Deepinder Goyal
-
మారిన జొమాటో పేరు: సీఈఓ ట్వీట్ వైరల్
ప్రముఖ ఫుడ్ అండ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో గురువారం (ఫిబ్రవరి 6) కంపెనీ పేరును "ఎటర్నల్"గా మారుస్తున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి ఓ కొత్త లోగోను ఆవిష్కరించింది. ఈ మేరకు కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ వాటాదారులకు ఓ లేఖ రాశారు.మేము బ్లింకిట్ను కొనుగోలు చేసినప్పుడు.. కంపెనీ లేదా బ్రాండ్/యాప్ మధ్య తేడాను గుర్తించడానికి 'ఎటర్నల్' [జోమాటోకు బదులుగా] ఉపయోగించడం ప్రారంభించాము. ఇప్పుడు అధికారికంగా వెల్లడిస్తున్నామని అన్నారు.ఇకపై జొమాటో లిమిటెడ్.. ఎటర్నల్ లిమిటెడ్ అవుతుంది. అయితే జొమాటో బ్రాండ్ లేదా యాప్ పేరులో అటువంటి మార్పు ఉండబోదని పేర్కొన్నారు. వెబ్సైట్ కూడా జొమాటో.కామ్ నుంచి ఎటర్నల్.కామ్ అవుతుంది. దీనికి వాటాదారుల ఆమోదం కూడా లభించిందని అన్నారు. ఎటర్నల్లో నాలుగు ప్రధాన వ్యాపారాలు ఉంటాయి. అవి ఫుడ్ డెలివరీ వర్టికల్ జొమాటో, క్విక్-కామర్స్ యూనిట్ బ్లింకిట్, లైవ్ ఈవెంట్స్ బిజినెస్ డిస్ట్రిక్ట్, కిచెన్ సప్లైస్ యూనిట్ హైపర్ప్యూర్.Announcement - https://t.co/UN3aL8XuR7— Deepinder Goyal (@deepigoyal) February 6, 2025 -
క్షమించండి.. మళ్ళీ ఇలా జరగదు: జొమాటో సీఈఓ
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ 'జొమాటో' (Zomato) సీఈఓ 'దీపిందర్ గోయల్' (Deepinder Goyal) వినియోగదారులకు క్షమాపణలు చెప్పారు. ఇంతకీ గోయల్ ఎందుకు సారీ చెప్పారు? దీనికి కారణం ఏమిటనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.జొమాటో వెజిటేరియన్ ఫుడ్ డెలివీలపై ప్రత్యేకంగా ఎక్కువ చార్జీలు వసూలు చేస్తోంది. ఈ విషయాన్ని రోహిత్ రంజన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'వెజ్ మోడ్ ఎనేబుల్మెంట్ ఫీ' పేరుతో ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారని వెల్లడించారు. అంతే కాకుండా.. ఈ రోజుల్లో భారతదేశంలో శాఖాహారిగా ఉండటం శాపంలా అనిపిస్తుందని లింక్డ్ఇన్లో పేర్కొన్నారు.సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించడం మాత్రమే కాకుండా.. ఫీజుకు సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ కూడా షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు జొమాటోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్విగ్గీలో శాకాహార డెలివరీలపై ఎటువంటి ఛార్జీలు వసూలుచేయడం లేదని.. వెజిటేరియన్లను కూడా సమానంగా చూస్తున్నందుకు స్విగ్గీకి ధన్యవాదాలు తెలిపారు.ఈ కొత్త ఛార్జ్ సమస్యపై నెటిజన్లు స్పందిస్తూ.. ఇలాంటి ప్లాట్ఫామ్ ఫీజులను ఎందుకు వసూలు చేస్తున్నారు. ఇలా ఎన్ని రకాలుగా ఫీజులు వసూలు చేస్తారని ఆగ్రహించారు. ఈ పోస్టుపై జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ స్పందిస్తూ.. దీనిని మా దృష్టికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు. తప్పు జరిగినందుకు క్షమించండి. ఈ ఫీజును ఈ రోజు నుంచే తొలగిస్తున్నామని, ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా చూస్తామని ఆయన అన్నారు.ఇదీ చదవండి: జొమాటో సీఈఓ కీలక ప్రకటన.. మరో రెండేళ్లు జీతం తీసుకోను -
స్వయంకృషితో ఎదిగిన టాప్ 10 కంపెనీలు
-
జొమాటో సీఈఓ గ్యారేజిలో ఇన్ని కార్లు ఉన్నాయా (ఫోటోలు)
-
మరో ఖరీదైన కారు కొన్న జొమాటో సీఈఓ: ధర ఎన్ని కోట్లో తెలుసా?
జొమాటో ఫౌండర్ అండ్ సీఈఓ 'దీపిందర్ గోయల్' తన గ్యారేజిలో మరో ఖరీదైన 'ఆస్టన్ మార్టిన్ వాంటేజ్' కారును చేర్చారు. రూ.3.99 కోట్ల ప్రారంభ ధర వద్ద లభిస్తున్న ఈ కారును ఇప్పటి వరకు ఎవరూ కొనుగోలు చేయలేదు. కాబట్టి ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కారును కొన్న మొదటి వ్యక్తిగా గోయల్ కొత్త రికార్డ్ క్రియేట్ చేసాడు.దీపిందర్ గోయల్ కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో గుర్గావ్లోని పార్కింగ్ వద్ద ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ ఉండటం చూడవచ్చు. ఇప్పటికే ఈయన గ్యారేజిలో ఆస్టన్ మార్టిన్ డీబీ12 కారుకు కూడా కొనుగోలు చేశారు. కాబట్టి ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ అనేది బ్రాండ్కు చెందిన రెండో కారు.ఆస్టన్ మార్టిన్ ఈ ఏడాది ఆగస్ట్లో కొత్త వాంటేజ్ను ప్రారంభించింది. ఇది టూ-డోర్ కూపే. ఇందులో పెద్ద గ్రిల్, వర్టికల్ ఎయిర్ కర్టెన్లు, రివైజ్డ్ బోనెట్, హై పెర్ఫార్మెన్స్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్లు, మెరుగైన ఫెండర్ ఎయిర్ డక్ట్లు, రివైజ్డ్ రియర్ బంపర్, రియర్ డిఫ్యూజర్, 21 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి.10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, 15-స్పీకర్ ఆడియో సిస్టమ్, కొత్త స్టీరింగ్ వీల్, ఫిజికల్ టోగుల్స్ వంటి ఇంటీరియర్ ఫీచర్స్ కూడా ఇందులో చూడవచ్చు. ఈ కారులోని 4.0 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజిన్ 502.88 Bhp పవర్, 675 Nm టార్క్ అందిస్తుంది. కేవలం 3.5 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమయ్యే ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 325 కిమీ కంటే ఎక్కువ.దీపిందర్ గోయల్ గ్యారేజిలోని ఇతర కార్లుదీపిందర్ గోయల్ గ్యారేజిలో ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కారు మాత్రమే కాకుండా.. ఆస్టన్ మార్టిన్ డీబీ12, బీఎండబ్ల్యూ ఎం8 కాంపిటీషన్, ఫెరారీ రోమా, పోర్స్చే 911 టర్బో ఎస్, లంబోర్ఘిని ఉరుస్, పోర్స్చే కారెరా ఎస్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. View this post on Instagram A post shared by Automobili Ardent India (@automobiliardent) -
ప్రత్యేక ఆఫర్ను ఆమోదించిన ‘జీతం లేని ఆఫీసర్’!
జొమాటో గోల్డ్ మెంబర్షిప్ ప్రోగ్రామ్ కోసం ‘స్పెషల్ వీకెండ్ ఆఫర్’ను ప్రవేశపెట్టింది. అందుకు చీఫ్ ఆఫ్ స్టాప్ ఆమోదం లభించినట్లు కంపెనీ పేర్కొంది. ఇటీవల జొమాటో సీఈఓ దీపిందర్గోయల్ ఓ ప్రకటన చేస్తూ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్థానంలో పని చేసేందుకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చని చెప్పారు. అయితే ఇందులో చేరినవారికి జీతం ఉండదు, పైగా ఉద్యోగంలో చేరిన వాళ్ళే రూ.20 లక్షలు సంస్థకు ఇవ్వాలని చెప్పారు. అయినాసరే ఈ ప్రకటన వెలువడిన తర్వాత దాదాపు 10 వేలమంది ఉద్యోగంలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నారు.ఇదీ చదవండి: చావు ఏ రోజో చెప్పే ఏఐ!ఈ వింత ఉద్యోగ ప్రకటనపై నెటిజన్లు విభిన్నంగా స్పందించడంతో జొమాటో సీఈఓ గోయల్ స్పందిస్తూ రూ.20 లక్షలు చెల్లించడం అనేది కేవలం వడపోత కోసం మాత్రమే అని పేర్కొంటూ.. రూ.20 లక్షలు చెల్లించే స్తోమత ఉన్న అభ్యర్థుల దరఖాస్తులను తిరస్కరించనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. తాజాగా కంపెనీ ప్రారంభించిన గోల్డ్ మెంబర్షిప్ ప్రోగ్రామ్ కోసం ‘స్పెషల్ వీకెండ్ ఆఫర్’ ప్రవేశపెట్టేందుకు చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆమోదం లభించినట్లు కంపెనీ తెలిపింది. ఈ పోస్ట్ కోసమే గోయల్ వింత ఉద్యోగ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. -
జొమాటో సీఈఓ కీలక ప్రకటన.. మరో రెండేళ్లు జీతం తీసుకోను
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లలో జొమాటో ఒకటి. ఈ కంపెనీ సీఈఓ 'దీపిందర్ గోయల్' మరో రెండేళ్లు (2026 మార్చి 31 వరకు) జీతం తీసుకోనని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యూఐపీ) డాక్యుమెంట్లలో వెల్లడించారు.దీపిందర్ గోయల్ 2021లోనే 36 నెలలు లేదా మూడేళ్లు జీతం తీసుకోవడం లేదు. అయితే ఇప్పుడు దీనిని మరో రెండేళ్లు పొడిగించారు. అంటే 2025-26 ఆర్ధిక సంవత్సరం వరకు (మొత్తం ఐదేళ్లు) గోయల్ జీతం తీసుకోకుండా ఉంటారు. జీతం వద్దనుకున్నప్పటికీ గోయల్ జొమాటో సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగుతారు.దీపిందర్ గోయల్ జీతాన్ని వదులుకున్నప్పటికీ.. ఈయనకు కంపెనీలో భారీ వాటా ఉంది. నవంబర్ 25 నాటికి, జొమాటో ముగింపు షేరు ధర ఆధారంగా కంపెనీలో అతని వాటా విలువ సుమారు రూ.10,000 కోట్లు. జొమాటో షేర్స్ ఈ ఏడాది మెరుగ్గా ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు 125 శాతం పుంజుకుంది. -
దీపిందర్ గోయల్ కొత్త కారు చూశారా? ధర రూ.9 కోట్లు..
జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్.. ఎట్టకేలకు మరో ఖరీదైన 'బెంట్లీ కాంటినెంటల్ జీటీ డబ్ల్యు12 ముల్లినర్' కొనుగోలు చేశారు. దీని ధర రూ.9 కోట్లు. ఈ కారుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.భారతదేశంలో అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో ఒకటిగా ఉన్న ఈ బెంట్లీ కాంటినెంటల్ జీటీ డబ్ల్యు12 ముల్లినర్ కారును చాలా తక్కువ మంచి మాత్రమే కొనుగోలు చేశారు. ఈ జాబితాలో నటుడు రణబీర్ కపూర్ ఉన్నారు. ఇది 22 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది.ఈ కారులోని 6 లీటర్ డబ్ల్యు 12 ఇంజిన్ 650 Bhp పవర్, 900 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఈ కారులో వాహన వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి.ఇదీ చదవండి: జస్ట్ నిద్రపోయాడంతేగా.. ఉద్యోగిని తీసేసిన కంపెనీకి రూ.41 లక్షల ఫైన్దీపిందర్ గోయల్ గ్యారేజిలో ఇప్పటికే రూ. 6 కోట్ల విలువైన బెంట్లీ కారును కలిగి ఉన్నారు. ఇది కాకుండా.. ఆస్టన్ మార్టిన్ డీబీ12, ఫెరారీ రోమా, పోర్స్చే 911 టర్బో ఎస్, పోర్స్చే 911 కారెరా ఎస్, లంబోర్ఘిని ఉరుస్, బీఎండబ్ల్యూ ఎం8 కాంపిటీషన్ వంటి కార్లు గోయల్ గ్యారేజిలో ఉన్నాయి. View this post on Instagram A post shared by Car Crazy India® (@carcrazy.india) -
జీతం లేని జాబ్.. స్పందించిన మాజీ ఉద్యోగి: ట్వీట్ వైరల్
జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ జీతమే లేని ఉద్యోగానికి సంబంధించి ఒక వినూత్న ప్రకటన చేశారు. జీతం ఇవ్వకపోగా.. ఉద్యోగి రూ.20 లక్షలు చెల్లించాలని మొదట్లో పేర్కొన్నప్పటికీ.. ఇప్పుడు దానిపై కూడా ఓ క్లారిటీ ఇచ్చేసారు. ఈ జాబ్ గురించి జొమాటో మాజీ కన్స్యూమర్ ఇంజనీరింగ్ హెడ్ అర్నవ్ గుప్తా కీలక వ్యాఖ్యలు చేసారు.చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఉద్యోగానికి ఎంపికైన ఉద్యోగి మొదటి ఏడాది 20 లక్షలు చెల్లించాలని పేర్కొన్నారు. రెండో ఏడాది ఆ ఉద్యోగికి రూ. 50 లక్షలకు తగ్గకుండా వేతనం ఉంటుందని ప్రకటించారు. ఈ ఉద్యోగానికి ఏకంగా 18,000 మంది అప్లై చేసుకున్నారు. ఆ తరువాత గోయల్ స్పందిస్తూ.. రూ.20 లక్షలు చెల్లించడం అనేది కేవలం వడపోత కోసం మాత్రమే అని పేర్కొంటూ.. రూ.20 లక్షలు చెల్లించే స్తోమత ఉన్న అభ్యర్థుల దరఖాస్తులను తిరస్కరించనున్నట్లు క్లారిటీ ఇచ్చారు.ఈ వినూత్న జాబ్ ఆఫర్ గురించి మాజీ జొమాటో ఉద్యోగి మాట్లాడుతూ.. గోయల్ ఆలోచనను సమర్ధించారు. ఉద్యోగానికి ఎంపికైన ఉద్యోగి.. తాను ఎంబీఏలో చేరి నేర్చుకునేదాని కంటే కూడా ఎక్కువ నేర్చుకుంటాడని అన్నారు. పెయిడ్ ఇంటర్న్షిప్ గురించి చాలామంది తెలివి తక్కువగా ఆలోచిస్తారు. జొమాటోలో జాబ్ పొందితే.. ఆ ఆలోచనను వదిలేస్తారు. మీరు మేనేజ్మెంట్ కన్సల్టింగ్ / స్ట్రాటజీలో కెరీర్ కోసం చూస్తున్నట్లయితే.. దాని విలువ రూ.20 లక్షల కంటే ఎక్కువే అని 'అర్నవ్ గుప్తా' (Arnav Gupta) పేర్కొన్నారు.జొమాటో చీఫ్ ఆఫ్ స్టాఫ్ జాబ్జొమాటోలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్థానంలో నియామకం కాబోయే వ్యక్తి గురుగ్రామ్లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో పని చేయాల్సి ఉంటుంది. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలన్న కోరిక, జీవితంలో ఉన్నతంగా ఎదగాలనే తపన ఉన్నవారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనిపై అప్లై చేసుకునే వారికి పూర్వానుభవం అవసరం లేదు.ఇదీ చదవండి: సరైన సమయానికి.. అనువైన ఫీచర్: ఎయిర్ క్వాలిటీ ఇట్టే చెప్పేస్తుందిఉద్యోగంలో చేరిన తరువాత జొమాటో, బ్లింకిట్, హైపర్ ప్యూర్, జొమాటోకు ఆధ్వర్యంలోని ఫీడింగ్ ఇండియా ఎన్జీఓ సంస్థల వృద్ధి కోసం పని చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. త్వరలోనే ఉద్యోగిని ఎంపిక చేసి గోయల్ అధికారికంగా ప్రకటించనున్నారు.I know people are commenting various stupid things about "paid internship"Leaving this note here as someone who got the chance to work 1 year with @deepigoyal, if you're looking for a career in Management Consulting / Strategy, this is worth waaaay more than ₹20L!— Arnav Gupta (@championswimmer) November 20, 2024 -
జీతమే లేని ఉద్యోగానికి 10వేల మంది ఎగబడ్డారు
ఉద్యోగంలో చేరుతున్నామంటే.. తప్పకుండా జీతం వస్తుందని అందరికి తెలుసు. అయితే జొమాటో సీఈఓ దీపీందర్ గోయల్ ఇటీవల ఓ ప్రకటన చేస్తూ.. చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్థానంలో పని చేసేందుకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చని చెప్పారు. అయితే ఇందులో చేరినవారికి జీతం ఉండదు, పైగా ఉద్యోగంలో చేరిన వాళ్ళే రూ. 20 లక్షలు ఇవ్వాలని చెప్పారు.ఈ వింత ప్రకటన చూసిన చాలామంది, ఇదేం ప్రకటన అనుకునే ఉంటారనుకుంటే భావిస్తే.. ఊహకందని రీతిలో 24 గంటల్లో ఏకంగా 10వేలమంది అప్లై చేసుకున్నారు. ఈ విషయాన్ని దీపీందర్ గోయల్ స్వయంగా తన ఎక్స్ ఖాతాలో పేర్కొంటూ.. అప్డేట్ కోసం వేచి ఉండాలని చెప్పారు.జొమాటోలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ జాబ్జొమాటోలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్థానంలో నియామకం కాబోయే వ్యక్తి గురుగ్రామ్లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో పని చేయాల్సి ఉంటుంది. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలన్న కోరిక, జీవితంలో ఉన్నతంగా ఎదగాలనే తపన ఉన్నవారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనిపై అప్లై చేసుకునే వారికి పూర్వానుభవం అవసరం లేదు. అంతే కాకుండా ఉద్యోగంలో చేరిన తరువాత జొమాటో, బ్లింకిట్, హైపర్ ప్యూర్, జొమాటోకు ఆధ్వర్యంలోని ఫీడింగ్ ఇండియా ఎన్జీఓ సంస్థల వృద్ధి కోసం పని చేయాల్సి ఉంటుందని గోయల్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఇంటర్నెట్ లేకుండా ట్రాన్సక్షన్స్: వచ్చేస్తోంది 'యూపీఐ 123 పే'చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఉద్యోగానికి ఎంపికైన వ్యక్తికి మొదటి ఏడాది జీతం ఉండదు. అయితే ఆ ఉద్యోగి రూ. 20లక్షలు ఫీడింగ్ ఇండియాకు విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే రెండో ఏడాది రూ. 50 లక్షలకు తగ్గకుండా వేతనం ఉంటుందని గోయల్ స్పష్టం చేశారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునేవారు రెజ్యూమె (Resume) కూడా పంపించాల్సిన అవసరమే లేదు. కేవలం 200 పదాల్లో తమ గురించి తెలియజేస్తే సరిపోతుంది.Update 2: we have over 10,000 applications, a lot of them well thought through, mixed between -1. Those who have all the money 2. Those who have some of the money 3. Those who say they don’t have the money 4. Those who really don’t have the money We will be closing the… https://t.co/8a6XhgeOGk— Deepinder Goyal (@deepigoyal) November 21, 2024 -
‘ఉద్యోగం ఇస్తాం.. జీతం ఉండదు.. పైగా రూ.20 లక్షలు విరాళం’
ఉద్యోగం ఇస్తాం.. కానీ జీతం ఉండదు.. పైగా రూ.20 లక్షలు ఉద్యోగార్థులే విరాళంగా చెల్లించాలి.. అవును మీరు విన్నది నిజమే. ఇవి ఏకంగా ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ చెప్పిన మాటలు. జొమాటోలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్థానంలో పని చేసేందుకు దరఖాస్తులు కోరారు. ఈమేరకు చేసిన వినూత్న ప్రకటన సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.‘జొమాటోలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్థానంలో పని చేసేందుకు సరైన అభ్యర్థుల కోసం చూస్తున్నాం. ఈ పొజిషన్లో నియామకం కాబోయే వ్యక్తి గురుగ్రామ్లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో పని చేయాల్సి ఉంటుంది. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలన్న కోరిక, జీవితంలో ఉన్నతంగా ఎదగాలనే తపన ఉన్నవారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగార్థులకు పూర్వానుభవం అవసరంలేదు. తమ స్థానంలో చేరిన తర్వాత జొమాటో, బ్లింకిట్, హైపర్ ప్యూర్, జొమాటోకు ఆధ్వర్యంలోని ఫీడింగ్ ఇండియా ఎన్జీఓ సంస్థల వృద్ధి కోసం పని చేయాల్సి ఉంటుంది’ అన్నారు.ఉద్యోగి రూ.20 లక్షలు విరాళం‘ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి మొదటి ఏడాది ఎలాంటి వేతనం ఉండదు. పైగా ఆ వ్యక్తి రూ.20 లక్షలు ఫీడింగ్ ఇండియాకు విరాళం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగి కోరికమేరకు జొమాటో కూడా రూ.50 లక్షలు తన తరఫున ఎన్జీఓకు విరాళం ఇస్తుంది. రెండో ఏడాది నుంచి మాత్రం రూ.50 లక్షలకు తగ్గకుండా ఆ ఉద్యోగికి వేతనం చెల్లిస్తాం’ అని దీపిందర్ తెలిపారు.ఇదీ చదవండి: రూ.25 వేలతో మూడేళ్లలో రూ.33 కోట్ల వ్యాపారం!రెజ్యూమె అవసరం లేదు‘ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసేవారు రెజ్యూమె పంపాల్సిన అవసరంలేదు. 200 పదాలకు తగ్గకుండా తమ వివరాలు తెలియజేస్తూ కవర్ లెటర్ పంపించాలి. దీన్ని d@zomato.comకు పంపించాలి’ అని చెప్పారు. ఈ పోస్ట్పై పలువురు నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. రూ.20 లక్షలు ఫీజు పెట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులను దూరం చేస్తున్నట్లేనని కొందరు చెబుతున్నారు. మరికొందరు మాత్రం ఒక సక్సెస్ఫుల్ బిజినెస్మ్యాన్ను దగ్గర నుంచి చూసి నేర్చుకునే అవకాశం దొరుకుతుందంటూ కామెంట్ చేస్తున్నారు. -
ఇంటర్లో 39% మార్కులు! కట్ చేస్తే కంపెనీకి సీఈఓ
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఇటీవల ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో’లో పాల్గొన్నారు. దీపిందర్ తన బాల్యంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు.. ఇంటర్ ఫస్ట్ఇయర్లో 39 మార్కులు సాధించిన గోయల్ ఐఐటీ ఢిల్లీలో సీటు సంపాదించి జొమాటోను ఎలా స్థాపించారో వివరించారు. జీవితం తనకు ఎన్నో పాఠాలు నేర్పిందన్నారు.‘స్కూల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు చాలా భయపడుతూ ఉండేవాడిని. దానికి కారణం నేను చదువులో టాప్ స్టూడెంట్ను కాదు. ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు పరీక్షలో నేను సరైన సమాధానాలు రాయకపోయినా మా టీచర్ కావాలనే నాకు మంచి గ్రేడ్ ఇచ్చారు. దాంతో కుటుంబం, స్నేహితుల నుంచి ప్రశంసలు అందుకున్నాను. అది నాకు చాలా సంతోషాన్నిచ్చింది. కొంతకాలం తర్వాత చివరి సెమిస్టర్ పరీక్షలు వచ్చాయి. అంతకుముందు వచ్చిన మార్కులు ఫేక్ అనే విషయం నాకు తెలుసు. ఈసారి ఎలాగైనా కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి మళ్లీ ప్రశంసలు పొందాలనుకున్నాను. (నవ్వుతూ)మా ప్రశ్నపత్రాలు ప్రింట్ చేసే ప్రింటింగ్ ప్రెస్ వ్యక్తి వద్దకు వెళ్లి ముందస్తుగా ప్రశ్న పత్రాలను పొందడానికి ప్రయత్నించాను. కానీ అది సాధ్యం కాలేదు. దాంతో విజయానికి షార్ట్కట్లు లేవని అర్థం చేసుకున్నాను. నేను కష్టపడి చదవడం ప్రారంభించాను. చివరి సెమిస్టర్లో క్లాస్లో ఐదో స్థానానికి చేరుకున్నాను. ఈ విజయం నాకు జీవితంలో ఏదైనా చేయగలననే విశ్వాసాన్ని కలిగించింది’ఇంటర్ ఫస్టియర్లో 39 శాతం మార్కులే..‘కొన్ని కారణాల వల్ల నేను ఇంటర్ ఫస్టియర్(11వ తరగతి)లో 39 శాతం మార్కులే వచ్చాయి. ప్రీ-యూనివర్శిటీ ఎడ్యుకేషన్ కోసం చండీగఢ్కు వెళ్లాను. కష్టపడి చదివి ఐఐటీ-జేఈఈ క్లియర్ చేసి ఐఐటీ ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. ఇక్కడ జీవితం ఎన్నో పాఠాలు నేర్పించింది. మన ఆలోచనలు ఉన్నతంగా ఉంటే ఉన్నత వ్యక్తులను కలుస్తాం. మనం ఎంచుకున్న విభాగంలో ఎప్పుడూ మొదటిస్థానంలో ఉండేందుకు కష్టపడి పని చేయాలి. ఇది నిత్య పోరాటంగా సాగాలి’ అన్నారు.డిప్రెషన్ను అధిగమించాలంటే..‘నేను కొన్ని కారణాల వల్ల చాలాసార్లు డిప్రెషన్గా ఫీల్ అవుతుంటాను. ఈ డిప్రెషన్ సైకిల్ మూడేళ్లుంటుంది. డిప్రెషన్ సైకిల్స్ నిజానికి మంచివని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అవి నన్ను ఒక పాయింట్కి మించి మరింత ఉన్నతంగా ఆలోచించేలా చేస్తాయి. మానసిక సవాళ్లను ఎదుర్కోవడమే డిప్రెషన్కు సరైన చికిత్స. అందుకే మనం చేస్తున్న పనిలోనే డిప్రెషన్ తొలగించుకునేందుకు పరిష్కారాలు వెతకాలి. ప్రతి సైకిల్ను అధిగమించేందుకు గతంలో కంటే మరింత మెరుగ్గా ఆలోచిస్తూ పని చేస్తున్నాను’ అని అన్నారు.ముందు టొమాటో!‘ఐఐటీలో చదువు పూర్తి చేసుకున్నాక కెరియర్ ప్రారంభంలో బైన్ & కో. అనే కన్సల్టింగ్ సంస్థలో పని చేశాను. కమ్యూనికేషన్ నైపుణ్యాలు నేర్పించడంలో, వ్యూహాత్మకంగా ఆలోచించేందుకు ఇది ఎంతో తోడ్పడింది. ఎలా ఆలోచించాలో, ఏం మాట్లాడాలో ఈ సంస్థ నాకు నేర్పింది. నేను ఎప్పటికీ బైన్ అండ్ కో సంస్థకు కృతజ్ఞతతో ఉంటాను. బైన్లో పని చేస్తున్న సమయంలోనే జొమాటో ఆలోచన వచ్చింది. కంపెనీ స్థాపించాలనే ఉద్దేశంతో పేరును ఖరారు చేయాలనే సందర్భంలో ‘టొమోటో’అని అనుకున్నాం. దానికి సంబంధించిన డొమైన్ పేరు ‘టొమోటో డాట్ కామ్’ను కూడా ఏర్పాటు చేశాం. కానీ చివరకు దాన్ని జొమాటోగా నిర్ణయించాం’ అన్నారు.ఇదీ చదవండి: 6:15 గంటల్లో రూ.5 లక్షల కోట్లు ఆవిరి!అంతిమంగా, కొన్ని ఎదురుదెబ్బలు, తను నేర్చుకున్న జీవిత పాఠాలే జొమాటోను ఏర్పాటు చేయడానికి గోయల్కు ధైర్యాన్ని అందించాయి. తను కోరుకుంటే ఏదైనా చేయగలననే విశ్వాసాన్ని ఇచ్చాయి. తాత్కాలిక విజయాలకు పొంగిపోవడం, అపజయాలకు కుంగిపోకుండా జీవితంలో దీర్ఘకాల లక్ష్యాలను ఏర్పరుచుకుని దాన్ని సాధించాలనే గట్టి తపనతో ముందుకెళ్లాలి. -
నాలుగు లైన్ల పోస్ట్కు స్పందించి జాబ్ ఆఫర్!
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఇటీవల తీసుకొచ్చిన కొత్త ఫీచర్ ‘ఫుడ్ రెస్క్యూ’కు సంబంధించి ఓ నెటిజన్ చేసిన పోస్ట్పై కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ స్పందించారు. ఆ నెటిజన్కు జాబ్ కూడా ఆఫర్ చేశారు. అసలు ఆ నెటిజన్ పోస్టేంటి.. సీఈఓ ఎందుకు జాబ్ ఆఫర్ చేయాల్సి వచ్చిందో తెలుసుకుందాం.ఆహార వృథాను అరికట్టడానికి జొమాటో కొత్తగా ‘ఫుడ్ రెస్క్యూ’ అనే ఫీచర్ను తీసుకొచ్చింది. ఆర్డర్ క్యాన్సిల్ కారణంగా ఉత్పన్నమయ్యే ఆహార వృథా సమస్యను పరిష్కరించడానికి ఈ ఫీచర్ను ప్రవేశపెట్టినట్లు జొమాటో సీఈఓ గోయల్ ఇటీవల ప్రకటించారు. కొత్త ఫీచర్ ద్వారా కస్టమర్లు ఆర్డర్ను క్యాన్సిల్ చేసిన తర్వాత నిమిషాల వ్యవధిలో ఫుడ్ను తగ్గింపు ధరతో ఇతర కస్టమర్లు పొందవచ్చు. జొమాటోలో నెలకు సగటున దాదాపు నాలుగు లక్షల ఆర్డర్లు క్యాన్సిల్ అవుతున్నాయి.We don't encourage order cancellation at Zomato, because it leads to a tremendous amount of food wastage.Inspite of stringent policies, and and a no-refund policy for cancellations, more than 4 lakh perfectly good orders get canceled on Zomato, for various reasons by customers.… pic.twitter.com/fGFQQNgzGJ— Deepinder Goyal (@deepigoyal) November 10, 2024కొత్త ఫీచర్కు సంబంధించిన ప్రకటనపై సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. క్యాన్సిల్ చేసిన ఆర్డర్లను కొనుగోలు చేయడంలో భద్రత ప్రశ్నార్థకంగా ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. చాలా మంది వినియోగదారులు ఆహారం వృథా అవ్వకుండా రాయితీపై భోజన సదుపాయాన్ని కల్పించే విధానాన్ని ప్రశంసిస్తున్నారు. అయితే బెంగళూరుకు చెందిన ప్రోడక్ట్ మేనేజర్ భాను అనే నెటిజన్ ఈ ఫీచర్ దుర్వినియోగాన్ని నిరోధించడానికి మరిన్ని నిబంధనలు అమలు చేయాలని కంపెనీకి సూచిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.validations1.should not be applicable to COD2.Cancellation should not be allowed if the delivery reaches 500 m to the delivery point 3.Chances of 2 idiots sharing meals ordering and cancelling at the same time getting a discount place 4.< two cancellations are allowed/ month.— Bhanu (@BhanuTasp) November 10, 2024ఇదీ చదవండి: ఏఐని ఎక్కువగా వాడుతున్నది మనమే..‘ఫుడ్ రెస్క్యూ ఫీచర్లో క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లను మినహాయించాలి. డెలివరీ పార్ట్నర్ వినియోగదారుల లోకేషన్కు 500 మీటర్ల పరిధిలో ఉంటే కస్టమర్లు ఆర్డర్లను రద్దు చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. ఓకే స్థానంలో ఉన్న ఇద్దరు వినియోగదారుల్లో ఒకరు ఫుడ్ బుక్ చేసి క్యాన్సిల్ చేసిన వెంటనే పక్కనే ఉన్న మరో కస్టమర్ దాన్ని రాయితీతో తిరిగి బుక్ చేసి ఇద్దరూ షేర్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మరిన్ని నిబంధనలు తీసుకురావాలి. ఈ ఫీచర్ దుర్వినియోగాన్ని అరికట్టడానికి కంపెనీ ప్రతి కస్టమర్కు క్యాన్సిల్ చేసే ఆర్డర్లలో పరిమితులు విధించాలి. రోజుకు గరిష్ఠంగా రెండు ఆర్డర్లు మాత్రమే రద్దు చేసేందుకు వీలు కల్పించాలి’ అని నెటిజన్ పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన జొమాటో సీఈఓ ఈ సూచనలు ఇప్పటికే కొత్త ఫీచర్లో చేర్చబడినట్లు చెప్పారు. నెటిజన్ సలహాలు, ఆలోచనలను మెచ్చుకుంటూ తన వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ‘ఎవరు మీరు ఏమి చేస్తారు? మీ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నాను. మీకు ఇష్టమైతే మనం కలిసి పని చేద్దాం’ అని పోస్ట్ చేశారు. -
‘తను నా కోసమే పుట్టిందనిపించింది’
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఇటీవల తన భార్య గ్రేసియా మునోజ్తో కలిసి ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో’లో పాల్గొన్నారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, తన భార్య, రచయిత్రి సుధా మూర్తితో వేదిక పంచుకున్నారు. దీపిందర్ తన భార్యను ముందుగా ఎలా కలుసుకున్నారో ఈ కార్యక్రమంలో తెలిపారు.‘గ్రేసియాను కలవడానికి ముందు చాలా కాలంపాటు ఒంటరిగా ఉన్నాను. స్నేహితులను తరచు కలుస్తుండేవాడిని. అందులో ఒక స్నేహితుడు పెళ్లి చేసుకోకూడదని సలహా ఇచ్చాడు. ఇంకో స్నేహితుడు మాత్రం నాకు గ్రేసియాను పరిచయం చేశాడు. ఆ సమయంలో తాను నాకోసమే పుట్టిందనిపించింది. చాలా కొద్ది కాలంలోనే మేం కలిపిపోయాం’ అని చెప్పారు. మెక్సికోకు చెందిన గ్రేసియాను కపిల్ భారతీయ వంటకాల గురించి అడిగారు. పంజాబీ వంటకాలకు ప్రాధాన్యతనిస్తానని ఆమె చెప్పారు. ‘ఛోలే భతుర్’ తన ఫేవరెట్ డిష్ అని తెలిపారు. ఇంట్లో ‘పంజాబీ రసోయి’ తయారు చేసుకుంటారా అని కపిల్ అడిగినప్పుడు, తాము జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడానికే ఇష్టపడుతామని చెప్పారు.ఇదీ చదవండి: ఒకే సంస్థ.. ఒకే హోదా.. రిటైర్మెంట్ వయసులో తేడా!గ్రేసియా మునోజ్ మోడలింగ్, లగ్జరీ ఫ్యాషన్లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. 2022లో యునైటెడ్ స్టేట్స్లో మెట్రోపాలిటన్ ఫ్యాషన్ వీక్ అవార్డును అందుకున్నారు. పిల్లల పోషణ, మహిళల సాధికారతపై దృష్టి సారించి స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీపిందర్, గ్రేసియా ఈ సంవత్సరం ప్రారంభంలో ఒక ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇది దీపిందర్కు రెండో వివాహం. అతను గతంలో ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ కంచన్ జోషిని వివాహం చేసుకున్నారు. -
The Great Indian Kapil Show: చూతము రారండీ
వయసుతో సంబంధం లేకుండా మహిళల్లో పెద్దరికం ఉట్టిపడుతూ ఉంటుంది. చిన్నవాళ్ళయినా, పెద్దవాళ్ళయినా పెద్దరికం అన్నది మహిళలకు ఒక సొగసు. మళ్లీ మగవాళ్లు అలాక్కాదు. వాళ్లకెంత వయసు వచ్చినా కూడా మాటల్లో, చేతల్లో చిన్నవాళ్లే... మహిళలతో పోలిస్తే’!సుధామూర్తి వయసు 74. మూర్తి గారి వయసు 78. ఆమె ఆగస్టు 19 న పుడితే, ఆయన ఆగస్టు 20 న జన్మించారు. తేదీలను బట్టి చూసినా సుధ ఆయన కన్నా ఒకరోజు ‘పెద్దరికం ’ ఉన్నవారు. (తమాషాకు లెండి). సరే, సంగతి ఏమిటంటే... ఈ దంపతులిద్దరూ ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’కు ఆహ్వానం వస్తే వెళ్లారు. సాధారణంగా కపిల్ బాలీవుడ్ సెలబ్రిటీలను తన టాక్ షో కు పిలుస్తుంటారు. అందుకు భిన్నంగా ఈసారి ఈ బిజినెస్ దిగ్గజ దంపతుల్ని ఒప్పించి రప్పించారు. వారితో టాక్ షో సరదాగా నడిచింది. భర్త గురించి భార్యను, భార్య గురించి భర్తను కొన్ని ప్రశ్నలు అడిగారు యాక్టర్ కమ్ కమెడియన్ కపిల్ శర్మ. వాటిల్లో ఒక ప్రశ్న : ‘మొదటిసారి సుధాజీ మీ ఇంటికి వచ్చినప్పుడు మీకెలా అనిపించింది?’ అని అడిగారు కపిల్. దానికి మూర్తి గారు చాలా గంభీరంగా, నిజాయితీగా సమాధానం ఇచ్చారు. ‘ఆ ఫీలింగ్ ఎలా ఉందంటే.. ఒక స్వచ్ఛమైన గాలి పరిమళం నా శ్వాసలోనికి వెళ్లినట్లుగా...’ అన్నారు. ఆ మాటకు వెంటనే సుధామూర్తి... ‘అప్పుడు ఆయన వయసులో ఉన్నారు కదా’ అన్నారు జోకింగ్గా. దెబ్బకు ఆడియెన్స్ భళ్లుమన్నారు. నిజానికి సుధామూర్తి ఉద్దేశ్యం ఆడియెన్స్ని నవ్వించడం కాదు, భర్తలోని కవితాత్మక భావోద్వేగాన్ని కాస్త నెమ్మది పరచటం. పైగా అంతమంది ఎదుట భర్త తనను అంతగా ‘అడ్మైర్’ చెయ్యటంతో ఆమెలోని పెద్దరికం మధ్యలోనే కల్పించుకుని ఆయన్ని ఆపవలసి వచ్చినట్లుంది. ఆపకపోతే... ఇంకా ఏం చెబుతారో అని. అసలే వాళ్ళది లవ్ మ్యారేజ్. ఈ నెల 9న నెట్ఫ్లెక్స్లో స్ట్రీమ్ ఆయ్యే ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ ఎపిసోడ్లో మూర్తి గారి ఈ అమాయకత్వాన్ని, సుధామూర్తి పెద్దరికాన్ని కనులారా వీక్షించవచ్చు. (డాటర్ ఆఫ్ ఆలియ : రాహా ‘ఆహా’ అంటూ వింటుంది)ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ అంటే జోక్ కాదు, నిజాలు ఎవ్వరూ చెప్పరు: రాధిక ఆప్టే కష్టాలు -
సీఈవో అయినా డెలివరీ బాయ్గా వెళ్తే అంతే..
చిరుద్యోగుల పట్ల సమాజంలో చాలా చిన్న చూపు ఉంది. ముఖ్యంగా ఫుడ్ డెలివరీ సిబ్బంది నిత్యం ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ పనిచేస్తున్నారు. వారు పడుతున్న ఇబ్బందులు స్వయంగా జొమాటో సీఈవో ఎదుర్కోవాల్సి ఉంది.విషయం ఏంటంటే ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ అప్పుడప్పుడూ డెలివరీ బాయ్ అవతారం ఎత్తి ఆర్డర్లు డెలివరీ చేస్తుంటారు. అందులో భాగంగానే తన సతీమణి గ్రీసియా మునోజ్తో కలిసి తాజాగా డెలివరీ ఎగ్జిక్యూటివ్స్గా రెస్టారెంట్స్, మాల్స్ తిరిగారు.ఇలాగే ఆర్డర్ పికప్ చేసుకునేందుకు గురుగ్రామ్లోని ఓ మాల్కు వెళ్లగా డెలివరీ బాయ్ దుస్తుల్లో ఉన్న వారిని అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. డెలివరీ బాయ్స్ లిఫ్ట్ ఉపయోగించేందుకు అనుమతి లేదని, మెట్లు ఎక్కి వెళ్లాలని సూచించారు. దీంతో చేసేది లేక మూడో అంతస్తులోని రెస్టారెంట్కు మెట్లు ఎక్కి వెళ్లి ఆర్డర్ పికప్ చేసుకున్నారు.తమకు ఎదురైన చేదు అనుభవాన్ని గురించి దీపిందర్ గోయల్ ‘ఎక్స్’లో ప్టోస్ట్ చేశారు. వీడియోలను షేర్ చేశారు. డెలివరీ భాగస్వాములందరికీ పని పరిస్థితులను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని గ్రహించినట్లు చెప్పుకొచ్చారు. మాల్స్ వారు కూడా డెలివరీ సిబ్బంది పట్ల మానవత్వం చూపించాలని కోరారు. గోయల్ పోస్ట్కు ప్రతిస్పందిస్తూ, మాల్స్ మాత్రమే కాదు.. చాలా సొసైటీల్లోనూ పరిస్థితి ఇలాగే ఉందని చాలా మంది వినియోగదారులు వాపోతూ కామెంట్లు పెట్టారు.During my second order, I realised that we need to work with malls more closely to improve working conditions for all delivery partners. And malls also need to be more humane to delivery partners. What do you think? pic.twitter.com/vgccgyH8oE— Deepinder Goyal (@deepigoyal) October 6, 2024 -
డెలివరీ ఏజెంట్లుగా దీపిందర్ గోయల్ దంపతులు
జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఇటీవల ఫుడ్ డెలివరీ ఏజెంట్ అవతారం ఎత్తారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డెలివరీ ఏజెంట్ యూనిఫామ్ వేసుకుని గురుగ్రామ్లో కస్టమర్లకు స్వయంగా ఫుడ్ డెలివరీ చేశారు.దీపిందర్ గోయల్ ఆయన భార్య గ్రేసియా మునోజ్తో కలిసి బైకుపై డెలివరీ ఏజెంట్లుగా వెళ్లడం ఇక్కడ చూడవచ్చు. అలా.. మోడ్ బై ఆకాంక్ష ఆఫీసులో గోయల్ ఫుడ్ డెలివరీ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోను అక్కడ ఉద్యోగి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. సరిగ్గా ఎలా చేయాలో బాస్ నుంచి నేర్చుకోండి అంటూ వ్యాఖ్యానించారు.డెలివరీ ఏజెంట్గా తన రోజు గురించి గోయల్ సోషల్ మీడియాలో వెల్లడించారు. రెండు రోజుల క్రితం గ్రేసియా మునోజ్తో ఆర్డర్లను డెలివరీ చేయడానికి బయలుదేరాను అని గోయల్ పేర్కొన్నారు. ఇందులో గోయల్ డెలివరీ బ్యాగ్ భుజాన వేసుకుని, తన భార్యతో కలిసి లొకేషన్ చూసుకుంటూ వెళ్లడం చూడవచ్చు.ఇదీ చదవండి: రూ.1.89 కోట్ల కొత్త బీఎండబ్ల్యూ కారు ఇదే.. పూర్తి వివరాలుదీపిందర్ గోయల్ ఫుడ్ డెలివరీ చేసిన తన అనుభవాలను పంచుకుంటూ.. మా కస్టమర్లకు ఆహారం అందించడం చాలా ఆనందంగా ఉందని, ఈ రైడ్ను తాను ఎంతగానో ఆస్వాదించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. View this post on Instagram A post shared by Deepinder Goyal (@deepigoyal) -
జొమాటో ఉద్యోగులకు 1.2 కోట్ల స్టాక్ ఆప్షన్లు
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో లిమిటెడ్ అర్హులైన తమ ఉద్యోగులకు దాదాపు 1.2 కోట్ల స్టాక్ ఆప్షన్లను మంజూరు చేయడానికి ఆమోదించింది. ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్(ESOP)గా మంజూరు చేసిన మొత్తం షేర్ల సంఖ్య 11,997,768 అని ఇటీవల ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో జొమాటో ప్రకటించింది.శుక్రవారం వారంతపు ట్రేడింగ్ సెషన్లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో జొమాటో షేర్లు రూ.275.20 వద్ద ముగిశాయి. దీంతో ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ మొత్తం విలువ రూ.330.17 కోట్లుగా మారింది. మొత్తం ఆప్షన్లలో 11,997,652 ఆప్షన్లు ‘ఈఎస్ఓపీ 2021’ ప్లాన్ కిందకు వస్తాయి. మరో 116 ఆప్షన్లు ‘ఈఎస్ఓపీ 2014’ కిందకు వస్తాయి. కంపెనీ వాటిని "ఫుడీ బే ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్"గా పేర్కొంది.ఈఎస్ఓపీలు అనేవి ఉద్యోగులకు పరిహారంగా ఇచ్చే కంపెనీ స్టాక్ ఆప్షన్లు. ఉద్యోగుల పనితీరు ఆధారంగా వారికి ప్రోత్సాహకంగా కంపెనీలు స్టాక్ ఆప్షన్లను కేటాయిస్తూ ఉంటాయి. వీటిని ఉద్యోగి కావాలంటే ఈక్విటీ షేర్గా కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది. -
ఉన్నట్టుండి.. తప్పుకొన్న జొమాటో కోఫౌండర్
జొమాటో సహ వ్యవస్థాపకురాలు, చీఫ్ పీపుల్ ఆఫీసర్ ఆకృతి చోప్రా సంస్థ నుంచి తప్పుకొన్నారు. కంపెనీలో 13 సంవత్సరాల పాటు సుదీర్ఘ కాలం పనిచేసిన ఆమె ఉన్నట్టుండి వైదొలిగారు. ఆకృతి చోప్రా రాజీనామా చేసినట్లు జొమాటో సెప్టెంబర్ 27న స్టాక్ ఎక్స్ఛేంజ్కు తెలియజేసింది."దీపీ (దీపిందర్ గోయల్).. చర్చించినట్లుగా ఈరోజు సెప్టెంబర్ 27 నుండి అధికారికంగా నా రాజీనామాను పంపుతున్నాను. ఇది 13 సంవత్సరాల అద్భుతమైన ప్రయాణం. ప్రతిదానికీ ధన్యవాదాలు. నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను " అని చోప్రా తన ఎగ్జిట్ మెయిల్లో రాసుకొచ్చారు. దీన్ని స్టాక్ ఎక్స్ఛేంజ్లో కంపెనీ అప్లోడ్ చేసింది.ఇదీ చదవండి: పడిలేచిన కెరటంలా అనిల్ అంబానీ..బ్లింకిట్ సీఈవో అయిన అల్బిందర్ ధిండా సతీమణే ఈ ఆకృతి చోప్రా. జొమాటోలో ఇటీవల అగ్రస్థాయి ఉద్యోగులు ఒక్కొక్కరుగా సంస్థను వీడుతున్నారు. వీరి సరసన ఇప్పుడు చోప్రా కూడా చేరారు. కోఫౌండర్ మోహిత్ గుప్తా కంపెనీని విడిచిపెట్టిన తర్వాత 2023 జనవరిలో మాజీ సీటీవో గుంజన్ పాటిదార్ బయటకు వెళ్లిపోయారు.దాదాపు అదే సమయంలో జొమాటో న్యూ ఇనీషియేటివ్స్ హెడ్, ఫుడ్ డెలివరీ మాజీ చీఫ్ రాహుల్ గంజూ, ఇంటర్సిటీ లెజెండ్స్ సర్వీస్ హెడ్ సిద్ధార్థ్ ఝవార్ కూడా నిష్క్రమించారు. పాటిదార్, పంకజ్ చద్దా, గౌరవ్ గుప్తా, మోహిత్ గుప్తా తర్వాత సుమారు రెండేళ్లలో కంపెనీ నుండి నిష్క్రమించిన ఐదో కో ఫౌండర్ చోప్రా. వీరిలో చద్దా 2018లో, గౌరవ్ గుప్తా 2021లో సంస్థను విడిచి వెళ్లారు. -
జొమాటో కొత్త ఫీచర్.. దీపిందర్ వీకెండ్ అప్డేట్
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కొత్త ఫీచర్ను ప్రకటించింది. ఎక్కువ మంది ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు ఒకే ఫోన్ను మార్చుకునే ఇబ్బంది లేకుండా కొత్త ఫీచర్ను తీసుకొచ్చినట్లు జొమాటో ఫౌండర్, సీఈవో దీపిందర్ గోయల్ తెలిపారు.ఈ కొత్త ఫీచర్ని 'గ్రూప్ ఆర్డరింగ్' అని పిలుస్తారు. ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు యూజర్లు తమ స్నేహితులకు లింక్లను షేర్ చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. తద్వారా వారు తమకు నచ్చిన వంటకాల జాబితాను సలువుగా జోడించవచ్చు. దీంతో ఫుడ్ ఆర్డర్ చేయడం మరింత వేగవంతమవుతుంది.దీపిందర్ గోయల్ వీకెండ్ అప్డేట్ పేరుతో ‘ఎక్స్’ (ట్విటర్)లో ఈ కొత్త ఫీచర్ గురించి తెలియజేశారు. ఈ చేసిన ఈ పోస్ట్కు లక్షకు పైగా వ్యూస్, వేలాదిగా లైక్లు వచ్చాయి. యూజర్లు మిశ్రమ కామెంట్లు చేశారు.Exciting new weekend update: Group Ordering is now on Zomato!⁰You can now share a link with your friends, and everyone can add to the cart seamlessly, making ordering together faster and easier. No more passing the phone around awkwardly to collect everyone's order 😉We’re… pic.twitter.com/W3SrlwVJR0— Deepinder Goyal (@deepigoyal) August 17, 2024 -
ఈ ప్లాట్ఫామ్పై కూడా ఫీజు వసూలు చేస్తారేమో!
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో 16వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న కమెడియన్ స్వాతి సచ్దేవా కాసేపు నవ్వులు పూయించారు. ఇటీవల జొమాటో ప్లాట్ఫామ్ ఫీజులు పెంచిన నేపథ్యంలో మృదువుగా జోకులు వేశారు. ఈమేరకు విడుదలైన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.ఇటీవల జొమాటో తన ప్లాట్ఫామ్ ఫీజును రూ.5 నుంచి రూ.6కు పెంచినట్లు ప్రకటించింది. దాంతో 20 శాతం ఫీజు పెంచినట్లయింది. ఇది నేరుగా కంపెనీ ఆదాయం పెరిగేందుకు ఉపయోగపడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ ఫీజును క్రమంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ తరుణంలో తాజాగా జరిగిన జొమాటో 16వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న స్టాండప్ కమెడియన్ స్వాతి సచ్దేవా మాట్లాడేందుకు స్టేజ్పైకి వస్తూ ‘జొమాటో వాళ్లు ఈ ప్లాట్ఫామ్పై కూడా ఫీజు వసూలు చేస్తారేమో.. దీనికి మాత్రం ఎలాంటి ఫీజు వసూలు చేయరని ఆశిస్తున్నా’నని అనడంతో అందరూ నవ్వుకున్నారు.ఇదీ చదవండి: అంబానీ ఆస్తులు కరగాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెలుసా..?ఈ కార్యక్రమంలో జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్, బ్లింకిట్ సీఈఓ అల్బిందర్ ధిండా పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Swati Sachdeva (@swati.sachdeva95) -
కస్టమర్ రిక్వెస్ట్.. జొమాటోలో కొత్త ఫీచర్
కస్టమర్ సమస్యలను పరిష్కరించే దిశగా జొమాటో ఓ కొత్త ఫీచర్ పరిచయం చేసింది. ఆర్డర్ హిస్టరీ కనిపించకుండా చేయడానికి ఇప్పుడు 'డిలీట్ ఆర్డర్' అందుబాటులో తెచ్చింది. కంపెనీ ఈ ఫీచర్ తీసుకురావడానికి గల కారణాన్ని ఈ ఇక్కడ తెలుసుకుందాం..డిలీట్ ఆర్డర్ అనే ఫీచర్ గురించి జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ తన ఎక్స్ ఖాతాలో వివరిస్తూ.. కరణ్ సింగ్ అనే వ్యక్తి అర్థరాత్రి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటారని, హిస్టరీ మొత్తం అందులో నిక్షిప్తమై ఉండటం వల్ల తన భార్యకు దొరికిపోతున్నట్లు చెప్పాడు. ఇది చాలామంది సమస్య. ఇప్పుడు మీరు ఆర్డర్ హిస్టరీని తొలగించవచ్చు. దీన్ని బాధ్యతాయుతంగా వినియోగించని అని పేర్కొన్నారు. కరణ్ సింగ్ అభ్యర్థన మన్నించి డిలీట్ ఆర్డర్ ఫీచర్ యాడ్ చేయడంతో.. సింగ్ కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు.For Karan and many others - you can now delete orders from your order history on zomato. Use it responsibly 🙏Sorry, this took us a bit of time to prioritise and build. This touched multiple systems and microservices. We are rolling it out to all customers as we speak. https://t.co/Vwfr6Fs087 pic.twitter.com/0UMUnDuj0j— Deepinder Goyal (@deepigoyal) July 12, 2024 -
బిలియనీర్ అయిపోయిన దీపిందర్ గోయల్
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ బిలియనీర్స్ క్లబ్లోకి చేరారు. గతేడాది నుంచి జొమాటో షేర్లలో రికార్డు ర్యాలీతో దీపిందర్ బిలియనీర్ అయ్యారు. 2023 జూలై కనిష్ట స్థాయి నుంచి కంపెనీ స్టాక్ 300 శాతానికి పైగా పెరిగింది.జొమాటో స్టాక్ బీఎస్ఈలో రూ.230 వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది రోజులో 2 శాతం లాభపడింది. దాని మార్కెట్ క్యాప్ రూ.1.8 ట్రిలియన్లకు చేరుకుంది. దీంతో గోయల్ నెట్వర్త్ రూ.8,300 కోట్లకు చేరుకోవడంతో భారతదేశపు అత్యంత ధనిక ప్రొఫెషనల్ మేనేజర్గా నిలిచాడు. ప్రస్తుతం గోయల్కు కంపెనీలో 36.95 కోట్ల షేర్లు లేదా 4.24 శాతం వాటా ఉంది.జొమాటో క్విక్ కామర్స్ వ్యాపారం బ్లింకిట్ తోటి కంపెనీలను అధిగమించి ఊహించిన దాని కంటే ముందుగానే లాభదాయకంగా మారవచ్చు అనే అంచనాల మధ్య గతేడాది ప్రారంభం నుంచి జొమాటలో స్టాక్ గణనీయంగా పెరుగుతూ చ్చింది. 2025 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో బ్లింకిట్ ఇబీట ఆదాయం బ్రేక్ ఈవెన్గా మారవచ్చని కంపెనీ ఇంతకు ముందు పేర్కొంది. ఫుడ్ డెలివరీ వ్యాపారం లాభదాయకమైన యూనిట్ కావడం కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్ను పెంచింది.మధ్యతరగతి కుటుంబం నుంచి..మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన దీపిందర్ ఐఐటీ ఢిల్లీ నుంచి మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆహారం పట్ల తనకున్న మక్కువతో స్ఫూర్తి పొంది ఫుడ్ ఆర్డర్ చేయడానికి యాప్ను రూపొందించారు. బెయిన్& కంపెనీలో ఉన్నప్పుడే FoodieBay.comని స్థాపించారు. దీన్ని తరువాత Zomato.com అని పేరు మార్చారు. 2011లో ఇన్ఫో ఎడ్జ్ నుంచి నిధులు లభించడంతో గోయల్, ఆయన బృందం తమ ఉద్యోగాలను వీడి జొమాటో వృద్ధిపై పూర్తిగా దృష్టి పెట్టారు. జొమాటో 2018లో యునికార్న్గా మారింది. -
ఫుడ్ డెలివరీకి ప్లాస్టిక్ కంటైనర్లు ప్రమాదం: జొమాటో సీఈఓ రిప్లై ఇదే..
ప్రముఖ న్యూట్రిషనిస్ట్, లైఫ్స్టైల్ ఎక్స్పర్ట్ 'ల్యూక్ కౌటిన్హో' తన ఇన్స్టాగ్రామ్లో ఫుడ్ డెలివరీ సర్వేస్ అండ్ రెస్టారెంట్ల ద్వారా ప్లాస్టిక్ కంటైనర్లను ఉపయోగించడం గురించి తన భయాన్ని తెలియజేసారు. వేడి ఆహారాన్ని ప్యాక్ చేయడానికి ప్లాస్టిక్ కంటైనర్ల వాడకం అనారోగ్యానికి కారణమవుతుందని పేర్కొన్నారు. బయోడిగ్రేడబుల్ మెటీరియల్లను ఫుడ్ డెలివరీ చేయడానికి ఉపయోగించాలని ప్లాట్ఫామ్లను కోరారు.స్విగ్గీ, జొమాటో, రెస్టారెంట్లు.. బయోడిగ్రేడబుల్ నాన్ ప్లాస్టిక్ కంటైనర్లలో ఫుడ్ డెలివరీలు జరిగేలా చూడాలని విన్నవించారు. మంచి ఆహారాన్ని మాత్రమే కాకుండా ప్లాస్టిక్ వాడకం నియంత్రించి ఆరోగ్యాన్ని కూడా అందించాలని కోరారు. ప్లాస్టిక్లోని వేడి ఆహారాలు ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తున్నాయి వెల్లడిస్తూ.. హార్మోన్లు, సంతానోత్పత్తి, ఈస్ట్రోజెన్ల ఉత్పత్తి కూడా తగ్గుతుందని ల్యూక్ కౌటిన్హో పేర్కొన్నారు.కౌటిన్హో సందేశానికి దీపిందర్ గోయల్ రిప్లై ఇచ్చారు. ల్యూక్కు ధన్యవాదాలు తెలియజేస్తూ.. మేము చేయగలిగినంత తప్పకుండా చేస్తాము. బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్కు ప్రాధాన్యత ఇస్తానని, తద్వారా కౌటిన్హో కోరుకున్న దిశలో అడుగులు వేస్తానని వాగ్దానం చేసారు. దీపిందర్ గోయల్ రిప్లైకు కౌటిన్హో కృతజ్ఞతలు తెలిపారు. నా మాటలను అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. View this post on Instagram A post shared by Luke Coutinho - Official (@luke_coutinho) -
జొమాటో గిన్నిస్ రికార్డ్.. సీఈఓపై మండిపడ్డ కునాల్ కమ్రా
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఇటీవల 'ఒకే వేదిక వద్ద అతిపెద్ద ఫస్ట్ ఎయిడ్ లెసన్' నిర్వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ 'దీపిందర్ గోయల్' తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో వెల్లడిస్తూ.. ఫోటోలు కూడా షేర్ చేశారు.దీపిందర్ గోయల్ ట్వీట్ మీద హాస్యనటుడు 'కునాల్ కమ్రా' తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జొమాటో సీఈఓ వారి డెలివరీ భాగస్వాముల సగటు ఆదాయం, వారి పని గంటల గురించి ప్రకటించగలరా?. కానీ ఒక రోజులో ఎన్ని కేజీల బిర్యానీ ఆర్డర్ చేశారో చెప్పగలరు కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపైన పలువురు నెటిజన్లు తమదైన రీతిలో మిశ్రమంగా స్పందిస్తున్నారు.జొమాటో గిన్నిస్ వరల్డ్ రికార్డ్జొమాటో కంపెనీ ఇటీవల తన 4300 మంది డెలివరీ భాగస్వాములకు ఒకే వేదిక మీద ఫస్ట్ ఎయిడ్ గురించి అవగాహన కల్పించారు. జొమాటో డెలివరీ భాగస్వాములు ఇకపైన ప్రధమ చికిత్స సమయంలో కూడా సహాయం చేయగలరు.. భారతదేశంలోని ఈ ఎమర్జెన్సీ హీరోలకు సెల్యూట్, పెద్ద థాంక్స్ అంటూ దీపీందర్ గోయల్ ట్వీట్ చేశారు.జొమాటో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లభించింది. ఇది పలువురు నెటిజన్లను ఎంతగానో ఆకర్శించింది. కొందరు దీపేందర్ గోయల్ను ప్రశంసించారు. ఇది అద్భుతమైన అచీవ్మెంట్.. డెలివరీ భాగస్వాములకు హ్యాట్సాఫ్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.Can you declare the no of delivery partners you have with their average income & working hours over the last 3 months?No you can’t But you can tell kgs of biryani ordered in one day. You’re such a hack bro… https://t.co/C4zjZP7CVv— Kunal Kamra (@kunalkamra88) June 13, 2024 -
‘ఇంటి పేరు’తో పనిలేదు దీపిందర్ గోయల్.. ప్రధాని మోదీ ట్వీట్ వైరల్
జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ స్టార్టప్ జర్నీపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. నేటి భారతంలో ఇంటిపేరుకు ఎలాంటి ప్రాధాన్యం లేదంటూనే.. గోయల్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందించారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ‘విశేష్ సంపర్క్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ ఈవెంట్లో దీపిందర్ గోయల్ స్టార్టప్ను ప్రారంభించే విషయంలో తనకు తన తండ్రికి మధ్య జరిగిన చర్చ గురించి గుర్తు చేశారు.నీ తండ్రి స్థాయి ఏంటో తెలుసా?‘16 ఏళ్ల క్రితం నా తండ్రికి నా స్టార్టప్ ఆలోచన గురించి వివరించా. అప్పుడాయన.. నీ తండ్రి స్థాయి ఏంటో తెలుసా? పంజాబ్లోని ఇంత చిన్న ఊరిలో నువ్వేం చేయలేవు అని అన్నారు. కానీ నేను సుసాధ్యం చేశాను. జొమాటో అనే సామ్రజ్యాన్ని నిర్మించి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విజయం ఇంటిపేర్లతో కట్టుబడి ఉండదనివిశేష్ సంపర్క్ కార్యక్రమంలో దీపిందర్ గోయల్ ప్రసంగంపై ప్రధాని మోదీ స్పందించారు. విజయం ఇంటిపేర్లతో కట్టుబడి ఉండదని, గోయల్ సాధించిన విజయాలు ఎంతో మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రేరణగా నిలుస్తోందన్నారు.మీ ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం‘నేటి భారతంలో ఒకరి ఇంటిపేరు పట్టింపు లేదు. కష్టపడి పనిచేయడమే ముఖ్యం. మీ ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం దీపిందర్ గోయల్! ఇది అసంఖ్యాక యువకులను వారి వ్యవస్థాపక కలలను కొనసాగించడానికి ప్రేరేపిస్తుంది. స్టార్టప్లు అభివృద్ధి చెందడానికి సరైన వాతావరణాన్ని అందించడానికి మేం కట్టుబడి ఉన్నాము’ అని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.In today’s India, one’s surname doesn’t matter. What matters is hardwork. Your journey is truly inspiring, @deepigoyal! It motivates countless youngsters to pursue their entrepreneurial dreams. We are committed to providing the right environment for the startups to flourish. https://t.co/E9ccqYyVzv— Narendra Modi (@narendramodi) May 22, 2024 -
అప్పుడు 'నీ తండ్రి స్థాయి తెలుసా అన్నారు': దీపిందర్ గోయల్
కేంద్ర మంత్రి 'హర్దీప్ సింగ్ పూరి' నిర్వహించిన విశేష్ సంపర్క్ కార్యక్రమానికి జొమాటో సీఈఓ 'దీపిందర్ గోయల్' హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన తన 20 సంవత్సరాల క్రితం నాటి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు.దీపిందర్ గోయల్ 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు.. ఫుడ్ డెలివరీ స్టార్టప్ను ప్రారంభించాలనే ఆలోచనను నా తండ్రితో చెప్పాను. అప్పుడు నా తండ్రి నాతో.. నీ తండ్రి ఏ స్థాయిలో ఉన్నారనే అర్థంతో.. 'జంతా హై తేరా బాప్ కౌన్ హై? అని అన్నట్లు వెల్లడించారు.చిన్న గ్రామంలో ఉన్న మనం స్టార్టప్ వంటివి సాధ్యం కాదని తన తండ్రి భావించినట్లు తెలిపారు. అయితే పంజాబ్లోని ఒక చిన్న పట్టణం నుంచి ప్రభుత్వ సహకారంతో జొమాటో వంటి సంస్థను స్థాపించగలిగాను. 2008లో కంపెనీ ప్రారంభమైనప్పటి నుంచి ఈ రోజు వరకు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాను. ఇది నాకు చాలా ఆనందంగా ఉందని గోయల్ అన్నారు.దీపిందర్ గోయల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. పేదరికం నుంచి వచ్చి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన గోయల్ వీడియోను ఇప్పటికే లక్షల మంది వీక్షించారు. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.Deepinder Goyal, ZomatoWhen I started Zomato in 2008, my father used to say “tu janta hai tera baap kaun hai” as my dad thought I could never do a start up given our humble background. This government and their initiatives enabled a small town boy like me to build something… pic.twitter.com/vogdM6v8oT— Hardeep Singh Puri (मोदी का परिवार) (@HardeepSPuri) May 20, 2024 -
న్యూ ఇయర్ను మించిన మదర్స్ డే! ఎలాగో చూడండి..
ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎన్ని పండుగలు, దినోత్సవాలు ఉన్నా మాతృ దినోత్సవానికి ఉన్న ప్రత్యేకత వేరు. ఇదిలా ఉంటే జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ మదర్స్ డేకి సంబంధించి ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు.జొమాటో డెలివరీ ఆర్డర్ వాల్యూమ్ పరంగా మదర్స్ డే కొత్త సంవత్సర వేడుకలను అధిగమించిందని దీపిందర్ గోయల్ పేర్కొన్నారు. ఈ మేరకు జొమాటో కార్యాలయంలోని సందడిగా ఉన్న కార్యకలాపాల దృశ్యాలను ‘ఎక్స్’ (ట్విటర్)లో షేర్ చేశారు. పెరిగిన డిమాండ్ను తీర్చడానికి ఉద్యోగులు శ్రద్ధగా పని చేస్తున్న "సర్వీస్ రూమ్"గా దీనిని పేర్కొన్నారు."మొదటిసారిగా మదర్స్ డే, నూతన సంవత్సర వేడుకల కంటే (చాలా) ఎక్కువ వాల్యూమ్ రోజుగా మారుతోంది. ఈరోజు తమ తల్లులకు ట్రీట్ ఇచ్చేవారి కోసం పనిచేస్తున్నాం" అని పోస్టులో రాసుకొచ్చారు. అలాగే ఆఫీస్లోని సిబ్బందికి కూడా ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ఉందని ప్రకటరించారు. ఆహార పంపిణీ సేవలకు మదర్స్ డే ఒక ముఖ్యమైన సందర్భంగా ఉద్భవించడం వినియోగదారుల ప్రవర్తనలో వచ్చిన మార్పును సూచిస్తోంది.Mother's Day, for the first time ever, is turning out to be a (much) higher volume day than New Year's Eve. Full w̸a̸r̸ service room scenes at the office today. Fingers crossed, that we are able to serve everyone treating their moms today.A super cool surprise awaits… pic.twitter.com/3N37D00Udo— Deepinder Goyal (@deepigoyal) May 12, 2024 -
‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్న జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్’
‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’.. ఈ మాటను తు.చ తప్పకుండా పాటిస్తారు సినీతారలు. అవకాశాలు అన్నప్పుడు, స్టార్డమ్ సంపాదించినప్పుడే నాలుగు రాళ్లు వెనకేస్తారు. ఇప్పుడు ఈ కోవలోకే ప్రముఖ వ్యాపార వేత్తలు వచ్చి చేరుతున్నారు. వ్యాపారం బాగా జరిగినప్పుడే నాలుగు రాళ్లు వెనకేస్తున్నారు. భవిష్యత్పై ఆర్ధిక భరోసా నిచ్చే రంగాల్లో భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నారు. తాజాగా ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ న్యూఢిల్లీలోని మెహ్రౌలీ అనే ప్రాంతంలో పక్క పక్కనే ఉన్న రెండు ప్రాంతాల్లో 5 ఎకరాల భూముని కొనుగోలు చేశారు. ఆ భూమి విలువ సుమారు రూ.79కోట్లు. వేర్వేరు యజమానుల నుంచి కొనుగోలు చేసిన ఆ భూమికి మొత్తం స్టాంప్ డ్యూటీ రూ.5.24 కోట్లు చెల్లించినట్లు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల గురించి అవగాహన ఉన్న సీఆర్ఈమ్యాటిక్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ తెలిపింది. గత ఏడాది మార్చి 28న తొలి సారి 2.5 ఎకరాల భూమిని Luxalon Building Private Limited నుంచి కొనుగోలు చేశారు. దాని విలువ రూ.29 కోట్లు కాగా.. స్టాంప్ డ్యూటీ కింద రూ.1.74 కోట్లు చెల్లించారు. రెండో సారి స్టెప్టెంబర్ 1, 2023న రవి కపూర్ అనే యజమాని నుంచి 2.53 ఎకరాల ల్యాండ్ను కొనుగోలు చేశారు. దీనికి రూ.50 వెచ్చించారు. స్టాంప్ డ్యూటీ కింద రూ.3.50 కోట్లు కట్టారు. పలు నివేదికల ప్రకారం.. రెండు ప్లాట్లు ఛతర్పూర్ ప్రాంతంలోని డేరా మండి అనే గ్రామంలో ఉన్నాయి. రెండు లావాదేవీల రిజిస్ట్రేషన్ హౌజ్ ఖాస్లో జరిగింది ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్ఫారమ్ మేక్మైట్రిప్ గ్రూప్ సీఈఓ రాజేష్ మాగో గురుగ్రామ్లోని డిఎల్ఎఫ్ మాగ్నోలియాస్లో 6,428 చదరపు అడుగుల అపార్ట్మెంట్ను రూ. 33 కోట్లకు కొనుగోలు చేశారు. జెన్పాక్ట్ సిహెచ్ఆర్ఓ పీయూష్ మెహతా అదే ప్రాపర్టీలో రూ.32.60 కోట్లతో 6,462 చదరపు అడుగుల ఫ్లాట్ను కొనుగోలు చేశారు. -
జొమాటో సీఈవో దీపీందర్ మొదటి భార్య ఇప్పుడు ఏం చేస్తున్నారు..?
-
జొమాటోలో ‘ప్యూర్ వెజ్’ చిచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఇటీవల అందుబాటులోకి తెచ్చిన ‘ప్యూర్ వెజ్’ ఫుడ్ డెలివరీ సర్వీసులు ఆ సంస్థలో చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఆ సమస్య నుంచి బయట పడేందుకు సంస్థ టాప్ ఎగ్జిక్యూటీవ్లతో సుమారు ఏకదాటిగా 20 గంటల పాటు జూమ్ కాల్స్ నిర్వహించినట్లు జొమాటో కోఫౌండర్, సీఈవో దీపిందర్ గోయల్ తెలిపారు. జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీ ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్’ ల కార్యక్రమం నిర్వహించింది. అయితే ఎంట్రప్రెన్యూర్ విభాగంలో దీపిందర్ ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది అవార్డ్ను సొంతం చేసుకున్నారు. ఈ అవార్డ్ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ చేతులు మీదిగా అందుకున్నారు. పెద్ద ఎత్తున ట్రోలింగ్ ఈ సందర్భంగా ప్యూర్ వెజ్ వివాదంపై జొమాటో సీఈవో మాట్లాడారు. కస్టమర్లు, ఆయా రెస్టారెంట్ల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా మేం ప్యూర్ వెజ్ మోడ్, ప్యూర్ వెజ్ ఫ్లీట్ సేవల్ని అందుబాటులోకి తెచ్చాం. కానీ ఈ సర్వీసులపై ఊహించని విధంగా వివాదం తలెత్తింది. నెటిజన్లు సైతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారని అన్నారు. తలెత్తిన ఆందోళనలు ‘‘ప్యూర్ వెజ్ వివాదంపై నెటిజన్లు సైతం రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు (RWAs) వెజ్ - నాన్ వెజ్ కలిపి తెస్తే ఆర్డర్లను తిరస్కరించే అవకాశం ఉందనే అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. డెలివరీ సిబ్బందిని సైతం అడ్డుకునే ప్రమాదం ఉందని వాపోయారు. ఇప్పటికే వెల్ఫేర్ అసోసియేషన్లలో విధించే ఆంక్షల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు గురించి ప్రస్తావించారు. అదే సమయంలో డెలివరీ సిబ్బంది సైతం ఓన్లీ వెజ్ పాలసీ వల్ల అవకాశాలు సన్నగిల్లుతాయనే ఆందోళనల్ని వ్యక్తం చేశారు.’’ ప్యూర్ వెజ్పై వెనక్కి తగ్గిన జొమాటో అయితే దీన్ని పరిష్కరించేందుకు జొమాటో ఉన్నత స్థాయి ఉద్యోగులతో సుమారు 20 గంటల పాటు జూమ్ కాల్ నిర్వహించామని గుర్తు చేశారు. ఆ తర్వాత వినియోగదారుల నుంచి వ్యతిరేకత రావడం, ప్యూర్ వెజ్పై దుమారం చెలరేగడంతో ఆయా ప్రభుత్వాలు జొమాటోకి నోటీసులు అందించాయి. ఫలితంగా పలు రాష్ట్రాల్లో ఆ సర్వీసుల్ని నిలిపివేస్తున్నట్లు జొమాటో అధికారికంగా ఎక్స్.కామ్లో ట్వీట్ చేశారు. Hi, we have disabled delivery of non-veg items in Uttar Pradesh, Assam, Chhattisgarh, Madhya Pradesh and Rajasthan as per govt. notice. Hope this clarification helps! — Zomato Care (@zomatocare) January 22, 2024 ఇక ఎన్డీటీవీ అవార్డ్ల కార్యక్రమంలో ‘దయచేసి ఈ ప్యూర్ వెజ్ సర్వీస్ ఏ మతానికి, రాజకీయ ప్రాధాన్యతలకు వ్యతిరేకం కాదని జొమాటో అధినేత, సీఈవో దీపిందర్ గోయల్ మరోసారి పేర్కొన్నారు. మరి రానున్న రోజుల్లో ఈ ప్యూర్ వెజ్ సేవల్ని అందిస్తారా? లేదంటే నిలిపివేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. Even though RTIs and mails for hostel GSec shows that there is no institute policy for food segregation, some individuals have taken it upon themselves to designate certain mess areas as "Vegetarians Only" and forcing other students to leave that area.#casteism #Discrimination pic.twitter.com/uFlB4FnHqi — APPSC IIT Bombay (@AppscIITb) July 29, 2023 -
రెండోపెళ్లి చేసుకున్న జొమాటో సీఈవో.. అమ్మాయి ఎవరంటే!
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్(41) రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. మెక్సికన్కు చెందిన మోడల్ గ్రేసియా మునోజ్ను దీపిందర్ పెళ్లి చేసుకున్నారని సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఈ వివాహం జరిగి మాత్రం నెలవుతుందని సమాచారం. తాజాగా గోయల్, గ్రేసియో సన్నిహితంగా ఉన్న ఫొటోలు కొన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో విషయం ఆరా తీశారు. దాంతో ఇద్దరికీ వివాహం జరిగినట్లు తెలిసింది. మునోజ్ ఇన్స్టాగ్రామ్ వివరాల ప్రకారం.. ఆమె మెక్సికోలో జన్మించారు. ప్రస్తుతం భారత్లో ఉన్నారు. గతంలో మోడలింగ్ చేసిన ఆమె.. ఇప్పుడు సొంతంగా లగ్జరీ కన్జూమర్ప్రొడక్ట్లకు సంబంధించి ఒక స్టార్టప్ నడుపుతున్నారు. 2022 ఏడాదికిగాను మెట్రోపాలిటన్ ఫ్యాషన్వీక్ విజేతగా నిలిచారు. దీపిందర్కు ఇది రెండో పెళ్లి. ఆయన ఐఐటీ దిల్లీలో చదువుతున్నపుడు కంచన్ జోషితో పరిచయం ఏర్పడింది. దాంతో ఇరువురు పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం కంచన్ దిల్లీ యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. దీపిందర్.. 2008లో హరియాణాలోని గురుగ్రామ్ కేంద్రంగా జొమాటో సంస్థను స్థాపించారు. కన్సల్టింగ్ సంస్థలో ఉద్యోగాన్ని వదిలి.. ఆహార డెలివరీ యాప్ ప్రారంభించారు. దేశంలో వెయ్యికి పైగా నగరాల్లోకి దీని కార్యకలాపాలు విస్తరించాయి. సుమారు రూ.1.5లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ కలిగిన జొమాటో ఇటీవల శాకాహారుల కోసం ప్రత్యేక సేవలు ప్రారంభించి వివాదంలోకి వెళ్లింది. ఇదీ చదవండి: మొదటి విద్యుత్కారును ఆవిష్కరించిన ఫేమస్ కంపెనీ ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’ పేరుతో కొత్త సేవలు మొదలుపెట్టింది. అయితే ఆ ఫ్లీట్లో డెలివరీ స్టాఫ్కు ప్రత్యేకంగా గ్రీన్కలర్ డ్రెస్కోడ్ ఉంటుందని ప్రకటించడంతో వివాదం చెలరేగింది. అలా ప్రకటన వెలువరించిన కాసేపటికే కంపెనీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇకపై అందరూ ఎర్ర రంగు యూనిఫామ్ను ధరిస్తారని చెప్పింది. అయితే ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’ సేవలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. వెజ్ ఆర్డర్లను అందించడానికి ప్రత్యేక సిబ్బంది ఉంటారని కంపెనీ వివరించింది. View this post on Instagram A post shared by Grecia Muñoz (@greciamunozp) -
ఇండియాలోనే మొట్టమొదటి ఆ కారు కొన్న జొమాటో సీఈఓ
-
భారత్లో మొదటిసారి ప్రవేశించిన లగ్జరీ కారు.. ధర ఎంతో తెలుసా..
కార్లంటే కొందరికి అవసరానికి ఉపయోగపడే వస్తువుగా ఉంటే.. ఇంకొందరికి అవో లగ్జరీ సింబల్గా మారుతున్నాయి. అందుకోసం రూ.కోట్లు ఖర్చు చేసి మరీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అలాంటి ఓ లగ్జరీ కారు తాజాగా మన దేశ రోడ్లపైకి వచ్చింది. భారత్లో మొట్టమొదటగా అడుగుపెట్టిన ఆస్టన్ మార్టిన్ డీబీ12 స్పోర్ట్స్ కారు అది. ఈ ఆస్టన్ మార్టిన్ డీబీ12 కారు ధర సుమారు నాలుగున్నర కోట్ల రూపాయలు. అయితే ఇంతకీ ఈ కారును కొన్న వ్యక్తి ఎవరిని అనుకుంటున్నారా. అలాంటి యోగం సాధారణ ప్రజలకు ఎక్కడుంటుంది. దీన్ని కొన్నది ఏకంగా రూ.1.34లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ కలిగిన ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సీఈవో దీపిందర్ గోయల్. ఇదీ చదవండి: ఏడు నిమిషాల్లో ఊడిన ఉద్యోగాలు ఆస్టన్ మార్టిన్ బ్రిటన్కు చెందిన కార్ల తయారీ సంస్థ. ఈ కంపెనీ డీబీ12 పేరుతో గతేడాది సెప్టెంబరులో కారును లాంచ్ చేసింది. ఈ కారు ధర రూ.4.59 కోట్లు. దీపిందర్ గోయల్ ఈ లగ్జరీ కారును తాజాగా సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కారుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ స్పోర్ట్స్ కార్ మెర్సిడెస్-బెంజ్-సోర్డ్స్ ఇంజిన్తో రూపొందించారు. 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్డ్ వీ8 ఇంజిన్ కలిగి ఉంది. కేవలం 3.5 సెకెన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం దీన్ని ప్రత్యేకత. View this post on Instagram A post shared by Automobili Ardent India (@automobiliardent) -
‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్న జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్’
‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’.. ఈ మాటను తు.చ తప్పకుండా పాటిస్తారు సినీతారలు. అవకాశాలు అన్నప్పుడు, స్టార్డమ్ సంపాదించినప్పుడే నాలుగు రాళ్లు వెనకేస్తారు. ఇప్పుడు ఈ కోవలోకే ప్రముఖ వ్యాపార వేత్తలు వచ్చి చేరుతున్నారు. వ్యాపారం బాగా జరిగినప్పుడే నాలుగు రాళ్లు వెనకేస్తున్నారు. భవిష్యత్పై ఆర్ధిక భరోసా నిచ్చే రంగాల్లో భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నారు. తాజాగా ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ న్యూఢిల్లీలోని మెహ్రౌలీ అనే ప్రాంతంలో పక్క పక్కనే ఉన్న రెండు ప్రాంతాల్లో 5 ఎకరాల భూముని కొనుగోలు చేశారు. ఆ భూమి విలువ సుమారు రూ.79కోట్లు. వేర్వేరు యజమానుల నుంచి కొనుగోలు చేసిన ఆ భూమికి మొత్తం స్టాంప్ డ్యూటీ రూ.5.24 కోట్లు చెల్లించినట్లు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల గురించి అవగాహన ఉన్న సీఆర్ఈమ్యాటిక్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ తెలిపింది. గత ఏడాది మార్చి 28న తొలి సారి 2.5 ఎకరాల భూమిని Luxalon Building Private Limited నుంచి కొనుగోలు చేశారు. దాని విలువ రూ.29 కోట్లు కాగా.. స్టాంప్ డ్యూటీ కింద రూ.1.74 కోట్లు చెల్లించారు. రెండో సారి స్టెప్టెంబర్ 1, 2023న రవి కపూర్ అనే యజమాని నుంచి 2.53 ఎకరాల ల్యాండ్ను కొనుగోలు చేశారు. దీనికి రూ.50 వెచ్చించారు. స్టాంప్ డ్యూటీ కింద రూ.3.50 కోట్లు కట్టారు. పలు నివేదికల ప్రకారం.. రెండు ప్లాట్లు ఛతర్పూర్ ప్రాంతంలోని డేరా మండి అనే గ్రామంలో ఉన్నాయి. రెండు లావాదేవీల రిజిస్ట్రేషన్ హౌజ్ ఖాస్లో జరిగింది ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్ఫారమ్ మేక్మైట్రిప్ గ్రూప్ సీఈఓ రాజేష్ మాగో గురుగ్రామ్లోని డిఎల్ఎఫ్ మాగ్నోలియాస్లో 6,428 చదరపు అడుగుల అపార్ట్మెంట్ను రూ. 33 కోట్లకు కొనుగోలు చేశారు. జెన్పాక్ట్ సిహెచ్ఆర్ఓ పీయూష్ మెహతా అదే ప్రాపర్టీలో రూ.32.60 కోట్లతో 6,462 చదరపు అడుగుల ఫ్లాట్ను కొనుగోలు చేశారు. -
రూ.97 లక్షల టిప్స్ - సీఈఓ రియాక్షన్ ఇలా..
2024 సంవత్సరానికి ఆహ్వానం పలకడానికి ప్రపంచంలోని చాలా దేశ ప్రజలతో పాటు భారతీయులు కూడా సిద్ధమయ్యారు. ఈ సందర్భంలో ఫుడ్, డ్రింక్స్ వంటి వాటి కోసం జొమాటో, స్విగ్గీ వంటి యాప్ల మీద పడ్డారు. 2023 డిసెంబర్ 31 రోజు మాత్రమే జొమాటో లెక్కకు మించిన డెలివరీలు చేసి ఏకంగా రూ. 97 లక్షల టిప్స్ పొందినట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కొత్త సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా ఇండియన్ జొమాటో డెలివరీ భాగస్వాములకు కస్టమర్లు ఏకంగా రూ. 97 లక్షలకు పైగా టిప్ ఇచ్చినట్లు జోమాటో సీఈవో 'దీపిందర్ గోయల్' తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. 2015 నుంచి 2020 వరకు కంపెనీ ఎన్ని ఆర్డర్లను స్వీకరించిందో.. ఒక్క 2023 డిసెంబర్ 31న ఒకే రోజు స్వీకరించి గతంలో నెలకొన్ని అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. సుమారు 3.2 లక్షల మంది జొమాటో డెలివరీ పార్ట్నర్స్ ఈ డెలివరీలను చేసినట్లు తెలిపారు. ఇదీ చదవండి: టెస్టింగ్ దశలో కొత్త ఫీచర్.. నచ్చిన ధరకే రైడ్! దేశంలో ఎక్కువ ఆర్డర్స్ మహారాష్ట్ర నుంచి వచ్చినట్లు, కలకత్తాకు చెందిన ఓకే వ్యక్తి 125 ఐటెమ్లను ఆర్డర్ చేసుకున్నాడు. ప్రజలు 1.47 లక్షల చిప్స్ ప్యాకెట్లు, 68,231 సోడా బాటిళ్లు, 2,412 ఐస్ క్యూబ్స్ ప్యాకెట్లు, 356 లైటర్లను ఆర్డర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. Love you, India! You’ve tipped over ₹97 lakhs till now to the delivery partners serving you tonight ❤️❤️❤️ — Deepinder Goyal (@deepigoyal) December 31, 2023 -
అలా కనిపిస్తాయంతే.. డిస్కౌంట్లపై జొమాటో సీఈవో నిజాయితీ కామెంట్
స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్లలో మనం తరచూ 50 శాతం.. 60 శాతం అంటూ కొన్ని డిస్కౌంట్ ఆఫర్లను చూస్తుంటాం. అయితే ఆ ఆఫర్ల గుట్టును బయటపెట్టారు జొమాటో (Zomato) సీఈవో దీపిందర్ గోయల్ (Deepinder Goyal). యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియా తన పోడ్కాస్ట్ 'ది రణవీర్ షో'లో చర్చ సందర్భంగా, జొమాటో తన కస్టమర్లకు అంతంత తగ్గింపులను ఎలా అందించగలదని గోయల్ను ప్రశ్నించారు. దీనికాయన సమాధానమిస్తూ.. "ఆ డిస్కౌంట్లు అంత పెద్దవేమీ కావు, అలా కనిపిస్తాయంతే" అని నిష్కపటంగా వ్యాఖ్యానించారు. జొమాటో తరచుగా "రూ. 80 వరకు 50% తగ్గింపు" వంటి ఆఫర్లను అందజేస్తుందని, వాస్తవానికి ఇక్కడ లభించే డిస్కౌంట్ రూ. 80 మాత్రమేనని, పూర్తిగా 50 శాతం తగ్గింపు కాదు అని దీపిందర్ గోయల్ స్పష్టం చేశారు. ఉదాహరణకు గోయల్ లెక్కల ప్రకారం.. ఆర్డర్ మొత్తం రూ. 400 అయితే దానిపై లభించే డిస్కౌంట్ రూ.80 అంటే తగ్గింపు 20 శాతం మాత్రమే. అందులో నిజాయితీ లేదు ఈ డిస్కౌంట్ పద్ధతి కస్టమర్లను తప్పుదారి పట్టించవచ్చని గోయల్ అంగీకరించారు. దాన్ని మార్చాలని తనకు ఉన్నప్పటికీ, పోటీదారులు ఈ అతిశయోక్తి తగ్గింపు ఆఫర్లను కొనసాగిస్తున్నప్పుడు జొమాటో మాత్రమే దీన్ని మార్చడం కష్టమన్నారు. ‘నేను ఈ రకమైన డిస్కౌంట్లను నిజాయితీగా పరిగణించను. డిస్కౌంట్లు సూటిగా, నిజాయితీగా ఉండాలి. మీరు మీ కస్టమర్కు తగ్గింపును వాగ్దానం చేస్తే, అది స్పష్టంగా ఉండాలి’ అని గోయల్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇక వ్యాపార ప్రత్యర్థులు అయినప్పటికీ, స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీహర్ష మెజెటీతో తన స్నేహపూర్వక సంబంధం గురించి గోయల్ పంచుకున్నారు. తాము కలిసినప్పుడు వ్యాపార విషయాలను మాట్లాడుకోమని వివరించారు. ఇదీ చదవండి: షాపింగ్ చేస్తున్నారా? బెస్ట్ క్యాష్ బ్యాక్ ఆఫర్లున్న క్రెడిట్కార్డులు ఇవే.. -
డెలివరీ బాయ్గా మారిన జొమాటో సీఈవో! బైక్పై ఫుడ్ డెలివరీ
ప్రముఖ ఫుడ్ డెలివరి సంస్థ జొమాటో (Zomato) సీఈఓ దీపిందర్ గోయల్ (Deepinder Goyal) ఫుడ్ డెలివరీ బాయ్గా మారిపోయారు. ఫ్రెండ్షిప్ డే (Friendship Day) సందర్భంగా సాధారణ డెలివరీ బాయ్ లాగా రెడ్ టీ షర్ట్ ధరించి బైక్పై ఫుడ్ డెలివరీలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన ట్విటర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జొమాటో టీ షర్ట్ వేసుకున్న దీపిందర్ గోయల్ ఫ్రెండ్షిప్డే సందర్భంగా పలువురు కస్టమర్లకు, డెలివరీ పార్ట్నర్స్కు, రెస్టారెంట్ పార్ట్నర్స్కు ఫుడ్ పార్సిల్స్, ఫ్రెండ్షిప్ బ్యాండ్లు అందించేందుకు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై బయలుదేరారు. ఇదీ చదవండి: ..అలా 15 కేజీలు బరువు తగ్గాను: ఫిట్నెస్ సీక్రెట్ చెప్పిన ఫుడ్ డెలివరీ యాప్ సీఈవో 'రెస్టారెంట్లు, వినియోగదారులతోపాటు డెలివరీ పార్ట్నర్స్కు ఆహారం, ఫ్రెండ్షిప్ బ్యాండ్లను అందించేందుకు వెళ్తున్నా. ఇది నాకు ప్రత్యేకమైన ఆదివారం' అంటూ దీపిందర్ గోయాల్ ట్వీట్ చేశారు. ఈ ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. వీటిపై యూజర్లు తమకు తోచిన విధంగా స్పందించారు. అంతా బాగుంది కానీ, ఆర్డర్లపై ఫ్రెండ్షిప్ డే చార్జ్లేవీ విధించరు కదా అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. Going to deliver some food and friendship bands to our delivery partners, restaurant partners and customers. Best Sunday ever!! pic.twitter.com/WzRgsxKeMX — Deepinder Goyal (@deepigoyal) August 6, 2023 -
..అలా 15 కేజీలు బరువు తగ్గాను: ఫుడ్ డెలివరీ యాప్ సీఈవో
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ నాలుగు ఏళ్లలో 15 కిలోలు బరువు తగ్గినట్లు ప్రకరించారు. తన ఫిట్నెస్ ప్రయాణం గురించి ఆయన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. 2019లో కోవిడ్ మహమ్మారి విజృంభణకు కొన్ని నెలల ముందు నుంచే తాను పనితోపాటు ఆరోగ్యానికీ సమాన ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించినట్లు దీపిందర్ గోయల్ రాసుకొచ్చారు. అంటే మరీ విపరీతంగా అన్నీ చేయడం కాకుండా చిన్న చిన్నగా స్థిరత్వాన్ని కొనసాగించినట్లు తెలిపారు. తాను 2019లో ఎలా ఉన్నాడో.. 2023 ఎలా మారాడో ఫొటోలను జత చేశారు. గోయల్ తన శరీరంలోని కొవ్వును 28 శాతం నుంచి 11.5 శాతానికి తగ్గించగలిగారు. 2019లో 87 కిలోల బరువున్న ఆయన ఇప్పుడు 72 కిలోలకు తగ్గారు. అలాగే ఆరోగ్యానికి అత్యంత హానికరమైన చెడు కొలెస్ట్రాల్ను కూడా గణనీయంగా తగ్గించుకున్నారు. 2019లో 165 mg/dL ఉన్న చెడు కొలెస్ట్రాల్ ప్రస్తుతం 55 mg/dL కు తగ్గింది. అదేవిధంగా గుండె జబ్బుకు కారణమయ్యే ట్రైగ్లిజరైడ్స్ 185 mg/dL నుంచి 86 mg/dLకి తగ్గాయి. ఇక బ్లడ్ షుగర్ కూడా 6.2 నుంచి 4.8కి తగ్గిందని దీపిందర్ గోయల్ పేర్కొన్నారు. ఇదీ చదవండి ➤ ChatGPT Diet Plan: చాట్జీపీటీ డైట్ ప్లాన్.. 11 కేజీల బరువు తగ్గాడు! కాగా దీపిందర్ గోయల్ చేసిన ఈ పోస్టు అనేక మంది యూజర్లను విశేషంగా ఆకర్షించింది. దీనిపై పలువురు ఫాలోవర్లు తమ నచ్చిన విధంగా కామెంట్లు చేశారు. దేశం మొత్తం జొమాటో నుంచి ఆర్డర్ చేస్తుంటే దాని సీఈవో మాత్రం ఇంటి ఫుడ్ తింటున్నారని ఓ యూజర్ చమత్కరించారు. ఈ అద్భుతమైన పరివర్తన వెనుక ఉన్న రహస్యం చెప్పాలని కోరుతూ ఓ ఫాలోవర్ చేసిన కామెంట్పై దీపిందర్ గోయల్ ప్రతిస్పందించారు. స్థిరత్వమే రహస్యంమని రిప్లై ఇచ్చారు. View this post on Instagram A post shared by Deepinder Goyal (@deepigoyal) -
జొమాటో సీఈఓ అద్భుతమైన కార్ల ప్రపంచం - చూద్దాం రండి!
దీపిందర్ గోయల్ (Deepinder Goyals) అనగానే అందరికి జొమాటో గుర్తొస్తుంది. భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అందరూ మెచ్చే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫారమ్లలో జొమాటో ఒకటిగా నిలిచింది. పంజాబ్ రాష్ట్రంలో ఒక సాధారణ ఉపాధ్యాయ దంపతులకు జన్మించిన గోయల్ ఈ రోజు రూ. 2వేల కోట్లకంటే ఎక్కువ సంపాదించాడు. కోటీశ్వరుడైన దీపిందర్ గోయల్ ఉపయోగించే కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఫెరారీ రోమా జొమాటో ప్రధాన కార్యాలయం సమీపంలోని రోడ్ల మీద తరచుగా దీపిందర్ గోయల్ తన ఫెరారీ రోమా కారులో కనిపిస్తూ ఉంటాడు. ఈ కారు రెడ్ కలర్లో చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. చిత్రమేమంటే జొమాటో యాప్ కూడా ఇదే కలర్లో ఉండటం గమనార్హం. ఈ కారు ధర సుమారు రూ. 4.3 కోట్లు (ఆన్-రోడ్ ప్రైస్). ఫెరారీ రోమా 3.9 లీటర్ ట్విన్టర్బో వి8 ఇంజన్ కలిగి 690 బిహెచ్పి పవర్, 760 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8 స్పీడ్ డ్యూయల్ క్లచ్ గేర్బాక్స్తో వస్తుంది. పోర్స్చే 911 టర్బో ఎస్ పోర్స్చే కంపెనీకి చెందిన 911 టర్బో ఎస్ కూడా దీపిందర్ గోయల్ ఉపయోగించే కార్లలో ఒకటి. దీని ధర రూ. 3.13 కోట్లు. ఈ కారు కేవలం 8.9 సెకన్లలో గంటకు 200 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇందులోని ఇంజిన్ 650 hp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. (ఇదీ చదవండి: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఐస్క్రీమ్ - ఈ ధరతో ఒక కారు కొనేయొచ్చు!) లంబోర్ఘిని ఉరుస్ మన దేశంలో ఎక్కువ మంది సెలబ్రిటీల వద్ద ఉన్న లగ్జరీ కార్లలో లంబోర్ఘిని ఉరుస్ ఒకటి. ఈ కారుని దీపిందర్ గోయల్ కూడా కొనుగోలు చేశారు. దీని ధర రూ. 4.18 కోట్లు. ఇందులో 4.0-లీటర్, ట్విన్-టర్బో వి8 ఇంజిన్ ఉంటుంది. ఇది 650 hp పవర్, 850 Nm టార్క్ అందిస్తుంది. కేవలం 3.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది. పోర్స్చే కారెరా ఎస్ పోర్స్చే కంపెనీకి చెందిన కారెరా ఎస్ దీపిందర్ గోయల్ వద్ద ఉన్న సూపర్ కార్లలో ఒకటి. దీని ధర రూ. 1.88 కోట్లు. ఇందులోని 3.0 లీటర్ ప్లాట్ సిక్స్ సిలిండర్ బాక్సర్ పెట్రోల్ ఇంజిన్ 450 bhp పవర్, 530 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది డిజైన్, ఫీచర్స్ పరంగా చాలా ఉత్తమంగా ఉండటమే కాకుండా పనితీరు పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. (ఇదీ చదవండి: అపర కుబేరులు జిమ్లో ఉంటే ఇలాగే ఉంటారా? ఫోటోలు చూడండి!) ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
జొమాటో సిఈవో కొత్త కారు.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
సెలబ్రెటీలు, పారిశ్రామిక వేత్తలు ఎప్పటికప్పుడు ఖరీదైన, విలాసవంతమైన కార్లను కొనుగోలు చేస్తారనే సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే జొమాటో సిఈవో, వ్యవస్థాపకుడు 'దీపిందర్ గోయల్' ఇటీవల అత్యంత ఖరీదైన 'ఫెరారీ రోమా' కొనుగోలు చేసాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో వెల్లడైన కొన్ని ఫోటోల ప్రకారం, ఈయన కొనుగోలు చేసిన కారు హర్యానాలోని గురుగ్రామ్ రోడ్లపై తిరుగుతున్నట్లు తెలిసింది. ఈ కారు ధర సుమారు రూ. 4.3 కోట్లు (ఆన్-రోడ్ ప్రైస్). ఇది రెడ్ కలర్లో చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. చిత్రమేమంటే జొమాటో యాప్ కూడా ఇదే కలర్లో ఉండటం గమనార్హం. ఫెరారీ కంపెనీ 2021లో రోమా కారుని ప్రారంభించింది. అయితే ఇది భారతదేశంలో కొంతమంది ధనవంతుల వద్ద మాత్రమే ఉంది. దీనికి కారణం ఈ కారు ధర ఎక్కువగా ఉండటమే. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఇందులో ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డిఆర్ఎల్లతో స్లిమ్ ఎల్ఈడీ హెడ్లైట్లను పొందుతుంది. అంతే కాకుండా క్వాడ్-ఎగ్జాస్ట్ సెటప్, ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ స్పాయిలర్ కూడా ఇందులో ఉన్నాయి. (ఇదీ చదవండి: బజాజ్ ప్రేమికుల కోసం చేతక్ ప్రీమియం ఎడిషన్.. ధర, రేంజ్ వివరాలు) ఫెరారీ రోమా క్యాబిన్, డ్రైవర్, కో డ్రైవర్ సీటు కూడా భిన్నంగా ఉంటాయి. సెంటర్ కన్సోల్లో 8.4 ఇంచెస్ టాబ్లెట్-స్టైల్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 16 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బటన్లతో కూడిన కొత్త స్టీరింగ్ వీల్ కూడా ఇందులో అమర్చబడి ఉంటాయి. ఫెరారీ రోమా 3.9 లీటర్ ట్విన్టర్బో వి8 ఇంజన్ కలిగి 690 బిహెచ్పి పవర్, 760 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8 స్పీడ్ డ్యూయల్ క్లచ్ గేర్బాక్స్తో జతచేయబడి ఉంటుంది. జొమాటో సీఈఓ దీపేందర్ గోయల్ వద్ద ఫెరారీ రోమాతో పాటు లంబోర్ఘిని ఉరస్, పోర్షే 911 కారెరా వంటి సూపర్ కార్లు కూడా ఉన్నాయి. -
జొమాటోకు భారీ షాక్, కో-ఫౌండర్ రాజీనామా
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు భారీ షాక్ తగిలింది. కో ఫౌండర్ మోహిత్ గుప్తా ఆ సంస్థకు రిజైన్ చేస్తున్నట్లు ప్రకటించారు. రిజైన్పై నోట్ను విడుదల చేసిన గుప్తా.. అందులో జొమాటో సంస్థకు శుభాకాంక్షలు తెలిపారు. సంస్థ దీర్ఘకాలిక పెట్టుబడిదారుడిగా కొనసాగుతున్నట్లు తెలిపారు. ‘సంవత్సరాల తరబడి మేము నేర్చుకున్న ప్రతిదానిని మీరు కొనసాగించడం కోసం నేను ఎదురు చూస్తున్నాను. కనికరం లేకుండా ఉండండి, నేర్చుకుంటూ ఉండండి. ప్రపంచానికి రోల్ మోడల్గా ఉండేలా సంస్థను నిర్మించండని’ అని అన్నారు. కోవిడ్-19 మహమ్మారి వంటి సవాళ్లు ఉన్నప్పటికీ జొమాటోను లాభదాయకమైన వ్యాపారం గా మార్చేందుకు ఫౌండర్ దీపిందర్ గోయల్, ఉద్యోగుల్ని కృషి చేశారని గుప్తా ప్రశంసించారు. గత కొన్ని సంవత్సరాలుగా దీపిందర్ గోయల్ మరింత పరిణతి చెందిన, నమ్మకమైన లీడర్గా మారడం నేను చూశాను. అతను ఇప్పుడు మీ అందరితో కలిసి వ్యాపారాన్ని ఉజ్వలమైన భవిష్యత్తుకు నడిపించగల సామర్థ్యం కలిగి ఉన్నాడు’ అని చెప్పారు. -
‘జొమాటో చెప్పినట్లే చేస్తోంది’
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో వాటాదారులకు చెప్పినట్టుగానే అడుగులు వేస్తోంది. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో నష్టాలను మరింత తగ్గించుకుని.. రూ.251 కోట్లకు పరిమితం చేసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నష్టాలు రూ.435 కోట్లతో పోలిస్తే సగం తగ్గినట్టు తెలుస్తోంది. కార్యకలాపాల ద్వారా ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.1,024 కోట్లతో పోలిస్తే 60 శాతం పెరిగి రూ.1,661 కోట్లకు ఎగసింది. ఆగస్ట్ 10 నుంచి జొమాటో విలీనం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి జొమాటో గణాంకాలను కూడా కలిపి చూస్తే ఆదాయం త్రైమాసికం వారీగా 16 శాతం పెరిగి, (వార్షికంగా 48 శాతం వృద్ధి) రూ.2,107 కోట్లుగా ఉంది. వార్షికంగా చూస్తే బిలియన్ డాలర్ల (రూ.8,000 కోట్లు) ఆదాయ మార్క్ను మొదటిసారి ఓ త్రైమాసికంలో చేరుకున్నట్టు జొమాటో ప్రకటించింది. ‘‘దీర్ఘకాలం కోసం వ్యాపార నిర్మాణ క్రమంలో ఉన్నాం. దీర్ఘకాలం కోసం స్వల్పకాల అంచనాల విషయంలో రాజీపడడం, అవకాశాలను అంచనా వేయడం అన్నది ఎప్పటి మాదిరే కొనసాగుతుంది’’అని జొమాటో సీఈవో, వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ తెలిపారు. మెరుగైన పనితీరు అంశంపైనా మాట్లాడారు. ‘‘చాలా విభాగాల్లో మేము మెరుగుపడాల్సి ఉంది. నాణ్యమైన ఉత్పత్తులను పెద్ద మొత్తంలో, వేగంగా డెలివరీ చేయాలి. కస్టమర్ల అభిప్రాయాలను సరైన విధంగా అర్థం చేసుకోవాలి. అలాగే, రెస్టారెంట్ భాగస్వాములు, డెలివరీ భాగస్వాముల అభిప్రాయాలను కూడా తరచూ వినాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న నమూనాలను సవాలు చేస్తూ, మరిన్ని రిస్క్లు తీసుకోవాల్సి ఉంది’’అని వివరించారు. బ్లింకిట్పై అభిప్రాయం మారుతుంది బ్లింకిట్ గురించి మాట్లాడుతూ.. ‘‘చాలా మంది ఇన్వెస్టర్లు ప్రస్తుతం బ్లింకింట్ వ్యాపారానికి సున్నా విలువ కడుతున్నారు. అది అర్థం చేసుకోతగినది. కొంత కాలానికి ఇది మారుతుందని నాకు నమ్మకం ఉంది’’అని గోయల్ వివరించారు. అన్ని ఇబ్బందులను అధిగమించామని, ప్రస్తుతం బ్లింకిట్కు నిలకడైన టీమ్ ఏర్పడిందని చెప్పారు. ఈ బృందం మంచి ఫలితాలను తీసుకొస్తున్నట్టు చెప్పారు. -
ర్యాష్ డ్రైవింగ్: జొమాటో హాట్లైన్ నంబర్ లాంచ్
న్యూఢిల్లీ: డెలివరీ పార్ట్నర్లు ర్యాష్గా డ్రైవింగ్ చేస్తున్న పక్షంలో ప్రజలు తమకు ఫిర్యాదు చేసేందుకు వీలుగా కొత్త డెలివరీ బ్యాగ్లను ప్రవేశపెట్టింది. ఈ విషయాన్ని ఆన్లైన్ ఫుడ్ అగ్రిగేటర్ జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. తమ బ్యాగ్లపై ‘హాట్లైన్ ఫోన్ నంబర్‘ ముద్రించి ఉంటుందని ట్వీట్ చేశారు. వేగంగా డెలివరీలు చేయాలంటూ తాము పార్ట్నర్లను ఒత్తిడి చేయమని ఆయన పేర్కొన్నారు. సత్వరం అందిస్తే ప్రోత్సాహకాలు ఇవ్వడం, లేకపోతే పెనాల్టీలు విధించడం వంటివి ఏమీ ఉండవని గోయల్ స్పష్టం చేశారు. అసలు వారికి ఎస్టిమేటెడ్ డెలివరీ కూడా చెప్పం. ఈ నేపథ్యంలో తమ డె లివరీ పార్ట్నర్లు ఎవరైనా వేగంగా నడుపుతుంటే. తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. తద్వారా రోడ్లపై ట్రాఫిక్ను రద్దీ లేకుండా నివారించాలని ఆయన కోరారు. 10 నిమిషాల్లోనే ఇన్స్టంట్ డెలివరీ సర్వీసులు ప్రారంభిస్తున్నామని గతంలో ప్రకటించినప్పుడు డెడ్లైన్ పేరిట డెలివరీ పార్ట్నర్లపై ఒత్తిడి పెంచుతున్నారంటూ జొమాటోపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో గోయల్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. As promised earlier, we have started rolling out delivery bags which mention a hotline phone number to report rash driving by our delivery partners. Please remember – we don’t incentivise our delivery partners for on time deliveries, nor do we penalise them for late ones. (1/2) pic.twitter.com/Jic36Rt1qn — Deepinder Goyal (@deepigoyal) November 2, 2022 -
జొమాటో సీఈవో దీపిందర్ గోయల్కు భారీ షాక్, బెడిసి కొట్టిన మాస్టర్ ప్లాన్!
జొమాటో సీఈవో దీపిందర్ గోయల్కు భారీ షాక్ తగిలింది. పదినిమిషాల్లో డెలివరీ అంటూ గోయల్ వేసిన మాస్టర్ ప్లాన్ బెడిసికొట్టినట్లు తెలుస్తోంది. ఆరంభం అదిరేలా గూర్గావ్ కేంద్రంగా జొమాటో 10నిమిషాల్లో ఫుడ్ డెలివరీ పైలెట్ ప్రాజెక్ట్ను ప్రారంభించింది. కానీ డెలివరీ బాయ్స్ లేక..చెప్పిన టైంకు కస్టమర్లకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ను డెలివరీ చేయడంలో విఫలమవుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అదే సమస్యతో స్విగ్గీ సైతం తన 'జెనీ' సేవల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆర్డర్లు ఆలస్యం అవ్వడంతో ఏం జరుగుతుందో అర్ధం గాక కస్టమర్లు తలలు పట్టుకుంటున్నారు. మేం అందుబాటులోకి తెచ్చే పదినిమిషాల ఫుడ్ డెలివరీ సర్వీస్ ప్రపంచంలో ఇంత వరకు ఏ ఇతర ఫుడ్ డెలివరీ సంస్థలు కస్టమర్లకు అందించలేదు. కానీ మేం అందిస్తాం. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయబోతున్నాం. తొలత ఈ టెన్ మినిట్స్ డెలివరీ పైలెట్ ప్రాజెక్ట్ను గుర్గావ్లో ప్రారంభిస్తున్నాం. తర్వాత దేశ వ్యాప్తంగా కస్టమర్లకు ఫుడ్ డెలివరీ అందిస్తున్నామని ప్రకటించి జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ గట్టి ప్లానే వేశారు. కానీ ఇప్పుడు ఆ ప్లాన్ బెడిసి కొట్టినట్లు తెలుస్తోంది. పది నిమిషాల సంగతి దేవుడెరుగు పది నిమిషాల సంగతి దేవుడెరుగు. ఆర్డర్ పెట్టిన ఫుడ్ ఐటమ్ 15 నుంచి 20 నిమిషాలకు కూడా అందడం లేదంటూ జొమాటోపై కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ కంపెనీ ప్రతినిధులు మాత్రం తాము చెప్పినట్లుగానే జొమాటో ఇన్స్టంట్ ద్వారా పదినిమిషాల్లో ఫుడ్ను కస్టమర్లకు అందిస్తున్నామని చెబుతున్నారు. గూర్గావ్లో జొమాటో ఇన్స్టంట్ ద్వారా టెన్ మినిట్స్ డెలివరీపై ఊహించని రెన్సాన్స్ వచ్చిందని, మే నెలలో బెంగళూరులో సైతం ఈ డెలివరీ విధానాన్ని అమలు చేయనున్నట్లు చెబుతున్నారు. జొమాటో ఇన్స్టంట్ యాప్లో సైతం ఫుడ్ డెలివరీ టైం 15 నుంచి 20నిమిషాల సమయం చూపెట్టడంపై ఫుడ్ లవర్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డెలివరీ బాయ్స్కు కొత్త కష్టాలు ఈ నేపథ్యంలో జొమాటో 10నిమిషాల్లో ఫుడ్ డెలివరీ చేయడం సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతుండగా..సీఎన్బీసీ టీవీ18 ఆసక్తికర కథనం వెలుగులోకి వచ్చింది. ఆ కథనం ప్రకారం..క్విక్ కామర్స్ (10నిమిషాల్లో ఆర్డర్ అందించడం), జాబ్ మొబిలిటీ (ఉన్న జాబ్ వదిలేసి మరో కొత్త ఫీల్డ్లోకి వెళ్లడం) వంటి అంశాలు స్విగ్గీ, జొమాటోలకు డెలివరీ బాయ్స్ గుడ్ బై చెబుతున్నట్లు నివేదించింది. దీంతో పాటు సమ్మర్ సీజన్, ఐపీఎల్, వర్షాల కారణంగా డెలివరీ బాయ్స్..ఆర్డర్లను డెలివరీ చేసేందుకు ముందుకు రావడం లేదని తెలిపింది. సేమ్ టూ సేమ్ దీంతో ఇన్ టైమ్లో కస్టమర్లకు ఫుడ్ డెలివరీని అందించకపోవడంతో జొమాటో, స్విగ్గీలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎల్ సీజన్ కారణంగా డిమాండ్కు తగ్గట్లు డెలివరీ బాయ్స్ లేక స్విగ్గీ సంస్థ జెనీ పేరుతో నిర్వహిస్తున్న పిక్ అప్.. డ్రాప్ ఆఫ్ సేవల్ని ముంబై, హైదరాబాద్, బెంగళూరులలో సేవల్ని తాత్కాలికంగా నిలిపివేసింది. “క్రికెట్, పండుగల సీజన్ ఫలితంగా ఫుడ్ మార్కెట్ప్లేస్, ఇన్స్టామార్ట్ రెండింటికీ అవసరాల్ని తీర్చడానికి డిమాండ్ పెరిగింది. అందుకు అనుగుణంగా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డిమాండ్కు అనుగుణంగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రస్తుతం స్విగ్గీ జెనీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఓ ప్రకటలో స్విగ్గీ తెలిపింది. చదవండి👉స్విగ్గీ బంపరాఫర్: డెలివరీ బాయ్స్ కష్టాలకు చెక్.. కళ్లు చెదిరేలా జీతాలు! -
జొమాటో డెలివరీ పార్ట్నర్స్కి గుడ్న్యూస్!
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫాం జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ తన ఉదారత చాటుకున్నారు. సంస్థ డెలివరీ పార్ట్నర్స్ పిల్లల చదువుకు ఆర్థికంగా తోడ్పాటు అందించే దిశగా జొమాటో ఫ్యూచర్ ఫౌండేషన్ (జెడ్ఎఫ్ఎఫ్)కు 90 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 700 కోట్లు) విలువ చేసే ఎసాప్స్ను (స్టాక్ ఆప్షన్స్) విరాళంగా ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు సంస్థ అంతర్గతంగా ఉద్యోగులకు ఆయన లేఖ రాశారు. జొమాటో పబ్లిక్ ఇష్యూకి వెళ్లడానికి ముందు .. ఇన్వెస్టర్లు, బోర్డు ఆయన పనితీరు ప్రాతిపదికన కొన్ని ఎసాప్స్ను కేటాయించింది. వీటన్నింటినీ ఫౌండేషన్కు అందిస్తున్నట్లు గోయల్ తెలిపారు. ఇద్దరు పిల్లలకు గత నెలలో షేరు సగటు ధర ప్రకారం వీటి విలువ సుమారు రూ. 700 కోట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. అయిదేళ్లకు పైగా తమ డెలివరీ పార్ట్నర్స్గా పనిచేస్తున్న వారి పిల్లల (గరిష్టంగా ఇద్దరికి) చదువు ఖర్చుల కోసం ఏటా ఒక్కొక్కరికి రూ. 50,000 వరకూ ఈ ఫండ్ నిధులు అందిస్తుంది. అదే పదేళ్ల పైగా పని చేస్తున్న వారి పిల్లలకు ఏటా రూ. 1 లక్ష వరకూ లభిస్తుంది. మహిళా డెలివరీ పార్ట్నర్లకు ఈ పని కాలానికి సంబంధించి కొంత వెసులుబాటు ఉంటుంది. ఫండ్కు నిధులు సమకూర్చేందుకు తొలి ఏడాది తన ఎసాప్స్లో 10 శాతాన్ని విక్రయించనున్నట్లు గోయల్ పేర్కొన్నారు. చదవండి: శబాష్!! జొమాటో.. చెప్పింది చేసింది! -
జొమాటోపై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు..! సాధ్యమంటోన్న కంపెనీ సీఈవో
పది నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ అందించేందుకు సిద్దంగా ఉన్నామని జొమాటో ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా కంపెనీ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. పది నిమిషాల్లో డెలివరీ చేసే డెలివరీ బాయ్స్ పరిస్థితి ఏంటని ట్విటర్లో ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా పది నిమిషాల డెలివరీ వ్యవహారం పార్లమెంట్లో చర్చకు దారి తీసింది. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం నిప్పులు చెరిగారు. సదరు కంపెనీలు వేగంగా డెలివరీ చేసే మోజులో పడ్డాయని, డెలివరీ బాయ్స్ భద్రత గురించి కంపెనీలు పట్టించుకోవడం లేదంటూ పార్లమెంట్లో ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ వ్యవహారంపై జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ స్పందించారు. 10 నిమిషాల్లో డెలివరీ సాధ్యమే..! సోషల్మీడియాలో నెటిజన్లు లేవనెత్తిన ప్రశ్నలకు జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ వివరణ ఇచ్చారు. అంతేకాకుండా పది నిమిషాల్లో డెలివరీ సాధ్యమంటూ పేర్కొన్నారు. జొమాటో ఇన్స్టంట్ సేవల్లో భాగంగా డెలివరీ బాయ్స్కు ఎలాంటి ఆటంకాలు రావని, వారి భద్రతకు కంపెనీ కట్టుబడి ఉందని పేర్కొన్నాడు. ► జొమాటో ఇన్స్టంట్ సేవల్లో భాగంగా 10 నిమిషాల డెలివరీ సర్వీస్...నిర్దిష్ట ప్రాంతాల్లో ఎక్కువగా జనాదరణ పొందిన, ప్రామాణిక ఫుడ్ ఐటమ్స్ రెండు నిమిషాల్లో రెడీ అయ్యే వాటిని మాత్రమే డెలివరీ చేస్తామని తెలిపారు. ► ఇక ఆలస్యమైన డెలివరీలపై ఎలాంటి జరిమానాలు లేవు. 10 నుంచి 30 నిమిషాల డెలివరీలకు ఎటువంటి ప్రోత్సాహకాలు లేవంటూ గోయల్ పేర్కొన్నారు. ► పది నిమిషాల్లో డెలివరీ అందించేందుగాను కొత్త ఫుడ్ స్టేషన్లను నిర్మిస్తామని తెలిపారు. వీటి సహాయంతో డెలివరీ వేగంగా అవుతుందని అభిప్రాయపడ్డారు. ► డెలివరీ భాగస్వాములకు రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తామని, వారికి ప్రమాద, జీవిత బీమాను కూడా అందిస్తామని గోయల్ చెప్పారు. ► 10 నిమిషాల్లో తమ కస్టమర్లకు వెంటనే రెడీ అయ్యే.. "బ్రెడ్, ఆమ్లెట్, పోహా, కాఫీ, చాయ్, బిర్యానీ, మోమోస్ మొదలైన ఫుడ్ ఐటమ్స్ను డెలివరీ చేస్తామని గోయల్ తెలిపారు. Again, 10-minute delivery is as safe for our delivery partners as 30-minute delivery. God, I love LinkedIn :P (2/2) pic.twitter.com/GihCjxA7aQ — Deepinder Goyal (@deepigoyal) March 22, 2022 చదవండి: జొమాటో సంచలన నిర్ణయం..! ఇకపై పది నిమిషాల్లోనే డెలివరీ..ముందుగా అక్కడే -
జొమాటో సంచలన నిర్ణయం..! ప్రపంచంలోనే మొదటి కంపెనీగా..!
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫాం జొమాటో సంచలన నిర్ణయం తీసుకుంది. కేవలం పది నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ అందించేందుకు సిద్దమైంది. జొమాటో ఇన్స్టంట్..! ప్రముఖ గ్రాసరీ సంస్థ జెప్టో కేవలం 10 నిమిషాల్లోనే గ్రాసరీ సేవలను డెలివరీ చేస్తోన్న విషయం తెలిసిందే. జెప్టో తరహాలోనే ఫుడ్ డెలివరీ సేవలను అందించేందుకు జొమాటో సిద్థమవుతోంది. అందుకోసం 'జోమాటో ఇన్స్టంట్'ని త్వరలో ప్రారంభించనున్నట్లు కంపెనీ సోమవారం రోజున ప్రకటించింది. వచ్చే నెల నుంచి గురుగ్రామ్లోని నాలుగు స్టేషన్లతో జోమాటో ఇన్స్టంట్ను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనుంది. మొదటి కంపెనీగా రికార్డు..! ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ కంపెనీ ఫుడ్ డెలివరీ సంస్థ 10 నిమిషాల్లోపు తాజా ఆహారాన్ని డెలివరీ చేయలేదు. కేవలం పది నిమిషాల్లో వేడి వేడి, తాజా ఆహారాన్ని అందించే సంస్థగా జొమాటో రికార్డులు క్రియేట్ చేయనుందని జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ వెల్లడించారు. రెస్టారెంట్లను క్రమబద్దీకరించడం, సదరు ప్రాంతంలో ఎక్కువగా తినే ఆహార పదార్థాల లిస్టింగ్ సహాయంతో ఫుడ్ డెలివరీ 10 నిమిషాల్లో చేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా కస్టమర్ల నుంచి వస్తోన్న డిమాండ్ నేపథ్యంలో జొమాటో ఇన్స్టంట్ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. 10 నిమిషాల డెలివరీ ఎలా పని చేస్తుందంటే? జొమాటో ఏర్పాటు చేసే ప్రతి ఫినిషింగ్ స్టేషన్లో డిమాండ్ ప్రిడిక్టబిలిటీ , హైపర్లోకల్ ప్రాధాన్యతల ఆధారంగా వివిధ రెస్టారెంట్ల నుంచి బెస్ట్ సెల్లర్ వస్తువులు (సుమారు 20-30 వంటకాలు) అందుబాటులో ఉంటాయని గోయల్ చెప్పారు. ఇక కస్టమర్లకు డెలివరీ ఛార్జీలు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఛార్జీల తగ్గింపు జొమాటో రెస్టారెంట్ భాగస్వాములతో పాటు, డెలివరీ బాయ్స్కు వారి ఆదాయాల్లో మార్పు ఉండదని తెలిపారు. చదవండి: ఎంత పని చేశార్రా..! జోమోటో పేరును మార్చేశారుగా..!