CS
-
సక్సెస్ని ఒడిసిపట్టడం అంటే ఇదే..!
'సక్సెస్' అంది అందనంత దూరంలో మిస్ అవ్వుతూ దోబుచులాడుతుంటే విసిగిపోతాం. మన వల్ల కాదని చేతులెత్తేస్తాం. కానీ ఈమె అలా చేయలేదు. చిన్నప్పటి నుంచి సక్సెని ఏదోలా అందుకున్నా..ఇప్పుడు ఈ సివిల్స్ ఎగ్జామ్(Civil Services Examination)లో ఇలా ఈ తడబాటు ఏంటనీ అనుకుంది. సక్సెస్ అంతు చేసేదాక వదలిపెట్టేదే లే అని భీష్మించింది. తాడోపేడో అన్నట్లు ఆహర్నిశలు కష్టపడింది. చివరికి విజయమే తలవంచి వొళ్లోకి వచ్చి వాలింది. ఫెయిల్యూర్స్తో ఆగిపోకూడదు ఓటమిని ఓడించేలా గెలిచితీరాలని చేతల్లో చూపించింది.. సివిల్స్లో గెలిచి మంచి ర్యాంకు సంపాదించుకోవాలనేది చాలామంది యువత కోరిక. ఆ క్రమంలో మాములు తడబాటులు రావు. ఒకనోకదశలో మన వల్ల కాదని చేతులెత్తేసే పరిస్థితి వచ్చేస్తుంది. దాన్ని తట్టుకుని ముందుకు సాగిన వారే విజయతీరాలను అందుకోగలరు. అలాంటి గొప్ప సక్సెనే అందుకుంది నీపా మనోచ(Neepa Manocha). ఆమె విద్యా నేపథ్యం వచ్చేసి..2015లో ప్రసిద్ధ లేడీ శ్రీ రామ్ కాలేజ్, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రురాలైంది. ఇక 2017లో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఎకనామిక్స్లో మాస్టర్స్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ICSI) నిర్వహించే సెక్రటరీ (CS) ప్రొఫెషనల్ పరీక్షల్లో ఉత్తీర్ణురాలై స్టాక్ ఎక్స్ఛేంజ్ కంపెనీ సెక్రటరీ(CS)గా ఉద్యోగం సాధించింది. అయినా సంతృప్తి చెందాక ఇంకా ఏదో సాధించాలన్న ఉద్దేశ్యంతో ప్రతిష్టాత్మకమైన సివిల్స్ సర్వీస్కి ప్రిపేరయ్యింది. పగలు స్టాక్ ఎక్ఛ్సేంజ్ మార్కెట్లో కంపెనీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తూ.. రాత్రిళ్లు ప్రిపరేషన్ సాగించేది. అయితే సీఎస్లో వరించినట్లుగా సక్సెస్ని సులభంగా అందుకోలేకపోయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడుసార్లు ఫెయిలైంది. తన ఆత్మవిశ్వాసమే సన్నగిల్లిపోయేలా ఓటమిని ఎదుర్కొంది. లాభం లేదు ఈ ఎగ్జామ్ మన వల్ల కాదనే నైరాశ్యం తెప్పించేలా నిపాకి సివిల్స్ చుక్కలు చూపించింది. ఇక్కడ నిపా ఆ తడబాటుల్ని తరిమేసి సక్సెని అందుకునేదాక వెనక్కి తగ్గకూడదనే పట్టుదల, కసితో చదివింది. చివరికి ఆమె కష్టం ముందు ఓటమే తలవంచి..దోబులాచుడతున్న సక్సెస్ ఒడిసిపట్టింది. నాలుగో ప్రయత్నంలో 144వ ర్యాంకు సాధించి ఐపీఎస్ సాధించింది. అంతేగాదు నిపా గనుక వరుస ఓటములతో ఆగిపోతే ఎవ్వరికీ ఆమె గురించి తెలిసి ఉండేది కాదు. ఓ ఫెయ్యిల్యూర్ స్టోరీగా మిగిలిపోయేది. ఓటమే తలొగ్గాలి తప్పా తాను కాదనుకుంది కాబట్టే సివిల్స్లో నిపా నెగ్గింది. అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. వదలిపెట్టకుండా పలకరిస్తున్న ఓటమి అంతు చూడాలే తప్ప తగ్గొద్దని చాటి చెప్పింది. (చదవండి: డెంటిస్ట్ కాస్త ఐఏఎస్ అధికారిగా..! కానీ ఏడేళ్ల తర్వాత..) -
TG: ‘సీఎస్’ వస్తే ఎవరూ ఉండకూడదా? పోలీసులపై ఎమ్మెల్యే ఫైర్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో శుక్రవారం(నవంబర్22) ఎస్పీఎఫ్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సచివాలయంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సచివాలయం ఆరవ అంతస్తులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) శాంతకుమారి వస్తున్న సమయంలో వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.సీఎస్ శాంతకుమారి వస్తున్నారు పక్కకు ఉండాలని వనపర్తి ఎమ్మెల్యేకు పోలీసులు సూచించారు.తాను ఎమ్మెల్యేను అని చెప్పినా మేఘారెడ్డిని పోలీసులు పక్కన నిలబెట్టారు.సీఎస్ వస్తె ఫ్లోర్ అంతా ఎవ్వరూ ఉండకూడదా? అని ఈ సందర్భంగా పోలీసులను మేఘాారెడ్డి ఆగ్రహంగా ప్రశ్నించారు. ఎమ్మెల్యేను ఎస్పీఎఫ్ సిబ్బంది గుర్తుపట్టకపోవడవం వల్లే వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలను గుర్తు పట్టడం లేదని ఎస్పీఎఫ్పై పలు ఫిర్యాదులుండడం గమనార్హం. -
లగచర్ల ఘటన.. సీఎస్, డీజీపీలకు ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశాలు
సాక్షి, ఢిల్లీ: లగచర్ల ఫార్మా బాధితుల అరెస్టులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) స్పందించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. లగచర్ల ఘటనపై రెండు వారాల్లో సమగ్ర నివేదిక పంపాలని ఆదేశించింది. ఘటన తీవ్రత నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల సంఘం లా అండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లతో కూడిన జాయింట్ టీమ్ను లగచర్ల పంపాలని నిర్ణయించింది.వారం రోజుల్లో ఈ అంశంపై జాయింట్ టీం నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై పోలీసుల దాడిపై ఎన్హెచ్ఆర్సీ ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసుల భయంతో ఊరు విడిచి గ్రామస్తులు వెళ్లిపోవడం తీవ్రమైన విషయం అని ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. ఫార్మా కంపెనీ భూ నిర్వాసితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ.. ఈనెల 18న ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ‘ఫార్మా కంపెనీలకు భూములివ్వకుంటే కేసులు పెడతామంటున్నారు. జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు.ఢిల్లీలో న్యాయం జరుగుతుందని వచ్చామంటూ లగచర్ల బాధిత మహిళలు జాతీయ ఎస్సీ, ఎస్టీ, మహిళా, మానవ హక్కుల కమిషన్ల ముందు కన్నీళ్లతో మొరపెట్టుకున్నారు. బీఆర్ఎస్ నేతలు సత్యవతి రాథోడ్, మాలోత్ కవిత, కోవా లక్ష్మిలతో కలిసి ఆదివారం ఢిల్లీకి వచ్చిన మహిళలు.. ఆయా కమిషన్లను కలిశారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఇదీ చదవండి: మాగొంతులు పిసికారు.. కళ్లకు బట్టలు కట్టి కొట్టారు -
ఏపీ కొత్త సీఎస్గా నీరబ్కుమార్ ప్రసాద్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రస్తుత సీఎస్ జవహర్రెడ్డి బదిలీ అయ్యారు. 1987 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి నీరబ్కుమార్ ప్రసాద్.. ప్రస్తుతం అటవీ, పర్యావరణశాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. -
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణపై సీఎస్ సమీక్ష
-
AP : సమాచార హక్కు కొత్త కమిషనర్ల ప్రమాణం
విజయవాడ, 11 మార్చి: రాష్ట్ర సమాచార కమీషన్కు నియమించబడిన ముగ్గురు నూతన కమీషనర్లు చావలి సునీల్, రెహానా బేగం, అల్లారెడ్డి ఉదయ భాస్కర్ రెడ్డిలచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్. జవహర్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ మేరకు విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయంలో నూతన సమాచార కమీషనర్లచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార కమీషన్ ముఖ్య సమాచార కమీషనర్ మెహబూబ్ భాషా, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, సమాచార కమీషనర్లు ఐలాపురం రాజా, శామ్యూల్ జొనాతన్, కాకర్ల చెన్నారెడ్డి, సమాచార కమీషన్ లా సెక్రటరీ జీ. శ్రీనివాసులు, ప్రభుత్వ సలహాదారు నేమాని భాస్కర్, నూతన సమాచార కమీషనర్ల కుటుంబ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెహానా గురించి.. రెహానా స్వస్థలం కృష్ణా జిల్లా, ఉయ్యూరు. జర్నలిస్టుగా 20 ఏళ్ళ అనుభవం. జర్నలిజంలో పరిశోధనాత్మక కథనాలు, సాహసోపేత ప్రయాణాలతో ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు. హైదరాబాద్ పాతబస్తీలో మైనర్ బాలికలతో అరబ్ షేకుల కాంట్రాక్ట్ వివాహాలు, 2008 ముంబాయి మారణహోమం లైవ్ కవరేజ్, ఉత్తరాఖండ్ వరదల రిపోర్టింగ్, సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా ఉగ్రదాడి కవరేజ్ వంటివి వీటిలో కొన్ని.. దక్షిణాన తమిళనాడు మొదలు ఉత్తరాన జమ్ము-కాశ్మీర్, పశ్చిమాన గుజరాత్ మొదలు తూర్పున త్రిపుర వరకు 17 రాష్ట్రల నుంచి వివిధ అంశాలపై రిపోర్ట్ చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా రెండోసారి గెలిచినప్పుడు నరేంద్ర మోదీతో సహా వివిధ రాష్ట్రాలకు చెందిన 10 మంది ముఖ్యమంత్రుల ఇంటర్వ్యూలు రెహానా ఖాతాలో ఉన్నాయి. భారత భూభాగంలో భారత-పాక్, భారత-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ప్రయాణం చేసి ప్రత్యేక కథనాలు అందించారు. గత ఏడాది టర్కీలో జరిగిన భూకంప ప్రళయాన్ని సాహసోపేతంగా కవర్ చేశారు రెహాన. రెహానా రాసిన పుస్తకాలు అంతర్జాతీయ సరిహద్దుల్లో చేసిన పాత్రికేయ ప్రయాణ అనుభవాలతో "సరిహద్దుల్లో.." పేరుతో పుస్తకం తెచ్చారు. ఈ పుస్తకం "ఫ్రాంటియర్" పేరుతో ఇంగ్లీషులో అనువాదం అయ్యింది. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై రాసిన వ్యాసాల సంకలనాన్ని "పెన్ డ్రైవ్" పేరుతో వెలువరించారు. టర్కీ భూకంప కవరేజ్ అనుభవాలతో టర్కీ @7.8 టైటిల్ తో పుస్తకం తెచ్చారు. అవార్డులు-రివార్డులు.. తెలంగాణ ప్రభుత్వ బెస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అవార్డు, తెలంగాణా ప్రెస్ అకాడమీ అరుణ్ సాగర్ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు, వివిధ సంస్థల పురస్కారాలు, అవార్డులు ఆమె ఖాతాలో ఉన్నాయి. గత ఏడాది మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ మహిళా జర్నలిస్టు పురస్కారంతో సత్కరించింది. ఏపీ మీడియా అకాడమీ కూడా బెస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా పురస్కారం అందజేసింది. నిర్వర్తించిన ఇతర బాధ్యతలు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మీడియా అడ్వైజరీ కమిటీ సభ్యురాలు, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్, జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఏపీ అసెంబ్లీ మీడియా అడ్వైజరీ సభ్యురాలిగా, ఏపీ మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇవి చదవండి: మనబడి ‘ఐబీ’కి అనుకూలం! -
సందేశ్ఖాలీ ఘర్షణ.. వెస్ట్ బెంగాల్ సీఎస్, డీజీపీలకు ఊరట
న్యూఢిల్లీ: సందేశ్ఖాలీ ఘర్షణల అంశంలో తమ ముందు హాజరు కావాలని లోక్సభ ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన ఆదేశాల నుంచి పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ(సీఎస్), డీజీపీలకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. లోక్సభ ప్రివిలేజ్ కమిటీ ఆదేశాలపై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ సోమవారం స్టే ఇచ్చింది. పశ్చిమబెంగాల్ సందేశ్ఖాలీలో జరిగిన పరిణామాలపై ఆందోళన చేపట్టిన బీజేపీ ఎంపీలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీనిపై ఎంపీ సుకాంత మజుందార్ రాష్ట్ర సీఎస్, డీజీపీలపై లోక్సభ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన ప్రివిలేజ్ కమిటీ పశ్చిమ బెంగాల్ సీఎస్ భగవతి ప్రసాద్ గోపాలిక, డీజిపీ రాజీవ్కుమార్లను సోమవారం తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈ ఆదేశాలపై వారిద్దరూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ప్రివిలేజ్ కమిటీ దర్యాప్తుపై కోర్టు స్టే ఇచ్చింది. కాగా, టీఎంసీ నేత షాజహాన్షేక్, ఆయన అనుచరులు తమ భూములు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, తమ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ సందేశ్ఖాలీ ప్రాంత వాసులు ఇటీవల ఆందోళనలకు దిగారు. దీనిపై బీజేపీ ఎంపీలు సందేశ్ఖాలీకి వెళ్లి మహిళలను పరామర్శించడానికి యత్నంచినపుడు పోలీసులకు వారికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఎంపీ సుకాంత గాయాలపాలై ఆస్పత్రిలో చేరారు. ఈ ఉదంతంపై ఆయన లోక్సభ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఇదీ చదవండి.. ఈడీ విచారణకు కేజ్రీవాల్ ఆరో‘సారీ’ -
మహిళలు లేకపోతే పురుషులతో భర్తీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో హారిజాంటల్ రిజర్వేషన్ల అమలు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. మహిళలకు హారిజాంటల్ పద్ధతి (రోస్టర్ పాయింట్ల పట్టికలో ఎలాంటి ప్రత్యేకంగా ఎలాంటి మార్కింగ్ లేకుండా)లో 33 1/3 (33.3) శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయిస్తూ గతంలో జీఓ ఎంఎస్ 3ను జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఉద్యోగాల భర్తీ క్రమంలో నిర్దేశించిన పోస్టులకు సరైన అభ్యర్థులు లేనిపక్షంలో వాటిని క్యారీఫార్వర్డ్ చేసే పద్ధతి (ఖాళీని అలాగే ఉంచడం) ఇకపై ఉండబోదు. దీనికి అనుగుణంగా తెలంగాణ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్–1996 లోని రూల్ 22, 22ఏలో ప్రభుత్వం మార్పులు చేసింది. తాజా సవరణలో భాగంగా ప్రస్తుతం మహిళలకు 33.3 శాతం రిజర్వు చేస్తున్నప్పటికీ.. కమ్యూనిటీ రిజర్వేషన్ల కేటగిరీల్లో అర్హులైన మహిళా అభ్యర్థులు లేనప్పుడు ఆయా ఉద్యోగాలను పురుషులతో భర్తీ చేసే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జీఓఎంఎస్ 35 జారీ చేశారు. ఈ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని అన్ని ప్రభుత్వ శాఖలకు, ఉద్యోగ నియామక సంస్థలైన టీఎస్పీఎస్సీతో పా టు ఇతర బోర్డులకు పంపించారు. దీంతో ఏదైనా నోటిఫికేషన్లో నిర్దేశించిన అన్ని ఖాళీలను అదే సమయంలో తప్పనిసరిగా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ తదితర కేటగిరీల్లో ఉద్యోగాలకు అర్హులైన మహిళా అభ్యర్థులు లేని సందర్భంలో, అదే కమ్యూనిటీకి చెందిన పురుషులతో భర్తీ చేయ డం వల్ల పోస్టులు ఖాళీగా ఉండే పరిస్థితి ఉత్పన్నం కాదు. మహిళలకు నిర్దేశించిన పోస్టులు పురుషులతో భర్తీ చేస్తే... మహిళలకు దక్కాల్సిన 33.3% దక్కకుండా పోతాయనే అభిప్రాయం వ్యక్తమవు తోంది. నియామకాల ప్రక్రియలో దీర్ఘకాలికంగా ప రిస్థితిని పరిశీలిస్తే మహిళలకు అతి తక్కువ సంఖ్య లో పోస్టులు దక్కుతాయనే వాదన వినిపిస్తోంది. -
అసోం సీఎస్గా సిక్కోలు వాసి
శ్రీకాకుళం: సిక్కోలు వాసికి కీలక బాధ్యతలు అప్పజెప్పింది అసోం ప్రభుత్వం సంతబొమ్మాళి మండలం కోటపాడు గ్రామానికి చెందిన ఐఏఎస్ అధికారి కోత రవి అసోం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు విడుదల చేసింది. అస్సాం కేడర్ 1993 బ్యాచ్కు చెందిన రవి.. గతంలో అమెరికాలోని భారత రాయబార కార్యాలయంలో ఆర్థిక దౌత్యాధికారిగా పనిచేశారు. ప్రస్తుతం అస్సాం ప్రభుత్వంలో 18 శాఖలకు అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇటీవల ఉల్ఫా తీవ్రవాదులతో జరిగిన శాంతి ఒప్పందంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. రవి పనితీరును గుర్తించిన అసోం ప్రభుత్వం ఆయనకు కీలక పదవిని అప్పగించింది. ఈ నియామకంపై ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మార్చి నెలఖారులో రవి బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. -
రాష్ట్ర ప్రభుత్వ బాటలో కేంద్రం
సాక్షి, అమరావతి : అర్హులందరికీ నవరత్న పథకాలను సంతృప్త స్థాయిలో అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ బాటలోనే కేంద్రం పయనిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పథకాన్నీ అర్హతే ప్రామాణికంగా, వివక్షకు తావు లేకుండా సంతృప్త స్థాయిలో అందిస్తోంది. ఒక వేళ పొరపాటున అర్హులైన వారికి ఏ పథకం అయినా అందకపోయినా ఏడాదిలో రెండు సార్లు అలాంటి వారి కోసం అవకాశం కల్పింస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హులైన మిగిలిన వారు దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలన చేసి ఏడాదిలో రెండు సార్లు పథకాల ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పథకాలనూ దేశవ్యాప్తంగా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో అందించేందుకు దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 15న తొలుత దేశ వ్యాప్తంగా 110 గిరిజన జిల్లాల్లో ప్రారంభిస్తారు. మిగతా జిల్లాల్లో నవంబర్ మూడో వారం నుంచి ప్రారంభించనున్నారు. ఇటీవలే కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ సీఎస్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరారు. తగిన చర్యలు తీసుకోండి : సీఎస్ జవహర్రెడ్డి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్రెడ్డి శనివారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచారానికి రాష్ట్రంలో తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. యాత్ర సమన్వయం కోసం రాష్ట్ర స్థాయిలో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక సీఎస్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని, అలాగే సీఎస్ అధ్యక్షతన గ్రామ, వార్డు సచివాలయాల శాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్, వ్యవసాయ, మహిళా, శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జిల్లా స్థాయిలో సీనియర్ అధికారి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించారు. గ్రామ, పంచాయతీలు, గ్రామ, వార్డు సచివాలయాల కేంద్రంగా వికసిత్ యాత్ర ప్రచార కార్యక్రమం నిర్వహించేందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని సూచించారు. వారంలో 14 గ్రామ పంచాయతీలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ యాత్ర కొనసాగేలాగ ప్రణాళికను రూపొందించడంతో పాటు ఆ ప్రణాళికను కేంద్ర ప్రభుత్వ ఐటీ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శి, వార్డు కార్యదర్శిని నోడల్ అధికారిగా నియమించాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వమే ఆడియో, వీడియోతో కూడిన ఎల్ఈడీ స్క్రీన్ మొబైల్ వాహనాలతో పాటు ప్రచార సామగ్రి సరఫరా చేస్తుందని, వీటిని క్షేత్రస్థాయిలో చేరవేసేందుకు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వలంటీర్లను వినియోగించుకోవాలని సీఎస్ సూచించారు. -
పోలింగ్కు ముందే రాష్ట్ర సరిహద్దుల మూసివేత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల పోలింగ్ జరిగే నవంబర్ 30వ తేదీకి ముందే రాష్ట్ర సరిహద్దులను మూసివేసి బయటి రాష్ట్రాల నుంచి వ్యక్తులు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అధికారులను ఆదేశించారు. తెలంగాణతో సహా 5 రాష్ట్రాల్లో శాసనసభ సాధారణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలతో పాటు వాటి సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్...ఎన్నికల కమిషనర్లు ఏసీ పాండే, అరుణ్ గోయెల్తో కలిసి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ రాష్ట్ర సచివాలయం నుంచి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉందని, శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని శాంతికుమారి వివరించారు. సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో సంప్రదింపులు జరిపి సరిహద్దు చెక్పోస్టును కట్టుదిట్టం చేశామని వివరించారు. నవంబర్ 28 నుంచి పోలింగ్ జరిగే 30 వరకు రాష్ట్రంలో డ్రై డేగా ప్రకటించామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రశాంతంగా ఉన్నాయని, సాధారణ నేర కార్యకలాపాలు కూడా తగ్గుముఖం పట్టాయని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. -
ఉద్యోగుల ఇళ్ల స్థలాలపై సీఎస్ సమీక్ష..
విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చే అంశంపై శనివారం విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్.జవహర్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. వివిధ ఉద్యోగ సంఘాల హౌసింగ్ సొసైటీల వారీగా ఇళ్ళ స్థలాలకు ఎంత మేర భూమి అవసరం ఉంది పరిశీలన జరపాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీసీఎల్ఏ జీ.సాయి ప్రసాద్ కు సీఎస్ సూచించారు. అంతేగాక ఈవిషయమై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించి ఒక నివేదిక సమర్పించాలని ఆదేశించారు.పది రోజుల్లో ఉద్యోగుల ఇళ్ళ స్థలాల అంశంపై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అన్నారు. పట్టణ ప్రాంతాల్లో పబ్లిక్ హౌసింగ్ విధానాన్ని తీసుకు వచ్చే అంశంపై దృష్టి సారించాలని అధికారులను సీఎస్ జవహర్ రెడ్డి సూచించారు.దానివల్ల పట్టణ ప్రాంతాల్లో ఇళ్ళు లేనివారు, ఇళ్ళు ఉన్నా రోడ్లు,పుట్ పాత్ లు,కాలువలు,డ్రైన్లు వంటి వివిధ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని చిన్న చిన్న గుడిసెలు,గుడారాలు వంటివి ఏర్పాటు చేసుకుని జీవనం సాగించే వారిని కట్టడి చేసి వారికి ప్రభుత్వమే పబ్లిక్ హౌసింగ్ విధానంలో నిర్మించిన ఇళ్ళలో నివసించేలా చేయవచ్చని తెలిపారు.దాంతో పట్టణాలను మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ద వఛ్చని సిఎస్ పేర్కొన్నారు. ఆరోగ్య పథకంపై చర్చ.. రాష్ట్రంలో ఉద్యోగులకు అమలు చేస్తున్న ఆరోగ్య పథకాన్ని(ఇహెచ్ఎస్)మరింత పారదర్శకంగా,పటిష్టవంతంగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్. జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగుల ఆరోగ్య పథకంపై శనివారం విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో ఆయన వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించారు.ఈ పథకం అమలులో వివిధ ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన పలు డిమాండ్లు వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలపై ఆయన వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యం.టి.కృష్ణబాబుతో సమీక్షించారు. మరో పది రోజుల్లో ఉద్యోగుల ఆరోగ్య పథకంపై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారని సీఎస్ పేర్కొన్నారు.ఈపథకం అమలుపై ఇటీవల ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో వచ్చిన వివిధ ప్రతిపాదనలు వాటి అమలు గురించి సీఎస్ సమీక్షించారు.అంతేగాక ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన అంశాలపై సీఎస్ జవహర్ రెడ్డి సమీక్షించారు. సెప్టెంబర్ నెలాఖరు నాటికి అందరికీ ఇహెచ్ఎస్ కార్డులు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని స్పెషల్ సీఎస్ కృష్ణబాబు చెప్పారు.రాష్ట్రం లోని 53 ఏరియా ఆసుపత్రిల్లో ఇహెచ్ఎస్ సేవలకై ప్రత్యేక క్లినిక్లు అందుబాటులోకి రానున్నాయని కృష్ణబాబు తెలిపారు.ఇంకా ఇహెచ్ఎస్ అమలుకు సంబంధించి తీసుకున్న చర్యలపై వివరించారు. ఇదీ చదవండి: ‘ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం చేసిన బాబు సిగ్గుపడాలి’ -
కొత్త సచివాలయంలో తొలి సంతకం చేసిన కేటీఆర్, సీఎస్
-
ఈ చారిత్రాత్మక ఘట్టంలో నేను కూడా భాగమయ్యను..
-
నన్ను సీఎస్ గా నియమించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు : జవహర్ రెడ్డి
-
ఏపీ నూతన సీఎస్గా కె.ఎస్ జవహర్ రెడ్డి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్ జవహర్ రెడ్డి నియామకమయ్యారు. కొత్త సీఎస్గా జవహర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 1 నుంచి కొత్త ప్రధాన కార్యదర్శిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తారు. 2024 జూన్ వరకు ఆయన ఈ పోస్టులో కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయన స్థానంలో సీఎస్గా కె.ఎస్ జవహర్ రెడ్డిని ఎంపిక చేసింది ప్రభుత్వం. ముందుగా సీఎస్ రేసులో పలువురి పేర్లు తెరపైకి వచ్చినా.. జవహర్రెడ్డివైపే మొగ్గు చూపింది. 1990 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ జవహర్రెడ్డి.. ప్రస్తుతం సీఎంకు ప్రత్యేక కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఇదీ చదవండి: సుప్రీం తీర్పు తర్వాత టీడీపీ నేతలు మాట్లాడలేదేం?: సజ్జల -
ఏపీ సీఎస్గా సమీర్శర్మ పదవీ కాలం పొడిగింపు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ పదవీకాలం పొడిగిస్తూ తాజాగా కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. సమీర్శర్మను మరో 6 నెలలు పాటు ఏపీ సీఎస్గా కొనసాగించేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. వచ్చే ఏడాది మే నెల వరకు ఆయన సీఎస్గా పనిచేయనున్నారు. కాగా, సమీర్శర్మ పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం ఈనెల 2వ తేదీన కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. చదవండి: ప్లేట్లెట్ థెరపీ కిట్కు పేటెంట్.. రెండు తెలుగు రాష్టాల్లో ఇదే తొలిసారి పొడిగింపు ప్రతిపాదనను ఆమోదిస్తూ సంబంధిత ఉత్తర్వులను జారీచేసింది. కాగా, రెండు నెలల క్రితం ఏపీకి సీఎస్గా సమీర్శర్మ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. ఈనెల 30న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే తాజా పొడిగింపుతో సమీర్శర్మ మరో ఆరునెలలు ఏపీకి చీఫ్ సెక్రెటరీగా సేవలందించనున్నారు. -
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం సిసోడియాకు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు భారీ ఊరట లభించింది. ఢిల్లీ ప్రభుత్వ అప్పటి ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాష్పై దాడిచేసిన కేసులో ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎం, ఇతర 9 మంది ఇతర ఎమ్మెల్యేలను ఢిల్లీ ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 2018 నాటి ఈ కేసులో కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. అయితే, ఈ కేసులో ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలు అమాంతుల్లా ఖాన్, ప్రకాష్ జర్వాల్పై అభియోగాలు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. తాజా తీర్పుపై ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా స్పందించారు.ఇది తప్పుడు కేసు అని మొదటినుంచీ చెబుతూనే ఉన్నామనీ, ఈ కేసులో అన్ని ఆరోపణలు అబద్ధమని కోర్టు తేల్చి చెప్పిందన్నారు. సత్యానికి, న్యాయానికి లభించిన గొప్ప విజయమని ఆయన పేర్కొన్నారు. తమ సీఎంకు వ్యతిరేకంగా పన్నిన కుట్ర అని సిసోడియా వ్యాఖ్యానించారు. కాగా 2018 ఫిబ్రవరి 19వ తేదీ రాత్రి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో జరిగిన సమావేశంలో అప్పటి సీఎస్ ప్రకాష్పై ఎమ్మెల్యేలు దాడి చేశారనే ప్రధాన ఆరోపణతో కేసునమోదైంది. కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటు మరో 11 మంది ఆప్ ఎమ్మెల్యేలపై పోలీసులు ఛార్జిషీటు నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్దాస్ పదవీకాలం పొడిగింపు
సాక్షి, అమరావతి: ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్దాస్ పదవీకాలం పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 30 వరకు కేంద్రం పొడిగించింది. ఆయన పదవీ కాలం మూడు నెలల పాటు పొడిగిస్తూ అనుమతి ఇచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. చదవండి: టెన్త్, ఇంటర్ ఫలితాలపై దృష్టి సారించాలి: మంత్రి సురేష్ ఏపీ: పంటల రవాణాపై ఆంక్షలు లేవు.. -
పదవులకు వన్నెతెచ్చిన అధికారి
ఐఏఎస్... మన దేశంలో యువత కలలు కనే ఉన్నతోద్యోగం. ఇది ఉద్యోగం మాత్రమే కాదు, సమాజానికి సేవ చేసే బృహత్తర అవకాశం. ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన ప్రతి ఒక్కరూ తమను తాము నిరూపించుకోవాలని పరితపిస్తారు. అందులో కొద్దిమంది మాత్రమే యువ అధికారులకు స్ఫూర్తి ప్రదాతలుగా చరిత్ర పుటలకెక్కుతారు. అందులో ముందు వరసలో నిలిచే అధికారి ఎస్వీ ప్రసాద్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన ఆయన వ్యక్తిత్వం, కార్యదక్షత ఎనలేనివి. కోవిడ్వల్ల ఆయన మరణిం చడం దిగ్భ్రమ. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన సిగటపు వీర ప్రసాద్ (ఎస్వీ ప్రసాద్) 1975 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. అహ్మ దాబాద్ ఐఐఎంలో ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత సివిల్ సర్వీసుల వైపు మళ్లారు. నెల్లూరు జిల్లా గూడూరు సబ్ కలెక్టర్గా కెరియర్ ప్రారంభించారు. 1982లో కడప కలెక్టర్గా, 1985లో విశాఖ పట్నం కలెక్టర్గా పనిచేశారు. చిన్న వయసులోనే విశాఖలో కమి షనర్గా, జాయింట్ కలెక్టర్గా, కలెక్టర్గా పనిచేసిన ప్రసాద్ విశాఖ నగరాభివృద్ధికి గట్టి పునాదులు వేశారు. 2009లో భూప రిపాలన ప్రధాన కమిషనరుగానూ విధులు నిర్వర్తించారు. ఏపీ జెన్కో చైర్మన్గా, ఏపీఎస్ఆర్టీసీ ఎండీ, వైఎస్ చైర్మన్గా బాధ్య తలు నిర్వర్తించారు. విద్యుత్తు సంస్కరణల్లో ఏపీ నంబర్ వన్గా నిలిచిందంటే అది ఆయన చలవే. విద్యుత్తు రంగం అంటే ప్రసాద్కు మక్కువ. మానవ మనుగడకు, దేశ ఆర్థికాభివృద్ధికి కీలకమైన విద్యుత్తు రంగాన్ని బలోపేతం చేయడం, ప్రజలకు నాణ్యమైన, నమ్మకమైన కరెంటును సరఫరా చేయడం విషయంలో నిర్దిష్ట అభిప్రాయాలు వ్యక్తం చేసేవారు. ఆయన సూచనలతో అధికార వర్గం చేపట్టిన సంస్కరణలను నాటి వాజ్ పేయి ప్రభుత్వంలోని కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి ప్రత్యేకంగా కొనియాడారు. నిరంతరం చెరగని చిరునవ్వుతో పనిచేసే ఆయనకు అధికార వర్గాల్లో ‘జెంటిల్మేన్ బ్యూరో క్రాట్’ అనే పేరుంది. అటెండర్ నుంచి ఉన్నతాధికారి వరకు అందరితోనూ ఒకే విధంగా వ్యవహరిస్తూ, ఓర్పుతో విధులు నిర్వర్తించేవారు. ఒక ఐఏఎస్ అధికారి సాధారణంగా ఒక ముఖ్యమంత్రి దగ్గర ముఖ్య కార్యదర్శిగా పనిచేయడమే గొప్ప! కానీ, ఎస్వీ ప్రసాద్ ఏకంగా ముగ్గురు సీఎంలు– నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్రెడ్డి, నారా చంద్రబాబునాయుడు దగ్గర సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వహించారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కొద్ది కాలం ఆయన పేషీలోనూ పనిచేశారు. సహజంగా సీఎం మారగానే ఆయన పేషీలోని అధికారులకు స్థాన చలనం కలుగుతుంది. కానీ, ప్రసాద్ మాత్రం నలుగురు సీఎంల పేషీల్లో దాదాపు 13 ఏళ్లు విధులు నిర్వర్తించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా పనిచేయాలన్నది ప్రతి ఐఏఎస్ అధికారి కల. రాష్ట్ర ప్రభుత్వంలో అత్యున్నత సివిల్ సర్వీస్ పోస్టు అయిన ప్రధాన కార్యదర్శి పదవిని ఎస్వీ ప్రసాద్ 2009లో దక్కించుకున్నారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2011 సెప్టెంబర్ చివరి వరకూ పనిచేశారు. ముఖ్య మంత్రులు తమకు ఇష్టమైన, సమర్థుడైన అధికారిని ఎంపిక చేసుకొంటారు. అది సాధారణ ప్రక్రియ. డజన్కు పైగా సీని యర్లను పక్కనపెట్టి మరీ నాటి ముఖ్యమంత్రి ప్రసాద్కు అవ కాశం ఇచ్చారు. అవి అక్షరాలా, ఆణిముత్యాలా! ఆయన వ్యక్తిత్వం లాగానే దస్తూరి కూడా అద్భుతమే. 2009 అక్టోబర్లో వరదలు వచ్చిన సమయంలో ఆయన సేవలు ఎనలేనివి. శ్రీశైలం జలాశయానికి శతాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా 25 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తింది. ఆయన కాలంతో పోటీపడి సమయస్ఫూర్తితో తీసుకున్న నిర్ణయాల వల్లే శ్రీశైలం డ్యామ్ సురక్షితంగా ఉంది. ఏ మాత్రం పొరపాటు జరిగినా జల ప్రళయమే. కర్నూలు, విజయవాడ, గుంటూరు వంటి నగరాలు నామరూపాల్లేకుండా పోయేవి. తెల్లవారుజామున 5 గంటలకు ఆయన దినచర్య మొదలై, అర్ధరాత్రి 12 గంటల వరకు అవిశ్రాంతంగా కొనసాగేది. చిరు ద్యోగి నుంచి ఉన్నతాధికారి వరకు ఎవరు వచ్చినా ఓపిగ్గా మాట్లాడేవారు. ఎవరు ఫోన్ చేసినా స్పందించేవారు. ‘ఎవరైనా అవసరం ఉంటేనే కదా ఫోన్ చేస్తారు’ అనేవారు. 1993లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎంగా ఉన్న సమ యంలో విశాఖ ఏజెన్సీలో ఎమ్మెల్యే బాలరాజును నక్సలైట్లు కిడ్నాప్ చేశారు. సీనియర్ ఐఏఎస్ అర్జునరావు, సీనియర్ ఐపీఎస్ ఆంజనేయరెడ్డిల సహకారంతో బాలరాజు కిడ్నాప్ కథ సుఖాంతం అవడంలో కీలకపాత్ర పోషించారు. తరచూ ‘గాడ్ ఈజ్ గ్రేట్’ అనేవారు. సాధ్యమైనంత వరకు మనం చేయగలిగిన సాయం చేస్తూనే ఉండాలని చెప్పేవారు. ఆయనలో మరో విశేష గుణం బాగా పనిచేసే వారిని వెన్నుతట్టి ప్రోత్సహించడం. వీఆర్వో నుంచి కలెక్టర్ వరకు ఎవరైనా సరే వ్యక్తిగతంగా ఫోన్ చేసి అభినందించేవారు. ఏ అధికారికైనా అన్యాయం జరిగితే ముఖ్యమంత్రి ఏ పార్టీ వారైనా సరే న్యాయం చేయడానికి ప్రయత్నించేవారు. ఐఏఎస్ అధికారిగా దాదాపు 40 ఏళ్ల పాటు సేవలందించినా ఎన్నడూ ఇసుమంతైనా గర్వం ప్రదర్శించలేదు. వైఎస్ రాజ శేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ప్రసాద్ సీసీఎల్ఏగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయినా ఆయనకు ఏపీ జెన్కో ఛైర్మన్ బాధ్యతలు అప్పగించారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల కోసం ప్రజాధనం దుర్వినియోగం కాకుండా, నిబంధనలు ఉల్లంఘిం చకుండా తక్కువ ధరకు బొగ్గు కొనాలని వైఎస్ సూచించారు. ప్రసాద్ అందుకోసం డి. ప్రభాకర్ రావుతో కలిసి ఒక నివేదిక ఇచ్చారు. దాన్ని చూసి వైఎస్ ఎంతగానో మెచ్చుకున్నారు. ఆ నివేదికను అమలు చేయడం వల్ల బొగ్గు కొనుగోళ్లలో దాదాపు రూ.1000 కోట్లు ఆదా అయింది. హైదరాబాదులోని ఓ అనాథా శ్రమంలోని పిల్లల చదువుల కోసం తన వేతనంలో కొంత భాగాన్ని మూడోకంటికి తెలియకుండా ఇచ్చేవారు. ఆయన మరణ వార్తకు మీడియా ఎనలేని ప్రాధాన్య మిచ్చింది. ‘ఉమ్మడి ఏపీ పూర్వ సీఎస్ ఎస్వీ ప్రసాద్ ఇక లేరు’ అంటూ ఆయన విశిష్టతను మరోసారి ప్రజలకు గుర్తుచేసింది. సివిల్ సర్వీసుల్లో ఉన్న వారికి, రావాలని కోరుకునే వారికి ఆయన రోల్ మోడల్. ఎస్వీ ప్రసాద్, శ్రీలక్ష్మి జంట ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. విధి విచిత్రమో, దైవలీలో గానీ మరణంలోనూ వారి సాన్నిహిత్యం వీడలేదు. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. వ్యాసకర్త: ఎ. చంద్రశేఖర రెడ్డి సీఈఓ, ఆంధ్రప్రదేశ్ ఇంధన పరిరక్షణ మిషన్ -
విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిందే
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు ప్రతి నెలా తప్పనిసరిగా విద్యుత్ బిల్లులు చెల్లించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశించారు. పెండింగ్ విద్యుత్ బిల్లులపై శుక్రవారం ఆయన బీఆర్కేఆర్ భవన్లో మున్సిపాలిటీలు, పంచాయతీ రాజ్, డిస్కంల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు బకాయిపడిన విద్యుత్ బిల్లుల అంశంపై త్వరలో ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. డిస్కంలకు రావాల్సిన బకాయిలపై గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలతో చర్చించి ఒక వారంలోపు సమగ్ర నివేదిక రూపొందించాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. పని చేయని బోరు బావులకు సంబంధించిన బిల్లులతోపాటు ఇతర విద్యుత్ బిల్లుల బకాయిల వివాదాలపై పంచాయతీలు, మున్సిపాలిటీలు, డిస్కం అధికారులు తక్షణమే సమావేశమై పరిష్కరించుకోవాలని సూచించారు. -
పట్టణ ప్రగతికి ప్రత్యేక సాఫ్ట్వేర్
సాక్షి, హైదరాబాద్: పట్టణ ప్రగతి అమలు కోసం మున్సిపల్ పరిపాలన శాఖ రూపొందించిన సాఫ్ట్వేర్ను మరింత సరళీకరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సూచించారు. ఈ నెల 24 నుంచి ప్రారంభమయ్యే పట్టణ ప్రగతి కార్యక్రమానికి సంబంధించి గురువారం బీఆర్కేఆర్ భవన్లో ఆయన సమీక్ష నిర్వహించారు. వార్డులు, మున్సిపాలిటీల వారీగా సమాచారం సేకరించడంతో పాటు, ప్రతీ వార్డుకు ఒక నోడల్ అధికారిని నియమించాలని, పట్టణ ప్రగతిలో పాల్గొనేందుకు మున్సిపాలిటీ స్థాయిలో అధికార బృందాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ వార్డు స్థాయిలో నాలుగు కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు ఒక్కో కమిటీలో 15 మంది సభ్యులు ఉండేలా చూడాలన్నారు. కమిటీల ఏర్పాటుతో పాటు కమిటీల సమాచారాన్ని అప్లోడ్ చేయడంలో కొన్ని జిల్లాలు వెనుకంజలో ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్యం, హరితహారం, కమ్యూనిటీ టాయిలెట్ల కోసం ప్రణాళిక, స్మశాన వాటికలు, నర్సరీల అభివృద్ధి, సమీకృత కూరగాయలు, మాంసం మార్కెట్లు, ఆట స్థలాలు, పార్కులు తదితరాలపై దృష్టి సారించాలన్నారు. నిరక్షరాస్యులను గుర్తించేందుకు సర్వే నిర్వహించాలన్నారు. పట్ట ప్రగతి కోసం ఫిబ్రవరి, మార్చి నెలకు సంబంధించి 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి జీహెచ్ఎంసీకి రూ.156 కోట్లు, ఇతర మున్సిపాలిటీలకు రూ.140 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసిందన్నారు. సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, సీడీఎంఏ సత్యనారాయణ, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కొత్త సీఎస్.. సోమేశ్కుమార్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ నియమితులయ్యారు. ఆయన నియామక ఫైలుపై మంగళవారం సీఎం కె.చంద్రశేఖర్రావు సంతకం చేశారు. ఆ వెంటనే రాష్ట్ర సాధారణ పరి పాలన శాఖ ఆయన నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. 2018 ఫిబ్రవరి 1 నుంచి సీఎస్గా కొనసాగుతున్న శైలేంద్ర కుమార్ జోషి మంగళవారం పదవీ విరమణ చేశారు. దీంతో వెంటనే 1989 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన సోమేశ్.. కొత్త సీఎస్ గా బాధ్యతలు తీసుకున్నారు. 2020 జనవరి 1 నుంచి పదవీ విరమణ రోజైన 2023 డిసెంబర్ 31 వరకు సోమేశ్ కుమార్ సీఎస్గా కొనసాగుతారు. ఎక్కువకాలం పాటు బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉండటంతోనే సోమేశ్కుమార్ను సీఎస్గా ఎంపిక చేసినట్లు సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో పాలనలో స్థిరత్వం ఉంటుందని పేర్కొంది. సీఎస్గా పదవీ విరమణ చేసిన ఎస్కే జోషిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నీటిపారుదల వ్యవహారాలు)గా నియమించాలని సీఎం నిర్ణయించారు. కాగా, తనను సీఎస్గా నియమించినందుకు సోమేశ్ కుమార్ ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. శాఖల పనితీరుపై అసంతృప్తితోనే?: రాష్ట్రం ఆవిర్భవించి ఆరేళ్లయినా పలు కీలక ప్రభుత్వ శాఖలు, విభాగాల పనితీరు గాడిలో పడకపోవడంపై సీఎం అసంతృప్తితో ఉన్నారు. ప్రధానంగా రెవెన్యూ శాఖలో అవినీతి, అక్రమాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలన వ్యవహారాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఆశించిన లక్ష్యాల సాధన కోసం పాలన యంత్రాంగాన్ని పరుగులు పెట్టించాలనే ఆలోనతోనే సీఎస్గా సోమేశ్ను ఎంపిక చేసినట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీఎంకు నాపై నమ్మకముంది: సీఎం కేసీఆర్ ఆశయాలు, ఆదేశాలకు అనుగుణంగా పనిచేసి ప్రభుత్వ లక్ష్య సాధనకు కృషి చేస్తానని నూతన సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. సీఎంకు తనపై నమ్మకముందని, దాన్ని నిలబెట్టుకుంటానన్నారు. మంగళవారం సాయం త్రం తాత్కాలిక సచివాలయంలో సీఎస్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను నిర్ధిష్ట కాలవ్యవధిలో పూర్తి చేసేలా కృషి చేస్తానని చెప్పారు. ఉద్యోగులతో స్నేహపూరితంగా వ్యవహరిస్తానని, అదే సమయంలో పని విషయంలో రాజీ పడబోనన్నారు. ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమన్వయంతో పని చేస్తానన్నారు. పదవీ విరమణ పొందిన ఎస్కే జోషి సలహా సూచనలివ్వాలని కోరారు. సైకాలజిస్ట్ నుంచి సీఎస్గా..: సోమేశ్కుమార్.. 1987 నవంబర్ నుంచి 1989 వరకు డీఆర్డీవో సైకాలజిస్టుగా సాయుధ బలగాల అధికారుల ఎంపిక కోసం మానసిక పరీక్షలు నిర్వహించేవారు. ఎస్కే జోషికి ఘనంగా వీడ్కోలు..: పదవీ విరమణ చేసిన సీఎస్ ఎస్కే జోషికి సీనియర్, ఐపీఎస్ అధికారులు, సచివాలయ ఉద్యోగులు ఘనంగా వీడ్కోలు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున బీఆర్కేఆర్ భవన్లోని సమావేశ మందిరంలో ఆయనను ఘనంగా సత్కరించారు. పోలీసు శాఖకు జోషి అందించిన సహకారం మరువలేనిదని డీజీపీ మహేందర్రెడ్డి కొనియాడారు. చదువు.. కొలువు పుట్టిన తేదీ, ప్రాంతం: 22.12.1963, బిహార్ విద్య: ఎంఏ (సైకాలజీ), ఢిల్లీ యూనివర్సిటీ భార్య: డాక్టర్ జ్ఞాన్ముద్ర, పీహెచ్డీ, డీన్ అండ్ ప్రొఫెసర్, ఎన్ఐఆర్డీపీఆర్, హైదరాబాద్ కుమార్తె: సాయి గరిమా, ఆర్ట్స్ విద్యార్థిని ఐఏఎస్గా తొలి కొలువు: నిజామాబాద్ జిల్లా బోధన్ సబ్కలెక్టర్ (ఆగస్టు 1991– మే 93) ►ఐటీడీఏ, పాడేరు ప్రాజెక్టు ఆఫీసర్గా 1993 మే నుంచి 1995 ఏప్రిల్ వరకు ►హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్గా 1995 మే– 1996 జూన్ వరకు ►యాక్షన్ ఎయిడ్ ఇండియా డైరెక్టర్/వ్యవస్థాపక సీఈవోగా 1996 జూన్ – 2000 జనవరి వరకు ►అనంతపురం జిల్లా కలెక్టర్గా జూన్ 2000 నుంచి 02 డిసెంబర్ వరకు ►ఏపీ అర్బన్ సర్వీస్ ఫర్ పూర్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్గా జనవరి 2003 నుంచి మే 2005 వరకు ►ఎయిడ్ ఎట్ యాక్షన్ దక్షిణాసియా రీజనల్ డైరెక్టర్గా మే 2005 నుంచి డిసెంబర్ 2009 వరకు ►ఏపీ కళాశాల విద్య కమిషనర్గా జూలై 2008 నుంచి డిసెంబర్ 2009 వరకు ►గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్గా డిసెంబర్ 2011 నుంచి అక్టోబర్ 2013 వరకు ►జీహెచ్ఎంసీ కమిషనర్గా అక్టోబర్ 2013 నుంచి అక్టోబర్ 2015 వరకు ►గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగా నవంబర్ 2015 నుంచి డిసెంబర్ 2016 వరకు ►రెవెన్యూ, రెవెన్యూ, సీసీఎల్ఏ, రెరా, కమర్షియల్ ట్యాక్స్ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా డిసెంబర్ 2016 నుంచి ఇప్పటి వరకు సోమేశ్ వద్దే రెవెన్యూ శాఖ రెవెన్యూ, సీసీఎల్ఏ, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఇంత కాలం పనిచేసిన సోమేశ్కుమార్.. సీఎస్గా నియమితులైనా కూడా ఆ శాఖలను ఆయన వద్దే ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. కాగా, సీఎస్ ఎస్కే జోషి వద్ద ఉన్న నీటిపారుదల శాఖను మరో సీనియర్ ఐఏఎస్కు అప్పగించనుంది. -
ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ
సాక్షి: అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ అయ్యారు. ఆయనను గుంటూరు జిల్లా బాపట్లలోని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఏపీహెచ్ఆర్డీ) డైరెక్టర్ జనరల్గా బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీసీఎల్ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న నీరబ్ కుమార్ ప్రసాద్ను తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. -
సీఎస్, ఇతర ఐఏఎస్లపై హైకోర్టు గరంగరం
సాక్షి, హైదరాబాద్: ‘డెంగీ విజృంభణకు నిర్లక్ష్యం కారణమని తేలితే క్రిమినల్ చర్యగా పరిగణించాలా? నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణమైతే ఎవరిది బాధ్యత? మృతుల కుటుంబా లకు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తే ప్రభుత్వం చెల్లిస్తుందని భావిస్తారేమో.. ఐఏఎస్ అధికారుల జేబుల నుంచే ఇవ్వాల్సి వస్తుంది. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున చెల్లించాలని ఆదేశాలివ్వగలం. ఐఏఎస్లకు శిక్షణ ప్రజల డబ్బుతోనే ఇస్తారు. వారు రోగాలతో బాధలు పడుతుంటే పట్టించుకోకపోతే ఎలా.. ఒక్కసారి మూసీ నది ఒడ్డుకు మీరు వెళితే ఎంత దారుణమైన పరిస్థితుల నడుమ జనం ఉన్నారో కనబడుతుంది.’ అని హైకోర్టు తీవ్ర స్వరంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శైలేంద్రకుమార్ జోషి, ఇతర ఐఏఎస్ అధికారులను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. స్వైన్ఫ్లూ, డెంగీ, మలేరియా, వంటి విషజ్వరాలతో బాధపడేవాళ్లకు సర్కార్ వైద్యం అందేలా ఆదేశాలివ్వాలని వైద్యురాలు ఎం.కరుణ, న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారించింది. బుధవారం హైకోర్టు ఆదేశాల మేరకు విచారణకు సీఎస్తోపాటు ప్రజా ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్కుమార్, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ స్వయంగా హాజరయ్యారు. హైకోర్టుకు హాజరైన ఐఏఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని, ఆ కమిటీకి సీఎస్ నేతృత్వం వహించాలని, ప్రతి శుక్రవారం కోర్టుకు వచ్చి ఏవిధమైన చర్యలు తీసుకున్నారో, నివారణ చర్యలు ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజేయాలని ధర్మాసనం ఆదేశిస్తూ విచారణను నవంబర్ 1కి వాయిదా వేసింది. కోర్టు మెట్లు ఎక్కేవారు కాదు ‘ఉన్నతాధికారులు తమ విధుల్ని సక్రమంగా నిర్వర్తిస్తే కోర్టు మెట్లు ఎక్కరు. ఇక్కడున్న సీనియర్ ఐఏఎస్లు మూసీ నదికి వెళ్లి చూస్తే అది ఎంత పెద్ద దోమల ఉత్పత్తి కేంద్రంగా మారిందో చూడొచ్చు. హైకోర్టు పక్కనే ఉన్న మూసీ కలుషితం కావడం వల్ల దోమలు కోర్టులోని వాళ్లను కుడుతున్నాయి. రోజూ పత్రికల్లో ప్రతి పేజీలోనూ ప్రజల సమస్యలు, జనం రోగాల గురించి కథనాలు వస్తున్నాయి. మీరు పత్రికలు చడవడం లేదా లేక చదివినా స్పందించడం లేదా.. ప్రజల విశ్వాసాలు, నమ్మకాలను ప్రభుత్వం మీ చేతుల్లో పెట్టింది. సగటు జీవి సణుగుడు అర్థం చేసుకోండి’అని ఘాటుగా కోర్టు వ్యాఖ్యానించింది. వర్షాలు మొదలయ్యాక చర్యలా? కిక్కిరిసిన కోర్టు హాల్లో విచారణ ప్రారంభమైన వెంటనే సీఎస్ జోషి.. హైకోర్టు సూచనల్ని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని, 30 రోజులకు పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సారథ్యంలో కార్యాచరణ అమలు చేస్తున్నామని తెలిపారు. పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. 12,751 గ్రామాల్లో నిరంతరం వాటన్నింటినీ అమలు చేస్తున్నామని చెప్పారు. గడిచిన నెలలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయో, 30 రోజుల కార్యాచరణ ప్రణాళికను ఎప్పట్నుంచి అమలు చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నిస్తే.. సెప్టెంబర్ నెల మధ్యలో అమలు మొదలైందని సీఎస్ చెప్పారు. జూన్లో వర్షాలు మొదలైతే సెప్టెంబర్ నెల సగం అయ్యే వరకూ ఎందుకు ఆగుతున్నారని అడిగింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉందని సీఎస్ చెప్పిన జవాబు పట్ల హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ప్రజారోగ్యమే ప్రభుత్వ ప్రథమ విధి ప్రజారోగ్యానికి ఎన్నికల కోడ్కు సంబంధం ఏమిటని, రాజ్యాంగంలో ప్రజారోగ్యమే ప్రభుత్వ ప్రథమ విధి అని చెబుతోందని ధర్మాసనం గుర్తు చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. రేపు రంగారెడ్డి, హైదరాబాద్ లాంటి జిల్లాల్లో భూకంపం వంటి విపత్తు సంభవిస్తే ఇలాగే చెబుతారా అని నిలదీసింది. చిన్న దేశం శ్రీలంకలో డెంగీ, మలేరియాలను పూర్తిగా నిర్మూలించాలని 2016లో లక్ష్యంగా పెట్టుకుని ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచిందని, మనం కనీసం హైదరాబాద్ జంట నగరాల్లో ఆవిధంగా చెయ్యలేమా అని ప్రశ్నించింది. భోపాల్, ఉదయ్పూర్ వంటి నగరాలు పరిశుభ్రతకు చిరునామాగా ఉన్నాయని, ఉదయపూర్లో 8 సరస్సులున్నాయని, అక్కడ డెంగీ వంటి మాటే వినపడదని పేర్కొంది. చివరకు డెంగీతో ఒక జడ్జి కూడా చనిపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. రూ.50 లక్షల చొప్పున చెల్లించాలని ఆదేశిస్తే సరి విచారణ మధ్యలో అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కల్పించుకుని ఫాగింగ్ మెషీన్లు రెట్టింపు చేశామని, అత్యవసర ప్రదేశాల్లో 70 మెషీన్లతో పాటు వాహనాల ద్వారా కూడా ఫాగింగ్ చేస్తున్నామని తెలిపారు. మీరు చెబుతున్న ఫాగింగ్ మెషీన్ల సంఖ్యలోనే తేడాలున్నాయని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఫలితంగానే ప్రజల ప్రాణాలు పోతున్నాయని, మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున చెల్లించాలని ఆదేశిస్తే సరిపోతుందని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. హైదరాబాద్ పరిసరాల్లో దోమల ఉత్పత్తి కేంద్రాలు 427 ఉన్నాయని, బ్రీడింగ్ సెంటర్ 401 ఉన్నవాటిని 235కు తగ్గించామని ఏజీ చెప్పబోతుంటే వర్షాకాలం ప్రారంభంలో దోమల నివారణ చర్యలు తీసుకుని ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని, లార్వా దశలోనే నాశనం చేసేలా ప్రణాళికలుండాలని సూచించింది. అయినా కేసులు పెరిగాయి.. రూరల్ ఏరియాలో 1,09,780 ప్రాంతాల నుంచి వ్యర్థాలను తొలగించారని, 2.79 లక్షల ఇతర ప్రాంతాల నుంచి కూడా వ్యర్థాలను తొలగించారని, నిరుపయోగంగా ఉన్న 16,380 బావుల్ని తొలగించామని సీఎస్ జోషి చెప్పగానే.. సీజే కల్పించుకుని చాలా సంతోషమని, అయినా డెంగీ కేసులు పెరిగినట్లుగా ప్రభుత్వ రికార్డులే చెబుతున్నాయని వ్యాఖ్యానించింది. ఆ వివరాల్ని సరిగ్గా తయారు చేయలేదని సీఎస్ చెప్పగానే, జనవరిలో వంద కేసులుంటే ఇప్పుడు 2 వేల కేసులకు పెరిగాయని ధర్మాసనం గుర్తు చేసింది. మరో ఐఏఎస్ అధికారి అరవింద్.. మంత్రి తలసాని నేతృత్వంలో ఒక సబ్ కమిటీ రెండు సార్లు సమావేశమైందని చెప్పారు. కార్పొరేషన్ పరిధిలో ఎన్ని వాహనాల ద్వారా ఎన్ని టన్నుల చెత్త తొలగింపు చేస్తున్నది.. దోమల నివారణకు తీసుకుంటున్న చర్యల్ని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ వివరించారు. గల్లీల్లో తిరిగేందుకు వీలుగా కొత్తగా 1,400 ఆటోల్ని కొనుగోలు చేశామని, చెత్తను క్రషింగ్ చేస్తున్నామని వివరించారు. ఇది హర్షించదగ్గ విషయమేనని, అయితే వర్షాకాలం ప్రారంభానికి ముందే ప్రణాళికలుండాలన్న కీలక విషయాన్ని మరిచిపోయారని హైకోర్టు వ్యాఖ్యానించింది. వెయ్యి పవర్ స్ప్రేయర్లు, 800 సాధారణ స్ప్రేయర్లు, ఫాగింగ్ వాహనాలు 60 ఏర్పాటు చేయాలని ఆదేశించింది. తమ ఉత్తర్వుల్ని ఖాతరు చేయపోతే కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాల్సివస్తుందని హెచ్చరించింది. మలేరియా, పోలియో వంటి వాటిని దాదాపు నివారించామని, డెంగీ విషయంలో ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నిస్తూ విచారణను వాయిదా వేసింది. -
సెల్ఫ్ డిస్మిస్ లేదు
సాక్షి, హైదరాబాద్: ‘మేము (ఆర్టీసీ కార్మికులు) కార్యాలయాలకు వెళ్తలేం కాబట్టి ఉద్యోగులం కాదన్న మాట ప్రభుత్వం నుంచి వచ్చింది. సెల్ఫ్ డిస్మిస్ అనే పదం ఎక్కడా లేదు. చెప్పినంత మాత్రాన తీసేసినట్టు కాదు. రేపు ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగినప్పుడు అన్ని అంశాలొస్తాయి. సెల్ఫ్ డిస్మిస్కు కూడా చర్చల ద్వారా పరిష్కారం దొరుకుతుంది’అని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కారం రవీందర్రెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ గురువారం సాయంత్రం ఉద్యోగుల జేఏసీ ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని తాత్కాలిక సచివాలయంలో కలసి వినతిపత్రం అందజేసింది.అనంతరం జేఏసీ నేతల తో కలసి కారం రవీందర్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మిక జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 19న జరగనున్న రాష్ట్ర బంద్ లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ పాల్గొంటుం దని అన్నారు. ఆ రోజు మధ్యాహ్న భోజనం సమయంలో నిరసన తెలియజేస్తామన్నారు. నమ్మకంతో ఉన్నారు.. ‘చాలా మంది కార్మికులు రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకంతో ఉన్నరు. గతంలో 43 శాతం ఫిట్మెంట్తో ప్రభుత్వం పీఆర్సీ ఇచ్చింది. 16 శాతం ఐఆర్ ఇచ్చింది. ప్రభుత్వం తప్పనిసరిగా తమ సమస్యలను పరిష్కరిస్తుందని ఆర్టీసీ కార్మికులు నమ్మకంతో ఉన్నరు. ప్రభుత్వం ఈ నమ్మకాన్ని నిజం చేయాల్సి ఉంది’అని సీఎస్కు వివరించినట్లు రవీందర్రెడ్డి తెలిపారు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్రెడ్డి, కండక్టర్ సురేందర్ గౌడ్లు ఆత్మహత్యకు పాల్పడగా, కొందరు ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యులు గుండెపోటుతో మరణించిన విషయాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.సమ్మెలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగాలని కోరినట్లు తెలిపారు. మానవతా దృక్పథంతో ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించాలని కోరామని ఉద్యోగుల జేఏసీ సెక్రటరీ జనరల్ మమత పేర్కొన్నారు. మాకు ఏ లోగుట్టు లేదు.. టీఎన్జీవో, టీజీవో, తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతలకు ఎలాంటి లోగుట్టు లేదని రవీందర్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని 8 లక్షల మంది ఉద్యోగులకు ఏ లోగుట్టు ఉందో మాకు అదే ఉందని అన్నారు. ఉద్యోగ సంఘాల నేతల బలహీనతల వల్ల ఉద్యోగుల ప్రయోజనాలు నీరుగారిపోతున్నాయని వస్తున్న విమర్శలను తోసిపుచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై 15 అంశాలతో కూడిన డిమాండ్ల పత్రాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించామన్నారు. 2018 జూలై 1 నుంచి కొత్త పీఆర్సీ అమలు, రెండు డీఏలు రావాల్సి ఉందన్నారు. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తిరిగి రాష్ట్రానికి తీసుకురావాలని, సీపీఎస్ స్థానంలో పాత పెన్షన్ విధానం అమలు చేయాల న్న డిమాండ్లను సీఎస్ ముందు ఉంచామన్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించి ప్రభుత్వ మే జీతం చెల్లించాలని డిమాండ్ చేశామన్నారు. ఈ నెల 24న హుజూర్నగర్ ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం సమస్యలను పరిష్కరించేందుకు చర్య లు తీసుకుంటామని సీఎస్ హామీ ఇచ్చారన్నారు. సాయంత్రం 4 గంటలకు బీఆర్కేఆర్ భవన్కు చేరుకున్న తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నేతలు సీఎస్ను కలిసేందుకు దాదాపు గంటకు పైగా వేచి చూడాల్సి వచ్చింది. సీఎస్ వేరే సమావేశంలో ఉండటంతో ఉద్యోగ నేతలు వేచిచూడక తప్పలేదని సచివాలయ వర్గాలు తెలిపాయి. -
నకిలీ జీవోతో ప్రభుత్వానికే బురిడీ
సాక్షి, హైదరాబాద్: నకిలీ ఉద్యోగాలు.. నకిలీ నోట్లు.. నకిలీ ఎరువులు, విత్తనాలే కాదు.. ఏకంగా నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు సృష్టిస్తున్నారు కేటుగాళ్లు. లబ్ధి కోసం ప్రభుత్వ సీఎస్ పేరిటే నకిలీ ఉత్తర్వులు సృష్టించి దాంతో ప్రభుత్వ అధికారులనే బురిడీ కొట్టించే ప్రయ త్నం చేస్తున్నారు. తాజాగా సెక్రటేరియట్లో అలాంటి వ్యవహారమే వెలుగుచూసింది. సకాలంలో పనులు చేయకపోయిన కారణంగా విజిలెన్స్ శాఖ సిఫార్సు చేసిన పెనాల్టీని మాఫీ చేసేందుకు ఏకంగా నకిలీ ఉత్తర్వులను సృష్టించారు. అధికారుల ముందుచూపుతో ఇది ప్రాథమిక స్థాయిలోనే బయటపడటం, అది సీసీఎస్ దర్యాప్తు వరకు వెళ్లడం చర్చనీయాంశమైంది. జీవో ఉద్దేశమిదీ..: నాగార్జునసాగర్ ఆధునీకరణ పనులను వరల్డ్బ్యాంకు నిధులతో ఇరిగేషన్ శాఖ చేపట్టింది. దీంతో ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ పరిధిలోని డీసీ–8 ప్యాకేజీ పనులను చేపట్టారు. ఈ పనులను సుదర్శన్రెడ్డి అనే కాంట్రాక్టర్ చేపట్టగా, ఆయన మరణంతో పనులు నిలిచిపోయాయి. తర్వాత ప్రాజెక్టు పనులను ఇతర కాంట్రాక్టర్కు ఇచ్చి పనులు పూర్తి చేయించారు. అయితే ఈ పనులపై విచారణ జరిపిన విజిలెన్స్ డిపార్ట్మెంట్ పనులు పూర్తికాని నేపథ్యంలో కాంట్రాక్టర్ నుంచి లిక్విడేటీవ్ డ్యామేజెస్ చార్జీ (ఎల్డీసీ) కింద రూ.88.21 లక్షలు పెనాల్టీ కింద వసూలు చేయాలని నీటి పారుదల శాఖకు సూచించింది. పనుల పూర్తి విషయంలో కాంట్రాక్టర్ తప్పులేదని, శాఖ పొడగించిన గడువు మేరకు పనులు పూర్తి చేసి కాల్వలకు నీళ్లిచ్చారని తెలిపింది. పెనాల్టీని రద్దు చేయాలని కోరుతూ నీటి పారుదల శాఖ ప్రభుత్వాన్ని కోరింది. అయితే దీనిపై ప్రభుత్వం ఏæ నిర్ణయం చేయలేదు. నీటిపారుదల శాఖ సిఫార్సు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉండగానే ఈ నెల 25న ప్రభుత్వం పెనాల్టీ మాఫీ చేస్తున్నట్లు స్పెషల్ సీఎస్ ఎస్కే జోషి పేరిట జీవో 2136 విడుదలైంది. గుర్తించారిలా.. ఈ జీవో కాఫీని పట్టుకొని ఈ నెల 26న కొందరు వ్యక్తులు బీఆర్కేఆర్ భవన్లోని సెక్షన్ అధికారులను కలిసి ఉత్తర్వులను అమలు చేయాలని కోరినట్లుగా తెలిసింది. అయితే వాళ్లెవరనేది ఇంకా తెలియలేదు. ఈ క్రమంలో జీవో అంశం ఇరిగేషన్ శాఖ డిప్యూటీ సెక్రటరీ సుబ్బమ్మ దృష్టికి వెళ్లింది. అయితే జీవో కాపీపైన తెలంగాణ ప్రభుత్వం చిహ్నం ఉంది. సాధారణ జీవోల్లో అలాంటి చిహ్నం ఉండదు. అలాగే ఎస్కే జోషి పేరు మీద ఏ జీవో ఇచ్చినా, పూర్తి పేరు శైలేంద్రకుమార్ జోషి అనే పేరుతో విడుదలవుతాయి. అదీగాక జీవో నంబర్: 2136గా పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం ఇరిగేషన్ శాఖలో జీవోల సీరియల్ నంబర్ 854 వద్దే ఉంది. ఈ ఆధారాలతో దాన్ని నకిలీ జీవోగా గుర్తించిన సుబ్బమ్మ సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు సుబ్బమ్మ గురువారం రాత్రి సీసీఎస్లో ఫిర్యాదు చేశారు. దీంతో ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు గురువారం కేసు నమోదు (ఎఫ్ఐఆర్ నెం.205) చేశారు. ప్రాథమికంగా ఏ కాంట్రాక్టర్ను ఉద్దేశించి ఆ జీవో జారీ అయిందో దృష్టి పెట్టారు. శుక్రవారం ప్రాథమిక ఆధారాలు సేకరించిన దర్యాప్తు అధి కారులు శనివారం నోటీసులు జారీ చేయనున్నారు. -
జూనియర్లకే అందలం!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: వైద్య ఆరోగ్యశాఖలో అనర్హులనే అందలం ఎక్కిస్తున్నారు. సీనియర్లను కాదని జూనియర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు.తాము చెప్పిన మాటను కాదనకుండా చేస్తారనే ఉన్నతాధికారుల ఆలోచనే ఇందుకు కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంఅండ్హెచ్వో) నియామకంలో ఈ తీరు కొనసాగుతోంది. అర్హులైన అధికారులు ఉన్నప్పటికీ వారిని కాదని.. వారి కంటే తక్కువస్థాయి కలిగిన వారిని అధికారులుగా నియమిస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు ఈ విధంగా తమకు ఇష్టం వచ్చిన జూనియర్ అధికారులను నియమించి..ఇష్టారీతిన వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి సివిల్ సర్జన్ (సీఎస్) కేడర్ కలిగిన వారిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంఅండ్హెచ్వో)గా నియమించాల్సి ఉంటుంది. అయితే ఆ శాఖలోని ఉన్నతాధికారులు డిప్యూటీ సివిల్ సర్జన్ (డీసీఎస్)లను డీఎంఅండ్హెచ్వోలుగా నియమిస్తున్నారు. ఈ విధంగా కర్నూలు జిల్లాలోనే కాకుండా అనంతపురంతో పాటు మరో 5 జిల్లాల్లో జూనియర్ అధికారులను అందలం ఎక్కించినట్టు తెలుస్తోంది. సీనియర్ అధికారులు కాస్తా డిప్యూటీ డీఎంఅండ్హెచ్వోలుగా ఉంటూ తమ జూనియర్ల కిందనే పనిచేయాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో జూనియర్లు తమకేమీ చెప్పేదంటూ డిప్యూటీ డీఎంఅండ్హెచ్వోలు ఎదురు తిరుగుతున్న సందర్భాలు నెలకొంటున్నాయి. ఫలితంగా వైద్య ఆరోగ్యశాఖలో వ్యవహారం కాస్తా కట్టుతప్పుతోంది. దీంతో పరిపాలన పట్టుతప్పి....కిందిస్థాయి సిబ్బందితో పనిచేయించలేని పరిస్థితి నెలకొంది. అన్నింటిలోనూ అదే తీరే...!: మాతా, శిశు మరణాల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆడిట్ చేయాలని మెడికల్ ఆఫీసర్లతో పాటు ఏఎన్ఎంలకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు జిల్లాలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకోసం అయ్యే ఖర్చును ఎవరిస్తారనే అంశం కానీ... ఏ బడ్జెట్ నుంచి తీసుకోవాలనే విషయం కానీ స్పష్టంగా పేర్కొనలేదు. ఫలితంగా మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంల సొంత బడ్జెట్ నుంచి ఈ ఖర్చులను భరించాల్సి వస్తోంది. అదేవిధంగా గతంలో కూడా పోలియో దినోత్సవం సందర్భంగా కార్యక్రమాల నిర్వహణకు కూడా బడ్జెట్ను కేటాయించలేదు. మిగిలిన జిల్లాల్లో ఇందుకోసం బడ్జెట్ను కేటాయించినప్పటికీ జిల్లాలో మాత్రం నెలలు గడిచినప్పటికీ నిధులు మాత్రం ఇవ్వలేదు. వరుసగా ‘సాక్షి’లో కథనాలు రావడంతో ఖర్చును వైద్య ఆరోగ్యశాఖ చెల్లించింది. మాతాశిశు మరణాలపై ఆడిట్ విషయంలో కూడా ఇప్పటివరకు మెడికల్ అధికారులకు, ఏఎన్ఎంలకు ఒక్కపైసా కూడా నిధులు విడుదల చేయలేదు. ఈ విధంగా వైద్య ఆరోగ్యశాఖలో అధికారులు ఆడింది ఆట...పాడింది పాటగా సాగుతోంది. -
సీఎం ఆరోపణల పర్వంలోకి వెళ్లడం దురదృష్టకరం
-
రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్గా మార్చేద్దాం: సీఎస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్గా మార్చేందుకు అవసరమైన బ్రాండ్ పాలసీని రూపొందించాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. దీనికి సంబంధించి ‘విజన్ డాక్యుమెంట్’ప్రాథమిక నివేదికను 15 రోజుల్లోగా తయారు చేయాలని సూచించారు. గురువారం సచివాలయంలో క్రీడల అభివృద్ధిపై గ్రాంట్ థర్టన్ ఇండియా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో క్రీడలు, సాంస్కృతిక శాఖల కార్యదర్శి బి.వెంకటేశం, పర్యాటక శాఖ కమిషనర్ సునితా ఎం.భగవత్, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. సీఎస్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ఉన్న ఆసక్తి, ప్రతిభకు అనుగుణంగా 5, 6 క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడలను నిర్వహించడం ద్వారా యువతకు క్రీడల పట్ల ఆసక్తిని పెంచడంతోపాటు, హైదరాబాద్ మౌలిక వసతులు అభివృద్ధి చెందుతాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ఉన్న క్రీడా మైదానాలు, స్టేడియంలు వినియోగించేలా ప్రణాళిక ఉండాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ క్రీడల్లో నిర్వహించబోయే చాంపియన్ షిప్స్, 2023లో వరల్డ్ యూనివర్సిటీ స్పోర్ట్స్ నిర్వహణ కోసం బిడ్డింగ్ చేయడానికి తీసుకోవల్సిన చర్యలపై చర్చించారు. రాష్ట్రంలో అంతర్జాతీయ క్రీడల ఈవెంట్లు నిర్వహించడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎస్ ఆదేశించారు. -
ఏపీ కొత్త సీఎస్గా అనిల్ చంద్ర పునేత నియామాకం
-
సచివాలయంలో సీఎస్ ఎస్ కె జోషి సమిక్ష సమావేశం
-
సీఎస్ వర్సెస్ డీఓ
గణపురం(భూపాలపల్లి) : గణపురం మండలంలోని చెల్పూరు çపదో తరగతి పరీక్ష కేంద్రం నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్(సీఎస్) ప్రభాకర్రెడ్డి, డిపార్టమెంటల్ అధికారి(డీఓ)నర్సింహచారి మధ్య గత రెండు రోజులుగా జరుగుతున్న గొడవలు వీధికెక్కాయి. పరీక్ష కేంద్రంలో ఒకరినొకరు దూషించుకుంటూ దాడి చేసుకునేందుకు యత్నించడంతో పరీక్షలు రాసే విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. వివరాలిలా ఉన్నాయి.. ఈ నెల 16న పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాగా గణపురం మండల కేంద్రంలో రెండుసెంటర్లతోపాటు చెల్పూరు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరో సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న పరీక్షల్లో సీఎస్ ప్రభాకర్రెడ్డి మొదటి రోజు నుంచి సెంటర్లో మాస్ కాపీయింగ్ నడుస్తున్నా పట్టించుకోవడం లేదని డీఓ నర్సింహచారి ఆరోపిస్తూ గొడవకు దిగుతున్నుట్ల సమాచారం. అందులో భాగంగా సోమవారం ఇంగ్లిష్ మొదటి పేపర్ పరీక్ష జరుగుతుండగా పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్ చేతిలో చిట్టీ ఉండడం గమనించిన డీఓ ఆమె చేతిని లాక్కొని సీఎస్ వద్దకు తీసుకెళ్లాడు. అయితే ఈ పెనుగులాటలో ఆమె చేతులకు ఉన్న గాజులు పగిలిపోయి గాయాలయ్యాయి. విద్యాసంస్థల యాజమాన్యాల వద్ద« డబ్బులు తీసుకుంటూ మాస్కాపీయింగ్కు పాల్పడుతున్నారంటూ సీఎస్ ప్రభాకర్రెడ్డితో డీఓ నర్సింహచారి గొడవకు దిగారు. రెండు రోజులపాటు పరీక్ష కేంద్రంలో ఈ తంతు నడుస్తుండడంతో విషయం తెలుసుకున్న డీఈఓ శ్రీనివాస్ రెడ్డి సంఘటనపై విచారణ జరపాలని గణపురం ఎంఈఓ చిలువేరు సురేందర్, వెంటాపురం ఎంఈఓ శాగర్ల అయిలయ్యను ఆదేశించారు. వారిచ్చిన నివేదిక ఆధారంగా డీఓను తొలగిస్తున్నట్లు ఆదేశా>లు జారీచేశారు. ఆయన స్థానంలో కర్కపల్లి పాఠశాల ప్రధానోపాద్యాయుడు భద్రయ్యను నియమిస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు. మొత్తానికి సీఎస్, డీఓల మధ్య జరిగిన గొడవతో చెల్పూరు పదో తరగతి పరీక్షా కేంద్రంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే పరీక్ష కేంద్రాల్లోకి బయటి వ్యక్తులు వచ్చి వారి సెల్ఫోన్లలో పరీక్ష పత్రాలను ఫొటోలు తీసుకొని వెళ్తున్నారని, మాస్కాపీయింగ్ను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
కాళేశ్వరం ప్రాజెక్టు జీవితాశయం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టును నిర్ణీత గడువులోగా పూర్తి చేయడమే తన స్వప్నమని కొత్త సీఎస్గా బాధ్యతలు స్వీక రించిన శైలేంద్రకుమార్ జోషి పేర్కొన్నారు. ఈ బృహత్తర ప్రాజెక్టును వీలైనంత తొందరగా ప్రజలకు అంకితం చేయాలని ఉందన్నారు. రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల ద్వారా, ప్రత్యేకించి పాలమూరు ప్రాజెక్టుల ద్వారా పంట పొలాలకు నీరందడం వృత్తిపరంగా తనకు అత్యంత సంతృప్తినిచ్చిందని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ పకడ్బందీగా అమలు చేయటంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తానన్నారు. సీఎస్గా బాధ్యతలు స్వీకరించాక ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. తనకు ఈ అవకాశమిచ్చిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. శక్తి సామర్థ్యాల మేరకు రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు పునరంకితమవుతానని చెప్పారు. ‘తెలంగాణ కొత్త రాష్ట్రం. రాష్ట్రానికి మంచి పేరుంది. అధికారులు, ఉద్యోగులందరం కలిసికట్టుగా, ఒక జట్టుగా పని చేస్తాం. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలన్నీ కాలవ్యవధి నిర్ణయించుకొని పూర్తి చేస్తాం. జూలై నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా శరవేగంగా పనులు చేపట్టేందుకు ప్రాధాన్యమిస్తాం. గత మూడేళ్లలో పలు రంగాల్లో తెలంగాణ శరవేగంగా ప్రగతి సాధించింది. రాష్ట్రం ఏర్పడ్డ కొత్త నుంచి ఇప్పటిదాకా పని చేసిన అధికారులంతా అద్భుతమైన సేవలందించారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తాను’’అని చెప్పారు. తనకు రెండేళ్ల పదవీకాలం ఉందని, అందరినీ కలుపుకొని ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామిగా పని చేస్తానన్నారు. సంతృప్తిగా పని చేశా: ఎస్పీ సింగ్ కొత్త సీఎస్ బాధ్యతల స్వీకరణ అనంతరం పాత సీఎస్ ఎస్పీ సింగ్కు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వీడ్కోలు పలికారు, 13 నెలల పాటు చేసిన ఆయన సేవలను, ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘తెలంగాణ ప్రజలు చాలా గొప్ప వాళ్లు. ఎవరినైనా అక్కున చేర్చుకుంటారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ ప్రజల ఆతిథ్యం మరిచిపోలేనిది. తెలంగాణ దేశంలోనే నంబర్వన్గా ఉంది. బంగారు తెలంగాణ సాధనకు సీఎం కేసీఆర్ కష్టపడుతున్నారు’’అని అన్నారు. తనకు ఏ వర్గాలూ లేవని, అందరితో టీం వర్క్ చేశానన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు పనులు తన నేతృ త్వంలో పూర్తవడం, మిషన్ భగీరథ పనులు 95%పూర్తవడం అత్యంత సంతోషాన్నిచ్చాయని చెప్పారు. తనకు గ్రూపులు, శత్రువులు లేరన్నారు. అధర్సిన్హా, అజయ్ మిశ్రా, కె.రామకృష్ణారావు, జయేశ్ రంజన్, రాజీవ్ త్రివేది, సురేష్ చందా, పీకే ఝా, హర్ప్రీత్ సింగ్, కళ్యాణ్ చక్రవర్తి, సీవీ ఆనంద్, బి.జనార్దన్రెడ్డి, అనితా రాజేంద్ర, శ్రీ లక్ష్మి, నవీన్ మిట్టల్ తదితర ఐఏఎస్, ఐపీఎస్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
కిరణ్బేడీకి షాక్
టీ.నగర్: పుదుచ్చేరిలో ఏడుగురు ఎమ్మెల్యేల బోర్డు అధ్యక్షుల పదవీకాలాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీంతో గవర్నర్ కిరణ్బేడి నిర్ణయానికి చుక్కెదురైంది. ఈ అనూహ్య పరిణామాలతో పుదుచ్చేరి చీఫ్ సెక్రటరీ మనోజ్ ఫరిదా బదిలీ అయ్యారు. పుదుచ్చేరిలో 30కి పైగా బోర్డు అధ్యక్షుల పదవులు కూటమి పార్టీల ఎమ్మెల్యేలకు, పార్టీ నిర్వాహకులకు అందజేయడం పరిపాటి. 2016 మేలో కాంగ్రెస్–డీఎంకే కూటమి ప్రభుత్వం ఏర్పాటుచేసింది. కాంగ్రెస్లో ఎమ్మెల్యేలు ధనవేలు, విజయవేణి, బాలన్, తీప్పాయిందాన్, జయమూర్తి ఐదుగురు డీఎంకేలో శివ, గీతా ఆనందన్ బోర్డు అధ్యక్షులుగా పదవులు చేపట్టారు. ఏడుగురు బోర్డు అధ్యక్షులు ఏడాదిపాటు మాత్రమే పదవుల్లో కొనసాగే వీలుంది. అంతేకాకుండా వారి కార్యనిర్వహణ సామర్థ్యాన్ని బట్టి వారు పదవుల్లో కొనసాగే అవకాశం ఉందనే నిబంధన మేరకు గవర్నర్ కిరణ్బేడి అంగీకారం తెలిపారు. ఇలావుండగా ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా బోర్డు అధ్యక్షుల పదవీ కాలాన్ని పొడిగించేందుకు మంత్రి వర్గం నిర్ణయించి గవర్నర్కు ఫైలు పంపింది. అయితే దీన్ని నిరాకరించిన గవర్నర్ బోర్డు అధ్యక్షుల ఏడాది కాలం కార్యాచరణ నివేదికను కోరుతూ నిషేధం విధించారు. దీంతో ఏడుగురు ఎమ్మెల్యేలు బోర్డు అధ్యక్షుల పదవుల్లో కొనసాగలేక తప్పుకున్నారు. తర్వాత ఈ ఫైలును ఏకాభిప్రాయం కుదరలేదంటూ కేంద్ర ప్రభుత్వానికి కిరణ్బేడి పంపారు. ఆ తర్వాత హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ను ముఖ్యమంత్రి నారాయణస్వామి కలిసి బోర్డు అధ్యక్షుల పదవీ కాలం కొనసాగింపునకు అనుమతిని ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చారు. కేంద్ర హోంశాఖ నుంచి గురువారం పుదుచ్చేరి గవర్నర్, ప్రధాన కార్యదర్శికి ఒక లేఖ అందింది. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సతీష్కుమార్ ఇచ్చిన ఉత్తర్వుల్లో ఏడుగురు ఎమ్మెల్యేలు మళ్లీ బోర్డు అధ్యక్షుల పదవుల్లో కొనసాగేందుకు అనుమతి అందజేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అనుమతితో కొద్ది రోజుల్లో బోర్డు అధ్యక్షులందరూ తమ పదవులను అందుకోనున్నారు. పుదుచ్చేరి సీఎస్ బదిలీ: గవర్నర్తో విభేదాల కారణంగా పుదుచ్చేరి చీఫ్ సెక్రటరీ మనోజ్ ఫరిదా బదిలీకి గురయ్యారు. పుదుచ్చేరి 2016 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆధ్వర్యంలో మంత్రివర్గం ఏర్పాటైంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కిరణ్బేడీని గవర్నర్గా నియమించగా కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీగా చీఫ్ సెక్రటరీ మనోజ్ ఫరిదా హోదా పెంచబడింది. అయినప్పటికీ ఆయన ఢిల్లీ వెళ్లకుండా పుదుచ్చేరిలో పనిచేస్తూ వచ్చారు. ఇలావుండగా గవర్నర్గా బాధ్యతలు చేపట్టగానే కిరణ్బేడి ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోసాగారు. దీంతో సీఎం నారాయణసామితో ఘర్షణ వైఖరి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి అండగా మనోజ్ ఫరిదా నిలిచారు. ఆ తర్వాత ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేల వ్యవహారంలోను కేంద్ర హోంశాఖకు వ్యతిరేకంగా చీఫ్ సెక్రటరీ పనిచేస్తున్నట్లు గవర్నర్, బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఆరోపణలు చేశారు. ఈ పరిస్థితుల్లో పుదుచ్చేరి చీఫ్ సెక్రటరీ మనోజ్ ఫరిదా అకస్మికంగా ఢిల్లీకి బదిలీ అయ్యారు. ఆయనకు బదులుగా ఢిల్లీలో చీఫ్ సెక్రటరీగా పనిచేస్తూ వచ్చిన అశ్విన్కుమార్ పుదుచ్చేరికి నియమితులయ్యారు. ఆయన త్వరలో పుదుచ్చేరికి వచ్చి పదవీ భాద్యతలు స్వీకరించనున్నారు. -
కొత్త విజ్ఞప్తులు స్వీకరించొద్దు
జిల్లాల పునర్వ్యవస్థీకరణపై అధికారులకు సీఎస్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: ప్రజల నుంచి వచ్చిన ప్రతీ విజ్ఞప్తిని క్షుణ్నంగా పరిశీలించి తుది నోటిఫికేషన్ ఇచ్చినందున జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ముగిసిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధికారులకు స్పష్టత ఇచ్చారు. తుది నోటిఫికేషన్ ప్రకారం కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటయ్యాయని, దీని ప్రకారమే పాలన జరుగుతుందని, ఇంకా మార్పులు చేర్పులకు ఏ మాత్రం అవకాశం లేదని, ఏవైనా విజ్ఞప్తులు వచ్చినా స్వీకరించొద్దని ఆయన ఆదేశించారు. జిల్లాల ఏర్పాటు ప్రక్రియ విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో ఆయన బుధవారం ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. దాదాపు ఏడాది పాటు వివిధ స్థాయిల్లో అత్యంత లోతుగా చేసిన కసరత్తు ఫలితంగా కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు, పోలీసు కమిషనరేట్లు, పోలీస్ సబ్-డివిజన్లు, సర్కిల్ కార్యాలయాలు, పోలీస్స్టేషన్ల కూర్పు అద్భుతంగా జరిగిందని అభిప్రాయపడ్డారు. ఇక మరింత బాగా పనిచేసే అంశాలపై దృష్టిపెట్టాలని సీఎస్ కలెక్టర్లకు ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొన్నారు. -
పేట మున్సిపల్ చైర్పర్సన్కు సీఎస్ అభినందన
సీఎస్కు పూలబొకే అందజేసి స్వాగతం పలికిన చైర్పర్సన్ సూర్యాపేట : బహిరంగ మలమూత్ర విసర్జన రహిత పట్టణంగా సూర్యాపేటకు గుర్తింపు లభించేలా కృషి చేసిన మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళికను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ అభినందించారు. సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ కార్యాలయాల భవనాలను పరిశీలించేందుకు శనివారం సూర్యాపేటకు వచ్చారు. ఈ సందర్భంగా రహదారి బంగ్లాలో రాజీవ్శర్మకు చైర్పర్సన్ ప్రవళిక, ప్రకాష్ పూలబొకే అందజేశారు. ఈనెల 30న ప్రధాని మోదీ చేతులమీదుగా అవార్డు అందుకోనునండడంతో ఆయన చైర్పర్సన్ను అభినందనలు తెలిపారు. -
హరితహారంపై సీఎస్ సమీక్ష
పాల్గొన్న కలెక్టర్, మంచిర్యాల ఆర్డీవో మంచిర్యాల రూరల్ : రెండో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా నిర్దేశించి లక్ష్యం, సాధించిన ప్రగతిపై రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్శర్మ మంగళవారం హైదరాబాద్ నుంచి ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంచిర్యాల ఆర్డీవో కార్యలయంలో కలెక్టర్ జగన్మోహన్, ఆర్డీవో అయిషా మస్రత్ ఖానమ్ ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వర్షాల ప్రభావంతో హరితహారం లక్ష్యం చేరుకోలేకపోయామని తెలిపారు. ఈ నెల 23వ తేదీలోగా 80 శాతం లక్ష్యాన్ని సాధిస్తామని తెలిపారు. ఆయా శాఖల వారీగా నాటిన మొక్కల వివరాలు ప్రధాన కార్యదర్శికి తెలియజేశారు. సోషల్ ఫారెస్ట్రీ 12 వేలు, జిల్లాలో గల 6 డివిజన్ ఫారెస్ట్లలో 35 లక్షల 28 వేలు, డ్వామాలో 2 కోట్లు లక్ష్యం కాగా.. ఈ నెల 25, 26 తేదీల్లో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు. విద్యాశాఖ ద్వారా 100 శాతం హరితహారం సాధించినట్లు పేర్కొన్నారు. రోడ్లు, భవనాల శాఖ ఇప్పటివరకు 29 కిలోమీటర్ల మేర మొక్కలు నాటిందని వివరించారు. ఇరిగేషన్ శాఖ కూడా 30 వేలకు గానూ 39 వేల మొక్కలు నాటి అధిక లక్ష్యం సాధించిందని తెలిపారు. ఉద్యానవన శాఖ ద్వారా అర్బన్ ప్రాంతాల్లో పండ్లు, పూల మొక్కలు పెద్ద ఎత్తున పంపిణీ చేసినట్లు చెప్పారు. హరితహారం కార్యక్రమంలో సింగరేణి సీఅండ్ఎండీ శ్రీధర్ స్వయంగా పాల్గొని మొక్కలు నాటారని తెలిపారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు 4 లక్షల మొక్కలు, ఇతర బ్యాంకులు 50 వేల మొక్కలు నాటాయని వివరించారు. నాటిన మొక్కలు సంరక్షించేలా చర్యలు తీసుకుంటూ తగిన సూచనలు చేస్తున్నామని కలెక్టర్ సీఎస్కు తెలిపారు. -
హైదరాబాద్ నుంచి ఫర్నీచర్ తరలింపు అవసరంలేదు
-ఉమ్మడి ఫైళ్లు తెలంగాణాతో సమన్వయంతో స్కానింగ్ చేయండి -న్యాయ శాఖలో 20 వేల పుస్తకాలు డిజిటలైజేషన్ -జీఏడీలో 14 వేల పుస్తకాలు డిజిటలై జేషన్ -నేడు వెలగపూడి సచివాలయానికి తరలివెళ్లనున్న నాలుగు శాఖలు -ఉదయం 6 గంటలకు సచివాలయంలో బస్సులు ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయానికి ఫర్నీచర్ తీసుకువెళ్లాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్య ప్రకాశ్ టక్కర్ స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో కొత్త ఫర్నీచర్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సచివాలయంలోని ఫర్నీచర్, ఎయిర్ కండీషన్స్ను అవసరమైతే గుంటూరు, విజయవాడలకు తరలివెళ్లిన శాఖాధిపతుల కార్యాలయాలకు ఇవ్వాలని టక్కర్ సూచించారు. ఈ మేరకు సీఎస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయంతో పాటు శాఖాధిపతుల కార్యాలయాల్లో ఉమ్మడి ఫైళ్లను తెలంగాణ ప్రభుత్వంతో సమన్వయంతో స్కానింగ్ చేయాలని సీఎస్ సూచించారు. రాష్ట్ర విభజన సమయంలో ఫైళ్ల స్కానింగ్ ఏ ధరకైతే చేయించారో అదే ధరకు స్కానింగ్ చేయించాలని, ఇందుకు ఐటీ శాఖతో సంప్రదింపులు జరపాలని ఆయన స్పష్టం చేశారు. వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో ఆర్థిక, రెవెన్యూ శాఖలను, వైద్య ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖలను ఒకే చోట కేటాయింపులు చేయాలని సీఎస్ పేర్కొన్నారు. ఇలా ఉండగా హైదరాబాద్ సచివాలయం నుంచి బుధవారం ఉదయం వెలగపూడి సచివాలయానికి పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి, కార్మిక, గృహ నిర్మాణ, వైద్య ఆరోగ్య శాఖలు తరలివెళ్లనున్నాయి. ఇందుకోసం బుధవారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్ సచివాలయంలో ఆరు బస్సులను ఏర్పాటు చేశారు. న్యాయ శాఖలో 20 వేల పుస్తకాలను డిజిటలైజేషన్ చేయాల్సిందిగా సీఎస్ ఆదేశించారు. ఒకే పుస్తకం రెండేసి ఉంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పంపిణీ చేసుకోవాలని ఆయన సూచించారు. ఒకే పుస్తకం ఉంటే డిజిటలైజేషన్ చేయాలన్నారు. ప్రణాళికా శాఖ లైబ్రరీలో ఏడు వేల పుస్తకాలున్నాయి. వీటిని కూడా డిజిటలైజేషన్ చేయాలని ఆయన సూచించారు. సాధారణ పరిపాలన శాఖలో 12,600 ఇంగ్లీషు, 1700 తెలుగు కలిపి మొత్తం 14,300 పుస్తకాలున్నాయని, ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చట్టాలు, ఉమ్మడి మద్రాసు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన జిల్లా గెజిటీర్స్, జనాభా లెక్కల పుస్తకాలు, నిజాం కాలానికి చెందిన దస్త్రాలున్నాయని, వీటిని డిజిటలైజేషన్ చేయాల్సిందిగా సీఎస్ సూచించారు. 21వ తేదీ కల్లా సచివాలయ శాఖలన్నీ తరలింపు జూలై 21వ తేదీ నాటికల్లా సచివాలయంలోని అన్ని శాఖలు వెలగపూడి సచివాలయానికి తరలివెళ్లేందుకు వీలుగా సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. జూలై 6వ తేదీన వెలగపూడిలోని ఐదవ భవనంలోని తొలి అంతస్థులోకి కొన్ని శాఖలు, జూలై 15వ తేదీన ఒకటి నుంచి నాలుగు భవనాల్లోని గ్రౌండ్ ఫ్లోర్లోకి కొన్ని శాఖలు, జూలై 21వ తేదీన ఒకటి నుంచి నాల్గో భవనంలోని తొలి అంతస్థులోకి కొన్ని శాఖలు తరలివెళ్లాలని సీఎస్ ఆదేశాల్లో స్పష్టం చేశారు -
ఉమ్మడి చట్టాల స్వీకరణ గడువు జూన్ 2
లేదంటే చెల్లుబాటు కావు : సీఎస్ సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చట్టాలను అన్వయించుకునేందుకు గడువు ముంచుకొస్తుంది. పునర్విభజన చట్టం ప్రకారం ఈ ఏడాది జూన్ రెండో తేదీలోగా అప్పటి చట్టాలను తెలంగాణ ప్రభుత్వం దత్తత తీసుకోవాలి. లేని పక్షంలో వాటన్నింటినీ బిల్లుల రూపంలో ప్రవేశపెట్టి కొత్తగా చట్టాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ అన్ని శాఖలను అప్రమత్తం చేశారు. ఇప్పటివరకు ఏయే చట్టాలను యథాతథంగా అన్వయించుకున్నారు.. వేటి స్థానంలో కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి.. ఇంకా ఎన్ని చట్టాలను దత్తత తీసుకోవాల్సి ఉందో.. పూర్తి వివరాలు సిద్ధం చేసుకోవాలని అన్ని శాఖలకు సూచించారు. అన్ని శాఖలు వీటిని పరిశీలించి సమగ్రంగా ప్రతిపాదనలన్నీ ఒకే ఫైలుగా పంపించాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి అన్వయించుకోవాల్సిన మిగిలిన చట్టాల ప్రతిపాదనలన్నింటినీ మే 31లోగా సమగ్రంగా పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. పునర్విభజన చట్టంలోని 101 సెక్షన్ ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలోని చట్టాలను నిర్దేశించిన గడువులోగా చట్టసభల అనుమతి, ఆమోదం లేకుండానే కొత్త రాష్ట్రం యథాతథంగా, లేదా స్వల్ప మార్పులతో దత్తత తీసుకునే వెసులుబాటు ఉంది. లేకుంటే వీటన్నింటినీ చట్టసభల అనుమతితో కొత్త చట్టాలుగా రూపొందించుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. -
58-42 దామాషాలోనే ఎస్వో, ఏఎస్వోల విభజన
* కమల్నాథన్ కమిటీ సూచనను అంగీకరించిన ఇరు రాష్ట్రాల సీఎస్లు * తెలంగాణకు కేటాయించిన వైద్యుల స్థానికత వివరాలు ఇవ్వాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల సచివాల యాల్లో పనిచేస్తున్న సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల విభజన ఓ కొలిక్కి వచ్చినట్టయింది. ఎస్వో, ఏఎస్వోలను 58-42 దామాషాలోనే విభజించాల్సిందిగా కమల్నాథన్ సూచించినట్టు తెలిసింది. శనివారం సచివాలయంలో కమల్నాథన్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి ఏపీ, తెలంగాణ సీఎస్లు ఎస్పీ టక్కర్, రాజీవ్శర్మతో పాటు కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు. కొంతకాలంగా ఉద్యోగుల విభజన జాప్యం కావడం, ఏపీలో పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచడంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. రాష్ట్రం విభజించి రెండేళ్లు కావస్తున్నా ఇలాంటి సమస్యలు కొలిక్కి రాలేదు. మరీ ముఖ్యంగా ఏపీ సచివాలయ ఉద్యోగులు అమరావతికి తరలివెళ్లాల్సిన తరుణంలో ఉభయ సచివాలయ శాఖల్లో పనిచేస్తున్న ఎస్వో, ఏఎస్వోల విభజన ప్రధానంశంగా మారింది. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన సమావేశంలో ఎస్వో, ఏఎస్వోల విభజన 58-42 దామాషాలోనే పంచుకోవాలని, ఇబ్బందులు తలెత్తితే సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించుకోవాలని సూచించారు. దీనికి ఇరు రాష్ట్రాల సీఎస్లు అంగీకరించినట్టు తెలిసింది. దీంతోపాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగుల విభజనపైనా చర్చ జరిగినట్టు సమాచారం. పదిరోజుల్లో లోకల్ స్టేటస్ తేల్చండి ఏపీకి చెందిన 300 మంది వైద్యులను అన్యాయంగా తెలంగాణకు కేటాయించారని తెలంగాణ వైద్యుల సంఘం వ్యతిరేకించిన నేపథ్యంలో.. అలా కేటాయిం చబడిన వారి స్థానికత వివరాలు పదిరోజుల్లో ఇవ్వాలని కమల్నాథన్ కమిటీ ఆదేశించింది. ఇరు రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో శనివారం కమల్నాథన్ కమిటీ సమావేశం జరిగింది. 4 నుంచి 10వ తరగతి వరకూ చదివిన స్టడీ సర్టిఫికెట్లుగానీ, లేదా నివా స ధృవపత్రాలుగానీ పొందు పరచాలని, ఈ ఆధారాలు ఉంటేనే తెలంగాణకు కేటాయింపు వర్తిస్తుందని అన్నట్టు తెలిసింది. దీంతో ఏపీ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఈ వివరాలు పదిరోజుల్లోగా ఆన్లైన్లో పెడతామని హామీ ఇచ్చారని సమాచారం. -
జూన్ 27న తరలింపు అనుమానమే!
సీఎస్ నిర్వహించిన సమీక్షలో స్పష్టత కరువు సాక్షి, హైదరాబాద్: కొత్త రాజధాని అమరావతిలో చేపట్టిన తాత్కాలిక సచివాలయ నిర్మాణం, ఉద్యోగుల తరలింపుపై సందిగ్ధత కొనసాగుతోంది. జూన్ 27న ఉద్యోగులను తరలిస్తామని రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు పదే పదే ప్రకటిస్తున్నప్పటికీ అందుకు తగ్గట్టుగా పరిస్థితులు కనిపించడంలేదు. వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం ఎప్పటికి పూర్తమతుందో ఎవ్వరికీ స్పష్టతలేదు.అక్కడ రెండు ఫోర్లు జూలై నెలాఖరు లేదా ఆగస్టు నాటికి పూర్తవుతాయంటున్నా, అదనంగా మరో రెండు ఫ్లోర్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటితోపాటు ఇతర వసతుల కల్పన పనులను అడ్డదారిలో అస్మదీయులకు కట్టబెట్టాలని ప్రభుత్వ పెద్దలు చేసిన ప్రయత్నాలకు సీఆర్డీఏ కార్యదర్శి అజయ్ జైన్ గండికొట్టారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో టెండర్లు పిలిచి ఈ నెలాఖరుకు ఖరారు చేయనున్నారు. ఈ నిబంధనల్లోనే ఆరు నెలలు సమయం పడుతుందని, అదనంగా మరో రెండు నెలలు పొడిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు.మే నెలాఖరులో టెండర్లను ఖరారు చేస్తే నవంబర్కు నిర్మాణం పూర్తి కావాలి. ఆ గడువును 2017 జనవరి వరకూ పొడగించవచ్చు. అప్పటికీ నిర్మాణాలు పూర్తవుతాయన్న నమ్మకం లేదు. ఈ నేపథ్యంలో ఎప్పుడు పూర్తయితే అప్పుడు ఉద్యోగులు తరలివెళ్లేలా చర్యలను చేపట్టాలని శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్య ప్రకాశ్ టక్కర్ నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో నిర్ణయించారు. వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయానికి ఉద్యోగుల తరలింపునకు మార్గదర్శకాల ఖరారుకు ఈ సమీక్ష జరిపారు.నిర్మాణం పూర్తిపై ఈ సమీక్షలోనూ స్పష్టత కొరవడటంతో ఉద్యోగుల తరలింపుపై సందిగ్ధత ఏర్పడింది. దీనిపై సీఆర్డీఏ కమిషనర్ను పిలిపించి మాట్లాడాలని నిర్ణయించారు. బ్యాచులర్, , కుటుంబ వసతి ఎంతమందికి కావాలనే వివరాలను తీసుకుని, అందుకు తగినట్లు ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. అడ్డగోలు నిర్ణయాలవల్లనే ఆలస్యం తాత్కాలిక రాజధాని హైదరాబాద్లో ఐదేళ్లుంటామని చెప్పిన సీఎం చంద్రబాబు ఓటుకు కోట్లు కేసు తర్వాత ఒక్కసారిగా ఉండవల్లికి చేరిన సంగతి తెలిసిందే. అక్కడ కృష్ణానది కరకట్టపై అక్రమంగా నిర్మించి లింగమనేని గెస్ట్హౌస్ను తన అధికారిక నివాసంగా మార్చుకున్నారు.అక్కడినుంచే పరిపాలిస్తూ... సచివాలయ ఉద్యోగులను జూన్ 27 నాటికి తరలిస్తామని ప్రకటించారు. ఒకవైపు 2018 నాటికి రాజధాని తొలిదశ నిర్మాణం పూర్తి చేస్తామని చెబుతూనే మరోవైపు అస్మదీయులకు లాభం చేకూర్చేలా తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి దాదాపు రూ.వెయ్యికోట్లు ఖర్చుపెడుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే తాత్కాలిక సచివాలయం కోసం మొదట రెండు ఫ్లోర్లు నిర్మించాలని తలపెట్టిన ప్రభుత్వం ఆ తర్వాత అదనంగా మరో రెండు ఫ్లోర్లు నిర్మించాలని నిర్ణయించింది. అయితే ఈ అదనపు ఫ్లోర్లతోపాటు ఇతర మౌలిక సదుపాయాలకు కల్పనకు టెండర్లు లేకుండా నామినేషన్పై ఇచ్చేయాలని ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెచ్చారు. తద్వారా అస్మదీయులు అడ్డదారిలో పనులు కట్టబెట్టి లాభం చేకూర్చాలని ప్రయత్నించారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ప్రసక్తే లేదని, నామినేషన్పై పనులు ఇవ్వడానికి సంతకం చేయబోనని సీఆర్డీఏ కార్యదర్శి అజయ్ జైన్ కరాఖండిగా చెప్పారు. దీంతో మరో మార్గం లేకపోవడంతో ఈ నెల 2వ తేదీన రెండు ప్యాకేజీలుగా విడగొట్టి రూ.574 కోట్ల పనులకు టెండర్లను పిలిచారు. ఈ టెండర్లను ఈ నెలాఖరుకు ఖరారు చేయనున్నారు. ఈ టెండర్ల నిబంధనల్లోనే ఆరు నెలలు సమయం పడుతుందని, అదనంగా మరో రెండు నెలలు పొడిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు 2017 జనవరి నాటికి కూడా నిర్మాణాల పూర్తవడం అనుమానంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల తరలింపు కూడా వాయిదా వేయక తప్పదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తరలింపు మార్గదర్శకాలు ఖరారు వెలగపూడి సచివాలయానికి తరలింపులో ఏ కేటగిరీ ఉద్యోగులకు మినహాయింపు ఇవ్వాలి, హైదరాబాద్ సచివాలయంలో ఏ కేటగిరీ ఉద్యోగులను ఉంచాలనే అంశాలకు సంబంధించి మార్గదర్శకాలను సమీక్షలో సీఎస్ ఖరారు చేశారు. హైకోర్టు, పరిపాలన ట్రిబ్యునల్, స్టాట్యుటరీ కమిషన్స్, పదవ షెడ్యూల్ సంస్థలను పర్యవేక్షిస్తున్న సెక్షన్లకు చెందిన ఉద్యోగులను హైదరాబాద్లోనే ఉంచాలని నిర్ణయించారు. ఈ మేరకు హైదరాబాద్లో ఉండిపోయేవారు లేదా తరలింపునుంచి మినహాయింపు పొందినవారి వివరాలిలా ఉన్నాయి. * స్టాంప్స్ అండ్ రిజస్ట్రేషన్స్, వాణిజ్య పన్నుల శాఖలకు చెందిన ఆన్లైన్ డేటాకు సంబంధించిన కంప్యూటర్ వ్యవస్థను పర్యవేక్షించే సిబ్బంది హా సచివాలయంలో పనిచేస్తూ ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరుకు ముందు పదవీ విరమణ చేయనున్న ముగ్గురు ఏఎస్ఓలు, నలుగురు ఎస్వోలు, ఏడుగురు అదనపు, సంయుక్త, డిప్యూటీ కార్యదర్శులు హా జన్యుపరమైన వ్యాధులతో హైదరాబాద్లో చికిత్స పొందుతున్న పిల్లల తల్లిదండ్రులు. కేన్సర్ వ్యాధితో చికిత్స పొందుతున్న, డయాలిసిస్ పొందుతున్న ఉద్యోగులు. * పిల్లలను దత్తత తీసుకున్న ఉద్యోగులకు వెలగపూడి సచివాలయానికి తరలివెళ్లడం సమస్యగా మారింది. బాలికను దత్తత ఇచ్చిన సంస్థ ప్రతీ రోజు ఇంటికి వచ్చి పర్యవేక్షణ చేస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో వెలగపూడి తరలివెళ్లడం సాధ్యం కాదని సచివాలయ ఉద్యోగిని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. దీంతో ఇలాంటి దరఖాస్తులను పరిశీలించడానికి ముగ్గురు అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని, వారికి తరలింపు నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారు. -
ప్రభుత్వ వైద్యుల విభజనలో తప్పులు
* కమలనాథన్ కమిటీ అంగీకరించిందన్న టీ వైద్యుల జేఏసీ * జాబితా రద్దుపై రెండు, మూడు రోజుల్లో నిర్ణయం! * కమలనాథన్తో తెలుగు రాష్ట్రాల సీఎస్ల సమావేశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ ప్రభుత్వ వైద్యుల విభజనలో తప్పులు దొర్లినమాట వాస్తవమేనని కమలనాథన్ కమిటీ అంగీకరించిందని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల జేఏసీ కన్వీనర్ డాక్టర్ లాలూప్రసాద్ చెప్పారు. విభజన జాబితాపై వివాదం నెలకొన్న నేపథ్యంలో బుధవారం తెలంగాణ, ఏపీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శులు రాజీవ్శర్మ, ఎస్పీ ఠక్కర్లు కమలనాథన్ కమిటీతో సమావేశమయ్యారు. సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన వివిధ విభాగాల అధిపతులు, ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధులతోపాటు కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ పాల్గొన్నారు. జాబితాలో తప్పులు జరిగినట్లు కమలనాథన్ అంగీకరించారని డాక్టర్ లాలూప్రసాద్ తెలిపారు. ఈ నేపథ్యంలో రెండు, మూడు రోజుల్లో జాబితా రద్దుకు సంబంధించిన అంశంపై ప్రకటన చేస్తామని కమలనాథన్ తమకు హామీయిచ్చారని చెప్పారు. జాబితాలో అక్రమాలు జరిగాయని డీఎంఈ రమణి కూడా అంగీకరించారని తెలిపారు. ఏపీకి చెందిన చాలామంది వైద్యులు ఒకటి నుంచి నాలుగో తరగతి సర్టిఫికెట్లను మాత్రమే ఇచ్చారని, కానీ ఐదు నుంచి పదో తరగతి వరకు సర్టిఫికెట్లను జత చేయలేదని తాము కమలనాథన్కు వివరించామన్నారు. భార్యాభర్తలు ఏపీలో ఉన్నా తెలంగాణకే కేటాయించారని, దీనిని అధికారులు ఉద్దేశపూర్వకంగానే చేశారని లాలూ ప్రసాద్ ఆరోపించారు. -
ఇంత విడ్డూరమా?
ఇద్దరు సీఎస్లు తిరస్కరించిన ఫైల్ను మళ్లీ కేబినెట్కు తీసుకెళ్లడమా? ♦ ఉన్నతాధికార వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ ♦ సంచలనం రేకెత్తించిన ‘సంతకానికి ససేమిరా!’ సాక్షి, హైదరాబాద్: సాగునీటి శాఖలో ‘పెదబాబు’, ‘చినబాబు’ అవినీతి సాగుపై ‘సంతకానికి ససేమిరా!’ శీర్షికన ‘సాక్షి’ శనివారం ప్రచురించిన వార్త ఉన్నతాధికార వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఇద్దరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు(సీఎస్లు) తిరస్కరించిన ‘అంచనాల పెంపు’ ప్రతిపాదనను రెండోసారి మంత్రివర్గం ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకోవడం పట్ల పలువురు సీనియర్ ఐఏఎస్లు విస్మయం వ్యక్తం చేశారు. మంత్రివర్గం ఆమోదముద్ర వేసిన తర్వాత కూడా ‘అంచనాల పెంపు’పై సంతకం చేయడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తిరస్కరించారంటే.. నిబంధనల ఉల్లంఘన ఎంత అడ్డగోలుగా, అసంబద్ధంగా, యధేచ్ఛగా సాగిందనే అంశంపై ఉన్నతాధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంత విడ్డూరమైన వ్యవహారాన్ని ఎప్పుడూ చూడలేదంటున్నాయి. అవినీతి పె తీవ్రంగా స్పందించాల్సిన ప్రభుత్వం.. దానికి రాజముద్ర వేయడానికి ప్రయత్నిస్తోందని మండిపడుతున్నాయి.ఈ యత్నంలో.. సొమ్ము దిగమింగిన పెద్దలంతా బాగుంటారని, సంతకాలు చేసిన అధికారులే ఇరుక్కుపోతారనే ఆవేదన ఆ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మళ్లీ మంత్రివర్గానికా..: ఒకసారి మంత్రివర్గం ఆమోదించిన అంశాన్ని మరోసారి మంత్రివర్గం ముందుకు తీసుకెళ్లిన చరిత్ర ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనూ లేదని, అడ్డగోలు అవినీతికి మంత్రివర్గం మళ్లీ ఎలా ఆమోదముద్ర వేస్తుందని ఐఏఎస్లు ప్రశ్నిస్తున్నారు. సీఎం చంద్రబాబు, నీటిపారుదల మంత్రి దేవినేనిలు.. ఈ అవినీతికి రాజముద్ర వేయడానికి ఎలా అంగీకరిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికే మంత్రివర్గం పరిమితం కావాలని, అవినీతి వ్యవహారాలకు రాజముద్ర వేసే వేదికలుగా మారిస్తే ప్రజలు క్షమించరని అంటున్నాయి. చర్యలే సమంంజసం : ఇద్దరు సీఎస్లు తిరస్కరించిన అంశాన్ని లోతుగా విచారించడానికి ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలని, నిబంధనలను ఉల్లంఘించిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఐఏఎస్లు సూచిస్తున్నారు. -
సీఎస్ను కలిసిన ఏపీ ఎన్జీఓలు!
-
కొత్త రాజధానికి వెళ్లాలా వద్దా?
-
కొత్త రాజధానికి వెళ్లాలా వద్దా?
హైదరాబాద్: కొత్త రాజధానికి తరలి వెళ్లే విషయంలో ఏపీ సచివాలయం ఉద్యోగులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ అంశంపై చర్చించుకునేందుకు బుధవారం ఏపీ సచివాలయంలో ఉద్యోగ సంఘాల సమావేశం నిర్వహించారు. రాజధానికి తరలి వెళ్లడంపై సమాలోచనలు చేశారు. ప్రత్యేక హోదా కోసం చేయాల్సిన పోరాటంపై కూడా ఉద్యోగ సంఘాలు చర్చించాయి. అనంతరం విజయవాడకు కార్యాలయాల తరలింపుపై సాయంత్రం సీఎస్ ఐవైఆర్ కృష్ణారావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు పలు డిమాండ్లు సీఎస్ ముందుకు తెచ్చారు. వాటిల్లో.. * సరైన సౌకర్యాలు కల్పిస్తేనే కొత్త రాజధాని ప్రాంతానికి వెళతాం. * ఇప్పటికిప్పుడు రాజధానికి తరలి వెళ్లాలంటే సాధ్యం కాదు * మౌలిక, గృహ వసతితోపాటు 35శాతం హెచ్ఆర్ఏ సంగతి కూడా తేల్చాలి * తమ పిల్లలు అక్కడ స్థానికేతరులుగా మారే అవకాశం ఉన్నందున స్థానికతపై స్పష్టత ఇవ్వాలి * వారానికి ఐదు రోజులే పనిదినాలు ఉండాలి * బస్సు సౌకర్యాలు కల్పించాలి * ముందు వీటిన్నింటిపై స్పష్టత ఇవ్వాలి.. అప్పుడే ఎంతమంది వెళ్లాలో నిర్ణయించుకుంటాం -
నేడు నీతి ఆయోగ్ భేటీ
* హాజరయ్యేందుకు సీఎం కేసీఆర్ విముఖత * ఢిల్లీ వెళ్లనున్న సీఎస్, ప్రణాళికశాఖ పీఎస్ సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో శనివారం జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల ఉప కమిటీ ఆఖరి సమావేశం కావటంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఉంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ రెండో వారంలోనే జరగాల్సిన ఈ సమావేశం వాయిదా పడింది. అప్పుడు ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధపడ్డ సీఎం కేసీఆర్ ఈసారి గైర్హాజరుకానున్నారు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్శర్మ, ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి బి.పి.ఆచార్య తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఇప్పటికే ఢిల్లీలో రెండుసార్లు, భోపాల్లో ఒకసారి ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. వీటిలో భోపాల్ సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ పథకాలకు నిధుల కేటాయింపు, వాటి అమలుపై కేంద్రప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి రావటం, అందుకు అనుగుణంగా ఒక నివేదిక తయారు చేసిన నేపథ్యంలో శనివారం నాటి భేటీలో చర్చలకు తావు లేదని సీఎం భావిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రాల అభిప్రాయాలను తూతూమంత్రంగా విని, ఆ తర్వాత తన అభిప్రాయాన్నే కేంద్రం బలవంతంగా రుద్దుతోందని ఆయన ఉన్నతాధికారులతో అన్నట్లు తెలిసింది. జూలై 2న నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడి రాష్ట్ర పర్యటన నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ అరవింద్ పనగారియా జూలై 2న తెలంగాణలో పర్యటించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో నీతిఆయోగ్ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ కార్యక్రమ పనితీరును పరిశీలించేందుకు ఆయన హైదరాబాద్కు రానున్నారు. తన పర్యటనలో భాగంగా 2న ఉదయం ఆయన జిల్లాల్లో పర్యటిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ సీఎం కేసీఆర్ను, 3 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబును కలసి నీతి ఆయోగ్పై చర్చించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
‘ఎర్ర’ ఎన్కౌంటర్పై సీబీఐ దర్యాప్తు నిలిపివేత
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు నిలుపుదల చేసింది. దీంతోపాటు బాధితులు ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని, అలాగే ఈనెల 9న స్వయంగా తమ ముందు హాజరుకావాలంటూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్), డీజీపీలను ఆదేశిస్తూ ఎన్హెచ్ఆర్సీ జారీ చేసిన ఉత్తర్వులను సైతం నిలిపేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన హైకోర్టు ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఎన్హెచ్ఆర్సీ ఉత్తర్వులను వచ్చేనెల 3వ తేదీ వరకు నిలుపుదల చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. తదుపరి విచారణను జూలై 3కు వాయిదా వేసింది. -
ఆస్తుల పంపిణీపై 6న సీఎస్ల భేటీ
సాక్షి, హైదరాబాద్: విభజన చట్టంలోని 10వ షెడ్యూల్లోని సంస్థల ఆస్తులు, సిబ్బం ది, అప్పుల పంపిణీపై చర్చించేందుకు ఈ నెల 6న సమావేశమవ్వాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు నిర్ణయించారు. ఏపీ ప్రభుత్వం అవసరం లేని సంస్థల ఆస్తులు, అప్పులు, సిబ్బందిని తెలంగాణకు వదిలేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సీఎస్లు సమావేశంలో సమీక్షించనున్నారు. కాగా 9వ షెడ్యూల్లోని ప్రభుత్వరంగ సంస్థల్లోని ఉద్యోగులను స్థానికత ఆధారంగానే ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతుండగా ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. స్థానికత ఆధారంగా అయితే ఆంధ్రాకు ఎక్కువమంది ఉద్యోగులు వస్తే ఆర్థిక భారం పడుతుందని, దీనికి అంగీకరించబోమని పేర్కొంటోంది. -
సీఎస్గా రమేష్ నేగీ పేరు ఖాయమైనట్టే!
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి సీనియర్ ఐఏఎస్ అధికారి రమేష్ నేగీ పేరు దాదాపు ఖాయమైనట్టే కనిపిస్తోంది. 1984 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి నేగీ పేరును ప్రధాన కార్యదర్శి పదవి కోసం కేంద్ర హోమ్ శాఖ ఢిల్లీ సర్కారుకు సూచించింది. కాగా, ఈ పదవి కోసం మరో ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తున్నా కూడా నేగీ పేరు ముందు వరుసలో ఉన్నట్లు చెబుతున్నారు. ఢిల్లీ ప్రభుత్వ వ్యవహారాల్లో అనుభవంతో పాటు నియితీపరుడనే ముద్ర నేగీపై ఉంది. గతంలో ఢిల్లీ జల్ బోర్డు సీఈఓగా, డీటీసీ మేనేజింగ్ డెరైక్టర్గా పనిచేసిన నేగీ, ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇదిలా ఉండగా సీఎస్ పదవి కోసం పరిశీలిస్తున్న ముగ్గురు అధికారుల పేరుల్లో నైనీ జైశ్రీలన్, సంజయ్ శ్రీవాస్తవ, ఆనంద్ ప్రకాశ్ ఉన్నట్లు సమాచారం. -
సీఏ, సీఎస్, సీఎంఏ.. ప్రాక్టికల్ ట్రైనింగ్.. పరిపూర్ణతకు మార్గం
చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ); కంపెనీ సెక్రటరీ (సీఎస్); కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్ (సీఎంఏ).. కామర్స్ రంగంలో దశాబ్దాలుగా ఆదరణ పొందుతున్న ప్రొఫెషనల్ కోర్సులు. నేటి పారిశ్రామికీకరణ, గ్లోబలైజేషన్ యుగంలో వీటికి మరింత డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు వీటి విషయంలో ఎదురవుతున్న సమస్య... నైపుణ్య లేమి. ఈ పరిస్థితిని ముందుగానే ఊహించిన నియంత్రణ సంస్థలు ప్రాక్టికల్ ట్రైనింగ్కు ప్రాధాన్యమిచ్చాయి. మరే ఇతర కోర్సుల్లో లేని విధంగా ప్రాక్టికల్ ట్రైనింగ్ను తప్పనిసరి చేశాయి. క్షేత్ర నైపుణ్యాలు పెంపొందించుకోవడం కరిక్యులంలో భాగం చేశాయి. ఈ నేపథ్యంలో సీఏ, సీఎస్, సీఎంఏ కోర్సుల ప్రాక్టికల్ ట్రైనింగ్పై ఫోకస్.. సీఏ.. ఆర్టికల్షిప్కు అత్యంత ప్రాధాన్యం చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సులో ప్రాక్టికల్ ట్రైనింగ్ను ఆర్టికల్షిప్గా పేర్కొంటున్నారు. కోర్సు నియంత్రణ సంస్థ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ఆర్టికల్షిప్నకు అత్యంత ప్రాధాన్యమిస్తూ నిబంధనలు అమలు చేస్తోంది. మూడేళ్ల ఆర్టికల్షిప్ పూర్తి చేసినవారిని మాత్రమే కోర్సు ఫైనల్ పరీక్షల్లో హాజరుకు అనుమతిస్తోంది. సీఏ విద్యార్థులు కోర్సు రెండో దశ ఐపీసీసీలో పేరు నమోదు చేసుకున్నప్పటి నుంచే గుర్తింపు పొందిన ఆడిటర్ లేదా ఆడిట్ సంస్థ వద్ద ఆర్టికల్ ట్రైనింగ్లో అడుగుపెట్టాలి. విద్యార్థులు తాము థియరిటికల్గా చదువుతున్న అంశాలను అప్పటికప్పుడు ప్రాక్టికల్గా అన్వయించే నైపుణ్యాలు సొంతం చేసుకునేలా చేయడమే ఈ నిబంధన ప్రధాన ఉద్దేశం. ఫలితంగా ఫైనల్ సర్టిఫికెట్ చేతికందేనాటికి విద్యార్థికి ఒక పూర్తిస్థాయి సీఏకు అవసరమైన అన్ని నైపుణ్యాలు లభిస్తాయి. ఆర్టికల్షిప్ సమయంలో ట్రైనీకి నిర్ణీత మొత్తంలో స్టైఫండ్ కూడా చెల్లిస్తారు. అదే విధంగా విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు వీలుగా సెలవులు ఇవ్వాలని కూడా ఐసీఏఐ స్పష్టం చేసింది. సమస్యలివే ట్రైనీలు తమ ఆర్టికల్షిప్ సమయంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తమను సదరు సంస్థ లేదా సర్టిఫైడ్ ఆడిటర్ అన్ని విభాగాల్లో పాల్పంచుకోనీయడం లేదని, దీనివల్ల అన్ని అంశాలపై అవగాహన లభించట్లేదని ట్రైనీలు అంటున్నారు. అంతేకాకుండా సీఏ పరీక్షల ప్రిపరేషన్ కోణంలో ఐసీఏఐ నిర్దేశించిన విధంగా సెలవుల మంజూరు కూడా ఉండట్లేదని చెబుతున్నారు. దీనికి ప్రిన్సిపల్ ఆడిటర్స్ స్పందిస్తున్న తీరు భిన్నంగా ఉంటోంది. ఆర్టికల్ ట్రైనీలు ఒక సంస్థలోని అన్ని కార్యకలాపాల్లో పాల్పంచుకోవాలనే విషయంలో ఆ సంస్థ లేదా ఆడిటర్ దృక్పథం ప్రధాన పాత్ర పోషిస్తుందంటున్నారు. క్లయింట్లు ఎక్కువగా ఉన్న సంస్థలో ఆడిటర్ తమ క్లయింట్లకు త్వరగా సేవలందించాలనే లక్ష్యంగా ఉంటారు. ఇలాంటి సంస్థల్లో ఆర్టికల్ ట్రైనీలకు అన్ని అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఎక్కువ సమయం కేటాయించే పరిస్థితి ఉండదు. కాబట్టి అభ్యర్థులే సహజ చొరవతో పరిశీలన నైపుణ్యాలను పెంచుకుని సంస్థలో జరుగుతున్న కార్యకలాపాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. సెలవుల మంజూరు కూడా సంస్థ లేదా ఆడిటర్పైనే ఆధార పడి ఉంటుంది. ‘చిన్న సంస్థల్లో సిబ్బంది తక్కువగా ఉంటారు. అలాంటి వారు విధుల పరంగా ఆర్టికల్ ట్రైనీలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీంతోవారికి సెలవులు మంజూరు చేయడంలో కొంత సమస్య ఎదురవుతోంది’ అంటున్నారు హైదరాబాద్లోని ప్రముఖ ఆడిట్ సంస్థ నిర్వాహకులు. ఆర్టికల్షిప్తోపాటు అదనంగా.. నిర్దేశించిన ఆర్టికల్షిప్ పూర్తయిన తర్వాత మూడు నెలలపాటు జనరల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్(జీఎంటీ) కూడా చేయాలి. అకౌంటింగ్ నైపుణ్యాలతోపాటు నిర్వహణ పరిజ్ఞానం అందించాలనే ఉద్దేశంతో ఐసీఏఐ ఈ జీఎంటీకి రూపకల్పన చేసింది. కానీ.. చాలామంది విద్యార్థులు సిలబస్ విస్తృతంగా ఉండే సీఏ కోర్సు పరీక్షలో ఉత్తీర్ణతకే ప్రాధాన్యమిస్తున్నారు. థియరిటికల్ ప్రిపరేషన్కే ఎక్కువ సమయం కేటాయిస్తూ డమ్మీ ఆర్టికల్స్ను అన్వేషిస్తున్నారనే అభిప్రాయముంది. తప్పనిసరిగా ప్రత్యక్షంగా ఆర్టికల్షిప్ పూర్తి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్టికల్స్, థియరీ రెండింటికీ ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగితే ప్రాక్టికల్ నైపుణ్యాలు పూర్తి స్థాయిలో లభిస్తాయి. ఆర్టికల్షిప్ సమయంలో ఎదురయ్యే ఇబ్బందుల పరిష్కారం కోసం ఐసీఏఐను సంప్రదించవచ్చు. సీఎంఏలోనూ మూడున్నరేళ్లు.. కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ).. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించే కోర్సు. మారిన నిబంధనలతో సర్వీసెస్ నుంచి సాఫ్ట్వేర్ వరకు అన్ని రంగాల్లోనూ ఇప్పుడు కాస్ట్ అకౌంటెంట్ల అవసరం ఏర్పడింది. ప్రధానంగా ఉత్పత్తి సంస్థల్లో కాస్ట్ అకౌంటెంట్ల డిమాండ్ ఎక్కువ. సీఏంఏ కోర్సు నిర్వహణ సంస్థ ఐసీఎంఏఐ విద్యార్థుల్లో ప్రాక్టికల్ నైపుణ్యాలకు పెద్దపీట వేస్తోంది. సీఏ మాదిరిగానే మూడున్నరేళ్ల ప్రాక్టికల్ ట్రైనింగ్ను తప్పనిసరి చేసింది. అయితే సీఎంఏ కోర్సు విషయంలో విద్యార్థులకు ప్రాక్టికల్ ట్రైనింగ్ పరంగా కొంత వెసులుబాటు ఉంది. సీఏలో మాదిరిగా మూడేళ్లు ఆర్టికల్ చేస్తేనే ఫైనల్ పరీక్షకు అర్హత అనే నిబంధన సీఎంఏలో లేదు. కోర్సు రెండోదశగా పేర్కొనే ఇంటర్మీడియెట్ తర్వాత ఆరు నెలలు తొలి దశ ప్రాక్టికల్ ట్రైనింగ్ను పూర్తి చేసుకుంటే.. ఫైనల్ పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతి లభిస్తుంది. తర్వాత ఫైనల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాక తప్పనిసరిగా మూడేళ్లపాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తి చేయాలి. అప్పుడే సంస్థ నుంచి స్టూడెంట్షిప్ లభిస్తుంది. అంతేకాకుండా సీఎంఏ విద్యార్థులకు ప్రాక్టికల్ ట్రైనింగ్కు సీఏతో పోల్చితే ఎక్కువ మార్గాలు ఉన్నాయనేది నిపుణుల అభిప్రాయం. కేవలం ప్రాక్టీసింగ్ కాస్ట్ అకౌంటెంట్ల వద్దే కాకుండా సంస్థల్లోనూ ప్రాక్టికల్ శిక్షణ పూర్తి చేసుకునే వీలుంది. సీఎంఏ ప్రాక్టికల్ ట్రైనింగ్ విషయంలో విద్యార్థులు పేర్కొంటున్న సమస్యలు.. అన్ని విభాగాలపై అవగాహన కల్పించకపోవడం, పరీక్షలకు సెలవులు ఇవ్వకపోవడం. అభ్యర్థులకు ట్రైనింగ్ ఇచ్చే సంస్థ ఏదో ఒక విభాగంలో వారిని నియమిస్తోంది. దాంతో అన్ని అంశాలపై అవగాహన లభించడం లేదు. విద్యార్థులు చొరవగా ఆయా విభాగాల్లోని వారితో మాట్లాడం ద్వారా అక్కడి పనితీరును తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సీఎస్.. ట్రైనింగ్ తప్పనిసరి.. కానీ.. కంపెనీ సెక్రటరీ కోర్సు... ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా మూడు దశలుగా నిర్వహించే ఈ కోర్సులోనూ ప్రాక్టికల్ ట్రైనింగ్ తప్పనిసరి. ప్రస్తుతం ఫౌండేషన్ కోర్సు, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ అనే మూడు దశలుగా సీఎస్ కోర్సు స్వరూపం ఉంది. తాజా నిబంధనల ప్రకారం- ప్రాక్టికల్ ట్రైనింగ్ పరంగా ఫౌండేషన్ కోర్సు నుంచే దీన్ని ప్రారంభించొచ్చు. ఫౌండేషన్ కోర్సు నుంచి మూడేళ్లు; ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ తర్వాత రెండేళ్లు; ప్రొఫెషనల్ కోర్సు తర్వాత ఒక ఏడాది ప్రాక్టికల్ ట్రైనింగ్ (అప్రెంటీస్షిప్) పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ తాజా మార్పు విషయంలోనే ఈ రంగంలోని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎస్ తుది దశ అయిన ప్రొఫెషనల్ కోర్సు తర్వాత ఏడాది వ్యవధిలో ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తి చేస్తే చాలు అనే వెసులుబాటు కారణంగా.. అత్యధిక శాతం మంది అభ్యర్థులు ప్రాక్టికల్స్కు అత్యల్ప ప్రాధాన్యమిస్తారని అంటున్నారు. ముందుగా పరీక్షలో ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా వ్యవహరిస్తారని పర్యవసానంగా క్షేత్ర నైపుణ్యాలు కొరవడతాయని చెబుతున్నారు. ఇది భవిష్యత్ కెరీర్పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి ఔత్సాహికులు వెసులుబాట్లు గురించి అన్వేషించకుండా.. క్షేత్ర నైపుణ్యాలు పెంచుకునే విధంగా వీలైనంత ఎక్కువ సమయం ప్రాక్టికల్ ట్రైనింగ్కు కేటాయించాలి. అప్పుడే తాము అకడమిక్గా చదువుకున్న అంశాలకు సంబంధించి రియల్టైం అప్లికేషన్స్పై అవగాహన ఏర్పడుతుంది. కంపెనీల చట్టం, ఇతర న్యాయ పరమైన సబ్జెక్ట్ల ప్రాధాన్యం ఎక్కువగా ఉండే సీఎస్లో పరిపూర్ణత లభించాలంటే ప్రాక్టికల్ అప్రోచ్కు పెద్దపీట వేయాలి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాక్టికల్ ట్రైనింగ్ (అప్రెంటీస్షిప్) విషయంలో వ్యక్తిగతంగానైనా చొరవ చూపి ముందుకు సాగాలి. అప్పుడే కోర్సులో చేరిన లక్ష్యం నెరవేరడంతోపాటు సుస్థిర భవిష్యత్తు సొంతమవుతుంది. ప్రొఫెషనల్గా రూపొందాలంటే.. ప్రాక్టికల్ నాలెడ్జ్, స్కిల్ సెట్ల అవసరం సీఏ, సీఎంఏ, సీఎస్ కెరీర్కు చాలా ఎక్కువ. కారణం.. తాము చదివిన అంశాలను తక్షణమే అన్వయించాల్సిన విధంగా విధులు ఉంటాయి. దాంతో ఈ రంగంలో మంచి ప్రొఫెషనల్గా పేరు గడించాలంటే తప్పనిసరిగా ప్రాక్టికల్ అప్రోచ్ పెంపొందించుకోవాలి. పరీక్షల్లో ఉత్తీర్ణత గురించి ఆందోళన చెందకుండా అకడమిక్ సిలబస్ ప్రిపరేషన్ సాగిస్తూనే ప్రాక్టికల్ ట్రైనింగ్లో వాటిని అన్వయించే నైపుణ్యాలు పెంచుకుంటే సర్టిఫికెట్ సొంతం చేసుకోవడం ఎంతో సులభం. చేయూతనిస్తున్న ఇన్స్టిట్యూట్లు.. సీఏ, సీఎస్, సీఎంఏ కోర్సుల్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ పరంగా విద్యార్థులకు సదరు నిర్వహణ ఇన్స్టిట్యూట్లు చేయూతనిస్తున్నాయి. ట్రైనింగ్ మార్గాలు అన్వేషిస్తున్న అభ్యర్థులకు సహకరిస్తున్నాయి. ఆయా ఇన్స్టిట్యూట్ల చాప్టర్లను సంప్రదిస్తే ప్రాక్టికల్ ట్రైనింగ్కు అవకాశం కల్పిస్తున్న సంస్థలు, ప్రాక్టీసింగ్ ఆడిటర్స్/సెక్రటరీస్ సమాచారం తెలియజేస్తున్నాయి. పోస్టల్ కోచింగ్ ద్వారా కోర్సు అభ్యసిస్తున్న విద్యార్థులు; నాన్-మెట్రోస్లోని విద్యార్థులకు ఈ సదుపాయం ఎంతో మేలు చేస్తోంది. ప్రాక్టికల్ థింకింగ్ ఉంటేనే... సీఏ కెరీర్లో అడుగుపెట్టే విద్యార్థులు ముందుగా తమలో ప్రాక్టికల్ థింకింగ్ లెవెల్స్పై స్పష్టతకు రావాలి. ఎందుకంటే.. సీఏ కోర్సులో ప్రాక్టికాలిటీ ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఈ రంగంలోని సీనియర్లను, సంస్థలను, ప్రాక్టీసింగ్ సీఏలను సంప్రదించి తమ అవగాహన స్థాయి తెలుసుకోవాలి. ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఆర్టికల్ షిప్) విషయానికొస్తే.. పకడ్బందీ అన్వేషణ సాగించాలి. సదరు సంస్థ లేదా ఆడిటర్కు ఉన్న గుర్తింపు, క్లయింట్ల సంఖ్య-స్థాయి ఆధారంగా ఆర్టికల్షిప్నకు దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడే ఎలాంటి సమస్యలు తలెత్తవు. ఆర్టికల్షిప్ సమయంలో సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకునే కోణంలో కృషి చేస్తే పరిపూర్ణ అవగాహన లభిస్తుంది. ‘పరీక్షలో ఉత్తీర్ణతకే ప్రాధాన్యమిద్దాం. తర్వాత విధుల్లో చేరి ప్రాక్టికల్ నాలెడ్జ్ సొంతం చేసుకోవచ్చు’ అనే ఆలోచన సరికాదు. - ఎం.దేవరాజ రెడ్డి, చైర్మన్, బోర్డ్ ఆఫ్ స్టడీస్,ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా సీఎంఏ.. క్షేత్ర నైపుణ్యాలు ఎంతో ముఖ్యం సీఎంఏ కోర్సు విషయంలో క్షేత్ర నైపుణ్యాలు ఎంతో ముఖ్యం. అందుకే మూడున్నరేళ్ల ప్రాక్టికల్ ట్రైనింగ్ను తప్పనిసరి చేశాం. ఇదే సమయంలో విద్యార్థుల కోణంలోనూ ఆలోచించి వెసులుబాటు కల్పించాం. దీన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. వీలైనంత వరకు ఫైనల్ పరీక్ష నాటికి అధిక శాతం ప్రాక్టికల్ ట్రైనింగ్ను పూర్తి చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. ప్రాక్టికల్ ట్రైనింగ్ సమయంలో విద్యార్థులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఏర్పాటు చేశాం. కాబట్టి ఒకటిరెండు సంఘటనలు చూసి ఆందోళన చెందకుండా.. నైపుణ్యాలు పెంచుకునేందుకు కృషి చేయాలి. - ఎ.ఎస్. దుర్గా ప్రసాద్, చైర్మన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిరంతర అవగాహనతోనే సీఎస్లో రాణింపు సీఎస్ కోర్సులో రాణించాలంటే నిరంతర అవగాహనే ప్రధానం. ఇందుకు సాధనం ప్రాక్టికల్ ట్రైనింగ్(అప్రెంటీస్షిప్). దీని విషయంలో ప్రస్తుతం పలు వెసులుబాట్లు ఉన్నాయి. ఔత్సాహిక విద్యార్థులు వాటి గురించి పట్టించుకోకుండా పూర్తి స్థాయిలో ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందే విధంగా అడుగులు వేయాలి. ముఖ్యంగా లీగల్ నాలెడ్జ్ ఆవశ్యకత ఎక్కువగా ఉండే సీఎస్ కోర్సులో రియల్టైం ఎక్స్పోజర్ ఎంతో అవసరం. దీన్ని గుర్తించి ఎగ్జిక్యూటివ్ దశ నుంచే ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రారంభించడం మంచిది. - డి. వాసుదేవరావు, చైర్మన్, ఐసీఎస్ఐ-హైదరాబాద్ చాప్టర్ ఎడ్యూ ఇన్ఫో విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు ఏఐసీటీఈ చర్యలు భారతదేశంలోని ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూల్స్లో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను పెంచే దిశగా ఏఐసీటీఈ చర్యలు తీసుకుంటోంది. ఉన్నత విద్యను అంతర్జాతీయీకరణ చేయాలనే ఉద్దేశంతోపాటు, అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పెరిగితే ఇన్స్టిట్యూట్లలో సాంస్కృతిక వైవిధ్యం కూడా పెరుగుతుందని, ఫలితంగా మన విద్యార్థులు భవిష్యత్తులో విదేశాల్లోనూ రాణించేందుకు ఆస్కారం లభిస్తుందని ఏఐసీటీఈ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో భారత్లో చదవాలనుకుంటున్న ఔత్సాహిక విదేశీ విద్యార్థుల కోసం అమెరికాలో నిర్వహిస్తున్న స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ మాదిరిగా ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ నిర్ణయాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు చేసే దిశగా ఏఐసీటీఈ వేగంగా అడుగులు వేస్తోంది. విదేశాల నుంచి భారత్కు ఉన్నత విద్య కోసం వస్తున్న విద్యార్థుల సంఖ్య 2013 నాటికి 1.3 లక్షలు ఉండగా ప్రతి ఏటా వస్తున్న సంఖ్యను పరిగణిస్తే అది 15 శాతంలోపే ఉంటోంది. తాజాగా తీసుకుంటున్న చర్యల ఫలితంగా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. -
తెలంగాణలో IAS పోస్టింగుకు రంగం సిద్ధం
-
దక్షిణాది రాష్ట్రాల సీఎస్ల భేటీ
అంతర్రాష్ట్ర సమస్యలు, కేంద్ర చట్టాలపై చర్చ తెలంగాణ సీఎస్ రాజీవ్శర్మ అధ్యక్షతన సమావేశం ఆంధ్రా, కర్నాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి సీఎస్లు, ఏసీఎస్ల హాజరు దక్షిణ ప్రాంత మండలి సమావేశానికి ఏజెండా సిద్ధం చేసిన సీఎస్లు సాక్షి, హైదరాబాద్: అంతర్రాష్ట్ర సమస్యలు, కేంద్ర చట్టాల అమలు తదితర అంశాలపై దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ అధ్యక్షతన బుధవారం హైదరాబాద్లో జరిగిం ది. దక్షిణ ప్రాంత మండలి(సౌత్ జోన్ కౌన్సిల్) ఎనిమిదో స్థాయి సంఘం సమావేశంలో దాదాపు 46 అంశాలపై చర్చించారు. ఆయా రాష్ట్రాల మధ్య చాలా కాలంగా ఉన్న పదిహేను వివాదాలను పరిష్కరించుకున్నారు. మిగిలిన అంశాలను సీఎంల స్థాయి దక్షిణ ప్రాంత మండ లి సమావేశ ఏజెండాగా తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్నాటక, కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు సిద్ధం చేశారు. ఈ సమావేశంలో హిందూజా విద్యుత్ ఉత్పత్తి అంశం, ఉత్తరాది నుంచి దక్షిణ భారతదేశానికి గ్రిడ్ కల్పనతోపాటు, ప్రభుత్వం ఇటీవల ఛత్తీస్గఢ్తో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం అమ లు కావడానికి అవసరమైన లైన్ను పవర్ గ్రిడ్ కార్పొరేషన్ను నిర్మించాలని కేంద్రాన్ని కోరనున్నారు. సమావేశం వివరాలను కేంద్ర హోం శాఖ అంతర్రాష్ట్ర మండలి సచివాలయ కార్యదర్శి హెచ్కె దాస్ వెల్లడించారు. మండలి సమావేశాలు ఆరు నెలలకోమారు నిర్వహించాలని తద్వారా సమస్యలు పరిష్కరించుకునే అవకా శం ఉంటుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో మెట్రోరైలు నిర్మాణంలో భాగంగా వాణి జ్య కట్టడాలు నష్టపరిహారం చెల్లింపు, రాష్ట్రాల్లో రహదారుల నిర్మాణానికి భూ సేకరణపై ఎదుర్కొంటున్న సమస్య, ప్రాజెక్టులు పూర్తి చేయడంలో తలెత్తుతున్న శాంతిభద్రతల సమస్య, కర్మాగారాల చట్టం-1948 ప్రకారం సంబంధిత ప్రాధికార సంస్థ అనుమతి లేకుండా రైల్వే అధికారులను ప్రాసిక్యూట్ చేసే అంశం, ఇసుక రవా ణా, జీఎస్టీ, పర్యాటకం, రైల్వే కారి డార్ గృహ నిర్మాణం, విద్యుత్ ప్రసార వ్యవస్థ, ఉపరితల రవాణా, రైల్వే ట్రాక్షన్లో విద్యుత్ ఛార్జీల పెంపు హేతుబద్ధం లేకపోవడం, పాండిచ్చేరి విమానాశ్రయానికి భూసేకరణ, కర్నాటక- తమిళనాడు, తమిళనాడు-కేరళ రాష్ట్రాల మధ్యనున్న వివాదాలు, రోడ్డు భద్రతా చట్టంపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో తెలంగాణ సీఎస్ రాజీవ్శర్మ, జీఏడీ (పొలిటికల్ ముఖ్యకార్యదర్శి) అజయ్మిశ్రా, ఎస్కే జోషి, ఆంధ్రా సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, ప్రేమ్చంద్రారెడ్డి, కర్నాటక సీఎస్ కౌశిక్ ముఖర్జీ, తమిళనాడు సీఎస్ మోహన్ వర్గీస్ చుంకత్, కేరళ ఎసీఎస్ నివేదిత పి హరన్, పాండిచ్చేరి సీఎస్ సుందరవడివేలు, కేంద్ర హోం మంత్రి సలహాదారు హరికృష్ణ పలివాల్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ, ఏపీ సర్కార్లకు సుప్రీం అక్షింతలు
న్యూఢిల్లీ : తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలకు ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. పోలీసుల పదోన్నతుల కేసులో ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసు శాఖలో పదోన్నతులపై గతంలో తామిచ్చిన ఆదేశాలు ఎందుకు పాటించటం లేదని ప్రశ్నించింది. కాగా పదోన్నతుల విషయంలో సుప్రీం కోర్టు ఉత్తర్వులు అమలు చేయడం లేదంటూ కొందరు పోలీసులు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేస్తూ హోంశాఖ కార్యదర్శి, డీజీపీని ప్రతివాదులుగా చేర్చిన విషయం తెలిసిందే. -
కిరణ్ సర్కార్ పధకాలు,ప్రాజెక్ట్ల పై వేటు
-
సీఎస్, డీజీపీ, నగర కమిషనర్లకు ఒకేచోట నివాస భవనాలు
బంజారా హిల్స్ రోడ్ నంబర్ 10లో నిర్మాణం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, నగర పోలీస్ కమిషనర్లకు త్వరలో అత్యంత ఆధునిక సౌకర్యాలతో అధికారిక నివాస భవనాలను ఒకేచోట నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు సీఎం కె.చంద్రశేఖర్రావు గురువారం ఆమోదం తెలిపారు. హైదరాబాద్ బంజారా హిల్స్లోని రోడ్ నంబర్ 10లో ఉన్న మూడెకరాల ప్రభుత్వ స్థలంలో వీటి నిర్మాణం జరగనుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, నగర పోలీస్కమిషనర్లకు రాజధానిలో ఇప్పటి వరకు అధికారిక నివాసాలు లేవు. ఈ కీలక పోస్టుల్లో ఏ అధికారి ఉన్నా ప్రభుత్వ క్వార్టర్స్లలో ఏదో ఒకదానిని కేటాయించేవారు. ఈ విషయమై సీఎస్ రాజీవ్శర్మ, డీజీపీ అనురాగ్శర్మలతో ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం చర్చించారు. అధికారులు తీసుకువచ్చిన ప్రతిపాదనలను పరిశీలించారు. బంజారాహిల్స్లోని మూడెకరాల ప్రభుత్వ స్థలం ఇందుకు అనువుగా ఉంటుంద ని అధికారులు అభిప్రాయపడినట్టు తెలిసింది. దీనిపై హోంవుంత్రి నారుుని నర్సింహారెడ్డితో మాట్లాడిన తరువాత సీఎం ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పినట్టు సమాచారం. -
సీమాంధ్ర అంశాలపై నేడు కేంద్రంతో సీఎస్ భేటీ
-
సీమాంధ్ర అంశాలపై నేడు కేంద్రంతో సీఎస్ భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒనగూరే ప్రయోజనాలు, రావాల్సిన ప్రాజెక్టులు తదితరాంశాలపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సోమవారం రాత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మంగళవారం ఉదయం కేంద్ర కేబినెట్ కార్యదర్శితో పాటు, కేంద్ర ప్రణాళికా సంఘం, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై విభజనకు చెందిన పలు అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న మేరకు కొన్ని ఇనిస్టిట్యూషన్స్ను 13వ షెడ్యూల్లో చేర్చడం, అలాగే మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులు, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, పరిశ్రమలకు రాయితీలతోపాటు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించడం, విద్యుత్ అంశాలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏర్పడనున్న రెవెన్యూ లోటు భర్తీ అంశాలపై సంబంధిత కేంద్ర ఉన్నతాధికారులతో ఆయన చర్చించనున్నారు. అంతకు ముందు సోమవారం ఉదయం ఈ విషయాలన్నింటిపైన సచివాలయంలో సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాల్సిన అంశాలను ప్రత్యేక నోట్స్ను ఆయా అధికారుల నుంచి సీఎస్ తీసుకున్నారు. కార్పొరేషన్ల విభజనపై ఇద్దరు సీఎస్లు భేటీ రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రస్తుత కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు రెండు రాష్ట్రాలకు విభజించడం ఎలా అనే అంశాలపై సోమవారం సచివాలయంలో తెలంగాణ సీఎస్ రాజీవ్శర్మ, ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావులు సమావేశమై చర్చించారు. అలాగే సంబంధిత అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇరు రాష్ట్రాలకు చెందిన విభజన అంశాలపై పరస్పరం చర్చల ద్వారా ముందుకు సాగాలని ఇద్దరు సీఎస్లు స్థూలంగా నిర్ణయించారు. -
రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ బాధ్యతలు స్వీకరణ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ రాజీవ్ శర్మ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1982 బ్యాచ్కు చెందిన రాజీవ్ శర్మ పలు కీలక శాఖల్లో బాధ్యతలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఆయన రూర్కీలో ఐఐటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ చేశారు. తరవాత ఇంగ్లండ్లోని అంగీలియాలో గ్రామీణాభివృద్ధిలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేశారు. అమెరికాలోని మిలన్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ చేశారు. 1982లో ఐఏఎస్గా ఎంపికై ఆంధ్రప్రదేశ్ కేడర్కు వచ్చారు. కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్గా, డెరైక్టర్ పోర్ట్స్, పురపాలక శాఖ స్పెషల్ కమిషనర్, సాంకేతిక విద్య డెరైక్టర్, వ్యవసాయ శాఖ కమిషనర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్య కార్యదర్శి, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డెరైక్టర్ జనరల్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శిగా పని చేశారు. రాష్ట్ర విభజన ప్రక్రియలో కీలక భూమిక పోషించారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి అవసరమైన సమాచారాన్ని అందించడమేకాక, ఆ కమిటీకి కార్యదర్శిగా వ్యవహరించారు. అలాగే తొలి డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా అనురాగ్శర్మ కూడా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ డీజీపీగా ఈరోజు ఉదయం 7.15కు ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా ఐవైఆర్ కృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు. -
సీఎస్గా మహంతి పదవి విరమణ
-
ఏపీ సీఎస్గా ఐవైఆర్, డీజీపీగా జెవి రాముడు!
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు నాయుడు శనివారం గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల నియామకాలు, రాజధాని నిర్మాణం, ఉద్యోగుల విభజనకు సంబంధించిన అంశాలపై బాబు ఈ సందర్భంగా గవర్నర్తో చర్చించినట్లు సమాచారం. కాగా చంద్రబాబుతో పాటు ఐఏఎస్ అధికారి, తిరుమల మాజీ ఈవో ఐవైఆర్ కృష్ణారావు కూడా గవర్నర్ను కలిసిన వారిలో ఉన్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు అధికారుల నియామకంపై కసరత్తు చేస్తున్నారు. ఐవైఆర్ కృష్ణారావును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించే యోచనలో బాబు ఉన్నట్లు సమాచారం. అలాగే డీజీపీగా జాస్తి వెంకట రాముడు (జెవి రాముడు), హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రస్తుత డీజీపీ ప్రసాదరావు, చంద్రబాబు కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా అజయ్ సహానీ, సీఎంఓ కార్యదర్శులుగా గిరిధర్, సాయిప్రసాద్ నియమితులయ్యే అవకాశం ఉంది. -
కేసీఆర్తో సీఎస్ భేటీ
విభజన కమిటీ కూడా.. విభజన ప్రక్రియను వివరించిన అధికారులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి, రాష్ట్ర విభజన కమిటీలోని సభ్యులు గురువారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర విభజన ప్రక్రియ ఆయనకు వివరించాలని అధికారులు వెళ్లినా, సమయం లేని కారణంగా వారు ఆయనకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వలేదని సమాచారం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శులు అజేయకల్లం, పీవీ రమేష్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి కలిశారు. రాష్ట్ర విభజనకు సంబంధించి పలు ఉద్యోగ సంఘాలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కలుస్తున్న నేపథ్యంలో, విభజన కమిటీకి నేతృత్వం వహిస్తున్న అధికారులు కేసీఆర్ను కలిసి వాస్తవ పరిస్థితులను వివరించాలని నిర్ణయించుకున్నారు. అధికారులు వెళ్లే సమయానికి కేసీఆర్ ఇతరులతో సమావేశంలో ఉండడంతో ఆలస్యం జరిగినట్లు సమాచారం. దీనితో అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏమీ ఇవ్వలేదని తెలిసింది. అయితే విభజన ప్రక్రియలో అపోహలు రాకుండా ఉండడానికి వీలుగా వీరు విభజన జరుగుతున్న తీరును కేసీఆర్కు మౌఖికంగా వివరించారు. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి తుది నిర్ణయం ఇంకా జరగలేదని, ఇప్పుడు ఇస్తున్నది కూడా తాత్కాలిక కేటాయింపులు మాత్రమేనని.. రెండు ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత శాశ్వత కేటాయింపులు ఉం టాయని అధికారవర్గాలు కేసీ ఆర్కు వివరించినట్టు తెలి సింది. ఉద్యోగుల కేటాయిం పుల్లో తెలంగాణ ఉద్యోగులకు నష్టం కలగరాదని కేసీఆర్ స్పష్టం చేసినట్టు సమాచారం. జూన్ 2 నాటికి సాధ్యమైనంతగా విభజన ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నట్టు తెలిసింది. -
IASల మధ్య రాజుకున్న చిచ్చు
-
సీఎస్ పర్యవేక్షణలో టి.బిల్లుపై కసరత్తులు పూర్తి
హైదరాబాద్: ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013’కు సంబంధించి తుది ప్రక్రియ ముగిసింది. బిల్లుపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను, సీఎం ప్రతిపాదించిన తిరస్కరణ తీర్మానాన్ని వేర్వేరుగా ప్రత్యేక విమానంలో సోమవారం హస్తినకు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. సీఎస్ పర్యవేక్షణలో టి.బిల్లుకు తుది మెరుగులు దిద్దిన అధికారులు అసెంబ్లీ అభిప్రాయాలను జత చేసి రేపు ఢిల్లీకి పంపనున్నారు. రేపు ఉదయం 9.40 గం.లకు ఉన్నతాధికారులు టి.బిల్లును విమానంలో ఢిల్లీకి తీసుకువెళ్లనున్నారు. రాష్ట్రపతి నుంచి వచ్చిన తెలంగాణ బిల్లుపై గత నెల 30వ తేదీ వరకు అసెంబ్లీలో చర్చ జరిగింది. శాసనసభ, మండలిలో వ్యక్తమైన అభిప్రాయాలను శాసనసభ సచివాలయ అధికారులు గత రెండు రోజులుగా క్రోడీకరించి సమగ్ర నివేదికను రూపొందించారు. శనివారం సాయంత్రం దానికి తుది మెరుగులు దిద్ది శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ముందుంచారు. -
రోడ్డుకు అడ్డంగా ఉన్న ప్రార్థనా మందిరాలు తొలగించండి
సాక్షి, హైదరాబాద్: పట్టణాలు, నగరాల్లోని రహదారులపై అనుమతి లేకుండా అడ్డంగా వెలసిన ప్రార్థనా మందిరాలను నెలరోజుల్లోగా తొలగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ప్రసన్న కుమార్ మహంతి పురపాలక శాఖను ఆదేశించారు. రహదారులపై వెలసిన ప్రార్థనా మందిరాలు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పును తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఇటీవల దీనిపై నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని మెమో రూపంలో పురపాలక శాఖతోపాటు, జిల్లాల పోలీసు ఉన్నతాధికారులు, కలెక్టర్లు, అన్ని మున్సిపాలిటీల కమిషనర్లకు పంపారు. జిల్లాల్లో కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్లతో కమిటీ ఏర్పాటు చేసి పట్టణాలు, నగరాల్లోని అనధికార ప్రార్థనా సంస్థలను తొలగించడం, అడ్డంకిగా మారిన వాటిని స్థానిక ప్రజలు, మతపరమైన నాయకులను సంప్రదించి వాటిని మరోచోటకు తరలించే కార్యక్రమాలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రతీనెలా దీనికి సంబంధించి నివేదికలను పురపాలక శాఖ సంచాలకులకు ఇవ్వాలని ఆదేశించారు. -
గవర్నర్కా...సీఎస్కా?
-
నేడు సీఎస్కు సమ్మె నోటీసు
-
ఎస్మాను ప్రయోగించిన భయపడేది లేదు: అశోక్ బాబు
-
నేటి అర్ధరాత్రి నుంచి APNGOల సమ్మె
-
'విభజనపై నిర్ణయం తీసుకున్న తీరు బాధాకరం'
-
12 అర్ధరాత్రి నుంచి ఎపిఎన్జిఓల సమ్మె
-
సమైక్య ఉద్యమం, ఉద్రిక్తలపై డీజీపీ నివేదిక