Event
-
NATS 8వ కర్టెన్ రైజర్ ఈవెంట్ (ఫొటోలు)
-
లుక్స్తోనే కట్టిపడేస్తోన్న కీర్తి సురేష్ ... (ఫోటోలు)
-
ఐఫా అవార్డు అందుకున్న ఆనందంలో టాలీవుడ్ బ్యూటీ (ఫోటోలు)
-
హైదరాబాద్లో మహిళా దినోత్సవ సంబరాలు (ఫొటోలు)
-
నయనతార 'అమ్మోరు2'లో పూజా కార్యక్రమంలో రెజీనా,మీనా (ఫోటోలు)
-
హైదరాబాద్ : ఆకట్టుకున్న మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ ఆడిషన్స్ (ఫొటోలు)
-
తల్లి కాబోతున్న కియారా : తొలి మెటర్నిటీ ఫ్యాషన్ లుక్ అదుర్స్!
హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే తల్లి కాబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మా జీవితాల్లో అత్యంతవిలువైన బహుమతి రాబోతోంది అనే క్యాప్షన్తో ఒక క్యూట్ ఫోటోను పోస్ట్ చేసింది. నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడిన కియారా త్వరలోనే ఒక బిడ్డకు జన్వనివ్వబోతోందన్న వార్త ఫ్యాన్స్ను ఆనందంలో ముంచెత్తింది. శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇదే విషయాన్ని కియారా భర్త సిద్దార్థ్ (Sidharth Malhotra)కూడా ఇన్స్టాలో షేర్ చేశాడు. కియారా అద్వానీ ఫ్యాషన్ మాస్ట్రో అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ప్రకటన చేయడానికి ముందు ఫ్యాషన్షోలో బాలెన్సియాగా బ్లాక్ దుస్తులను ప్రదర్శించింది. అది ట్రెడిషనల్ దుస్తులైనా, లేదా హై-ఫ్యాషన్ వెస్ట్రన్ అయినా ఆమె లుక్ స్పెషల్గా ఉంటుంది. ఇటీవల, తీరా ఈవెంట్లో, కియారా క్లాసిక్ బ్లాక్ దుస్తులు, బంగార ఆభరణాలతో ఒక బోల్డ్ స్టేట్మెంట్ లుక్తో అదరగొట్టింది. బ్రాండ్ సిగ్నేచర్ లోగోను పోలీ ఉన్న లూజ్గా ఉండేశాటిన్ జాక్వర్డ్ టాప్ ఎంచుకుంది బాలెన్సియాటూ-పీసెస్ ఎటైర్లో స్టన్నింగ్గా కనిపించింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఆమె తొలి పబ్లిక్ మెటర్నిటీ ఫ్యాషన్ లుక్. View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) ఇక బంగారు ఆభరణాల విషయానికి వస్తే చోకర్ ,ఆకర్షించే సింహం పంజా పెండెంట్తో సహా చంకీ స్టేట్మెంట్ నెక్లెస్లను ధరించింది కియారా. భారీ చెవిపోగులు, ఉంగరాలు బ్రాస్లెట్ల స్టాక్ను కూడా జోడించింది. అంతేకాదు లౌబౌటిన్ హీల్స్లో అసలే పొడగరి అయిన కియారా మరింత సొగసరిలా అందర్నీ మెస్మరైజ్ చేసింది. -
ట్యాంక్ బండ్ వేదికగా : చీర కట్టి..పరుగు పెట్టి.. (ఫోటోలు)
-
హైదరాబాద్లో తనైరా శారీ రన్.. అందంగా ముస్తాబైన మహిళలు (ఫోటోలు)
-
ప్రతిష్టాత్మక ఈవెంట్కు జంటగా హాజరైన వీకే నరేశ్- పవిత్రా లోకేశ్.. వీడియో వైరల్
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న నటుడు వీకే నరేశ్. విభిన్నమైన పాత్రలో వెండితెరపై అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. తొమ్మిదో ఏట పండంటి కాపురం మూవీతో బాలనటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు వీకే నరేశ్. చైల్డ్ ఆర్టిస్ట్గా పలు సినిమాలు చేసిన అతడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక చిత్రాల్లో కనిపించారు. ఇటీవల తన 65వ పుట్టిన రోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. అంతేకాకుండా ఈ వేడుకల్లో నటి పవిత్రా లోకేశ్ కూడా పాల్గొన్నారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో కీలక పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించారు.అయితే ప్రముఖ నటి, దర్శకురాలు, వీకే నరేశ్ తల్లి విజయ నిర్మల జయంతి సందర్భంగా హైదరాబాద్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. తన తల్లి విజయ నిర్మల పేరిట అవార్డులను ప్రకటించారు. ఫిబ్రవరి 20న ఆమె జయంతి సందర్భంగా పలువురు టాలీవుడ్ ప్రముఖులకు ప్రతిష్టాత్మక అవార్డులను అందించారు. ఈ కార్యక్రమానికి నటి పవిత్ర లోకేశ్తో కలిసి ఆయన హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీరితో పాటు సంక్రాంతికి వస్తున్నాం డైరెక్టర్ అనిల్ రావిపూడి, మా ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా ఈ ఈవెంట్కు హాజరయ్యారు. కాగా.. ఈ ఈవెంట్లో జంధ్యాల జీవితంపై రైటర్ సాయినాథ్ రాసిన పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. నాకు సినిమాల్లో ఓనమాలు నేర్పించిన జంధ్యాలను చరిత్రలో ఒక భాగంగా ఉంచాలని ఆయన పేరుతో డబ్బింగ్, పోస్ట్ ప్రోడక్షన్ థియేటర్నుప్రారంభించినట్లు పేర్కొన్నారు.అయితే తన కెరీర్లోనే 2025 బిజీగా ఉండబోతోందని ఇటీవల ఓ ఈవెంట్లో వెల్లడించారు. ఏకకాలంలో తొమ్మిది సినిమాల్లో నటిస్తున్నా.. బ్యూటీ అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా సినిమా మ్యూజియమ్ అండ్ లైబ్రరీ అండ్ క్రియేటివ్ స్పేస్ ఫర్ యంగ్ పీపుల్ అనే కార్యక్రమాన్ని శ్రీమతి ఘట్టమనేని ఇందిరా దేవి పేరుతో ప్రారంభించినట్లు వెల్లడించారు. అందులో విజయకృష్ణ మందిరం ఏర్పాటు చేయడం జరిగిందని.. నేను, పవిత్ర దీనిని ఓ మిషన్లా తీసుకుని కళాకారుల ఐక్య వేదిక సంస్థ పేరుపై ఏర్పాటు చేసినట్లు ఇటీవలే వివరించారు.Visuals of Actor & MAA President @iVishnuManchu, Director @AnilRavipudi, Actor @ItsActorNaresh, and #PavitraLokesh from the Vijaya Nirmala Awards function in Hyderabad! 📸🤩#ManchuVishnu #AnilRavipudi #ShivaBalaji #TFNExclusive #TeluguFilmNagar pic.twitter.com/LkIrqymsGi— Telugu FilmNagar (@telugufilmnagar) February 20, 2025 -
హై లైఫ్ ఎగ్జిబిషన్ కర్టెన్ రైజర్ ఈవెంట్ లో మెరిసిన మోడల్స్...
-
'కలర్స్ హెల్త్ కేర్'లో ఐశ్వర్య రాజేష్ సందడి
-
స్నేహితులతో ఫ్యాషన్ ఈవెంట్లో నమ్రతా శిరోద్కర్ (ఫోటోలు)
-
బాలికా సాధికారత..పరుగుతో చేయూత !
-
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ పాతికేళ్ల పండగలో మెరిసిన తారలు
-
ముంబై మ్యూజికల్ ఈవెంట్లో ఎంజాయ్ చేస్తున్న మెహ్రీన్ (ఫోటోలు)
-
హీరో బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ వేడుక (ఫోటోలు)
-
వారికేమో ముద్దులు, హగ్గులు.. అభిమానితో అలాగేనా?.. హీరోయిన్పై నెటిజన్స్ ఫైర్!
టాలీవుడ్ హీరోయిన్ నిత్యామీనన్ ప్రస్తుతం ఇడ్లీ కడై అనే కోలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో ధనుశ్ హీరోగా నటిస్తున్నారు. గతంలో వీరిద్దరు జంటగా రుచిత్రంబలం (తెలుగులో ‘తిరు’) మూవీలో నటించారు. ఈ సినిమాలో నటనకు గానూ నిత్యాకు జాతీయ ఉత్తమ నటి అవార్డ్ను దక్కించుకుంది. అంతేకాకుండా జయం రవి సరసన కాదలిక్క నెరమిళ్లై అనే సినిమాలో కనిపించనుంది. ఈ మూవీ సంక్రాంతి కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది.కాగా.. ఈ చిత్రానికి తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆయన సతీమణి కిరుతిగ ఉదయనిధి దర్శకత్వంలో తెరకెక్కించారు. దర్శకురాలిగా ఆమెకు ఇది మూడో సినిమా కావడం మరో విశేషం. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. తాజాగా చెన్నైలో ఓ ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నిర్వహించిన ఓ ఈవెంట్కు హీరోయిన్ నిత్యామీనన్ కూడా హాజరైంది. అయితే ఈవెంట్లో నిత్యామీనన్ వ్యవహరించిన తీరుపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. ఆమె మాట్లాడుతుంగా అక్కడే ఉన్న ఓ వ్యక్తి షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. కానీ నిత్యా అతన్ని సున్నితంగా తిరస్కరించింది. దీంతో నిత్యామీనన్ తీరుపై నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. ఆమెది చెత్త బిహేవియర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కానీ అంతకుముందు ఇదే ఈవెంట్లో నిత్యా వ్యవహరించిన తీరు అందరిని షాకింగ్కు గురి చేస్తోంది. ఇదే ఈవెంట్లో నిత్యా మీనన్ దర్శకుడు మిష్కిన్ను ముద్దుపెట్టుకుంది. అంతేకాకుండా మూవీ హీరో జయం రవిని కూడా హగ్ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే ఆమె చేసిన దాంట్లో తప్పేమీ లేకపోయినా.. ఓ అభిమాని షేక్ హ్యాండ్ ఇస్తే ఇవ్వరా? అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. ఫ్యాన్స్తో నిత్యా మీనన్ తీరు సరికాదంటూ పోస్టులు పెడుతున్నారు. (ఇది చదవండి: ప్రేమకు వ్యతిరేకం కాదు.. అలాంటి వ్యక్తికే నా లైఫ్లో చోటు: నిత్యా మీనన్)కాగా.. ఈ చిత్రంలో జయం రవి, నిత్యతో పాటు యోగి బాబు, వినయ్, లాల్, లక్ష్మీ రామకృష్ణన్, వినోదిని, గాయకుడు మనో, టీజే బాను, జాన్ కోగన్ ప్రధాన పాత్రలు పోషించారు. రెడ్ జెయింట్ మూవీస్ నిర్మించనున్న ఈ చిత్రానికి మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రఘుమాన్ సంగీతం అందించారు.జాతీయ అవార్డుకాగా తిరు సినిమాకుగానూ నిత్యామీనన్కు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు లభించింది. ఈ మూవీలో ధనుష్ హీరోగా నటించగా రాశీ ఖన్నా హీరోయిన్గా యాక్ట్ చేసింది. హీరో స్నేహితురాలిగా నిత్య ఆకట్టుకుంది. మిత్రన్ జవహర్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇది 2022లో విడుదలైంది. నిత్య లేటెస్ట్ మూవీ కాదలిక్క నెరమిళ్లై విషయానికి వస్తే.. ఇందులో జయం రవి, వినయ్, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. రెడ్ జియాంట్ సినిమా నిర్మిస్తున్న ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది.తెలుగులో సినీ కెరీర్.. అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది నిత్యా మీనన్. అలా మొదటి చిత్రంతోనే జనాలకు బాగా నచ్చేసింది. 180, ఇష్క్, జబర్దస్త్, గుండె జారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, ఒక అమ్మాయి తప్ప, జనతా గ్యారేజ్, అ, నిన్నిలా నిన్నిలా, భీమ్లా నాయక్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తమిళంలో ఇడ్లీ కడాయ్, డియర్ ఎక్సెస్ సహా మరో సినిమా చేస్తోంది. Worst behaviour from #Nithyamenon !pic.twitter.com/8mmHTcYg4a— Kolly Censor (@KollyCensor) January 9, 2025 -
జియో వరల్డ్లో మనీష్ మల్హోత్రా: బాలీవుడ్ తారలు, నీతా వెరీ స్పెషల్
-
Game Changer Pre Release Event : హీరో రామ్చరణ్ ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
‘గేమ్ ఛేంజర్’ ముంబై ఈవెంట్ (ఫొటోలు)
-
సంక్రాంతికి వస్తున్నాం.. బ్యాట్ పట్టి, స్టెప్పులేసిన వెంకీమామ (ఫోటోలు)
-
బృందావనంలో గోపికలుగా ఎంత ముద్దుగున్నారో.. గుర్తు పట్టారా? (ఫోటోలు)
-
అమెరికాలో ల్యాండ్ అయిన 'గేమ్ ఛేంజర్' టీమ్ (ఫొటోలు)
-
హైదరాబాద్ లో పుష్ప 2 వైల్డ్ ఫైర్ జాతర
-
ఎల్లో చీరలో ’క్రష్మిక’ లుక్, ఆ స్టయిలే వేరు సామి (ఫోటోలు)
-
చెన్నైలో 'పుష్ప 2' వైల్డ్ ఫైర్ ఈవెంట్ (ఫొటోలు)
-
24న చెన్నైలో పుష్ప 2 వైల్డ్ ఈవెంట్
-
'గేమ్ ఛేంజర్' టీజర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
8 మ్యాట్రిక్స్ డిజైన్ కాన్క్లేవ్ ఈవెంట్: పోస్టర్ ఆవిష్కరించిన ఐటీ మంత్రి
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి 'దుద్దిళ్ల శ్రీధర్ బాబు' మాదాపూర్లోని టీ-హబ్లో '8 మ్యాట్రిక్స్ డిజైన్ కాన్క్లేవ్ 2024' ఈవెంట్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం నవంబర్ 20న జరగనుంది. దీనికి డిజైన్ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖు హాజరుకానున్నారు.8 మ్యాట్రిక్స్ డిజైన్ కాన్క్లేవ్ 2024 ఈవెంట్ పోస్టర్ను ఆవిష్కరించిన సందర్భంగా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. డిజైన్, టెక్నాలజీని ప్రోత్సహించడంలో తెలంగాణ నిబద్ధతకు ఈ కార్యక్రమం ఒక నిదర్శనం. కాన్క్లేవ్ పరిశ్రమ అభివృద్ధికి కొత్త అవకాశాలను పెంపొందిస్తూ సృజనాత్మకతను పెంచుతుంది. అంతే కాకుండా ఇది కొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా హైదరాబాద్ ఖ్యాతిని బలోపేతం చేస్తుందని అన్నారు.నవంబర్ 9న (శనివారం) జరిగిన ఈ కార్యక్రమానికి డిజైన్ విద్యార్థులు, పరిశ్రమ నిపుణులు, సలహాదారులతో సహా మొత్తం 250 మంది హాజరయ్యారు.8 మ్యాట్రిక్స్ డిజైన్ కాన్క్లేవ్ 2024 ప్రతినిధి 'రాజ్ సావంకర్' ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అనుభవజ్ఞులైన పరిశ్రమ నిపుణుల నేతృత్వంలో ప్యానెల్ చర్చలను హోస్ట్ చేయడానికి చాలా సంతోషిస్తున్నాము. హాజరైనవారు విభిన్న రంగాలలో సరికొత్త ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమం సృజనాత్మకత, సాంకేతికతను కలిపే ఏకైక వేదిక, అంతే కాకుండా.. ఇది భవిష్యత్ పురోగతికి కూడా వేదికగా నిలుస్తుందని ఆయన అన్నారు. -
విజయవాడలో డ్రోన్ ప్రదర్శన (ఫోటోలు)
-
ప్రియాంక చోప్రా స్టైలిష్ లుక్ : విలువ రూ. 20 లక్షలు!
గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా గురించిప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీనుంచి బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరిగా ఎదిగింది. తరువాత హాలీవుడ్ దాకాఎదిగి అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో ఒకరిగా తనను తాను నిలబెట్టుకుంది. తాజాగా ముంబై ఈవెంట్లో స్టైలిష్ లుక్లో తళుక్కున మెరిసింది ప్రియాంక చోప్రా. ఆమె మొత్తం ఔట్ఫిట్ ధర ఏకంగా రూ. 20 లక్షలట. దీంతో ధరించిన డ్రెస్, నగలు, హీల్ ఇలా ప్రతీదీ హాట్ టాపిక్గా మారింది. ఈ ఈవెంట్లో కాస్త సన్నగా తయారైన ఆమె అందరినీ ఆకర్షించడమే కాకుండా ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త ట్రెండ్ను సెట్ చేసింది. ప్రియాంక చోప్రా ధరించిన అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్ వివియన్ వెస్ట్వుడ్కు చెందిన డ్రెస్ ఖరీదు ధర రూ. 2.26 లక్షలు. అలాగే ఆమె ధరించిన క్రిస్టియన్ లౌబౌటిన్ హీల్ ధర 71 వేల రూపాయలు. ఆగండి ఆగండి ఇంకా ఉంది. ప్రియాంక చోప్రా Bvlgari బ్రాండ్కి అంబాసిడర్గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్లో ఆమె ధరించిన Bvlgari బ్రాండ్, రోజ్ గోల్డ్ అండ్ డైమండ్ నెక్లెస్ ధర రూ. 7.6 లక్షలు. ఇక డైమండ్ చెవిపోగులు ధర తొమ్మిది లక్షలని ఫ్యాన్స్ అంచనా.ఇదీ చదవండి: అపుడు కటిక పేదరికం : ఇపుడు పూలసాగుతో కోట్ల ఆదాయంవిదేశాల్లో నివసిస్తున్నప్పటికీ, ప్రియాంకకు దేశంపై ఉన్న ప్రేమ పాత్ర అపారం. తన కిష్టమైన గేట్వే అంటూ ఒక వీడియోను కూడా ఇన్స్టాలో షేర్ చేసింది. అలాగే తన నిర్మాణ సంస్థ పర్పుల్ పెబుల్ పిక్చర్స్ ద్వారా ప్రాంతీయ సినిమాల్లో ముఖ్యమైన చిత్రాలకు సపోర్ట్ చేస్తోంది. నిర్మాతగా మరాఠీ-భాషా డ్రామా చిత్రం పానీకి సంబంధించిన ప్రచార కార్యక్రమానికి స్టైల్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా తన తల్లి మధు చోప్రా , కొత్త పెళ్లికొడుకు, సోదరుడు సిద్ధార్థ్ చోప్రాతో కలిసి పోజులిచ్చింది. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
ఇండియన్ ఐడెల్ ఫేం షణ్ముఖ ప్రియ లైవ్ ఈవెంట్ కు ఎదురుదెబ్బ
-
ఎలిగెంట్లుక్, స్టైలిష్ బ్యాగ్ : ఇషా అంబానీ లెవలే వేరు!
యువ మహిళా వ్యాపారవేత్తగా రాణిస్తున్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వ్యాపార రంగంలో రాణిస్తూనే, ఫ్యాషన్ ఐకానిక్లా కూడా తనదైన శైలిని ప్రదర్శిస్తుంది. తాజాగా ఒక ఫ్యాషన్ ఈవెంట్లో ఇషా స్పెషల్లుక్లో ఆకట్టుకుంది. ఈ విషయంలో తల్లి నీతా అంబానీకి తగ్గ తనయ అనిపించుకుంటోంది. సోమవారం జరిగిన లగ్జరీ స్కిన్కేర్ అండ్ హెయిర్కేర్ బ్రాండ్ అగస్టినస్ బాడర్ నిర్వహించిన స్టార్-స్టడెడ్ లాంచింగ్ కార్యక్రమంలో ఇషా అంబానీ బ్లాక్ డ్రెస్లో తళుక్కున మెరిసారు. అనైతా ష్రాఫ్ అడ్జానియా డిజైన్ చేసిన స్ట్రాప్లెస్ బ్లౌజ్, నెక్లైన్ కార్సెట్ టాప్ ,మ్యాచింగ్ స్కర్ట్ ధరించింది. అంతేకాదు లగ్జరీ చిట్టి బ్యాగ్ హీర్మేస్ కెల్లీ బ్యాగ్ ఆకర్షణగా నిలిచింది. తన కవల పిల్లలు ఆదియా,కృష్ణ పేర్లతో ప్రత్యేకంగా తీర్చిదిద్దడం హైలైట్. గ్లామరస్ అవతార్లో శిరస్సునుంచి పాదం వరకు ఆసాంతంగా పర్ఫెక్ట్గా కనిపించింది.కాగా ఇషా అంబానీ 2018లోవ్యాపారవేత్త ఆనంద్ పిరమల్ను పెళ్లి చేసుకున్నారు. 2022, నవంబరులో వీరికి కవల పిల్లలు పుట్టారు. -
యానిమల్ బ్యూటీపై ఆరోపణలు.. ఆమె టీమ్ ఏమన్నారంటే?
యానిమల్ మూవీతో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకున్న బ్యూటీ తృప్తి డిమ్రీ. రణ్బీర్ కపూర్ ప్రియురాలిగా ఈ సినిమాలో అలరించింది. తృప్తి గ్లామర్కు ఆడియన్స్ ఫుల్ ఫిదా అయిపోయారు. ఈ మూవీ తర్వాత ముద్దుగుమ్మకు వరుసగా ఆఫర్స్ కొట్టేసింది. అయితే తాజాగా ఈ బాలీవుడ్ భామ ఓ వివాదంలో చిక్కుకుంది. ఓ ఈవెంట్కు హాజరయ్యేందుకు డబ్బులు తీసుకుని మోసం చేశారని ఆమెపై ఆరోపణలొచ్చాయి. ఈవెంట్కు వచ్చేందుకు వారి నుంచి దాదాపు రూ.5.5 లక్షలు తీసుకుందని నిర్వాహకులు చెబుతున్నారు.తాజాగా తృప్తి డిమ్రీపై వస్తున్న ఆరోపణలపై ఆమె టీమ్ స్పందించింది. ఆమె కేవలం షెడ్యూల్ ప్రకారమే ఈవెంట్స్కు హాజరవుతారని వెల్లడించింది. సినిమా ప్రమోషన్స్ మినహాయించి వ్యక్తిగతంగా ఎలాంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదని తెలిపింది. ఎలాంటి కార్యక్రమాలకు డబ్బులు తీసుకోవడం, చెల్లింపులను ఆమోదించడం లాంటిది జరగలేదని స్పష్టం చేసింది. ఆమె ప్రస్తుతం తన రాబోయే చిత్రం విక్కీ విద్య కా వో వాలా వీడియో మూవీ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారని ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసింది.కాగా.. ఇక సినిమాల విషయానికొస్తే తృప్తి చివరిసారిగా బ్యాడ్ న్యూజ్లో కనిపించింది. ప్రస్తుతం విక్కీ విద్యా కా వో వాలా వీడియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత భూల్ భూలయ్యా-3, ధడక్-2 లో నటించనుంది.అసలేం జరిగిందంటే..?జైపుర్కి చెందిన మహిళా వ్యాపారవేత్తలు ఎఫ్ఐసీసీఐ ఎఫ్ఎల్ఓ ఆధ్వర్యంలో ఓ ఈవెంట్ ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం ఇది జరిగింది. అయితే ఈవెంట్కు హాజరవుతానని చెప్పి తృప్తి డిమ్రీ రూ.5.5 లక్షలు తీసుకుంది. ఈవెంట్ మొదలవడానికి ఐదు నిమిషాల ముందు వరకు వచ్చేస్తానని చెప్పిందట. తీరా రాకపోయేసరికి నిర్వాహకులు, మహిళ వ్యాపారవేత్తలు తృప్తిపై నిరసన వ్యక్తం చేశారు. ఆమె ఫొటోపై నల్లని పెయింట్ రాశారు. ఈక్రమంలోనే ఆమె టీమ్ క్లారిటీ ఇచ్చింది.Muh Kaal Karo 😱 #TriptiDimri skips event after taking 5 Lacs; Women group blackened her poster #MovieTalkies pic.twitter.com/45spP3LrMa— $@M (@SAMTHEBESTEST_) October 1, 2024 -
16 ఏళ్లయింది.. ఎన్టీఆర్ కోసం తెగ ఆరాటపడ్డ యాంకర్.. ఇన్నాళ్లకు! (ఫొటోలు)
-
యాపిల్ ఈవెంట్లో కొత్త ఉత్పత్తులు (ఫోటోలు)
-
ఇట్స్ గ్లోటైమ్: యాపిల్ మెగా ఈవెంట్ రేపే
యాపిల్ 'ఇట్స్ గ్లోటైమ్' ఈవెంట్ రేపు (సెప్టెంబర్ 9) ప్రారంభమవుతుంది. ఈ ఈవెంట్లో కంపెనీ తన ఐఫోన్ 16 సిరీస్, వాచ్ సిరీస్ 10ను కూడా లాంచ్ చేయనుంది. ఈ ప్రత్యేక కార్యక్రమం కాలిఫోర్నియాలోని యాపిల్ కుపెర్టినో పార్క్లో జరుగుతుంది. యాపిల్ అధికారిక వెబ్సైట్, యూట్యూబ్, యాపిల్ టీవీ యాప్ ద్వారా ఈ ఈవెంట్ లైవ్ చూడవచ్చు.గ్లోటైమ్ ఈవెంట్లో.. యాపిల్ చీఫ్ టిమ్ కుక్ కొత్త ఐఫోన్ పరికరాలను ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇందులో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఉండనున్నాయి. వీటికి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడికానప్పటికీ కొన్ని పుకార్లు లేదా లీక్స్ ద్వారా కొన్ని విషయాలు వెల్లడయ్యాయి.బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. యాపిల్ తన ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్లను భారతదేశంలోనే తయారు చేయనున్నట్లు సమాచారం. కాబట్టి మనదేశంలో ఈ పరికరాల రిటైల్ ధర కొంత తక్కువగానే ఉండే అవకాశం ఉంది.యాపిల్ ఐఫోన్ 16 సిరీస్యాపిల్ ఐఫోన్ 16 సిరీస్.. 6.1 ఇంచెస్ నుంచి 6.7 ఇంచెస్ ఓఎల్ఈడీ డిస్ప్లే పొందనున్నట్లు సమాచారం. ఈ ఫోన్లు బ్లూ, గ్రీన్, రోస్, వైట్, బ్లాక్ అనే కలర్ ఆప్షన్లలో లభించనుంది. ఐఫోన్ 16 ప్రో బ్రౌన్ కలర్ పొందనున్నట్లు సమాచారం. దీనిని డెసర్ట్ టైటానియం అని పిలుస్తారు. దీంతితో పాటు గోల్డ్ కలర్ కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం.ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఇదే మార్గం: నితిన్ గడ్కరీ యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ మైక్రో-లెన్స్ టెక్నాలజీని ఉపయోగించవచ్చని చెబుతున్నారు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.89,900 వరకు ఉండొచ్చని అంచనా. ఐఫోన్ 16 సిరీస్ 2x ఆప్టికల్ 48MP ప్రైమరీ కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వంటి వాటిని పొందే అవకాశం ఉంది. ఈ 16 సిరీస్ మోడల్స్ ఏ18 చిప్సెట్ను కలిగి ఉంటుందని సమాచారం. ఇది ఏఐకు సపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది. -
ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ అప్పుడే.. ధర ఎంతంటే?
యాపిల్ తన కొత్త ఐఫోన్ 16 సిరీస్ను సెప్టెంబర్ 9న 'ఇట్స్ గ్లోటైమ్' ఈవెంట్లో ఆవిష్కరించనుంది. మొబైల్ ఫోన్ మాత్రమే కాకుండా.. ఎయిర్ పాడ్స్, స్మార్ట్వాచ్ వంటి వాటిని విడుదల చేయనున్నట్లు సమాచారం. యాపిల్ ఐప్యాడ్ మినీ 7ను కూడా కంపెనీ ఆవిష్కరించే అవకాశం ఉందని చెబుతున్నారు.యాపిల్ ఐఫోన్ 16 సిరీస్యాపిల్ ఐఫోన్ 16 సిరీస్.. 60Hz రిఫ్రెష్ రేట్తో 6.7 ఇంచెస్ ఓఎల్ఈడీ డిస్ప్లే పొందనున్నట్లు సమాచారం. ఇందులో మైక్రో-లెన్స్ టెక్నాలజీని ఉపయోగించవచ్చని చెబుతున్నారు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.89,900 వరకు ఉండొచ్చని అంచనా. ఐఫోన్ 16 సిరీస్ 2x ఆప్టికల్ 48MP ప్రైమరీ కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వంటి వాటిని పొందే అవకాశం ఉంది. ఈ 16 సిరీస్ మోడల్స్ ఏ18 చిప్సెట్ను కలిగి ఉంటుందని సమాచారం. ఇది ఏఐకు సపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది.యాపిల్ ఐప్యాడ్ మినీ 7కంపెనీ విడుదల చేయనున్న యాపిల్ ఐప్యాడ్ మినీ 7.. 60Hz రిఫ్రెష్ రేట్ రిజల్యూషన్తో అదే 8.3 ఇంచెస్ లిక్విడ్ రెటినా డిస్ప్లేను పొందవచ్చు. ర్యామ్ 4 జీబీ నుంచి 8 జీబీకి అప్గ్రేడ్ పొందుతుంది. దీని ధర వంటి వివరాలు లాంచ్ సమయంలో వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
‘కమిటీ కుర్రోళ్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
Ram Pothineni: డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫోటోలు)
-
3న శిల్పకళా వేదికలో చింగ్ హార్ట్స్..
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నేపథ్య గాయిని మంగ్లీ స్వరాలతో నగరంలోని శిల్పకళా వేదికగా ‘చింగ్ హార్ట్స్’ పేరుతో లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ను నిర్వహించనున్నారు. ఆగస్టు 3న జరగనున్న కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను రామానాయుడు స్టూడియోస్ వేదికగా సింగర్ మంగ్లీ, జబర్దస్త్ ఫేం బుల్లెట్ భాస్కర్, సంస్థ సభ్యులు అరుణ ప్రదీప్, విజయలక్షి్మ, సాయి గౌరీ, శ్రీ వల్లి ఆవిష్కరించారు. 35వ వార్షికోత్సవం నేపథ్యంలో..నిరాదరణకు గురైన బాలికలు, అనాథ చిన్నారులకు అన్నీ తామై చూసుకుంటోంది నగరంలోని సాయి సేవా సంఘ్ సామాజిక సేవా సంస్థ. 35వ వార్షికోత్సవం సందర్భంగా చిన్నారుల సహాయార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటి వరకూ దాదాపు 2 వేల మంది బాలికలకు ఉచిత విద్య, వసతితో పాటు వారికి అవసరమైన సంపూర్ణ ఆరోగ్య సంరక్షణను అందింస్తుంది. నృత్యం, సంగీతం వంటి విభిన్న కళల్లో శిక్షణ అందిస్తుంది. ఆ సంస్థ వల్లే..ఈ స్థాయికి...ఏ ఆధారం లేని బాలికల ఆలనా పాలనా చూసుకోవడం అనిర్వచనీయమని మంగ్లీ అన్నారు. తనని కూడా ఆర్టీడీ అనే సంస్థ చేరదీయడం వల్లే ఈ స్థాయికి ఎదిగానని గుర్తు చేసుకున్నారు. ఇంతటి సేవను అందిస్తున్న సాయి సేవా సంఘ్ సంస్థ కోసం తాను కన్సర్ట్లో పాడుతున్నానని, బుక్ మై షో టిక్కెట్ల ద్వారా వచ్చే డబ్బునే కాకుండా వ్యక్తిగతంగా లక్ష రూపాయలను విరాళంగా అందిస్తానని ప్రకటించారు. ఇందులో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్కతో పాటు జబర్ధస్త్ ఫేం ఆటో రామ్ ప్రసాద్, బుల్లెట్ భాస్కర్, నాటీ నరేష్ వంటి ప్రముఖులు ఇందులో పాల్గొననున్నారు. -
హైదరాబాద్: హైలైఫ్ ఎగ్జిబిషన్లో సందడి చేసిన ముద్దుగుమ్మలు (ఫోటోలు)
-
తిరగబడరా స్వామి ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో మాల్వీ మల్హోత్రా.. పోటోలు
-
నీలం బంగారు గౌనులో మెరిసిపోతున్న శ్లోకా మెహతా..! (ఫొటోలు)
-
Kannappa Teaser Launch : కన్నప్ప టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫోటోలు)
-
యాపిల్ WWDC 2024 ఈవెంట్ (ఫొటోలు)
-
రెస్టారెంట్ ప్రారంభ కార్యక్రమంలో సందడి చేసిన నటి వర్ష (ఫోటోలు)
-
అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్.. సాంగ్స్తో జోష్ నింపిన కేటీ పెర్రీ (ఫోటోలు)
-
లవ్ మీ సినిమా స్టోరీ లీక్ చేసిన బ్యూటీ, క్లైమాక్స్ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)
-
నంద్లాల్ షోరూమ్లో సందడి చేసిన సినీ తారలు (ఫొటోలు)
-
కోకాపేట్లోని బఫెలో వైల్డ్ వింగ్స్.. ఆటిజంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం..(ఫొటోలు)
-
Tamannaah Latest Photos: తమన్నా బ్యూటీకి ఫిదా అవుతున్న నెటిజన్లు (ఫోటోలు)
-
మాదాపూర్లో గ్రాండ్గా ఎఫ్ కేఫ్ లాంచ్ ప్రారంభం.. సందడి చేసిన స్టార్స్ (ఫోటోలు)
-
అలియా చీర స్పెషల్ ఎట్రాక్షన్: విషయం తెలిస్తే మీరూ షాకవుతారు!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ హోప్ గాలా 2024 ఈవెంట్లో అందరి చూపులను తన వైపునకు తిప్పుకుంది. ఇటీవల తన తొలి హోప్ గాలాను లండన్లో నిర్వహించింది. ఈసందర్భంగా 30 ఏళ్ల నాటి వింటేజ్ సారీని కొత్తగా డిజైన్ చేయించుని మరీ ధరించింది. ఇవరీ రేషమ్ సారీలో తన స్టయిలిష్లుక్తో అందర్నీ మెస్మరైజ్ చేసింది. దీనికి జతగా టోర్టటైజ్ నెక్లైన్ క్రిస్టల్-ఎంబెడెడ్, వెనుక ముత్యాల లైన్లతో తీర్చిదిద్దిన బ్లౌజ్ మరింత అందంగా నప్పింది. (వేసవిలో చల్ల చల్లగా : గోండ్ కటీరా జ్యూస్.. ఒక్కసారి తాగితే..!) హోప్ గాలా 2024 ఈవెంట్కోసం ఈ చీరను ప్రముఖ డిజైనర్లు అబుజానీ, సందీప్ ఖోస్లా స్పెషల్గా డిజైన్ చేశారట. వీరు దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఆకులు,పువ్వుల డిజైన్లతో పట్టు దారాలతో ఎంబ్రాయిడరీ చేసినట్టు తెలిపారు. అంతేకాదుఈ చీర వాస్తవానికి 1994లో తయారు చేసిందట. 30 ఏళ్లనాటి ఈ చీరను మళ్లీ కొత్తగా సిద్ధం చేయడానికి 3500 గంటలు పట్టిందని తెలిపారు. ఇదే ఈవెంట్లో పర్పుల్ కలర్ డ్రెస్తో మెరిసింది అలియా. (ముఖేష్ సర్ప్రైజ్ గిఫ్ట్ : ఆనంద్ మహీంద్ర ఫిదా!) 2023లోఅలియా మెట్ గాలా అరంగేట్రంలో లక్ష ముత్యాలతో చేసిన గౌనుతో అందరినీ ఆశ్చర్యపరిచింది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అనే సినిమాతో బాలీవుడ్లోకి అడుగు పెట్టిన అలియా సక్సెస్పుల్ హీరోయిన్గా దూసుకు పోతోంది. బాలీవుడ్ స్టార్హీరో ప్రియుడు రణ్బీర్ కపూర్ని పెళ్లాడింది. పెళ్లి తరువాత ఇద్దరూ వరుస హిట్లతో దుమ్ము రేపుతున్నారు.అలాగే జాతీయ,అంతర్జాతీయబ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంది. అంతేనా ఒక దుస్తుల బ్రాండ్కు సీఈవో వ్యాపార రంగంలోనూ తన సత్తా చాటుకుంటోంది. ఈ స్వీట్ కపుల్కు రాహా కపూర్ అనే ముద్దుల కూతురుకూడా ఉన్న సంగతి తెలిసిందే. (మర్డర్ మిస్టరీని ఛేదించిన పోలీసులు: సెల్ఫీ వీడియో పుణ్యమే!) View this post on Instagram A post shared by Mandarin Oriental (@mo_hotels) View this post on Instagram A post shared by Abu Jani Sandeep Khosla (@abujanisandeepkhosla) -
న్యూ జెర్సీలో ఆటా బిజినెస్ సెమినార్, కిక్ ఆఫ్ ఫండ్ రైజింగ్ ఈవెంట్
న్యూ జెర్సీ లో జరిగిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ - ఆటా బిజినెస్ సెమినార్ మరియు కిక్ ఆఫ్ ఫండ్ రైజింగ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. న్యూ జెర్సీ న్యూయార్క్ టీం సాయంతో.. అట్లాంటాలో జరుగనున్న 18th ఆటా కాన్ఫరెన్స్ కోసం 800K పైగా స్పాన్సర్షిప్ ప్రతిజ్ఞలను సేకరించారు. ఆట అధ్యక్షురాలు మధు బొమ్మినేని, ప్రెసిడెంట్ఎలెక్ట్ జయంత్ చర్ల , పూర్వ ప్రెసిడెంట్ కరుణాకర్ ఆసిరెడ్డి, ఫిలడెల్ఫియా ట్రస్టీ రాజ్ కక్కెర్ల తదితరులు పాల్గొని ప్రసంగించారు. ATA న్యూజెర్సీ , న్యూయార్క్ టీం - కార్ప్రేట్ చైర్ హరీష్ బథిని, కో చైర్ ప్రదీప్ కట్టా మరియు ఫైనాన్స్ కమిటీ చైర్ శ్రీకాంత్ గుడిపాటి , కో చైర్ శ్రీకాంత్ తుమ్మలతో పాటు రీజనల్ కోరినేటర్లు సంతోష్ కోరం , ధనరాజ్, రీజినల్ డైరెక్టర్ విలాస్ రెడ్డి జంబుల, మహిళల రీజినల్ కో-ఆర్డినేటర్ గీతా గంగుల, తదితరుల సహాయంతో బిజినెస్ సెమినార్ మరియు నిధుల సేకరణను విజయవంతంగా నిర్వహించారు. అట్లాంటాలో జరిగిన ఆటా (ATA) కాన్ఫరెన్స్ కోసం 636k పైగా 175 కార్పొరేట్ స్పాన్సర్షిప్ ప్రతిజ్ఞలను సేకరించినట్లు సభ్యులు తెలిపారు. అలాగే న్యూజెర్సీ & న్యూయార్క్ బృందం అట్లాంటా కాన్ఫరెన్స్ కోసం 800K పైగా దాతల ప్రతిజ్ఞలను సేకరించిందని పేర్కొన్నారు. అట్లాంటాలో జూన్ 7 నుండి 9 వరకు జరిగే ఆటా 18వ కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని నిర్వహకులు పిలుపునిచ్చారు. -
గ్రాండ్గా విశ్వక్ సేన్ గామి ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
GAMA Awards 2024: దుబాయ్లో గామా అవార్డ్స్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘అహ్లాన్ మోదీ’లో మార్పులు.. కారణమిదే!
యూఏఈలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఫిబ్రవరి 13) పాల్గొనబోయే ‘అహ్లాన్ మోదీ’ కార్యక్రమాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా కుదించారు. సోమవారం రాత్రి భారీ వర్షం కురవడంతో ‘అహ్లాన్ మోదీ’ కార్యక్రమంలో పలు మార్పులు చేశారు. అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనబోయే బహిరంగ కార్యక్రమం గురించి అధికారి సజీవ్ పురుషోత్తమన్ మాట్లాడుతూ ప్రతికూల వాతావరణం కారణంగా 35 వేల మంది హాజరయ్యేందుకు మాత్రమే ఏర్పాట్లు చేయగలుగుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సుమారు 60 వేల మంది ఆన్లైన్లో నమోదు చేసుకున్నారని తెలిపారు. వీరి కోసం 500లకు పైగా బస్సులను నడుపుతున్నామన్నారు. వెయ్యిమంది వాలంటీర్లు తమ సేవలను అందిస్తారని తెలిపారు. యూఏఈలో ప్రధాని ఈ నెల 13, 14 తేదీలలో పర్యటించనున్నారు. -
‘అహ్లాన్ మోదీ’కి 65 వేల రిజిస్ట్రేషన్లు
మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ప్రధాని నరేంద్ర మోదీకి అపరిమితమైన ఆదరణ ఉంది. యూఏఈలో జరగబోయే ‘అహ్లాన్ మోదీ’ కార్యక్రమానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఏకంగా 65 వేల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఫిబ్రవరి 13న అంటే నేడు (మంగళవారం) యూఏఈలో జరిగే ‘అహ్లాన్ మోదీ’ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఇండియన్ పీపుల్ ఫోరమ్ ప్రెసిడెంట్, ‘అహ్లాన్ మోదీ’ ఇనిషియేటివ్ హెడ్ జితేంద్ర వైద్య ఈ ఈవెంట్ గురించి మీడియాకు తెలిపారు. ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమమని, ప్రవాస భారతీయుల కమ్యూనిటీ దీనికి సకల ఏర్పాట్లు చేస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 65 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, అంతకుమించి జనం వస్తే, వసతి కల్పించలేమని, అందుకే రిజిస్ట్రేషన్లు ఇక నిలిపివేయాల్సి వచ్చిందని యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 13నుంచి ప్రారంభమయ్యే తన పర్యటనలో యూఏఈ, ఖతార్లోని ప్రవాస భారతీయులతో భేటీ కానున్నారు. యూఏఈలో నిర్మితమైన హిందూ దేవాలయాన్ని 14న ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఐదు వేల మంది భక్తులు హాజరుకానున్నరని అంచనా. 2015 తర్వాత ప్రధాని మోదీ యూఏఈలో పర్యటించడం ఇది ఏడోసారి. -
సీయాటెల్ సిద్ధం ఫర్ ‘యాత్ర 2’ ఈవెంట్
అమెరికాలోని సీయాటెల్లో యాత్ర2 మెగా ప్రీమియర్ షో రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. YSRCP USA, సోషల్ మీడియా, జగనన్న కనెక్ట్స్ ఆధ్వర్యంలో 'సీయాటెల్ సిద్ధం ఫర్ యాత్ర2 ఈవెంట్ని గ్రాండ్గా నిర్వహించారు. ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నట్టు APNRTS రీజినల్ కో ఆర్డినేటర్ దుష్యంత్ రెడ్డి తెలిపారు. మూవీని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు మహి రాఘవ్, నిర్మాత శివ మేక, చిత్ర యూనిట్ కి ధన్యవాదాలు తెలిపారు. సీయాటెల్ నలుమూలల నుంచి వైఎస్సార్, సీఎం జగన్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి యాత్ర 2 సెలబ్రేషన్ లో పాలు పంచుకున్నారు. YSRCP USA , సోషల్ మీడియా కమిటీ సభ్యులు.. చిన్నారులతో కలిసి భారీ కేక్ కట్ చేశారు. అనంతరం వైఎస్సార్ పాలనని గుర్తు చేసుకున్నారు. వైస్సార్ అడుగు జాడల్లో నవరత్నాలతో పాటు విన్నూతన మైన పథకాలు AP ప్రజలకి అందించిన CM YS జగన్ పరిపాలన ని గుర్తు చేస్తూ , రాబోయే ఎలక్షన్ లో 140 పై చిలుకు స్థానాల లో విజయ దుందుభి మోగించడం ఖాయమని ఈ సందర్భం గా తెలియ జేశారు. ఈ ఈవెంట్ లో YSRCP USA సభ్యులు మునీశ్వర్ రెడ్డి నాగిరెడ్డి , వినయ్ రెడ్డి, అనిల్ బెల్లపు , JC రెడ్డి , వెంకట్ సుబ్బా రెడ్డి, ప్రకాష్ కొండూరు ,శంకర్ తిప్పల ,ప్రకాష్ మామిడి,జితేందర్ రెడ్డి ,శ్రీనివాస రెడ్డి మల్లంపాటి ,భాస్కర్ రెడ్డి , వినోద్ ,సునీల్ బలభద్ర ,నరేన్ రెడ్డి ,వెంకట్ రెడ్డి,రాజ శేఖర్ రెడ్డి ,ప్రదీప్, బాల ,కరుణాకార్ రెడ్డి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని సహాయ సహకారాలు అందజేశారు. కమ్యూనిటీ లీడర్స్ మనోజ్ చింతి రెడ్డి , సాయిరెడ్డి కంచరకుంట్ల ,సువీన్ రెడ్డి ఉప్పల ,నవీన్ గోలి ప్రసంగించి యాత్ర 2 మూవీ కి ధన్యవాదాలు తెలియజేశారు. -
మిస్ వరల్డ్: ఈ స్టన్నింగ్ ఇండియన్ బ్యూటీల గురించి తెలుసా?
అందరమూ కలలు కంటాం. వాటిల్లో కొన్ని చాలా పెద్దవి,చాలా చిన్నవి. చిన్నదైనా పెద్దదైనా ఆ కలను నేర్చుకునే పట్టుదల మాత్రం కొందరికే ఉంటుంది. కలలను సాకారం చేసుకునే అదృష్టం కొంతమందికే సాధ్యం. అందులోనే చాలా ప్రత్యేకమైంది అయితే ఆ జర్నీ చాలా కష్టం. ఇక, బ్యూటీ, మోడలింగ్ రంగంలో అమ్మాయిలు రాణించాలంటే నిజంతా అది కత్తి మీద సామే. అలాంటి ఎన్నో సవాళ్లను అధిగమించి ప్రపంచ సుందరీమణులుగా,విజేతలుగా నిలిచారు. ప్రపంచ వేదికల మీద మన దేశాన్ని అత్యున్నతంగా నిలబెట్టారు. తాజాగా మిస్ వరల్డ్ 2023 సంబరాలకు ఇండియా వేదిక కానుంది. బ్యూటీ విత్ పర్పస్ థీమ్తో ఈ పోటీలు ఘనంగా నిర్వహించనుంది. ప్రతీ ఏడాది వివిధ దేశాల్లో నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్కు ఈసారి భారత్ ఆతిథ్యమివ్వనుంది. దీంతో మిస్ వరల్డ్ ఈవెంట్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలు ఎపుడు నిర్వహించారో తెలుసా? యునైటెడ్ కింగ్డమ్లో ఎరిక్ మోర్లీ 1951లో ఈ పోటీలకు నాంది పలికారు. ఇంగ్లీషు టెలివిజన్ వ్యాఖ్యాత ఎరిక్ డగ్లస్ మోర్లీ మిస్ వరల్డ్ పోటీ , కమ్ డ్యాన్సింగ్ ప్రోగ్రామ్ను మొదలు పెట్టారు. 1978ల ఆయన నిష్క్రమించడంతో అతని భార్య బ్యూటీ క్వీన్ జూలియా మిస్ వరల్డ్ పోటీలను కొనసాగించింది. 82 ఏళ్ల వయసులో మోర్లీ 2000లో మరణించాడు. అతని భార్య, జూలియా మోర్లీ ఛైర్మన్గా ఉండగా కుమారుడు స్టీవ్ డగ్లస్ దాని సమర్పకులలో ఒకరుగా ఉన్నారు. లండన్లోని లైసియం బాల్రూమ్లో తొలి మిస్ వరల్డ్ టైటిల్ను మిస్ స్వీడన్, కికీ హాకోన్సన్ కైవసం చేసుకుంది. మన ముద్దుగుమ్మలు తమ అందానికి, సంకల్పాన్ని, తెలివితేటల్ని, జోడించి ఆరు సార్లు జగజ్జేతలుగా నిలిచారు. రీటా ఫారియా రీటా ఫారియా పావెల్ ఒక డాక్టర్. మోడలింగ్ రంగంలో రాణిస్తూ 1966లో మిస్ వరల్డ్ పోటీల్లో చరిత్ర సృష్టించింది. తొలి ఆసియా , భారతీయ మిస్ వరల్డ్ విజేతగా నిలిచి బ్యూటీ రంగంలో ఇండియాలో పేరును సమున్నతంగా నిలిపింది. మరియు ముంబైలో గోవా తల్లిదండ్రులకు జన్మించింది. వైద్య శిక్షణ పొందిన తొలి మిస్ వరల్డ్ విజేత ఆమె. ఏడాది పాటు మిస్ వరల్డ్గా ఉన్న ఆమె సినిమా ఆఫర్లను తిరస్కరించి వైద్య వృత్తికి అంకితమైంది. 1971లో, తన గురువు డేవిడ్ పావెల్ను వివాహం చేసుకుంది. ఐశ్వర్య రాయ్: ప్రపంచంలోనే అందాలరాణిగా నిలిచిన ఐశ్వర్య రాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. 1994 మిస్ వరల్డ్ టైటిల్ గెల్చుకుని యూత్ కలల రాణిగా అవతరించింది. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. రెండు ఫిల్మ్ఫేర్ నామినేషన్లతో సహా వివిధ అవార్డులును దక్కించుకుంది. అలాగే 2009లో భారత ప్రభుత్వ పద్మశ్రీ పురస్కారాన్ని ,2012లో ఫ్రెంచ్ ప్రభుత్వం ఆర్డర్ డెస్ ఆర్ట్స్ ఎట్ లెటర్స్ను గెల్చుకుంది. డయానా హేడెన్: మోడల్, నటి డయానా హేడెన్ 1997లో మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది.మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న మూడో భారతీయ మహిళ. అంతేకాదు ఈ పోటీల్లో మూడు సబ్ టైటిల్స్ను గెల్చుకున్న ఏకైక మిస్ వరల్డ్ కూడా యుక్తా ముఖి: మిస్ ఇండియాగా నిలిచిన నాల్గో భామ యుక్తా ఇంద్రలాల్ ముఖి. 1999లో మిస్ వరల్డ్ టైటిల్తోపాటు 1999లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని కూడా సొంతం చేసుకుంది. మోడల్గాను, కొన్ని హిందీ సినిమాల్లోనూ కనిపించింది. ప్రియాంక చోప్రా : 2000లో మిస్ వరల్డ్ 2000 విజేత ప్రియాంక చోప్రా, మోడల్గా, హీరోయిన్గా రాణిస్తోంది. అంతేకాదు ఇండియాలో అత్యధిక పారితోషికం పొందుతున్న హీరోయిన్లలో ఒకరిగా తన సత్తాను చాటుకుంటోంది. రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు , ఐదు ఫిల్మ్ఫేర్ అవార్డులతో సహా పలు గౌరవాలను గెలుచుకుంది. 2016లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు వరించింది. అలాగే ఫోర్బ్స్ ఆమెను ప్రపంచంలోని 100 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చేర్చింది. మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ 2017 టైటిల్ను నటి , మోడల్ మానుషి చిల్లర్ గెలుచుకున్నారు. ఫెమినా మిస్ ఇండియా 2017 పోటీలో ఆమె తన సొంత రాష్ట్రం హర్యానాకు ప్రతినిధిగా పోటీ పడి, గెలిచింది. ఆ తర్వాత మిస్ వరల్డ్ కిరీటం పొందిన ఆరో భారతీయురాలిగా నిలిచింది. చారిత్రాత్మక నాటకం సామ్రాట్ పృథ్వీరాజ్లో సంయోగిత పాత్రతో ఆమె తొలిసారిగా నటించింది. -
అబ్బురపరుస్తున్న గ్యాడ్జెట్స్.. ఎప్పుడైనా చూసారా!
లాస్ వేగాస్లో అట్టహాసంగా జరుగుతున్న 2024 సీఈఎస్ ఈవెంట్లో అత్యుత్తమ ఉత్పత్తులు కనివిందు చేస్తున్నాయి. ఈ ఈవెంట్లో సాధారణ ఉత్పత్తులకంటే కూడా కొత్త టెక్నాలజీతో అబ్బురపరిచే గ్యాడ్జెట్స్, వెహికల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ కథనంలో ఏఐ (AI) టెక్నాలజీ కలిగిన ఉత్తమ గాడ్జెట్లను గురించి వివరంగా తెలుసుకుందాం. బల్లీ (BALLIE) సీఈఎస్ వేదికపై కనిపించిన ఉత్తమ ఏఐ ఉత్పత్తులలో ఒకటి 'బల్లీ'. శామ్సంగ్ కంపెనీ లాంచ్ చేసిన ఈ గ్యాడ్జెట్ చూడటానికి చిన్న బాల్ మాదిరిగా ఉంటుంది. కానీ పనితీరులో మాత్రం దానికదే సాటి అని చెప్పాలి. నిజానికి ఇది ఒక ఎంటర్టైన్మెంట్ డివైజ్ అయినప్పటికీ.. ఇంట్లో చాలా పనులు చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. నెల మీద, పైకప్పు మీద కూడా ప్రాజెక్ట్ చేయగల కెపాసిటీ కలిగిన బల్లీ.. ఈవెంట్లో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ గ్యాడ్జెట్ ధర, వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు. (Image credit: Future) LG స్మార్ట్ హోమ్ ఏజెంట్ శామ్సంగ్ ఉత్పత్తులకు ఏ మాత్రం తీసిపోకుండా.. LG కంపెనీ కూడా ఓ స్మార్ట్ హోమ్ ఏజెంట్ను ఆవిష్కరించింది. లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన ఈ గ్యాడ్జెట్ ఒక స్మార్ట్ హబ్. ఇది ChatGPT వాయిస్తో కమ్యూనికేట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా మీ మానసిక స్థితిని పర్యవేక్షించడంలో కూడా ఇది చాలా సహాయపడుతుంది. ఈ ఏఐ రోబోటిక్ ధర కూడా సంస్థ అధికారికంగా ప్రకటించలేదు. (Image credit: LG) సెగ్వే నవిమో (SEGWAY NAVIMOW) సెగ్వే నవిమో అనేది ఓ రోబోట్ లాన్మూవర్స్. నిజానికి రోబోట్ లాన్మూవర్స్ ఈ రోజు ఆలోచన కాదు. అయితే సీఈఎస్ వేదికపై కనిపించిన ఈ సెగ్వే నవిమో ఏఐ టెక్నాలజీ కలిగిన గ్యాడ్జెట్. ఇది బ్లేడ్హాల్ట్ సెన్సార్, రెయిన్ సెన్సార్, అల్ట్రాసోనిక్ సెన్సార్, విజన్ఫెన్స్ సెన్సార్ వంటి వాటిని కలిగి ఉంటుంది. అమెరికాలో ఈ గ్యాడ్జెట్ ధరలు అందుబాటులో లేదు కానీ.. యూరప్ మార్కెట్లో 1300 డాలర్ల ప్రారంభ ధర వద్ద లభిస్తోంది. (Image credit: Segway) ఓరో (ORO) శామ్సంగ్, LG గ్యాడ్జెస్ట్స్ కంటే కూడా ఓరో అనేది పెంపుడు జంతువులకు మరింత ఫ్రెండ్లీగా ఉంటుంది.పెద్ద పెద్ద కళ్ళు కలిగిం ఈ పరికరం బంతిని విసరడం, ఆహారాన్ని అందించడం వంటివి చేసేలా రూపొందించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూడా పెంపుడు జంతువులను జాగ్రత్తగా చూసుకుంటుంది. దీని ధర 799 డాలర్లు. ఏప్రిల్ నుంచి విక్రయానికి రానున్నట్లు సమాచారం. ఇప్పుడు దీనిని 299 డాలర్ల డౌన్పేమెంట్తో ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. (Image credit: ORo) మొబిన్ (MOBINN) సాధారణంగా గ్యాడ్జెట్స్.. ఇంటి పరిసరాల్లో లేదా ఇంట్లో చదునుగా ఉన్న ప్రాంతాల్లో తిరగటానికి అనుకూలంగా ఉంటాయి. కానీ మొబిన్ అనేది మెట్లను కూడా ఎక్కగలదు. ఫ్లెక్సిబుల్ వీల్స్తో కూడిన ఈ రోబోట్ మనం ఆర్డర్ చేసిన వస్తువులను తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. LiDAR-బేస్డ్ మ్యాపింగ్ సిస్టమ్ను కలిగిన మొబిన్ వర్షం, మంచు, రాత్రి సమయంలో కూడా పని చేస్తుంది. సంస్థ ఈ గ్యాడ్జెట్ ధర, లాంచ్ డేట్ వంటి వాటిని అధికారికంగా వెల్లడించలేదు. (Image credit: MOBINN) లూనా (LOONA) సాధారణంగా ఎవరైనా తమను ఎంటర్టైన్ చేయడానికి పెంపుడు జంతువులను పెంచుకుంటారు. అయితే లూనా అనే రోబోట్ పెంపుడు జంతువులకు ఏ మాత్రం తీసిపోదు. చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ.. ChatGPT ఆధారంగా పనిచేస్తుంది. ఇది కదిలే హోమ్ మానిటర్, ప్రోగ్రామింగ్ లెర్నింగ్ ప్లాట్ఫారమ్గా పనిచేస్తుంది. దీని ధర 380 డాలర్ల వరకు ఉంటుంది. (Image credit: keyirobot) రోబోట్ వాక్యూమ్ రోబోట్ వాక్యూమ్ అనేది వాయిస్ అసిస్టెంట్, రోబోట్ ఆర్మ్, వీడియో కాలింగ్ ఫంక్షనాలిటీ వంటి వాటిని పొందుతుంది. CES 2024 వేదికగా కనిపించిన అద్భుతమైన గ్యాడ్జెట్లలో ఇది కూడా ఒకటి. మరొక పరికరం అవసరం లేకుండా దీనిని కంట్రోల్ చేయవచ్చు. ఈ పరికరం లోపల ఉండే కెమెరా యజమానికి కాల్ చేయగల కెపాసిటీ కలిగి ఉంటుంది. ఈ రోబోట్ వాక్యూమ్ ధర, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. -
CES 2024: కొత్త టెక్నాలజీలతో అబ్బురపరుస్తున్న లేటెస్ట్ ప్రొడక్ట్స్ (ఫోటోలు)
-
స్టార్ హీరో ఈవెంట్లో అసభ్య ప్రవర్తన.. యాంకర్తో అలా!
కోలీవుడ్ స్టార్ ధనుశ్ నటించిన చిత్రం కెప్టెన్ మిల్లర్. ఈ చిత్రంలో ఇంతకు ముందు ఎప్పుడు లేని విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పొంగల్ బరిలో నిలిచింది. ఈ సందర్భంగా చిత్రబృందం చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఏర్పాటు చేసింది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో శివ రాజ్కుమార్, సందీప్ కిషన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాంకర్తో అసభ్య ప్రవర్తన బుధవారం చెన్నైలో నిర్వహించిన ఈవెంట్లో ఓ చేదు సంఘటన జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ను హోస్ట్ చేస్తున్న యాంకర్ ఐశ్వర్యతో అసభ్యంగా ప్రవర్తించాడు. చాలామంది ఫ్యాన్స్ హాజరైన ఈవెంట్లో ఆమె అసభ్యకరంగా తాకాడు. అతని తీరుతో విసిగిపోయిన యాంకర్ అక్కడే దేహశుద్ధి చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. అయితే ఇది చూసిన నెటిజన్స్ సైతం యాంకర్ ఐశ్వర్యకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. వెంటనే స్పందించి అతనికి బుద్ధిచెప్పడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాలోనూ పోస్ట్ చేసింది. 😨😨 pic.twitter.com/JJljl7ntBc — Christopher Kanagaraj (@Chrissuccess) January 3, 2024 -
2024 ఆటలు...ఆశలు...
ప్రపంచ క్రీడా పండుగ ఒలింపిక్స్లో ఈ సారి భారత్ పతకాల సంఖ్య రెండంకెలకు చేరుతుందా...టి20 ప్రపంచకప్ టైటిల్తో టీమిండియా ఈ సారైనా పదిహేడేళ్ల కరువు తీరుస్తుందా...మన మహిళల క్రికెట్ టీమ్ వరల్డ్ కప్ అందుకునే స్థాయికి ఎదిగిందా...అండర్–19 స్థాయిలో ప్రపంచ కప్ డిఫెండింగ్ చాంపియన్గా దిగుతున్న మన కుర్రాళ్లు మళ్లీ సత్తా చాటుతారా... క్రికెట్ ఫ్యాన్స్ మదిలో ఈ ప్రశ్నలకు కొత్త ఏడాదిలో సమాధానం లభిస్తుంది... బ్యాడ్మింటన్ ప్రపంచంలో మరోసారి మన షట్లర్ల హవా సాగుతుందా...ఫార్ములా వన్ 23 రేస్లలో ఎవరికి పైచేయి అవుతుంది... హాకీలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి... ఫుట్బాల్లో ఆసియా ఖండంలో మన బలం పెరిగిందా...ఇవన్నీ చూడాల్సిందే. టెన్నిస్లో ఎప్పటిలాగే నాలుగు గ్రాండ్స్లామ్ల వేట...ప్రతీ ఏటా అలరించేందుకు వచ్చే ఐపీఎల్ ఎలాగూ ఉన్నాయి. వీటికి తోడు ఆర్చరీ, అథ్లెటిక్స్, చెస్, రెజ్లింగ్, షూటింగ్, బాక్సింగ్, టేబుల్ టెన్నిస్లాంటి క్రీడల్లో పలు ఆసక్తికర టోర్నీలకు ఈ ఏడాది వేదిక కానుంది. 2024లో క్రీడాభిమానులను అలరించేందుకు సిద్ధమైన ప్రధాన ఈవెంట్ల క్యాలెండర్ మీ కోసం... భారత క్రికెట్ జట్టు షెడ్యూల్ జనవరి 11–17: అఫ్గానిస్తాన్తో స్వదేశంలో 3 టి20 మ్యాచ్లు జనవరి 25–మార్చి 11: ఇంగ్లండ్తో స్వదేశంలో 5 టెస్టులు ఐపీఎల్: మార్చి 22 నుంచి మే 26 వరకు జూలై: శ్రీలంకలో భారత్ పర్యటన (3 వన్డేలు, 3 టి20లు) సెప్టెంబర్: స్వదేశంలో బంగ్లాదేశ్తో సిరీస్ (2 టెస్టులు, 3 టి20లు) అక్టోబర్: స్వదేశంలో న్యూజిలాండ్తో సిరీస్ (3 టెస్టులు) నవంబర్–డిసెంబర్: ఆస్ట్రేలియాలో భారత్ పర్యటన (5 టెస్టులు) పురుషుల టి20 ప్రపంచకప్ టోర్నీ జూన్ 4 నుంచి 30 వరకు వేదిక: వెస్టిండీస్, అమెరికా ఫుట్బాల్ ఆసియా కప్ (ఖతర్) జనవరి 12 నుంచి ఫిబ్రవరి 10 వరకు యూరో–2024 (జర్మనీ) జూన్ 14 నుంచి జూలై 14 వరకు కోపా అమెరికా టోర్నీ (అమెరికా) జూన్ 20 నుంచి జూలై 14 వరకు బ్యాడ్మింటన్ జనవరి 9–14: మలేసియా ఓపెన్–1000 టోర్నీ (కౌలాలంపూర్) జనవరి 16–21: ఇండియా ఓపెన్–750 టోర్నీ (న్యూఢిల్లీ) మార్చి 5–10: ఫ్రెంచ్ ఓపెన్–750 టోర్నీ (పారిస్) మార్చి 12–17: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్–1000 టోర్నీ (బర్మింగ్హమ్) ఏప్రిల్ 28–మే 5: థామస్ కప్–ఉబెర్ కప్ ఫైనల్స్ (చెంగ్డూ, చైనా) మే 28–జూన్ 2: సింగపూర్ ఓపెన్–750 టోర్నీ జూన్ 4–9: ఇండోనేసియా ఓపెన్–1000 టోర్నీ (జకార్తా) ఆగస్టు 20–25: జపాన్ ఓపెన్–750 టోర్నీ (టోక్యో) సెప్టెంబర్17–22: చైనా ఓపెన్–1000 టోర్నీ (చాంగ్జౌ) అక్టోబర్ 15–20: డెన్మార్క్ ఓపెన్–750 టోర్నీ (ఒడెన్స్) నవంబర్ 19–24: చైనా మాస్టర్స్–750 టోర్నీ (షెన్జెన్) నవంబర్ 26–డిసెంబర్ 1: సయ్యద్ మోడి ఓపెన్–300 టోర్నీ (లక్నో) డిసెంబర్ 11–15: వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ (హాంగ్జౌ, చైనా) టెన్నిస్ జనవరి 15–28: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ (మెల్బోర్న్) మే 26–జూన్ 9: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ (పారిస్) జూలై 1–14: వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీ (లండన్) ఆగస్టు 26–సెప్టెంబర్8: యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ (న్యూయార్క్) నవంబర్ 10–17: ఏటీపీ ఫైనల్స్ టోర్నీ (టురిన్, ఇటలీ) ఫార్ములావన్ మార్చి 2: బహ్రెయిన్ గ్రాండ్ప్రి మార్చి 9: సౌదీ అరేబియా గ్రాండ్ప్రి మార్చి 24: ఆ్రస్టేలియా గ్రాండ్ప్రి ఏప్రిల్ 7: జపాన్ గ్రాండ్ప్రి ఏప్రిల్ 21: చైనా గ్రాండ్ప్రి మే 5: మయామి గ్రాండ్ప్రి మే 19: ఎమీలియా రొమాగ్నా గ్రాండ్ప్రి మే 26: మొనాకో గ్రాండ్ప్రి జూన్ 9: కెనడా గ్రాండ్ప్రి జూన్ 23: స్పానిష్ గ్రాండ్ప్రి జూన్ 30: ఆస్ట్రియా గ్రాండ్ప్రి జూలై 7: బ్రిటిష్ గ్రాండ్ప్రి జూలై 21: హంగేరి గ్రాండ్ప్రి జూలై 28: బెల్జియం గ్రాండ్ప్రి ఆగస్టు 25: డచ్ గ్రాండ్ప్రి సెప్టెంబర్ 1: ఇటలీ గ్రాండ్ప్రి సెప్టెంబర్15: అజర్బైజాన్ గ్రాండ్ప్రి సెప్టెంబర్ 22: సింగపూర్ గ్రాండ్ప్రి అక్టోబర్ 20: యూఎస్ గ్రాండ్ప్రి అక్టోబర్ 27: మెక్సికో గ్రాండ్ప్రి నవంబర్ 3: బ్రెజిల్ గ్రాండ్ప్రి నవంబర్ 23: లాస్ వేగస్ గ్రాండ్ప్రి డిసెంబర్ 1: ఖతర్ గ్రాండ్ప్రి హాకీ జనవరి 13–21: ఒలింపిక్ క్వాలిఫయింగ్ పురుషుల టోర్నీ (వాలెన్సియా, స్పెయిన్) జనవరి 13–21: ఒలింపిక్ క్వాలిఫయింగ్ మహిళల టోర్నీ (వాలెన్సియా, స్పెయిన్) జనవరి 13–19: ఒలింపిక్ క్వాలిఫయింగ్ మహిళల టోర్నీ (రాంచీ, భారత్) జనవరి 15–21: ఒలింపిక్ క్వాలిఫయింగ్ పురుషుల టోర్నీ (మస్కట్, ఒమన్) షూటింగ్ జనవరి 5–18: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ రైఫిల్, పిస్టల్ టోర్నీ (జకార్తా) జనవరి 12–22: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ షాట్గన్ టోర్నీ (కువైట్ సిటీ) జనవరి 24–ఫిబ్రవరి 1: ప్రపంచకప్ రైఫిల్, పిస్టల్, షాట్గన్ టోర్నీ (కైరో, ఈజిప్ట్) ఫిబ్రవరి 4–13: ప్రపంచకప్ షాట్గన్ టోర్నీ (రబాట్, మొరాకో) ఏప్రిల్ 11–19: ఫైనల్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ రైఫిల్, పిస్టల్ టోర్నీ (రియో డి జనీరో, బ్రెజిల్) ఏప్రిల్ 22–30: ఫైనల్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ షాట్గన్ టోర్నీ (దోహా, ఖతర్) మే 1–12: ప్రపంచకప్ రైఫిల్, పిస్టల్, షాట్గన్ టోర్నీ (బకూ, అజర్బైజాన్) మే 31–జూన్ 7: ప్రపంచకప్ రైఫిల్, పిస్టల్ టోర్నీ (మ్యూనిక్, జర్మనీ) జూన్ 10–19: ప్రపంచకప్ షాట్గన్ టోర్నీ (లొనాటో, ఇటలీ) అండర్–19 పురుషుల వన్డే ప్రపంచకప్ టోర్నీ జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 వరకు వేదిక: దక్షిణాఫ్రికా మహిళల టి20 ప్రపంచకప్ టోర్నీ సెప్టెంబర్–అక్టోబర్ వేదిక: బంగ్లాదేశ్ పారిస్ ఒలింపిక్స్ – 26 జూలై – 11 ఆగస్టు అథ్లెటిక్స్ జనవరి 21: ఆసియా మారథాన్ చాంపియన్షిప్ (హాంకాంగ్) ఫిబ్రవరి 21–23: ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ (టెహ్రాన్) మార్చి 1–3: ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ (స్కాట్లాండ్) ఆగస్టు 26–31: ప్రపంచ అండర్–20 చాంపియన్షిప్ (పెరూ) చెస్ ఏప్రిల్ 3–25: క్యాండిడేట్స్ టోర్నమెంట్ (టొరంటో, కెనడా) జూన్ 1–14: ప్రపంచ జూనియర్ అండర్–20 చాంపియన్షిప్ (న్యూఢిల్లీ, భారత్) సెప్టెంబర్10–23: చెస్ ఒలింపియాడ్ (బుడాపెస్ట్, హంగేరి) అక్టోబర్ 22–నవంబర్ 2: ప్రపంచ యూత్ చాంపియన్షిప్ (బ్రెజిల్) రెజ్లింగ్ ఏప్రిల్ 11–16: ఆసియా సీనియర్ చాంపియన్షిప్ (బిష్కెక్, కిర్గిజ్స్తాన్) ఏప్రిల్ 19–21: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ (బిష్కెక్, కిర్గిజ్స్తాన్) మే 9–12: ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ (ఇస్తాంబుల్, తుర్కియే) బాక్సింగ్ ఫిబ్రవరి 29–మార్చి 12: పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీ (ఇటలీ) ఏప్రిల్: ఆసియా చాంపియన్షిప్ మే 23–జూన్ 3: పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీ (థాయ్లాండ్) అక్టోబర్ 20–నవంబర్ 6: ప్రపంచ యూత్ చాంపియన్షిప్ (క్రొయేషియా) టేబుల్ టెన్నిస్ ఫిబ్రవరి 16–25: ప్రపంచ టీమ్ చాంపియన్షిప్ (బుసాన్, కొరియా) డిసెంబర్ 1–8: ప్రపంచ యూత్ చాంపియన్షిప్ (స్వీడన్) ఆర్చరీ ఏప్రిల్ 23–28: ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీ (షాంఘై, చైనా) మే 21–26: ప్రపంచకప్ స్టేజ్–2 టోర్నీ (యెచోన్, కొరియా) జూన్ 18–23: ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నీ (అంటాల్యా, తుర్కియే) -
యానిమల్ తరహాలో ‘దీనమ్మ జీవితం’
దేవ్ బల్లాని, ప్రియా చౌహాన్, సరిత ప్రధాన పాత్రల్లో మురళీ రామస్వామి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దీనమ్మ జీవితం’. వై. మురళీకృష్ణ, వై. వెంకటలక్ష్మీ, డి. దివ్య సంతోషి, బి. సోనియా నిర్మించిన ఈ చిత్రం జనవరి 5న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దేవ్ మాట్లాడుతూ– ‘‘మంచి కంటెంట్తో వస్తున్న చిత్రం ఇది.పెద్ద విజయాన్ని అందుకుంటామనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘యానిమల్’ వంటి రా అండ్ ఫ్యామిలీ ఫిల్మ్ ‘దీనమ్మ జీవితం’. తమిళ్, మలయాళంలోనే కాదు.. తెలుగులోనూ మంచి కంటెంట్తో సినిమా చేయగలరని నిరూపించే చిత్రమిది’’ అన్నారు మురళీ రామస్వామి. ‘సమాజంలో జరిగే కథ ఇది. తప్పకుండా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని ప్రియా చౌహాన్ అన్నారు. -
Venky75 Event Photos: వెంకీ మామ 75వ సినిమా సెలబ్రేషన్స్.. స్పెషల్ ఈవెంట్లో తారల సందడి (ఫోటోలు)
-
Bollywood Celebrities In Umang 2023: ఉమాంగ్ ముంబై పోలీస్ షోలో మెరిసిన తారలు (ఫొటోలు)
-
మాట చికాగో చాప్టర్ కిక్ ఆఫ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్
-
AIM For Seva దాతల ప్రశంసా కార్యక్రమం
-
టెక్సాస్లో గ్రాండ్గా 24వ వార్షిక అవార్డ్స్ బాంకెట్
అమెరికా, టెక్సాక్లో జరిగిన యూఎస్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ DFW 24వ వార్షిక అవార్డ్స్ బాంకెట్ కార్యక్రమానికి అనుహ్య స్పందన వచ్చింది. డల్లాస్ వేదికగా జరిగిన ఈ కర్యాక్రమానికి టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్, హ్యూస్టన్ కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా డీసీ మంజునాథ్ ముఖ్య అతిథులుగా హాజరై, ప్రసంగించారు. భారత్-అమెరికా దేశాల మధ్య ఉన్న బలమైన ద్వైపాక్షిక వాణిజ్యాల గురించి వారు ప్రస్తావించారు. టెక్సాక్-భారత్ ఆర్థిక సంబంధాలు వృద్ధి చెందుతున్నట్లు పేర్కొన్నారు. టెక్సాస్ వృద్ధిలో భారతీయ అమెరికన్ల కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భారతీయ, అమెరికన్ పారిశ్రామికవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ అనుభవాలను పంచుకున్నారు. కార్యక్రమం విజయవంతం కావడంపై ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. 1999లో ఈ ఛాంబర్ని ప్రారంభించామని, ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా వార్షిక అవార్డ్స్ బాంకెట్ ఈవెంట్ని గ్రాండ్గా నిర్వహించినట్లు తెలిపారు. 24వ వార్షిక అవార్డ్స్ బాంకెట్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నిర్వహకులు ధన్యవాదాలు తెలిపారు. -
దేశ నలుమూలల నుంచి నాట్య తోరణంలో పాల్గొన్న నృత్యకారులు
-
దసరా ఉత్సవాల్లో సనాతన ధర్మం విమర్శకులపై పోస్టర్లు
ఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరుగుతున్న దసరా వేడుకల్లో దిష్టిబొమ్మలకు సనాతన ధర్మ వ్యతిరేకులపై పోస్టర్లు వెలిశాయి. 'సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించేవాళ్లు నశించిపోతారు', 'సనాతన ధర్మ విమర్శకులు అంతరించిపోతారు' అని పేర్కొన్న పోస్టర్లను దిష్టిబొమ్మలకు అంటించారు. కానీ వేడుకల ప్రారంభానికి ముందే వాటన్నింటిని తొలగించారు. కాగా ఈ ఏడాది ఎర్రకోటలో జరుగుతున్న దసరా ఉత్సవాలకు బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా హాజరుకానున్నారు. 50 ఏళ్లుగా జరుగుతున్న ఎర్రకోట ఉత్సవాల చరిత్రలో తొలిసారి ఓ మహిళ కంగనా రనౌత్ ఈ సారి దిష్టిబొమ్మను దహనం చేయనుంది. ఎర్రకోట వద్ద జరుగుతున్న ఉత్సవాల్లో రావణ, కుంభకర్ణ, మేఘనాథ్ ల దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. రావణ దహనం పేరుతో జరుగుతున్న ఈ కార్యక్రమం దసరా వేడుకల్లో ఓ సాంప్రదాయంగా వస్తోంది. చెడుపై మంచి విజయానికి గుర్తుగా ఈ వేడుకలను జరుపుతున్నారు. సనాతన ధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదం దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూ వంటి రోగాలతో పోలుస్తూ ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ మండిపడింది. దేశంలో మతసామరస్యాన్ని దెబ్బతీసే చర్యగా పరిగణించింది. ఇదీ చదవండి: మొసలితో రైతుల వినూత్న నిరసన.. కేటీఆర్ రియాక్షన్ ఇది..! -
జాతీయ అవార్డ్ విన్నర్స్కు మైత్రి మూవీ మేకర్స్ పార్టీ.. పాల్గొన్న అల్లు అర్జున్ (ఫొటోలు)
-
మాదాపూర్ ఎన్ కన్వెన్షన్లో దాండియా ఆడుతున్న హామ్స్టిక్ విద్యార్థులు (ఫొటోలు)
-
‘స్పార్క్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
Polimera 2 Trailer: మా ఊరి పొలిమేర 2 ట్రైలర్ విడుదల వేడుక (ఫొటోలు)
-
'రూల్స్ రంజన్' ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
Month Of Madhu Trailer Launch Photos: ‘మంత్ ఆఫ్ మధు’ మూవీ ట్రైలర్ (ఫొటోలు)
-
Cancer : క్యాన్సర్పై అవగాహన పెంచేందుకు "గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్"
హైదరాబాద్ : ప్రపంచంలోనే అతిపెద్ద క్యాన్సర్ అవేర్నెస్ రన్ "గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్-2023" కోసం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర టీ షర్ట్ను విడుదల చేశారు. ఫిజికల్, వర్చువల్ మోడ్ల ద్వారా 130 దేశాల నుండి లక్ష మంది పాల్గొనే ఈ రన్ అక్టోబర్ 8న జరగనుంది. ఈ ప్రయత్నంలో సైబరాబాద్ పోలీసులు రన్ నిర్వాహకులకు అండగా ఉంటారు. ఎప్పుడు : సెప్టెంబర్ 12, 2023 ఎక్కడ : క్షేత్ర స్థాయిలో గచ్చిబౌలి స్టేడియం, హైదరాబాద్, దీంతో పాటు వర్చువల్ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాన్సర్ అవగాహన రన్ "క్వాంబియంట్ డెవలపర్స్ - గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్-2023" అక్టోబర్ 8న గచ్చిబౌలి స్టేడియంలో, నగరంలో జరగనుంది. ఈ నేపథ్యంలో, గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో జరిగిన సంక్షిప్త ఆవిష్కరణ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మంగళవారం దీనికి సంబంధించిన టీ-షర్ట్ను విడుదల చేశారు. గ్లోబల్ రన్ - నోబుల్ కాజ్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ, "ఇది ఒక వైవిధ్యంతో నడిచే గొప్ప పరుగు" అని అన్నారు. "సైబరాబాద్ పోలీసులు గత సంవత్సరం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంవత్సరం కూడా దీంట్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఇది స్పోర్ట్స్ ఈవెంట్ కాదు, ఇది గ్లోబల్ ఈవెంట్ అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. 130 దేశాల నుంచి రన్నర్లు పాల్గొనే అవకాశం ఉంది. ఈ ఈవెంట్కు సహకరిండాన్ని సైబరాబాద్ పోలీసులు బాధ్యతగా భావిస్తున్నారు. ఇది మాకు గర్వకారణం. సైబరాబాద్ పోలీసులు నిర్వాహకులకు అన్ని విషయాల్లో సహకరిస్తారు" అని తెలిపారు. "'బీ లైట్' అనే థీమ్తో 6వ ఎడిషన్ రన్లో 130కి పైగా దేశాల నుండి లక్ష మందికి పైగా ప్రజలు పాల్గొంటారు" అని సీనియర్ కన్సల్టెంట్ రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్, గ్రేస్ (గ్లోబల్ రీసెర్చ్ అండ్ క్యాన్సర్ ఎడ్యుకేషన్) క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి వెల్లడించారు. రన్ నిర్వహించబోయిన విధానం: రన్ మూడు వేర్వేరు విభాగాలలో జరుగుతుంది. 5K, 10K, 21.1K (హాఫ్ మారథాన్). గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న ఈ కార్యక్రమంలో 25 వేల మందికి పైగా పాల్గొనే అవకాశం ఉంది. ఇది హైబ్రిడ్ పద్దతిలో భౌతిక పద్దతిలో, వర్చువల్ పద్దతిలో జరగనుంది. భారతదేశంలో రెండు వేర్వేరు ఫార్మాట్లలో జరిగే ఏకైక రన్ బహుశా ఇదే. ఎడ్యుకేషన్, ఎర్లీ డిటెక్షన్, ట్రీట్మెంట్, రీహాబిలిటేషన్, అత్యాధునిక పరిశోధనల ద్వారా క్యాన్సర్ భారాన్ని తగ్గించే సదుద్దేశంతో లాభాపేక్షలేని సంస్థగా "గ్రేస్" క్యాన్సర్ ఫౌండేషన్ ఏర్పడింది. ఇందులో పాల్గొనే ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన దూరాన్ని పరిగెత్తడమే కాకుండా, తమ రిజిస్ట్రేషన్ ఫీజులో కొంత భాగాన్ని క్యాన్సర్ స్క్రీనింగ్, అవగాహన కోసం విరాళంగా ఇవ్వడం ద్వారా మంచి కార్యక్రమంలో పాలుపంచుకున్నట్టవుతారు” అని డాక్టర్ చినబాబు తెలిపారు. క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడం ద్వారా ప్రజలకు మరింత మేలు చేయడం, సమాజంలో క్యాన్సర్ను నిరోధించడానికి, ఎదుర్కోవడానికి శారీరక శ్రమను ప్రోత్సహించడం, ప్రజలు చురుకైన జీవనశైలిని అనుసరించడంలో సహాయపడటం, నిరుపేదలను వారి ఇంటి వద్దే ఉచితంగా పరీక్షించడానికి నిధులను సేకరించడానికి ఈ రన్ను నిర్వహిస్తున్నట్టు డాక్టర్ చినబాబు తెలిపారు. ఈ రన్ గురించి ప్రజలకు అవగాహన: "గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అట్టడుగు వర్గాలకు క్యాన్సర్తో పోరాడటానికి సహాయం చేస్తుంది. చాలా కణితులను ప్రారంభ దశలోనే గుర్తించి సరైన చికిత్స అందించినట్లయితే నయం చేయవచ్చు. అయితే, ప్రపంచవ్యాప్తంగా మారుమూల, మురికివాడల్లో నివసించే చాలా మందికి ఈ వాస్తవం గురించి తెలియదు. దురదృష్టవశాత్తు, వారు క్యాన్సర్ బారిన పడుతున్నారు. కాబట్టి, ఈ రన్ ద్వారా వారిని చేరదీసి, ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించాలనేది మా ప్రగాఢ కోరిక" అని ఆయన అన్నారు ప్రపంచవ్యాప్తంగా ఏటా 9.5 మిలియన్ల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారనేది విస్మయం కలిగిస్తోంది. కాబట్టి, ఎక్కువ మంది దీని బారిన పడకుండా నిరోధించడానికి, ఫౌండేషన్ ఇప్పటివరకు 4 ఖండాలను కవర్ చేస్తూ 10 దేశాలలో ఉచిత స్క్రీనింగ్ క్యాంపులు, క్యాన్సర్ అవగాహన చర్చలు ఇంకా క్యాన్సర్ రన్లను నిర్వహిస్తోంది. -
ఎవర్రా మీరంతా? ఇలా తగులుకున్నారు.. హర్షసాయి కాళ్లపై పడ్డ ఫ్యాన్!
యూట్యూబర్గా, సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్గా హర్ష సాయి అందరికీ సుపరిచితమే. కష్టాల్లో ఉన్న చాలామందికి సాయం చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. అయితే ఇప్పటివరకు సామాజిక సేవ కోసం టైం వెచ్చించిన మనోడు.. సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీకి సిద్ధమయ్యాడు. తానే హీరోగా, స్వీయ దర్శకత్వంలో మెగా సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తుండటం మరో విశేషం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ కాగా.. ఫ్యాన్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. టీజర్ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్లో గ్రాండ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. అయితే ఈ చిత్రాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరి బంధువైన కల్వకుంట్ల వంశీధర్ రావు సమర్పిస్తున్నారు. బిగ్బాస్ బ్యూటీ మిత్ర శర్మ తన సొంత బ్యానర్ శ్రీ పిక్చర్స్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. (ఇది చదవండి: హర్ష సాయి హీరోగా మెగా సినిమా.. టీజర్ వచ్చేసింది) అయితే టీజర్ రిలీజ్ సందర్భంగా వేదికపై ఓ సంఘటన చోటు చేసుకుంది. మామూలుగా అయితే ఇలాంటి సన్నివేశాలు స్టార్ హీరోల ఈవెంట్స్లో చూస్తుంటాం. కానీ మొదటిసారి సినిమా చేస్తున్న హర్ష సాయి టీజర్ రిలీజ్ ఈవెంట్లో జరగడంతో నెటిజన్స్ షాకయ్యారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోవాలనుందా? అయితే చూద్దా పదండి. గతంలో స్టార్ హీరోల మూవీస్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. అభిమాన హీరోతో ఒక్క సెల్ఫీ ఫోటో అయినా దిగాలని ఉత్సాహంగా ఉంటారు. అదే అదునుగా ఈవెంట్ జరుగుతున్న సమయంలో వేదికపైకి దూసుకురావడం చూస్తుంటాం. ఇటీవలే విశ్వక్సేన్ మూవీ ఫంక్షన్కు హాజరైన జూనియర్ ఎన్టీఆర్ను ఓ అభిమాని ఒక్కసారిగా వేదికపైకి దూసుకెళ్లాడు. తన ఫేవరేట్ హీరోతో సెల్ఫీ అంత సాహసం చేశాడు. అయినా జూనియర్ ఉన్న క్రేజ్ అలాంటిది మరీ. ఆయన అభిమానులు ఆ మాత్రం రచ్చ ఉండాల్సిందే. కానీ.. ఎవరూ ఊహించని విధంగా హర్షసాయి సినిమా తీస్తున్నట్లు ప్రకటించాడు. అంతేకాకుండా టీజర్ను కూడా రిలీజ్ చేస్తూ హైదరాబాద్లో ఈవెంట్ నిర్వహించాడు. అయితే విశ్వక్ సేన్ ఈవెంట్లో జరిగిన సీన్ ఇక్కడ రిపీట్ అవ్వడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఓ అభిమాని ఏకంగా హర్ష సాయి కాళ్లపై పడడంతో నెట్టింట చర్చ మొదలైంది. అక్కడున్న సిబ్బంది అతనికి పక్కకు తీసుకెళ్లారు. ( ఇది చదవండి: అలా అయితేనే ఇండస్ట్రీలో కొనసాగుతాం: హీరోయిన్ కామెంట్స్ వైరల్!) అంతా బాగానే ఉంది.. కానీ హర్షసాయి ఈవెంట్లో ఈ సంఘటన జరగడంతో నెటిజన్స్ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా వీన్ని తగులుకున్నారేంటి బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే హర్షసాయికి మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. ఓ నెటిజన్ రాస్తూ ఇంతకీ ఎవర్రా మీరంతా? అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. అరే ఏంటయ్యా మీ అభిమానం? ఫన్నీ మీమ్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. టీజర్కే ఇంతా హడావుడి చేస్తే.. సినిమా రిలీజ్ అయితే ఏ రేంజ్లో ట్రోల్స్ వస్తాయో వేచి చూడాల్సిందే. -
యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ : ప్రత్యర్థుల దారుణమైన ట్రోలింగ్
దక్షిణ కొరియా స్మార్ట్ఫోన్ దిగ్గజం శాంసంగ్, అమెరికా టెక్దిగ్గజం యాపిల్పై మరోసారి ట్రోలింగ్కు దిగింది. అమెరికాలోని యాపిల్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈవెంట్లో ఐఫోన్ 15 సిరీస్ను తాజాగా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే యూఎస్బీ-సీ పోర్ట్తో లాంచ్ తాజా ఐఫోన్లను ఎద్దేవా చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది శాంసంగ్. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో యుఎస్బి-సి పోర్ట్లపై దారుణంగా ట్రోల్ చేస్తోంది శాంసంగ్. దీనికి మరో స్మార్ట్ఫోన్దిగ్గజం వన్ప్లస్ కూడా తోడైంది. అలాగే మరికొన్ని డిజిటల్ ప్లాట్ఫాంలు కూడా యాపిల్పై విమర్శలకు దిగాయి. ఎట్టకేలకు మనం ఒక మాజికల్ చేంజ్ను (సీ) చూస్తున్నా అంటూ పోరక్షంగా ట్వీట్ చేసింది. అయితే ఇక్కడ కొంతమంది యూజర్లు యాపిల్కు మద్దతుగా నిలవడం విశేషం. ఆండ్రాయిడ్ ఫోన్లు చాలా కాలంగా USB-Cని ఉపయోగి స్తున్నాయి. నిజానికి, యాపిల్ఇపుడు యూఎస్బీ-సీ స్విచ్ చేయడానికి ఏకైక కారణం, 2024 నుంచి యూరోపియన్ యూనియన్ ఇప్పుడు అన్ని స్మార్ట్ఫోన్లు USB-C ని మాండేటరీ చేసింది. కాగా USB-Cతో Apple Watch Series 9, Airpods Proతో పాటు iPhone 15 సిరీస్ను విడుదల చేసింది. ఐఫోన్ 15 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 79,900 నుండి ప్రారంభం. అలాగే ఐఫోన్ 15 ప్లస్ ప్రారంభ ధర రూ. 89,900, iPhone 15 Pro 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 1,34,900 గాను నిర్ణయించింది. ఇక iPhone 15 Pro Max 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 1,59,900 నుండి ప్రారంభం.స్మార్ట్ఫోన్ సెక్టార్లో శాంసంగ్, యాపిల్ మధ్య పోటీ గత దశాబ్ద కాలంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఫోల్డబుల్ ఫోన్ లేదంటూ గత ఏడాది కూడా శాంసంగ్ యాపిల్పై విమర్శలు గుప్పించింది. Apple announcing USB-C… pic.twitter.com/KIzXQFIzMx — OnePlus_USA (@OnePlus_USA) September 12, 2023 -
ప్యారిస్ సభలో బీజేపీపై రాహుల్ ఫైర్..
ఢిల్లీ: బీజేపీ, ఆర్ఎస్ఎస్పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూయిజంతో వారికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. హిందువులకు వారు చేసిందేమీ లేదని చెప్పారు. తాను భగవద్గీత, ఉపనిషత్లను చదివానని ఎక్కడా కూడా హిందువులు(బీజేపీ) వారి గురించి లేదని పేర్కొన్నారు. ఈ మేరకు ఫ్రాన్స్లో సైన్స్ పీఓ యూనివర్సిటీ విద్యార్ధులతో ముచ్చటించారు. I have read the Gita, Upanishads and many Hindu books. There is nothing Hindu about what the BJP does—absolutely nothing. I have not read anywhere in any Hindu book or heard from any learned Hindu person that you should terrorize or harm people who are weaker than you. They… pic.twitter.com/mEj2vOrAxq — Congress (@INCIndia) September 10, 2023 "మీ కంటే బలహీనమైన వ్యక్తులను భయభ్రాంతులకు గురిచేయాలని లేదా హాని చేయాలని నేను ఏ హిందూ పుస్తకంలో చదవలేదు. ఏ హిందూ పండితుడి నుంచి వినలేదు. ఈ ఆలోచన, హిందూ జాతీయవాది అనేది పూర్తిగా తప్పు పదం. 'హిందూ జాతీయవాదులు'లకు హిందూ మతంతో ఎలాంటి సంబంధం లేదు" అని రాహుల్ గాంధీ అన్నారు. "బిజెపి, ఆర్ఎస్ఎస్కు హిందూ మతంతో ఎటువంటి సంబంధం లేదు. వారు ఎలాగైనా అధికారం సాధించాలని చూస్తున్నారు. ఇందుకోసం వారు ఏదైనా చేస్తారు" అని ఆయన అన్నారు. ర్యాడికల్ హిందూ యువకులపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు రాహుల్ గాంధీ ఈ విధంగా సమాధానమిచ్చారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ లోక్ సభ ఎంపీ తేజశ్వీ సూర్య తప్పుబట్టారు. రాహుల్ గాంధీకి మన ధర్మంపై చాలా తక్కువ అవగాహన ఉందని ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రపంచ వేదికలకు భారత్ నిలయంగా మారిందని చెప్పారు. జీ20 సమ్మిట్లో డిక్లరేషన్ను ప్రపంచ దేశాలు 100 శాతం ఆమోదించాయని గుర్తుచేశారు. The very fact that Rahul Gandhi thinks that Hinduism is practiced by referring to ‘books’ shows how shallow his understanding of our dharma. That he has been reduced to crying before a handful of people in some far away European city while Bharat is achieving global consensus… https://t.co/TZk2VmmC6w — Tejasvi Surya (@Tejasvi_Surya) September 10, 2023 ఇదీ చదవండి: జీ20 డిన్నర్ మీటింగ్లో మమతా బెనర్జీ.. కాంగ్రెస్ అసంతృప్తి -
'మణిపూర్లో జీ20 సదస్సును జరపండి'
లక్నో: కేంద్ర ప్రభుత్వంపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. మణిపూర్లో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటే కేంద్రం ఎందుకు జీ20 సదస్సును అక్కడ నిర్వహించట్లేదని ప్రశ్నించారు. ఈ మేరకు 'జీ20 కా చునావ్ కనెక్షన్' సెషన్లో భాగంగా ఆయన మాట్లాడారు. 'దేశవ్యాప్తంగా జీ20 సెషన్లను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఉత్తరప్రదేశ్, ఢిల్లీలతో సహా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. కానీ మణిపూర్ సమస్యపై సరిగా స్పందించడం లేదు. అక్కడ పరిస్థితులు సాధారణ స్థాయికి చేరాయని నాయకులు చెబుతున్నారు. నిజంగా అక్కడ అల్లర్లు లేకపోతే ప్రస్తుతం జరిగే జీ20 మీటింగ్లను మణిపూర్లో నిర్వహించవచ్చు.' అని అఖిలేష్ యాదవ్ అన్నారు. మణిపూర్ సమస్యపై ప్రతిపక్షాలు ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని పట్టుబట్టాయి. ప్రధాని మోదీ ఈ సమస్యపై స్పందించాలని కోరారు. అటు.. కేంద్రంపై అవిశ్వాస తీర్మాణాన్ని కూడా ప్రవేశపెట్టాయి. అయితే.. ఈ తీర్మాణంపై కేంద్రం తన బలాన్ని నిరూపించుకుంది. ఇదీ చదవండి: ఆయుష్మాన్ భారత్పై ప్రశంసలు కురిపించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ -
''తెలంగాణ చరిత్ర మహోన్నతమైనది.. చరిత్రలో అజరామరమైంది''
తెలంగాణ సమాజం ఆది నుంచి మత సామరస్యం, మానవీయ విలువలకు కేంద్రంగా నిలిచిందని పలువురు ప్రొఫెసర్లు పేర్కొన్నారు.భారతదేశ చరిత్ర పటంలో తెలంగాణ చరిత్ర అజరామరమయ్యిందన్నారు..రాష్ట్ర అవతరణ తర్వాత మనకు తెలియని మన మహోన్నతమైన చరిత్రను వెలికితీసే కృషి ముమ్మరంగా కొనసాగుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట ఉన్నత విద్యామండలిలో ‘‘తెలంగాణ చరిత్ర’’ బృహత్ గ్రంథాన్ని విడుదల చేశారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డా డి. రవీంద్ర యాదవ్, తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ఈ సందర్భంగా పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులతో పాటు ఇంటర్ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు చదువుకునే విద్యార్థులకు ఈ గ్రంథం తప్పకుండా ఉపయోగపడుతుందని అన్నారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తిని తర్వాత తరాలకు అందజేయాలంటే మన చరిత్రను, మన సంస్కృతిని నిక్షిప్తం చేసి అందచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. తొలుత ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో, ఇప్పుడు తెలుగులో అందించడం వల్ల విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.ఒకే గ్రంథంలో సమగ్రంగా మొత్తం చరిత్రను ముద్రించిన తెలంగాణ పబ్లికేషన్స్ కృషిని ఆయన అభినందించారు. -
గ్రాండ్ ఈవెంట్ దీప్మేల 2023 వచ్చేసింది.. ఎప్పుడు? ఎక్కడంటే
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దీప్మేల ఈవెంట్ వచ్చేసింది. హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ హాల్ 3లో ఈ నెల 11-13 వరకు ఈ ఈవెంట్ జరగనుంది. దీనికి దాదాపు 15వేల మంది సందర్శకులు రావచ్చని అంచనాల వేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సుధారెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఎలైట్ జ్యువెలరీ, డిజైనర్ వేర్, హస్తకళలు, కళాఖండాలు, పోషకాహార గృహోపకరణాలు, చర్మ సంరక్షణ మొదలైన ఉత్పతులను ఈ ఈవెంట్లో ప్రదర్శించనున్నారు. దీప్ మేల వెనక దీప్ శిఖా దీప్మేల 2023ని దీప్ శిఖా మహిళా క్లబ్ నిర్వహిస్తోంది. ఈ సంస్థ 1965లో ప్రారంభమైంది. దీనికి రాధిక మలానీ ప్రెసిడెంట్గా ఉన్నారు, మధు జైన్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మానవ సేవే మాధవ సేవ' అనే నినాదంతో.. దీప్ శిఖా మహిళా క్లబ్ కార్యక్రమాలను చేపడుతోంది. కన్య గురుకుల హైస్కూల్, దీప్శిఖ వొకేషనల్ జూనియర్ కళాశాలను ఈ క్లబ్ నిర్వహిస్తోంది. దీని ద్వారా 1500 మంది పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తున్నారు. దీప్ మేళాలో ఎన్నో ప్రత్యేకతలు ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా దీప్మేళాను నిర్వహిస్తున్నారు. భారత్తో పాటు పొరుగుదేశాల నుంచి కూడా సుమారు 250 స్టాల్స్ ఇందులో భాగం కానున్నాయి. దీప్మేలాలో టేస్టీ చాట్, బిర్యానీ, పిజ్జా, ఐస్ క్రీం, మాక్టెయిల్లు అందించే ఫుడ్ కోర్ట్ లు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆకర్షణలు, మరెన్నో ప్రత్యేకతలు. దీప్ మేలాలో కుటుంబమందరికీ ఏదో ఒక ఆకర్షణ, ప్రత్యేకత కలిగి ఉండటంతో... ఇది వేలాది మంది సందర్శకులను మరియు వారి కుటుంబాలను ఆకర్షిస్తోంది. ఈ ఈవెంట్ ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని దీప్ మేలా మహిళా క్లబ్ సభ్యులు నిర్వహించే దాతృత్వ కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారని క్లబ్ అధ్యక్షురాలు రాధిక మలాని తెలిపారు. గత ఏడాది జరిగిన దీప్ మేళా వివరాలు, ఫోటోలు కింద ట్వీట్ లో చూడవచ్చు. Deepmela 2022 Exhibition at Hitex by Deepshikha Mahila ClubMore HD Photos - https://t.co/r8BZTEHu1X#Deepmela #DeepmelaExhibition #Deepmela2022 #Exhibition #Hyderabad #Hitex #HyderabadExhibition pic.twitter.com/TwVnvB9VDc— Ragalahari (@Ragalahariteam) July 15, 2022 దీప్ శిఖా కార్యవర్గం వీరే ఈ క్లబ్ కు ప్రస్తుతం అధ్యక్షురాలిగా రాధిక మలాని, వైస్ ప్రెసిడెంట్ గా మధు జైన్, కార్యదర్శిగా ప్రియాంక బహేతి, కోశాధికారిగా సంగీతా జైన్, జాయింట్ సెక్రటరీగా భావ సంఘీ, మీనాక్షి భురారియా, సభ్యులుగా శివాని టిబ్రేవాల్, సలహాదారుగా జయ దగా ఉన్నారు. -
విజయవాడ : చీరకట్టు .. అదిరేట్టు ..(ఫోటోలు)
-
శాంసంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్: అదిరిపోయే ఫోల్డబుల్ స్మార్ట్పోన్స్, వాచ్ 6, ప్యాడ్ 9 సిరీస్ (ఫోటోలు)
-
BRO Pre Release Event Photos: బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
వివేక్ ఒబెరాయ్కి రూ.1.55 కోట్ల టోకరా
ముంబై: సామాన్యులే కాదు, ప్రముఖులు సైతం ఆర్థిక నేరాల బారినపడుతున్నారు. ఇదే తరహాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ రూ.1.55 కోట్లు పోగొట్టుకున్నారు. ఈవెంట్, సినీ నిర్మాణ సంస్థలో పెట్టుబడులు పెట్టాలని, మంచి లాభాలు వస్తాయంటూ ఓ సినీ నిర్మాత, వివేక్ ఒబెరాయ్ ఇద్దరు వ్యాపార భాగస్వాములు నమ్మించారు. ఒబెరాయ్ రూ.1.55 కోట్లు పెట్టుబడిగా పెట్టారు. కానీ, ఆ సొమ్మును ముగ్గురు వ్యక్తులు సొంతానికి వాడుకున్నారు. ఈ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. సదరు ఈవెంట్, సినీ నిర్మాణ సంస్థలో వివేక్ ఒబెరాయ్ భార్య కూడా భాగస్వామిగా ఉన్నారు. -
హైదరాబాద్ : సూత్ర ఎగ్జిబిషన్లో మెరిసిన మోడల్స్ (ఫొటోలు)
-
తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో ఎవేర్ నెస్ ఈవెంట్
-
కరీంనగర్ :కేబుల్ బ్రిడ్జి వద్ద అలరించిన ఆటపాటలు (ఫొటోలు)
-
యాపిల్ కొత్త ఆవిష్కరణలు.. ఈసారి ఏ ప్రొడక్ట్స్ను విడుదల చేయనుందంటే!
టెక్ దిగ్గజం యాపిల్ కొత్త ప్రొడక్ట్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఏటా నిర్వహించే వరల్ట్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ (WWDC 2023)లో తమ ప్రొడక్ట్స్ను యూజర్లకు పరిచయం చేయనుంది. ఈ ఏడాది జూన్ 5 (రేపటి నుంచే) సోమవారం నుంచి జూన్ 9 శుక్రవారం వరకు ఈవెంట్ను నిర్వహించనున్నట్లు యాపిల్ వెల్లడించింది. యాపిల్ ఆవిష్కరించే ప్రొడక్ట్స్ ఇవేనా ఐదు రోజుల డెవలపర్ ఈవెంట్లో ప్రీమియం ప్రొడక్ట్లైన మిక్స్డ్ రియాలిటీ (ఎంఆర్)హెడ్సెట్, న్యూ మాక్బుక్ ఎయిర్, కొత్త ఆపరేటింగ్ సిస్టంను విడుదల చేయనుంది. దీంతో పాటు వర్చువల్ రియాలిటీ (వీఆర్), అగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్)ను అనుభూతి పొందేందుకు వినియోగించే మిక్స్డ్ రియాలిటీ హెడ్ సెట్ కోసం గత కొంత కాలంగా నిరీక్షిస్తున్న యూజర్లు కోరిక నెరవేరనుంది. ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది? కాలిఫోర్నియాలోని కుపెర్టినో యాపిల్ పార్క్ కేంద్రంగా జరిగే ఈ ఈవెంట్కు డెవలపర్లు, విద్యార్థులు పాల్గొననున్నారు. భారతీయులు స్థానిక కాలమానం ప్రకారం జూన్ 5 (సోమవారం) రాత్రి 10:30 గంటలకు వీక్షించవచ్చు. ఎలా వీక్షించాలి? వరల్ట్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ను యాపిల్ డాట్కామ్లో లైవ్ స్ట్రీమ్ జరగనుంది. యాపిల్ టీవీ సబ్స్క్రిప్షన్ ఉంటే యాప్ను ఇన్స్టాల్ చేసి లైవ్లో చూడొచ్చు. -
చీరాలలో ‘అహింస’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
బేబీ సాంగ్ లాంచ్ ఈవెంట్లో సందడి చేసిన స్టార్స్ (ఫొటోలు)
-
కృష్ణ,విజయనిర్మల నటించిన సినిమానే మళ్ళీ పెళ్లి..నరేష్ షాకింగ్ కామెంట్స్
-
విశాఖపట్నం : అంతర్జాతీయ నర్సుల వారోత్సవాలు (ఫొటోలు)
-
ఒక్కోక్కడికి ఇచ్చి పడేసారు వామ్మో మామూలుగా రెచ్చిపోలేదుగా
-
థియేటర్ లో ఆదిపురుష్ ట్రైలర్ చూసి రచ్చ రచ్చ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్
-
ఈ అమ్మాయిలు కుర్చీలు ఎక్కి ఏం చేశారో చుస్తే షాక్..!
-
ముంబైలో ఆదిపురుష్ హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘న్యూసెన్స్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ప్రభాస్ సాహో హీరోయిన్ ఎంత సింపుల్ గా ఉందొ చూడండి
-
అపరకుబేరులు అయినా ఎంత సింపుల్ గా ఉన్నారో
-
Ramabanam Pre Release Event : ‘రామబాణం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
అమెరికాలో దారుణం.. ప్రోమ్ పార్టీపై కాల్పులు
న్యూయార్క్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఓ దుండగుడు.. ఇంట్లో జరుగుతున్న హైస్కూల్ ప్రోమ్ పార్టీపై కాల్పులు జరిపాడు. ఈ ప్రమాదంలో 9 మంది టీనేజర్లు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. అమెరికాలోకి టెక్సాస్లో జాస్పర్ కౌంటీలో ఉన్న ఓ ఇంట్లో హైస్కూల్ ప్రోమ్ పార్టీ జరుగుతోంది. ఈ సందర్భంగా పిల్లలందరూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో ఓ దుండగుడు ప్రోమ్ పార్టీపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో తొమ్మిది మంది టీనేజర్లు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, కాల్పుల్లో గాయపడిన వారంతా 15-19 ఏళ్ల మధ్య వారుగా తెలుస్తోంది. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఇక, కాల్పల సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్టు జాస్పర్ కౌంటీ షరీష్ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, కాల్పలకు గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. -
Ramabanam Trailer Launch Event : ‘రామబాణం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆ హీట్ స్ట్రోక్ హీట్ మాములుగా లేదు! దెబ్బకు బహిరంగ కార్యక్రమాలు..
మహారాష్ట్రలోని అవార్డుల కార్యక్రమంలో వడదెబ్బతో సుమారు 13 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటన చర్చనీయాంశంగా మారడమే గాక సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి కూడా. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఎండలు తగ్గేవరకు మధ్యాహ్నం నుంచి సాయంత్ర 5 గంటల వరకు ఎలాంటి బహిరంగ కార్యక్రమాలను నిర్వహించకూడదని నిషేధించింది. వాస్తవానికి నాడు బహిరంగ మైదానంలో మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన భూషణ్ అవార్డుల కార్యక్రమానికి లక్షలాదిమంది హాజరయ్యారు. ఆ సమావేశం మండే ఎండలో జరిగినట్లు తెలుస్తోంది. ఆ రోజు ఆ సమావేశం జరిగనప్పుడూ గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఈ కార్యక్రమానిక ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్లు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు హాజరయ్యారు. ఈ విషాద ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిండే రూ. 5 లక్షల పరిహారం కూడా ప్రకటించారు. ఇదిలా ఉండగా, ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రణాళిక పై ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టాయి. షిండే ప్రభుత్వంపై నరహత్య కేసు నమోదు చేయాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజిత్ పవార్ డిమాండ్ చేశారు. ఇది ప్రకృతి వైపరిత్యం కాదని, మానవ నిర్మిత విపత్తు అని విమర్శులు గుప్పించారు. దీనికి ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని పవార్ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు అధిక పరిహారం ఇవ్వాలని కూడా పవార్ డిమాండ్ చేశారు. (చదవండి: దేశంలో అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఏంటో తెలుసా?) -
Agent Trailer Launch Event : ఏజెంట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
కర్నూలులో రామబాణం సాంగ్ రిలీజ్.. గోపీచంద్కు పూలమాలతో సత్కారం (ఫొటోలు)
-
Virupaksha Trailer: 'విరూపాక్ష' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)
-
NIT Warangal: నిట్లో వసంతోత్సవ వేడుకలు.. ఆకట్టుకున్న కళారూపాలు (ఫొటోలు)
-
బలగం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నడుస్తుండగా కిందపడిపోయిన తెలంగాణ గవర్నర్ తమిళిసై
-
మీ సొంతింటి కల సాకారం కోసం ‘సాక్షి’ ప్రాపర్టీ షో వచ్చేసింది!
సాక్షి, హైదరాబాద్: సొంతింటి కలను మరింత చేరువ చేసేందుకు ‘సాక్షి’ ప్రాపర్టీ షో మరోసారి నగరవాసుల ముందుకు వచ్చింది. నేడు, రేపు మాదాపూర్లోని శిల్పకళావేదికలో సాక్షి 14వ స్థిరాస్తి ప్రదర్శన జరగనుంది. నగరానికి చెందిన 20కి పైగా నిర్మాణ సంస్థలతో పాటు ఎస్బీఐ, కెనరా బ్యాంకులు కూడా ఈ షోలో పాల్గొననున్నాయి. ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ ముఖ్య అతిథిగా హాజరై ఉదయం 10 గంటలకు ప్రాపర్టీ షోను ప్రారంభించనున్నారు. ప్రవేశం ఉచితం. మెయిన్ స్పాన్సర్: అపర్ణా అసోసియేట్ స్పాన్సర్లు: వాసవి గ్రూప్, సైబర్సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, రాజపుష్ప ప్రాపర్టీస్ కో–స్పాన్సర్లు: సాకేత్ ఇంజనీర్స్, శిల్పా రాఘవ ప్రాజెక్ట్స్ పాల్గొనే ఇతర సంస్థలు: ఆర్క్ బిల్డర్స్, ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ, కపిల్ ప్రాపర్టీస్, ఎన్సీసీ అర్బన్, శ్రీరాధే రియాల్టీ, వర్ధన్ ఇన్ఫ్రా డెవలపర్స్, ఏలియాంటో గ్రూప్, అసెట్ప్రీ, హస్తినా, గ్రీన్ హోమ్ ఐటీ లేక్సిటీ, మహిధరా ప్రాజెక్ట్స్, సీతా షెల్టర్స్, రిధిరా జెన్, శ్రీ విజయ గణపతి అవెన్యూస్, యోషిత ఇన్ఫ్రా, కెనరా, ఎస్బీఐ బ్యాంకులు. -
శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో తొలిసారి క్రీడా కార్యక్రమం
గత రెండేళ్లుగా వైవిధ్యభరితమైన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి, ప్రపంచవ్యాప్తంగా అందరి అభిమానాన్ని సంపాదించుకున్న "శ్రీ సాంస్కృతిక కళాసారథి" సంస్థ తొలిసారి సింగపూర్లో క్రీడారంగంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. సంక్రాంతి పండగ సందర్భంగా మైగ్రెంట్ ఫోర్స్ క్రికెట్ లీగ్ (MFCL) ని Terusan Recreation Centre లో జనవరి 22-24 వరకు ఘనంగా నిర్వహించింది. మొత్తం 12 టీంలు లెవన్ టైగెర్స్, విక్టోరియన్స్ (మెగాయార్డ్), కూల్ ట్రంప్స్ (పెంజూరు), సెంబావాన్గ్ స్ట్రైకర్స్ (సెంబావాన్గ్), కెప్పెల్ సన్రై జర్స్ (అకాసియా లాడ్జ్), సింగపూర్ తెలంగాణ (వెస్ట్ కోస్ట్), కెన్టెక్ హాన్టెర్స్ (కెన్టెక్ లాడ్జి), రాయల్ గైస్ (కాకిబుకిత్), తెలుగు సూపర్ కింగ్స్ (సీడీపీల్/జేటీసీ), దుర్గ ఎలెవెన్స్ (జురాన్గ్ ఐలాండ్), రోటరీ కోబ్రాస్ (TR), ట్రోఫీ ఫైటర్స్ ( Tuas View) పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్లో, ముత్యాల రమేష్ నాయకత్వంలో కూల్ ట్రంప్స్ (పెంజూరు) విజేతగా నిలవగా, చిన్నబోయిన రవి కుమార్ నాయకత్వంలో దుర్గ ఎలెవెన్స్ (జురాన్గ్ ఐలాండ్) టీం ద్వితీయ, సంకాబత్తుల దుర్గ బాబు నాయకత్వంలో రాయల్ గైస్ (కాకిబుకిత్) టీం తృతీయ స్థానం కైవసం చేసుకున్నారు. మొదటి బహుమతిగా 500 డాలర్లు, ద్వితీయ బహుమతిగా 300 డాలర్లు, తృతీయ బహుమతిగా 200 డాలర్లతో పాటు ట్రోఫీని విజేతలకు అందచేశారు. సీడీ దిలీప్ వరప్రసాద్ ‘మాన్ అఫ్ ది మ్యాచ్’ ట్రోఫీ అందుకోగా, బెస్ట్ బౌలర్ గా మహేశ్వరన్ సూర్య ప్రకాష్, బెస్ట్ క్యాచ్కు పందాల జైరాం నాయుడు ఎంపికయ్యారు. ఈ టోర్నమెంట్ కి అంపైర్గా శ్రీనివాస్ యాదవ్, సంగటి చంద్ర మోహన్ రెడ్డి వ్యవహరించారు. గిరిధర్ సారాయి నాయకత్వంలో జరిగిన ఈ కార్యాక్రమములో నగేష్ టేకూరి, పోతగౌని నర్సింహా గౌడ్, అశోక్ ముండ్రు, కంకిపాటి శశిధర్ , సుదర్శన్ పూల, రాము చామిరాజు, సుధాకర్ జొన్నాదుల, పాతూరి రాంబాబు, శ్రీధర్ భరద్వాజ్, సునీల్ రామినేని, కరుణాకర్ కంచేటి , మిట్టా ద్వారకానాథ్, తోట సహదేవుడు, S కుమార్, లీల మోహన్, సురేంద్ర చేబ్రోలు తదితరులతో పాటు అనేకమంది వాలంటీర్స్ వచ్చి ఈ 3 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వీరితో పాటు తెలంగాణ కల్చరల్ సొసైటీ అధ్యక్షులు రమేష్ గడప, వారి సభ్యులు నీలం మహేందర్. గారెపల్లి శ్రీనివాస్, SP Sysnet కొల్లా శివప్రసాద్ తదితరులు విచ్చేసి నిర్వాహుకులను, క్రీడాకారులను అభినందించారు. శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ విజయవంతం కావటం పట్ల హర్షం ప్రకటిస్తూ, దానికి సహకరించిన Terusan Recreation Centre యాజమాన్యానికి, వాలంటీర్స్, ఆర్ధిక సహాయం అందించిన సరిగమ బిస్ట్ర రెస్టారంట్, గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్, SP Sysnet, టింకర్ టాట్స్ మొంటోసిరి, శబ్ద కాన్సెప్ట్స్, శంకర్ వీర, బాలకృష్ణ, సుబ్బు వి పాలకుర్తి లకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదములు తెలియచేశారు. -
మలేషియాలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు
మలేషియా ఆంధ్ర అసోసియేషన్ అధ్వర్యములో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. మలేషియా కౌలాలంపూర్ లోని డీ చక్ర రూఫ్ టాప్ హాల్, ఖీఔఓ కాంప్లెక్స్, బ్రిక్ ఫీల్డ్స్, కులాలంపూర్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సాంప్రదాయ దుస్తులతో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిధిగా ఇండియన్ హై కమీషనర్ అఫ్ మలేషియా హెచ్.ఈ.బీ.ఎన్ రెడ్డి, మలేషియా తెలుగు అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సీతా రావు మలేషియా తెలంగాణ అసోసియేషన్ డిప్యూటీ ప్రెసిడెంట్ సత్య, వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి , మలేషియా తెలుగు ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్, ఇతర తెలుగు సంఘాల ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఉత్సవాలలో కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల పాటలు నృత్యాలతో ఆడిటోరియం కళకళలాడింది. అలాగే జబర్దస్త్ ఫేమ్ అశోక్, బాబీ పాల్గొని వారి హాస్యంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రుచికరమైన తెలుగు వంటకాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అలాగే ముగ్గులపోటీలు, లక్కీ కపుల్, క్యూట్ బేబీ కాంటెస్ట్ , లక్కీ డ్రా నిర్వహించి బంగారు బహుమతులను అందజేశారు. హెచ్.ఈ.బీ.ఎన్ రెడ్డి మాట్లాడుతూ.. విదేశీ గడ్డపై ఇలాంటి పండుగలు నిర్వహిస్తూ తమ సంస్కృతి, సంస్కారాలను కాపాడుతూ నవతరాలకు చాటిచెబుతేన్న మా అసోసియేషన్ ను అయన అభినందించారు. ఈ సంక్రాంతి తెచ్చే సంబరాలలో ప్రతి ఇంట ఆనందాలు వెళ్లి విరియాలని అయన ఆకాంక్షించారు. మా ప్రెసిడెంట్ శ్రీరామ్ మాట్లాడుతూ.. మన దేశాన్ని దాటి ఎంత దూరం వచ్చినప్పటికి మన సంస్కృతి సంప్రదాయాలను మరిచిపోకుండా వాటిని కాపాడుతు రేపటి తరం పిల్లలకు తెలియచేయటం మన బాధ్యత అన్నారు. అలాగే సంక్రాతి పండుగా గొప్పతనాన్ని వివరించారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ గా వచ్చిన శ్రీ బిర్యానీ , టెక్ తీరా , ఎస్వీఐ టెక్నాలజీస్ , ఆక్సీ డేటా , రెడ్ వేవ్ , జాస్ ట్రేట్జ్ ,క్లబ్ మహీంద్రా ,మినీ మార్ట్ , మై టెక్ ,కానోపుస్ , లు లు మనీ , ఈగల్ టెక్ ,నిమ్మల, మై 81,ఫామిలీ గార్డెన్,దేశి తడ్కా,బిగ్ సి హైదరాబాద్,మై బిర్యానీ హౌస్,ప్రబలీస్ రెస్టారెంట్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ శ్రీరామ్ కోర్ కమిటీ సభ్యులు వెంకట్,శ్రీనివాస్ చౌటుపల్లి, నల్ల స్వామి నాయుడు ,జగదీష్ శ్రీరామ్ ,కిరణ్ గుత్తుల ,రవి వంశి ,శారద ,దీప్తి ,హరీష్ నడపన ,రామ్ గొల్లపల్లి ,గణేష్ ,కిషోర్ ,నాయుడు రావూరి ,రవి జాస్ ,సందీప్ తన్నీరు ,సతీష్ నంగేడా ,కల్పనా తదితరులు పాల్గొన్నారు. -
ఈ సీజన్ వచ్చిందంటే జపాన్లో పండగే.. అక్కడివారంతా కలసి
జపాన్ ఈశాన్య ప్రాంతంలో ఏటా ప్లమ్ చెట్లు పూత పూసే జనవరి మొదటి వారం నుంచి మార్చి మొదటి వారం వరకు జరుపుకొనే సంబరాలు ఇవి. ఈ సమయంలో జపాన్ ఈశాన్య ప్రాంతంలో విపరీతంగా మంచు కురుస్తుంది. ప్లమ్తోటల్లోని చెట్లు సరికొత్త పూలతో కళకళలాడుతూ కనిపిస్తాయి. ‘అటామీ బయినె ఉమె మత్సురి’ పేరిట జరుపుకొనే ఈ వేడుకల్లో పిల్లా పెద్దా అంతా ఉత్సాహంగా పాల్గొంటారు. షిజువోకా రాష్ట్రంలోని ఇజు ద్వీపకల్పంలో ప్లమ్ పూల సంబరాలు మరింత అట్టహాసంగా జరుగుతాయి. పూలతో కళకళలాడే ప్లమ్ చెట్ల కిందకు చేరి వనభోజనాలు జరుపుకుంటారు. జపాన్లోని అతిపెద్ద ప్లమ్తోట ‘అటామీ బయినె’కు పెద్దసంఖ్యలో జనాలు చేరుకుని, విందు వినోదాలతోను, సంప్రదాయ నృత్య సంగీత కార్యక్రమాలతోనూ కాలక్షేపం చేస్తారు. ఇక్కడే కాకుండా, కొందరు సంపన్నుల ప్రైవేటు ప్లమ్తోటల్లోనూ ఈ వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ వేడుకల్లో పాల్గొనడానికి పెద్దసంఖ్యలో విదేశీ పర్యాటకులు కూడా ఈ సీజన్లో జపాన్కు వస్తుంటారు. చదవండి: వారెవ్వా! ఓ వైపు సూర్యోదయం, మరో వైపు నిండుచంద్రుడు.. ఈ ఫొటో కోసం 2వేల సార్లు -
‘ప్రపంచం మొత్తం ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది’
భారత దేశ మాజీ ఉప రాష్ట్రపతి ముప్పలపాటి వెంకయ్య నాయుడు నాలుగురోజుల దుబాయి పర్యటనలో భాగంగా తెలుగు అసొసియేషన్ భారత కాన్సులేట్ జనరల్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో పాల్గొన్నారు. వెంకయ్య నాయుడును తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు దినేష్ కుమార్ ఉగ్గిన సాదరంగా ఆహ్వానిస్తూ స్వాగత ఉపన్యాసం ఇచ్చారు. ఈ సందర్భంగా దుబాయిలోని భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ అమన్ పురి దేశానికి వెంకయ్య నాయుడుగారు చేసిన సేవలను కొనియాడరు. అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. జనని, జన్మభూమి, చదువుచెప్పిన గురువులను ఎన్నడూ మరువరాదని, మనిషికి మాతృభాష కళ్ళవంటిది అయితే ఇతర భాషలు కళ్ళజోడు వంటివని, మాతృభాషను, మన కట్టు, బొట్టు, ప్రాస, యాస, గోసలను కాపాడుకోవాలని కోరారు. భారతదేశంలో మన వేద పురాణ కాలం నుండే మహిళకు ఒక ప్రత్యేక స్థానం ఉందని, మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోది పిలిపునిచ్చినట్టుగా ఆడపిల్లలను సంరక్షించాలని, చదివించాలని,ప్రోత్సాహించాలని కోరారు. ప్రపంచం శర వేగంతో ముందుకు వెళ్తోందని, మన భారతదేశం నిపుణతకు, మేధస్సు, నిజాయితీ లకు పెట్టునిల్లు అని, సంకల్పం, దృఢ నిశ్చయం, పట్టుదల, కఠోర పరిశ్రమతో విశ్వగురువుగా మళ్ళీ అవతరించబోతోందని చెప్పారు. సాంకేతిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక,వైజ్ఞానికరంగాల్లో భారత్దే పైచేయి అని, ప్రపంచం మొత్తం ఇప్పుడు భారత్ వైపు చూస్తోందని చెప్పారు. మన పూర్వ వృత్తాంతన్ని మననం చేసుకుంటూ, మన మూలాలను మరవకుండా, మనుగడను కొనసాగించి పురోభివృద్ది చెందాలని కోరారు. ప్రతీ ఒక్కరూ తమ, తమ కుటుంబ, సమాజ, ప్రాంత, రాష్ట్ర, దేశ శ్రేయస్సు కొరకు పాటుపడాలని సందేశాన్ని ఇచ్చారు య.ఏ.ఈ లోని ఉభయ రాష్ట్రాల తెలుగు వారిని సంఘటిత పరుస్తూ, తెలుగు సంసృతిని సంరక్షిస్తున్న తెలుగు అసోసియేషన్ సేవలను నువెంకయ్యనాయుడు ప్రత్యేకంగా కొనియాడారు. ఈ సందర్భంగా దుబాయిలోని చిన్నారులు చేసిన కూచిపూడినృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలుగు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వివేకానంద బలుసా, ఎస్ఆర్ఆర్బిల్డింగ్ మెటేరియల్స్ అధినేత తోట రామకుమార్, దినేష్ కుమార్ ఉగ్గిన వెంకయ్యనాయుడుని సన్మానించి, సన్మాన పత్రం, శాలువా,జ్ఞాపికలను బహుకరించారు. ఈ కార్యక్రమానికి వక్కలగడ్డ వేంకట సురేష్, ఆర్జె జాహ్నవి లు సంధానకర్తలు గా వ్యవహరించారు. తెలుగు అసోసియేషన్ తరఫున శ్రీధర్ దామెర్ల,విజయ్ భాస్కర్, మోహన్ ఎంవీఎస్కే,అంబేడ్కర్, లతా నాగేశ్, ఫహీమ్, శ్రీనివాస్ యండూరి, సురేంద్ర దండేకుల,నూకల మురళీ కృష్ణకార్యక్రమ నిర్వహణ బాధ్యతలు చూసుకున్నారు. -
విజయవాడ : సిద్ధార్థ కళాశాలలో ఉత్సాహంగా బ్లిట్జ్ క్రీగ్–2023 (ఫొటోలు)
-
వాల్తేరు వీరయ్య: పూనకాలు లోడింగ్ సాంగ్ లాంచ్ ఈవెంట్(ఫొటోలు)
-
పెద్ద అవుటపల్లిలో తానా సేవా కార్యక్రమాలు విజయవంతం
తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి స్వగ్రామం పెద్ద అవుటపల్లిలో తానా చైతన్య స్రవంతి సందర్భంగా చేసిన సేవా కార్యక్రమాలు విజయవంతం అయ్యాయి. తానా సర్వీసెస్ డే సందర్భంగా ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లి గ్రామంలో RCM స్కూల్ నందు సోమవారం ఉచిత క్యాన్సర్ పరీక్షలు, ఉచిత కంటి పరీక్షలు, ఆర్థోపెడిక్స్ పరీక్షలు, చెవి ముక్కు గొంతు పరీక్షలు వంటి సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి 27 గ్రామాల ప్రజలు, గన్నవరం, దావాజి గూడెం, అల్లపురం, మర్లపాలెం గ్రామాల నుంచి కూడా ప్రజలు వచ్చారు. 1. తానా ఫౌండేషన్, గ్రేస్ ఫౌండేషన్ వారిచే ఉచిత మెగా క్యాన్సర్ క్యాంపు 2. టాప్ స్టార్ హాస్పిటల్స్ విజయవాడ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం 3. ఉచిత వినికిడి పరీక్షలు 4. ఉచిత మెగా కంటి శిబిరం 5. తానా క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమము 6. తానా రైతుకోసం సందర్భంగా రైతులకు రక్షణ కిట్లు పంపిణీ. 7. తానా చేయూత ద్వారా 20 మంది అనాధ పిల్లలకు స్కాలర్షిప్ పంపిణీ. 8. జిల్లా పరిషత్ హైస్కూల్ అబివృద్ధి కోసం 1,00,000 డొనేషన్. ఈ కార్యక్రమానికి తానా ప్రతి నిధులు, రాజకీయ ప్రజా ప్రతినిధులు కార్యక్రమానికి విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని కిరణ్ కలపాల కో ఆర్డినేట చేసుకొని తమ సహకారం అందచేశారు. తానా ప్రతినిధులు: లావు అంజయ్య చౌదరి, తానా అధ్యక్షులు, వెంకట రమణ యార్లగడ్డ, తానా ఫౌండేషన్ చైర్మన్, సతీష్ వేమూరి తానా తానా సెక్రటరి, సతీష్ వేమన, మాజీ తానా అధ్యక్షులు, రవి పోట్లురి, 2023 తానా Convenntion Convener, సునీల్ పాత్ర, తానా చైతన్య స్రవంతి కో ఆర్డినేటర్, రాజా కసుకుర్థి, తానా కమ్యూనిటి సర్వీసెస్, సురేష్ పుట్టగుంట, ఫౌండేషన్ ట్రస్టీ, శ్రీనివాస్ ఒరుగంటి, ఫౌండేషన్ ట్రస్టీ, శశాంక్ యార్లగడ్డ, స్పోర్ట్స్ కో ఆర్డినేటర్, ఠాగోర్ మలినేని, మీడియా కో ఆర్డినేటర్, శ్రీనివాస్ కోకట్ల,ఈవెంట్స్ కో ఆర్డినేటర్, జోగేశ్వరరావు పెద్దిబోయిన, లక్ష్మినారాయణ సూరపనేని, అనిల్ లింగమనేని, గన్నే రమణ, వంశీ కోట, రమేష్ యలమంచిలి, శ్రీనివాస్ నాదెండ్ల, అనిల్ యలమంచిలి, శ్రీనివాస్ తాతినేని, సుమంత్ పూసులురు ప్రజా ప్రతినిధులు: లావు రత్తయ్య, విజ్ఞాన సంస్థల అధినేత కృష్ణ దేవరాయులు, నరసరావుపేట ఎంపీ, కంభంపాటి రామ మోహనరావు, మాజీ రాజ్య సభ సభ్యులు దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లరావు, మాజీ మంత్రి కూన రవికుమార్, మాజీ విప్, ఆమదాలవలస, ఆరుమళ్లీ రాదకృష్ణ, మాజీ ఎంఎల్ఏ, తణుకు, బచ్చుల అర్జునుడు, ఎంఎల్సీ, గన్నవరం, యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎంఎల్సీ గన్ని కృష్ణ, మాజీ గూడా చైర్మన్ కొమ్మరెడ్డి పట్టాబి, అధికార ప్రతినిధి కేసీనేని చిన్ని, సీనియర్ నాయకులు రాము వెనిగళ్ల, సీనియర్ నాయకులు, కొనగల్ల బుల్లయ్య, రాష్ట్ర సెక్రటేరి ఆళ్ల వెంకట గోపాలకృష్ణ రావు, నీటి సంఘాల అధ్యక్షులు మూల్పూరి సాయి కళ్యాణి, తెలుగు మహిళ కార్యదర్శి .లావు ఫౌండేషన్ ద్వారా పెద్ద అవుటపల్లి గ్రామంలో మరెన్నో ప్రజలకు అవసరమైన సేవా కార్యక్రమాలు చేస్తామని తానా అధ్యక్షులు చెప్పారు. -
సంతోషం అవార్డ్స్ మొట్టమొదటి OTT అవార్డులు (ఫొటోలు)
-
హైదరాబాద్లో తానా మహాసభల సన్నాహక సమావేశం జయప్రదం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2023లో ఫిలడెల్ఫియాలో జూలై నెలలో నిర్వహించే 23వ తానా మహాసభలను పురస్కరించుకుని ఇండియాలో మొట్టమొదటిసారిగా సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్లోని దస్పల్లా హోటల్లో జరిగిన ఈ సమావేశానికి మంచి స్పందన వచ్చింది. తానా నాయకులతోపాటు దాతలు, సినీ నటీనటులు, వ్యాపార, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తానా బోర్డ్ డైరెక్టర్ జాని నిమ్మలపూడి ఆధ్వర్యంలో జరిగిన ఈ సన్నాహక సమావేశానికి వ్యాపారవేత్తలు రామకృష్ణ బొబ్బ, సుధాకర్ కొర్రపాటి దాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సినీ నటుడు మురళీ మోహన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా తానా మహాసభల లోగోను, ప్రోమోను మురళీ మోహన్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తనకు తానా అంటే చాలా ఇష్టం అని ఇప్పటివరకు 20 సార్లు వారి మహాసభలకు హాజరయ్యానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు మాట్లాడుతూ.. ఫిలడెల్పియాలో జూలై నెలలో నిర్వహిస్తున్న తానా మహాసభలకు అందరూ రావాల్సిందిగా ఆహ్వానించారు. వ్యాపార ప్రముఖులతోపాటు, రాజకీయ, సినీతారలు, సాహితీవేత్తలు ఇతరులు అందరూ ఈ మహాసభల విజయవంతానికి సహకరించి తానా ఆతిధ్యాన్ని స్వీకరించాలని ఆయన కోరారు. దాతలు ఇస్తున్న సహకారం మరువలేనిదంటూ తానాకు సహకరిస్తున్న దాతలను ఆయన ఈ కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు. \ తానా మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి మహాసభలకు సంబంధించిన విశేషాలను వివరించి అందరూ ఈ మహాసభలకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తానా బోర్డ్ డైరెక్టర్ జాని నిమ్మలపూడి సేకరించిన కోటి రూపాయలను బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి విరాళంగా అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో ప్రతాపరెడ్డి కూడా కీలకపాత్ర పోషించారని జాని నిమ్మలపూడి తెలిపారు. తానా నాయకులు లక్ష్మీ దేవినేని, శశికాంత్ వల్లేపల్లి, పురుషోత్తం చౌదరి గూడె, సురేష్ పుట్టగుంట, రవి మందలపు, సునీల్ పంత్ర, శ్రీనివాస్ ఓరుగంటి, ఉమ కటికి, రాజా కసుకుర్తి, సురేష్ కాకర్ల, హితేష్ వడ్లమూడి, శశాంక్ యార్లగడ్డ, శ్రీనివాస్ కూకట్ల, టాగూర్ మలినేని, రఘు ఎద్దులపల్లి, సుమంత్ పుసులూరి తదితరులతోపాటు సినీ రంగ ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఈ మహాసభల సన్నాహక సమావేశానికి హాజరయ్యారు. -
ఘోరం: అత్తను సుత్తితో కొట్టి..పది ముక్కలుగా చేశాడు
సాక్షి, జైపూర్: యావత్తు దేశాన్నే ఉలిక్కిపడేలా చేసిన ఢిల్లీ శ్రద్ధా వాకర్ హత్యోదంతం మరువక మునుపే అచ్చం అలాంటి తీరులోనే మరో ఘటన కలకలం రేపింది. ఒక వ్యక్తి ఈవెంట్కి వెళ్లొద్దని అడ్డు చెప్పిందన్న కోపంతో అత్తను సుత్తితో కొట్టి చంపి ముక్కలుగా చేశాడు. ఈ దారుణ ఘటన రాజస్తాన్లోని జైపూర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...32 ఏళ్ల అనూజ్ శర్మ అనే యువకుడు జైపూర్లోని విద్యానగర్లో తండ్రి, చెల్లి, మేనత్తతో కలిసి ఉంటున్నాడు. ఆ యువకుడి తల్లి గతేడాది కరోనా సమయంలో మృతి చెందింది. అతడి చెల్లి, తండ్రి ఇండోర్లో వెళ్లడంతో ఈ నెల డిసెంబర్ 11 నుంచి అనుజ్ అతడి మేనత్త సరోజ్ ఇద్దరే జైపూర్లో ఉంటున్నారు. వాస్తవానికి అనూజ్ మేనత్త సరోజ్ భర్త చనిపోవడంతో ఆమె అతడి కుటుంబంతోనే కలిసి ఉంటోంది. ఐతే ఒకరోజు అనూజ్ ఢిల్లీలోని ఒక ఈవెంట్కి వెళ్లాలనుకున్నాడు. ఆ విషయమై అతడి మేనత్తకు ఆమెకు మధ్య వాగ్వాదం తలెత్తింది. దీంతో అనూజ్ కోపంతో ఒక సుత్తి తీసుకుని మేనత్తను కొట్టి చంపేశాడు. ఆతర్వాత ఆమె మృతదేహాన్ని ఒక మార్బుల్ కట్టర్తో సుమారు 10 ముక్కలుగా కోసేశాడు. ఆ భాగాలను బకెట్, సూట్కేసులలో పెట్టుకుని జైపూర్-సికర్ హైవే సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్లి అత్త కనిపించడం లేదంటూ మిస్సింగ్ కేసు పెట్టాడు. అతడు కేసును తప్పుదోవ పట్టించేందుకు పలు రకాలుగా ప్రయత్నించాడు. ఐతే అతడి చర్యలను అనుమానించిన పోలీసులు నిందితుడి ఇంటికి సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించగా..అతడు మాత్రమే ఇంటి నుంచి వెళ్తున్నట్లు వీడియోలో కనిపించింది. పైగా అతడి ఫ్లాట్లోని కిచెన్లో రక్తపు మరకలను గుర్తించారు పోలీసలు. సదరు యువకుడు బీటెక్ వరకు చదువుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే సీసీటీవీలో బకెట్లు, సూట్కేసులతో అనూజ్ బయటకు వెళ్లినట్లు సాక్ష్యాధారాలు కూడా ఉండటంతో ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు అరెస్టు చేశారు. (చదవండి: ప్రేమిస్తున్నానంటూ వెంటపడి..పెళ్లి మాట ఎత్తగానే...) -
సోమాజిగూడ విల్లామేరీలో ఫ్రెషర్స్ డే వేడుకలు (ఫొటోలు)
-
ఫిలడెల్ఫియాలో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు
అమెరికాలో తెలుగుజాతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ఫిలడెల్ఫియాలో బాలల సంబరాలు నిర్వహించింది. ఆ ప్రాంతంలోని భారతీయ టెంపుల్ కల్చరల్ సెంటర్ వేదికగా ఈ బాలల సంబరాలు జరిగాయి. ప్రతి ఏటా పండిట్ జవహర్ లాల్ నెహ్రు జన్మదినం సందర్భంగా నాట్స్ బాలల సంబరాలను నిర్వహిస్తూ వస్తుంది. దాదాపు 120 మందికి పైగా బాల బాలికలు ఈ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. బాలల సంబరాలను పురస్కరించుకుని తెలుగు సంప్రదాయ నృత్యం, సినీ నృత్యం, సంప్రదాయ సంగీతం, సినీ సంగీతం, గణితం, తెలుగు వక్తృత్వం, తెలుగు పదకేళి అంశాల్లో నాట్స్ పోటీలు నిర్వహించింది. ఎనిమిదిఏళ్ళలోపు, పన్నెండుఏళ్ళలోపు, పన్నెండుఏళ్ళపైన ఉన్న చిన్నారులను మూడు వర్గాలుగా విభజించి నిర్వహించిన ఈ పోటీల్లో అనేక మంది పిల్లలు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి నాట్స్ బహుమతులు అందించింది. నాట్స్ వైస్ ప్రెసిడెంట్ ప్రోగ్రామ్స్ హరినాథ్ బుంగటావుల, సరోజ సాగరం, శ్రీనివాస్ సాగరం, రవి ఇంద్రకంటి, బాబు మేడి, రామకృష్ణ గొర్రెపాటి, పార్ధ మాదాల, అపర్ణ సాగరం, మాలిని గట్టు, సురేంద్ర ఈదర, మధు కొల్లి, సురేష్ బొందుగుల, మధు బూదాటి, సాయి సుదర్శన్ లింగుట్ల, లవ కుమార్ ఐనంపూడి, శ్రీకాంత్ చుండూరి, రమణ రాకోతు, ఈ కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. నాట్స్ జాతీయ కార్యవర్గ సభ్యులు రామ్ నరేష్ కొమ్మనబోయిన, మురళి మేడిచెర్ల, బోర్డు సెక్రెటరీ శ్యామ్ నాళం, నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి (బాపు) నూతి, తదితరులు బాలల సంబరాల విజయవంతం చేసేలా కృషి చేశారు. వీరితో పాటు నాట్స్ సంబరాలు కల్చరల్ టీం సభ్యులు బిందు యలంచిలి, శ్రీదేవి జాగర్లమూడి, శ్రీదేవి వేదగిరి, ఓం నక్క, కిరణ్ తవ్వ , టి ఏ జి డి వి అధ్యక్షులు ముజీబుర్ రెహ్మాన్ షేక్, మాజీ అధ్యక్షులు కిరణ్ కొత్తపల్లి, తదితరులు పాల్గొని వారి తోడ్పాటుని అందించారు. స్థానికంగా ప్రసిద్దులైన ప్రముఖ సంగీత, నృత్య గురువులు శ్రీనివాస్ చాగంటి, అన్నపూర్ణ చాగంటి, భాస్కరి బుధవరపు, సింధు బుధవరపు, అంజని వేమగిరి, వల్లి పిల్లుట్ల, సునంద గంధం, ప్రత్యుష నాయర్, శ్రీదేవి ముంగర, చిన్మయి ముంగర, నిర్మల రాజ్, లావణ్య న్, శ్రీనిధి దండిభొట్ల, విద్య షాపుష్కర్, రఘు షాపుష్కర్, మల్లి చామర్తి, సురేష్ యలమంచి ఈ సంబరాల్లో న్యాయ నిర్ణేతలుగా వ్యపహరించారు. ఈ కార్యక్రమానికి ధాత్రి గంధం, శ్రీనిజ దండిభొట్ల, స్నేహ ఇంద్రకంటి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. బాలల సంబరాలను దిగ్విజయవంతంగా నిర్వహయించిన నాట్స్ ఫిలడెల్ఫియా చాప్టర్ కార్యవర్గ సభ్యులందరికి నాట్స్ సంబరాలు కన్వీనర్ శ్రీధర్ అప్పసాని ప్రత్యేక అభినందనలు తెలియ చేసారు. అమెరికాలో తెలుగు చిన్నారుల కోసం నాట్స్ ఫిలడెల్ఫియా విభాగం ఘనంగా నిర్వహించడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్ వుమన్ అరుణ గంటి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రాండ్ స్పాన్సర్ బావర్చి బిర్యానీస్, స్పాన్సర్స్ ఓపెరా టెక్నాలజీస్, లక్ష్మి మోపర్తి న్యూయార్క్ లైఫ్, డివైన్ ఐటీ సర్వీసెస్, లావణ్య & సురేష్ బొందుగుల, సాఫ్ట్ స్కూల్స్.కామ్ ఈ కార్యక్రమ నిర్వహణకు తమ సహాయాన్ని అందించాయి. -
ప్రారంభమైన తానా చైతన్య స్రవంతి సేవా కార్యక్రమాలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) చైతన్య స్రవంతి కార్యక్రమంలో భాగంగా తానా కార్యవర్గము.. అంజయ్య చౌదరి లావు నాయకత్వంలో పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా బెలుగుప్ప మండలం ఆవులెన్న గ్రామ ప్రజల నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి తానా నాయకత్వం22222222222 సహాయం చేసింది. తానా ఫౌండేషన్ ట్రస్టీ గుదే పురుషోత్తం చౌదరి తన మిత్రులతో కలిసి వాటర్ ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన 10 లక్షల రూపాయలు సమకూర్చారు. వాటర్ ప్లాంట్ నిర్మాణం పూర్తయిన సందర్భంగా తానా కార్యవర్గం స్థానిక శాసనసభ్యులు పయ్యావుల కేశవ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి మాట్లాడుతూ.. గ్రామ ప్రజల అవసరాలను పరిష్కరించడానికి ఎల్లవేళలా ముందుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు, తానా ఫౌండేషన్ ట్రస్టీ గుదె పురుషోత్తం చౌదరి, 23వ తానా మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి, తానా చైతన్య స్రవంతి కోఆర్డినేటర్ సునీల్ పంట్ర, రైతు కోసం కో చైర్ రఘు ఎద్దులపల్లి, వెంకట్ మాలపాటి, పీ.వీ.కే.కే కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుబ్బారావు, గ్రామ సర్పంచ్ రామ్మోహన్ అండ్ర, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు డెసెంబర్ 2, 2022 నుంచి జనవరి 7, 2023 వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనున్నారు. తదనంతరం తానా కార్యవర్గము కళ్యాణదుర్గం పట్టణంలోని జ్ఞాన భారతి విద్యాసంస్థల ఆవరణంలో జరిగిన తానా చేయూత కార్యక్రమంలో భాగంగా 35 మంది పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున పంపిణీ చేశారు. అంతేకాకుండా దాదాపు 1000 మందికి పైగా పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించారు. ఈ తానా చేయూత కార్యక్రమానికి తానా ఫౌండేషన్ ట్రస్టీ గుదె పురుషోత్తం చౌదరి తన తండ్రి గుదె వెంకటరామప్ప గారి జ్ఞాపకార్థం మూడు లక్షల, 50 వేల రూపాయలను 30 మంది విద్యార్థులకు సహాయంగా అందించారు. ఆర్థిక సహాయం అందుకున్న విద్యార్థులు, ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు, చైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ, ఫౌండేషన్ ట్రస్టీ గుదె పురుషోత్తం చౌదరి, తానా మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి, చైతన్య స్రవంతి కోఆర్డినేటర్ సునీల్ పంట్ర, జ్ఞాన భారతి విద్యాసంస్థల యాజమాన్యం రమేష్ బాబు మోదుపల్లికి తానా కార్యవర్గం ప్రత్యేకంగా అభినందించింది. తదనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు తరిమెళ్ళ రాజు నేతృత్వంలో కళాకారుల బృందం సభికులను అలరించారు. ఈ కార్యక్రమంలో జ్ఞాన భారతి విద్యాసంస్థల ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొని వీక్షకులకు కార్యక్రమానికి వన్నెలు దిద్దారు. -
టాంపా బే నాట్స్ ఫుడ్ డ్రైవ్కి చక్కటి స్పందన
అమెరికాలో భాషే రమ్యం.. సేవే గమ్యం అంటూ ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ప్లోరిడాలో నిర్వహించిన ఫుడ్ డ్రైవ్కు మంచి స్పందన లభించింది. ధ్యాంక్స్ గివింగ్ బ్యాక్లో భాగంగా టంపాబే నాట్స్ విభాగం చేపట్టిన ఫుడ్ డ్రైవ్లో నాట్స్ సభ్యులంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. నాట్స్ పిలుపుకు స్పందించి దాదాపు 20 కుటుంబాలు ఈ ఫుడ్ డ్రైవ్ ను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించాయి. తాజా పండ్లు, కూరగాయలు, వెన్న, పాలు, పాల ఉత్పత్తులు సేకరించారు. చిన్నారులు, మహిళలు అందరూ కలిసి ఈ ఫుడ్ డ్రైవ్లో పాల్గొని ఆహార ఉత్పత్తులను విరాళంగా అందించారు. 2500 పౌండ్ల ఆహారం ఈ కార్యక్రమంలో మొత్తం 2500 పౌండ్ల ఆహారాన్ని సేకరించి టంపాలోని పేద పిల్లల ఆకలి తీర్చే హోప్ చిల్డ్రన్స్ హోమ్కు విరాళంగా అందించారు. దాదాపు 70 మంది పిల్లలకు ఆహారం సరిపోతుందని హోప్ చిల్డ్రన్స్ హోమ్ నిర్వాహకులు తెలిపారు. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో శేఖర్ కోన, శివ చెన్నుపాటి, రాహుల్ చంద్ర గోనె, భాస్కర్ సోమంచి, అనిల్ అరెమండ, విజయ్ దలై, రమేష్ కొల్లి, ప్రసన్న కోట, రవి చౌదరి తదితరులు కీలక పాత్ర పోషించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డా. కొత్త శేఖరంతో పాటు మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండకు నాట్స్ టంపా బే విభాగం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. నాట్స్ బోర్డు వైస్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ బోర్డు డైరక్టర్ శ్రీనివాస్ మల్లాది, నాట్స్ వైస్ ప్రెసిడెంట్(ఫైనాన్స్/మార్కెటింగ్) భాను ధూళిపాళ్ల, ప్రోగ్రామ్ నేషనల్ కో ఆర్డినేటర్ రాజేష్ కాండ్రు, జాయింట్ ట్రెజరర్ సుధీర్ మిక్కిలినేని, ప్రసాద్ ఆరికట్ల, సలహా కమిటీ సభ్యులు సురేష్ బొజ్జా, చాప్టర్ కోఆర్డినేటర్ సుమంత్ రామినేని, జాయింట్ కో ఆర్డినేటర్ విజయ్ కట్ట, కోర్ టీమ్ కమిటీ టీం సభ్యులు నవీన్ మేడికొండ, హరి మండవ, భావన దొప్పలపూడి, భార్గవ్ మాధవరెడ్డి, శ్రీనివాస్ బైరెడ్డి, శిరీష దొడ్డపనేని ఇతర క్రియాశీల వాలంటీర్లు ఈ ఫుడ్ డ్రైవ్ విజయవంతం చేయడానికి కృషి చేశారు. పేద పిల్లల కోసం చేపట్టిన ఈ ఫుడ్ డ్రైవ్ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్ ఉమెన్ అరుణ గంటి, నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి(బాపు) నూతి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాట్స్ కార్యదర్శి రంజిత్ చాగంటి, కార్యనిర్వాహక మీడియా కార్యదర్శి మురళీకృష్ణ మేడిచెర్ల ఈ కార్యక్రమానికి తమ మద్దతు అందించారు. -
ఘనంగా కెనరా బ్యాంక్ 117వ వ్యవస్థాపక దినోత్సవం
బెంగళూరు: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ 117వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. బెంగళూరు ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్యాంక్ వ్యవస్థాపకుడు దివంగత అమ్మెంబళ్ సుబ్బారావు పాయ్కు ఘనంగా నివాళులర్పించారు. బ్యాంక్ 117 సంవత్సరాల సుధీర్ఘ ప్రయాణాన్ని విజవంతంగా పూర్తి చేసుకోవడంలో ఖాతాదారుల పాత్ర అమోఘమైందని బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఎల్వీ ప్రభాకర్ తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా క్యూర్ ఇంటర్నేషనల్ ఇండియా ట్రస్ట్కు ఆర్థిక చేయూతను అందించినట్లు తెలిపారు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ చిరంతనకు కూడా ఆర్థిక సాయాన్ని అందించినట్లు ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఉన్నతాధికారులు, పలు రాష్ట్రాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. చదవండి: ఈ కార్లకు యమ క్రేజ్, ‘మరో రెండేళ్లైనా వెయిట్ చేస్తాం..అదే కారు కావాల్సిందే’ -
క్రిస్మస్ కేక్ మిక్సింగ్ ఈవెంట్ (ఫొటోలు)
-
డల్లాస్లో నాట్స్ 5కే రన్/1కే ఫన్ వాక్
టెక్సాస్: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా డల్లాస్ లో 5కే రన్/1కే ఫన్ వాక్, ఫుడ్ డ్రైవ్ లను నిర్వహించింది. నాట్స్ డల్లాస్ విభాగం ప్రతి ఏటా గాంధీ జయంతి సందర్భంగా మన తెలుగువారిలో ఆరోగ్యంపై అవగాహన కలిగిస్తోంది. ఇందులో వారిని భాగస్వాములను చేసేందుకు ఈ కార్యకమాన్ని 2014 నుంచి నిర్వహిస్తూ వస్తుంది. డల్లాస్-ఫోర్టువర్తు మెట్రో చుట్టు పక్కల ప్రాంతాల నుంచి దాదాపు 100 మందికి పైగా ఈ రేసులో పాల్గొన్నారు. ఫిటెనెస్ కోసం పరుగులు పెట్టే వారంతా 5కె రన్లో పాల్గొంటే.. ఆరోగ్యం కోసం 1కే ఫన్లో సరదాగా నడస్తూ ఉత్సాహంగా పోటీ పడ్డారు. ఈ పరుగు పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి రేస్ బిబ్స్ ను అందించడం జరిగింది. దీని ఆధారంగా వారు 5K రన్ పూర్తి చేయటానికి తీసుకున్న సమయం, వారి వయోపరిమితి ఆధారంగా తీసుకోవడంతో పాటు మొదటి మూడు స్థానాలలో నిలిచిన వారిని విజేతలుకు పతకాలను అందించారు. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల ఈ రన్ విజయవంతం కావడానికి తన వంతు సహకారం అందించారు. నాట్స్ డల్లాస్ చాప్టర్ కార్యక్రమాలకి తమ సహాయ సహకారాలను అందిస్తున్న అందరికి చాప్టర్ కోఆర్డినేటర్ సత్య శ్రీరామినేని ధన్యవాదాలు తెలిపారు. స్వాగత్ బిర్యానీస్ ఇండియన్ క్యూసిన్, ఫార్మ్ 2 కుక్, హిండ్ సైట్, కోపెల్ చెస్ క్లబ్, వైకుంట్ డెవలపర్స్, క్లౌడ్ జెనిక్స్, ఏజ్నిక్స్ ఫార్మాస్యూటికల్స్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సాల్వేషన్ ఆర్మీ కోసం నాట్స్ ఫుడ్ డ్రైవ్ నాట్స్ ప్రతి ఏటా గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించే ఫుడ్ డ్రైవ్ కూడా డల్లాస్ నాట్స్ విభాగం ఈ 5కే రన్తో పాటు నిర్వహించింది. ఈ ఫుడ్ డ్రైవ్ కి కూడా మన తెలుగు వారి నుంచి విశేష స్పందన లభించింది. దీని ద్వారా విరాళంగా వచ్చిన ఆహారాన్ని డల్లాస్లోని స్థానిక సాల్వేషన్ ఆర్మీకి విరాళంగా అందించారు. డల్లాస్ టీం క్రీడా విభాగ నాయకులు గౌతం కాశిరెడ్డి, నాట్స్ డల్లాస్ చాప్టర్ కో-కోర్డినేటర్ రవి తాండ్ర, డల్లాస్ టీం సభ్యులు శ్రీథర్ న్యాలమడుగుల, రవీంద్ర చుండూరు, శ్రీనివాస్ ఉరవకొండ, త్రినాథ్ పెద్ది, యషిత, రేహాన్, సందీప్ తాతినేనితో పాటు ఇతర సభ్యులు ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. నాట్స్ డల్లాస్ విభాగం చేపట్టిన రన్, ఫుడ్ డ్రైవ్ కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా క్రీడా విభాగ సభ్యులకు నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి (బాపు) నూతి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
‘మన భాష, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుందాం’
మన భాష, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవటం తెలుగు వారిగా మన గౌరవాన్ని మరింత ఇనుమడింపజేస్తుందని భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. ఈ దిశగా తెలుగు వారంతా చొరవ తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం మలేషియా, సింగపూర్ పర్యటనల్లో ఉన్న ఆయన, మలేషియా తెలుగు సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మలేషియాలోని తెలుగు సంతతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. 41 ఏళ్ళ క్రితం రెండవ ప్రపంచ తెలుగు మహాసభలకు, నాటి విద్యాశాఖ మంత్రి మండలి వెంకట కృష్ణారావు ఆహ్వానం మేరకు మిత్రులు జైపాల్ రెడ్డితో కలిసి వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రతి సంస్కృతిలో జీవన విధానం, విశ్వాసాలు భాగంగా ఉంటాయన్న ఆయన, ఈ రెండు కాలగమనంలో పురోగమించాలే తప్ప, తిరోగమించరాదని సూచించారు. ఇటీవల తమ చెన్నై పర్యటనలో భాగంగా ఉన్నతమైన కుటుంబ విలువలకు చిరునామాగా నిలిచిన బటర్ ఫ్లై గ్రూప్ అధినేత మురుగేశన్ చెట్టియార్ గృహాన్ని సందర్శించారని అన్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ ఇంటిలో 65 మంది కలిసి ఉమ్మడి కుటుంబంగా జీవించడం గొప్పవిషయమని తెలిపారు. ఇలాంటి విలువలను ముందు తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో తమ కుమార్తె, మనుమడిని కూడా వారి ఇంటికి తీసుకువెళ్ళినట్లు తెలిపారు. ఈ స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. భాష మన సంస్కృతికి జీవనాడి అన్న ఆయన, ఉన్నతమైన సంస్కృతి... ఉన్నతమైన సమాజానికి బాటలు వేస్తుందని, భాష ద్వారా సంస్కృతి, సంస్కృతి ద్వారా సమాజం శక్తివంతమౌతాయని పేర్కొన్నారు. భారత్, మలేషియా మధ్య చక్కని బంధం ఏర్పడటంలో ప్రవాస భారతీయుల పాత్ర కీలకమన్నారు. ఈ నేపథ్యంలో 1960ల నుంచి మలేషియా తెలుగు సంఘం పోషిస్తున్న పాత్రను అభినందించిన ఆయన, తెలుగు సాంస్కృతిక వారసత్వం, భాషను పరిరక్షించుకునేందుకు ప్రారంభమైన మలేషియా తెలుగు సంఘం, పేర్లు మార్చుకున్నా ప్రాథాన్యతలను మార్చుకోకుండా అదే స్ఫూర్తితో పని చేస్తుండటం ఆనందదాయకమన్నారు. మలేషియాలోని ఇతర ప్రజల మధ్య సామరస్యంగా జీవించటంలో, బహుళ జాతుల మధ్య తెలుగు సంఘం గౌరవం, గుర్తింపును నిలబెట్టడానికి వారు చేసిన కృషి అభినందనీయమని తెలిపారు. ఇదే స్పూర్తి భవిష్యత్ లోనూ కొనసాగాలని ఆకాంక్షించారు. -
‘ది ఘోస్ట్’ మూవీ ట్రైలర్ లాంచ్ వేడుక (ఫొటోలు)
-
కన్నీళ్లు తెప్పించే ఘటన.. ‘సినీ గాడ్ఫాదర్’ను కళ్లారా చూడాలని.. ఇంతలోనే
అనంతపురం సప్తగిరి సర్కిల్: మెగాస్టార్ చిరంజీవి అంటే నిలువెల్లా ఆ యువకుడికి అభిమానం. కళ్లారా చూడాలన్న తాపత్రయం. సినీ గాడ్ఫాదర్ను హైదరాబాద్ వెళ్లి చూసే అవకాశం ఎలాగూ ఉండదు. బుధవారం అనంతపురం వస్తున్నారని తెలిసి.. మిత్రుడిని వెంటబెట్టుకొని గుత్తి నుంచి ద్విచక్ర వాహనంపై ఆత్రంగా బయల్దేరాడు. మరో పదినిమిషాల్లో సభా ప్రాంగణానికి చేరుకుంటాడు. అంతలోనే గార్లదిన్నె వద్ద మృత్యువు అతన్ని ప్రమాద రూపంలో కబళించింది. చదవండి: గాడ్ఫాదర్ ఈవెంట్.. ఎస్పీకి ఫిర్యాదులు.. అసలు ఏం జరిగిందంటే? అయితేనేం అభిమానం “చిరంజీవి’గా వెలుగునివ్వాలని అతని కుటుంబ సభ్యులు భావించారు. నేత్రాలను దానం చేస్తే.. మరో ఇద్దరి జీవితాల్లో వెలుగునిస్తాడని భావించారు. అనుకున్నదే తడవుగా నేత్రాలను దానం చేశారు. గుత్తి పట్టణానికి చెందిన రాజశేఖర్ (22) కళ్లను అతని కుటుంబ సభ్యులు సాయిట్రస్ట్ ఆధ్వర్యంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి ద్వారా నేత్రాలను గురువారం సేకరించారు. కళ్లను సేకరించిన వారిలో సాయిట్రస్ట్ సభ్యులు విజయసాయి, నారాయణ, ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి టెక్నీషియన్ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
గాడ్ఫాదర్ ఈవెంట్.. ఎస్పీకి ఫిర్యాదులు.. అసలు ఏం జరిగిందంటే?
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: నగరంలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో బుధవారం జరిగిన గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో జేబు దొంగలు రెచ్చిపోయారు. కేవలం గంట వ్యవధిలోనే 300 సెల్ఫోన్లను అపహరించారు. దీంతో ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చాట్బాట్ సేవలకు 24 గంటల వ్యవధిలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. చదవండి: కట్టుకున్నవాడు ఖతం.. ప్రియుడు, కూతురితో కలిసి.. దాదాపు 270 మందికి పైగా తమ సెల్ఫోన్లు అపహరణకు గురైనట్లు చాట్బాట్కు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు. అలాగే అనంతపురం త్రీటౌన్ పోలీసు స్టేషన్కు 20, టూటౌన్ పోలీసు స్టేషన్కు 18 రాతపూర్వక ఫిర్యాదులు అందాయి. -
అనంతపురం: విషాదాన్ని మిగిల్చిన ‘గాడ్ ఫాదర్’
గార్లదిన్నె(అనంతపురం జిల్లా): అనంతపురం వేదికగా బుధవారం నిర్వహించిన ‘గాడ్ఫాదర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ విషాదాన్ని మిగిల్చింది. తమ అభిమాన హీరోని చూడాలన్న ఆత్రుత ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. వివరాలు.. గుత్తి మండలం చెర్లోపల్లికి చెందిన రాజశేఖర్(23), అభిరామ్ స్నేహితులు. వీరికి చిరంజీవి అంటే చెప్పలేనంత అభిమానం. చదవండి: కేబుల్ బ్రిడ్డి వద్ద టెన్షన్.. దుర్గం చెరువులో దూకి యువతి ఆత్మహత్య! దీంతో అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరుగుతున్న గాడ్ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి బుధవారం ఉదయం ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. గార్లదిన్నె మండలం తలగాచిపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై కుక్క అడ్డు రావడంతో వేగాన్ని నియంత్రించుకోలేక అదుపు తప్పి కిందపడ్డారు. రాజశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్వల్పంగా గాయపడ్డ అభిరామ్ను స్థానికులు వెంటనే అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై గార్లదిన్నె పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. తొక్కిసలాటలో గాయపడ్డ యువతి అనంతపురం శ్రీకంఠంసర్కిల్: స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిర్వహించిన గాడ్ఫాదర్ ఈవెంట్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. భారీగా అభిమానులు తరలిరావడంతో మైదానం కిక్కిరిసింది. అభిమాన హీరోని చూడాలనే ఆత్రుత కారణంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో అనంతపురంలోని రహమత్నగర్కు చెందిన అఖిల అనే యువతి తీవ్రంగా గాయపడింది. పోలీసులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. -
‘ఆమె కూల్గా కనిపించినా, షూటింగ్ స్పాట్లో మాత్రం ఫైర్’
ప్రముఖ నృత్య దర్శకురాలుగా రాణిస్తున్న బృంద మాస్టర్ ఇటీవలే మెగాఫోన్ పట్టి హే సినామికా అనే చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్, నటి ఇలా, అతిథి రావ్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన వైవిధ్య భరిత ప్రేమ కథా చిత్రంతో బృందా మాస్టర్ దర్శకురాలిగా మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఈమె కుమరి మావట్టత్తిన్ దగ్స్ పేరుతో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే ఇది ఆమె తొలి చిత్రానికి పూర్తిగా భిన్నమైన కథ, కథనాలతో ఉండటం విశేషం. కమర్షియల్ అంశాలతో కూడిన పూర్తి యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రంగా కుమరి మావట్టత్తిన్ దగ్స్ చిత్రాన్ని బృందా మాస్టర్ తెరకెక్కించారు. హెచ్ ఆర్ పిక్చర్స్ పతాకంపై రియా శిబు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా హ్రిదు హారన్ కథానాయకుడుగా పరిచయం అవుతున్నారు. ఈయన ఇంతకుముందే బాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కాగా నటి అన స్వరాజన్, సింహ, ఆర్కే సురేష్, మునీశ్కాంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సేమ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా కుమరి మావట్టత్తిన్ దగ్స్ చిత్ర పరిచయ కార్యక్రమాన్ని బుధవారం రాత్రి చెన్నైలోని సత్యం థియేటర్లో నిర్వహించారు. ఇందులో చిత్ర యూనిట్తో పాటు నటి కుష్భు, దర్శకుడు కె.భాగ్యరాజ్, గౌతమ్ మీనన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటి కుష్బు మాట్లాడుతూ బృంద తనకు బెస్ట్ ఫ్రెండ్ అని పేర్కొన్నారు. ఆమె చూడ్డానికి కూల్గా కనిపించినా, షూటింగ్ స్పాట్లో మాత్రం ఫైర్గా ఉంటారని పేర్కొన్నారు. అలాంటి ఆమె యాక్షన్ కథాంశంతో కూడిన ఈ చిత్రాన్ని చేయడంలో ఆశ్చర్య పడాల్సిన పని లేదన్నారు. ఈ చిత్రాన్ని తాను చశానని కచ్చితంగా ఇది సంచలన విజయం సాధిస్తుందని అన్నారు. త్వరలో చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించి నవంబర్ నెలలో చిత్రాన్ని తమిళం, తెలుగు, కన్నడం, హిందీ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. -
వైట్ హౌస్లో సందడి చేసిన బరాక్ ఒబామా దంపతులు
వాషింగ్టన్: బరాక్ ఒబామా, మిచెల్ ఒబామా అమెరికా వైట్ హౌస్కి తిరిగి రావడంతో గత పరిపాలన వైభవం కళ్లముందు కదలాడింది. నాటి రోజులను స్మృతి పథంలోకి తెచ్చుకుంటూ వెనుకకు వెళ్లే అరుదైన క్షణం ఇది. వాస్తవానికి బరాక్ ఒబామా దంపతులు 2017లో వైట్ హౌస్ని విడిచిపెట్టిన తదనతరం మళ్లీ తమ అధికారిక పోర్ట్రెయిట్ల(చిత్రపటాల) ఆవిష్కరణ కోసం తొలిసారిగా వైట్హౌస్కి తిరిగి వచ్చారు. ఇది అమెరికా వైట్ హౌస్ సంప్రదాయ వేడుక. 2012లో చివరిగా జరుపుకున్న సంప్రదాయాన్ని మళ్లీ అందరికీ తిరిగి గుర్తు చేసేలా చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఈ మేరకు జో బైడెన్ ఈ పోర్ట్రెయిట్ ఆవిష్కరణ వేడుక కోసం బరాక్ ఒబామా దంపతులకు వైట్హౌస్లో ఆతిథ్యం ఇచ్చారు. ఈ వేడుకలో జో బైడెన్ భార్య జిల్ బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ పాల్గొన్నారు. ఈ వేడుకతో అమెరికా ప్రజలకు బరాక్ ఒబామా దంపతులు మరింత చేరవయ్యారని బైడెన్ అన్నారు. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారితో సతమతమవుతుండటంతో వైట్ హౌస్లో ఈవెంట్లను జరపడం కోసం చాలా కాలంగా నిరీక్షించామని జిల్ బైడెన్ అన్నారు. అంతేకాదు ఈ పవిత్రస్థలంలో వారి చిత్ర పటాలను గోడలకు వేలాడదీయడంతో అధికారంలోకి రానున్న తరాల వారికి స్ఫూర్తిగానే గాకుండా గత స్మృతులు కళ్లముందు మెదిలాడి సవాళ్లును ఎదర్కొనే ధ్యైర్యాన్ని ఇస్తాయన్నారు జిల్ బైడెన్. ఈ పోర్ట్రెయిట్ ఆవిష్కరణ సంప్రదాయం 1965 నుంచి అసోసియేషన్ చేపట్టింది. తొలిసారిగా ఈ పోర్ట్రెయిట్లను చిత్రించిన కళాకారుల పేర్లును కూడా వెల్లడించారు. ఒబామా చిత్రపటాన్ని రాబర్ట్ మెక్కర్డీ, మిచెల్ ఒబామా చిత్రపటాన్ని షారన్ స్ప్రంగ్ చిత్రించారు. ఈ సందర్భంగా ఒబామా మాట్లాడుతూ.. జో బిడెన్ అధ్యక్షుడిగా ఉండటం అమెరికా అదృష్టమని ప్రశంసించారు. ఒబామా తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వైస్ ప్రెసిడెంట్గా బైడెన్ తనకు ఎన్నో సలహాలు, సూచలను అందించిన విషయాలను గుర్తు చేసుకున్నారు. ఎన్నో విపత్కర సమయాల్లో బైడెన్ తనకు చక్కటి మార్గ నిర్దేశం చేశారని అన్నారు. అలాగే ఈ చిత్రపటాలను చిత్రించిన కళాకారులను సైతం మెచ్చుకోవడమే కాకుండా వారి పనితీరుని కూడా ఎంతగానో ప్రశంసించారు. తన దృష్టిలో ఈ పోర్ట్రెయిట్లకు మరింత ప్రాముఖ్యత ఉందని, అవి జార్ట్, మార్తా, వంటి నాటి మహోన్నత అధ్యక్షుల చిత్రాల సమక్షంలో తమ చిత్రాలు ఉండటం గొప్ప గౌరవంగా భావిస్తున్నాని ఒబామా చెప్పారు. I want to thank Robert McCurdy for his extraordinary work on my portrait. Robert is known for his paintings of public figures, and I love how he paints people exactly the way they are. Take a look at the process behind creating the official White House portraits: pic.twitter.com/oZb6ov4uwr — Barack Obama (@BarackObama) September 7, 2022 (చదవండి: స్వీట్ బాక్స్లో ఏకంగా రూ.54 లక్షలు) -
క్రమశిక్షణ, అంకితభావంకు సంగీతం తోడైతే ఘంటసాల: చంద్రబోస్
అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకుడు, స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకలు సందర్భంగా ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదం ఊపందుకున్న విషయం విదితమే. శంకర నేత్రాలయ యూఎస్ఏ అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో పలు టీవీ చర్చ కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇందులో భాగంగా ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ పాల్గొన్న ఈ ప్రత్యేక కార్యక్రమం, 10 మంది సహ నిర్వాహకులు కలిసి ప్రపంచ వ్యాప్తంగా 100 మంది పైగా గాయకులు / గాయనీమణులతో ఘంటసాల శత గళార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటి రెండు భాగాల్ని 21, 28 ఆగస్టు నాడు ప్రసారం చేయగా అనూహ్యమైన స్పందన వచ్చిందని, 4 సెప్టెంబర్ నాడు మూడవ భాగం ప్రసారం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. చంద్రబోస్ మాట్లాడుతూ.. మాస్టార్కి భారతరత్న కోసం ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఘంటసాల గురించి చెప్పే అర్హత గాని, అనుభవం కానీ తనకు చాలదని ఆయితే ఆయనపైన తనకున్న అపారగౌరవంతో కొన్ని విషయాలను పంచుకున్నారు. మాస్టార్ పాటలు పాడకముందు జాతీయోద్యమంలో పాల్గొన్నారని, ఓ సందర్భంలో జైలు జీవితం కూడా గడిపినట్లు తెలిపారు. నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ, అంకితభావంకు సంగీతం తోడైతే అది ఘంటసాల మాస్టారని కొనియాడారు. 1944 వరకు పాత్రధారులే వారి వారి పాత్రలకు పాటలు పాడేవారని.. మొట్టమొదటి నేపధ్య గాయకుడు ఎమ్మెస్ రామారావు అయితే, వారి తరువాత 1945లో స్వర్గసీమ చిత్రంతో మొదలుపెట్టి - 1974 వరకు అలా అప్రతిహతంగా మాస్టారు ప్రయాణం సాగిందని చెప్పారు. శారద ఆకునూరి (హ్యూస్టన్, USA) బృందం, ఫణి డొక్కా (అట్లాంటా, USA) బృందం, డాక్టర్ రెడ్డి ఉరిమిండి (డల్లాస్, USA) బృందం ఈ కార్యక్రమంలో ఘంటసాల పాటలు పాడి, చక్కటి వ్యాఖ్యానంతో ఆయనను స్మరించుకున్నారు. వీరితో పాటు మరికొందరు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చక్కని పాటలతో అందరిని అలరించారు. శతగళార్చన చివరి భాగంలో ముఖ్య అతిథిగా అనంత శ్రీరామ పాల్గొంటారని నిర్వాహకులు తెలియజేశారు. శతగళార్చనకు ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోందని చాలా మంది ప్రముఖులు "ఘంటసాలకి భారతరత్న" విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నారని నిర్వాహకులు తెలియజేశారు. -
'గుడ్బై' మూవీ ట్రైలర్ లాంచ్ వేడుక (ఫొటోలు)
-
నెరవేరని ఆకాంక్షలు.. ఆగని ఆక్రోశం
సాక్షి, హైదరాబాద్: ‘దేశంలో పేదల ఆకాంక్షలు నెరవేరని పరిస్థితులు ఇంకా మనకు కనబడుతున్నాయి. బడుగు వర్గాల ప్రజల ఆక్రోశం ఇంకా వినిపిస్తూనే ఉంది. అనేక వర్గాల ప్రజల్లో తమకు స్వాతంత్య్ర ఫలాలు సంపూర్ణంగా అందలేదన్న ఆవేదన ఉంది. వీటన్నింటినీ విస్మరించి దేశాన్ని ఒక ఉన్మాద స్థితిలోకి నెట్టివేసేందుకు కుశ్చితమైన కుటిల ప్రయత్నాలు జరగడాన్ని మనం కళ్లారా చూస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చెప్పారు. ‘ఇవన్నీ చూస్తూ మౌనం వహించడం కరెక్ట్ కాదు.. అర్థమైన తర్వాత కూడా అర్ధం కానట్టు ప్రవర్తించడం మేధావుల లక్షణం కాదు..’ అని ఆయన పేర్కొన్నారు. ధీరోదాత్తులు, మేధావులు, వైతాళికులు కరదీపికలుగా మారి ఏ సమాజాన్నైతే సక్రమమైన మార్గంలో నడిపిస్తారో.. ఆ సమాజం గొప్పగా పురోగమిస్తుందని స్పష్టం చేశారు. అద్భుతమైన ప్రకృతి, ఖనిజ సంపదలు, ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి యువశక్తి, మానవ సంపత్తి కలిగి ఉన్న మన దేశం పురోగమించాల్సినంతగా పురోగమించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్య్రం లభించి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆగస్టు 8 నుంచి 22 వరకు 15 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభ వేడుకను నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి ప్రసంగించారు. స్వతంత్ర భారత స్ఫూర్తిని ఈ తరం పిల్లలకు, యువకులకు, తెలియనివారికి విస్తృతంగా తెలియపర్చాలన్న సదుద్దేశంతో 15 రోజుల పాటు ఈ విధంగా కార్యక్రమాలు పెట్టుకున్నామని తెలిపారు. కరోనా లాంటి విష వాయువులు వస్తూపోతూ ఉంటాయి ‘సంవత్సర కాలంగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ వస్తున్నప్పటికీ..ఈ ముగింపు ఉత్సవాలను 15 ఆగస్టుకు ముందు, తర్వాత కూడా జరపాలనుకుని, చాలా గొప్పగా జరుపుకున్నాం. ఈ ప్రయత్నమంతా ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కరోనా మహమ్మారి లాంటి కొన్ని విష వాయువులు (దేశంలోని వర్తమాన రాజకీయాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ) వస్తూ పోతూ ఉంటాయి. స్వాతంత్య్రపు ఉజ్వలత్వం, 75 ఏళ్లుగా జరుగుతున్న విషయాలను మరొక్కమారు సింహావలోకనం చేసుకుని, ముందుకు పురోగమించాల్సిన పద్ధతుల గురించి ఆలోచించాల్సిన అవసరం యువకులకు, మేధావులకు, ఆలోచనపరులకు, ప్రజలందరికీ ఉంది..’ అని సీఎం అన్నారు మహాత్ముడి గురించి ఈ తరం పిల్లలకు తెలియాలి ‘విశ్వజనీనమైన సిద్ధాంతాన్ని, ఆహింసా వాదాన్ని, ఎంతటి శక్తిశాలులైనా సరే శాంతియుత ఉద్యమాలతో జయించవచ్చని ప్రపంచ మానవాళికి సందేశం ఇచ్చిన మహాత్ముడు పుట్టిన గడ్డ మన భారతావని. అలాంటి దేశంలో మహాత్మాగాంధీ గురించి, ఆయన ఆచరణ గురించి, స్వాతంత్య్ర పోరాటంలో ఆయన పోషించిన ఉజ్వలమైన పాత్రగురించి ఈ తరం పిల్లలకు తెలియాల్సిన అవసరం ఉంది. స్వాతంత్య్రం ఊరికే రాలేదు. ఎన్నో త్యాగాలు, ప్రాణ, ఆస్తి త్యాగాలు, ఎన్నో బలిదానాలు జరిగితే వచ్చింది. స్వేచ్ఛా భారతంలో మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నం. ఎందరో మహానీయులు త్యాగాలు చేశారు. మనందరి పక్షాన వారందరికీ శిరస్సు వంచి జోహార్లు, ఘనమైన నివాళి అర్పిస్తున్నా. స్ఫూర్తి రగిల్చేలా..చర్చ చెలరేగేలా.. ఆ స్ఫూర్తితో ఈ దేశాన్ని కులం.. మతం.. జాతి అనే భేదం లేకుండా, పేద.. ధనిక తేడా లేకుండా అందరినీ కలుపుకొని ఒక ఉజ్వలమైన రీతిలో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నేటి తరం బిడ్డలుగా మనందరిపైనా ఉంది. అటువంటి స్ఫూర్తి రగిల్చేందుకే రకరకాల కార్యక్రమాలకు రూపకల్పన జరిగింది. చెట్లు నాటడం, ఆటలు, వ్యాసరచన పోటీలు..ఇలాంటివన్నీ ఎందుకు? ఏ సందర్భంలో జరుపుకుంటున్నాం? అని గ్రామ గ్రామాన, ప్రతి పట్టణంలో చర్చ చెలరేగాలని, తద్వారా ప్రతి ఇంట్లో స్వాతంత్య్రం గురించి, ఆనాటి త్యాగాల గురించి స్ఫురణకు తెచ్చే సన్నివేశాలు రావాలని.. ఈ విధంగా 15 రోజుల పాటు కార్యక్రమాల్ని పెట్టుకున్నాం’ అని ముఖ్యమంత్రి చెప్పారు. కొందరు అల్పులు గాంధీ గురించి నీచంగా మాట్లాడుతున్నారు... ‘సామూహిక జాతీయ గీతాలపన, పిల్లలకు గాంధీ సినిమాను ప్రదర్శించడం నాకు అన్నింటి కంటే బాగా నచ్చిన రెండు ఉదాత్తమైన విషయాలు. సుమారు కోటి మంది ప్రజలు జాతీయ గీతాన్ని ఏకకాలంలో ఆలపించడం రాష్ట్రానికే గర్వకారణం. మన జాతీయ స్ఫూర్తికి, భావానికి అది అద్దం పట్టింది. మహాత్ముడు విశ్వమానవుడు. అద్భుతమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి. ఆయన గురించి కొందరు అల్పులు నీచంగా మాట్లాడవచ్చు. కానీ ఆయన అంతటి మహాత్ముడు మరో 1000 ఏళ్లలో ఈ నేల మీద జన్మించడని ఐక్యరాజ్య సమితి ఘంటాపథంగా చెప్పిన విషయం మనందరికీ తెలుసు. మనం ఏ దేశానికి వెళ్లినా గాంధీ పుట్టిన దేశం నుంచి వచ్చామని చాలా దేశాల ప్రజలు పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటారు. అనేక దేశాలు గాంధీ లైబ్రరీలు నిర్వహించడం, ఆయన జీవిత విశేషాలు తెలియజేయడం, విగ్రహాలు ఏర్పాటు చేయడం మన దేశానికి గర్వకారణం. గాంధీ మార్గంలో పురోగమించేందుకు ఆలోచన చేయాలి గాంధీ సినిమాను 22 లక్షల మంది పిల్లలు చూశారంటే అందులో 10 శాతం మంది ఆయన్నుంచి స్ఫూర్తి పొందినా, ఈ దేశం బాగా పురోగమించడానికి వారి శక్తిసామర్థ్యాలు వినియోగిస్తారని బలంగా నమ్ముతున్నా. భవిష్యత్తులో గాంధీ మార్గంలో దేశం ఏ విధంగా పురోగమించాలో మనమందరం ఆలోచన చేయాలి. గాంధీ బాటలోనే, ఆయన సూచించిన ఆహింసా సిద్ధాంతంతోనే తెలంగాణ రాష్ట్రం సాధించుకుని మనం ఏ విధంగా పురోగమిస్తున్నామో మనందరికీ తెలుసు..’ అని కేసీఆర్ పేర్కొన్నారు. వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించినందుకు కేశవరావు కమిటీ సభ్యులకు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. -
సింగపూర్లో ఘనంగా శ్రీగురు కళాంజలి కార్యక్రమం
సింగపూర్లో "స్వర లయ ఆర్ట్స్ " సంస్థ ఆగష్టు 14వ తేదీ సాయంత్రం శ్రీ గురు కళాంజలి కార్యక్రమ మొదటి భాగాన్ని యుమీ గ్రీన్ హాల్ నుంచి యూట్యూబ్, ఫేస్ బుక్ లైవ్ ద్వారా అద్వితీయంగా నిర్వహించారు. స్వర లయ ఆర్ట్స్ విద్యార్థులైన చిన్నారులు బొమ్మకంటి అనన్య, షణ్మిత తంగప్పన్లు ప్రార్ధనాగీతంతో ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. పప్పు పద్మా రవిశంకర్ (ఆల్ ఇండియా రేడియో, విశాఖపట్నం A గ్రేడ్ ఆర్టిస్ట్ ) తమ వీణావాదనతో అందర్నీ మంత్రముగ్ధుల్ని చేయగా వారి తనయులు పప్పు జ్ఞానదేవ్ వయోలిన్, పప్పు జయదేవ్ మృదంగ సహకారంతో సాగిన సంగీతఝరి మరింత రక్తి కట్టింది. అనంతరం స్వర లయ ఆర్ట్స్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు యడవల్లి శేషు కుమారి కళాకారులతో వారి గురు పరంపర, వారి గురువుల విద్యాబోధనా విధానాల గురించి ఇంటర్వ్యూ రూపంలో చర్చించడం ఈ కార్యక్రమం ప్రత్యేకత. ఈ సందర్భంగా యడవల్లి శేషు కుమారి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో కళాకారుల ప్రదర్శనలతో పాటు, వారి గురువుల కళావిశిష్టత, వైవిధ్యం మున్నగు అంశాలపై చర్చలతో విజ్ఞానవంతముగా ముందుతరాలకు ఉపయుక్తంగా రూపొందించబడింది. ఈ శీర్షికలో సమర్పించనున్న కార్యక్రమాలలో ఇది మొదటిభాగమని పేర్కొన్నారు. ప్రత్యేక అతిధిగా సంగీత సుధానిది గుమ్ములూరి శారద సుబ్రహ్మణ్యం కళాకారులకు అభినందనలు తెలిపారు. శ్రీ గురు కళాంజలి ప్రోగ్రాం గురువుల గూర్చి ఎన్నో విషయాలను తెలుసుకునే విధంగా ఉందని మరిన్ని కార్యక్రమాలు చెయ్యాలని సంస్థకు ఆశీస్సులను అందించారు.ఈ కార్యక్రమానికి కవుటూరు లలితా రత్నకుమార్, సౌభాగ్యలక్ష్మి రాజశేఖర్, విద్యాధరి , రాధిక నడదూరు మున్నగు ప్రముఖులు, స్నేహితులు విచ్చేసి హర్షం తెలియజేశారు. బొమ్మకంటి సౌజన్య పరిచయ కర్తగా వ్యవహరించారు. -
ట్యాంక్ బండ్ పై మళ్లీ సన్డే ఫన్డే సంబరాలు (ఫోటోలు)
-
‘ది వారియర్’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
నైజీరియా చర్చిలో తొక్కిసలాట.. 31 మంది మృతి
అబూజా: నైజీరియాలోని రివర్స్ రాష్ట్రం హర్కోర్ట్ నగరంలోని ఓ చర్చిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో చిన్నారులతో సహా 31 మంది ప్రాణాలు కోల్పోగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని కింగ్స్ అసెంబ్లీ పెంటెకొస్టల్ చర్చిలో శనివారం ఉదయం 9 గంటలకు పేదలకు పలు వస్తువులను ఉచితంగా అందజేస్తామంటూ నిర్వాహకులు ప్రకటించారు. దీంతో, ఉదయం 5 గంటలకే భారీ సంఖ్యలో జనం చర్చి వద్ద క్యూ కట్టారు. రద్దీ పెరిగి, చర్చిగేట్లు విరగ్గొట్టారు. ఇది తొక్కిసలాటకు దారితీసి 31 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. నిర్వాహకులు ఉచిత పంపిణీని రద్దు చేశారు. చదవండి: టెక్సాస్ నరమేధం పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు -
హైదరాబాద్: రెండో రోజు వింగ్స్ ఇండియా ఎయిర్ షో
-
ముంబైలో 'రాధే శ్యామ్' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)