CM Kejriwal
-
కేజ్రీవాల్ బెయిల్పై తీర్పు రిజర్వు
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై తీర్పును హైకోర్టు రిజర్వులో ఉంచింది. సోమవారం కేజ్రీవాల్, సీబీఐ తరఫు లాయర్లు తమ వాదనలు వినిపించారు. ‘ఎక్సైజ్ కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాల్. ఆయన్ను విడుదల చేస్తే సాకు‡్ష్యలను ప్రభావితం చేస్తారు. ఆయన అరెస్టయితేనే ఈ కేసు విచారణ ముగింపునకు వస్తుంది. నెలలోగా చార్జిషిటు వేస్తాం’అని సీబీఐ లాయర్ డీపీ సింగ్ తెలిపారు. కేజ్రీవాల్ను జైలు నుంచి బయటకు రాకుండా చేసేందుకే సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారని ఆయన తరఫు సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి వాదించారు. ఊహాకల్పనలతోనే కేజ్రీవాల్కు అరెస్ట్ చేశారే తప్ప, ఆయనకు వ్యతిరేకంగా ప్రత్యక్షంగా ఎటువంటి ఆధారాలు లేవన్నారు. వాదనలు విన్న అనంతరం జస్టిస్ నీనా బన్సన్ కృష్ణ తీర్పును రిజర్వులో ఉంచుతూ ఆదేశాలిచ్చారు. ఆఖరి చార్జిషీటు అంతకుముందు, సీబీఐ అధికారులు మద్యం కుంభకోణం కేసులో ఆఖరి చార్జిషిటును రౌజ్ అవెన్యూ కోర్టులో దాఖలు చేశారు. ఇందులో సీఎం కేజ్రీవాల్, ఆప్ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్తోపాటు అరబిందో ఫార్మా డైరెక్టర్ పి.శరత్ చంద్రారెడ్డి, బడ్డీ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అమిత్ అరోరా, హవాలా ఆపరేటర్ వినోద్ చౌహాన్, వ్యాపారవేత్త ఆశిష్ మాథుర్పేర్లున్నాయి. -
కేజ్రీవాల్కు ఢిల్లీ పోలీసుల నోటీసులు
ఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యేలకు ఎర వేసేందుకు బీజేపీ ప్రయత్నించిందంటూ చేసిన ఆరోపణలకు గాను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు శనివారం పోలీసులు నోటీసులిచ్చారు. ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను మూడు రోజుల్లో అందజేయాలని కోరారు. ఈ సందర్భంగా ఐదు గంటలు హైడ్రామా జరిగింది. కేజ్రీవాల్ నివాసంలో అధికారులు తాము నోటీసులు తీసుకుంటామని చెప్పగా పోలీసులు నిరాకరించారు. సీఎంకే ఇస్తామన్నారు. చివరికి కేజ్రీవాల్ బయటకు రాగా నోటీసులిచ్చారు. మరోవైపు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తామిచ్చిన ఐదు నోటీసులకు కేజ్రీవాల్ స్పందించలేదంటూ ఈడీ అధికారులు శనివారం అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దివ్యా మల్హోత్రాకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఈ నెల 7వ తేదీన విచారణ చేపడతామని మేజిస్ట్రేట్ చెప్పారు. -
చీఫ్ సెక్రటరీని తొలగించండి
న్యూఢిల్లీ: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేశ్ కుమార్ను బాధ్యతల నుంచి తప్పించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్(ఎల్జీ)ని సీఎం కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. నరేశ్ కుమార్ తన కుమారుడికి చెందిన సాఫ్ట్వేర్ కంపెనీకి, ఐఎల్బీ అనే సంస్థతో ఎంవోయూ కుదిరేందుకు అధికార దురి్వనియోగానికి పాల్పడినట్లు విజిలెన్స్ మంత్రి అతీషి ఆరోపించారు. ఈ మేరకు నివేదికను ఇటీవల సీఎం కేజ్రీవాల్కు అందజేశారు. ఆ నివే దికను కేజ్రీవాల్ శనివారం లెఫ్టినెంట్ జనరల్ వీకే శుక్లాకు పంపారు. అతీషి సిఫారసుల మేరకు ప్రధాన కార్యదర్శి నరేశ్ కుమార్ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలను చీఫ్ సెక్రటరీ నరేశ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. తనకుమారుడికి ఎటువంటి కంపెనీతోను, ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. ఐఎల్బీఎస్ సంస్థ కూడా అతీషి చేసిన ఆరోపణలు నిరాధారాలంటూ ఖండించింది. -
DelhiFloods: మూడు రోజుల్లో రూ.200కోట్లు నష్టం, ఇండస్ట్రీ కీలకహెచ్చరికలు
ఎడతెగని వర్షాలు, వరద పరిస్థితి దేశ రాజధాని నగరం ఢిల్లీని అతలాకుతలం చేసింది. యమునా నది నీటి మట్టం ఊహించిన దాని కంటే 18 గంటల ముందుగానే ప్రమాద స్థాయి 208.46 మీటర్లకు చేరింది. గతంలో ఎన్నడూ లేని చాలా ప్రాధాన్య ప్రాంతాలు కూడా నీట మునిగాయి. ముఖ్యంగా సుప్రీంకోర్టు, రాజ్ ఘాట్ని వరదనీరు ముంచెత్తింది. అంతేకాదు ఎర్రకోట చుట్టూ వరదనీరు చేరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం కూడా నీటి మునిగింది. అటు మంచినీటికోసం ప్రజల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. ఇక నిత్యావసరాల కోసం జనం అల్లాడి పోతున్నారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఢిల్లీని ముంచెత్తిన వరదలతొ వ్యాపార పరంగా అపార నష్టానికి దారి తీశాయి. యమునా నదిలో నీటిమట్టం పెరగడం ఢిల్లీ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. యమునా బాజార్ నుంచి ఎర్రకోట దాకా దుకాణాలు, ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. గత 3-4 రోజుల్లో దాదాపు 200 కోట్ల రూపాయల వ్యాపారం దెబ్బతిందని ఇండస్ట్రీ బాడీ తెలిపింది. అలాగే యమునా నది నీటిమట్టం పెరుగుతున్న దృష్ట్యా రాబోయే కొద్ది రోజుల పాటు ఇతర నగరాల నుండి వస్తువుల తరలింపును నిలిపి వేయాలని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ఛైర్మన్ బ్రిజేష్ గోయల్ ఢిల్లీలోని వ్యాపారులకు విజ్ఞప్తి చేయడం గమనార్హం. #WATCH | Delhi: Water level in Yamuna river rises after incessant rainfall & release of water from Hathnikund barrage. The water level of Yamuna River at Old Railway Bridge (ORB) has crossed the danger mark and is at 208.40 meters, recorded around 9 am. (Drone Visuals from… pic.twitter.com/yT1X0rXz5g — ANI (@ANI) July 14, 2023 పాత ఢిల్లీ, కాశ్మీరీ గేట్, మోరీ గేట్, మానెస్ట్రీ మార్కెట్, చాందినీ చౌక్, జామా మసీదు, భగీరథ్ ప్లేస్, లజ్పత్ రాయ్ మార్కెట్, కినారీ బజార్, ఫతేపురి, ఖరీ బావోలి, నయా బజార్ మార్కెట్లు వర్షం కారణంగా దెబ్బ తిన్నాయని ట్రేడర్స్ బాడీ తెలిపింది. అలాగే కాశ్మీరీ గేట్ మార్కెట్ ప్రెసిడెంట్ వినయ్ నారంగ్ మాట్లాడుతూ, 3-4 రోజుల వర్షం కారణంగా రూ. 50 కోట్లకు పైగా నష్టం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రతిరోజు రేవారీ, గుర్గావ్, ఘజియాబాద్, ఫరీదాబాద్, మీరట్, సోనిపట్, పానిపట్, పాల్వాల్, బాగ్పట్, బరౌత్, ముజఫర్నగర్ వంటి ప్రాంతాల నుండి రోజువారీ 2 లక్షలకు పైగా కస్టమర్ల తాకిడి ఉంటుంది. ఇదే పరిస్థితి మరిన్ని రోజులు కొనసాగితో మరింత భారీ నష్టం తప్పదని వ్యాపారులు వణికి పోతున్నారు. సమీప నగరాల నుంచి వచ్చే కస్టమర్లు కూడా తమ ప్లాన్ను వాయిదా వేసుకున్నారు.అటు రైళ్ల రాకపోకలను రైల్వే నిలిపిసింది. రోడ్డు, ఇతర రవాణా మార్గాల మూతతో వ్యాపారం మరింత స్థంభించింది. దీంతో వ్యాపారులు కొనుగోలు దారులు ఢిల్లీకి రావడం లేదని గోయల్ని ఉటంకిస్తూ పిటిఐ పేర్కొంది. కాగా వరద పీడిత ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన ఢిల్లీ సర్కారు తగిన చర్యలు చేపడుతోంది. పాఠశాలలు, కళాశాలలకు ఆదివారం వరకు సెలవు ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు, అవసరమైన సేవలను అందించేవి తప్ప, మిగిలిన ఉద్యోగులు ఇంటి నుండి పనిచేయాలని ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఈ సమయంలో అవసరమైన సేవలు అందించే వాహనాలు మినహా భారీ వాహనాల ప్రవేశంపై నిషేధం విధించినట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. -
కేజ్రీవాల్ బంగ్లా దర్యాప్తు అధికారికి ఉద్వాసన
న్యూఢిల్లీ: ఢిల్లీలో పాలనాధికారం రాష్ట్ర సర్కార్కే ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చిన నేపథ్యంలో ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం కేజ్రీవాల్ అధికార బంగ్లా ఆధునీకరణకు రూ.45 కోట్లు వెచ్చించారన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న విజిలెన్స్ అధికారి, సీనియర్ ఐఏఎస్ రాజశేఖర్ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దర్యాప్తును విజిలెన్స్ విభాగంలోని ఇతర అసిస్టెంట్ డైరెక్టర్లు పంచుకోవాలని, నివేదికలను నేరుగా విజిలెన్స్ సెక్రటరీకి సమర్పించాలని ఆదేశించింది. దర్యాప్తు మాటున రాజశేఖర్ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు విజిలెన్స్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ చెప్పారు. -
కేజ్రీవాల్ పై సీబీఐ ప్రశ్నల వర్షం
-
లిక్కర్ స్కామ్లో సీబీఐ విచారణకు హాజరైన కేజ్రీవాల్
-
మూడు నెలల్లో అందరికీ వ్యాక్సిన్ : ఢిల్లీ సీఎం
సాక్షి,న్యూఢిల్లీ: ఒక వైపు కరోనా వైరస్ అంతానికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంటే, మరోవైపు ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటక లాంటి రాష్ట్రాల్లో మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. ఈనేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రానికి కీలక విజ్ఞప్తి చేశారు. అందరికీ టీకాలు వేయడానికి కేంద్రం అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు సంబంధించిన టీకాల సరఫరా తమకు లభిస్తే తమ ప్రభుత్వం మూడు నెలల్లోనే ఢిల్లీలో టీకాల కార్యక్రమం మొత్తాన్ని పూర్తి చేస్తామన్నారు. కోవిడ్ -19 టీకాల వేగాన్ని పెంచాలని ఢిల్లీ సర్కార్ పెంచాలని యోచిస్తోంది. రోజుకు 30-40వేల వ్యాక్సిన్లు ఇస్తున్నామనీ, దీన్ని త్వరలో 1.25 లక్షల మందికి పెంచుతామని కేజ్రీవాల్ తెలిపారు..అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ టీకాలు వేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని అర్హతగల లబ్ధిదారులందరికీ టీకా డ్రైవ్ను విస్తరించాలని అరవింద్ కేజ్రీవాల్ గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వ్యాక్సిన్ ఉత్పత్తి పెరిగింది, కాబట్టి టీకాలు అందించే కార్యక్రమాన్ని కూడా మరింతగా విస్తరించాలన్నారు. అంతేకాదు టీకా తీసుకునేందుకు అర్హుల జాబితా తయారుచేసే బదులు అందరికీ అవకాశం కల్పించాలన్నారు. అలాగే టీకా ధరలు, వ్యాక్సినేషన్ ప్రక్రియను వికేంద్రీకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. తద్వారా రాష్ట్రాలు తమదైన రీతిలో యుద్ధ ప్రాతిపదికన టీకాలు వేయడానికి అనుమతించాలని ఢిల్లీ సీఎం కోరారు. టీకా కేంద్రాలకు సంబంధించిన కేంద్రం అమలు చేస్తున్న ప్రస్తుత మార్గదర్శకాలు చాలా కఠినంగా ఉన్నాయని అభి ప్రాయపడిన ఆయన దీ న్ని సరళీకరించి మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. టీకా విషయంలో 2 నెలల అనుభవం నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని, సాధ్యమైనన్ని ఎక్కువ కేంద్రాల్లో టీకాలు వేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాగా భారతదేశంలో మళ్లీ కోవిడ్-19 విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 35,871 తాజా కేసులు నమోదయ్యాయి. ఇది 3 నెలల్లో అత్యధికమని అధికార గణాంకాలు చెబుతున్నాయి. బుధవారం ఢిల్లీలో 500కి పైగా కేసులు కొత్తగా నమోదుతో మొత్తం సంఖ్య 644,489 కు చేరుకుంది. గత 24 గంటల్లో ఒక మరణంతో మరణించిన వారి సంఖ్య 10,945 గా ఉంది. -
సీఎస్పై దాడి చార్జిషీట్లో కేజ్రీవాల్ పేరు
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై దాడి కేసులో సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం సిసోడియాలను నిందితులుగా చేరుస్తూ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమర్ విశాల్కు సమర్పించిన చార్జిషీట్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో 11 మంది ఎమ్మెల్యేల పేర్లున్నాయి. ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్ను అధికారిక విధులు నిర్వర్తించకుండా అడ్డుకునేందుకు, గాయపరిచేందుకు కేజ్రీవాల్, సిసోడియా తదితరులు కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని, చంపేస్తామని బెదిరించారని అందులో పేర్కొన్నారు. కాగా, చార్జిషీటుపై ఈనెల 25వ తేదీన విచారణ చేపడతామని మెజిస్ట్రేట్ ప్రకటించారు. -
ఢిల్లీ వివాదం యథాతథం
న్యూఢిల్లీ: ఢిల్లీలో పాలనాధికారాలపై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ)కు మధ్య వివాదం యథాతథంగా కొనసాగుతోంది. నియామ కాలు, బదిలీలకు సంబంధించిన సిబ్బంది విభాగంపై అధికారం మాదంటే మాదని ఇటు సీఎం, అటు ఎల్జీ ప్రకటించుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు అధికారుల బదిలీలకు సంబంధించి సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం పంపిన ఫైలును ఎల్జీ అనిల్ బైజాల్ తిప్పి పంపేశారు. మరోపక్క పాలనపై, అధికారులపై పట్టు సాధించేందుకు ఢిల్లీ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. దీనిలో భాగంగానే ప్రజల ముంగిట్లోకే రేషన్ సరుకుల పంపిణీకి చర్యలు తీసుకోవాలని సీఎం కేజ్రీవాల్ అధికారులను ఆదేశించారు. ఎల్జీపై కేజ్రీవాల్ ధ్వజం సుప్రీం తీర్పు నేపథ్యంలో శుక్రవారం ఎల్జీ అనిల్ బైజాల్తో సీఎం కేజ్రీవాల్ సుమారు 25 నిమిషాల పాటు భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఢిల్లీ సర్వీసెస్ విభాగం అసెంబ్లీ పరిధిలోకి రాదని, అధికారుల నియామకాలు, బదిలీలు చేసే అధికారం తమకే ఉందని 2015లో హోం శాఖ ఇచ్చిన నోటిఫికేషన్ను సుప్రీం రద్దు చేయలేదని ఎల్జీ కేజ్రీవాల్కు చెప్పారు. అనంతరం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ ఎల్జీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘కేంద్ర ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ సుప్రీం కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నారు. సిబ్బంది విభాగాన్ని ఢిల్లీ ప్రభుత్వానికి అప్పగించేందుకు ఎల్జీ అంగీకరించడం లేదు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం బాహాటంగా తిరస్కరించడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. సిబ్బంది విభాగాన్ని ఢిల్లీ ప్రభుత్వానికి అప్పగించరాదని కేంద్ర హోం శాఖ తనకు సూచించిందని బైజాల్ నాతో చెప్పారు’ అని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పు అమలు చేయాలని కోరేందుకు కేజ్రీవాల్ హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ అపాయింట్మెంట్ కోరారు. పాలనపై పట్టుకు ఆప్ యత్నాలు తీర్పు నేపథ్యంలో ఢిల్లీలో పాలనపై, అధికా రులపై పట్టు బిగించేందుకు ఆప్ చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే అభ్యంత రాలన్నీ పక్కనపెట్టి ప్రజల ముంగిట్లోనే రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నట్టు కేజ్రీవాల్ తెలిపారు. ఈ మేరకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆహార విభాగాన్ని ఆదేశించినట్టు ఆయన ట్విట్టర్లో పేర్కొన్నా రు. దీనిపై తీసుకున్న చర్యలపై రోజువారీ నివేదిక ఇవ్వాలని కూడా అధికారులను ఆదేశించానన్నారు. ఈ ప్రతిపాదన పట్ల ఎల్జీ గతంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విధానం అమలుకు ముందు కేంద్రాన్ని సంప్రదించాలని ఆప్ ప్రభుత్వానికి స్పష్టం చేశారు. అయితే సుప్రీం తీర్పు నేపథ్యంలో ఎల్జీ అభ్యంతరాలను తోసిరాజని కేజ్రీవాల్ ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. అలాగే డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అధ్యక్షతన సమావేశమై వ్యయ, ఆర్థిక కమిటీ రెండు ప్రాజెక్టులను ఆమోదించింది. సిగ్నేచర్ బ్రిడ్జికి చివరి విడత నిధుల మంజూరుకు, ఢిల్లీ టెక్నికల్ వర్సిటీలో అకడమిక్ భవనం, హాస్టల్ గదుల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఇంకో తీర్పు వస్తే పూర్తి స్పష్టత: ఎల్జీ కేజ్రీవాల్ వ్యాఖ్యలను ఎల్జీ తోసిపుచ్చారు. సిబ్బంది విభాగానికి సంబందించి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులో కూడా తీర్పు వస్తే ఈ అంశంపై పూర్తి స్పష్టత వస్తుందని ఎల్జీ పేర్కొన్నారు. ఢిల్లీలో సిబ్బంది విభాగం అసెంబ్లీ పరిధిలోకి రాదంటూ 2015లో కేంద్ర హోం శాఖ ఇచ్చిన నోటిఫికేషన్ను సుప్రీంకోర్టు ఇంకా రద్దు చేయలేదనీ, కాబట్టి ఉద్యోగుల బదిలీలపై అధికారం తమదేనంటూ కేజ్రీవాల్కు ఎల్జీ లేఖ రాశారు. హోం శాఖ స్పందిస్తూ.. సిబ్బం ది విభాగం అంశంపై సుప్రీంలో పెండిం గ్లో ఉన్నందున తాము తుది నిర్ణయం చెప్పడం చట్టవ్యతిరేకమవుతుందంది. -
సంతోషం కోసం ఓ పిరియడ్!
న్యూఢిల్లీ: పాఠశాల విద్యార్థుల కోసం ‘హ్యాపీనెస్ కరిక్యులమ్’ (కొత్త తరహా సిలబస్)ను ఢిల్లీ ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. దీన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆధ్యాత్మిక గురువు దలైలామా సంయుక్తంగా సోమవారం ప్రారంభించారు. ఈ సిలబస్పై ఢిల్లీ డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోడియా మాట్లాడారు. ప్రభుత్వ స్కూళ్లలో 8వ తరగతి వరకు ఈ ‘హ్యాపీనెస్’ పిరియడ్ 45 నిమిషాలపాటు ఉండనుంది. ‘ధ్యానంతో పాటు విలువైన విద్య, మానసిక వ్యాయామాలు ఉంటాయి. 40 మంది ప్రభుత్వ స్కూళ్ల టీచర్లు, విద్యావేత్తలు అధ్యయనం చేసి దీన్ని రూపొందించారు. తీవ్రవాదం, అవినీతి, కాలుష్యంలాంటి అధునిక సమస్యలను ఇలాంటి మానవీయ విద్యను అందించడం ద్వారా పరిష్కరించవచ్చని ఆశిస్తున్నాం’ అని సిసోడియా చెప్పారు. ఆధునిక విద్య, ప్రాచీన జ్ఞానం ఏకం చేయడంతో ప్రతికూల భావాల్ని అధిగమించగల్గుతామని దలైలామా అన్నారు. -
ఐదోవ రోజుకు చేరిన కేజ్రీవాల్ నిరసన
-
నాలుగో రోజుకు చేరిన కేజ్రీవాల్ నిరసన
న్యూఢిల్లీ: ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కార్యాలయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ముగ్గురు మంత్రులు చేస్తున్న దీక్ష నాలుగో రోజుకు చేరింది. దీంతో ఎల్జీ ఇంటి నుంచే తన విధులు నిర్వహిస్తున్నారు. కాగా, దీక్ష చేస్తున్న కేజ్రీవాల్ను కలిసేందుకు ఎవరినీ అనుమతించకపోవడంపై ఆప్ నేతలు మండిపడ్డారు. ‘కేజ్రీవాల్ను హౌజ్ అరెస్టు చేశారా?’ అని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ప్రశ్నించారు. ఢిల్లీలో ఐఏఎస్ అధికారులు ఆందోళన విరమింపజేసే విషయంలో బైజాల్ చొరవతీసుకోవడం లేదంటూ కేజ్రీవాల్ నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. అటు, ప్రధానమంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్ల తీరును నిరసిస్తూ.. ఎమ్మెల్యేలు, ఆప్ కార్యకర్తలు రాజ్ఘాట్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ‘మోదీజీ ఫర్గివ్ ఢిల్లీ’ హ్యాష్ట్యాగ్తో ఈ ప్రదర్శన కొనసాగింది. నాలుగు నెలలుగా ఆందోళన చేస్తున్న ఢిల్లీ ఐఏఎస్ అధికారుల ఆందోళన విరమించేలా ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. -
ఆప్ ఎమ్మెల్యేలకు ఊరటనిచ్చిన ఢిల్లీ హైకోర్టు
-
అనర్హతపై ‘ఆప్’ విజయం
న్యూఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యేల లాభదాయక పదవుల కేసులో ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై విధించిన అనర్హతను రద్దుచేస్తూ కేసును మళ్లీ విచారించాలని ఎన్నికల సంఘాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం తీరును కోర్టు తప్పుబట్టింది. అనర్హతపై కేంద్రానికి ఈసీ చేసిన ప్రతిపాదనలను సహజ న్యాయాన్ని, ఎమ్మెల్యేల హక్కులను నీరుగార్చటంగా అభివర్ణించిన ధర్మాసనం.. వారిపై వేటువేసేముందు ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని చెప్పుకునే అవకాశం ఇవ్వకపోవటాన్ని తప్పుబట్టింది. తీర్పుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ఈసీపై కోర్టు మండిపాటు ‘ఎన్నికల కమిషన్ జనవరి 19న ఆప్ ఎమ్మెల్యేల అనర్హతపై రాష్ట్రపతికి సిఫారసు చేసిన ఉద్దేశం చట్టాలను నీరుగార్చటమే. సహజన్యాయ చట్టాలను అమలు చేయటంలో ఎన్నికలసంఘం విఫలమైంది’ అని 79 పేజీల తీర్పులో కోర్టు స్పష్టం చేసింది. ‘అనర్హతపై ఆప్ ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని భారత ఎన్నికల సంఘం విని, క్షుణ్ణంగా విచారించాలి. ఆ తర్వాత ప్రభుత్వంలో లాభదాయక పదవులు అంటే ఏమిటనే ముఖ్యమైన అంశాలపై నిర్ణయం తీసుకోవాలి. పార్లమెంటరీ సెక్రటరీలుగా పిటిషనర్లు (ఆప్ ఎమ్మెల్యేలు) అనుభవించిన లాభదాయక పదవులపై నిష్పాక్షికంగా పునఃసమీక్ష జరపాలి’ అని ఎన్నికల సంఘాన్ని ఈసీ ఆదేశించింది. మేం వదలబోం: కాంగ్రెస్ ఆప్ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో ఎన్నికల సంఘం వద్ద తమ పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ తెలిపింది. ‘లాభదాయక పదవులపై మా పోరాటం కొనసాగుతుంది. హైకోర్టు వీరు తప్పుచేయలేదని నిర్ధారించ లేదు. ఎమ్మెల్యేల వాదన వినలేదనే అంశంపై సామాజిక న్యాయం జరగలేదని మాత్రమే అభిప్రాయపడింది’ అని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ మాకెన్ పేర్కొన్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆ 20 మంది ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రాంనివాస్ అనుమతించారు. అసలు వివాదమేంటి? ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం 2015 మార్చిలో 20 మంది ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించింది. ఎమ్మెల్యేలుగా వేతనం తీసుకుంటూనే పార్లమెంటు సెక్రటరీలుగా లాభం పొందే పదవులను అనుభవించటంపై బీజేపీ, కాంగ్రెస్ కోర్టును ఆశ్రయించాయి. 2016లో వీరి నియామకాలను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల సంఘం సూచన మేరకు రాష్ట్రపతి ఆదేశాలతో ఈ 20 మందిని కేంద్రం అనర్హులుగా ప్రకటించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై స్టే విధించాలంటూ ఆప్ ఎమ్మెల్యేలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం సున్నితంగా తిరస్కరించింది. అయితే.. ఈ స్థానాల్లో తక్షణమే ఎన్నికలు నిర్వహించటం వంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఈసీకి సూచించింది. -
అనర్హతపై ‘ఆప్’ విజయం
న్యూఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యేల లాభదాయక పదవుల కేసులో ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై విధించిన అనర్హతను రద్దుచేస్తూ కేసును మళ్లీ విచారించాలని ఎన్నికల సంఘాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం తీరును కోర్టు తప్పుబట్టింది. అనర్హతపై కేంద్రానికి ఈసీ చేసిన ప్రతిపాదనలను సహజ న్యాయాన్ని, ఎమ్మెల్యేల హక్కులను నీరుగార్చటంగా అభివర్ణించిన ధర్మాసనం.. వారిపై వేటువేసేముందు ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని చెప్పుకునే అవకాశం ఇవ్వకపోవటాన్ని తప్పుబట్టింది. తీర్పుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ఈసీపై కోర్టు మండిపాటు ‘ఎన్నికల కమిషన్ జనవరి 19న ఆప్ ఎమ్మెల్యేల అనర్హతపై రాష్ట్రపతికి సిఫారసు చేసిన ఉద్దేశం చట్టాలను నీరుగార్చటమే. సహజన్యాయ చట్టాలను అమలు చేయటంలో ఎన్నికలసంఘం విఫలమైంది’ అని 79 పేజీల తీర్పులో కోర్టు స్పష్టం చేసింది. ‘అనర్హతపై ఆప్ ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని భారత ఎన్నికల సంఘం విని, క్షుణ్ణంగా విచారించాలి. ఆ తర్వాత ప్రభుత్వంలో లాభదాయక పదవులు అంటే ఏమిటనే ముఖ్యమైన అంశాలపై నిర్ణయం తీసుకోవాలి. పార్లమెంటరీ సెక్రటరీలుగా పిటిషనర్లు (ఆప్ ఎమ్మెల్యేలు) అనుభవించిన లాభదాయక పదవులపై నిష్పాక్షికంగా పునఃసమీక్ష జరపాలి’ అని ఎన్నికల సంఘాన్ని ఈసీ ఆదేశించింది. మేం వదలబోం: కాంగ్రెస్ ఆప్ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో ఎన్నికల సంఘం వద్ద తమ పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ తెలిపింది. ‘లాభదాయక పదవులపై మా పోరాటం కొనసాగుతుంది. హైకోర్టు వీరు తప్పుచేయలేదని నిర్ధారించ లేదు. ఎమ్మెల్యేల వాదన వినలేదనే అంశంపై సామాజిక న్యాయం జరగలేదని మాత్రమే అభిప్రాయపడింది’ అని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ మాకెన్ పేర్కొన్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆ 20 మంది ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రాంనివాస్ అనుమతించారు. అసలు వివాదమేంటి? ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం 2015 మార్చిలో 20 మంది ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించింది. ఎమ్మెల్యేలుగా వేతనం తీసుకుంటూనే పార్లమెంటు సెక్రటరీలుగా లాభం పొందే పదవులను అనుభవించటంపై బీజేపీ, కాంగ్రెస్ కోర్టును ఆశ్రయించాయి. 2016లో వీరి నియామకాలను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల సంఘం సూచన మేరకు రాష్ట్రపతి ఆదేశాలతో ఈ 20 మందిని కేంద్రం అనర్హులుగా ప్రకటించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై స్టే విధించాలంటూ ఆప్ ఎమ్మెల్యేలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం సున్నితంగా తిరస్కరించింది. అయితే.. ఈ స్థానాల్లో తక్షణమే ఎన్నికలు నిర్వహించటం వంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఈసీకి సూచించింది. -
కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)పై ఆప్ ఎమ్మెల్యేల దాడి కేసులో ఆధారాలను సేకరించేందుకు ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ నివాసంలో పోలీసులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఉన్న హార్డ్ డిస్క్ను స్వాధీనం చేసుకున్నారు. అయితే సీఎం ఇంట్లో సీఎస్పై దాడి జరిగినట్లుగా చెబుతున్న గదిలో సీసీటీవీ కెమెరా లేదు. సోదాలకు వస్తున్నట్లు సీఎం ఇంట్లోని సంబంధిత వ్యక్తికి ముందుగానే సమాచారమిచ్చామన్నారు. కేజ్రీవాల్ను పోలీసులు ప్రశ్నించే అవకాశముందని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి హన్స్రాజ్ అహిర్ కూడా సంకేతాలిచ్చారు. పోలీసులు రౌడీల్లా వ్యవహరించారు.. ఢిల్లీ పోలీసులు కేంద్రం చేతిలో కీలుబొమ్మల్లా మారారనీ, సీఎం నివాసంలోకి అక్రమంగా ప్రవేశించి రౌడీల్లా వ్యవహరించారని ఆప్ ఆరోపించింది. సీఎంను అవమానించడానికే పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారంది. ప్రధాని మోదీ ప్రభుత్వ ఆదేశం లేకుంటే పోలీసులు అలాంటి దాదాగిరి చేసి ఉండేవారు కాదని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. కేజ్రీవాల్ ఓ ట్వీట్ చేస్తూ ‘పెద్ద పోలీసు బలగాన్ని మా ఇంటికి పంపారు. మరి న్యాయమూర్తి లోయా మృతి కేసులో అమిత్ షాను ఎప్పుడు ప్రశ్నిస్తారు?’ అని అన్నారు. ఆప్ ప్రభుత్వంతో కలసి పనిచేసేలా ఉద్యోగులను ఆదేశించాల్సిందిగా లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ను కేజ్రీవాల్ కోరారు. కాగా, అరెస్టైన ఎమ్మెల్యేల బెయిల్ అభ్యర్థనలను స్థానిక కోర్టు కొట్టివేసింది. కాగా, ప్రజోపయోగ పనులకు అడ్డొచ్చే అధికారులను కొట్టాల్సిందేనని ఉత్తమ్ నగర్ ఎమ్మెల్యే నరేశ్ బాల్యన్ వ్యాఖ్యానించారు. -
పాకిస్తాన్ కల తీర్చిన బీజేపీ: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఐఎస్ ఏజెంట్లు, ద్రోహులు జాతీయవాదుల ముసుగులో దేశాన్ని విడగొట్టేందుకు కుట్రపన్నుతున్నారని పరోక్షంగా బీజేపీపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కుల, మత ప్రాతిపదికన భారత్లో చీలికలు సృష్టిస్తున్న కాషాయ పార్టీ...దేశాన్ని విభజించాలన్న పాకిస్తాన్ కలను తన మూడేళ్ల పాలనలోనే నిజం చేసిందని ఎద్దేవా చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఐదో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో కేజ్రీవాల్ ప్రసంగించారు. ‘పాకిస్తాన్, ఐఎస్లు 70 ఏళ్లలో చేయలేని దాన్ని బీజేపీ మూడేళ్లలోనే చేసి చూపించింది. దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. హిందూ, ముస్లింల మధ్య చిచ్చుపెట్టి భారత్ను విడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. విచ్ఛిన్న భారత్ కాక పాక్కు ఉన్న పెద్ద లక్ష్యం మరేంటి?’ అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. -
కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ: పరువు నష్టం దావా కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తమ పరువుకు భంగం కలిగించారని ఢిల్లీ డిస్ట్రిక్ట్ అండ్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ), మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్లు కేజ్రీవాల్, కీర్తీఆజాద్ పై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. వారి వ్యాఖ్యలు డీడీసీఏ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉన్నాయంటూ, తమ ముందు హాజరు కావాలని కోర్టు జనవరి 30న ఆదేశించింది. దీంతో మంగళవారం కోర్టు ముందు హాజరైన కేజ్రీవాల్ రూ.10,000 సొంత పూచీకత్తు, అంతే మొత్తంలో ష్యూరిటీ సమర్పించాలని ఆదేశిస్తూ బెయిల్ మంజూరు చేసింది. -
ఢిల్లీని వదిలి వెళ్తాను: గుర్మెహర్
న్యూఢిల్లీ: కార్గిల్ అమరవీరుడు కెప్టెన్ మణ్ దీప్ సింగ్ కుమార్తె, ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని గుర్మెహర్ కౌర్ తన ఆందోళనను విరమించాలని నిర్ణయించుకుంది. తనపై బీజేపీ, ఏబీవీపీతో సహా సెల్రబిటీలు కూడా తీవ్రమైన కామెంట్లు చేస్తుండటంతో తన నిరసనను ఇక్కడితే ఆపేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తనకు మద్ధతు తెలిపిన అందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ఆందోళన విరమించకపోతే అత్యాచారం చేస్తామంటూ ఏబీవీపీ వారు తనపై బెదిరింపులకు పాల్పడటం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఢిల్లీ నుంచి గుర్మెహర్ కౌర్ ఎక్కడికైనా వెళ్లిపోవాలనుకున్నట్లు చెప్పింది. ఈ వివాదంలో గుర్మెహర్కు అరవింద్ కేజ్రీవాల్ మద్ధతు తెలిపారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని గుర్మెహర్కు వ్యతిరేకంగా జరుగుతున్న చర్యలపై ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. గత వారం రాంజాస్ కాలేజీలో జరిగిన గొడవలపై చర్చించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ను కలిశారు. రాంజాస్ కాలేజీలో విధ్వసం సృష్టించిన ఏబీవీపీ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని లెఫ్టినెంగ్ గవర్నర్కు కేజ్రీవాల్ విజ్ఞప్తిచేశారు. గుర్మెహర్ను బెదిరించిన వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా కేజ్రీవాల్ కోరారు. గుర్మెహర్ తండ్రి కెప్టెన్ మణ్దీప్ సింగ్ 1999 కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందారు. తన తండ్రిని పాకిస్తాన్ చంపలేదని, యుద్ధం ఆయనను చంపిందని రాసిన ఫ్లకార్డ్ చేతబట్టుకుని ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మరోసారి ఆమె వివాదంలో చిక్కుకుంది. దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్న జేఎన్యూ విద్యార్థి ఉమర్ ఖలిద్ను రాంజాస్ కాలేజీలో ఓ సాహిత్య కార్యక్రమంలో ఉపన్యసించేందుకు ఆహ్వానించారు. దీనిపై గత బుధవారం ఏబీవీపీ తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో పాటు విద్యార్థులు, మీడియాపై దాడికి పాల్పడగా ఈ ఘటనలో దాదాపు 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటనపై గుర్మెహర్ కౌర్ గుర్మెహర్ తీవ్ర స్థాయిలో స్పందిస్తూ.. ఏబీవీపీకి భయపడేది లేదంటూ.. తనకు దేశ వ్యాప్తంగా విద్యార్థుల మద్దతు ఉందని రాసున్న ప్లకార్డుతో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వివాదం మొదలైంది. రాంజాస్ కాలేజీ వివాదం.. సంబంధిత కథనాలు ట్విట్టర్ వార్కు తెరలేపిన సెహ్వాగ్ ఏబీవీపీకి భయపడను: జవాన్ కూతురు 'నా తండ్రిని పాకిస్థాన్ చంపలేదు' రాంజాస్ కాలేజీలో రణరంగం! నన్ను రేప్ చేస్తామని బెదిరించారు -
రాంకిషన్ విషయంలో వెనక్కి తగ్గని కేజ్రీవాల్
న్యూఢిల్లీ: 'ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్'(ఓఆర్ఓపీ) పథకం అమలుతీరుతో ఆవేదన చెందిన మాజీ జవాను రాంకిషన్ గ్రెవాల్(70) ఆత్మహత్య చేసుకోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు. జవాన్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై నిన్న (బుధవారం) ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు తమ పార్టీల నేతలతో కలసి దేశ రాజధాని ఢిల్లీలో నిరసన చేపట్టగా వారికి చేదు అనుభవమే ఎదురైంది. పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ విషయంపై ఢిల్లీ సీఎం చాలా పట్టుదలతో కనిపిస్తున్నారు. తాను ఎట్టిపరిస్థితుల్లోనూ మాజీ జవాను రాంకిషన్ కుటుంబాన్ని కలిసి తిరుతానని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. నేడు జవాను రాంకిషన్ సొంతగ్రామానికి వెళ్లనున్నట్లు కేజ్రీవాల్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న జవాను రాంకిషన్ స్వగ్రామం హరియాణాలోని భివానీ జిల్లా బామ్లా గ్రామం. జవాను కుటుంబసభ్యులను కలిసి వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపి, వారికి అండగా ఉండనున్నట్లు తెలిపారు. అయితే ఢిల్లీలోని రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి నిన్న వెళ్లిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఓఆర్ఓపీ పథకం అమల్లో లోపాలను సరిచేయాలని రక్షణమంత్రిని కలిసి వివరించేందుకు మంగళవారం ముగ్గురు మాజీ సైనికులతో వచ్చిన రాంకిషన్ పురుగుల మందు ఆత్మహత్య చేసుకున్నారు. జవానుగా సేవలందించిన రాంకిషన్ రిటైరైన తర్వాత గ్రామంలో పారిశుధ్యంలో మెరుగైన ఫలితాలు సాధించినందుకు 2008లో రాష్ట్రపతి చేతుల మీదుగా 'నిర్మల్ గ్రామ్ పురస్కార్' అందుకున్నారు. Will go to their village and meet Ram Kishan ji's family there today — Arvind Kejriwal (@ArvindKejriwal) 3 November 2016 -
మాజీ జవాన్ ఆత్మహత్యపై ఢిల్లీలో హైడ్రామా
-
'మా సీఎం సరే.. మీ పీఎం దేశంలోనే ఉండరేం?'
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం సభకు హాజరుకాకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన బీజేపీపై ఆ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ ముఖ్యమంత్రి సంగతి సరే ప్రధాని నరేంద్రమోదీ సంగతేమిటి.. ఆయన చాలా అరుదుగా దేశంలో కనిపిస్తున్నారు కదా అంటూ నిలదీశారు. శుక్రవారం ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అయింది. అయితే, ఇందులో ముగ్గురే కేబినెట్ మంత్రులు పాల్గొన్నారు. మిగితావారెవ్వరూ కూడా సభలో కనిపించలేదు. దీంతో బీజేపీ ప్రతిపక్ష నాయకుడు విజేంద్ర గుప్తా మాట్లాడుతూ 'ప్రత్యేక సమావేశం అంటూ పిలిచారు. కానీ ఢిల్లీ ముఖ్యమంత్రి కనిపించడం లేదు. కేబినెట్ నుంచి ముగ్గురు మంత్రులు మాత్రమే హాజరయ్యారు. మిగితా వారెవ్వరూ లేరు' అని అంటుండగానే ఆయన మైకును కట్ చేశారు. పంజాబ్ భారత దేశంలో భాగం కాదని మీరు అనుకుంటున్నారా అంటూ స్పీకర్ ప్రశ్నించారు. వెంటనే సీట్లో కూర్చొండని ఆదేశించారు. అయితే మాట్లాడుతుంటే మైకు కట్ చేయడం ప్రజాస్వామ్యం అంటారా అని గుప్తా ప్రశ్నించారు. దీంతో ఆరోగ్యశాఖమంత్రి సత్యేంద్ర జైన్ మాట్లాడుతూ మా ముఖ్యమంత్రి విషయం అట్లుంచితే.. ప్రధాని నరేంద్రమోదీ చాలా అరుదుగా దేశంలో కనిపిస్తున్నారుగా.. ఆయన సంగతేమిటి? ఆయన ఎందుకు దేశంలో కలియతిరగరు' అని ప్రశ్నించారు. -
లెఫ్టినెంట్ గవర్నర్, క్రేజీవాల్ మధ్య మరో వివాదం
ఢిల్లీ: క్రేజీవాల్ సర్కార్, లెఫ్టినెంట్ గవర్నర్కు మధ్య మరో వివాదం రేగింది. గత వారం ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మరో అడుగు ముందుకేశారు. ఢిల్లీ పాలనకు సంబంధించిన ఫైళ్ల వివరాలను తనకు పంపించాలని లెఫ్టినెంట్ గవర్నర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై క్రేజీవాల్ సర్కార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తాజా వివాదంతో ఢిల్లీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. లెఫ్టినెంట్ గవర్నరే ప్రభుత్వాధినేత అని హైకోర్టు తీర్పునిచ్చింది. కోర్టు తీర్పుపై క్రేజీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్న విషయం తెలిసిందే. -
నేనేమీ ఆయన పరువు తీయలేదు
ప్రజలు అనుకుంటున్న విషయాలే చెప్పను న్యూఢిల్లీ: ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) అవకతవకల కేసులో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పరువుకు భంగం కలిగించేలా తాను ఎలాంటి ఆరోపణలు చేయలేదని హస్తిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హైకోర్టుకు తెలిపారు. జైట్లీ గురించి బహిరంగంగా ప్రజలు చెప్పుకొంటున్న విషయాలనే తాను చెప్పానని, అంతేకానీ ఆయనకు వ్యతిరేకంగా తన సొంతమాటలు ఏవీ చెప్పలేదని ఆయన వివరణ ఇచ్చారు. జైట్లీ తనపై, ఆప్ నాయకులపై దాఖలుచేసిన పరువునష్టం దావాలో ఈ మేరకు కేజ్రీవాల్ తరఫు న్యాయవాది మంగళవారం కోర్టుకు తెలియజేశారు. జైట్లీ పరువునష్టం కేసులో సీఎం కేజ్రీవాల్, ఆప్ నేతలకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టు అభియోగాలు ఖరారుచేసింది. ('లక్ష ఓట్లతో ఓడిపోయావు.. నీకేం పరువుంది?') డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్నకాలంలో అక్రమాలు జరిగినట్టు వెలుగుచూడటంతో ఆ అవకతవకలతో జైట్లీకి సంబంధం ఉందంటూ కేజ్రీవాల్, ఆప్ నేతలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో జైట్లీ కేంద్ర ఆర్థికమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్లు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో జైట్లీ కేజ్రీవాల్, ఆప్ నేతలు రాఘవ్ చద్దా, కుమార్ విశ్వాస్, అశుతోష్, సంజయ్ సింగ్, దీపక్ వాజపేయి తదితరులపై వ్యక్తిగత హోదాలో రూ. 10 కోట్ల పరువునష్టం దావా వేశారు. -
కేజ్రీవాల్ కు ఢిల్లీ కోర్టు సమన్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు డిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఢిల్లీ ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలపై ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. జులై 30లోగా కోర్టు ఎదుట హాజరుకావాలని కేజ్రీవాల్ను కోర్టు ఆదేశించింది. 2013 తన ఎన్నికల సందర్భంగా కేజ్రీవాల్ తన సరైన చిరునామా ఇవ్వలేదని, ఆస్తులకు సంబంధించి తప్పుడు సమాచారం అందించారని ఆరోపిస్తూ మౌలిక్ భారత్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ స్నిగ్ధ సర్ వారియా ఈ సమన్లు జారీ చేశారు. ఎన్నికల అఫిడవిట్ లో ముఖ్యమంత్రి తప్పుడు సమాచారం ఇచ్చారని కాంగ్రెస్ విమర్శించిన సంగతి తెలిసిందే. -
ట్విట్టర్లో గుడ్న్యూస్ చెప్పిన కేజ్రీవాల్!
న్యూఢిల్లీ: జాట్ల రిజర్వేషన్ ఆందోళనల నేపథ్యంలో తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న ఢిల్లీ ప్రజలకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్లో ఓ గుడ్ న్యూస్ చెప్పారు. మునాక్ కాలువను సైన్యం తమ ఆధీనంలోకి తీసుకోవడంతో త్వరలోనే ఢిల్లీకి తాగునీటి సమస్యలు తీరిపోతాయని తెలిపారు. తమను ఓబీసీ జాబితాలో చేర్చాలంటూ గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్న జాట్లు ఢిల్లీ కీలక మంచినీటి వనరైన మునాక్ కాలువను నిర్భందించారు. దీంతో తాగునీరు అందక ఢిల్లీ వాసులు అల్లాడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఓవైపు కేజ్రీవాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ విషయంలో పరిష్కారాన్ని కోసం ప్రయత్నించకుండా.. చేతులు కట్టుకొని కూర్చోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. ఈ నేపథ్యంలోనే జాట్లు నిర్బంధించిన మునాక్ కాలువను ఆర్మీ తమ ఆధీనంలోకి తీసుకోవడం.. తాగునీటి సరఫరాకు లైన్ క్లియర్ చేయడంతో ఈ విషయాన్ని కేజ్రీవాల్ ట్విట్టర్లో ప్రకటించారు. ఇది ఢిల్లీవాసులకు శుభవార్త అని ఆయన చెప్పారు. అయితే ఈ కాలువ లైనింగ్ దెబ్బతిందో? లేదో పరీక్షించి వీలైనంత త్వరగా ప్రజలకు నీటిని అందిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. తీవ్రమైన తాగునీటి సమస్య కారణంగా ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు మూతపడిన విషయం తెలిసిందే. -
అబద్ధాలతో నా పరువు తీశారు!
కేజ్రీవాల్పై కేసు విషయంలో ఢిల్లీ కోర్టుకు జైట్లీ వాంగ్మూలం ♦ ఎలాంటి అవినీతికి పాల్పడలేదని స్పష్టీకరణ న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఇతర ఆప్ నేతలపై వేసిన నేరపూరిత పరువునష్టం దావాకు సంబంధించిన విచారణ నిమిత్తం మంగళవారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలోని చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. తప్పుడు అభియోగాలు, అవాస్తవ ప్రకటనలతో తన ప్రతిష్టను దెబ్బదీసేలా కేజ్రీవాల్ తదితరులు వ్యవహరించారని మెజిస్ట్రేట్ సంజయ్ ఖనగ్వాల్కు తెలిపారు. ఢిల్లీ, జిల్లా క్రికెట్ సంఘం(డీడీసీఏ) అధ్యక్షుడిగా తానెలాంటి అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. స్వయంగా ప్రఖ్యాత లాయరైన జైట్లీ.. దాదాపు 70 నిమిషాల పాటు కోర్టులో వివరణ ఇచ్చారు. కేజ్రీవాల్, ఆప్ నేతలు అశుతోష్, కుమార్ విశ్వాస్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్ధా, దీపక్ బాజ్పేయిలు తనపై ఫేస్బుక్, ట్వీటర్, ప్రెస్మీట్లలో చేసిన కామెంట్లను ప్రస్తావిస్తూ.. కోర్టులో దావా వేసిన తరువాత కూడా తనపై, తన కుటుంబంపై ప్రజల్లో ఉన్న గౌరవం తగ్గేలా తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. సన్నిహితుడైన ఒక సివిల్ సర్వీసెస్ అధికారిపై జరుగుతున్న సీబీఐ దర్యాప్తు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కేజ్రీవాల్ తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఫిరోజ్ షా కోట్లా స్టేడియం నిర్మాణంలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై.. ఆ స్టేడియం నిర్మాణ పర్యవేక్షణను ఒక కమిటీ చూసుకుందని, తాను అందులో సభ్యుడిని కూడా కాదని వివరించారు. జైట్లీ తరఫు సాక్షిగా ప్రఖ్యాత జర్నలిస్ట్ రజత్ శర్మ కూడా కోర్టుకు వాంగ్మూలమిచ్చారు. అనంతరం విచారణను ఫిబ్రవరి 3వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. జైట్లీ కోర్టుకు వచ్చిన సమయంలో ఫొటో తీసేందుకు జర్నలిస్టులు ప్రయత్నించడం, వారిని పోలీసులు తోసేయడంతో కొద్దిసేపు తొక్కిసలాట జరిగింది. ఆరోపణలపై మాటతప్పం: ఆప్ జైట్లీ అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణల విషయంలో వెనక్కుతగ్గమని ఆప్ స్పష్టం చేసింది. జైట్లీ అవినీతికి సంబంధించి తమ వివరణను కోర్టు ముందు ఉంచుతామని తెలిపింది. -
'ఫేస్ బుక్, ట్విట్టర్ లో నాపై ఆరోపణలు'
న్యూఢిల్లీ : ఆప్ నేతలపై పరువునష్టం కేసులో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం పాటియాల హౌస్ కోర్టుకు హాజరయ్యారు. జైట్లీ స్టేట్మెంట్ను పాటియలా హౌస్ కోర్టు రికార్డు చేసింది. తనతో పాటు కుటుంబసభ్యులపై కేజ్రీవాల్తో పాటు ఆప్ నేతలు ...ట్విట్టర్, ఫేస్ బుక్ లో నిరాధార ఆరోపణలు చేశారని ఆయన తన స్టేట్మెంట్లో తెలిపారు. తన పరువుకు భంగం కలిగించారని జైట్లీ పేర్కొన్నారు. కాగా ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నిధుల దుర్వినియోగం వ్యవహారంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేతలు...అరుణ్ జైట్లీపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోతనతో పాటు తనకుటుంబ సభ్యులపై అసత్య ఆరోపణలు చేసిన కేజ్రీవాల్తో పాటు అయిదుగురు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకులు కుమార్ విశ్వాస్, అశుతోష్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, దీపక్ వాజపేయిలపై జైట్లీ రూ.10 కోట్లకు వ్యక్తిగత హోదాలో డిసెంబర్ 21న పరువునష్టం దావా వేశారు. ఇందుకోసం ఆయన స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. ఇక డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నిధుల దుర్వినియోగంపై అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీల మధ్య మాటల యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే. -
'కేసుకు భయపడేది లేదు.. పోరాటం సాగిస్తాం'
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. అరుణ్ జైట్లీ కోర్టు కేసుకు తాము భయపడబోమని, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. డీడీసీఏలో అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు ఏర్పాటు చేసిన విచారణ సంఘానికి సహకరించి జైట్లీ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని కేజ్రీవాల్ సూచించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో పాటు పలువురు ఆప్ నేతలపై అరుణ్ జైట్లీ వ్యక్తిగత హోదాలో సోమవారం రూ.10 కోట్లకు ఢిల్లీ హైకోర్టులో పరువునష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ పైవిధంగా స్పందించారు. డీడీసీఏలో అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రమణ్యం నేతృత్వంలో విచారణ కమిషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఢిల్లీ రాష్ట్ర సర్కారు నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. డీడీసీఏ కుంభకోణం కేసులో జైట్లీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్, అరుణ్ జైట్లీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. -
రూ.10కోట్లకు పరువునష్టం దావా వేసిన జైట్లీ
న్యూఢిల్లీ : డీడీసీఏ రగడ చివరకు కోర్టు మెట్లు ఎక్కింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో పాటు పలువురు ఆప్ నేతలపై అరుణ్ జైట్లీ సోమవారం ఢిల్లీ హైకోర్టులో పరువునష్టం దావా వేశారు. తనతో పాటు తనకుటుంబ సభ్యులపై అసత్య ఆరోపణలు చేసిన కేజ్రీవాల్తో పాటు అయిదుగురు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకులు కుమార్ విశ్వాస్, అశుతోష్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, దీపక్ వాజపేయిలపై జైట్లీ రూ.10 కోట్లకు వ్యక్తిగత హోదాలో పరువునష్టం దావా దాఖలు చేశారు. డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నిధుల దుర్వినియోగంపై అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీల మధ్య మాటల యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే. అలాగే ఇదే అంశంపై ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు పాటియాల కోర్టులో అరుణ్ జైట్లీ క్రిమినల్ కేసు దాఖలు చేయనున్నారు. మరోవైపు డీడీసీఏలో అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో విచారణ కమిషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఢిల్లీ రాష్ట్ర సర్కారు నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. -
కేజ్రీపై జైట్లీ పరువునష్టం దావా!
ఢిల్లీ హైకోర్టులో నేడు దాఖలు న్యూఢిల్లీ: ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)లో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆప్ నేతలు తనపై చేస్తున్న ఆరోపణలతో కేంద్రమంత్రి అరుణ్జైట్లీ చట్టపరంగా స్పందించారు. కేజ్రీవాల్, ఆప్ నేతలు కుమార్ బిశ్వాస్, సంజయ్సింగ్, రాఘవ్ చద్దా, దీపక్ వాజ్పేయిలపై నేడు ఢిల్లీ హైకోర్టులో పరువునష్టం దావా వేయనున్నారు. పాటియాలా హౌస్ కోర్టులో క్రిమినల్ కేసు వేయనున్నారు. కాగా, డీడీసీఏలో అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో విచారణ కమిషన్ను ఏర్పాటుచేస్తున్నట్లు ఢిల్లీ రాష్ట్ర సర్కారు ఆదివారం ప్రకటించింది. జైట్లీలాంటి వారికి భయపడమని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. డీడీసీఏలో అవకతవకలపై ఈడీ, డీఆర్ఐ దర్యాప్తు జరిపించాలని మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్ డిమాండ్ చేశారు. అక్రమాలకు సంబంధించి 2011-12 నాటి ఏజీఎం వీడియో ఫుటేజ్ను ఆయన ఆదివారమిక్కడ విడుదల చేశారు. వీడియోలో అక్రమాలకు సంబంధించి ఆయన డీడీసీఏ అధికారులను నిలదీయడం.. అధ్యక్ష స్థానంలో కూర్చున్న జైట్లీ అధికారులను వెనకేసుకురావడం కనిపించింది. ఆప్ ఆరోపణల నేపథ్యంలో జైట్లీకి పలువురు భారత క్రికెటర్లు మద్దతుగా నిలిచారు. టాప్ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, ఇషాంత్ శర్మ పూర్తి మద్దతు ప్రకటించారు. గంభీర్ స్పందిస్తూ.. జైట్లీ డీడీసీఏ అధ్యక్షునిగా ఉన్న సమయంలో క్రికెట్కు మేలు జరిగిందని చెప్పారు. -
కేజ్రీవాల్ దుమారం
అరుణ్ జైట్లీ తప్పుకో: పార్లమెంటులో కాంగ్రెస్, ఆప్, టీఎంసీ డిమాండ్ న్యూఢిల్లీ: ఢిల్లీలో సీఎం కార్యాలయంపై సీబీఐ దాడుల దుమారం గురువారమూ కొనసాగింది. డీడీసీఏ ఫైలు కోసమే ఢిల్లీ సీఎంవోపై సీబీఐ దాడులు జరిగాయని సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. కాగా, డీడీసీఏలో నిధుల అవకతవకల కేసులో జైట్లీ రాజీనామా చేయాలంటూ.. ఆప్, కాంగ్రెస్ పార్లమెంటులో నిరసన చేపట్టాయి. ఈ కేసులో అవినీతి జరిగినట్లు ఢిల్లీ ప్రభుత్వం గుర్తించినందున జైట్లీ పదవినుంచి తప్పుకోవాలని డిమాండ్చేశాయి. డీడీసీఏ వివాదంలో విచారణకోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆప్ కూడా పార్లమెంటు లోపలా బయటా మోదీ సర్కారుపై విమర్శలు చేసింది. అటు, తృణమూల్ కాంగ్రెస్.. ఆప్ ఆందోళనకు మద్దతు పలికింది. మోదీ పాలనతో సీబీఐ, జీబీఐ (గుజరాత్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)గా మారిందని టీఎంసీ పక్షనేత సుదీప్ బందోపాధ్యాయ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం తీరుకు నిరసనగా టీఎంసీ సభనుంచి వాకౌట్ చేసింది. అయితే సీబీఐ.. ఢిల్లీ సీఎంవో దాడి చేయలేదని మంత్రి వెంకయ్య తెలిపారు. ‘ఏ ముఖ్యమంత్రైనా నోటికి వచ్చినట్లు మాట్లాడతారా? ఆయన (కేజ్రీవాల్) రాజకీయాల్లోకి కొత్తగా వచ్చారు’ అన్నారు. అయితే.. విపక్షాలు లేవనెత్తుతున్న అస్పష్టమైన అంశాలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని.. అవినీతి చర్చను పక్కదారి పట్టించేందుకే ఆప్, కాంగ్రెస్ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని జైట్లీ అన్నారు. గురువారం కేజ్రీవాల్ ముఖ్య కార్యదర్శి రాజేంద్ర కుమార్ను సీబీఐ 9 గంటలపాటు ప్రశ్నించింది. డీడీసీఏ ఫైలు కోసమే..: కేజ్రీవాల్ డీడీసీఏ కేసుతోపాటు ఢిల్లీ కేబినెట్ నిర్ణయాలకు సంబంధించిన పలు ఫైళ్లనూ అధికారులు సీజ్ చేశారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. సీఎంవోపై సీబీఐ దాడులు జరగలేదని వ్యాఖ్యానించిన జైట్లీ పార్లమెంటును తప్పుదోవ పట్టించారని విమర్శించారు. ‘ నా కార్యాలయంలో సీబీఐ అధికారులు డీడీసీఏ ఫైలును చదివారు. నేను మీడియాలో ఈ విషయం చెప్పటంతో.. ఆ ఫైలును అక్కడే వదిలేశారు’ అని కేజ్రీవాల్ ఆరోపించారు. జైట్లీ ఆర్థిక మంత్రి సీట్లో ఉంటే నిష్పాక్షిక విచారణ జరగదని అందుకే ఆయన పదవినుంచి తప్పుకోవాలన్నారు. ఆప్ ఎంపీకి నీళ్లిచ్చిన ప్రధాని జైట్లీ రాజీనామా చేయాలంటూ లోక్సభ వెల్లో ఆందోళన చేస్తున్న సమయంలో ఆప్ ఎంపీ భగవంత్ మన్కు నిరసం వచ్చింది. ఈ సమయంలో ఆయన నీళ్ల కోసం లోక్సభ సెక్రటేరియట్ అధికారుల బెంచీలపై నీటికోసం చూశారు. దీన్ని గుర్తించిన ప్రధాని మోదీ.. చిరునవ్వుతో తన టేబుల్పై ఉన్న నీటిని ఆప్ ఎంపీకి ఇచ్చారు. నీళ్లు తాగిన ఎంపీ.. చిరునవ్వుతో ఆ గ్లాసును టేబుల్పై పెట్టి ప్రధాని ముఖంలోకి చూస్తూ నవ్వారు. ఆ తర్వాత ఎంపీ వెల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలుచేశారు. -
ఢిల్లీ కూల్చివేతలకు రాజకీయరంగు
శిశువు మృతిపై కేసు నమోదు షకూర్ బస్తీ ఘటనపై కేంద్రం, రాహుల్పై ఆప్ సర్కారు ధ్వజం న్యూఢిల్లీ: ఢిల్లీలోని షకూర్ బస్తీలో రైల్వే ట్రాకుల పక్కన రెండు రోజుల కిందట ఆక్రమణలు తొలగిస్తుండగా ఓ శిశువు మృతిచెందిన సంఘటన రాజకీయ దుమారం సృష్టిస్తోంది. మృతిపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అంశంపై ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ సర్కారు.. కేంద్రంతోపాటు అటు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ధ్వజమెత్తింది. ఈ ఘటనకు కేజ్రీవాల్ , మోదీ సర్కార్లదే బాధ్యతని, అవి బాధితులకు పునరావాసం కల్పించకుండా పరస్పర విమర్శలకు దిగుతున్నాయని రాహుల్ ట్వీటర్లో పేర్కొన్నారు. అంతకు ముందు ఆయన సంఘటన స్థలాన్ని సందర్శించారు. కాగా రాహుల్ ఇంకా పిల్లాడిలాగే వ్యవహరిస్తున్నారని, రైల్వేలు కేంద్రం పరిధిలోకి వస్తాయన్న విషయం ఆయనకు తెలియదా? అని సీఎం కేజ్రీవాల్ ప్రశ్నించారు. పాప మృతిపై ఆప్ సర్కారు న్యాయవిచారణకు ఆదేశించింది. కేజ్రీవాల్, రైల్వేమంత్రి సురేశ్ ప్రభును కలిశారు. పునరావాసం కల్పించకుండా ఢిల్లీలో ఇకపై మురికి వాడల తొలగింపు ఉండదని కేజ్రీ మీడియాతో అన్నారు. మరోపక్క.. ఛాతీపై తీవ్రగాయాలు, పక్కటెముకలు విరగడం వంటి కారణాలతో ఆరు నెలల శిశువు మృతిచెందినట్లు పోస్టుమార్టం నివేదిక పేర్కొంది. బస్తీలో ఆక్రమణల తొలగింపు ప్రారంభించడానికి రెండు గంటల ముందే ఆ శిశువు మృతిచెందినట్టు ప్రభు లోక్సభకు చెప్పారు. అధికారుల చర్యవల్లే తమ పాప మృతిచెందిందని తల్లిదండ్రులు అంటున్నారు. ఇల్లు ఖాళీ చేసే హడావుడిలో బట్టలమూట పాపపై పడడంతో మృతిచెందినట్లు పాప తండ్రి పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. కూల్చివేత విషయంలో రైల్వే శాఖపై, పోలీసులపై ఢిల్లీ హైకోర్టు మండిపడింది. గూడు కోల్పోయిన 5 వేల మందికి వెంటనే పునరావాసం కల్పించాలని అధికారులను ఆదేశించింది. -
ప్రధాని జీతమూ పెరగాల్సిందే!: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర ఎమ్మెల్యేల వేతనాల పెంపును సీఎం కేజ్రీవాల్ సమర్థించుకున్నారు. ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడకుండా వేతనాలు పెంచామన్నారు. ‘ప్రధానికన్నా ఎమ్మెల్యేలకు ఎక్కువ వేతనం ఉందని పత్రికలో చూశాను. ప్రధాని జీతం రూ.లక్ష కన్నా తక్కువ ఉంటే.. ఆయన జీతమూ పెంచాల్సిందే’ అని శనివారం హిందుస్తాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో అన్నారు. ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు జనవరి 1నుంచి అమల్లోకి తెద్దామనుకున్న చైనా తరహా (సరి-బేసి వాహనాలను ఒకరోజు మార్చి ఒకరోజు వాడటం) పథకం అమలులో ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే.. ఆపేస్తామన్నారు. -
భారత్-పాక్ ఐక్యతకు చిహ్నానివి
‘భారత పుత్రిక’ గీతతో రాష్ట్రపతి ప్రణబ్ న్యూఢిల్లీ: ‘భారత పుత్రిక’ గీత (23) మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను వేర్వేరుగా కలుసుకుంది. ఈది ఫౌండేషన్ ప్రతినిధులతో కలసి రాష్ట్రపతి భవన్కు చేరుకున్న గీతను ప్రణబ్ ఆశీర్వదించారు. ఆమెను భారత్-పాక్ పుత్రికగా, ఇరు దేశాల ఐక్యతకు చిహ్నంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ఈది ఫౌండేషన్ చేస్తున్న మంచిపనులను ఆయన అభినందించారు. కాగా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఆయన నివాసంలో గీత అంతకుముందు కలుసుకోగా అన్ని రకాలుగా ఆమెకు అవసరమైన సాయం చేస్తానని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. సంజ్ఞల భాష దుబాసీ సాయంతో కేజ్రీవాల్ గీతతో సుమారు 20 నిమిషాలు మాట్లాడారు. మరోవైపు గీత తల్లిదండ్రులం తామేనంటూ యూపీలోని రాంపూర్కు చెందిన అనారాదేవి, రామ్రాజ్లు గీతను కలుసుకునేందుకు సిద్ధమవుతున్నారు. తమ వద్ద ఆధారాలు ఉన్నాయని...డీఎన్ఏ పరీక్షకు సైతం తాము సిద్ధమని అనారాదేవి తెలిపింది. కాగా, గీతను అధికారులు మంగళవారం ఇండోర్లోని బధిరుల సంరక్షణ కేంద్రానికి తరలించారు. తన అసలైన తల్లిదండ్రులెవరో తేలేవరకు ఆమె అక్కడే ఉండనుంది. రూ. కోటి విరాళాన్ని తిరస్కరించిన ఈది ఫౌండేషన్: గీత బాగోగులు చూసుకున్నందుకు భారత ప్రధాని మోదీ ప్రకటించిన రూ. కోటి విరాళాన్ని పాక్ స్వచ్ఛంద సంస్థ ఈది ఫౌండేషన్ మంగళవారం తిరస్కరించింది. మోదీ ప్రకటనపట్ల ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అబ్దుల్ సత్తార్ ఈది కృతజ్ఞత తెలుపుతూనే ఆర్థికసాయాన్ని సున్నితంగా తిరస్కరించారని సంస్థ ప్రతినిధి అన్వర్ తెలిపారు. -
మైనర్లయినా మరణశిక్ష వేయాల్సిందే: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: అత్యాచారానికి పాల్పడిన వారు 15 ఏళ్ల బాలురైనా మరణ శిక్ష విధించాల్సిందేనని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. మహిళా భద్రతపై సోమవారం జరిగిన కేబినెట్ భేటీలో చర్చించిన అనంతరం ఈ ప్రకటన చేశారు. అత్యాచారం వంటి హేయమైన నేరాలకు పాల్పడిన 15 ఏళ్లు పైబడిన వారికి మరణ శిక్షగాని, జీవిత ఖైదు గాని విధించాలని కేజ్రీవాల్ అన్నారు. గత వారం ఢిల్లీలో 24 గంటల వ్యవధిలో రెండున్నరేళ్లు, ఐదేళ్ల వయసుగల ఇద్దరు బాలికలు అత్యాచారానికి గురయ్యారని, దీనికి సంబంధించి దాదాపు 17 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలురను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. -
ఢిల్లీ ఆహార మంత్రిపై వేటు
అవినీతి ఆరోపణలపై అసీమ్ను తప్పించిన కేజ్రీ బిల్డర్ నుంచి రూ. 6 లక్షల లంచం తీసుకున్నట్లు ఆరోపణ సాక్షి, న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలపై ఢిల్లీ ఆహార-పౌరసరఫరాలు, పర్యావరణ మంత్రి అసీమ్ అహ్మద్ ఖాన్ను సీఎం కేజ్రీవాల్ శుక్రవారం మంత్రి పదవి నుంచి తప్పించారు. ఒక బిల్డర్ నుంచి అసీమ్ రూ. 6 లక్షలు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నట్లు హడావుడిగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెలిపారు. ఈ ఉదంతంపై దర్యాప్తు జరపాలని సీబీఐని కోరామన్నారు. అసీమ్ స్థానంలో తొలిదఫా ఎమ్మెల్యే అయిన ఇమ్రాన్ హుసేన్ను నియమించినట్లు వెల్లడించారు. ‘ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిని ఉపేక్షించదు. అవినీతిపరుడైతే మంత్రి అయినా, నా కొడుకైనా, ఎవరైనా సరే సహించం. సిసోడియా(డిప్యూటీ సీఎం)అవినీతికి పాల్పడితే చర్య తీసుకుంటా. నేను అవినీతికి పాల్పడితే సిసోడియా చర్య తీసుకుంటారు’ అని స్పష్ట ంచేశారు. ‘అవినీతి ఆరోపణలపై ఒక మంత్రిని ఎవరూ కోరకుండానే తప్పించడం ఇదే తొలిసారి. అసీమ్పై గురువారం రాత్రి ఫిర్యాదు అందింది. బిల్డర్, అసీమ్, దళారి మధ్య జరిగినట్లు పేర్కొంటున్న ఆడియో టేపును ఫిర్యాదుదారు అందించారు. నేను, సిసోడియా దాన్ని విని ఆరోపణలు బలంగా ఉన్నాయని తేల్చాక ఈ నిర్ణయం తీసుకున్నాం. అవినీతి ఆరోపణలున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్ సీఎంలపై బీజేపీ మాలాగే చర్య తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. ఆడియో టేపులో కొంత భాగాన్ని సీఎం విలేకర్ల సమావేశంలో వినిపించారు. తననియోజకవర్గమైన మతియా మహల్లో బిల్డర్ చేపడుతున్న భవన నిర్మాణాన్ని అసీమ్ అడ్డుకున్నారని, రూ. 6 లక్షలు చెల్లించాక అనుమతించారని ఆ టేపులో ఉంది. శుక్రవారం ఉదయం కేజ్రీవాల్.. అసీమ్ను పిలిపించి టేప్ విషయం చెప్పాక, అసీమ్ తప్పు ఒప్పుకున్నారని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. కాగా, తనపై విపక్షం భారీ కుట్రపన్నిందని, ఆ కుట్రను శనివారం బయటపెడతానని అసీమ్ చెప్పారు. విచారణ పెండింగ్లో ఉంది కనుక రాజీనామా చేయాలని పార్టీ చెప్పడంతో రాజీనామా చేశానన్నారు. కాగా, మంత్రి తొలగింపు.. తాను నిజాయితీపరుణ్నని చెప్పుకోవడానికి కేజ్రీవాల్ చేసిన యత్నమని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ మాకెన్ ఆరోపించారు. నకిలీ డిగ్రీ కేసులో ఢిల్లీ న్యాయమంత్రి జితేందర్సింగ్ తోమర్ జూన్లో రాజీనామా చేయడం తెలిసిందే. -
టూరిజం హబ్గా ఢిల్లీ: సీఎం
న్యూఢిల్లీ : అంతర్జాతీయ నగరాల మాదిరిగానే ఢిల్లీని కూడా టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. జనక్పురిలోని దిల్లీ హాట్లో శుక్రవారం ఏర్పాటుచేసిన వార్షిక మామిడిపండ్ల ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా అనేక ఉత్సవాలు జరుపుకుంటుంటామని, వాటిని తిలకించేందుకు అనేకమంది వస్తుంటారని, ఇది పర్యాటక రంగ వికాసానికి దోహదం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి మనీష్సిసోడియా, న్యాయశాఖ మంత్రి కపిల్ మిశ్రా హాజరైనప్పటికీ ప్రారంభానికి ముందు ధూళి తుపాను రావడంతో వారు కుప్పకూలిపోయారు. దీంతో వారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించలేకపోయారు. కాగా సందర్శకుల కోసం నిర్వాహకులు లంగ్రా, చౌసా, రతౌల్, రాంకేలా, కేసర్, మల్లిక, ఆమ్రాపాలి తదితర రకాల మామిడి పండ్లను అందుబాటులో ఉంచారు. -
నియంతృత్వ పాలనకు కేంద్రం కుట్ర: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)కి మరిన్ని అధికారాలు కల్పిస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్.. దేశాన్ని నియంతృత్వం దిశగా తీసుకెళ్లేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నంలో భాగమని మోదీ సర్కారుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. ఈ విషయంలో కేంద్రంతో సుదీర్ఘ పోరుకు సిద్ధమన్నారు. 2 రోజుల ప్రత్యేక సమావేశాల్లో భాగంగా రెండోరోజు బుధవారం సమావేశమైన ఢిల్లీ అసెంబ్లీలో ఆయన ప్రసంగించారు. ‘దేశాన్ని నియంతృత్వం దిశగా తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఇప్పుడు ఢిల్లీలో, తర్వాత ఒకటొకటిగా బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో దీన్ని అమలుచేస్తారు. కేంద్రానికి వ్యతిరేకంగా బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలన్నీ కలిసిరావాలి’ అని కోరారు. కాగా కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్పై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. -
రాష్ట్రపతి దగ్గరకు చేరిన పంచాయితీ
రాష్ట్రపతితో నజీబ్జంగ్, కేజ్రీవాల్ భేటీ ఒకరిపై ఒకరు ఆరోపణలు; రాజ్నాథ్తోనూ జంగ్ మంతనాలు అటార్నీ జనరల్ అభిప్రాయం కోరిన హోంశాఖ న్యూఢిల్లీ: ఢిల్లీ ‘లొల్లి’ రాష్ట్రపతి దగ్గరకు చేరింది. ఢిల్లీ ప్రభుత్వాధినేతలు లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) నజీబ్జంగ్, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ల మధ్య ఐదు రోజులుగా సాగుతున్న ప్రత్యక్ష పోరు.. పరిష్కారం కోసం రాష్ట్రపతి కోర్టుకు చేరుకుంది. మంగళవారం మధ్యాహ్నం నజీబ్ జంగ్.. సాయంత్రం కేజ్రీవాల్ ఒకరి తరువాత ఒకరుగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఎవరి వాదనలు వారు వినిపించారు. కేజ్రీవాల్ రాష్ట్రపతిని కలవటానికి కొద్ది గంటలు ముందుగా ఎల్జీ.. ప్రణబ్ను కలసి జరుగుతున్న ఘర్షణ నేపథ్యాన్ని వివరించారు. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ శకుంతలా గామ్లిన్ను నియమించటం, తదనంతర పరిణామాలను చర్చించారు. అంతకుముందు ఆయన కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్తోనూ 15 నిమిషాలు భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిని బేఖాతరు చేసి తాను తీసుకున్న నిర్ణయాలను జంగ్ సమర్థించుకున్నట్లు సమాచారం. సాయంత్రం కేజ్రీవాల్.. ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాతో కలసి రాష్ట్రపతితో సమావేశమయ్యారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఎల్జీ బేఖాతరు చేస్తున్నారని ప్రణబ్కు ఫిర్యాదు చేశామని సమావేశం తర్వాత సిసోడియా విలేకరులకు తెలిపారు. తనను సంప్రదించకుండానే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిని నియమించారని అన్నారు. కార్యదర్శుల నియామకాల్లోనూ ఎల్జీ జోక్యం మితిమీరిందని ఆయన ఆరోపించారు. ఎల్జీ తీసుకున్న ఏ నిర్ణయం కూడా రాజ్యాంగబద్ధం కాదని రాష్ట్రపతికి తెలిపినట్లు చెప్పారు. తన ఆదేశాలు వినకుంటే బదిలీ చేస్తానంటూ ఎల్జీ బెదిరిస్తున్నారని సీఎం కేజ్రీవాల్ తెలిపారన్నారు. రాష్ట్రపతి పాలన ఉన్న సమయంలో వ్యవహరించినట్లుగా ఎల్జీ వ్యవహరిస్తున్నారన్నారు. ఆప్ ఎజెండాలో పరిపాలన లేదు: జైట్లీ లెఫ్టినెంట్ గవర్నర్తో ఆప్ సర్కారు ఘర్షణతో ఢిల్లీలో పరిపాలన స్తంభించిందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఆప్ రాజకీయ ఎజెండాలో పరిపాలన అన్నది లేదని విమర్శించారు. కొత్త పార్టీకి అత్యధిక మెజారిటీ ఇచ్చి ప్రజలు ప్రయోగం చేశారని.. కానీ అది భారీ మూల్యానికి దారి తీస్తోందని అన్నారు. గవర్నర్తో సంబంధం లేకుండానే నిర్ణయాలు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ జంగ్ నుంచి కానీ, ఆయన కార్యాలయం నుంచి కానీ మౌఖికంగా, రాత పూర్వకంగా ఎలాంటి ఆదేశాలు వచ్చినా, వాటిని వెంటనే అమలు చేయవద్దని ఆప్ సర్కారు ఉన్నతాధికారులందరికీ ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ వైపు నుంచి వచ్చే ప్రతీ ఆదేశాన్నీ, తప్పనిసరిగా ముఖ్యమంత్రికి కానీ, సంబంధిత శాఖ మంత్రికి కానీ తెలియజేశాకే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. జంగ్తో కేజ్రీవాల్ లడాయీ ఇంతటితో ఆగలేదు. సర్వీసుల ముఖ్య కార్యదర్శిగా తాను నియమించిన రాజేంద్రకుమార్ ద్వారా మరో ముఖ్యకార్యదర్శి నియామకపు ఉత్తర్వులను కేజ్రీవాల్ జారీ చేయించారు. సాధారణ పరిపాలనా విభాగపు ముఖ్యకార్యదర్శిగా అరవింద్ రేను నియమిస్తూ జీవో విడుదల చేశారు. అసలు రాజేంద్ర కుమార్ నియామకమే చెల్లదని ఎల్జీ వాదిస్తుంటే ఆయనతోనే మరో కార్యదర్శిని నియమింపజేయటం గమనార్హం. నేడు రాష్ట్రపతితో రాజ్నాథ్ భేటీ! ప్రతిష్టంభనను తొలగించటానికి బుధవారం రాజ్నాథ్ సింగ్ రాష్ట్రపతితో భేటీ కానున్నట్లు సమాచారం. ఢిల్లీ ప్రభుత్వం కేంద్ర హోం శాఖ పరిపాలనా నియంత్రణలో ఉండటంతో సమస్యకు పరిష్కారాన్ని చూపాల్సిన బాధ్యత హోంమంత్రిపైనే ఉంది. కాగా, ఎల్జీ-నగర ప్రభుత్వానికి ఉన్న బాధ్యతలు, విధులపై అభిప్రాయం చెప్పాలని అటార్నీ జనరల్ను హోం శాఖ కోరింది. అధికారుల నియామకాలు, బదిలీలకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వంలో తనకున్న అధికారాలపై న్యాయనిపుణులతో జంగ్ సంప్రదింపులు జరిపారు. గత శుక్రవారం శకుంతలా గామ్లిన్ను తాత్కాలిక ప్రధానకార్యదర్శిగా నియమించటంతో కేజ్రీవాల్కు, ఎల్జీకీ మధ్య ఘర్షణ నెలకొనడం తెలిసిందే. బెంబేలెత్తుతున్న ఐఏఎస్లు కేజ్రీవాల్, జంగ్ల ఘర్షణతో ఐఏఎస్లు బెంబేలెత్తుతున్నారు. దాదాపు 20 మంది కేంద్రపాలిత ప్రాంత కేడర్ ఐఏఎస్ అధికారులు తమను ఢిల్లీ నుంచి మరెక్కడికైనా బదిలీ చేయాల్సిందిగా కేంద్ర హోం శాఖను సంప్రదించినట్లు సమాచారం. అధికారికంగా ఎవరూ వెల్లడించకపోయినప్పటికీ, తాత్కాలిక ప్రధానకార్యదర్శిగా గామ్లిన్ను నియమించినప్పటి నుంచీ ఐఏఎస్లు ఇద్దరు రాజ్యాంగాధిపతుల మధ్య నలిగిపోతున్నారు. మరోవైపు ఢిల్లీ ప్రభుత్వంలోని సీనియర్ అధికారులతో ఆప్ ప్రభుత్వం బుధవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఆప్ సర్కారుకు లాయర్ల సమర్థన ఎల్జీ నజీబ్ జంగ్, సీఎం కేజ్రీవాల్ మధ్య కొనసాగుతున్న ఘర్షణపై సుప్రీం కోర్టు సీనియర్ లాయర్లు స్పందించారు. ప్రముఖ న్యాయవాదులు రాజీవ్ ధావన్, ఇందిరా జైసింగ్లు ఈ విషయంపై మాట్లాడుతూ ఉన్నతాధికారుల నియామకాలకు సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్కు స్వతంత్ర అధికారాలు లేవని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరుండాలో ఎంచుకునే సంపూర్ణ హక్కులు ముఖ్యమంత్రికి ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ వివాదాన్ని లెఫ్టినెంట్ గవర్నరే సృష్టించారని ఆయన విమర్శించారు. ప్రధాన కార్యదర్శి సెలవుపై వెళ్లి 40 గంటలైనా తాత్కాలిక ప్రధానకార్యదర్శిని నియమించలేదన్న కారణంతో లెఫ్టినెంట్ గవర్నర్ తానే నియామకానికి పూనుకోవటం సరి కాదని అన్నారు. -
రైతు గజేంద్ర సింగ్కు స్మారకం
- నిర్ణయించిన ఆప్ ప్రభుత్వం - రైతుల సమస్యలపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ఆలోచింపజేశారు - ఆయన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం - ప్రకటించిన సీఎం కేజ్రీవాల్ - పంట నష్ట పరిహారం ఎకరాకు రూ. 20 వేలు చెల్లింపు న్యూఢిల్లీ: గత నెలలో జంతర్ మంతర్ వద్ద ఆమ్ఆద్మీ పార్టీ నిర్వహించిన ర్యాలీలో ఆత్మహత్య చేసుకున్న రైతు గజేంద్ర సింగ్ జ్ఞాపకార్థం స్మారకం నిర్మించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ శుక్రవారం వెల్లడించారు. ఔటర్ ఢిల్లీలోని బవానా ప్రాంతంలో అకాల వర్షాల కారణంగా పంటలను నష్టపోయిన రైతులకు ఆయన పరిహార చెక్కులను అందించారు. అనంతరం మాట్లాడుతూ రైతుల సమస్యలపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆలోచించేలా చేసేందుకు గజేంద్ర తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు. అందుకే ఆయన జ్ఞాపకార్థం త్వరలో మెమోరియల్ నిర్మిస్తామని తెలిపారు. ఆయన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. ఆ రోజు ఘటనలో తమ తప్పేమీలేదని పునరుద్ఘాటించారు. ‘సభా వేదికకు చెట్టు చాలా దూరంలో ఉంది. అక్కడ ఏం జరుగుతుందో చూసేందుకు వీలు లేదు’ అని తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం రైతులకు ఇచ్చే పరిహార పథకానికి ‘గజేంద్ర సింగ్ కిసాన్ సహాయతా యోజనా’గా పేరు నిర్ణయించినట్లు చెప్పారు. ప్రకృతి విపత్తుల కారణంగా పంట నష్టం జరిగే రైతులకు సహాయం చేయడానికి చొరవ చూపాలని కేంద్ర, అన్ని రాష్ర్ట ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. గరిష్ట నష్ట పరిహారం రూ. 20 వేలు: అకాల వర్షాల కారణంగా 70 శాతానికి పైగా పంట నష్టం జరిగిన వారికి ఎకరాకు రూ. 20 వేలు, అంతకంటే తక్కువ నష్టం జరిగిన వారికి రూ. 14 వేలు పరిహారం ఇస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. పరిహారం విషయంలో అధికారులకు, రైతులకు ఏమైనా వివాదాలు వస్తే దగ్గరలోని గ్రామ సభలో పరిష్కారం చేసుకోవాలని ఓ ప్రభుత్వాధికారి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న పరిహారం చాలా ఎక్కువని కేజ్రీవాల్ తెలిపారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు రూ. 100 చెక్కులను ఇచ్చాయని, ఆప్ ప్రభుత్వం అత్యధికంగా రూ. 20వేలు చెల్లించిందన్నారు. -
‘వరుణ’ బాధిత రైతులకు సర్కారు సాయం
♦ త్వరలోనే ప్రకటిస్తామన్న సీఎం కేజ్రీవాల్ ♦ రైతులకు భరోసా ఇవ్వాలని సూచన ♦ వెంటనే తోడ్పాటు అందిచాలి: మాకెన్ న్యూఢిల్లీ: అకాల వర్షాలకు కుదేలైన రైతులకు ఢిల్లీ సర్కార్ ఊరటనిచ్చే ప్రకటన చేసింది. ‘అనుకోని వడగళ్ల వానలతో పంటలు కోల్పోయిన బాధిత రైతులకు ప్రభుత్వం అతి త్వరలోనే ఉపశమన ప్యాకేజీ ప్రకటిస్తుంది.’ అని ఢిల్లీ ముఖ్య మంత్రి అర్వింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఢిల్లీలోని గ్రామ నియోజకవర్గాలైన మాటియాలా, నజాఫ్ఘర్, ముంద్కా, నరేలా ఎమ్మెల్యేలతో శుక్రవారం భేటీ అయ్యారు. దేశ రాజధాని శివారుల్లో ఉండే తమ నియోజకవర్గాలే వర్షాల వల్ల సష్టపోయాయని సీఎంకు ఎమ్మెల్యేలు వివరించారు. ప్రభుత్వం బాధిత రైతుల వెంట ఉందనే భరోసా ఇవ్వండని కేజ్రీవాల్ వారికి సూచించారు. ప్రభుత్వం త్వరలోనే బాధిత రైతులు నష్ట పరిహారం చెల్లించి అన్ని విధాలా ఆదుకుంటుందనే ధైర్యం ఇవ్వాలని పురమాయించారు. అకాల వర్షాల వల్ల వేల ఎకరాల పంట భూములు నాశనమయ్యాయని సీఎంకు నజాఫ్ఘర్ ఎమ్మెల్యే కైలాష్ గెహ్లాట్ వివరించారు. బాధితులందరినీ ఆదుకుంటామని కేజ్రీవాల్ భరోసా ఇచ్చారు. ప్రభావిత గ్రామాలను సందర్శించిన మాకెన్ వర్షాల ప్రభావిత మూడు గ్రామాలను ఇటీవల ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ మాకెన్ సందర్శించారు. బాధిత రైతులకు వెంటనే ప్రత్యేక తోడ్పాటు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
నీటి సమస్యకు సింగపూర్ మంత్రం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రజల నీటి కష్టాలను తీర్చడానికి ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వృథా నీటిని తిరిగి వాడుకునే విధానం అవలంభిస్తున్న సింగపూర్ను ఆదర్శంగా తీసుకోనుంది. వృథా నీటిని శుద్ధి చేసి తిరిగి ఉపయోగించే పద్ధతులను అధ్యయన ం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సోమవారం తెలిపారు. రాష్ట్రపతి భవన్లో సోమవారం జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవానికి కేజ్రీవాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడతూ వృథా నీటిని తిరిగి ఉపయోగించడంలో సింగపూర్ అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయడానికి కొన్ని బృందాలను పంపినట్టు తెలిపారు. ‘సింగపూర్కు స్వతహాగా నీటి వసతి లేదు. ఆ దేశానికి 95 శాతం నీరు బయటి నుంచే వస్తుంది. ఆ నీటిని శుద్ధి చేసి తిరిగి ఉపయోగించే నూతన పద్ధతులకు సింగపూర్ శ్రీకారం చుట్టింది. దీని వల్ల బాత్రూం, వంటగదిలో ఉపయోగించే నీరు తిరిగి అక్కడే ఉపయోగించొచ్చు. ఈ విధంగా ఎక్కడ వాడుకున్న నీటిని అక్కడే వినియోగించేలా సింగపూర్ పద్ధతిని పరిశీలిస్తున్నాం. దీనిని పెలైట్ ప్రాజెక్టుగా తీసుకుని ఢిల్లీలో 10 నుంచి 15 ప్లాంట్లు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నాం. ఈ పద్ధతిలో వ్యర్థ నీటిని శుద్ధి చేసిన ప్పుడు అది పూర్తిగా మంచి నీటిలాగే మారుతుంది. మా ప్రయత్నాలు ఫలిస్తే ఢిల్లీలో నీటి సమస్య అసలు ఉండదు’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. అలాగే ఢిల్లీలో ఇప్పటికీ కేవలం 30 నుంచి 40 శాతం మంది మాత్రమే ఆస్తి పన్ను చెల్లిస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని కేజ్రీవాల్ చెప్పారు. ఆస్తి పన్ను చెల్లింపులను రాబట్టడం గురించి కూడా యోచిస్తున్నామన్నారు. -
కార్పొరేషన్ల ఆర్థిక స్థితి దారుణం
న్యూఢిల్లీ: ఢిల్లీ కార్పొరేషన్ల ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, అయినా నిధుల కేటాయింపుల్లో భారీ కోత పెట్టిందని ఆప్ ప్రభుత్వంపై కాంగ్రెస్ మండిపడింది. నిధుల సమస్య గురించి మేయర్లు సీఎం కేజ్రీవాల్కు విన్నవించినా ఆయన పట్టించుకోవడంలేదని ఆరోపించింది. కాంగ్రెస్ హయాంలో అవసరమైన మేరకు నిధులు కేటాయించామని, ఏ అంశానికి కోత పెట్టలేదని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అజయ్ మాకెన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నిధులు కేటాయించకుండా ఆయా అంశాలపై రాజకీయం చేస్నున్నారని దుయ్యబట్టారు. ముగ్గురు మేయర్లతో సీఎం నిర్వహించిన సమావేశంలో ఉత్తర ఢిల్లీ కార్పొరేషన్కు రూ. 302 కోట్ల నిధులు ఇవ్వాలని సంబంధింత మేయర్ యోగేంద్ర చందోలియా విన్నవించినా సీఎం తోసిపుచ్చారని పేర్కొన్నారు. ఉద్యోగుల జీతాలు చెల్లించేందుకు రుణం ఇవ్వాలని కోరినా తిరస్కరించారని అజయ్ మాకెన్ తెలిపారు. ఈ విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రి సహాయం తీసుకుందామని యోగేంద్రతోపాటు ఇతరులు కూడా సీఎంకు విన్నవించారన్నారు. తూర్పు, ఉత్తర కార్పొరేషన్లు తమ ఉద్యోగులకు రెండు నెలలుగా జీతభత్యాలు చె ల్లించలేదని మాకెన్ గుర్తు చేశారు. అన్ని కార్పొరేషన్లు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ర్టంలోని ఆప్ ప్రభుత్వాలు ఒకరినొకరు నిందించుకుంటూ సమస్యలు పరిష్కరించడంలేదని ఆరోపించారు. తమ హయంలో కార్పొరేషన్లను ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేశామన్నారు. విద్య, పారిశుద్ధ్యం, వైద్యం, అనధికార కాలనీల అభివృద్ధి వంటి ముఖ్యమైన అంశాలకు విరివిగా నిధులు కేటాయించామని పేర్కొన్నారు. మురికివాడల్లో సౌకర్యాల కల్పనకు కూడా భారీగా నిధులిచ్చామన్నారు.