా ప్రారంభమై పూర్తి చేసుకుంటే మొత్తం 48 మెగావాట్లతో దక్షిణ భారతంలోనే అతిపెద్ద ప్లాంట్గా నగరం నిలవనున్నదన్నారు. కార్పొరేటర్లు, అధికారులు తమ పరిధిలో క్షేత్ర స్థాయిలో పర్యటించి మెరుగైన పారిశుద్ధ్యం కోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ సంతోష్, ప్రియాంక అలా, జోనల్ కమిషనర్ రవికిరణ్, జాయింట్ కమిషనర్ సంధ్య, కార్పొరేటర్లు కొలను లక్ష్మీబాల్రెడ్డి, మహేశ్వరి శ్రీహరి, డీఎంసీ వంశీకృష్ణ, ఏఎంహెచ్ఓ భార్గవ నారాయణ్, మహీంద్రా కంపెనీ ఉద్యోగులు పాల్గొన్నారు. -
పాఠశాల టాయిలెట్లను క్లీన్ చేసిన కలెక్టర్
సాక్షి, అడవివరం (విశాఖ పట్నం): వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున స్ఫూర్తివంతమైన కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం అడవివరం జెడ్పీ హైస్కూల్కు విచ్చేసిన ఆయన.. పాఠశాలలో పనిచేస్తున్న ఆయాలను ఘనంగా సత్కరించారు. పాఠశాలలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచుతూ విద్యార్థుల ఆరోగ్య రక్షణకు కృషి చేస్తున్న ఆయాల సేవలు మరువలేనివని కొనియాడారు. అనంతరం పాఠశాలలోని టాయిలెట్లను కలెక్టర్ స్వయంగా క్లీన్ చేసి ఆదర్శంగా నిలిచారు. -
క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం
-
దునియాలో ఇలాంటి పెళ్లి చూసుండరు.. ఎందుకంటారా?
అతిథిదేవో భవ అంటారు. సాధారణంగా పెళ్లికి వచ్చిన అతిథులకు మర్యాదులు, భోజనాలు అంటూ వాళ్లకి సపర్యలు చేసి పది కాలాలు గుర్తుండిపోయేలా చేయాలనుకుంటారు. అయితే, ఈ పెళ్లి మాత్రం రోటీన్కు భిన్నంగా జరిగింది. నవదంపతులను మనసారా ఆశీర్వదించేందుకు వచ్చిన అతిథులకు విందు పెట్టడమే కాదు, వారు తిన్న పాత్రలను వారితోనే కడిగించారు. పెళ్లి గ్రాండ్గా జరిగింది.. కానీ వివరాల్లోకి వెళితే.. ‘రెడిట్’ అనే సోషల్ మీడియాలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఓ మహిళ పంచుకోవడంతో ఈ పెళ్లి తంతు బయటకొచ్చింది. ‘‘వధువు మా దగ్గర బంధువే. కానీ, వరుడి గురించి నాకు పెద్దగా తెలియదు. వాళ్లు పెళ్లి కోసం బాగానే ఖర్చు పెట్టారు. అందులో భాగంగా ఖరీదైన వేదికను అద్దెకు తీసుకుని, అలంకరణ విషయంలో ఏ మాత్రం తగ్గకుండా వేదికను అద్భుతంగా డెకరేట్ చేయించారు. పెళ్లికి వచ్చిన అతిథులకు విందు కోసం బఫెట్లోని ఫుడ్ కూడా చాలా టేస్టీగానే ఉందని తెలిపింది. ఇక్కడ వరకు అంతా బాగానే నడిచింది .ప్లేటు నిండా ఆహారం పెట్టుకుని ఆరగిస్తున్నాను. అయితే, నా భర్త ఖాళీ ప్లేటుతో నా దగ్గరకు వచ్చాడు. ఏమైందని అడిగితే ఫుడ్ అయిపోయిందని చెప్పాడు. దీంతో నేను వధువు తల్లి వద్దకు వెళ్లి అడగగా అందుకు ఆమె పుడ్ అయిపోయిందని, ఇక రాదని చెప్పడంతో మిగిలిన అతిథులంతా ఆకలితోనే పస్తులున్నారు’’ అని తెలిపింది. ఖర్చు ఎక్కువైంది.. ఏమనుకోకుండా కాస్త ప్లేట్లు.. ‘‘ఇక్కడ అసలు ట్విస్ట్ మొదలైంది. సరే ఉన్నదాంతో సరిపెట్టుకుని విందు చేశాక రిసెప్షన్ చూసేందుకు వెళ్లాం. ఇంతలో ఓ పని మనిషి మా వద్దకు వచ్చి కిచెన్లోకి రావాలని తెలిపింది. అక్కడికి వెళ్లిన తర్వాత కుప్పలా పడివున్న ప్లేట్లు, గ్లాసులు చూపించి కడగాలని చెప్పింది. ఒక్కసారిగా షాక్ తగిలి ఏంటని వధువు తల్లిని అడగగా.. పెళ్లి ఖర్చులన్నీ వధువు వెడ్డింగ్ గౌను, వేదిక, విందుకే అయిపోయానని, గిన్నెలు కడిగేందుకు మనుషులను పెట్టుకోలేకపోయామని సాఫీగా ఆమె సమాధానం ఇచ్చింది. ఇక చేసేదేమిలేక నేను, మరో తొమ్మిది మంది అతిథులం పెళ్లిలోని ప్లేట్లు కడిగాల్సి వచ్చింది. పెళ్లి కోసం వచ్చి మొత్తం సమయాన్నంత మేం కిచెన్లోనే గడిపాల్సి వచ్చింది. ఈ ఘటన మూడేళ్ల క్రితం జరగగా, ప్రస్తుతం ఆ జంట విడాకులు కూడా తీసేసుకున్నారు. బహుశా అతిథుల అవమానపరిచనందుక ఫలితమేమో ఇది ఏమైనా!’ అని సదరు మహిళ చెప్పుకొచ్చింది. ఇది చదివిన నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘ఇది చాలా చేదు అనుభవం. తినేందుకు సరిపడా పుడ్ లేకపోగా.. ప్లేట్లు కడిగించారు. అసలు వాళ్ల పెళ్లి గురించే ఆలోచించారే గానీ.. అతిథులను పట్టించుకోలేదు’’ అని ఒకరు. ‘‘నీ స్థానంలో నేను అక్కడ ఉంటే.. తక్షణమే పెళ్లి నుంచి పరారయ్యేవాడిని’’ అని మరొకరు కామెంట్ చేశారు. -
ప్రజల నిర్లక్ష్యం.. రోడ్లపై జీహెచ్ఎంసీ సిబ్బంది
రహమత్నగర్: ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు దుర్గయ్య. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య విభాగంలో కామాటీగా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం కామాటీ పని పక్కన పెట్టి రహదారులపై చెత్త వేయకుండా ఇలా కాపలా కాస్తున్నాడు. వాహనాలపై వచ్చి రోడ్లమీద, ఫుట్పాత్లపై చెత్త పడవేయకుండా అడ్డుకుంటున్నాడు. ప్రజల నిర్లక్ష్యం మూలంగా సిబ్బంది ఇలా రోజు కాపలా ఉండాల్సి వస్తోంది. సర్కిల్–19లోని రహమత్నగర్ డివిజన్ హెచ్ఎఫ్నగర్, కార్మికనగర్, శ్రీరాంనగర్ డంపింగ్ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది చాలా మంది ఇలాగే కాపలా కాయాల్సి వస్తోంది. ప్రజలు ఇప్పటికైనా మేల్కొని..సామాజిక బాధ్యతతో వ్యవహరించి రోడ్లపై చెత్త వేయకుండా ఉండాలని, లేకుంటే మాకు రోజూ ఇలా కాపలా కాసే డ్యూటీ తప్పదని దుర్గయ్య వాపోయారు. రోగాలు వ్యాపిస్తున్న ఈ తరుణంలో అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. ( చదవండి: అతి తెలివి అంటే ఇదే.. ఇళ్లంతా ఐరన్తోనే నిర్మాణం ) -
సరికొత్త టెక్నాలజీతో హైయర్ అత్యాధునిక ఏసీ
సాక్షి, న్యూఢిల్లీ: చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ కంపెనీ హైయర్ సెల్ఫ్ క్లీన్కూల్ టెక్నాలజీతో కూడిన ఏసీని భారత మార్కెట్లో విడుదల చేసింది. అన్ని కాలాల్లోనూ అనుకూలమైన ఏసీ ఉత్పత్తిగా కంపెనీ పేర్కొంది. 1.5 టన్ కెపాసీటీతో కూడిన ఈ హాట్ అండ్ కోల్డ్ 3 స్టార్ ఏసీ.. ట్రిపుల్ ఇన్వర్టర్ ప్లస్ టెక్నాలజీతో ఉంటుందని సంస్థ ప్రకటించింది. ఏసీ తనంతట తానే శుభ్రం చేసుకోవడంతోపాటు, గదిలో ఉష్ణోగ్రతను తగినట్టు కూలింగ్ను మార్చుకోవడం చేస్తుందని, 65 శాతం ఇంధనాన్ని ఆదా చేస్తుందని తెలిపింది. 60 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ ఏసీ పనిచేస్తుందని ప్రకటించింది. మైక్రో డస్ట్ ఫిల్టర్తో కూడిన ఈ కొత్త క్లీన్కూల్ ఏసీ గాలి నుండి దుమ్ము, బ్యాక్టీరియా వైరస్ను తొలగిస్తుంది. తద్వారా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం నుండి వినియోగదారులను రక్షిస్తుందని కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా, బెస్ట్-ఇన్-క్లాస్ మోటారు, ఆప్టిమైజ్డ్ ఫ్యాన్ ఎయిర్ డక్ట్తో అమర్చబడి ఉంటుందనీ, ఇది 15 మీటర్ల వరకు గాలిని వీచేలా చేస్తుందని పేర్కొంది. ఈ ప్రత్యేక ఫీచర్ గదిలోని అన్ని మూలలను చాలా వేగంగా చల్లబరుస్తుందని చెప్పింది. -
చీపుర్లు పట్టిన టీచర్లు
సత్తుపల్లి టౌన్:పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడంతో సత్తుపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో చెత్తా చెదారం పేరుకుపోయింది. గురువారం ఉదయం వచ్చిన ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు అది చూసి మాకెందుకులే అనుకోలేదు.. చీపుర్లు పట్టి పాఠశాల ప్రాంగణాన్ని ఊడ్చి శుభ్రం చేశారు. దీనిపై పీఆర్టీయూ రాష్ట్ర నేత చిత్తలూరి ప్రసాద్ మాట్లాడుతూ.. చాలా పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులు లేకపోవటంతో పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయన్నారు. దీంతో ఉపాధ్యాయులే చీపుర్లు పట్టి శుభ్రం చేసుకోవాల్సిన దుస్థితి తలెత్తిందని చెప్పారు. -
ఫ్రిజ్లో సాల్మొనెల్లా సూక్ష్మజీవి!
మనమందరం రకరకాల ఆహారపదార్థాలను ఫ్రిజ్లో దాచుకుంటాం. ఫ్రిజ్లోని ఉష్ణోగ్రత చాలా చాలా తక్కువగా ఉండటం వల్ల అక్కడ సూక్ష్మజీవులు పెరగడానికి అవకాశమే లేదని అనుకుంటాం. నిజానికి అక్కడ కూడా సాల్మొనెల్లా అనే ఓ సూక్ష్మజీవి పెరగడానికి అవకాశం ఎక్కువే. సాధారణంగా మాంసాహారం నిల్వ చేసే సమయంలో ఈ సూక్ష్మజీవి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక ఆహారపదార్థంలో సాల్మొనెల్లా ఉందంటే అది ఫ్రిజ్లోని అన్ని రకాల ఆహారపదార్థాలనూ కలుషితం చేసే అవకాశం ఉంది. ఫలితంగా ఆయా ఆహారపదార్థాలను బాగా వేడిచేయకుండా తిన్నప్పుడు కొందరిలో నీళ్ల విరేచనాలతో పాటు డీ–హైడ్రేషన్ ముప్పు తప్పదు. అందుకే ఫ్రిజ్ను సైతం ఆరోగ్యకరంగా ఉండేలా ఎలా చూసుకోవాలో తెలుసుకుందాం. ఫ్రిజ్లో ఆహారపదార్థాలు దాచుకునే క్రమంలో ఫ్రిజ్ హైజీన్ కూడా అవసరమే ఇందుకోసం మనం అందులో మాంసాహారం, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు నిలువ చేసుకునే సమయంలో అవన్నీ వేర్వేరుగానూ, హానికరం కాని ప్యాకింగ్ మెటీరియల్తో ప్యాక్ చేసి పెట్టుకోవాలి. మాంసాహార పదార్థాల్లోనూ చికెన్, మటన్, సీఫుడ్స్ లాంటి మాంసాన్ని (రా–మీట్ను) దేనికదే విడివిడిగా ప్యాక్ చేసి ఫ్రిజ్లో పెట్టాలి. ఒక మాంసాహారం మరో మాంసాహారంతో ఎట్టిపరిస్థితుల్లోనూ కలవకూడదు. (చదవండి: మంచి నిద్రకూ.. బ్యాక్టీరియాకు లింకు) ఫ్రిజ్లోంచి తీసిన ఆహార పదార్థాలను పచ్చిపచ్చిగా ఉన్నవాటిని సాధ్యమైంతగా రా–ఫుడ్ రూపంలో తినకపోవడమే మేలు. ఇక ఆకుకూరలూ, కాయగూరలను తగిన ఉష్ణోగ్రత వద్ద సరిగ్గా ఉడికాకే తినాలి. ఫ్రిజ్ నుంచి తీసిన మాంసాహారాన్ని తప్పనిసరిగా అత్యధిక ఉష్ణోగ్రత వద్ద ఉడికించేలా తప్పక జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే అత్యధిక ఉష్ణోగ్రత వద్ద సాల్మొనెల్లా లేదా ఈ–కొలై సూక్ష్మజీవులు చనిపోతాయి. మాంసాహారం తినేవారు దాన్ని సరిగ్గా ఉడికించాక (ప్రాపర్లీ కుక్డ్ ఫుడ్) మాత్రమే తినాలి. డీప్ ఫ్రీజర్ భాగంలో అర చేయి పెట్టి చూసినప్పుడు అది బాగా చల్లగా తగలాలే తప్ప... బాగా తడితడిగా చిత్తడిగా తగలకూడదు. అలా చిత్తడిగా ఉందంటే అక్కడ తగిన ఉష్ణోగ్రత నిర్వహితం (మెయింటెయిన్) కావడం లేదని అర్థం. ఫ్రిజ్లో తగిన చల్లదనం / ఉష్ణోగ్రత లేకపోతే దాని పనితీరు బాగాలేదని గ్రహించి, ఫ్రిజ్ రిపేర్ చేసేవారితో దాన్ని తప్పక బాగు (రిపేర్) చేయించుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ ఫ్రిజ్ను నెలకొకసారో లేదా రెణ్ణెల్లకొకసారో... ఇలా నిర్ణీత సమయంలో తప్పక శుభ్రం చేసుకుంటూ ఉండాలి. -
చుట్టాలు వస్తేకనీ..తాజ్ను పట్టించుకోని ప్రభుత్వం
-
కాలుష్యంతో వ్యాధుల ముప్పు
సాక్షి, హైదరాబాద్: ‘పరిసరాల పరిశుభ్రత, మూసీ ప్రక్షాళలనతోనే జల, వాయుకాలుష్యం సహా డెంగీ, మలేరియా దోమల నియంత్రణ సాధ్యం. ప్రజారోగ్యానికి హానికరంగా మారిన మూసీని ఎంత త్వరగా ప్రక్షాళన చేస్తే అంత మంచిది. లేదంటే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు’అని హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ హెచ్చరించారు. ఫౌండేషన్ ఫర్ ఫ్యూచరిస్టిక్ సిటీస్ ఆధ్వర్యం లో ‘హెల్త్ హైదరాబాద్’పేరుతో ఆదివారం స్టాఫ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజీలో కరుణా గోపాల్ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. నగరంలో రోజురోజుకూ పెరుగుతోన్న జల, వాయు కాలుష్యం ప్రజారోగ్యానికి పెద్ద ముప్పుగా పరిణమించిందన్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, మూసీని ప్రక్షాళన చేయడం ద్వారా డెంగీ, మలేరియా వ్యాధులకు కారణమవుతున్న దోమలను నియంత్రించవచ్చని చెప్పారు. శారీరక శ్రమను అలవర్చుకోవడం, సహజ ఆహారం తీసుకోవడం ద్వారా రోగాల బారీ నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. పాఠశాలల్లో ఆటస్థలాలను ఏర్పాటు చేయడం, పిల్లలకు ఆడుకునే అవకాశం ఇవ్వడం ద్వారా అధిక బరువు ముప్పు నుంచి పిల్లలను కాపాడవచ్చని పేర్కొన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి మాట్లాడుతూ.. శరీరానికి కనీస వ్యాయామం లేకపోవడం వల్ల అనేక మంది చిన్న వయసులోనే పెద్ద జబ్బుల బారిన పడుతున్నారని తెలిపారు. వైద్య ఖర్చులు బాధిత కుటుంబాలనే కాదు ప్రభుత్వాలను కూడా సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయని చెప్పారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు శరీరానికి అవసరమైన వ్యాయామం అందించడం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చని ఆయన సూచించారు. -
పళ్లు శుభ్రం చేసే చేసే పద్ధతితో డేంజర్!
మనకు పెద్దగా అలవాటు లేదుగానీ.. ఇతర దేశాల్లో పళ్లను శుభ్రం చేసుకునే పద్ధతిలో ఫ్లాసింగ్ ఒకటి. బ్రష్ చేసిన తరువాత పళ్ల మధ్య చిక్కుకున్న ఆహారాన్ని ఒక దారం సాయంతో తొలగించుకోవడాన్ని ఫ్లాసింగ్ అంటారు. బాగుందిగానీ.. ఈ ఫ్లాసింగ్ కోసం వాడుతున్న ప్రత్యేకమైన దారం కారణంగా పళ్ల మధ్య పాలిఫ్లూరోర అల్కైల్ (పీఎఫ్ఏ) రసాయన పదార్థాలు పోగుపడుతున్నట్లు తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది. కాలిఫోర్నియా పబ్లిక్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొంతమంది కార్యకర్తల రక్తనమూనాలను పరీక్షించడం ద్వారా ఈ నిర్ధారణకు వచ్చారు. ఫర్నిచర్ మొదలుకొని అనేక ఇతర వస్తువుల్లో నీటిని దూరంగా ఉంచేందుకు ఈ పీఎప్ఏలను వాడుతున్నారు. పైగా అంత తేలికగా నాశనమయ్యే రసాయనమూ కాదిది. మార్కెట్లో అందుబాటులో ఉన్న 18 కంపెనీలు ఈ పీఎఫ్ఏను ఫ్లాసింగ్ దారాల పై పూతగా వాడుతున్నట్లు తెలిసింది. పళ్లమధ్య ఈ దారాన్ని ఉంచి కదిలించినప్పుడు పూతలోని రసాయనాలు అక్కడే పోగుపడుతున్నాయని.. తరువాత కండరాల్లోకి కూడా చేరిపోతున్నాయని తాము గుర్తించినట్లు కేటీ బోరోనౌ అనే శాస్త్రవేత్త తెలిపారు. పీఎఫ్ఏలతో కేన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నది తెలిసిందే. అనేక ఇతర పదార్థాల నుంచి కూడా ఈ పీఎఫ్ఏ శరీరంలోకి ప్రవేశించేందుకు అవకాశం ఉంది. -
4న మిక్సీతో సిరిధాన్యాల శుద్ధిపై శిక్షణ
సిరిధాన్యాలను మిక్సీలతో ఇంటిపట్టున సులభంగా శుద్ధి చేసి బియ్యం తయారీ, అటవీ చైతన్య ద్రావణంతో సిరిధాన్యాల సాగుపై ఈ నెల 4న గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడులో శిక్షణ ఇస్తారు. ఉ. 10 గం. నుంచి సా. 5 గం. వరకు శిక్షణ ఉంటుంది. డా. ఖాదర్ వలి అనుయాయి, అటవీ కృషి నిపుణులు బాలన్(మైసూరు) తదితరులు తెలుగులో శిక్షణ ఇస్తారు. పేర్లు నమోదు చేసుకోగోరే వారు 83675 35439, 97053 83666 నంబర్లలో సంప్రదించవచ్చు. -
వైరల్ వీడియో: డ్రైనేజీ శుభ్రం చేసిన సీఎం
పుదుచ్చేరి : స్వచ్ఛ భారత్లో భాగంగా మన నాయకులు, సినిమా ప్రముఖులు, క్రీడాకారులు ఇలా ఒక్కరనేంటి దాదాపు దేశంలోని ప్రముఖులందరు కూడా చీపురు పట్టి రోడ్లు ఉడ్చిన సంఘటనలు అనేకం జరిగాయి. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఓ వ్యక్తి స్వయంగా పార చేత పట్టుకుని మురికి కాలువలను శుభ్రం చేసిన సంఘటనలను ఎక్కడా చూసి ఉండం. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఓ వీడియో చూస్తే ఆ లోటు కూడా తీరిపోతుంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘స్వచ్ఛతాహై సేవా’ కార్యక్రమంలో భాగంగా ఓ ముఖ్యమంత్రి మురికి కాలువలో ఉన్న చెత్తను తొలగించారు. నలుగురికి చెప్పే ముందు మనం ఆచరించాలని చెప్పిన ఈ వ్యక్తి పుదుచ్చేరి కాంగ్రెస్ సీఎం వీ నారాయణస్వామి. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో నారాయణస్వామి స్వయంగా మురికి కాలువలో ఉన్న చెత్తను తొలగించారు. ఈ వీడియో చూసిన అభిమానులు ఆయనను అభినందనలతో ముంచెత్తుతున్నారు. నారాయణ స్వామి చేసిన పనిని మెచ్చుకుంటూ.. ‘మీరు ఏదో ఫొటోలకు ఫోజులు ఇవ్వడం కోసం ఈ పని చేస్తున్నట్లు లేరు. చాలా నిజాయితీగానే మురికి కాలువలోకి దిగి అక్కడ ఉన్న చెత్తను తొలగిస్తున్నార’ని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ‘కార్యకర్తలకు మీరు ఓ రోల్మోడల్గా నిలిచారు. మీరు చేసిన పని మాకు మరింత ఉత్సాహన్నిచ్చింద’ని కాంగ్రెస్ అభిమాని ఒకరు వ్యాఖ్యానించారు. కానీ మరికొందరు మాత్రం ‘ఇప్పటికైనా మీకు పారిశుద్ధ్య కార్మికుల కష్టాలు అర్థం కావాలని కోరుకుంటున్నాం. వారికి సరైన పరికరాలు అందజేయండి’ అంటూ కామెంట్ చేశారు. -
మురికి కాలువను శుభ్రం చేసిన సీఎం
-
శుభ్రతే సౌందర్యం
టీనేజ్లో మొటిమలు, బ్లాక్హెడ్స్తో సమస్య జటిలమై యాక్నెకు దారితీస్తుంది. చర్మం తిరిగి క్లియర్గా రావాలంటే ఇంట్లోనే చేసుకోదగిన సింపుల్ ట్రీట్మెంట్లివి. ∙ఆరెంజ్ పీల్ పౌడర్ను పన్నీటితోకాని మంచినీటితో కాని పేస్టులాకలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి. కమలాపండు తొక్కలను ఎండబెట్టి పొడిచేసుకుని నిల్వచేసుకుని వాడుకోవచ్చు లేదా మార్కెట్లో రెడీమేడ్గా ఈ పౌడర్ దొరుకుతుంది. తాజా కమలాపండు తొక్కలనుగ్రైండ్ చేసి కూడా వాడుకోవచ్చు. దాల్చిన చెక్కను పొడి చేసి అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని మొటిమలు, మచ్చలు ఉన్న చోట మాత్రమే రాసి ఆరిన తర్వాత కడిగేయాలి. దీనిని వారానికి మూడుసార్లు వేస్తుంటేమంచి ఫలితం ఉంటుంది. ఈప్యాక్ వేసినప్పుడు చర్మం కాస్తమండుతుంది. నొప్పితో కూడిన మొటిమలకు ఇది మంచి ట్రీట్మెంట్ ∙వేరుశనగ నూనెలో అంతే మోతాదు నిమ్మరసం కలిపి ముఖానికిపట్టించి పది నిమిషాల తర్వాత చన్నీటితో కడగాలి. ∙పెరుగు, కీరా, అవకాడో మూడింటినీ మిక్సీలో వేసి మిశ్రమాన్ని చిక్కని పేస్ట్గా చేసుకోవాలి. ఈ పేస్ట్ను ముఖమంతా పట్టించి 15నిముషాల తర్వాత తడి వస్త్రంతో శుభ్రం చేసుకోవాలి. -
పార్టీల విరాళాలే టార్గెట్: ఎలక్టోరల్ బాండ్స్
సాక్షి, న్యూఢిల్లీః రాజకీయ పార్టీలకు అందే ఎన్నికల విరాళాల్లో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళికను ప్రకటించింది. పార్టీలకు అందే కోట్ల కొద్దీ విరాళాలకు చెక్ పెట్టే యోచనతో ఎలక్టోరల్బాండ్స్ పథకాన్ని లాంచ్ చేసింది. 2017 ఫిబ్రవరి 1న 2017-18 బడ్జెట్ ప్రసంగంలో రాజకీయ నిధుల పారదర్శకత అంశాన్ని ప్రస్తావించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం లోక్సభలో ఈ బాండ్స్పై వివరణ ఇచ్చారు. ఈ పథకంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుందని, ఈ రోజు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు వెల్లడించారు.వీటిని రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చే సందర్భంగా వాడుకోవచ్చన్నారు. భారతదేశ పౌరుడు లేదా దేశంలో ఉన్న కార్పొరేట్ సంస్థలకు ఈ బాండ్లను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ బాండ్లు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబర్ నెలల్లో పది రోజుల పాటు ఈ బాండ్లను ఎస్బీఐ నుంచి కొనుగోలు చేయొచ్చని జైట్లీ వివరించారు. ఇలా వెయ్యి, పది వేలు, లక్ష, పది లక్షలు, కోటి రూపాయలు.. ఇలా ఎంత విలువైన బాండ్నైనా కొనుగోలు చేయొచ్చని తెలిపారు. అలాగే ఈ బాండ్లపై విరాళం ఇస్తున్న వారి పేర్లు ఉండవు. కానీ ఈ బాండ్లను కొనుగోలు చేసే వ్యక్తి తన కేవైసీ వివరాలను ఎస్బీఐకి చెప్పాల్సి ఉంటుందని జైట్లీ స్పష్టంచేశారు. పేరుకు బాండ్లే అయినా వీటికి వడ్డీ ఉండదు. ఒక రకంగా ప్రామిసరీ నోటు లాంటిది. ఆ విరాళాలు సంబంధిత రాజకీయ పార్టీకి చేరేవరకు ఎస్బీఐ బాధ్యత వహిస్తుంది. వీటి కాలపరిమితి 15 రోజులు. ఈ గడువులోపు సంబంధిత రిజిస్టర్డ్ రాజకీయ పార్టీ పేరిట ఉన్న బ్యాంక్ అకౌంట్ ద్వారా వీటిని నగదు రూపంలోకి మార్చుకునే వీలుంటుంది.ఈ ఎన్నికల బాండ్ల ద్వారా ఎంత డబ్బు సంపాదించిందో ఎన్నికల కమిషన్ రిటర్న్స్లో ప్రతి రాజకీయ పార్టీ దాఖలు చేయాలని ఆర్థికమంత్రి చెప్పారు. సార్వత్రిక ఎన్నికలు ఉన్న ఏడాదిలో ప్రతి నెలా 30 రోజుల పాటు ఇస్తారని ఆర్థిక మంత్రి జైట్లీ వెల్లడించారు. The Government of India today notified the Scheme of Electoral Bonds to cleanse the system of political funding in the country.Electoral Bond would be a bearer instrument in the nature of a Promissory Note and an interest free banking instrument. — Ministry of Finance (@FinMinIndia) January 2, 2018 -
పిల్లలతో డ్రైనేజ్ క్లీన్ చేయించిన వార్డెన్
-
పరిశుభ్రతకు పంచ సూత్రాలు
కాకినాడ సిటీ : పరిశుభ్రమైన పరిసరాలను, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు జిల్లాలో అన్ని గ్రామాల్లో పంచసూత్ర కార్యాచరణ అమలు పర్చాలని కలెక్టర్ హెచ్.అరుణ్కుమార్ ఎంపీడీఓలను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి మండలస్థాయి వీడియో కాన్ఫరెనుస నిర్వహించి స్వచ్ఛభారత్, ఉపాధి హామీ కార్యక్రమాల కింద గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాల సాధన, ఉపాధి హామీ పథకం కింద కూలీ లకు పనుల కల్పన, పనుల తనిఖీ, పంట కుంటల తవ్వకం తదితర అంశాలపై ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలను ముమ్మరం చేస్తూ అన్ని గ్రామాల్లో పరిశుభ్రత పంచ సూత్ర కార్యాచరణ పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా నూరుశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతో ప్రతి గ్రామాన్ని సత్వరం బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా తీర్చిదిద్దడాన్ని తొలి అంశంగా చేపట్టాలన్నారు. రెండో అంశంగా ప్రతి గ్రామంలో డంపింగ్యార్డ్ ఏర్పాటు చేసి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేపట్టాలన్నారు. మూడో అంశంగా గ్రామాల్లో మురుగునీరు నిలిచి ఉండే పల్లపు ప్రదేశాలను మెరక చేయడం, సీసీ డ్రెయినులు లేని చోట్ల కచ్చా డ్రెయినులను తవ్వి కమ్యూనిటీ సోక్పిట్లకు మురుగును తరలించడం చేయాలని సూచించారు. నాలుగో అంశంగా గ్రామాల్లో కొబ్బరి బొండాలు, మొక్కజొన్న పొత్తులు, ఇతర తినుబండారాలు విక్రయించే చిరు వ్యాపారులు, టీ బడ్డీలు, కాఫీ హోటళ్ళ వర్తకులు తమ వ్యాపార వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వదలకుండా క్రమశిక్షణతో మెలిగేలా అవగాహన కల్పించి తప్పనిసరిగా పాటించేట్టు నియంత్రించాలన్నారు. ఐదో అంశంగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, డ్వాక్రా మహిళలు, యువజన సంఘాలు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి వ్యక్తిగత, సామాజిక పరిశుభ్రత పట్ల ప్రజలందరిలో చైతన్యం, ఆచరణలను జాగృతం చేయాలన్నారు. సమావేశంలో డ్వామా పీడీ నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
చైనాలో స్వచ్ఛ టవర్!
పీల్చే గాలి కలుషితమైపోతోంది. అది ఢిల్లీ... ముంబై... షాంఘై ఏదైనా కావచ్చు. రోడ్లపై తిరిగే వాహనాలను నియంత్రించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఓ ప్రయోగం చేసి గమ్మున ఉండిపోయింది. అంటే వర్కవుట్ కాలేదని! అయితే చైనా దీనికి భిన్నంగా ఒకదాని తరువాత ఒకటి ప్రయత్నాలు చేస్తూ పోతోంది. ఇందుకు తాజా ఉదాహరణ ఫొటోలో కనిపిస్తున్న ‘స్మాగ్ టవర్’. వాహనాల నుంచి వెలువడే పొగలో ఉండే అతిసూక్ష్మమైన కాలుష్య పదార్థాలను స్మాగ్ అంటారు. ఈ టవర్ గాల్లో ఉండే స్మాగ్ను పీల్చేసుకుని స్వచ్ఛమైన గాలిని బయటకు వదులుతుంది. దాదాపు 21 అడుగుల పొడవుండే ఈ స్మాగ్ టవర్స్ ఒకొక్కటి గంటకు 30 వేల ఘనపు మీటర్ల గాలిని శుద్ధి చేయగలదు. టవర్లోపల నెగటివ్ చార్జ్తో ఉండే ఉపరితలంపై పాజిటివ్ అయాన్లు, దుమ్మూధూళి, స్మాగ్ అతుక్కుపోతాయి. నెదర్లాండ్స్కు చెందిన డాన్ రూస్గార్డే డిజైన్ చేసిన ఈ టవర్లు కేవలం 1400 వాట్ల విద్యుత్తుతో పనిచేస్తాయి. ఇంకోలా చెప్పాలంటే రెండు మిక్సీలు వాడేంత విద్యుత్తు అన్నమాట. సరే... అంతా బాగానే ఉందిగానీ ఈ యంత్రం నుంచి స్వచ్ఛమైన గాలి మాత్రమే బయటకొస్తూంటే... స్మాగ్ అంతా ఏమవుతుంది? రెండో ఫొటోలో ఓ ఉంగరం కనిపిస్తోందా? దాని మధ్యలో నల్లగా కనిపిస్తోందే.. అది ఈ టవర్ సేకరించిన స్మాగ్. ఈ ఒక్క ఉంగరంలో ఉన్న స్మాగ్ వెయ్యి ఘనపు మీటర్ల గాలిని శుద్ధి చేస్తే వచ్చింది. ఈ లెక్కన ఈ టవర్ రోజుకు 300 ఉంగరాలకు సరిపడా స్మాగ్ను సేకరిస్తుందన్నమాట. రూస్గార్డే ఈ ఉంగరాలు ఒకొక్కదాన్ని 250 యూరోల చొప్పున విక్రయిస్తున్నారు. భలే ఐడియా కదూ...! వాతావరణంలోంచి టవర్ తన లోపలికి లాగేస్తున్న స్మాగ్... ఇదిగో ఈ ఉంగరం లాంటి పరికరం (స్మాగ్ రింగ్) లోకి చేరుతుంది. -
స్కిన్ టైట్నింగ్
బ్యూటిప్స్ రెండు లేదా మూడు క్యాబేజీ ఆకులు, రెండు టీ స్పూన్ల బియ్యప్పిండి, గుడ్డు తెల్ల సొన తీసుకుని అన్నింటినీ మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. అవసరమైతే నీటిని కలుపుకోవచ్చు. పొడి చర్మం వాళ్ళు మూడు చుక్కలు ఆలివ్ ఆయిల్ లేదా బాదం ఆయిల్ను కలుపుకోవచ్చు. ఈ పేస్ట్ని ముఖమంతా అప్లై చేసుకోవాలి. మసాజ్ చేయకూడదు. ప్యాక్ టైట్ అయ్యేంతవరకూ లేదా ప్యాక్ పొడిబారేంత వరకూ ఉంచుకుని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికోసారి ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం ముడతలు పడకుండా, వదులు అవకుండా ఉంటుంది. ఇంట్లోనే బ్లీచింగ్ తయారి: బాగా మరిగిన పాలు చల్లారిన తర్వాత పై మీగడను ఒక గిన్నెలోకి తీసుకుని దానిలో చిటికెడు పసుపు, కొన్ని చుక్కలు నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా ముఖాన్ని నీటితో కడిగి శుభ్రం చేసుకోవాలి. తయారుచేసుకున్న బ్లీచ్ను ముఖమంతా అప్లై చేసుకోవాలి. వేలితో ముఖంపై నెమ్మదిగా వలయాకారంలో రబ్ చేయాలి. పది నిముషాలపాటు ఉంచుకుని కడిగేసుకోవాలి. తేడా మీరే గమనిస్తారు. మార్కెట్లో లభించే బ్లీచ్ కంటే బాగా పనిచేస్తుంది. -
బ్యూటిప్స్
పసుపు రంగులోకి మారిన అరటిపండు తొక్కతో చర్మ కాంతిని మెరుగుపరచుకోవచ్చు. అరకప్పు తాజా పాలు తీసుకుని దానిలో అరటిపండు తొక్కను వేసి మరగపెట్టాలి. పాలు చల్లారిన తర్వాత టీ స్పూను పాలలో దూది ఉండను (కాటన్ బాల్) ముంచి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది మంచి క్లెన్స్ర్గా పనిచేస్తుంది. మిగిలిన పాలల్లో ఉన్న అరటిపండు తొక్కను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ను ముఖానికి అప్లై చేసుకుని అరగంటపాటు ఆరనివ్వాలి. తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికోసారి చేస్తే చాయ మెరుగవుతుంది. చర్మం వదులుగా అవ్వకుండా ఉంటుంది, అలాగే ముడతలు కూడా పోతాయి. ఒక్కోసారి ముక్కు రంధ్రాల చుట్టూ, చుబుకం దగ్గర చర్మం నల్లగా, దళసరిగా మారిపోతుంటుంది. అలాంటప్పుడు స్నానానికి వెళ్ళే ముందుగా ఒక స్పూన్ గ్లిజరిన్, మూడు స్పూన్ల తేనె కలుపుకుని, ముఖానికి, కంటి చుట్టూ అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్ను 10-15నిముషాల పాటు ఉంచుకోవాలి. తర్వాత ముఖాన్ని నీటితో కడగాలి. ఇలా రోజూ చేస్తుంటే వారం రోజుల్లోపే మీ ముఖం కాంతివంతంగా తయారవుతుంది. జిడ్డు చర్మం ఉన్నవాళ్ళు గ్లిజరిన్, తేనె మిశ్రమంలో కొద్దిగా నిమ్మరసం లేదా చిటికెడు పసుపు కులుపుకోవచ్చు. -
పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్య సమాజం
– దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తాడేపల్లిగూడెం : రైల్వేస్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యవంతమైన రైలు ప్రయాణం ప్రయాణికులు చేయవచ్చని దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. భారతీయ రైల్వేలో చేపట్టిన స్వచ్ఛ్ సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం స్థానిక రైల్వేస్టేషన్లో చేపట్టిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ప్రయాణికులు ఆహ్లాదకర వాతావరణంలో ప్రయాణించాలంటే పరిశుభ్ర వాతావరణం అవసరమన్నారు. 2019 అక్టోబర్ నాటికి భారతదేశం స్వచ్ఛ భారత్గా ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, దానిలో భాగంగా నియోజకవర్గంలో వారానికి ఒక రోజు కార్యక్రమం చేపడుతున్నామన్నారు. రైల్వేస్టేషన్లో బూజులు దులిపి పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఆయన వెంట పార్టీ నాయకులు కర్రి ప్రభాకర బాలాజీ. యెగ్గిన నాగబాబు, సీఎ ఎంఆర్ఎల్ఎస్.మూర్తి, కంచుమర్తి నాగేశ్వరరావు, కర్రి సీతారామయ్య పాల్గొన్నారు. వసతుల కోసం రైల్వే అధికారికి వినతి తాడేపల్లిగూడెం రైల్వేస్టేషన్లో వసతులు, రైల్వే హాల్టులు, ఇతరాల కోసం మంత్రి మాణిక్యాలరావు రైల్వే డెప్యూటీ చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ బి.వెంకట్రావుకు వినతిపత్రం అందచేశారు. గూడ్సు షెడ్ను నవాబుపాలెంకు మార్చాలని కోరారు. ఇక్కడ గూడ్సు షెడ్ ప్రాంతంలో రెండో రిజర్వేషన్ టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయాలన్నారు. ఏలూరు రోడ్డు వరకు రైల్వేపుట్ బ్రిడ్జిని విస్తరించాలని కోరారు. -
పరిశుభ్రతే లక్ష్యంగా పనిచేయండి
రాజమహేంద్రవరం సిటీ : పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా పనిచేయాలని సికింద్రాబాద్ చీఫ్ ఇంజనీర్ (నిర్మాణం)బ్రహ్మానందరెడ్డి పిలుపు నిచ్చారు. స్వచ్చత సప్తాహ్ కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం ప్రధాన రైల్వే స్టేషన్లో శనివారం ప్రారంభించారు. మొదటి రోజు స్టేషన్ ఆవరణ, రైల్వే ఉద్యోగుల కాలనీల్లో మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు ఉన్న వాటిని ట్రిమ్మింగ్ చేసే కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛత సప్తాహ్లో స్వచ్ఛ స్టేషన్, స్వచ్ఛ రైలు, స్వచ్ఛ నీరు, స్వచ్ఛ పరిశర్, స్వచ్ఛ సహయోగ్, స్వచ్ఛ సంవాద్ కార్యాక్రమాలను రోజుకు ఒకటి చొప్పున నిర్వహిస్తామని స్టేషన్ మేనేజర్ భమిడిపాటి సుబ్రహ్మణ్యశాస్త్రి తెలిపారు. స్టేషన్ చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ కేశవభట్ల శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ వర్క్స్ జాన్ విజయ్, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
పరిసరాల పరిశుభ్రత పాటించాలి
కట్టంగూర్ ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను పాటించాలని తెలంగాణ సాంస్కృతిక సారథి పైలం సంతోష్ అన్నారు. బుధవారం మండలకేంద్రంలో ఆరోగ్యశాఖ, పౌరసంబంధాల శాఖల ఆధ్వర్యంలో సారథి కళాకారులు పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ పరిసరాల్లో నీరు నిలువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వ్యాధుల పట్ల ప్రజలు అవగాహన కల్గిఉండి అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో కళాకారులు వెంకట్, సంధ్యారాణి, తాటిపాముల శంకర్, వెంకట్ తదితరులున్నారు. -
పారిశుద్ధ్య వారోత్సవాలు ప్రారంభం
నడిగూడెం: మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో గురువారం పారిశుద్ధ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీఓ బర్మావత్ శంకర్ నాయక్, ఈఓఆర్డీ కొల్లు వైష్ణోయోగి, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్లాస్టిక్ రహిత పట్టణాలుగా తీర్చిదిద్దాలి
మహబూబ్నగర్ న్యూటౌన్ : అన్ని మున్సిపాలిటీలను ప్లాస్టిక్, ఫ్లెక్సీ రహిత పట్టణాలుగా తీర్చిదిద్దాలని సీడీఎంఏ దాన కిశోర్ సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి మున్సిపల్ అధికారులతో వీడియోకాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికీ చెత్త సేకరణను వందశాతం అమలు చేయాలన్నారు. నిర్దేశించిన లక్ష్యం ప్రకారం హరితహారం కార్యక్రమంలో విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. ప్రతీ మున్సిపాలిటీలో రెండుకు తగ్గకుండా మహిళా మరుగుదొడ్లు నిర్మించాలన్నారు. ఆయా మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ బయోమెట్రిక్ హాజరును తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి మహబూబ్నగర్, ఐజ మున్సిపల్ కమిషనర్లు భూక్యాదేవ్సింగ్, వెంకన్న, ఇంజనీరింగ్ విభాగం అధికారులు హాజరయ్యారు. -
‘ఫైన్’గా లేకపోతే ‘ఫైనే’
తాటిచెట్లపాలెం: నిత్యం విశాఖ–కాకినాడ పాసింజర్లో అనకాపల్లి వెళ్లే అప్పారావు రోజు మాదిరిగానే విశాఖ రైల్వేస్టేషన్కు చేరుకుని రైలు కాలక్షేపానికి సమోసా తింటూ ఆ కాగితాన్ని డస్ట్బిన్నులో వేయకుండా కిందపడేసాడు. ఇంకేముంది రైల్వే అధికారులు రూ.100 ఫైన్ విధించారు. అదేవిధంగా కాంతారావు మూత్రవిసర్జనం రైలు పట్టాలమీదే కానిచ్చేయండంతో రూ.300 బాదారు. ఇదీ వాల్తేరుడివిజన్లో ఎ–1కేటగిరి రైల్వేస్టేషన్లలో ప్రస్తుతం అమలవుతున్న విధానం... పరిశుభ్రతవైపు ఓ అడుగు అన్నచందాగా వాల్తేరుడివిజన్ అడుగులు వేస్తోంది. ఎ1స్టేషన్లుగా పరిగణించే విశాఖపట్నం, రాయగడ, విజయనగరం, శ్రీకాకుళంరోడ్డు, రాయగడ స్టేషన్లతో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీనికై రైల్వేయాక్ట్ ను అనుసరించి స్టేషన్పరిసరాన్ని నాశనంచేసే వారినుంచి గరిష్టంగా రూ.500 వరకూ వసూలుచేయనున్నారు. సంబంధిత రైల్వేస్టేషన్లలో ఉమ్మివేసినా, చెత్తవేసినా, గోడలపై పనికిమాలిని రాతలు రాసినా ఫైన్చెల్సించాల్సి ఉంటుంది. వీటితో పాటు బట్టలు ఉతకడం, వంటలుచేయడం, మూత్రంపోయడంపై ఆంక్షలు విధించారు. పలు నూతన విధానాల్ని అవలంబిస్తున్న విశాఖ రైల్వేస్టేషన్లో ఇప్పటికే వైఫై అనాబుల్ సౌకర్యంతో పాటు వాషబుల్ఆప్రాన్వంటి అధునాతన టెక్నాలజీని వాడుతున్న తరుణంలో ప్రయాణికుల భాద్యత అనే అంశానికి ప్రాధాన్యతనిచ్చి పరిశుభ్రతలో వారిని భాగస్వామ్యం చేయాలని నిర్ణయించినట్టుగా రైల్వేవర్గాలుతెలిపాయి. ఫైన్బాదుడు ఇలా ఉంటుంది... చెత్తాచెదారం వేస్తే– రూ.100 ఉమ్మివేస్తే..–రూ.200 మూత్రవిసర్జనకు–రూ.300 గోడలను పాడుజేస్తే–రూ.500..వీటితోపాటు రైల్వే పరిసరప్రాంతాల్లో ఉమ్మివేస్తే రూ.30 ఫైన్ వసూలుచేస్తారు. ప్రతిఒక్కరూ జాగ్రత్త వహించి మసులుకోవాలని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. -
మేయర్గా పిల్లి!
కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన ఎన్నిక.. ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. రష్యా.. బార్నౌల్ నగరంలో జరిగిన మేయర్ ఎన్నికల్లో మార్జాలం పోటీచేయడమే వింతనుకుంటే.. ఏకంగా అత్యధిక మెజారిటీతో విజయం సాధించడం ప్రపంచాన్ని ఆకర్షించిన వార్తయింది. అసలు పిల్లేంటి? ఎన్నికల్లో పోటీ చేయడం ఏమిటి? అని ఆరాతీస్తే.. ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న అవినీతిని అరికట్టాలనే ఆలోచనను ప్రాక్టికల్ గా అమలుచేస్తూ స్థానిక ప్రజలు బార్సిక్ అనే పిల్లిని స్థానికులు మేయర్ గా పోటీలోకి దింపారు. సాధారణ ఎన్నికల్లో జంతువులు పోటీచేయకూడదనే నిబంధన ఉంది కాబట్టి ఆన్ లైన్ లో ఎన్నికలు నిర్వహించారు. నిజం ఎన్నికలను మైమరపించేలా ప్రచారకార్యక్రమాన్ని నిర్వహించారు. నిజం ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులకంటే మెరుగైన ప్రజాసేవ చేస్తానన్న పిల్లిగారి వాగ్ధానాన్ని ఓటర్లు నమ్మారు. దీంతో తొంభై శాతం ఓట్టను కైవసం చేసుకుని బార్సిక్ ముందువరుసలో నిలిచింది. రష్యన్ సోషల్ మీడియా వెబ్సైట్ (Vkontakte) ద్వారా టికెట్ పొందిన తర్వాత సియమీస్ పిల్లి బార్సిక్.. మేయర్ ఎన్నికల్లో అనేకమంది ఓటర్ల హృదయాలను దోచేసింది. కొత్త మేయర్ ను ఎన్నుకునే సందర్భంలో.. ఆన్లైన్లో జరిగిన పోలింగ్ లో అరుగురు అభ్యర్థులపై పోటీ చేసిన పిల్లి విజయపథంలో దూసుకుపోయింది. స్థానిక ఇంటర్నెట్ గ్రూప్ ద్వారా పోస్ట్ చేసిన పిల్లి.. అభ్యర్థుల జాబితాలో స్థానం సంపాదించింది. అంతేకాదు జనం కూడ ఆ నాలుగుకాళ్ళ అభ్యర్థిని ఆనందంగా ఓట్లేసి గెలిపించేయడం అక్కడ ప్రత్యేకత సంతరించుకుంది. ఓపక్క ఆన్లైన్లో 'గో బార్సిక్'... 'బార్సిక్ రూల్స్' అన్న నినాదాలతో ఓటర్లంతా పలికిన మద్దతుకు రష్యన్ సోషల్ మీడియా నిండిపోయింది. "పోటీ చేసిన అభ్యర్థులకంటే పిల్లే బాగా నిజాయితీగా పనిచేస్తుందని ఓటర్లు నమ్మారు అందుకే దాన్ని గెలిపించారు" అంటూ అలెగ్జాండర్ రెషెత్నికోవ్ పేరున ఓ యూజర్ కూడ ఈ సందర్భాన్ని విమర్శనాత్మకంగా వ్యాఖ్యానించారు. అయితే ఇంతకు ముందు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఇగోర్ సావింట్నేవ్ ను తొలగించిన తర్వాత... ప్రస్తుతం పీటర్ ఫ్రైసన్ ఈ నగర బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఇకపై పిల్లి స్థానంలో మేయర్ బాధ్యతలను ఎవరు స్వీకరిస్తారు అన్న విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. పిల్లిని సపోర్ట్ చేసిన ఓటర్లే ఆ విషయం నిర్ణయిస్తారని అంతా ఎదురు చూస్తున్నారు. -
ఇంటి పనిమనిషి
మనందరం మంచి మనుషులం. మనందరం పని చేసుకునే మనుషులం. మనింటికొచ్చే పనిమనిషి కూడా మనలాంటిదే. మన కుటుంబం కోసం మనం చేసే పనికి తన కుటుంబం కోసం తను చేసే పనికి తేడా లేదు. కానీ ఎందుకో మన అపార్ట్మెంట్లలో, కాలనీలలో కొందరు పనిమనుషుల్ని అగౌరవిస్తుంటారు. మీ ఇరుగుపొరుగులో ఎవరైనా పనిమనుషుల్ని కించపరుస్తుంటే, హింసపెడుతుంటే... వారికి రక్షణ కల్పించే వ్యవస్థ ఉంది. చట్టాలు ఉన్నా అవే పరిష్కారం కాదు. మనం అలాంటి యజమానులను సెన్సిటైజ్ చేస్తే ఒక పేద ఇంటి మనిషికి పెద్ద సాయం చేసిన వాళ్లమవుతాం. తన బిడ్డ కాకపోయినా తల్లిలా చూసుకుంటుంది. తన తల్లిదండ్రులు కాకపోయినా కూతురులా మనింట్లో పెద్దవాళ్లకు సేవ చేస్తుంది. తన ఇల్లు కాకపోయినా ఇంటివాళ్లందరినీ తన వాళ్లలా చూసుకుంటుంది. మన మురికి శుభ్రం చేస్తుంది. మన కోసం నిత్యం శ్రమిస్తుంది. ఈమెను పనిమనిషి అంటాం. ఈమె పనిని గుర్తిస్తున్నామా? ఈమె కూడా ఒక మనిషే అని గుర్తిస్తున్నామా? ఎవరికివారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. పదిహేడేళ్ల సుధ మౌలాలిలోని ఓ ఇంట్లో మూడేళ్ల క్రితం చంటిపిల్లవాడిని చూసుకోవడానికి పనికి కుదిరింది. రోజంతా ఆ పిల్లవాడి బాగోగులు చూసుకోవడానికి సుధకు నెలకు రెండువేల రూపాయలు జీతంగా ఇస్తున్నారు. పిల్లవాడి పనులతో పాటు మెల్లగా ఇంటిపనులు, వంటపనులు కూడా చెప్పడం మొదలుపెట్టారు. ‘ఈ జీతం సరిపోదు, మరో వెయ్యి రూపాయలు పెంచండ’ని సుధ అడిగింది. ఇవ్వడం కుదరదు అని చెప్పడంతో ఆ ఇంట్లో పనిమానేసింది. అదే అపార్ట్మెంట్ మరో ఫ్లాట్లో పనిలో చేరింది. అయితే మూడేళ్లుగా సుధకు బాగా మాలిమి అయిన పిల్లవాడు ఆమె బయట కనిపించడంతో పరిగెత్తుకుంటూ వెళ్లాడు. ఇంటికి వెళ్లమని సుధ ఎంత నచ్చజెప్పినా ఆ పిల్లవాడు వినలేదు. సుధ పనిమానేసిన దగ్గర నుంచి ఆ పిల్లవాడు తిండి తినడం లేదు. సరిగా నిద్రపోవడం లేదు. దాంతో సుధను మళ్లీ పనిలోకి రమ్మని పిల్లవాడి తల్లీదండ్రీ కోరారు. కానీ, జీతం పెంచితేనే వస్తానని సుధ చెప్పింది. ఆమెపై కక్షగట్టిన ఆ తల్లీదండ్రీ సుధ మీద దొంగతనం కేసుపెట్టారు... పిల్లవాడి ఒంటిమీద నగలు వలుచుకెళ్లిందని. పోలీసులు సుధను అరెస్ట్ చేశారు. అంతటితో ఆగకుండా ఆమెను చిత్రహింసలు పెట్టారు. నిజం చెప్పమంటూ వాతలు తేలేలా కొట్టారు. ఇష్టం వచ్చినట్టు కడుపులో తన్నారు. తల, మెడ మీద కాలిబూటుతో తొక్కారు. ఎంతగా హింసించారంటే ఇప్పుడు సుధ లేవలేని పరిస్థితిలో ఉంది. తాను ఓ బిడ్డకు జన్మనిచ్చే అవకాశం కూడా లేదని వైద్యులు చెప్పారు. లేబర్ ఆఫీసులో పోలీసుల మీద, దీనికి కారణమైన ఆ భార్యభర్తల మీద కంప్లయింట్ నమోదయ్యింది. పదహారేళ్ల గౌరి రెండేళ్లుగా బంజారాహిల్స్లోని ఓ ఇంట్లో పనిచేస్తోంది. ఆ ఇంటి కుర్రాడు పెళ్లి చేసుకుంటానని గౌరిని నమ్మించి, గర్భవతిని చేసి, ఆ తర్వాత చెప్పాపెట్టకుండా పారిపోయాడు. ఆ ఇంట్లోవారిని గౌరి తల్లిదండ్రులు నిలదీస్తే... రుజువులేంటి.. అని ఎద్దేవా చేస్తున్నారు. డె భ్బై ఏళ్ల సుశీల పనికి వెళితే తిరిగి ఇంటికొచ్చాకే బాత్రూమ్కి వెళ్లాలి. పనిచేస్తున్న ఇంట్లో బాత్రూమ్కి వెళ్లడానికి వాళ్లు ఒప్పుకోరు. అపార్ట్మెంట్ లిఫ్ట్ను ఉపయోగించకూడదు. మూడంతస్తుల మెట్లు ఎక్కే వెళ్లాలి. ఓ రోజు బాత్రూమ్కి వెళితే ఆ ఇంటివారితో పెద్ద గొడవైంది. తమనే ఎదిరించి మాట్లాడిందని, ఆమె మీద దొంగతనం నేరం మోపారు. పోలీసుకేసు పెట్టారు. అయితే, ఆ వృద్ధురాలిని తీసుకెళ్లలేక ఆమె కొడుకును స్టేషన్లో ఉంచారు పోలీసులు. యజమానులు పనిమనుషుల్ని ఎలా ట్రీట్ చేస్తారనే దానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఆంధ్ర, తెలంగాణ డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి లిజీ జోసెఫ్ ఈ వివరాలను అందించారు. పనిమనుషులు ఒక వ్యవస్థగా లేకపోవడంతో ప్రభుత్వపరంగా వారికి లభించవలసిన గౌరవం, భద్రత, జీతభత్యాలు, ఇతర సదుపాయాలు అందడం లేదనే వాస్తవానికి పై సంఘటనలే నిదర్శనం. ఎందుకింత చిన్నచూపు? సాధారణంగా మన ఇళ్లల్లో బండెడు చాకిరీని అమ్మో, అక్కో, చెల్లో, కూతురో, భార్యో చేస్తుంది. అది వాళ్ల డ్యూటీ అన్నట్టు చూస్తూ ఉండిపోతాం. హెల్ప్ చెయ్యాలని కూడా అనిపించదు. ఈ ధోరణే పని మనుషుల విషయంలోనూ మనం కనబరుస్తుంటాం. ఉత్తిపుణ్యానికే పనిమనుషులకు జీతం ఇస్తున్నట్లు బాధపడిపోతుంటాం. కడుపునొప్పో, కాలినొప్పో ఉండి ఒక్క రోజు పనికి రాలేకపోయినా, ఏదో ఘోరం జరిగిపోయినట్లు, మోసం చేసినట్లు బాధపడిపోతాం. పని మనుషుల కష్టం వెలకట్టలేనిదని గ్రహిస్తే ఇంత బాధ ఉండదు. ‘కనీసం’ అంటే? పని మనుషులకు కనీసం ఎంత వేతనం ఇవ్వాలి? వాళ్లకు తప్పనిసరిగా కల్పించాల్సిన సదుపాయాలేమిటి? వారి విషయంలో యజమాని ధోరణి ఎలా ఉండాలి అనే విషయమై జాతీయంగా, అంతర్జాతీయంగా అనేక సమాలోచనలు జరిగాయి. చర్చలూ సాగాయి. కొన్ని చట్టాలు వచ్చాయి. తాజాగా ఇప్పుడు... పనిమనుషుల సంక్షేమం కోసం భారత ప్రభుత్వం ఒక జాతీయ విధానానికి రూపకల్పన చేసే పనిలో ఉంది. ఇది కనుక చట్టంగా వచ్చి, అమలయితే మన ఇళ్లలో పని చేసే పని మనుషుల కనీసం వేతనం నెలకు రు. 9000 అవుతుంది. అదనంగా... పింఛను, ఆరోగ్య బీమా వంటి సదుపాయాలు చేకూరుతాయి. ‘‘మా ప్రభుత్వం పనిమనుషులకు వేతన భద్రత, ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత కల్పించే విషయమై కృత నిశ్చయంతో ఉంది. అందుకు అనుగుణంగా డ్రాఫ్ట్ తయారవుతోంది’’ అని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ గతవారం మళ్లీ ఒకసారి ప్రకటించారు. ఈ జాతీయ విధానం చట్టంగా వస్తే పని మనుషులపై జరిగే గృహదౌర్జన్యాలకు, హింసలకు కూడా చెక్ పడుతుంది. మీ పక్కింట్లో పనిమనిషి యజమానుల వేధింపులకు గురైతే తెలుగురాష్ట్రాలలోని డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్కి తెలియజేయవచ్చు. లేదా బాధితులనే ఫోన్ చేసి సాయం కోరమని చెప్పవచ్చు. వారి ఫోన్ నెం. 040-27902881 - సాక్షి ఫ్యామిలీ పని మనుషులు ఎదుక్కొనే సమస్యలు బట్టలు, గిన్నెలు శుభ్రపరచడానికి వాడే రసాయనాల వల్ల కాళ్లు, చేతులు పుండ్లు అవుతుంటాయి.బాత్రూమ్లు శుభ్రపరచడానికి వాడే యాసిడ్, బ్లీచ్.. వంటి గాఢమైన రసాయనాల నుంచి రక్షణకు కాళ్లకు చెప్పులుండవు. చేతులకు గ్లౌస్ ఉండవు. ఈ కారణాల వల్ల చర్మసమస్యలతో బాధపడుతుంటారు. ఆ పొగలు పీల్చి శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు.మిగిలిపోయినవి, పాచిపోయిన పదార్ధాలు తినడం వల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటుంది.పనులకు వెళ్లేవారిలో వితంతువులు, అవివాహితులు ఎక్కువ. వీరిలో లైంగిక వేధింపులకు గురయ్యేవారు అధికంగా ఉంటారు. మానసిక, శారీరక హింసలకు ఆస్కారం ఎక్కువ. డొమెస్టిక్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్) యాక్ట్ 2008 పనిమనుషుల్లో ఆడామగా ఇద్దరూ ఉన్నప్పటికీ ప్రధానంగా మహిళలను ఉద్దేశించే ఈ చట్టం తయారైంది. శ్రమదోపిడి, వేళాపాళా లేని పని, గృహనిర్బంధం, హింస వంటివే కాకుండా... పనిమనుషులను అక్రమంగా తరలించడం, చిన్నపిల్లల్ని పనిమనుషులుగా చేర్చుకోవడం కూడా ఈ చట్టప్రకారం నేరమే. గుర్తింపు: 18 ఏళ్లు పైబడి, 60 ఏళ్ల లోపు వయసున్న వారెవరైనా 90 రోజులకు తక్కువ కాకుండా పని చేస్తూ ఉన్నట్లయితే డొమెస్టిక్ వర్కర్గా గుర్తింపు పొందే అవకాశాన్ని ఈ చట్టంలోని సెక్షన్ 16 కల్పిస్తోంది. పని, విశ్రాంతి, సెలవు: పని చేస్తున్న చోటే ఉంటున్నట్లయితే, ఆ రోజు పని పూర్తయి, మళ్లీ పని మొదలయ్యే మధ్య వ్యవధిలో డొమెస్టిక్ వర్కర్కి కనీసం 10 గంటల విశ్రాంతి ఉండాలి. ఏడాదికి కనీసం 15 రోజుల సెలవు ఉండాలి. (సెక్షన్ 22) ఇతర సదుపాయాలు: 2008 చట్టం ప్రకారం పెన్షన్, వేతనంతో కూడిన మెటర్నిటీ లీవు, వీక్లీ ఆఫ్ ఉంటుంది. భద్రత: మహిళలను గానీ, బాలికలను గానీ డొమెస్టిక్ వర్క్ పేరుతో నమ్మించి, మోసం చేసి, ఏ విధంగానైనా నిర్బధించిన వారికి, లైంగికదోపిడీకి గురిచేస్తున్నవారికి, అందుకు సహాయపడిన వారికి కనీసం 6 నెలల జైలు శిక్ష ఉంటుంది. నేరం తీవ్రతను బట్టి ఆ శిక్షాకాలం ఏడేళ్ల వరకు ఉంటుంది. 50 వేల రూపాయల వరకు జరిమానా కూడా ఉంటుంది. ఎవరికి ఫిర్యాదు చేయాలి? అన్యాయానికి, అక్రమానికి, నిరాదరణకు, శ్రమదోపిడీకి, లైంగిక దౌర్జన్యానికి గురవుతున్న డొమెస్టిక్ వర్కర్ తన సమీపంలో ఉన్న డిస్ట్రిక్ బోర్డుకు ఫిర్యాదు చేయవచ్చు. ఈ బోర్డులు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటై నడుస్తుంటాయి. -
హుస్సేన్సాగర్ ప్రక్షాళన మొదలు పెట్టిన HMDA
-
జరిమానాలతో వీధులను శుభ్రంగా ఉంచగలమా?
- ఆకార్ పటేల్ దేశంలో చెత్తా చెదారాన్ని బహిరంగ స్థలాల్లో పడవేస్తే అక్కడికక్కడే జరిమానా విధించేలా ఒక కొత్త బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు ఈ వారం వార్తలు వచ్చాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఈ కథనం పతాక శీర్షికగా వచ్చింది. అంటే ప్రభుత్వంలో ఉండి దీన్ని లీక్ చేసినవారు, దాన్ని నివేదించిన వారు ఈ చట్టాన్ని ముఖ్యమైనదిగా భావించారన్నమాట. ‘బహిరంగ స్థలాల్లో చెత్త పడవే యటం, ఎలక్ట్రానిక్ వ్యర్థాన్ని డంప్ చేయడం, బహిరంగ స్థలాలను మురికి చేయ టం, నిషేధించిన ప్లాస్టిక్ సంచులను ఉపయోగించడం వంటివాటిని స్వల్ప నేరాల కింద పరిగణించి అక్కడికక్కడే జరిమానా విధించటానికి’ పర్యావరణ మంత్రిత్వ శాఖ సమాయత్తమవుతున్నట్లు ఆ పత్రికా వార్త తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అతి ప్రధాన ప్రాజెక్టుల్లో ఒకటైన ‘స్వచ్ఛ భారత్ అభియాన్కు చట్టపరమైన కోరలను’ ఈ బిల్లు కల్పించనున్నట్లు ఇది స్పష్టం చేస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ గత అక్టోబర్లో ప్రారంభించిన కీలకమైన ప్రాజెక్టు.. ‘స్వచ్ఛదనం ప్రాతిపదికన చెత్త పడేసే వారిపై జరిమానాలు, పరిహారా లను ప్రవేశపెట్టి సింగపూర్ తొలి ప్రధానమంత్రి లీ కాన్ యు ప్రారంభించిన ఆధునీకరణ తరహా ప్రాజెక్టును పోలి ఉన్నదని’ ఆ వార్తా కథనం తెలిపింది. అయితే అలాంటి వాటికి సింగపూర్ మంచి నమూనేయేనా, లీ చేపట్టిన పరి ష్కారం ఇక్కడ వర్తిస్తుందా? ఇక్కడ మనం మొదటగా గుర్తించవలసింది ఏమి టంటే, చైనా ప్రజలు (సింగపూర్లో చైనీయులే ప్రధానంగా ఉన్నారు) దక్షిణా సియా ప్రజల స్థాయిలో తమ వీధులను, ఇరుగు పొరుగు ప్రదేశాలను అంత చెత్తగా ఉంచుకోరు. మనం భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ (శ్రీలంక దీనికి మిన హాయింపు) దేశాల కేసి చూస్తే మనకీవిషయం స్పష్టంగా బోధపడుతుంది. చైనీ యులు ప్రపంచంలో ఎక్కడున్నా సరే.. అంటే తమ మాతృ భూమిలో కానీ, ప్రపం చమంతటా తాము నివసిస్తున్న ప్రాంతాల్లో కానీ (అమెరికాలో వీరు నివసించే ప్రాంతాలను చైనా టౌన్స్ అంటారు) పరిశుభ్రత పట్ల ఒక ప్రాథమిక అవగాహ నను, విజ్ఞతను, క్రమాన్నీ, గౌరవాన్ని కూడా కలిగి ఉంటారు. పైగా, తామున్న పరిసరాలకు అనుగుణంగా వ్యవహరిస్తుంటారు. అదే మన విషయంలో అలా కనిపించదు. చట్టాలు కొంతవరకు మాత్రమే సాయపడగలవని నేను చెప్పగలను. సింగ పూర్ను పరిశుభ్రంగా ఉంచింది లీ మేధోతనమే అనుకున్నట్లయితే హాంకాంగ్ను ఎవరు క్రమంలో పెట్టారు? ఇక్కడ కూడా చైనీయులే అధిక సంఖ్యలో ఉన్నారు. కాగా ఇక్కడ కూడా సింగపూర్ వంటి నియంతృత్వ పాలనే ఉంది. రెండో విషయం ఏమిటంటే, పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న ఈ కొత్త చట్టం వాస్తవంగా కొత్తదేనా? గత కొన్ని నెలలుగా పత్రికల్లో వస్తున్న పతాక శీర్షికలను గమనించినట్లయితే, ’వీధుల్లో చెత్త పారవేసినందుకు ఇప్పుడు ఫైన్ కట్టండి’ అంటూ అమృత్సర్ నుంచి వచ్చిన ఒక వార్త మనకు కనబడుతుంది. ఇలాంటి చర్యలకుగాను స్పాట్ ఫైన్ అనేది సరిపోదని అక్కడి మునిసిపల్ కార్పొరేషన్ నిర్ణయించిందట. చెత్త పడవేసిన చోటే ఫైన్ కట్టే నిబంధన ఇప్పటికే ఉన్నప్పటికీ, చట్టాన్ని ఉల్లంఘించినవారిని కోర్టులో హాజరు పర్చాలని, ఆ బాధను వారు అనుభవించాలని అమృత్సర్ మునిసిపల్ కార్పొరేషన్ నిర్ణయించినట్లు ట్రిబ్యూన్ పత్రిక పేర్కొంది. రైల్వేలలో వ్యక్తులు చెత్త పడేస్తున్నారని, (భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత చెత్తతో, మురికితో కూడి ఉంటాయని) అలాంటివారిపై రూ.5 వేల వరకు అపరాధం విధిస్తారని గత సంవత్సరం ఆ పత్రిక ప్రకటించింది. వీధుల్లో చెత్త పారవేస్తూ కనిపిస్తే చాలు ఆ వ్యక్తిపై అక్కడికక్కడే రూ.500 జరి మానా విధిస్తామంటూ గత సంవత్సరం ఆగస్టులో ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. వీధుల్లో ఉమ్మివేయడం, చెత్త పారవేయడం, మూత్ర విసర్జన వంటి చర్య లకు పాల్పడితే అక్కడికక్కడే రూ.500లు ఫైన్ విధించేలా కొత్త చెత్త వ్యతిరేక చట్టం రూపొందుతోందని 2010 సంవత్సరంలోనే హిందూస్తాన్ టైమ్స్ రాసింది. ఇప్పుడు మరొక చట్టం దానికి అపశవ్య దిశలో రూపొందుతున్నట్లు కనబడు తోంది. నిజానికి ప్రభుత్వం ఏం చేయాల్సి ఉంది? సమస్య అల్లా ఎక్కడుందంటే, ప్రభుత్వం ఒక చట్టం ద్వారా సామాజిక, సాంస్కృతిక మార్పును ప్రభావితం చేయాలనుకుంటోంది. అలా చేయవచ్చా? దీనికి సమాధానం అవుననే చెప్పాలి. ఎందుకంటే శిశు హత్యలు, వరకట్న హత్యలు కూడా సాంస్కృతిక నేరాలే. వీటి విషయంలో కూడా కఠిన చట్టాలను తీసుకురావాలి. ఎందుకంటే అవి కూడా హత్యలతో సమానమే. వాటితో ఆ మార్గంలోనే వ్యవహరించాలి. స్వచ్ఛ భారత్ అభియాన్ పేరిట జరుగుతున్న గందరగోళం ఇదే. ఇంతకూ ఈ పథకం దేనికి ఉద్దేశించిందన్నది కొన్ని సంకేతాలు పంపుతోంది. ప్రధాన మంత్రి తన చీపురు ద్వారా వ్యక్తిగత ఉదాహరణను నెలకొల్పారు. పలు ప్రదేశా లలో చీపురుతో చెత్తను శుభ్రం చేస్తూ కనిపించారు. ఇదంతా ఒక వారం లేకుంటే మరికొన్ని రోజులు మాత్రమే నడిచిందని పలు వార్తా కథనాలు సూచిస్తున్నాయి. ఒక రోజు మాత్రమే చీపురు పట్టుకుని వీధుల్లోకి వచ్చినందుకు ప్రముఖ వ్యక్తు లను అభినందించటానికి మాత్రమే ఆయన ట్వీట్లు పరిమితమయ్యాయి. మరోై వైపున ప్రభుత్వ ప్రకటనలు స్వచ్ఛభారత్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో మరుగు దొడ్లు నిర్మించడమని చెప్పాయి. అక్కడ లక్ష్యాలన్నీ గణాంకాల రూపంలోనే కనిపిస్తున్నాయి. స్వచ్ఛభారత్ అభియాన్తో గాంధేయ పని విధానాన్ని అలవర్చడానికి మోదీ ప్రయత్నిస్తున్నట్లు నేను భావిస్తున్నాను. మన సామాజిక, సాంస్కృతిక సమస్య లను పరిష్కరించడంలో ఆ మార్గం అత్యాశతో కూడుకున్నదే అయినప్పటికీ ఆ ఆలోచన ఉన్నతమైనదే. తన మరుగుదొడ్డిని తానే శుభ్రపర్చుకోవడం, తన బట్టలను తానే వడకటం వంటి చర్యల ద్వారా గాంధీ ఒక నిరుపమాన వ్యక్తిగత ఉదాహరణగా నిలిచారు. మోదీ ప్రభుత్వం ద్వారా ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఏదేమైనా గాంధీ ఈ విషయంలో విఫలమయ్యారు. తన తరపున చేయడానికి మరొకరు సిద్ధంగా ఉన్నంతవరకు ఏ భారతీయుడు కూడా తన మరుగుదొడ్డిని తానే శుభ్రపర్చుకోవడం అనేది కల్లే. ఇక పోతే ఖాదీ మన జ్ఞాపకాల్లోంచే కనుమరుగైపోయింది. మరి మోదీ విజయం సాధిస్తారా? సాధించలేరు. ఎందుకంటే సాంస్కృతిక మార్పు అనేది కేవలం చట్టం రూపంలో జరగదు. పైగా ఒకే ఒక రాత్రిలో అది సాధ్యం కాదు కూడా. ఆ మార్పు అంతర్గతంగానే రావాలి. గాంధీ దాన్ని అర్థం చేసుకున్నారు. మోదీ పట్ల భారతీయులకు చాలా సానుకూల ముద్ర ఉంది. ఆయన వ్యక్తిగత ఉదాహరణ ప్రత్యేకమైనది. ఈ విషయంపై తాను నిజంగానే తీవ్రంగా ఆలోచిస్తున్నట్లయితే ఇక్కడే ఆయన కేంద్రీకరించాలి. గాంధీ జీవిత కాలంలో దీన్ని సాధించలేకపోయినట్లే, మోదీ జీవితకాలంలో ఈ మార్పు రాక పోవచ్చు. అయితే ఏదో ఒక కొత్త చట్టం కంటే ఆయన ప్రయత్నమే మరింత సమ ర్థవంతంగా ప్రభావం చూపగలదు. (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) aakar.patel@icloud.com) -
దులపరా... డింగరీ...
మగవాళ్లు ఇంటిపని ఎందుకు చెయ్యరు? పోనీ, ఎందుకు చెయ్యలేదు? వాళ్లు చెప్పే మొదటి కారణం జాబ్. బయటికెళ్లి జాబ్ చేసి వచ్చి మళ్లీ ఇంట్లో పని చెయ్యడం కష్టం కదా అంటారు. ‘‘ఏం? ఆడవాళ్లు జాబ్ చేస్తూ కూడా ఇంటిని చక్కబెట్టుకోవడం లేదా?’’ అంటే నిజమే కానీ ఇంటి పనులు చెయ్యడం తమకు చేతకాదని రెండో కారణంగా చెబుతారు. ఎందుకు చేతకాదూ అంటే, ‘‘అలవాటు లేక’’ అనేది అందరికీ సమాధానం. రోజంతా ఇంట్లో కష్టపడుతున్న గృహిణికి చేయూత అందించడం కోసం మగవాళ్లు ఇంటి పనులు అలవాటు చేసుకుంటే తప్పేముంది? కనీసం చిన్న చిన్న పనులైనా మగవాళ్లు చేస్తుంటే ఇంట్లో ఆడవాళ్లకు ఎంతో సమయం మిగులుతుంది. పెద్ద సహాయం ఏదో చేసినట్లుగానూ ఉంటుంది. సో, ఇవాళ్టి నుంచే దుమ్మును అన్వేషించి, దులిపే ప్రయత్నం చెయ్యండి. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు. అలాగే ఇంట్లోని కొన్ని ప్రదేశాల్లో పేరుకుపోయే దుమ్మును ఇరవై నాలుగు చేతులున్న గృహిణి కూడా కనిపెట్టలేదు. అదేదో మీరు కనిపెట్టి క్లీన్ చెయ్యండి. కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి మీరో దుమ్ము స్పెషలిస్ట్ అవండి. దుమ్ము, జిడ్డు పేరుకుపోయే రహస్య ప్రదేశాలు కిచెన్లోని అరల మూలలు, పై అంచులు. స్విచ్లు, స్విచ్బోర్డులు గీజర్ కాయిల్ పైభాగం. పెయింటింగుల వెనుకభాగం. మంచాలు, సోఫాల కింది భాగం. ఐదు పనులే కదా చేసేయ్ బాస్. -
ఆపరేషన్ హుస్సేన్సాగర్
హైదరాబాద్ ల్యాండ్ మార్క్ హుస్సేన్సాగర్... జంటనగరాలను కలిపే వారధి సాగరే... భాగ్యనగరం పేరు వినగానే చార్మినార్తో పాటు గుర్తొచ్చే మరోపేరు హుస్సేన్సాగర్.. ఒకవైపు ట్యాంక్బండ్పై తెలుగువెలుగుల మూర్తులు.. మరోవైపు సాగర్ నడుమ తథాగతుడు.. ఎంత అద్భుత దృశ్యకావ్యమిది. ఇంతటి ప్రశస్తి కలిగిన ఈ సాగర్ తన గర్భంలో ఎన్నెన్నో విషవాయువుల్ని ఇముడ్చుకోవడం మరో విషాదం. ఏళ్ల పూర్వం మంచినీటి సరస్సుగా అలరారిన సాగర్.. ఇప్పుడు మురికికూపంగా మారిపోయింది. ములు మూసుకుపోయినా పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు. నిజాం హయాం నాటి నిర్వహణ నేడు లేదనేందుకు ఇదో నిదర్శనంగా మిగిలింది. గతం గతః అంటూ ఎట్టకేలకు సాగర్కు పునరుజ్జీవం తేవాలని సర్కారు సంకల్పించింది. విషతుల్యమైన ప్రస్తుత జలాల్ని ప్రక్షాళన చేసి.. స్వచ్ఛమైన నీటితో సాగర్కు కొత్తకళను తేవాలని భావించింది. ఇందులో భాగంగా అనధికారికంగా సాగర్ ప్రక్షాళన పనులు ప్రారంభమయ్యాయి. అధికారికంగా వెల్లడించకపోయినా ప్రక్షాళన పనులు వేగంగా సాగిపోతున్నాయి. -
క్లీన్స్వీప్పై భారత్ గురి
రాంచీ: ఓవైపు అద్వితీయ ప్రదర్శనతో చెలరేగిపోతున్న భారత్ జట్టు...మరోవైపు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోతున్న శ్రీలంక టీమ్... సిరీస్లో ఆఖరిదైన ఐదో వన్డే కోసం సిద్ధమయ్యాయి. ఆదివారం జేఎస్సీఏ అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను క్లీన్స్వీప్ చేయాలనేది భారత లక్ష్యం. కనీసం ఈ మ్యాచ్లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలనేది లంక ఆరాటం. ఐదు వన్డేల సిరీస్లో శ్రీలంక ఎప్పుడూ 0-5తో ఓడిపోలేదు. ఐదో వన్డేలోనూ ఓడితే మ్యాథ్యూస్ సేన ఈ చెత్త రికార్డును మూటగట్టుకోవాల్సి వస్తుంది. వరుస విజయాలతో ఆత్మ విశ్వాసంతో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్లో రైనాకు విశ్రాంతినిచ్చింది. దీంతో మహారాష్ట్ర బ్యాట్స్మన్ కేదార్ జాదవ్కు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలున్నాయి. కోచ్ ఫ్లెచర్ పర్యవేక్షణలో జాదవ్ శనివారం ఎక్కువసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. బ్యాట్స్మెన్ అంతా ఫామ్లో ఉండటం భారత్కు కలిసొచ్చే అంశం. బౌలింగ్ విషయానికొస్తే ఉమేశ్ నెట్స్లో పాల్గొనకుండా వెన్ను కండరాలను పటిష్టం చేసుకునే పనిలో పడ్డాడు. దీంతో వినయ్ కుమార్కు ఈ మ్యాచ్లో ఆడే అవకాశం రావొచ్చు. బిన్నీ, కులకర్ణీ, అక్షర్ పటేల్లు తమ పాత్రను సమర్థంగా పోషిస్తుండటం భారత్కు అనుకూలాంశం. మరోవైపు లంక జట్టు బ్యాటింగ్లో ఫర్వాలేదనిపిస్తున్నా బౌలింగ్ సమస్యలతో ఇబ్బందులు పడుతోంది. మలింగ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. నాలుగో వన్డేలో ఆడిన మిస్టరీ స్పిన్నర్ అజంతా మెండిస్ పెద్దగా ప్రభావం చూపకపోవడం, మిగతా బౌలర్లు ఆశించిన మేరకు రాణించకపోవడం ఆందోళన కలిగించే అంశం. దీంతో పాటు ఫీల్డింగ్లోనూ లంకేయులు తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. తగ్గిన సందడి లోకల్ హీరో ధోని లేకపోవడంతో ఈ మ్యాచ్పై రాంచీ అభిమానులు కూడా పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. టిక్కెట్ల అమ్మకం ఆశించిన స్థాయిలో లేదని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. 20 వేల మంది మాత్రమే హాజరయ్యే అవకాశాలున్నాయి. జార్ఖండ్లో ఈనెల 25 నుంచి ఎన్నికలు జరుగుతుండటం కూడా ఓ కారణమని అసోసియేషన్ అధికారి తెలిపారు. మరోవైపు ఈ మ్యాచ్కు హాజరుకానున్న ధోని... జట్టు సహచరులకు తన బంగ్లా హర్మూలో విందు ఇవ్వనున్నట్లు సమాచారం. జట్లు (అంచనా): భారత్: కోహ్లి (కెప్టెన్), రహానే, రోహిత్, రాయుడు, జాదవ్, ఉతప్ప, బిన్నీ, అక్షర్ పటేల్, కరణ్ శర్మ, ఉమేశ్ / వినయ్, కులకర్ణి. శ్రీలంక: మ్యాథ్యూస్ (కెప్టెన్), కె.పెరీరా, దిల్షాన్, చండిమల్, జయవర్ధనే, తిరిమన్నే, టి.పెరీరా, ప్రసన్న, కులశేఖర, మెండిస్, ఎరంగా, పిచ్, వాతావారణం వికెట్పై కాస్త బౌన్స్ ఉంటుంది. మొదట పేసర్లకు తర్వాత స్పిన్నర్లకు అనుకూలం. మంచు ప్రభావం ఉంది. వర్షం పడే అవకాశాల్లేవు. మధ్యాహ్నం గం. 1.30 నుంచి స్టార్స్పోర్ట్స్-1, డీడీలో ప్రత్యక్ష ప్రసారం -
శ్రీనివాసన్కు క్లీన్చిట్!
గురునాథ్ బెట్టింగ్తో ఆయనకి సంబంధం లేదు తేల్చిన జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ! ముంబై: ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వివాదంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ ఎన్.శ్రీనివాసన్కు జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ నివేదిక క్లీన్చిట్ ఇచ్చినట్టు సమాచారం. తమ తుది నివేదికను కమిటీ సోమవారం సుప్రీం కోర్టుకు అందజేసిన విషయం తెలిసిందే. తన అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ బెట్టింగ్ కార్యకలాపాల్లో శ్రీనివాసన్కు గల సంబంధాలపై ఎలాంటి సాక్ష్యాలు లభించలేవని కమిటీ తెలిపిందని ఓ జాతీయ న్యూస్ చానెల్ కథనం ప్రసారం చేసింది. ఈనెల 10న ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు విచారణ ప్రారంభించనుంది. మరోవైపు ఐపీఎల్ మ్యాచ్ల బెట్టింగ్పై గురునాథ్ దోషిగానే ఉన్నా స్పాట్ ఫిక్సింగ్లో మాత్రం అతడికి వ్యతిరేకంగా కమిటీ సాక్ష్యాలను సేకరించలేకపోయింది. ఒకవేళ సాక్ష్యాలు లభించి ఉంటే... గురునాథ్తో పాటు చెన్నై సూపర్కింగ్స్ జట్టు కూడా న్యాయపరంగా చిక్కుల్లో పడేది. గతంలో కమిటీ విచారణ పూర్తయ్యేదాకా శ్రీనివాసన్ను బీసీసీఐ అధ్యక్ష పదవికి దూరంగా ఉండాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇప్పుడు ఈ నివేదిక ఆయనకు గొప్ప ఊరటనిచ్చినట్టుగా భావించాల్సి ఉంటుంది. బుకీతో భారత ఆటగాడికి సంబంధం 2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో ఓ ప్రముఖ ఆటగాడికి బుకీలతో పాటు మ్యాచ్ ఫిక్సర్లతో సంబంధాలున్నట్టు జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ తేల్చినట్టు సమాచారం. అయితే ఐపీఎల్లో వివాదాస్పద రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్లో అతడు సభ్యుడు కాదని, అలాగే తను ప్రస్తుత భారత జట్టులో ఆడడం లేదని కమిటీ తన నివేదికలో తెలిపింది. 2011 ప్రపంచకప్ కూడా ఫిక్స్ అయ్యిందని గతంలో ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన సెమీస్ మ్యాచ్ ఫలితాన్ని చాలా మంది ప్రశ్నిస్తుంటారు. ఒకవేళ ముద్గల్ కమిటీ ఆ ఆటగాడి భాగస్వామ్యంపై సాక్ష్యాలు వెలికితీస్తే మరిన్ని వివరాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఇదిలావుండగా విచారణలో భాగంగా చాలామంది ప్రస్తుత భారత ఆటగాళ్లు కమిటీ ముందు హాజరయ్యారు. వీరిలో ఐపీఎల్లో చెన్నైకి ఆడే ఆటగాళ్లను గురునాథ్ పాత్ర గురించి ప్రశ్నించారు. బెట్టింగ్ వివాదంలో గురునాథ్ వాయిస్ శాంపిల్స్ కూడా సరిపోయినట్టు ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చింది. -
విండీస్తో సిరీస్ క్లీన్స్వీప్ చేస్తే...
భారత్కే టాప్ ర్యాంక్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ దుబాయ్: వెస్టిండీస్తో జరగబోయే ఐదు మ్యాచ్ల సిరీస్ను క్లీన్స్వీప్ చేస్తే... ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో భారత్ పూర్తి స్థాయిలో నంబర్వన్ ర్యాంక్కు చేరుకుంటుంది. ప్రస్తుతం 113 రేటింగ్ పాయింట్లతో దక్షిణాఫ్రికాతో కలిసి టీమిండియా సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే విండీస్తో సిరీస్ను 5-0తో గెలిస్తే భారత్ ఖాతాలో 116 రేటింగ్ పాయింట్లు వచ్చి చేరుతాయి. దీంతో టాప్ ర్యాంక్ భారత్ సొంతమవుతుంది. ఒకవేళ భారత్ 4-1తో సిరీస్ సాధించినా... యూఏఈలో పాక్తో జరిగే సిరీస్ను 3-0తో ఆస్ట్రేలియా స్వీప్ చేసినా... ఈ రెండు జట్లు 114 పాయింట్లతో టాప్ ర్యాంక్ను పంచుకోవాల్సి ఉంటుంది. అయితే దశాంశమానం తేడాలో ధోనిసేన నంబర్వన్లో ఉంటుంది. మరోవైపు విండీస్తో సిరీస్లో భారత యువ బ్యాట్స్మన్ కోహ్లి బ్యాట్ ఝుళిపిస్తే... మరోసారి నంబర్వన్ ర్యాంక్కు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభంలో టాప్ ర్యాంక్లో ఉన్న ఈ ఢిల్లీ బ్యాట్స్మన్.... బంగ్లాదేశ్తో సిరీస్కు దూరం కావడంతో మూడో ర్యాంక్కు పడిపోయాడు. ప్రస్తుతం డివిలియర్స్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కెప్టెన్ ధోని 6వ, శిఖర్ ధావన్ 7వ ర్యాంక్ల్లో ఉన్నారు. బౌలింగ్లో రవీంద్ర జడేజా 5వ ర్యాంక్లో, ఆల్రౌండర్ ర్యాంకింగ్స్లో 3వ స్థానంలో ఉన్నాడు. -
రోడ్డు ఊడ్చి చెత్త ఎత్తిన నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. గాంధీజీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని వచ్చే ఐదేళ్లలో సాధించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో మోడీ స్వయంగా చీపురు పట్టారు. ఢిల్లీలోని వాల్మీకి బస్తీలో ఆయన పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్డు ఊడ్చి చెత్త ఎత్తారు. మోడీతో పాటు పలువురు మంత్రులు, బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో సుమారు అయిదు వేలమంది విద్యార్థులు పాల్గొన్నారు. అంతకు ముందు మోడీ వాల్మీకి మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు స్వచ్ఛభారత్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గత కొన్ని రోజులుగా కేంద్ర మంత్రులంతా చీపుర్లు పట్టిన విషయం తెలిసిందే. -
ఇక స్వచ్ఛమైన సాగర్!
కలుషిత జలాలు, రసాయనాలతో కాలుష్యకాసారంగా మారిపోయిన హుస్సేన్ సాగర్కు మంచి రోజులు రానున్నాయి. సాగర్ జలాలను శుద్ధి చేసి నగరవాసులకు ఆహ్లాదాన్ని అందించే దిశగా మహానగరాభివృద్ధి సంస్థ ప్రయత్నాలు ప్రారంభించింది. జలాశయాన్ని పరిశుభ్రం చేసేందుకు జర్మనీ, అమెరికా దేశాల్లోని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గల యంత్రాలను వినియోగించనుంది. ఒకపక్క సాగర్ ప్రక్షాళన.. మరోవైపు తాజాగా ఆధునిక యంత్రాల వినియోగంతో సాగర్ కొత్తందాలు సంతరించుకోనుంది. విషరసాయన వర్థాలతో హుస్సేన్ సాగర్ జలాలు కలుషితమయ్యాయి. ఈ క్రమంలో సాగర్లోకి వచ్చే ఫ్లోటింగ్ మెటీరియల్ను, గట్ల వెంట పెరిగిన గుర్రపు డెక్కను తొలగించేందుకు, ఇతర వ్యర్థాలను వెలికి తీసేందుకు హెచ్ఎండీఏ చర్యలు చేపట్టనుంది. ఇందుకు ఆధునిక యంత్రాలను వినియోగించాలని నిర్ణయించింది. కలుషితమైన జలాలను మనుషులతో కాకుండా యంత్రాల ద్వారానే శుభ్రం చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తోంది. జమ్మూ-కాశ్మీర్లోని ‘దాల్ లేక్’ క్లీనింగ్కు వినియోగిస్తున్న ఆధునిక యంత్రాలను ఇక్కడ వినియోగించేందుకు అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం యాక్వటిక్ వీడ్ హార్వెస్టర్ కం ట్రాష్ కలెక్టర్, యాంఫీబియస్ ఎస్కవేటర్ తదితర యంత్రాలను కొనుగోలు చేసేందుకు రూ.11.5కోట్ల వ్యయ అంచనాలతో తాజాగా టెండర్లు ఆహ్వానించారు. జర్మనీ, అమెరికా సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ ఆధునిక యంత్రాలను సరఫరా చేయడంతో పాటు వచ్చే 5 ఏళ్లపాటు వారే వాటిని నిర్వహించే విధంగా టెండర్లో నిబంధన విధించారు. హుస్సేన్సాగర్ శుద్ధికి అనువుగా ఆ యంత్రాలను రూపొందించి 6నెలల వ్యవధిలోగా వాటిని తమకు అప్పగించాలని నిర్దేశించారు. రూ.370కోట్ల వ్యయంతో చేపట్టిన సాగర్ ప్రక్షాళన ప్రాజెక్టులో భాగంగా ఈ యంత్రాలను కొనుగోలు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆ ప్రాజెక్టుకు రుణ దాత అయినా ‘జైకా’ కూడా ఇందుకు పచ్చజెండా ఊపడంతో హెచ్ఎండీఏ అధికారులు పనులు వేగవంతం చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. సాగర్ ప్రక్షాళన పనులు ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తున్నందున ఆధునిక యంత్రాల సాయంతో జలాశయాన్ని మరింత శుభ్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలకు ఉపక్రమించారు. జలాల శుద్ధి ఇలా ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వస్తే హుస్సేన్సాగర్ క్లీనింగ్ పనులు మరింత సులువు కావడంతో పాటు ఖర్చు కూడా త గ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాకాలం వస్తే చాలు నాలా ముఖద్వారాల వద్ద గుర్రపుడెక్క, ఇతర జలాధారిత మొక్కలు విస్తృతంగా పెరిగి మురుగునీటి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తున్నాయి. అదే సమయంలో ఆయా ప్రాంతాల్లో విపరీతమైన దుర్వాసన కూడా వెదజల్లుతోంది. ప్రధానంగా పికెట్నాలా, కూకట్పల్లి నాలా, బంజారా, బల్కాపూర్ నాలాలు సాగర్లో కలిసే చోట దట్టంగా పెరిగిన గుర్రపుడెక్కను, మేట వేసిన వ్యర్థాలను తొలిగించేందుకు ఈ ఆధునిక యంత్రాలు ఎంతో ఉపకరిస్తాయని అధికారులు చెబుతున్నారు. యాంఫీబియస్ ఎస్కలేటర్ సాయంతో నాలాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని వెలికితీసి నేరుగా లారీల్లో నింపడం ద్వారా బయటకు తరలించ వచ్చంటున్నారు. ఇప్పటివరకూ వినాయక విగ్రహాలను గట్టుకు చేర్చి నాలుగైదు రోజులు ఎండినతర్వాత ఇతర ప్రాంతాలకు తరలించేవారు. ఇప్పుడు ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వస్తుండడంతో ఏరోజు వ్యర్థాలను ఆరోజే బయటకు తరలిస్తామని అధికారులు చెబుతున్నారు. తగిన రీతిలో మార్పులు... సాగర్ క్లీనింగ్కు కొనుగోలు చేస్తున్న యంత్రాలు 6 నెలల్లో వినియోగంలోకి వ చ్చే అవకాశం ఉంది. వినాయక చవితి నాటికే వాటిని తెప్పించాలని భావించినా... సాగర్ జలాల్లో పనులు నిర్వహించేందుకు అనువుగా ఆ యంత్రాల్లో కొన్ని మార్పులు తప్పనిసరైంది. ఈమేరకు టెండర్లో పక్కాగా సూచనలు చేశాం. యంత్రాల్లో కొన్ని మార్పులు చేసేందుకు కనీసం 5నెలలు పట్టే అవకాశం ఉంది. ఈసారికి ‘పాంటూన్ మౌంటెడ్ ఎస్కలేటర్’ను తెప్పించి గణేష్ విగ్రహాలను సాగర్ నుంచి వెలికి తీయాలని నిర్ణయించాం. కొత్తగా కొనుగోలు చేస్తున్న ‘యాక్వటిక్ వీడ్ హార్వెస్టర్ కం ట్రాష్ కలెక్టర్, యాంఫీబియస్ ఎస్కవేటర్’లను సాగర్లోనే కాకుండా మిగతా జలాశయాల క్లీనింగ్కు కూడా వినియోగించుకొనే వెసులుబాటు ఉంటుంది. వీటి వినియోగం వల్ల సాగర్ మరింత పరిశుభ్రం కానుంది. - బి.ఎల్.ఎన్.రెడ్డి, ఎస్ఈ -
చెరిపేయండి... శాశ్వతంగా!
పీసీలోంచి ఫైళ్లు తొలగించాలంటే మీరు ఏం చేస్తారు? ఆ... ఏముంది.. ట్రాష్లో పడేస్తేసరి అంటున్నారా? బాగానే ఉంటుంది కానీ దీనిద్వారా ఫైల్ పూర్తిగా తొలగిపోదు!! హార్డ్డ్రై వ్లో ఎక్కడో ఓ మూలన అలాగే పడి ఉంటుంది. కాలం గడిచేకొద్దీ ఇలాంటి చెత్త అంతా పేరుకుపోయి... పీసీ నత్తనడకన నడవడం మొదలవుతుంది. ఈ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఎంచక్కా ఈ పద్ధతులు పాటించండి! ట్రాష్లో పడేసి, క్లీన్ చేసిన ప్రతిసారి హమ్మయ్యా.. కొంత చెత్త వదిలించుకున్నామని మనం అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి మన పని సగమే అయినట్లు లెక్క. ఎందుకంటే ట్రాష్ను క్లీన్ చేసినప్పుడు ఫైల్ తాలూకూ వర్చువల్ పాథ్ మాత్రమే డిలీట్ అవుతుంది. ఫైల్ అలాగే స్టోర్ అవుతుంది. కొంచెం కష్టమైనప్పటికీ వీటిని మళ్లీ రికవర్ చేసే అవకాశం ఉంటుంది. మామూలు ఫైళ్ల విషయంలో ఫర్వాలేదేమోగానీ.... సున్నితమైన వివరాలున్న ఫైళ్ల విషయంలో మాత్రం మరింత జాగ్రత్త అవసరం. ఈ సమస్యను అధిగమించేందుకు అదే ఫైల్పై మళ్లీ సమాచారాన్ని స్టోర్ చేయడం ఒక్కటే మార్గం. కానీ ఇది చేతులతో చేసే పని కాదు. మార్కెట్లో ఉచితంగా లభించే సాఫ్ట్వేర్లను ఉపయోగించాల్సి ఉంటుంది. అలాంటివి ఏమేమి ఉన్నాయో, అవెలా పనిచేస్తాయో చూడండి... ఇరేజర్... ఈ సాఫ్ట్వేర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేసే కంప్యూటర్ల కోసం మాత్రమే. ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తరువాత డిలీట్ చేయాల్సిన ఫైల్పై రైట్ క్లిక్ చేస్తే చాలు... కనిపించే ఆప్షన్లలో ఇరేజర్ ఐకాన్ను ఎంచుకోవడం ద్వారా ఫైల్ను శాశ్వతంగా చెరిపేయవచ్చు. ఒక్కో ఫైల్ను ఎన్నిసార్లు ఓవర్రైట్ చేయవచ్చో మీరే నిర్ణయించుకోవచ్చు. అంతేకాకుండా ట్రాష్లో పడేసే ప్రతిఫైల్ను ఇలా ఓవర్రైట్ చేసి డిలీట్ చేసేలా ఇరేజర్ను ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. సీసీ క్లీనర్... దీని గురించి మీరు వినే ఉంటారు. హార్డ్డిస్క్లో స్పేస్ను ఆదా చేసేందుకు తరచూ వాడే సాఫ్ట్వేర్ ఇది. సాధారణ పద్ధతుల్లో ఫైళ్లను డిలీట్ చేసిన తరువాత వాటిని గుర్తులను చెరిపేసేందుకు చక్కగా ఉపయోగపడుతుంది ఈ సాఫ్ట్వేర్. పీసీలో నిర్దిష్టంగా ఫలానా ప్రాంతాల్లోని అనవసరమైన ఫైళ్లను ఓవర్రైట్ చేయమని సూచించే అవకాశం ఉంటుంది సీసీక్లీనర్ సాఫ్ట్వేర్తో. దీంట్లోనూ ఎన్నిసార్లు ఓవర్రైట్ చేయాలన్నది మనమే నిర్ణయించుకోవచ్చు. సోర్స్ ఎమ్టీ ట్రాష్.. ఈ సాఫ్ట్వేర్ ఆపిల్ కంప్యూటర్ల కోసం ఉద్దేశించింది. కొనుక్కున్నప్పుడే ట్రాష్ బిన్కు అనుసంధానంగా ఏర్పాటై వస్తుంది. కాకపోతే ఫైల్స్ ట్రాష్లో పడేసిన తరువాత ఫైండర్ ఆప్షన్లోకి వెళ్లి సెక్యూర్ ఎమ్టీ ట్రాష్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. హార్డ్డ్రైవ్ మొత్తాన్ని ఓవర్రైట్ చేయాలనుకుంటే డిస్క్ యుటిలిటీ ఆప్లోకి వెళ్లి ఇరేజ్ అప్షన్ను క్లిక్ చేయాలి. ఆ తరువాత ‘సెక్యూరిటీ ఆప్షన్’ను సెలెక్ట్ చేసుకుని క్లిక్ చేస్తే సరి. విండోస్, ఆపిల్ పీసీలు రెండింటిలోనూ ట్రాష్బిన్ను పూర్తిగా పక్కనబెట్టి ఫైళ్లను డిలీట్ చేయాలంటే ఫైల్ ష్రెడ్డర్ సాఫ్ట్వేర్ను కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ద్వారా ఎప్పటికప్పుడు ఫైళ్లను ఓవర్రైట్ చేసి శాశ్వతంగా డిలీట్ చేయవచ్చు. ఒక ఫైల్ను ఎన్నిసార్లు ఓవర్రైట్ చేయాలన్నది సాఫ్ట్వేరే నిర్ణయించుకుంటుంది. -
పరిశుభ్ర గంగావతరణమెప్పుడో!
ఇప్పుడు మోడీ ఈ అంశాన్ని చేపడతానని ఘంటాపథంగా చెబుతున్నారు. ఆయన ఎంత తొందరగా చర్యలు చేపడితే భారత పర్యావర ణానికి అంత మంచిది. గంగా క్షాళనం కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది. ‘గంగామాత పిలుపుతోనే ఇక్కడికి వచ్చాను’ అని ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో ఉద్విగ్నంగా చెప్పుకు న్నారు. వారణాసి ఓటర్లు ఆయనను ఘన విజయంతో అభిషేకించారు కూడా. గంగ క్షాళనకు కంకణం కట్టుకున్నట్టు ప్రధాని పార్లమెంటులో ప్రకటించారు. 26 సంవత్సరాలుగా గంగ క్షాళనకు కృషి జరుగుతోంది. ఇంతవరకు వేల కోట్లు ఖర్చు చేశారు. ప్రపంచ బ్యాంకు నిధులు, జలశుద్ధి సాంకేతిక పరిజ్ఞానంలో ఎంతో ఖ్యాతి పొందిన ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి కూడా అంగీకరించింది. అయినా పవిత్ర గంగావతరణం జరగడంలేదు. పదకొండు రాష్ట్రాల గుండా పారే గంగ, దేశంలో 40 శాతం ప్రజలకు (500 మిలియన్లు) జీవనాధారం. గంగా పరీవాహక ప్రాంతమే నాలుగు లక్షల చదరపు మైళ్లు. లక్ష, ఆపై జనాభా ఉన్న 29 పట్టణాలు, యాభయ్వేలు-లక్ష మధ్య జనాభా కలిగిన 23 పట్టణాలు, ఇంకో 48 చిన్న చిన్న పట్టణాలను తాకుతూ 2,525 కిలోమీటర్ల మేర ప్రవహి స్తోంది. దీనితో పెద్ద మురికికూపంగా అవతరించడానికి కావలసిన అన్ని ప్రమాదాలు సంక్రమించాయి. రోజుకు 8 ల క్షల గ్యాలన్ల మలినాలు చేరుతున్నాయని నిపుణులు చెబుతు న్నారు. గృహావసరాలు, పరిశ్రమల వ్యర్థాలు, స్మశానాల మలినాల వల్ల గంగ కలుషితమవుతున్నదని జల కాలుష్య అధ్యయనాల నిపుణుడు, ఆచార్య బీడీ త్రిపాఠి(బీహెచ్యు) చెప్పారు. ప్రస్తుతం చేరుతున్న మలినాలు 20 ఏళ్ల క్రితం కంటే రెట్టింపు ఉన్నాయి. వచ్చే ఇరవై ఏళ్లలో ఇంకో రెట్టింపు కావచ్చునని అంచనా. పశు కళేబరాలు, అవాంఛనీయ శిశు వుల మృతదేహాలు, చాకిరేవులు నదికి పెద్ద బెడద. నిజానికి రసాయనాలతో చేసిన పదార్థాలే, పశు- మానవ కళేబరాల కంటే ప్రమాదకరమని సెంట్రల్ గంగా అథారిటీ తొలి సంచా లకుడు కేసీ శివరామకృష్ణన్ హెచ్చరించారు. కళేబరాలను నదిలో పెరిగే ఒక జాతి తాబేళ్లు తినగలవు. రసాయనాల నుంచి నదిని కాపాడే శక్తి ఏదీ లేదు. గంగ ప్రయోజనం మత విశ్వాసాలకు పరిమితం కాదు. భవిష్యత్తులో గంగ, దాని ఉపనదుల మీద 300 డ్యామ్లు నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. గంగ పరిరక్షణో ద్యమం పేరుతో అటు ఆధ్యాత్మికవాదులు, పర్యావరణవే త్తలు పాతిక ముప్పయ్ సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నారు. అందరి కృషి ఆహ్వానించదగినదే. కేంద్ర ప్రభుత్వ పరంగా 1986, ఏప్రిల్లో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉండగా గంగా కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించారు. 190 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినా నది కాలుష్యం స్థాయిని తగ్గించలేకపో యారు. దీనితో మార్చి 31, 2000 సంవత్సరంలో ఈ కార్య క్రమాన్ని రద్దు చేశారు. ఈ పథకం శుద్ధ దండగ అని శాస్త్రవే త్తలు, ప్రభుత్వేతర సంస్థలు ప్రకటించాయి. సుందర్లాల్ బహుగుణ, సుశీలానాయర్, కాంచనలతా సబర్వాల్ వంటి వారు ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఉత్తరాఖండ్ లోని హరిద్వార్లో గంగ ఒడ్డున జరుగుతున్న అక్రమ గనుల తవ్వకానికి వ్యతిరేకంగా స్వామి నిగమానంద సరస్వతి అనే సాధువు ఆమరణ దీక్ష చేసి, చనిపోయారు. దీనితో హరిద్వార్ జిల్లాలో అక్రమ గనుల తవ్వకాన్ని నిషేధించారు. ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ జీడీ అగర్వాల్ గంగ ప్రక్షాళన కోరుతూ దీర్ఘకాలం నిరాహార దీక్ష చేశారు. అన్నా హజారే చెప్పడంతో నాటి ప్రధాని మన్మోహన్సింగ్ డాక్టర్ అగర్వాల్ డిమాండ్లను నెరవేర్చడానికి అంగీకరించారు. 2012లో గంగా ముక్తి సంగ్రామ్ సమితి ఆధ్వర్యంలో పెద్ద ర్యాలీ జరిగింది. అలహాబాద్ నుంచి ఢిల్లీ వరకు సాగిన ఈ ర్యాలీలో ప్రముఖ మఠాధిపతులు, సాధుసంతులు పాల్గొ న్నారు. గంగ రక్షణకు దేశం ఇంత తాపత్రయ పడుతోంది. గంగా క్షాళనం అంటే దేశం ఎదురు చూస్తున్న సత్కార్యం. ఇప్పుడు మోడీ ఈ అంశాన్ని చేపడతానని ఘంటాప థంగా చెబుతున్నారు. ఆయన ఎంత తొందరగా చర్యలు చేపడితే భారత పర్యావరణానికి అంత మంచిది. గంగలో కొద్దికాలం క్రితం వరకు 100 మిల్లీలీటర్ల నీటికి గాను 5,000 పరిమాణంలో ఉన్న కోలిఫోరమ్ బాక్టీరియా, ఇటీవలి లెక్క ల ప్రకారం 60,000కు చేరింది. ఈ బాక్టీరియా ప్రతి 100 మిల్లీలీటర్లకు ఉండవలసినది (ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క) 500 మాత్రమే. అంటే 120 రెట్లు అధికం. ఈ స్థితిలో అయి నా ప్రధాని తన ధృఢ నిశ్చయాన్ని ప్రకటించడం సంతోషిం చదగినదే. వారణాసి ఎంపీ మోడీ. వారణాసి నగర పాలక సంస్థను ఆయన పార్టీయే ఏలుతోంది. వీరు ఐదేళ్లు పదవు లలో ఉంటారు. కాబట్టి గంగ కోసం చాలా చేయవచ్చు. కల్హణ