Fahad Fazil
-
ఓకే ఏడాదిలో నాలుగు సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ!
ఓటీటీ వచ్చాక థియేటర్లకు ప్రేక్షకుల పరుగులు తగ్గిపోయాయి. వెండితెర ప్రదర్శనలు వారాలకే పరిమితమయ్యాయి. ఎంత పెద్ద హీరో సినిమా అయినా.. సినిమా ఎంత బాగున్నా సరే యాభై రోజుల లోపు స్మార్ట్ తెరకు తేవాల్సిందే. అందుకే బెనిఫిట్ షోలు.. అడ్డగోలుగా పెంచుతున్న టికెట్ రేట్లతో సినిమాలకు కలెక్షన్లు రాబడుతున్న రోజులివి. అయినా అనుకున్న ఫిగర్ను రీచ్ కాలేకపోతున్నారు కొందరు నిర్మాతలు. కానీ, కళ్లు చెదిరేరీతిలో కలెక్షన్లతో.. ఈ ఏడాది టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది మలయాళ చిత్ర పరిశ్రమ. వాస్తవికతతో పాటు ఆహ్లాదకరమైన కథలను అందించే చిత్ర పరిశ్రమగా పేరున్న మాలీవుడ్కు పేరు దక్కింది. అంతర్జాతీయంగానూ ఆ చిత్రాలకు అంతే గుర్తింపు దక్కుతోంది. కానీ, ఇదే పరిశ్రమకు వంద కోట్ల చిత్రం ఒక కలగానే ఉండేది. లిమిట్ బడ్జెట్, దానికి తగ్గట్లుగా తెరకెక్కే చిత్రం.. అదే స్థాయిలో కలెక్షన్లు రాబట్టేది మలయాళ సినిమా. ఫలితంగా రూ.20.. 30 కోట్ల కలెక్షన్లు రావడమే కష్టంగా ఉండేది. అయితే.. మలయాళం సినిమా మొదలైన 85 ఏళ్లకు(1928లో తొలి చిత్రం రిలీజ్..).. హాఫ్ సెంచరీ క్లబ్లోకి ‘దృశ్యం’(2013) రూపంలో ఓ చిత్రం అడుగుపెట్టింది. ఆ తర్వాత మరో మూడేళ్లకు ‘పులిమురుగన్’ సెంచరీ క్లబ్కి అడుగుపెట్టిన తొలి మల్లు చిత్ర ఘనత దక్కించుకుంది. అలాంటి సినీ పరిశ్రమ ఇప్పుడు.. 2024 ఏడాదిలో ఏకంగా నాలుగు సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ బాది ట్రేడ్ పండితులనే ఆశ్చర్యపోయేలా చేసింది.ఈ ఏడాది విడుదలైన మలయాళ చిత్రాల్లో ఐదు సినిమాలు కలెక్షన్లపరంగా అద్భుతం సృష్టించాయి. అందులో మొదటిది.. మంజుమ్మల్ బాయ్స్. కేరళ-తమిళనాడు సరిహద్దులోని మిస్టరీ గుహల్లో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన చిత్రమిది. కేరళలో మాత్రమే కాదు.. తమిళనాట సైతం ఈ చిత్రం సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. కమల్ హాసన్ ‘గుణ’ లోని పాట.. మంజుమ్మల్ బాయ్స్ బ్యాక్డ్రాప్కే హైలైట్. టోటల్ రన్లో ఏకంగా డబుల్ సెంచరీ(రూ.240 కోట్ల వసూళ్లు) రాబట్టి.. ఆ భాషలో కలెక్షన్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.ది గోట్ లైఫ్ (ఆడుజీవితం)పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రాణం పెట్టి నటించిన సినిమా. విడుదలకు ముందే అంతర్జాతీయ వేదికల్లోనూ ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఎడారి దేశంలో ఓ వలసజీవి ఎదుర్కొనే అవస్థలే ఈ చిత్ర కథాంశం. నజీబ్ అనే వ్యక్తి వాస్తవ గాథను బెన్యామిన్ ‘ఆడుజీవితం’గా నవల రూపకంలోకి తీసుకెళ్తే.. దానిని రచయిత కమ్ దర్శకుడు బ్లెస్సీ వెండితెరపైకి తేవడానికి 16 ఏళ్లు పట్టింది. కలెక్షన్లపరంగా 150 కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. అవార్డులను సైతం కొల్లగొట్టింది.ఆవేశం ఫహద్ ఫాజిల్ వన్ మేన్ షో. ముగ్గురు కాలేజీ యువకులకు, ఎమోషనల్ గ్యాంగ్స్టర్ రంగా మధ్య నడిచే కథ ఇది. మలయాళంలో జీతూ మాధవన్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం ఏకంగా 156 కోట్లు రాబట్టింది ఈ చిత్రం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల్లో రీల్స్ ద్వారా ఈ చిత్రం మరింత ఫేమస్ అయ్యింది.ఏఆర్ఎం(అజయంతే రంధం మోషణం)మిన్నల్ మురళితో తెలుగువారిని సుపరిచితుడైన టోవినోథామస్ లీడ్లో తెరకెక్కిన చిత్రం. ఓ వంశంలో మూడు తరాలకు.. ఓ విగ్రహ నేపథ్యంతో నడిచే కథ ఇది. జితిన్లాల్ ఈ యాక్షన్ థిల్లర్ను తెరకెక్కించారు. ఫుల్ రన్లో వంద కోట్లు రాబట్టింది ఈ చిత్రం.ప్రేమలుమలయాళంలో చిన్నచిత్రంగా వచ్చి.. కలెక్షన్లపరంగా అద్భుతం సృష్టించింది ఈ చిత్రం.యూత్ఫుల్ ఎంటర్టైనర్గా గిరిష్ ఏడీ దీనిని తెరకెక్కించాడు. ఏకంగా 136 కోట్ల వసూళ్లు రాబట్టింది.ఈ చిత్రాలు బోనస్..మాలీవుడ్కు నిజంగా ఇది లక్కీ ఇయరే. పై ఐదు చిత్రాలు మాత్రమే కాదు.. కలెక్షన్లపరంగా మరికొన్ని చిత్రాలు రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టాయి. ఇందులో.. విపిన్ దాస్ డైరెక్షన్లో పృథ్వీరాజ్ సుకుమారన్-బసిల్ జోసెఫ్-నిఖిలా విమల్ నటించిన గురువాయూర్ అంబలనాదయిల్, రూ.90 కోట్లతో సెంచరీ క్లబ్కి ఎక్కడం మిస్ అయ్యింది ఈ సినిమా. ఇక.. వినీత్ శ్రీనివాసన్ డైరెక్షన్లో ప్రణవ్ మోహన్లాల్ లీడ్ో నటించిన ‘‘వర్షన్గలక్కు శేషం’’, దింజిత్ అయ్యతాన్ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ సెన్సేషన్ ‘‘కష్కింద కాండం’’, మమ్మూటి నటించిన ‘టర్బో’, ‘భ్రమయుగం’ చిత్రాలు మాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి.. ఇతర చిత్ర పరిశ్రమలు కుళ్లుకునేలా చేశాయి. -
ఓటీటీలో ఫహాద్ ఫాజిల్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా
మలయాళ ప్రముఖ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ 'బౌగెన్విల్లా' ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు ఇప్పటికే ప్రకటన వచ్చింది. అయితే, తాజాగా ఈ చిత్రం నుంచి తెలుగు ట్రైలర్ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాకు అమల్ నీరద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కుంచాకో బోబన్, జ్యోతిర్మయి కీలక పాత్రలలో మెప్పించారు పోషిస్తున్నారు. అక్టోబర్ 17న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ హిట్ మూవీ ఇప్పుడు సోనీ లివ్లో స్ట్రీమింగ్కు రానుంది.'బౌగెన్విల్లా' చిత్రంలో ఫహాద్ ఫాజిల్, కుంచకో బొబన్, జోతిర్మయి వంటి స్టార్స్ నటించడంతో మలయాళంలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అక్కడ మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో విడుదల కానుంది. సోనీలివ్ ఓటీటీ వేదికగా డిసెంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈమేకు తాజాగా తెలుగు ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్గా ఈ సినిమాను అమల్ నీరద్ అద్భుతంగా డైరెక్ట్ చేశాడని ప్రశంసలు అందాయి. సుమారు రూ. 20 కోట్లతో తెరకెక్కిన ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 40 కోట్లకు పైగానే రాబట్టింది. కేరళలో ఎవరూ ఊహించని విధంగా అక్కడి టూరిస్టులు మిసింగ్ అవుతూ ఉంటారు. ఆ కేసులో దాగి ఉన్న సీక్రెట్ను ఏసీబీ డేవిడ్ కోషిగా ఫాహద్ మెప్పించారు. -
Pushpa 2 Review: ‘పుష్ప 2’ మూవీ రివ్యూ
టైటిల్: పుష్ప 2: ది రూల్నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన్నా, ఫహద్ పాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ, రావు రమేశ్, ధనంజయ, తారక్ పొన్నప్ప, అజయ్ ఘోష్ తదితరులునిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్నిర్మాతలు: నవీన్ కుమార్, రవిశంకర్రచన-దర్శకత్వం: సుకుమార్సంగీతం: దేవీశ్రీ ప్రసాద్సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్ఎడిటింగ్: నవీన్ నూలివిడుదల తేది: డిసెంబర్ 5, 2024అల్లు అర్జున్ అభిమానుల మూడేళ్ల నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేల పుష్ప 2 మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల తర్వాత ఆ స్థాయిలో యావత్ సినీలోకం ఎదురు చూస్తున్న తెలుగు సినిమా పుష్ప 2. అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప: ది రైజ్’కి సీక్వెల్ ఇది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా చాలా గ్రాండ్గా నిర్వహించడంతో దేశం మొత్తం ‘పుష్ప 2’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? బన్నీ ఖాతాలో మరో పాన్ ఇండియా హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.‘పుష్ప 2’ కథేంటంటే..?ఒక సాధారణ కూలీగా జీవీతం మొదలు పెట్టిన పుష్పరాజ్(అల్లు అర్జున్) ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియాను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడనేది ‘పుష్ప పార్ట్-1’లో చూపించారు. పుష్పరాజ్ సిండికేట్ లీడర్ కావడంతో ‘పుష్ప : ది రైజ్’ కథ ముగుస్తుంది. పుష్ప 2: ది రూల్ (Pushpa 2 The Rule Movie Telugu Review) సినిమా కథ అక్కడ నుంచే ప్రారంభం అవుతుంది. శ్రీవల్లి(రష్మిక)ని పెళ్లి చేసుకొని అటు వ్యక్తిగతం జీవితాన్ని హాయిగా గడుపుతూనే.. మరోవైపు ఎర్ర చందనం స్మగ్లింగ్ని దేశం మొత్తం విస్తరిస్తాడు పుష్పరాజ్. ఎంపీ సిద్దప్ప(రావు రమేశ్) అండతో తన వ్యాపారానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకుంటాడు. ఓ సారి చిత్తూరుకి వచ్చిన ముఖ్యమంత్రి నరసింహరెడ్డిని కలిసేందుకు పుష్పరాజ్ వెళ్తాడు. భార్య శ్రీవల్లి కోరిక మేరకు అతనితో ఫోటో దిగేందుకు ప్రయత్నించగా..‘స్మగ్లర్తో ఫోటో దిగలేను’ అంటూ సీఎం నిరాకరిస్తాడు. అంతేకాదు శ్రీవల్లిని అవమానించేలా మాట్లాడతాడు. దీంతో ఆ సీఎంనే మార్చాలని పుష్పరాజ్ డిసైడ్ అవుతాడు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్దప్పను చేయాలనుకుంటాడు. దాని కోసం పుష్పరాజ్ ఏం చేశాడు? తనను అవమానించిన పుష్పరాజ్ని ఎలాగైన పట్టుకోవాలని చూస్తున్న ఎస్పీ షెకావత్(ఫాహద్ ఫాజిల్) ప్రయత్నం ఫలించిందా? షెకావత్కి పుష్పరాజ్ విసిరిన సవాల్ ఏంటి? కేంద్రమంత్రి ప్రతాప్రెడ్డి(జగపతి బాబు), పుష్పరాజ్ మధ్య ఎందుకు గొడవ వచ్చింది? ప్రతాప్రెడ్డి తమ్ముడు కొడుకు (తారక్ పొన్నప్ప) పుష్పరాజ్పై పగ పెంచుకోవడానికి గల కారణం ఏంటి? తనను తప్పించి సిండికేట్ లీడర్గా ఎదిగిన పుష్పరాజ్ను అణచివేసేందుకు మంగళం శ్రీను(సునీల్), దాక్షాయణి(అనసూయ)వేసిన ఎత్తుగడలు ఏంటి? చివరకు పుష్పరాజ్ అనుకున్నట్లుగా సిద్దప్పను సీఎం చేశాడా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..కొన్ని సినిమాలకు కథ అవసరం లేదు. స్టార్ హీరో.. ఆయన స్థాయికి తగ్గట్లు ఎలివేషన్స్..భారీ యాక్షన్ సీన్స్.. మాంచి పాటలు ..ఇవి ఉంటే చాలు బొమ్మ హిట్టైపోతుంది. పుష్ప 2లో డైరెక్టర్ సుకుమార్ కూడా ఇదే ఫార్ములాను అప్లై చేశాడు. పుష్ప : ది రైజ్ సినిమాతో పుష్పరాజ్ పాత్రను డ్రగ్లా ఎక్కించిన సుక్కు.. పార్ట్ 2లో ఆ మత్తును అలానే కంటిన్యూ చేసేశాడు. కథపై కాకుండా ఎలివేషన్స్.. యాక్షన్ సీన్స్పై ఎక్కువ ఫోకస్ చేశాడు. పార్ట్ 1లో ఉన్నంత కథ కూడా ఈ సీక్వెల్లో లేదు. హై ఇవ్వడమే లక్ష్యంగా కొన్ని సీన్లను అల్లుకుంటూ పోయాడు అంతే. ప్రతి పది నిమిషాలకొకసారి హై ఇచ్చే సీన్ ఉండేలా స్క్రీన్ప్లే రాసుకున్నాడు. కథనం నీరసంగా సాగుతుందన్న ఫీలింగ్ ఆడియన్స్కి వచ్చేలోగా.. ఓ భారీ యాక్షన్ సీన్ పడుతుంది. అందులో బన్నీ నటవిశ్వరూపం చూసి గూస్బంప్స్ తెచ్చుకోవడమే తప్ప.. మరో ఆలోచన రాదు. భార్య మాట భర్త వింటే ఎలా ఉంటుందనే పాయింట్ని ఈ స్మగ్లింగ్ కథతో ముడిపెట్టి చూపించిన విధానం ఆకట్టుకుంటుంది.ఓ భారీ యాక్షన్ సీన్తో కథ ప్రారంభం అవుతుంది. పుష్పరాజ్ క్యారెక్టర్, అతని ప్రపంచం గురించి అల్రేడీ తెలుసు కనుక.. స్టార్టింగ్ నుంచే హీరోకి ఎలివేషన్స్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఫహాద్ పాత్ర ఎంట్రీ సీన్ అదిరిపోతుంది. ఫస్టాఫ్ అంతా షెకావత్-పుష్పరాజ్ మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్లా కథనం సాగుతుంది. ఎర్రచందనం పట్టుకునేందుకు షెకావత్ ప్రయత్నించడం.. పుష్పరాజ్ అతన్ని బురిడీ కొట్టించి దాన్ని తరలించడం .. ఫస్టాఫ్ మొత్తం ఇదే తంతు నడుస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే స్విమింగ్ఫూల్ సీన్ అదిరిపోతుంది. ఇద్దరి జరిగే సవాల్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. అలాగే శ్రీవల్లీ, పుష్పరాజ్ల మధ్య వచ్చే ‘ఫీలింగ్స్’ సీన్లు నవ్వులు పూయిస్తాయి. ఇక ద్వితియార్థంలో ఎమోషన్స్పై ఎక్కువ దృష్టి పెట్టారు. జాతర ఎపిసోడ్ అదిరిపోతుంది. ఆ తర్వాత కథనం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్కి ముందు వచ్చే యాక్షన్ సీన్ అయితే పూనకాలు తెప్పిస్తుంది. ఆ సీన్లో బన్నీ మాస్ తాండవం చేశాడు. క్లైమాక్స్ అంతగా ఆకట్టుకోదు. పార్ట్ 3కి ఇచ్చిన లీడ్ అంతగా కిక్ ఇవ్వలేదు. సినిమా నిడివి (దాదాపు 3 గంటల 20 నిమిషాలు) ఎక్కువగా ఉండడం సినిమాకు కాస్త మైనస్ అనే చెప్పాలి. లాజిక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాకుంటే అంత మంచిది. అయితే మాస్ ఆడియన్స్కి ఇవేవి అవసరం లేదు. వారిని ఎంటర్టైన్ చేస్తే చాలు. అలాంటి వారికి పుష్ప 2 విపరీతంగా నచ్చుతుంది. ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అయితే సుకుమార్ ఫుల్ మీల్స్ పెట్టారనే చెప్పాలి. ఎవరెలా చేశారంటే..పుష్ప: ది రూల్’ అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు కథనంతా తన భుజాన వేసుకొని నడిపించాడు. మాస్ లుక్లోనే కాదు నటనలోనూ బన్నీ అదరగొట్టేశాడు. యాక్షన్ సీన్స్లో అయితే ‘తగ్గేదేలే’ అన్నట్లుగా తన నట విశ్వరూపం చూపించాడు. జాతర ఎపిసోడ్, క్లైమాక్స్కి ముందు వచ్చే యాక్షన్ సీన్లో బన్నీ ఫెర్మార్మెన్స్ నెక్ట్స్ లెవన్లో ఉంది. చిత్తూర యాసలో ఆయన పలికిన సంభాషణలు అలరిస్తాయి.ఇక శ్రీవల్లీగా డీగ్లామర్ పాత్రలో రష్మిక జీవించేసింది. పార్ట్ 1తో పోలిస్తే ఈ చిత్రంలో ఆమె పాత్ర నిడివి చాలా ఎక్కువగా ఉంటుంది. జాతర ఎపిసోడ్లో ఆమె చెప్పే సంభాషణలు ఆకట్టుకుంటాయి. డీఎస్పీ షెకావత్గా ఫహద్ పాజిల్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఎంపీ సిద్దప్పగా రావు రమేశ్ మరోసారి తెరపై తమ అనుభవాన్ని చూపించారు. తారక్ పొన్నప్పకు మంచి పాత్ర లభించింది. బన్నీకి ఆయన మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. స్పెషల్ సాంగ్లో శ్రీలీల అదరగొట్టేసింది. బన్నీతో పోటీ పడి మరి డ్యాన్స్ చేసింది. మంగళం శ్రీను పాత్రలో నటించిన సునీల్కి పెద్దగా గుర్తుంచుకునే సీన్లేవి పడలేదు. దాక్షయణిగా నటించిన అనసూయ పరిస్థితి కూడా అంతే. ఒకటి రెండు చోట్ల ఆమె చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఇక కేంద్రమంత్రి ప్రతాప్ రెడ్డిగా జగపతి బాబు ఉన్నంత చక్కగా నటించాడు. పార్ట్ 3లో ఆయన నిడివి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. జగదీశ్, ధనుంజయ, అజయ్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. దేవీశ్రీ ప్రసాద్, శ్యామ్ సీఎస్ల నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. ‘సూసేకీ..’, కిస్సిక్’, ‘ఫీలింగ్స్’ పాటలు తెరపై అలరించాయి. సినిమాటోగ్రాఫర్ మిరోస్లా కుబా బ్రోజెక్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ప్రతి సీన్ చాలా రిచ్గా, వాస్తవాన్ని ప్రతిబింబించేలా చూపించాడు. ఆర్ట్ డిపార్ట్మెంట్ పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తోంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెపాల్సింది. నిడివిని కొంచెం తగ్గిస్తే బాగుండేవి. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా ‘తగ్గేదేలే’ అన్నట్లుగా ఈ సినిమా కోసం ఖర్చు పెట్టారు.- అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
Pushpa 2 X Review: ‘పుష్ప 2’మూవీ ట్విటర్ రివ్యూ
అల్లు అర్జున్ ఫ్యాన్తో పాటు యావత్ సినీలోకం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప 2 మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న నాలుగో చిత్రం.. బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప- ది రైజ్’ కి సీక్వెల్ కావడంతో ‘పుష్ప 2: ది రూల్’పై ముందు నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేశాయి. దానికి తోడు పాట్నా మొదలుకొని చెన్నై, ముంబై, కొచ్చి లాంటి నగరాలతో పాటు దేశమంతా తిరిగి ప్రచారం చేయడంతో ‘పుష్ప 2’పై భారీ బజ్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 5) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో గురువారం రాత్రి 9.30 గంటల నుంచే స్పెషల్ షోస్ పడిపోయాయి. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.పుష్ప 2 కథేంటి? ఎలా ఉంది? బన్నీ ఖాతాలో మరో భారీ హిట్ పడిందా లేదా? తదితర విషయాలు ఎక్స్(ట్విటర్ ) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’తో బాధ్యత వహించదు.ఎక్స్లో పుష్ప 2 చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సినిమా బ్లాక్ బస్టర్ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. బన్నీ మాస్ యాక్టింగ్ అదిరిపోయిందని అంటున్నారు. సుకుమార్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. భారీ బ్లాక్ బస్టర్తో ఈ ఏడాది ముగించారని కామెంట్ చేస్తున్నారు. మరికొంత మంది అయితే ఇది యావరేజ్ మూవీ అంటున్నారు. #Pushpa2 definately cross 250 cr on 1st day 🔥 What a film https://t.co/zSTuWaSX93— Sameer Chauhan 🥷 (@srk_MrX) December 5, 2024 First Day First Show #Pushpa2TheRulereviewReally A Great Movie - Full Paisa Wasool. #RashmikaMandana And #AlluArjun𓃵 Killer🔥 #Pushpa2 #AlluArjun #Pushpa2ThaRule #Pushpa2Review #WildfirePushpa pic.twitter.com/ii4jx7vbWs— Lokesh 🕉️ (@LokeshKhatri__) December 5, 2024 #Pushpa2 is a Decently Packaged Commercial Entertainer with a Good 1st Half and a 2nd Half that started well but drops pace significantly in the last hour. The first half starts right where Part 1 ends. This half runs purely on drama which feels slightly slow at times but…— Venky Reviews (@venkyreviews) December 4, 2024 పుష్ప 2 డీసెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్.ఫస్టాఫ్ బాగుంది. సెకండాఫ్ స్టార్టింగ్ బాగుంది కానీ చివరి గంట డ్రాప్ అయినట్లుగా అనిపించిదంటూ ఓ నెటిజన్ 3 రేటింగ్ ఇచ్చాను.#Pushpa2TheRule Review 1st Half = Excellent 🥵2nd Half = Justified 🙂Rating = 3.25/5🥵❤️🔥— Rama (@RameshKemb25619) December 4, 2024 ఫస్టాప్ అద్భుతంగా ఉంది. సెకండాఫ్ కథకి న్యాయం జరిగింది అంటూ మరో నెటిజన్ 3.25 రేటింగ్ ఇచ్చారు.Icon star #ALLUARJUNNata viswaroopam 🔥🔥brilliant Director Sukumar Ramapage 🔥🔥🔥India’s Biggest Blockbuster #Pushpa2 #pushpatherule— Maduri Mattaiah Naidu (@madurimadhu1) December 4, 2024 ఐకాన్స్టార్ అల్లు అర్జున్ నటవిశ్వరూపం, సుకుమార్ డైరెక్షన్ అదిరిపోయింది. ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 2 అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.Kuthaa Ramp undhi Movie🔥🔥🔥@alluarjun acting ayithe vere level especially aa Jathara scene ayithe punakale🔥🔥🔥🔥🔥🔥🔥🔥#Sukumar writing excellent @ThisIsDSP bgm 🔥🔥Pushpa gadi Rulu India shake avuthadi🔥🔥🔥❤️🔥❤️🔥❤️🔥#Pushpa2TheRule #Pushpa2 #Pushpa2TheRuleReview #Pushpa2— Hanish (@HarishKoyalkar) December 4, 2024Good 1st half Below average 2nd half Bad climax#Pushpa2 #Pushpa2TheRule Bhaai one man show ! #Pushpa2Review #Pushpa2Celebrations— CeaseFire 🦖 (@Rebelwood_45) December 4, 2024#Pushpa2 #1stHalfReviewSuperb and very entertaining. Just a mass 🔥🔥 Comedy, dialogue delivery @alluarjun just nailed it. The real Rule of #Pushpa #FahadFaasil craziness is just getting started. Waiting for 2nd half 🔥#SamCS BGM 🔥🔥🔥— Tamil TV Channel Express (@TamilTvChanExp) December 4, 2024#Pushpa2 #AlluArjun𓃵 Power packed first half followed by a good second halfSukkumark in writing and screenplay 3hr 20 mins lo oka scene kuda bore kottadu 💥Rashmika acting 👌Songs bgm💥Cinematography too good vundi asalu @alluarjun nee acting ki 🙏Peak commercial cinema.— Hussain Sha kiran (@GiddaSha) December 4, 2024 -
పుష్ప-2లో ఆయన పాత్ర వేరే లెవల్.. అల్లు అర్జున్ ప్రశంసలు
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. మరో వారం రోజుల్లో థియేటర్లను షేక్ చేయనున్నాడు పుష్పరాజ్. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్తో ఫుల్ బిజీ అయిపోయారు. ఇటీవల చెన్నైలో కిస్సిక్ సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. పుష్ప-2 ప్రమోషన్లలో భాగంగా ఇవాళ కేరళలోని కొచ్చిలో భారీ ఈవెంట్ నిర్వహించారు. నగరంలోని లివా మాల్ గ్రాండ్ హయత్లో ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా హాజరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్పై ప్రశంసలు కురిపించారు.అల్లు అర్జున్ మాట్లాడుతూ..'ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. దాదాపు 20 ఏళ్లుగా మీరు నన్ను అభిమానిస్తున్నారు. మల్లు అర్జున్గా మీ ప్రేమకు రుణపడి ఉంటా. ఈ చిత్రంలో ఫాహద్ ఫాజిల్ అద్భుతంగా చేశారు. ప్రతి కేరళియన్ గర్వపడేలా ఉంటుంది. ఫాఫా మీ అందరిని అలరిస్తారు. ఆయనతో పనిచేయడం సంతోషంగా ఉంది. పుష్ప విడుదలై మూడేళ్లవుతోంది. ఇకపై ఇన్ని రోజులు మిమ్మల్ని వెయిట్ చేయించను. ఇప్పటి నుంచి సినిమాలు త్వరగా చేస్తాను. శ్రీవల్లితో మూడేళ్లుగా నా ప్రయాణం ఎప్పటికీ గుర్తుంటుంది. ఈ సినిమాలో తన సపోర్ట్కు ధన్యవాదాలు. థ్యాంక్ యూ రష్మిక' అని అన్నారు.సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. వచ్చేనెల డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. నేషనల్ క్రష్ రష్మిక మరోసారి శ్రీవల్లిగా అలరించనుంది. పుష్పలో భన్వర్లాల్ షెకావత్గా అలరించిన మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ మరోసారి కీ రోల్ ప్లే చేస్తున్నారు. A Special surprise coming your way 💥💥💥Get ready for the Mass Blast🎧🔥Watch #PushpaRulesKeralam Event Live now... For the Blasting Surprise ❤️🔥❤️🔥- https://t.co/QdHDdVrAj9#Pushpa2TheRule #Pushpa2TheRuleOnDec5th— Pushpa (@PushpaMovie) November 27, 2024 -
టాలీవుడ్ దర్శక-నిర్మాతలపై కన్నేసిన పర భాష హీరోలు!
భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం టాలీవుడ్ ముందు వరుసలో ఉంది. స్టార్ హీరోల తెలుగు సినిమాలు పాన్ ఇండియా మూవీస్గా ఇతర భాషల్లో రిలీజ్ అవుతున్నాయి. కథాబలం ఉన్న సినిమాలు భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ఇలా ఇతర భాషల హీరోల సినిమాలు కూడా టాలీవుడ్లో విడుదలై, మంచి సినిమాలు సూపర్హిట్స్గా నిలుస్తున్నాయి. దీంతో కొందరు హీరోలు తెలుగు నిర్మాణ సంస్థలు, తెలుగు దర్శకులతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ప్రేక్షకులు కూడా క్షేమంగా రండి లాభంగా వెళ్లండి అంటూ ఆదరిస్తున్నారు. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం...ఆకాశంలో ఒక తార!‘మహానటి, సీతారామం’, ఇటీవల ‘లక్కీభాస్కర్’ చిత్రాలతో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తెలుగులో దుల్కర్ చేసిన ఈ మూడు సినిమాలు సూపర్హిట్స్ కావడమే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. దీంతో తెలుగులో సినిమాలు చేయడానికి మరింత ఆసక్తి చూపిస్తున్నారు దుల్కర్ సల్మాన్ . ప్రస్తుతం ‘ఆకాశంలో ఒక తార’ సినిమా చేస్తున్నారాయన. పవన్ సాధినేని ఈ సినిమాకు దర్శకుడు. గీతా ఆర్ట్స్, స్వప్నా సినిమాస్, లైట్ బాక్స్ మీడియా పతాకాలపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. అలాగే ‘కాంత’ అనే పీరియాడికల్ ఫిల్మ్లోనూ దుల్కర్ హీరోగా నటిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని మరో లీడ్ రోల్ చేస్తున్నారు. రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ అట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు జాను సంగీతం అందిస్తున్నారు. కాగా దుల్కర్ తెలుగు నిర్మాతలతో సినిమాలు చేస్తున్నప్పటికీ ఆయన సినిమాలు ఇతర భాషల్లో కూడా డబ్బింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.రాజమౌళి సమర్పణలో...అల్లు అర్జున్ ‘పుష్ప: ది రైజ్’ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న బన్వర్సింగ్ షెకావత్ పాత్రలో తెలుగు ఆడియన్స్ను మెప్పించారు మలయాళ హీరో ఫాహద్ఫాజిల్. ప్రస్తుతం ‘పుష్ప: ది రైజ్’ సినిమాకు సీక్వెల్గా వస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ సినిమాలోనూ ఫాహద్ ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. అయితే ఫాహద్ హీరోగా ‘డోన్ట్ ట్రబుల్ ది ట్రబుల్, ఆక్సిజన్ ’ అనే రెండు తెలుగు సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. రాజమౌళి సమర్పణలో ఆర్కా మీడియా పతాకంపై శోభు యార్లగడ్డ, కార్తికేయ ఈ రెండు సినిమాలను నిర్మిస్తున్నారు. ‘ఆక్సిజన్ ’ సినిమాతో సిద్ధార్థ్ నాదెళ్ల, ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమాతో శశాంక్ ఏలేటి దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఈ ఏడాది మార్చిలో ‘డోన్ట్ ట్రబుల్ ది ట్రబుల్, ఆక్సిజన్’ సినిమాల ఫస్ట్లుక్స్ను విడుదల చేశారు మేకర్స్. అయితే ఆ తర్వాత ఈ సినిమాల గురించి మరో అప్డేట్ రావాల్సి ఉంది.జై హనుమాన్‘కాంతార’ సినిమాతో కన్నడ యాక్టర్ రిషబ్ శెట్టి పేరు జాతీయస్థాయిలో మార్మోగిపోయింది. ప్రస్తుతం ‘కాంతార’ సినిమా ప్రీక్వెల్ ‘కాంతార: ఛాప్టర్ 1’తో బిజీగా ఉన్నారు రిషబ్శెట్టి. అయితే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కాకుండానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదే జై హనుమాన్.ఈ ఏడాది సంక్రాంతి ఫెస్టివల్కు విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచిన ‘హను–మాన్ ’ సినిమాకు సీక్వెల్గా ‘జై హనుమాన్ ’ రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాలో రిషబ్శెట్టి మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నారు. ప్రశాంత్వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయు)లో భాగంగా ‘జై హను మాన్ ’ అనే తెలుగు సినిమాకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు రిషబ్. ప్రశాంత్ వర్మ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రానా మరో లీడ్ రోల్ చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ‘జై హనుమాన్’ సినిమాను నిర్మిస్తున్నారు.యాక్షన్ ‘జాట్’బాలీవుడ్లోని సీనియర్ హీరోల్లో ఒకరైన సన్నీ డియోల్ తెలుగులో సినిమా చేస్తున్నారు. ‘జాట్’ అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ మొదలైంది. పీటర్ హెయిన్స్, అన్ల అరసు, రామ్–లక్ష్మణ్, వెంకట్.. ఇలా నలుగురు యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ఈ సినిమాకు అసోసియేట్ కావడం చూస్తే యాక్షన్ సీక్వెన్స్లు నెక్ట్స్ లెవల్లో ఉండబోతున్నాయని ఊహించవచ్చు. రణ్దీప్ హుడా, వినీత్కుమార్, సయామీ ఖేర్, రెజీనా ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ ‘జాట్’ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. హిందీలో ‘గదర్ 2’ వంటి బ్లాక్బస్టర్ కొట్టిన వెంటనే సన్నీడియోల్ తెలుగులో ‘జాట్’ చేయడానికి అంగీకరించడం విశేషం. ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ‘జాట్’ కాకుండా హిందీలో ‘బోర్డర్ 2, లాహోర్ 1947’ సినిమాలతో బిజీగా ఉన్నారు సన్నీడియోల్. ‘జాట్’ విజయం సాధిస్తే ఆయన తదుపరి సినిమాలైన ‘బోర్డర్ 2, లాహోర్ 1947’ చిత్రాలు కూడా తెలుగులో రిలీజ్ అవుతాయని ఊహించవచ్చు.కంగువాహీరో సూర్య తెలుగులోనూ పాపులర్. ఆయన తమిళ చిత్రాలు ఎప్పటికప్పుడు తెలుగులో అనువాదం అవుతుంటాయి. వీలైనప్పుడు నేరుగా తెలుగు సినిమాల్లోనూ సూర్య నటిస్తారు. తాజాగా సూర్య నటించిన భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షనల్ ఫిల్మ్ ‘కంగువా’. శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్స్ , యూవీ క్రియేషన్స్ పతాకాలపై తమిళ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా, తెలుగు నిర్మాతలు వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో ‘కంగువ, ఫ్రాన్సిస్’ అనే రెండు భిన్నమైన రోల్స్లో సూర్య నటించారు. దిశా పటానీ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో యోగిబాబు, బాబీడియోల్ ఇతర పాత్రలు చేశారు. ఈ నెల 14న ‘కంగువా’ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ స్వరకర్త. అలాగే గీతాఆర్ట్స్ సంస్థలో సూర్య ‘గజిని 2’ సినిమా చేస్తారని, అలాగే బోయ΄ాటి శ్రీను దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.కుబేరధనుష్కు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఆయన తమిళ సినిమాలు తెలుగులో అనువాదమై ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటున్నాయి. అయితే ధనుష్ తెలుగు, తమిళం భాషల్లో నటించిన ద్విభాషా చిత్రం ‘సార్’ (తమిళంలో ‘వాతి’). వెంకీ అట్లూరి దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మించారు. ‘సార్’ చిత్రం వందకోట్ల రూపాయల వసూళ్లను రాబట్టి, బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. దీంతో వెంటనే తెలుగు నిర్మాతలతో మరో సినిమా చేసేందుకు ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదే ‘కుబేర’. శేఖర్కమ్ముల దర్శ కత్వంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న భారీ బడ్జెట్ ఫిల్మ్ ఇది. ఈ సినిమాలో నాగార్జున మరో లీడ్ రోల్లో నటిస్తుండగా, రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ నెల 15న ‘కుబేర’ సినిమా టీజర్ విడుదల కానుంది. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ‘కుబేర’ సినిమా రిలీజ్ కానుంది. ఈ తరహాలో మరికొంతమంది ఇతర భాషల హీరోలు టాలీవుడ్ దర్శక– నిర్మాతలతో సినిమాలు చేస్తున్నారు. ఇంకొందరు ఆసక్తి చూపిస్తూ, కథలు వింటున్నారు. -
పుష్ప నటుడి థ్రిల్లర్ మూవీ.. ట్రైలర్ చూశారా?
పుష్ప నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన తాజా సైకలాజికల్ థ్రిల్లర్ బౌగెన్విల్లా. ఈ సినిమాకు అమల్ నీరద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కుంచాకో బోబన్, జ్యోతిర్మయి కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా అక్టోబర్ 17న థియేటర్లలో విడుదల కానుంది.కాగా.. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ పుష్ప మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. పుష్ప సీక్వెల్ పార్ట్-2 లోనూ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
వారం రోజులు అక్కర్లేదు!
‘‘ఖైదు చెయ్ ఖైదు చెయ్... నేరస్తుణ్ణి ఖైదు చెయ్... ఖైదు చెయ్ ఖైదు చెయ్... నేరస్తుణ్ణి ఖైదు చెయ్’’ అంటూ మొదలవుతుంది ‘వేట్టయాన్: ద హంటర్’ సినిమా తెలుగు ట్రైలర్. రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వేట్టయాన్’. అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్ ఇతర లీడ్ రోల్స్లో నటించారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘వేట్టయాన్’ ట్రైలర్ను బుధవారం విడుదల చేశారు. ‘ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదు. కానీ పోరంబోకులకు బాగా భద్రత ఉంది’, ‘నేరస్తుణ్ణి వెంటనే పట్టుకోవాలి. అందుకు ఏ యాక్షన్ అయినా తీసుకోండి’, ‘ఒక వారంలో ఎన్కౌంటర్ జరిగిపోవాలి’ (రావు రమేశ్), ‘అక్కర్లేదు సార్... వారం రోజులు అక్కర్లేదు... మూడే రోజుల్లో డిపార్ట్మెంట్కు మంచి పేరు వస్తుంది’ (రజనీకాంత్), ‘కాలం విలువ తెలిసిన మనిషి మాత్రమే ఏదైనా సాధించగలడు’ (రానా), ‘న్యాయం అన్యాయం అయినప్పుడు న్యాయంతోనే సరిచేయాలి. అంతేకానీ... ఇంకో అన్యాయంతో కాదు’ (అమితాబ్ బచ్చన్), ‘నన్ను ఏ పోస్ట్లోకి తిప్పికొట్టినా నేను మాత్రం పోలీస్వాడినే సార్... నా నుంచి వాడిని కాపాడటం ఎవ్వరి వల్ల కాదు (రజనీకాంత్)’ అన్న డైలాగ్స్ ఈ ట్రైలర్లో ఉన్నాయి. -
ట్రెండింగ్లో బాలయ్య... 20 ఏళ్ల రూల్కి బ్రేక్!
ఆవేశం సినిమా తెలుగు రీమేక్లో బాలకృష్ణ నటించబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ వర్గాలు. ఫహద్ ఫాజిల్ నటించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సొంతం చేసుకుంది. బాలయ్య కోసమే ఆ హక్కులను కొలుగోలు చేసినట్లు తెలుస్తోంది. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేసి ఓ ప్రముఖ దర్శకుడు ఈ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నాడట. వాస్తవానికి బాలయ్య రీమేకులకు దూరంగా ఉంటాడు. దాదాపు 20 ఏళ్ల కింద తమిళ బ్లాక్ బస్టర్ ‘సామి’ తెలుగు రీమేక్ ‘లక్ష్మీనరసింహా’లో బాలయ్య హీరోగా నటించాడు. ఆ తర్వాత కొత్త కథలతోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ రీమేక్ చేయాలని బాలయ్య డిసైడ్ అయ్యాడట. ఆవేశం సినిమా బాగా నచ్చడంతో బాలయ్య ఈ నిర్ణయం తీసుకున్నాడని ప్రచారం జరుగుతుంది.ఈ చిత్రంలో ఫహద్ ఓ డిఫరెంట్ క్యారెక్టర్ చేశాడు. సినిమా విజయానికి ప్రధాన కారణం ఆయన నటనే. రిలీజ్ తర్వాత ప్రతి ఒక్కరు ఆ పాత్ర గురించే మాట్లాడుకున్నారు. అందులో పహద్ని తప్ప మరో హీరోని ఊహించుకోలేమని చెప్పారు. రూ. 30 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిందంటే.. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. కేవలం థియేటర్స్లో మాత్రమే కాదు..ఓటీటీ(అమెజాన్ ప్రైమ్)లోనూ ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. అలాంటి బ్లాక్ బస్టర్ సినిమా రీమేక్లో బాలయ్య నటిస్తున్నారని ప్రచారం జరగడంతో ఆయన పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. కొంతమంది అభిమానులైతే ఏకంగా ఆవేశం సినిమా పాటకి బాలయ్య విజువల్స్ జోడించి.. ఆ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరి ఇదే కనుక నిజమైతే.. బాలయ్య తన 20 ఏళ్ల రూల్కి బ్రేక్ ఇచ్చినట్లే అవుతుంది. -
తెలుగులో విజయ్ సేతుపతి ‘సూపర్ డీలక్స్ ’.. రీలీజ్ ఎప్పడంటే..?
వైవిధ్యమైన పాత్రలతో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి ట్రాన్స్జెండర్గా నటించిన చిత్రం ‘సూపర్ డీలక్స్’. సమంత కథానాయకగా నటించగా ఫాహద్ ఫాజిల్ ఓ కీ రోల్లో నటించారు. త్యాగరాజన్ కుమార రాజా దర్శత్వంలో రూపొందిన ఈ తమిళ చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం తెలుగులో ఈ నెల 9న థియేటర్లలో విడుదల కానుంది. సీఎల్ఎన్ మీడియా తెలుగులో విడుదల చేయనుంది. ‘‘సూపర్ డీలక్స్’ని నాలుగు వందల థియేటర్లలో గ్రాండ్గా విడుదల చేయనున్నాం. నాలుగు విభిన్న కథలను జోడించి దర్శకుడు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని తెలుగులో విడుదల చేస్తున్న సీఎల్ఎన్ మీడియా పేర్కొంది. -
కేరళ కోసం విరాళాలు ప్రకటించిన స్టార్స్.. ఎవరెవరు ఎంత..?
కేరళలో భారీ వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఎక్కడ చూసిన నీటితో నిండిపోయిన నగరాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వయనాడ్ ప్రాంతంలో భారీ వర్షం వల్ల చాలామంది ఆశ్రయం కూడా కోల్పోయారు. యాన్ని ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడడంతో ఇప్పటికే 200 మందికి పైగానే విగతజీవులుగా మారితే.. మరికొంత మంది ఆచూకీ లేకుండా పోయింది. ఇప్పటికీ అనేకమంది శిథిలాల్లో చిక్కుకుపోయారు. ఈ విపత్తులో కేరళను ఆదుకునేందుకు తమ వంతుగా సాయం చేసేందుకు పలువురు సినీ ప్రముఖులు ముందుకు వచ్చారు.సౌత్ ఇండియా స్టార్ హీరో మమ్ముట్టి, ఆయన కుమారుడు దుల్కర్ సల్మాన్ సాయం చేసేందకు ముందుకొచ్చారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఆర్థిక సహాయం కోసం మమ్ముట్టి రూ.20 లక్షలు, దుల్కర్ సల్మాన్ రూ. 15 లక్షలు కేరళ మంత్రి పి రాజీవ్కు అందజేశారు. ఇదే సమయంలో ఫహాద్ ఫాజిల్- నజ్రియా దంపతులు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షలు విరాళం అందించారు. ఈ విషయాన్ని స్వయంగా ఫహద్ ఫాజిల్ తన నిర్మాణ సంస్థ ఫహద్ ఫాజిల్ అండ్ ఫ్రెండ్స్ లెటర్ ప్యాడ్పై ముఖ్యమంత్రికి రాసిన లేఖను షేర్ చేస్తూ తెలియజేశాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా రూ. 10 లక్షలు ప్రకటించారు. అయితే, ఇప్పటికే సూర్య, జ్యోతిక, కార్తీ రూ. 50 లక్షలు అందించగా.. విక్రమ్ రూ. 20 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే. కేరళ కోసం అండగా నిలబడుతున్న స్టార్ హీరోలను నెటిజన్లు అభినందిస్తున్నారు. -
మాలీవుడ్ స్టార్ ఫాహద్.. డేట్స్ ఇవ్వడం లేదా?
-
రజినీకాంత్ ని లెక్కచేయని ఫహాద్ ఫాజిల్
-
Viji Venkatesh: కన్నీటి భాష తెలిసిన నటి ఈమె
కన్నీళ్ల భాష తెలిసిన విజీ వెంకటేష్ కళారంగంలోకి అడుగుపెట్టింది. దేశవ్యాప్తంగా క్యాన్సర్పై అవగాహన సదస్సులు నిర్వహించడం నుంచి క్యాన్సర్ బాధితులకు అండగా నిలవడం వరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన విజీ వెంకటేష్లో నటిగా మరో కోణం పరిచయం అయింది. ఆమెకు నటనలో ఓనమాలు తెలియవు. అయితే ‘తెలియదు’ అనే మాట దగ్గర ఆమె ఎప్పుడూ ఆగిపోలేదు. మలయాళం మాట్లాడడం నేర్చుకుంది. సాధన చేసి నటనలో శభాష్ అనిపించుకుంది. ‘బలమైన సినీ మాధ్యమం ద్వారా ఎన్నో సందేశాలను ప్రజలకు చేరువ చేయవచ్చు’ అంటుంది విజీ వెంకటేష్...71 ఏళ్ల వయసులో మలయాళ చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టిన విజీ వెంకటేష్ మన దేశంలో క్యాన్సర్ పేషెంట్ల కోసం మూడు దశాబ్దాలకు పైగా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఆమె స్వచ్ఛంద సంస్థ ‘ది మాక్స్ ఫౌండేషన్’కు ఇండియా, సౌత్ ఏషియా హెడ్గా ఉన్నారు.దిల్లీలో పుట్టి పెరిగిన విజీకి సామాజిక స్పృహకు సంబంధించిన విషయాలపై స్కూల్రోజుల్లో నుంచే ఆసక్తిగా ఉండేది. ఆ ఆసక్తికి అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. వివాహం తరువాత దిల్లీ నుంచి బాంబేకు వచ్చింది. ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చినట్లుగా అనిపించింది. తన ఆసక్తులకు తగిన వాతావరణం ఇక్కడ కనిపించింది. ఆంగ్లంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.‘ది మాక్స్ ఫౌండేషన్’ ద్వారా ఉద్యోగ, సేవాప్రస్థానాన్ని ప్రారంభించింది. ‘క్యాన్సర్ పేషెంట్ల గురించి పనిచేయాలనుకోవడానికి కారణం ఏమిటి? అని చాలామంది నన్ను అడుగుతుంటారు. అయితే కాన్సర్పై పోరాటానికి, అవగాహన కలిగించడానికి క్యాన్సర్ పేషెంట్ కానక్కర్లేదు. వారి కష్టాలు మనకు తెలిసుంటే చాలు. ముంబైలో సంస్థలు, వ్యాపారవేత్తల నుంచి క్యాన్సర్ బాధితులకు అవసరమైన నిధుల సేకరణ ్రపారంభిండం ద్వారా నా ప్రస్థానం మొదలైంది’ అంటుంది విజీ.నిధుల సేకరణ మాత్రమే కాదు పేద క్యాన్సర్ పేషెంట్ల ఇంటికి వెళ్లి వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకునేది. ధైర్యం చెప్పేది. వీరిలో చాలామందికి పొగాకు నమిలే అలవాటు ఉన్నట్లు గ్రహించింది. ఉద్యోగ ప్రయాణం మొదలైన కొత్తలో బ్రిటిష్ కౌన్సిల్ లైబ్రరీకి వెళ్లి క్యాన్సర్కు సంబంధించిన ఎన్నో పుస్తకాలను చదివి కొత్త విషయాలను తెలుసుకునేది. అంతేకాదు టాటా మెమోరియల్ హాస్పిటల్లోని ఆంకాలజీ డిపార్ట్మెంట్ ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుంది.ఫ్యాక్టరీలకు వెళ్లి పొగాకు నమలడం ద్వారా వచ్చే ఆరోగ్య సమస్యల గురించి కార్మికుల కోసం అవగాహన సదస్సులు నిర్వహించేది. ఈ సమావేశాలు పొగాకు నమిలే అలవాటు ఉన్న చాలామందిలో మార్పు తీసుకువచ్చి ప్రమాదం బారిన పడకుండా చూశాయి. అవగాహన సదస్సులతో పాటు పేదల కోసం ఎన్నో చోట్ల క్యాన్సర్కు సంబంధించి ఎర్లీ డిటెక్షన్ క్యాంపులు నిర్వహించింది. ఈ క్యాంప్లు ఎంతోమందిని కాపాడాయి.ఫహద్ ఫాజిల్తో విజీ వెంకటేష్అసలు సినిమాల్లో నటించే అవకాశం విజీ వెంకటేష్కు ఎలా వచ్చింది అనే విషయానికి వస్తే... సోషల్ మీడియాలో ఆమె చురుగ్గా ఉంటుంది. మలయాళ డైరెక్టర్ అఖిల్ సత్యన్, అతని టీమ్ ఇన్స్టాగ్రామ్లో విజీ వెంకటేష్ ఫొటోను చూశారు. తమ సినిమా ‘పచ్చుం అబ్బుతావిలక్కుమ్’కు ‘ఉమ్మచ్చి’ క్యారెక్టర్కు సరిగ్గా సరిపోయే మహిళ అనుకున్నారు. వెంటనే విజీ వెంకటేష్ను సంప్రదించారు.‘నేను ఫుల్–టైమ్ జాబ్ చేస్తున్నాను. నాకు మలయాళం పెద్దగా రాదు’ అని చెప్పింది. ‘ఈ వయసులో నటన ఏమిటి’ అని కూడా అన్నది. అయితే డైరెక్టర్ పట్టువదలని విక్రమార్కుడు అయ్యాడు. ‘రోల్’ గురించి మరింత వివరంగా చర్చించాడు. అతడి ఆసక్తి, వృత్తిపట్ల అంకిత భావం నచ్చడంతో విజీకి ‘ఓకే’ అనక తప్పలేదు. ఇక అప్పటినుంచి మలయాళం స్పీకింగ్ స్కిల్స్పై దృష్టి పెట్టింది. నటనలో మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమాలో విజీ తల్లి పాత్ర పోషించింది. స్వతంత్ర వ్యక్తిత్వం, పోరాడే ధీరత్వం ఉన్న మహిళ పాత్ర అది. నిజానికి ఈ పాత్రకి సంబంధించిన లక్షణాలు ఆమెలో సహజంగా ఉన్నవే.ఈ సినిమా నుంచి మరికొన్ని సినిమాల నుంచి ఆఫర్లు వచ్చాయి. ‘వీర’ లాంటి చిత్రాలతో పేరు తెచ్చుకున్న దర్శకుడు జయరాజ్ చిత్రం కోసం సైన్ చేసింది. కాటుక, ముక్కు పుడక... ఇలా విజీ వెంకటేష్కు తనదైన సిగ్నేచర్ స్టైల్ ఉంది. తన మొదటి సినిమా కోసం ఆ స్టైల్ను పక్కన పెట్టాల్సి వచ్చింది. అయితే కొత్త లుక్లో కూడా సహజంగా, అందంగా ఉంది విజీ వెంకటేష్. -
ఓటీటీలో ఆవేశం.. ఆ సీన్పై చర్చ!
ఫహద్ ఫాజిల్.. అప్పుడే హీరోగా చేస్తాడు.. అంతలోనే విలన్గా నటిస్తాడు. ప్రాధాన్యతను బట్టి ఏ పాత్రలో అయినా దూరేస్తాడు. ఇటీవల అతడు హీరోగా నటించిన మలయాళ మూవీ ఆవేశం బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది.ఓటీటీలో ఆవేశంబాక్సాఫీస్ దగ్గర హిట్టందుకున్న మూవీ ఓటీటీలోకి రావడంతో సినీప్రియులు ఆత్రుతగా ఆవేశం సినిమా చూసేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు సినిమాలోని ఓ సీన్ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. హిందీ భాషను కావాలని పక్కన పడేశారని కామెంట్లు చేస్తున్నారు.ఫైట్ సీన్లో వార్నింగ్ఇంతకీ ఏమైందంటే.. ఓ ఫైట్ సీన్లో రంగ(ఫహద్ ఫాజిల్) తన కాలేజీలోని సీనియర్లు అజు, బిబి, షాంతన్కు వార్నింగ్ ఇస్తుంటాడు. మలయాళం, కన్నడ భాషల్లో వార్నింగ్ ఇస్తాడు. హిందీలో కూడా ఇద్దామనుకునేసరికి హిందీలో అవసరం లేదులే అంటూ రంగ రైట్ హ్యాండ్ అంబాన్ (సాజిన్ గోపు) అతడిని వారిస్తాడు. హిందీ అక్కర్లేదా?అందరికీ చెప్పింది అర్థమైందిగా.. ఇక వెళ్లిపోండి అని ఆదేశిస్తాడు. హిందీలో అవసరం లేదా? అని హీరో అడిగితే అంబాన్ వద్దని బదులిస్తాడు. ఇది చూసిన కొందరు అధికార భాష హిందీని గౌరవించాలి కదా అని అభిప్రాయపడగా.. అయినా ప్రాంతీయ భాషా చిత్రంలో హిందీ అవసరం ఏముందిలే అని మరికొందరు లైట్ తీసుకుంటున్నారు.చదవండి: ఓ మంచి దెయ్యం టీజర్ చూశారా? -
కట్టప్పతో స్టార్ హీరో.. ఈ మధ్యే రూ.150 కోట్ల హిట్ మూవీతో..!
నటుడు సత్యరాజ్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో బోలెడన్ని సినిమాలు చేశాడు. మొదట్లో విలన్గా, తర్వాత హీరోగా.. అనంతరం సహాయక నటుడిగా మెప్పించాడు. బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రతో పాన్ ఇండియా స్థాయిలో క్లిక్కయ్యాడు. ఈ మధ్య ఇతడు సింగపూర్ సెలూన్ మూవీలో మెరిశాడు. ఫోటో వైరల్తాజాగా ఈ నటుడు యుక్తవయసులో ఉన్నప్పటి ఫోటో ఒకటి వైరల్గా మారింది. ఇందులో సత్యరాజ్ ఓ బుడ్డోడితోపాటు కెమెరావైపు నవ్వులు చిందిస్తున్నాడు. ఈ బుడ్డోడు సౌత్ ఇండస్ట్రీలో ఫేమస్ యాక్టర్. ఇతడి తండ్రి కూడా నటుడే! ఆయనతో కలిసి సత్యరాజ్ రెండు సినిమాలు కూడా చేశాడు. ఇంతకీ ఈ చిన్నోడెవరో గుర్తుపట్టారా? తెలుగులో విపరీతమైన పాపులారిటీఅతడే మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్. పుష్ప సినిమాతో తెలుగులో విపరీతమైన పాపులారిటీ దక్కించుకున్న ఇతడు ఈ మధ్యే ఆవేశం అనే సినిమాతో మలయాళంలో బ్లాక్బస్టర్ హిట్ కొట్టాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా రాబట్టింది. 1980లో అతడు సత్యరాజ్తో దిగిన ఫోటోను ఓటీటీ ప్లాట్ఫామ్ ముబి ఇండియా సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్గా మారింది. Sathyaraj and Fahadh Faasil in the 1980s. pic.twitter.com/H9DidxzScV— MUBI India (@mubiindia) May 7, 2024చదవండి: నాన్నతో కోపంలో అన్నా.. అదే నిజమైంది: బన్నీ -
సినిమాయే జీవితం కాదు.. నన్ను లైట్ తీస్కోండి: పుష్ప విలన్
ఫహద్ ఫాజిల్.. తెలుగు, మలయాళ, కన్నడ ప్రేక్షకులకు సుపరిచితుడే! సొంత (మలయాళ) ఇండస్ట్రీలో హీరోగా నటించే ఈయన ఇతర భాషా చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్లు, విలనిజం పాత్రలు పోషిస్తుంటాడు. ఇటీవల ఈయన ప్రధాన పాత్రలో నటించిన మలయాళ మూవీ 'ఆవేశం' రూ.100 కోట్ల క్లబ్బులో చేరింది.సినిమానే జీవితం కాదుఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఫహద్ ఫాజిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమా చూస్తున్నంతసేపే తనను పట్టించుకోవాలే తప్ప తర్వాత తన గురించి ఆలోచించొద్దన్నాడు. అలాగే సినిమాయే జీవితం కాదని ఉపదేశించాడు. అతడు ఇంకా మాట్లాడుతూ.. 'నేను ఏదీ అనుకున్న సమయానికి మొదలుపెట్టను.. పూర్తి చేయను. నేను చేసే సినిమాలు కూడా ముందుగా ప్లాన్ చేసుకున్నవి కాదు. ఎగ్జయిట్గా అనిపిస్తే వెంటనే చేసేస్తానంతే! ప్రేక్షకులు సినిమా చూసి ఆనందించేందుకు నా వంతు నేను కృషి చేస్తాను.నా గురించి ఆలోచించొద్దువాళ్లు సినిమా చూస్తున్నంత సేపు ఎంటర్టైన్ అవ్వాలి.. అంతేకానీ తర్వాత నేనేం చేస్తున్నాను? నా లైఫ్ ఎలా ఉంది? అని నాగురించి ఆలోచించకూడదు. థియేటర్ లోపల ఉన్నప్పుడు మాత్రమే ఆలోచించండి.. అక్కడి నుంచి బయటకు వచ్చేశాక నన్ను సీరియస్గా తీసుకోకండి. ఖాళీ సమయాల్లోనో లేదా తినేటప్పుడో నటీనటుల గురించి వారి పర్ఫామెన్స్ గురించి జనాలు మాట్లాడుకోవడం నాకస్సలు ఇష్టం ఉండదు.ఇంట్లో ఎందుకు చర్చ?కావాలంటే సినిమా చూసి ఇంటికి తిరిగెళ్లే సమయంలో దాని గురించి డిస్కషన్ చేయండి.. అంతే కానీ ఇంట్లో కూడా దాని గురించే ఎందుకు చర్చ? సినిమాను కూడా ఓ హద్దులో ఉంచాలి. కేవలం మూవీస్ చూడటమే కాకుండా జీవితంలో చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయని గుర్తుంచుకోండి' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఫహద్.. పుష్ప 2 సినిమాతో పాటు వేటయ్య, మారీషన్ సినిమాలు చేస్తున్నాడు.చదవండి: మూడో పెళ్లి గురించి ప్రశ్న.. స్టార్ హీరో ఆన్సరిదే..! -
విలన్ను కాస్తా కమెడియన్ను చేసేశారు!
మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ మాతృభాషలో హీరోగా నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. కోలీవుడ్, టాలీవుడ్లో మాత్రం విలన్గా నటిస్తున్న ఈయన ఇటీవల తెలుగులో పుష్ప చిత్రంలో పోలీస్ అధికారిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే తమిళంలో ఉదయనిధి స్టాలిన్, కీర్తీ సురేష్ జంటగా నటించిన మామన్నన్ చిత్రంలో విలనిజాన్ని పండించారు. అలాగే కమల్ హాసన్ కథానాయకుడిగా నటించిన విక్రమ్ చిత్రంలోనూ కీలక పాత్రలో మెప్పించారు. కమెడియన్ను చేసేశారు తాజాగా రజనీకాంత్ హీరోగా నటిస్తున్న వేట్టైయాన్ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఇందులో తన పాత్ర గురించి ఆయన మాట్లాడుతూ.. వేట్టైయాన్ చిత్రంలో దర్శకుడు జ్ఞానవేల్ తనను కమెడియన్గా మార్చారని చెప్పారు. కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ మూవీలో తననే హీరోగా పలువురు భావించారని, అంత ప్రాముఖ్యత కలిగిన పాత్రల్లో నటించిన తనను వేట్టైయాన్ చిత్రంలో కమెడియన్గా చేయడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. అప్పుడే ఒప్పుకున్నా రజనీకాంత్ చిత్రంలో కమెడియన్గానా? అని తాను ఆశ్చర్యపోయానని, అయితే అందులో తన పాత్ర గురించి దర్శకుడు వివరించగా ఆ పాత్రలో నటించడానికి అంగీకరించానని ఫహద్ ఫాజిల్ పేర్కొన్నారు. కాగా ఈ క్రేజీ చిత్రం అక్టోబర్ నెలలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. చదవండి: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. నిశ్చితార్థం రోజే నటుడి దుర్మరణం! -
షెకావత్ సర్ న్యూ లుక్.. 'పుష్ప'పై ప్రతీకారంతో!
పుష్పరాజ్పై ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీ అవుతున్నాడు బన్వర్సింగ్ షెకావత్. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘పుష్ప’. ఈ సినిమాలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’లో పుష్పరాజ్గా అల్లు అర్జున్,పోలీసాఫీసర్ భన్వర్సింగ్ షెకావత్పాత్రలో ఫాహద్ ఫాజిల్ నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘పుష్ప’ చిత్రంలోని మలి భాగం ‘పుష్ప: ది రూల్’ సెట్స్పై ఉంది. ఇందులో కూడా అల్లు అర్జున్, ఫాహద్ ఫాజిల్ నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్లోపాల్గొన్నారు ఫాహద్ ఫాజిల్. కాగా ఆగస్టు 8 (మంగళవారం) ఫాహద్ ఫాజిల్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘పుష్ప: ది రూల్’ సినిమాలోని ఫాహద్ కొత్తపోస్టర్ను రిలీజ్ చేశారు. ‘ప్రతీకారంతో భన్వర్సింగ్ షెకావత్ సార్ బిగ్ స్క్రీన్స్పై వచ్చేందుకు రెడీ అవుతున్నారు’ అనే క్యాప్షన్తో చిత్ర యూనిట్ ఫాహద్ కొత్తపోస్టర్ను విడుదల చేసింది. ఇక ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ఈ నెల 10న హైదరాబాద్లోప్రారంభం కానుందని, హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మికా మందన్నా షూటింగ్లోపాల్గొంటారని తెలిసింది. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ పతాకాలపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2024లో విడుదల కానుంది. -
నాయకుడుతో...
ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫాహద్ ఫాజిల్, కీర్తీ సురేష్ లీడ్ రోల్స్లో నటించిన తమిళ చిత్రం ‘మామన్నన్’. ‘పరియేరుమ్ పెరుమాళ్, కర్ణన్’ లాంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన మారి సెల్వరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం తెలుగులో ‘నాయకుడు’గా ఏషియన్ మల్టీప్లెక్స్– సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ నెల 14న రిలీజ్ కానుంది. ‘‘పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రమిది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్. -
ఓటీటీలోకి రాబోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ
ఫహాద్ ఫాజిల్ పేరుకే మలయాళ నటుడు గానీ డబ్బింగ్ సినిమాల వల్ల తెలుగు ప్రేక్షకులకు గత కొన్నేళ్ల నుంచి బాగా పరిచయమే. అల్లు అర్జున్ 'పుష్ప' చిత్రంలో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఫహాద్ ఫాజిల్ నటించిన 'ధూమమ్' సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీగా ఉంది. మలయాళంతో పాటు కన్నడలో జూన్ 23న థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. యూ టర్న్ ఫేమ్ పవన్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. (ఇదీ చదవండి; రూ. 20 కోట్లతో ఇల్లు కొన్న హీరోయిన్.. ఆయన బహుమతే కదా అంటూ..) 'కేజీఎఫ్, కాంతార,సలార్' లాంటి అద్భుతమైన సినిమాలు నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ వారే ధూమమ్ను నిర్మించారు. దీన్ని తెలుగులో కూడా విడుదల చేయాల్సింది కానీ ఎందుకో వెనక్కి తగ్గి.. కేవలం మలయాళ, కన్నడ భాషలకే పరిమితం చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. జులై 21 నుంచి ధూమమ్ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. కానీ దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఈ సినిమాలో అపర్ణా బాల మురళి హీరోయిన్గా మెప్పించింది. ఓటీటీలో మాత్రం తెలుగు వెర్షన్లో ఈ సినిమా రానున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: Nayanthara: నయనతార ఆశలన్నీ 75 పైనే!) 'ధూమం' కథేంటి? సిగరెట్ కంపెనీలో పనిచేసే అవినాష్(ఫహాద్ ఫాజిల్) జీవితం, జీతం బాగానే ఉంటుంది. కానీ ఈ ఉద్యోగం వదిలేయాలని నిర్ణయించుకుంటాడు. తమ సంస్థ వల్ల చిన్నపిల్లలు కూడా పొగాకు బారిన పడుతుండటమే దీనికి కారణం. సరిగ్గా ఈ టైంలోనే అవినాష్, అతడి భార్య ఓ ప్రమాదంలో పడతారు. వీళ్ల బాడీలకు టైమ్ బాంబ్ ఫిక్స్ చేస్తారు. అది పేలకూడదంటే సిగరెట్స్ తాగుతూ తక్కువ సమయంలో కోటి రూపాయలు పోగు చేయాలి. ఈ గండం నుంచి వీళ్లు ఎలా బయటపడ్డారు అనేదే 'ధూమం' స్టోరీ. -
విచిత్ర పరిస్థితుల్లో ఫాహద్ ఫాజిల్
-
'సలార్' నిర్మాతలకు షాకిచ్చిన ఆ సినిమా రిజల్ట్!
'కేజీఎఫ్', 'కాంతార' లాంటి అద్భుతమైన సినిమాలు నిర్మించి, వందల కోట్ల లాభాలు అర్జించిన హోంబలే ఫిల్మ్స్ కు షాక్ తగిలింది. అది కూడా ఓ చిన్న మూవీ వల్ల. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఎందుకంటే మరో మూడు నెలల్లో 'సలార్' రిలీజ్కు సిద్ధంగా ఉంది. ఇలాంటి టైంలో తాము నిర్మించిన ఓ చిత్రానికి ఫ్లాప్ టాక్ రావడం అవాక్కయ్యేలా చేసింది. ఫహాద్ ఫాజిల్ పేరుకే మలయాళ నటుడు గానీ డబ్బింగ్ సినిమాల వల్ల తెలుగు ప్రేక్షకులకు గత కొన్నేళ్ల నుంచి బాగా పరిచయమే. అల్లు అర్జున్ 'పుష్ప' చిత్రంలో పోలీస్ గా నటించి ఆకట్టుకున్నాడు. ఈ మధ్యే 'ధూమం' మూవీతో థియేటర్లలోకి వచ్చాడు. దీన్ని తెలుగులో కూడా విడుదల చేయాల్సింది కానీ ఎందుకో వెనక్కి తగ్గి.. కేవలం మలయాళ, కన్నడ భాషలకే పరిమితం చేశారు. (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు.. వీడియో రిలీజ్ చేసిన నటి సురేఖావాణి) కన్నడలో లూసియా, యూటర్న్ లాంటి డిఫరెంట్ చిత్రాలతో హిట్స్ కొట్టిన పవన్ కుమార్ దీనికి దర్శకుడు కావడంతో విడుదలకు ముందే ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ సినిమా జనాల్ని పెద్దగా ఎంటర్టైన్ చేయలేకపోతోంది. రెండు రోజుల్లో రూ.2.5 కోట్లు మాత్రమే వసూళ్లు వచ్చినట్లు టాక్. స్టోరీ పరంగానూ పొరపాట్లు జరగడంతో బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా రూ.8 కోట్ల బడ్జెట్ మాత్రమే పెట్టినప్పటికీ.. నెగిటివ్ టాక్ రావడం నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ని అయోమయానికి గురిచేసింది. 'ధూమం' కథేంటి? సిగరెట్ కంపెనీలో పనిచేసే అవినాష్(ఫహాద్ ఫాజిల్) జీవితం, జీతం బాగానే ఉంటుంది. కానీ ఈ ఉద్యోగం వదిలేయాలని నిర్ణయించుకుంటాడు. తమ సంస్థ వల్ల చిన్నపిల్లలు కూడా పొగాకు బారిన పడుతుండటమే దీనికి కారణం. సరిగ్గా ఈ టైంలోనే అవినాష్, అతడి భార్య ఓ ప్రమాదంలో పడతారు. వీళ్ల బాడీలకు టైమ్ బాంబ్ ఫిక్స్ చేస్తారు. అది పేలకూడదంటే సిగరెట్స్ తాగుతూ తక్కువ సమయంలో కోటి రూపాయలు పోగు చేయాలి. ఈ గండం నుంచి వీళ్లు ఎలా బయటపడ్డారు అనేదే 'ధూమం' స్టోరీ. (ఇదీ చదవండి: మహేశ్ సినిమా క్లైమాక్స్ బయటపెట్టిన రాజమౌళి తండ్రి) -
టాలీలో మాలీ హవా
‘ప్రతిభకి భాషతో సంబంధం లేదు’ అనే మాట చిత్ర పరిశ్రమలో తరచుగా వినిపిస్తుంటుంది. టాలెంటెడ్ ఆర్టిస్ట్లు ఏ భాషలో ఉన్నా తెలుగు పరిశ్రమ సాదర స్వాగతం పలుకుతుంది. ప్రస్తుతం తెలుగులో సెట్స్పై ఉన్న పలు చిత్రాల్లో జయరామ్, పృథ్వీరాజ్ సుకుమారన్, ఫాహద్ ఫాజిల్, దేవ్ మోహన్, జోజూ జార్జ్, సుదేష్ నాయర్.. వంటి పలువురు మలయాళ నటులు కీలక పాత్రలతో హవా సాగిస్తున్నారు. ఈ మాలీవుడ్ నటులు చేస్తున్న తెలుగు చిత్రాలపై ఓ లుక్కేద్దాం. బిజీ బిజీగా... ‘భాగమతి.. అల వైకుంఠపురములో, రాధేశ్యామ్, ధమాకా... ఇలా వరుసగా తెలుగు సినిమాలు చేశారు మలయాళ సీనియర్ నటుడు జయరామ్. నెగటివ్, పాజిటివ్ క్యారెక్టర్స్తో తెలుగులో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శ కత్వం వహిస్తున్న ‘గేమ్ ఛేంజర్’తో పాటు మహేశ్బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రంలో జయరామ్ కీలక పాత్ర చేస్తున్నారు. అదిరే ఎంట్రీ మలయాళం స్టార్ హీరోల్లో ఒకరైన ఫాహద్ ఫాజిల్ ‘పార్టీ లేదా పుష్పా..’ అంటూ తెలుగులోకి అడుగుపెట్టారు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప: ది రైజ్’ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రతో అదిరే ఎంట్రీ ఇచ్చారు ఫాహద్. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్గా వస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ చిత్రంలోనూ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో నటిస్తున్నారు ఫాహద్ ఫాజిల్. ‘పుష్ప’ మొదటి భాగంలో ఆయన పాత్ర నిడివి తక్కువగానే ఉన్నా రెండో భాగంలో మాత్రం పూర్తి స్థాయిలో ఉంటుందని టాక్. పదమూడేళ్ల తర్వాత... మాలీవుడ్లో ఓ వైపు స్టార్ హీరోగా దూసుకెళుతూ మరోవైపు డైరెక్టర్గా (లూసిఫర్, బ్రో డాడీ) ప్రతిభ చూపిస్తున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్. కాగా మన్మోహన్ చల్లా దర్శకత్వం వహించిన ‘పోలీస్ పోలీస్’ (2010) చిత్రం ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చారు పృథ్వీరాజ్. ఆ చిత్రంలో ఓ హీరోగా నటించిన ఆయన పదమూడేళ్ల గ్యాప్ తర్వాత మరో తెలుగు చిత్రంలో (‘సలార్’) నటిస్తున్నారు. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో జగపతిబాబు ఓ విలన్గా నటిస్తుండగా ఆయన తనయుని పాత్రలో పృథ్వీరాజ్ నటిస్తున్నారట. పృథ్వీ పాత్ర నెగటివ్ టచ్తో ఉంటుందని టాక్. సెప్టెంబర్ 28న ‘సలార్’ విడుదల కానుంది. ‘శాకుంతలం’తో వచ్చి... గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ‘శాకుంతలం’తో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చారు దేవ్ మోహన్. మలయాళంలో నటించింది కొన్ని సినిమాలే అయినా తొలి తెలుగు చిత్రంలోనే సమంత వంటి స్టార్ హీరోయిన్కి జోడీగా నటించే అవకాశం అందుకున్నారు దేవ్ మోహన్. ఈ సినిమాలో దుష్యంత మహారాజుగా నటించి, మెప్పించారు దేవ్. ఇలా ‘శాకుంతలం’తో తెలుగుకి వచ్చి, రెండో తెలుగు సినిమా ‘రెయిన్బో’లోనూ మరో స్టార్ హీరోయిన్ రష్మికా మందన్నాకి జోడీగా నటించే చాన్స్ అందుకున్నారు దేవ్. శాంతరూబన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. జోజు.. సుదేష్ కూడా... మలయాళంలో నటుడిగా, నిర్మాతగా, గాయకుడిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న జోజూ జార్జ్ ‘ఆది కేశవ’ సినిమాతో తెలుగులోకి అడుగుపెడుతున్నారు. వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో విలన్గా నటిస్తున్నారు జోజూ. అలాగే నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న సినిమా ద్వారా సుదేష్ నాయర్ తెలుగుకి ఎంట్రీ ఇస్తున్నారని టాక్. ఈ చిత్రంలో ఆయన స్టైలిష్ విలన్ పాత్రలో కనిపిస్తారట. వీళ్లే కాదు.. మరికొందరు మలయాళ నటులు కూడా తెలుగు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
పుష్ప యూనివర్స్ పార్ట్ 3 కి లైన్ క్లియర్!
-
విలన్గా మారుతున్న స్టార్ హీరోలు.. కొత్త కండీషన్ అప్లై
టాలీవుడ్లో ఒకప్పుడు విలన్ అంటే.. గళ్ళ పంచె, పెద్ద పెద్ద మీసాలు, బుగ్గ మీద ఒకటి రెండు కత్తి గాట్లు, భారీ శరీరంతో గంభీరంగా ఉండేవారు. వారి పాత్రకి అంతగా రెస్పెక్ట్ కూడా ఉండేది కాదు. కానీ ఇప్పటి విలన్స్ మాత్రం హీరోకి సమానంగా రెస్పెక్ట్ కోరుకుంటున్నారు. ‘సర్’ అని పివాల్సిందేనని పట్టుబడుతున్నారు. గతేడాది రిలీజైన బ్లాక్ బస్టర్ పుష్పలో ఫస్టాఫ్ మొత్తం ఎదురులేకుండా ఎదుగుతూ వెళ్తుంటాడు పుష్పరాజ్.కానీ విలన్ భన్వర్ సింగ్ షేకావత్(ఫహద్ ఫాజిల్) ఎంట్రీ ఇచ్చిన తర్వాత పుష్ప స్పీడ్ తగ్గతుంది. పుష్పకు, భన్వర్ కు మధ్య కేవలం ‘సర్’ అనే పాయింట్ పైనే అసలు వైరం మొదలవుతుంది. ఒక్కటి తగ్గుతోంది పుష్పా అంటూ భన్వర్.. ఇది సర్ నా బ్రాండ్ అంటూ పుష్ప చెప్పే డైలాగ్స్.. వీరిద్దరి వైరాన్ని సీక్వెల్ వరకు తీసుకెళ్లాయి. ముఖ్యంగా భన్వర్ సింగ్ షెకావత్ తనని సర్ అని పిలవాల్సిందే అని పట్టుబట్టే సీన్,ఈ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఒక ఇటీవల విడుదలై సూపర్ సక్సెస్తో దూసుకెళ్తున్న కమల్ హాసన్ ‘విక్రమ్’లో విలన్ది కూడా సేమ్ ప్రాబ్లమ్. ఈ చిత్రం క్లైమాక్స్లో విలన్గా ఎంట్రీ ఇచ్చాడు తమిళ స్టార్ హీరో సూర్య. రోలెక్స్ క్యారెక్టర్ లో సూర్య విలనీజం ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెంటింగ్ టాపిక్.పుష్ప మాదిరే విక్రమ్లో కూడా విలన్ రెస్పెక్ట్ కోరుకున్నాడు.తన మనుషులే తనని పేరు పెట్టి పిలవడం జీర్ణించుకోలేకపోతాడు.రోలెక్స్ సర్ అని పిలవాల్సిందే అని పట్టుబడతాడు.ఈ సీన్ కూడా సినిమాకే హైలైట్ గా నిలిచింది. మొత్తంగా విలన్ గా మారుతున్న హీరోలు కొత్త కండీషన్ పెడుతున్నారు. హీరోల చేతిలో తన్నులు తిన్నా సరే రెస్పెక్ట్ మాత్రం తగ్గేదేలేదంటున్నారు.సర్ అని పిలవకపోతే సీక్వెల్ వరకు ఆ వైరం కొనసాగుతుందని చెప్పుకొస్తున్నారు. -
‘విక్రమ్’.. 13 మంది అసిస్టెంట్ డైరెక్టర్లకు కమల్ సర్ప్రైజింగ్ గిఫ్ట్స్
Kamal Haasan Gifts New Bikes to 13 Assistant Directors: విక్రమ్ మూవీ సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్నాడు హీరో కమల్ హాసన్. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఈ సినిమాతో కమల్ బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నాడు. దీంతో ప్రస్తుతం విక్రమ్ టీం, కమల్ హాసన్ మూవీ సక్సెస్ను ఆస్వాధిస్తున్నారు. విక్రమ్ మూవీ భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో కమల్ హాసన్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్కు మంగళవారం ఖరీదైన లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు కోటీకి పైగా విలువ చేసే లెక్సాస్ లగ్జరీ కారును గిఫ్ట్గాఇచ్చి సర్ప్రైజ్ చేశాడు. చదవండి: ‘విక్రమ్’ భారీ విజయం, దర్శకుడికి కమల్ లెక్సాస్ లగ్జరీ కారు బహుమతి అలాగే విక్రమ్ మూవీకి పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లకు కూడా సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఇచ్చాడు కమల్ హాసన్. ఈ సినిమాకు పని చేసిన 13 మంది అసిస్టెంట్ డైరెక్టర్లకు అపాచీ ఆర్టీఆర్ 160 (Apache RTR 160)బైక్లను బహుమతిగా ఇచ్చాడు. ఈ ఒక్కో బైక్ ధర సుమారుగా రూ. 1.45 లక్షలు ఉంటుందని సమాచారం. కాగా విక్రమ్ మూవీ కోసం వీరు చాలా హర్డ్ వర్క్ చేశారని, వారి శ్రమ ఫలితమే మూవీ బాగా వచ్చిందని కమల్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా అసిస్టెంట్ డైరెక్టర్లకు కమల్ బైక్ కీ అందిస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్బస్టర్ హిట్ను సొంతం చేసుకుంది. చదవండి: సాయి పల్లవికి పెద్ద ఫ్యాన్ని: బాలీవుడ్ డైరెక్టర్ విడుదలైన నాలుగు రోజుల్లో ఈ మూవీ దాదాపు రూ. 200 కోట్లు వసూళ్లు చేసింది. ఇక వీకెండ్స్లో (జూన్ 3 నుంచి 5 వరకు) అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో విక్రమ్ మూడో స్థానంలో నిలవడం విశేషం. విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని’రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్పై ఆర్ మహేంద్రన్ తో కలిసి కమల్ హాసన్ నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో 'విక్రమ్: హిట్ లిస్ట్' పేరుతో సుధాకర్ రెడ్డి, హీరో నితిన్ విడుదల చేశారు. ఇందులో కమల్ 67 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీగా యాక్షన్ సీన్స్ చేయడం విశేషం. https://t.co/zrQRWQN1Ta pic.twitter.com/dSi5jTXkVc — Ramesh Bala (@rameshlaus) June 7, 2022 -
విక్రమ్: కమల్ హాసన్ పారితోషికం ఎంతో తెలుసా?
తమిళ స్టార్ కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా విక్రమ్. హీరో సూర్య అతిథి పాత్రలో కనిపించనున్నాడు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగులో విక్రమ్: హిట్ లిస్ట్ పేరుతో సుధాకర్ రెడ్డి, హీరో నితిన్ రిలీజ్ చేస్తున్నారు. జూన్ 3న తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలోనూ విడుదల కానుంది. ఈ క్రమంలో ఇందులో నటీనటులకు ఎంతమేర పారితోషికం ఇచ్చారన్న విషయం ఆసక్తికరంగా మారింది. ఫిల్మీదునియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం మేరకు సినిమా బడ్జెట్ రూ.120 కోట్ల పైనే ఉండగా చిత్రబృందం రెమ్యునరేషన్ కూడా ఆ రేంజ్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. కమల్ హాసన్ రూ.50 కోట్ల మేర తీసుకుంటే డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దాదాపు రూ.8 కోట్లు అందుకున్నట్లు సమాచారం. విజయ్ సేతుపతికి రూ.10 కోట్లు, ఫహద్ ఫాజిల్కు రూ.4 కోట్ల మేర పారితోషికం సర్దినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరించిన అనిరుధ్ రవిచందర్కు సైతం రూ. 4 కోట్లు ముట్టజెప్పారట. కాగా కమల్ హాసన్ 2018 ఆగస్టులో విశ్వరూపం 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత విక్రమ్తో థియేటర్లలో సందడి చేయనుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చదవండి 👇 రూ.కోటి ఆఫర్ చేసినా పాడని కేకే! ఎవరీ కేకే, ఆయనకంటే మేమే బాగా పాడతామన్న సింగర్.. నెట్టింట ట్రోలింగ్ -
పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఈ 'దొంగాట' చూడాల్సిందే..
టైటిల్: దొంగాట నటీనటులు: ఫాహద్ ఫాజిల్, సూరజ్ వెంజరమూడ్, నిమిషా సజయన్, అలెన్సియర్ లే లోపెజ్ తదితరులు నిర్మాతలు: సందీప్ సేనన్, అనీష్ ఎం థామస్ కథ: సజీవ్ పజూర్ దర్శకత్వం: దిలీష్ పోతన్ సినిమాటోగ్రఫీ: రాజీవ్ రవి సంగీతం: బిజిబాల్ విడుదల తేది: మే 06, 2022 (ఆహా) చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుల్లో మలయాళీ నటుడు ఫాహద్ ఫాజిల్ ఒకరు. కరోనా సమయంలో ఆడియెన్స్ ఓటీటీలకు అలవాటు కావడంతో ఒక్కసారిగా ఫాహద్ పేరు దేశవ్యాప్తంగా వినిపించింది. విభిన్నమైన చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు. పాత్ర బలంగా ఉంటే ఎలాంటి సినిమా అయినా చేసేందుకు వెనుకాడరు. 'పుష్ప: ది రైజ్' సినిమాలో భన్వర్ సింగ్ షేకవాత్ అనే పోలీసు పాత్రలో ఎంతలా ఆకట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డిఫరెంట్ రోల్స్ చేస్తూ ఫ్యాన్స్, ఆడియెన్స్ ఎంటర్టైన్ చేస్తున్న ఫాహద్ ఫాజిల్ నటించిన మలయాళ చిత్రం 'తొండిముత్యాలుం దృక్సాక్షియుం'. 2017లో విడుదల మంచి విజయం సాధించిన ఈ చిత్రాన్ని తాజాగా తెలుగులో 'దొంగాట' పేరుతో 'ఆహా' ఓటీటీలో విడుదల చేశారు. ఫహద్ ఫాజిల్, సూరజ్ వెంజరమూడ్, నిమిషా సజయన్ కీలకపాత్రల్లో నటించారు. మూడు జాతీయ పురస్కారాలను అందుకున్న ఈ 'దొంగాట' ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ: ఒక మిస్అండర్స్టాండింగ్ కారణంగా దగ్గరైన ప్రసాద్ (సూరజ్ వెంజరమూడ్), శ్రీజ (నిమిషా సజయన్) ప్రేమించి గుడిలో పెళ్లి చేసుకుంటారు. తర్వాత వేరే కాపురం పెడతారు. వ్యవసాయం పండించడానికని నీళ్ల కోసం బోర్ వేసేందుకు శ్రీజ దగ్గర ఉన్న తాళి తాకట్టు పెట్టేందుకు బస్సులో వెళ్తారు. బస్సులో ప్రయాణించేటప్పుడు శ్రీజ మెడలోని బంగారు గొలుసును (తాళి) ప్రసాద్ (ఫాహద్ ఫాజిల్) అనే దొంగ కొట్టేస్తాడు. అది గమనించిన శ్రీజ.. ప్రసాద్ను పట్టుకుని నిలదీస్తే తాను దొంగలించలేదని బుకాయిస్తాడు. దీంతో బస్సులోని వారి సహాయంతో ప్రసాద్ను (ఫాహద్ ఫాజిల్) పోలీస్లకు అప్పగిస్తారు. పోలీస్ స్టేషన్కు వెళ్లిన ప్రసాద్-శ్రీజ దంపతులు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. గొలుసు కొట్టేసిన ప్రసాద్ అనే దొంగ నేరం ఒప్పుకున్నాడా ? ఆ తాళి శ్రీజ-ప్రసాద్లకు చేరిందా ? ఇలాంటి కేసుల్లో పోలీసులు ఎలా వ్యవహరిస్తారు? అనే అంశాలతో తెరకెక్కిందే ఈ 'దొంగాట'. విశ్లేషణ: ఇద్దరు దంపతులు, ఒక దొంగ, చిన్న కేసు, పోలీసులు అనే చిన్న కథను చాలా చక్కగా ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ దిలీష్ పోతన్. ఒక దొంగతనాన్ని పోలీసులు ఎలా చేధిస్తారో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఫాహద్ ఫాజిల్ బంగారు తాళిని దొంగతనం చేయడంతోనే అసలు కథ ప్రారంభవుతుంది. తర్వాత వచ్చే సీన్లు, దొంగలు, సాక్షులు, సామాన్యులతో పోలీసులు వ్యవహరించే తీరు బాగా అలరిస్తుంది. పరిస్థితులకు అనుగుణంగా తమకు ఎలాంటి సమస్య రాకుండా పోలీసుల ప్రవర్తనా శైలీ ఆలోచింపజేసేలా ఉంటుంది. అమాయకంగా ఉంటూ చివరివరకు నేరాన్ని ఒప్పుకోని దొంగల తీరు, తమకు నష్టం కలిగినా ఇంకొకరికి అన్యాయం జరగకూడదనే భావించే మధ్యతరగతి వ్యక్తుల ఆలోచనలను చాలా బాగా చూపించారు. అక్కడక్కడా సినిమా కొంచెం సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే ? దొంగలు పారిపోతే పోలీసులు వెతికే తీరు, పై అధికారులకు సమాధానం ఇచ్చేటప్పుడు వారికి కలిగే భయం, దొంగతనం చేసిన కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉండే దొంగల ప్రవర్తన వంటి అంశాలను నటీనటులు వారి నటనతో చాలా చక్కగా చూపించారు. దొంగ పాత్రలో ఫాహద్ ఫాజిల్ అద్భుతంగా నటించాడు. 'చివరివరకు బయటపడకూడదు అనేదే తన స్టైల్' అని చెబుతూ అమాయకపు చూపులు, పోలీసులతో మాట్లాడే వైఖరీ, ఎవరు లేనప్పుడు అసలైన దొంగలా ప్రవర్తించే ఫాహద్ నటన ఆకట్టుకునేలా ఉంది. మధ్యతరగతి వ్యక్తుల్లా సూరజ్, నిమిషా కూడా చాలా చక్కగా ఒదిగిపోయి నటించారు. మిగతా పోలీసు పాత్రలు సైతం వారి నటనతో మెప్పించారు. పోలీసు వ్యవస్థలోని లొసుగులు, మధ్యతరగతి వ్యక్తుల ఆలోచనా ధోరణి, సమస్యలు ఎదురైనప్పుడు వారు రాజీపడే విధానాన్ని చూపించి దర్శకుడు దిలీప్ పోతన్ మంచి మార్కులు కొట్టేశారనే చెప్పవచ్చు. అయితే ఫాహద్ ఫాజిల్ దొంగగా మారడానికి కారణాలు, తర్వాత మంచివాడిలా మారేందుకు ప్రేరేపించిన కారణాలు అంతగా చూపించలేకపోయాడు. సజీవ్ పజూర్ అందించిన కథ, శ్యామ్ పుష్కరణ్ డైలాగ్లు ఓకే అనిపించాయి. రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ, బిజిబాల్ సంగీతం పర్వాలేదనిపించింది. ఈ సినిమాలో నటనకు గానూ ఫాహద్ ఫాజిల్కు ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డు వచ్చింది. బెస్ట్ స్క్రీన్ప్లే రైటర్గా సజీవ్ పజూర్ కూడాల జాతీయ అవార్డును అందుకున్నారు. ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డును సైతం అందుకుంది ఈ మూవీ. ఫైనల్గా ఏంటంటే కాస్త నెమ్మదిగా సాగిన ఈ 'దొంగాట' ఓసారి చూడాల్సిందే. -
'పుష్ప' సినిమా కోసం అనసూయ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Anasuya Bharadwaj remuneration for Pushpa:రంగస్థలంలో రంగమత్తగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న యాంకర్ అనసూయ .. బడా సినిమాల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఇటీవలె పుష్ప సినిమాలో నటించి మరోసారి మెప్పించింది. 'దాక్షాయని' పాత్రలో మంగళం శ్రీను భార్యగా కనిపించింది. అయితే ఈ చిత్రంలో అనసూయ పాత్ర నిడివి తక్కువగా ఉందన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో నటించేందుకు అనసూయ తీసుకున్న పారితోషికంపై ఎంతన్న దానిపై చర్చ మొదలైంది. ఈ సినిమాలో నటించేందుకు ఒక్కరోజుకే అనసూయ రూ. 1-1.5లక్షల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. మొత్తంగా పదిరోజులకు పైగానే కాల్షిట్లు ఇచ్చినట్లు సమాచారం. దీంతో పుష్ప చిత్రానికి గాను దాదాపు రూ.12 లక్షల వరకు అందుకుందట. ఇక పుష్ప ఫస్ట్ పార్ట్లో అనసూయ రోల్ తక్కువగానే ఉన్నా సెకండ్ పార్ట్లో మాత్రం అనసూయ రోల్ కీలకంగా మారనుందని తెలుస్తుంది. ఫాహద్ ఫాజిల్తో కలిసి బన్నీపై పగ తీర్చుకునేలా అనసూయ క్యారెక్టర్ ఉండనుందని సమాచారం. -
పుష్పరాజ్ కోసం వాళ్లని సెట్ చేసిన సుకుమార్
Villains In Allu Arjun Pushpa Movie:స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా కోసం ఊరమాస్ లుక్లో పుష్పరాజ్గా అవతారం ఎత్తాడు. బన్నీ కెరీర్లోనే పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రతినాయకులుగా క్రేజీ స్టార్స్ను సెట్ చేశాడు సుకుమార్. హీరో పాత్రను పాన్ ఇండియా లెవల్లో ఎలివేట్ చేయాలంటే విలన్లు అంతకుమించిన స్ట్రాంగ్గా ఉండాలి. అందుకే పుష్పరాజ్కు ప్రతినాయకులుగా క్రేజీ స్టార్స్ను సెట్ చేశాడు సుకుమార్. విలన్ పాత్రల్లో హీరో, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్లు ఉండటం విశేషం. ఈ లిస్ట్లో మొదటగా చెప్పుకోవాల్సింది ఫాహద్ ఫాజిల్. అప్పటివరకు మలయాళ ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన ఫాహద్ కరోనా సమయంలో వరుస హిట్లతో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పటివరకు హీరోగానే చేస్తూ వచ్చిన ఈ మలయాళ స్టార్ హీరో పుష్ప సినిమా కోసం తొలిసారిగా పవర్ఫుల్ ప్రతినాయకుడిగా మారారు. ఇక 'భైరవగీత' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ధనుంజయ్ ఆ తర్వాత శాండల్వుడ్లో బిజీ అయ్యాడు. ఇప్పుడు ఈ హీరో కూడా పుష్పరాజ్తో యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇక ఒకప్పటి టాలీవుడ్ కమెడియన్ సునీల్ కూడా విలన్గా మారోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ సినిమాలో మంగళం శ్రీనుగా సర్ప్రైజ్ చేస్తానంటూ ఊరిస్తున్నాడు. అలాగే యాంకర్ అనసూయ,అజయ్ ఘోష్, శత్రు వంటి విలన్లు కూడా పుష్పరాజ్ను ఎదుర్కొనేందుకు రెడీ అయ్యారు. -
బాలీవుడ్లో పుష్ప నటుడి తెరంగ్రేటం..!
Actor Fahadh Faasil To Debut In Bollywood Films: కరోనా మహమ్మారి కారణంగా థియేటర్లు మూతపడటంతో సినీ ప్రేమికులు ఓటీటీల బాట పట్టారు. ఆ సమయంలో సినీ అభిమానులు, ప్రేక్షకులను అలరించిన ఏకైక నటుడు ఫహద్ ఫాజిల్. ఈ మళయాల నటుడు తన అద్భుత నటనాకౌశల్యంతో ప్రేక్షకుల నుంచే కాదు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఓటీటీ ఫ్లాట్ఫామ్లలో వచ్చిన జోజి, కార్బన్, జన్ ప్రకాశన్, కుంబలంగి నైట్స్, సూపర్ డీలక్స్ వంటి చిత్రాలతో అలరించాడు. ఈ ఫేమ్తోనే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న'పుష్ప: ది రైజ్' సినిమాలో ప్రతినాయకుడిగా ఆఫర్ కొట్టేసి, విలనిజం చూపించబోతున్నారు. తాజాగా ఫహద్పై బాలీవుడ్ దర్శకుల కన్ను పడింది. అతనితో బాలీవుడ్ డైరెక్టర్లు సినిమా తీసేందుకు చర్చలు జరుగుతున్నాయి. అంటే త్వరలోనే ఫహద్ ఫాజిల్ బీటౌన్లో అరంగ్రేటం చేయనున్నారు. ఈ విషయం గురించి ఫహద్ 'చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడే అన్ని విషయాలు చెప్పలేను. ఏం జరుగుతుందో చూద్దాం.' అని చెప్పుకొచ్చాడు. ఇంతకుముందు ఓటీటీలో రిలిజైన మాలీవుడ్ థ్రిల్లర్ 'మాలిక్' మూవీలో నటించాడు ఫహద్. రాజకీయ నేపథ్యం ఉన్న ఈ చిత్రంలో అతను వృద్ధాప్య పితృస్వామ్య పాత్ర పోషించాడు. దీని గురించి 'నేను చేసిన సులేమాన్ పాత్ర, తన వర్గాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది.' అని ఫహాద్ తెలిపారు. అలాగే మాలిక్ చిత్ర దర్శకుడు గురించి ఫహద్ మాట్లాడుతూ, 'గతంలో మహేష్ నారాయణన్తో నేను సీ యూ సూన్, టేక్ ఆఫ్ సినిమాలు చేశాను. ప్రధానంగా నేను ఏం చేయగలనో స్పష్టంగా తెలిసిన స్నేహితుడు మహేష్. అతను ఏం కోరుకుంటాడో నాకు అవగాహన ఉంది. ఎప్పుడూ సినిమా కోసం ఒకరికొకరం ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది.' అని చెప్పారు. పుష్ప సినిమాలో ప్రతినాయకుడి పాత్ర గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాని ఫహద్ తెలిపారు. షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది చదవండి: రామ్ చరణ్కు గట్టి పోటీ ఇవ్వబోతోన్న ఫహద్ ఫాజిల్! -
కమల్హాసన్, ఫాహద్, సేతుపతి.. భారీ మల్టిస్టారర్ షూటింగ్ షురు
చిన్న బ్రేక్ తర్వాత విక్రమ్ యాక్షన్ మళ్లీ షురూ అయ్యింది. కమల్హాసన్, ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రధారులుగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘విక్రమ్’. ఇందులో విక్రమ్ పాత్రలో కనిపిస్తారు కమల్. ఈ సినిమా తాజా షెడ్యూల్ కోయంబత్తూర్లో మొదలైంది. ఇప్పటివరకు జరిపిన షూటింగ్లో కమల్–విజయ్ సేతుపతి కాంబినేషన్ సీన్స్, ఫాహద్ సీన్స్ను విడి విడిగా తీశారు. తాజా షెడ్యూల్లో కమల్, విజయ్ సేతుపతి, ఫాహద్ కాంబినేషన్లో సీన్స్ను షురూ చేశారు లోకేష్. ఇవి యాక్షన్ సీక్వెన్స్ అని తెలిసింది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల చేయాలనుకుంటున్నారు. -
పుష్ప: ఫైట్స్ సీన్స్ అదిరిపోతాయి..బీ రెడీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ స్థాయిలో పాన్ ఇండియా లెవల్ తీస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలో మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ను విడుదల చేసింది చిత్ర బృందం. పుష్పరాజ్(అల్లు అర్జున్)- భన్వర్ సింగ్ షెకావత్(ఫహద్ ఫాజిల్)మధ్య వచ్చే ఫైట్ సీన్స్ అదిరిపోతాయని పేర్కొంది. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ 17న విడుదల చేయనున్నట్లు మరోసారి స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ట్విట్టర్లో ఓ పోస్ట్ను షేర్చేసింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా రష్మిక మందన్నా హీరోయిన్గా చేస్తోంది. Gripping scenes between @alluarjun & #FahadhFaasil are being shot 🔥 Witness the ultimate Face-Off between #PushpaRaj & #BhanwarSinghShekhawat on Big Screens From 17th DEC 2021.#PushpaTheRise #ThaggedheLe 🤙@iamRashmika @aryasukku @ThisIsDSP @adityamusic @MythriOfficial pic.twitter.com/togtU9OTpb — Pushpa (@PushpaMovie) October 4, 2021 -
'పుష్ప' విలన్ వచ్చేశాడు.. భన్వర్ సింగ్ షెకావత్గా ఫహద్.. లుక్ ఇదే
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. పాన్ ఇండియా లెవల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ మూవీ మొదటి భాగం ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, శనివారం ఈ మూవీ నుంచి మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ లుక్ విడుదల అయింది. ‘విలన్ ఆఫ్ పుష్ప’ పేరుతో ఫహద్ ఫస్ట్లుక్ను షేర్ చేసింది. ఇందులో ఆయన భన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీస్ అధికారిగా పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. (చదవండి: ‘కొండపొలం’ ఫస్ట్ సాంగ్.. ఆకట్టుకున్న వైష్ణవ్, రకుల్ లవ్ ట్రాక్) మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుకున్న ఈ సినిమా తొలిభాగాన్ని ‘పుష్ప ది రైజ్’ పేరుతో ఈ ఏడాది క్రిస్మస్కు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. Meet the #VillainOfPushpa 🔥 The most talented #FahadhFaasil turns into menacing BHANWAR SINGH SHEKHAWAT(IPS) to lock horns with our #PushpaRaj 👊#PushpaTheRise #ThaggedheLe 🤙@alluarjun @iamRashmika @Dhananjayaka @aryasukku @ThisIsDSP @resulp @adityamusic @MythriOfficial pic.twitter.com/P0yNiX0Ruo — Pushpa (@PushpaMovie) August 28, 2021 -
కమల్తో ఫాహద్ ఫాజిల్.. ఫోటో వైరల్
కమల్హాసన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘విక్రమ్’. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రధారులు. ఇటీవలే ‘విక్రమ్’ షూటింగ్ ప్రారంభమైంది. ముందు కమల్, సేతుపతి కాంబినేషన్ సీన్స్ను తెరకెక్కించారు. తాజాగా ఫాహద్ ఈ సెట్స్లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సీనియర్ నటుడు కమల్తో యువనటుడు ఫాహద్ చిరనవ్వులు చిందిస్తూ, ఓ సెల్ఫీ తీసుకున్నారు. -
కమల్తో విజయ్ సేతుపతి.. ఫోటో వైరల్
కమల్హాసన్ ‘విక్రమ్’ షూట్ షురూ అయింది. కార్తీ హీరోగా ‘ఖైదీ’ (2019), విజయ్ హీరోగా ‘మాస్టర్’ (2021) చిత్రాలను డైరెక్ట్ చేసిన లోకేశ్ కనగరాజ్ ఈ ‘విక్రమ్’ చిత్రానికి దర్శకుడు. ఇందులో కమల్తో పాటు విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శుక్రవారం చెన్నైలో ప్రారంభమైంది. ప్రస్తుతం కమల్హాసన్, విజయ్ సేతుపతిలపై కీలక సన్నివేశాలను తీస్తున్నారు లొకేశ్. ఈ షెడ్యూల్ తర్వాత ఓ ఫారిన్ షెడ్యూల్ను ప్లాన్ చేశారట. అలాగే ‘విక్రమ్’ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారని కోలీవుడ్ టాక్. మరి...‘విక్రమ్’ సంక్రాంతి బరిలో నిలబడతాడా? వేచి చూడాల్సిందే. -
భార్యలతో మాలీవుడ్ స్టార్ హీరోలు.. ఫోటో వైరల్
మలయాళ స్టార్ హీరోలు ఫహద్ ఫాసిల్, దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్లు ఒకచోట చేరారు. గెట్ టు గెదర్ పార్టీలో భార్యలతో కలిసి దర్శనమిచ్చారు. ఈ ఫోటోలను హీరోయిన్ నజ్రియా నజిమ్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. మలయాళ స్టార్ హీరోలంతా ఒకచోట చేరడంతో ఈ ఫోటో ప్రస్తుతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ స్వీట్ మూమెంట్ని నజ్రియా మిర్రర్ సెల్ఫీలో బంధించారు. అయితే ఈ గెట్ టు గెదర్ లో అందరూ బ్లాక్ కలర్ డ్రెస్లో కనిపించారు. ఇక ‘ట్రాన్స్’లో చివరిసారిగా కనిపించిన నజ్రియా నాచురల్ స్టార్ నానితో అంటే సుందరానికి అనే చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆమె తనకు సంబంధించిన అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది. ఇక ‘కోల్డ్ కేస్’ విడుదల కోసం హీరో పృథ్వీరాజ్ సన్నద్ధమవుతుండగా, ‘కురూప్’, ‘సెల్యూట్’ చిత్రాల రిలీజ్ కోసం దుల్కర్ ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఫహద్ ఫాసిల్ పుష్ప సినిమాలో విలన్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుంది. View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) చదవండి : కమెడియన్ అలీ సినిమాకు ప్రభాస్ ప్రమోషన్స్ ఆ హీరోయిన్ సినిమాలకు గుడ్బై చెప్పనుందట! -
పెద్ద ప్రమాదం నుంచి బయటపడిన ఫహద్ ఫాజిల్
-
అదృష్టవశాత్తూ బతికిపోయా: ఫహద్ ఫాజిల్
మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ తనకు జరిగిన ప్రమాదం గురించి సోషల్ మీడియాలో వివరాలు వెల్లడించాడు. ఇటీవలే ఓ పెద్ద ప్రమాదం నుంచి బయటపడినట్లు పేర్కొంటూ లేఖ విడుదల చేశాడు. 'మలయాన్కుంజు' సినిమా చిత్రీకరణ సమయంలో చాలా ఎత్తు నుంచి కింద పడిపోయానని తెలిపాడు. కానీ ఆ సమయంలో తల వేగంగా కింద ఆని పచ్చడి అవకుండా చేతులు భూమికి ఆనించడంతో పెద్ద ముప్పు తప్పిందని వైద్యులు తెలిపారన్నాడు. Actor #FahadhFaasil’s open letter about his accident on the sets of his film. He also supported the decision of his latest film #Maalik opting for an OTT release. pic.twitter.com/LOHhFZKffC — BARaju's Team (@baraju_SuperHit) June 16, 2021 చదవండి: పెళ్లి తర్వాత తొలిసారి స్పందించిన హీరోయిన్ ప్రణీత -
మమ్ముట్టి బాటలోనే మరో మలయాళ హీరో
పరభాష నటులు తమ పాత్రలకు డబ్బింగ్ చెప్పించుకుంటుంటారు. భాషపై పట్టు సాధించాక సొంతంగా డబ్బింగ్ చెబుతుంటారు. అయితే కొందరు మాత్రం మొదటి సినిమాకే ఆయా భాషలపై పట్టు సాధించి ప్రేక్షకులకు తమ గొంతును వినిపించానుకుంటారు మలయాళ హీరోలు మమ్ముట్టి, మోహన్లాల్ కూడా అలానే చేశారు. తాజాగా వారి బాటలోనే నడవనున్నారట మరో మలయాళ హీరో ఫాహద్ ఫాజిల్. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'పుష్ప' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు ఫాహద్. ఈ సినిమాలో తన సొంత గొంతును వినిపించుకుంటున్నార. లాక్డౌన్ కారణంగా షూటింగ్కు బ్రేక్ పడటంతో తెలుగు నేర్చుకునే పనిలో ఉన్నారట. వీలైనంత త్వరగా తెలుగు మీద పట్టు సాధించి పుష్పలో సొంత గొంతు వినిపించేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. -
రెండు రోజుల్లో రిలీజ్.. ఈలోపే మృతి
కరోనా టైంలో తెలుగు చిత్రపరిశ్రమలో వరుస విషాదాలు సంభవిస్తున్నాయి. సింగర్ ఆనంద్, స్టిల్ ఫొటోగ్రాఫర్ మోహన్జీ, రచయిత నంద్యాల రవి, ప్రముఖ ఇంటర్వ్యూ జర్నలిస్ట్.. నటుడు టీఎన్ఆర్, పీఆర్వో బీఏ రాజులు కన్నుమూసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఉదయం మరో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ ప్రొడ్యూసర్ అన్నంరెడ్డి కృష్ణకుమార్ ఈ తెల్లవారుఝామున గుండెపోటుతో కన్నుమూశారు. విశాఖపట్టణంలో ఈ ఉదయం ఆయన చనిపోయినట్లు తెలుస్తోంది. కృష్ణకుమార్ తెలుగులో ప్రొడ్యూసింగ్ వహించిన ‘అనుకోని అతిథి’ సినిమా మరో రెండు రోజుల్లో ‘ఆహా’లో రిలీజ్ కావాల్సి ఉంది. ఇంతలోనే ఆయన మృతి చెందడం ఆయన సన్నిహితుల్ని విషాదంలోకి నెట్టింది. కాగా, కృష్ణకుమార్ మృతి విషయం తెలిసిన పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు. ఫహద్ ఫాజిల్, సాయి పల్లవి లీడ్ రోల్లో వివేక్ డైరెక్ట్ చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘అథిరన్’. మలయాళంలో హిట్ అయిన ఈ మూవీ ‘అనుకోని అతిథి’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ వెర్షన్కి నిర్మాతల్లో అన్నంరెడ్డి కృష్ణ కుమార్ ఒకరు. గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు గమనించే లోపే ఆయన మృతి చెందినట్లు సమాచారం.కాగా, మూవీ స్ట్రీమింగ్కు సరిగ్గా రెండు రోజుల ముందు కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. -
కమల్తో తలపడనున్న ‘పుష్ప’విలన్
మలయాళ స్టార్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్ వరుసగా విలన్ రోల్స్కు ఓకే చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ‘పుష్ప’ సినిమాలో విలన్గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఫాహద్. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. తాజాగా ‘ఖైదీ, మాస్టర్’ చిత్రాల ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్హాసన్ నటిస్తున్న ‘విక్రమ్’ అనే తమిళ సినిమాకు ఓకే చెప్పారు. ఈ చిత్రంలో ఓ లీడ్ క్యారెక్టర్ చేయనున్నట్లు ఫాహద్ తెలిపారు. ఆయన చేస్తున్నది విలన్ పాత్ర అని చెన్నై సమాచారం. తమిళంలో ఫాహద్ చేస్తున్న మూడో చిత్రం ఇది. ఇంతకుముందు శివకార్తికేయన్ ‘వేలైక్కారన్ ’, విజయ్ సేతుపతి – సమంతల ‘సూపర్ డీలక్స్’ చిత్రాల్లో ఫాహద్ నటించారు. -
పుష్పరాజ్ను ఢీకొట్టే ధీటైన విలన్ దొరికాడు
‘ఆర్య, ఆర్య 2’ చిత్రాల తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, రవి శంకర్.వై నిర్మిస్తున్నారు. ప్యాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో రష్మికా మందన్న కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలో పుష్పరాజ్ను (అల్లు అర్జున్ పాత్ర) ఢీకొట్టే ధీటైన విలన్ ఎవరనే ఊహాగానాలకు తెరపడింది. జాతీయ అవార్డు గ్రహీత, మలయాళీ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ ‘పుష్ప’లో ప్రతినాయకుడిగా నటించనున్నారని మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. ఫాహద్ నటించిన పలు మలయాళ చిత్రాలు తెలుగుతో పాటు ప్యాన్ ఇండియా వైడ్ కూడా సినీ అభిమానుల్ని అలరించాయి. ఇటీవల ఆయన నటించిన ‘ట్రాన్స్, సీ యూ సూన్ ’ సినిమాలు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాయి. ‘‘పుష్ప షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఆగస్టు 13న విడుదల చేయనున్నాం’’ అని నిర్మాతలు అన్నారు. -
కమల్ సినిమాలో మలయాళ హీరో విలన్!
‘ఖైదీ, మాస్టర్’ చిత్రాల దర్శకుడు లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో కమల్హాసన్ ఓ సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే. నవంబర్లో కమల్ పుట్టినరోజున ఈ సినిమా టీజర్, టైటిల్ను విడుదల చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో విలన్గా మలయాళ హీరో ఫాహద్ ఫాజిల్ కనిపిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఆ మధ్య సూపర్ డీలక్స్’ వేలైకారన్’ వంటి తమిళ సినిమాల్లో నటించారు ఫాహద్. ‘వేలైకారన్’లో చేసిన విలన్ పాత్ర ఫాహద్ కి మంచి పేరు తెచ్చింది. -
సీ యూ సూన్
లాక్డౌన్ వల్ల అన్ని ఇండస్ట్రీ వాళ్లు షూటింగ్స్ ఆపేస్తే మలయాళ ఇండస్ట్రీలో ఓ బృందం ఈ పరిస్థితిని చాలెంజ్గా తీసుకుని లాక్డౌన్లోనే ఓ సినిమా ప్రారంభించి పూర్తి చేసింది కూడా. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్, రోషన్ మాథ్యూస్, దర్శనా రాజేంద్రన్ ముఖ్య పాత్రల్లో మహేశ్ సి. నారాయణ్ దర్శకత్వంలో ‘సీ యూ సూన్’ అనే చిత్రం తెరకెక్కింది. 70 నిమిషాల నిడివి ఉండే ఈ సినిమాను పూర్తిగా ఐ ఫోన్లో చిత్రీకరించారు. చిత్రీకరణ మొత్తం లాక్డౌన్ సమయంలోనే అన్ని జాగ్రత్తలు పాటిస్తూ చేశారు. సెప్టెంబర్ 1న ఈ సినిమా అమేజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. -
అతిథి వస్తున్నారు
కేరళలో 1970లలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘అధిరన్’. సాయిపల్లవి, ఫాహద్ ఫాజిల్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో వివేక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం ‘అనుకోని అతిథి’ పేరుతో నవంబర్ 15న తెలుగులో రిలీజ్ కానుంది. ఇన్ ట్రూప్ ఫిలిమ్స్ సమర్పణలో జయంత్ ఆర్ట్స్ బ్యానర్పై అన్నంరెడ్డి కృష్ణకుమార్, గోవింద రవికుమార్ తెలుగులో విడుదల చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సైకలాజికల్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రమిది. సాయిపల్లవి, ప్రకాశ్రాజ్, అతుల్ కులకర్ణి నటన సూపర్బ్. ప్రభాస్ ‘సాహో’కి నేపథ్య సంగీతం అందించిన జిబ్రాన్ ఈ చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారు. మలయాళంలోలానే తెలుగులోనూ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అను మోతే దత్, సంగీతం: పి.ఎస్. జయహరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దక్షిన్ శ్రీన్వాస్, సమర్పణ: దీపా సురేందర్ రెడ్డి. -
నిత్యాకు థ్యాంక్స్ చెప్పిన నజ్రియా
తమ వివాహబంధానికి పరోక్షంగా సహాయపడిన నిత్యామీనన్కు నటి నజ్రియా కృతజ్ఞతలు తెలిపారు. రాజా రాణి, నైయ్యాండి వంటి చురుకైన పాత్రల్లో నటించి తమిళ అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన నజ్రియా కెరీర్ శిఖరాగ్రాన ఉన్న సమయంలోనే నటుడు ఫహద్ ఫాజిల్ను వివాహమాడి సెటిలయ్యారు. వీరి ప్రేమ కలిసి రావడంతో చిత్రాలను తనకు వదిలిపెట్టిన విషయాన్ని నిత్యామీనన్ ప్రస్తుతం వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ ‘బెంగళూరు డేస్’మలయాళ చిత్రంలో తనను కథానాయకిగా నటించేందుకు అడిగారన్నారు. వేరే చిత్రాల్లో బిజీగా ఉండడంతో ఆ చిత్రాన్ని అంగీకరించలేకపోయానన్నారు. ఆ అవకాశం నజ్రియాకు దక్కిందని, ఫహద్ ఫాజిల్ హీరోగా నటించినట్లు తెలిపారు. ఆ సమయంలోనే నజ్రియాకు ఫహద్కు మధ్య ప్రేమ చిగురించిందన్నారు. తనకు వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టడంతో వారి వివాహబంధానికి దారితీసినట్లు గొప్పగా చెబుతుంటారని తెలిపారు. -
నా వల్లే ఆమె పెళ్లి జరిగింది!
తమిళసినిమా: నా వల్లే ఆమె పెళ్లి జరిగింది అంటోంది నటి నిత్యామీనన్. సినీ పరిశ్రమలో పొగరుబోతుగా ముద్ర పడిన నటి నిత్యామీనన్. తనకు నచ్చితే ఎలాంటి పాత్రనైనా చేయడానికి సై అనే ఈ కేరళా కుట్టి నచ్చకపోతే ఎంత పెద్ద దర్శకుడి చిత్రానైనా నిరాకరించేస్తుంది. అలా మాతృభాషలోనూ తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకుంది. ప్రస్తుతం జయలలిత బయోపిక్లో టైటిల్ పాత్రను పోషిస్తున్న నిత్యామీనన్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది. నటి నజ్రియా గుర్తుండే ఉంటుంది. తిరుమణం ఎన్నుం నిక్కా, రాజారాణి వంటి కొన్ని తమిళ చిత్రాల్లో నటించిన ఈ మలయాళీ బ్యూటీ మాతృభాషలోనూ పలు చిత్రాలు చేసింది. కథానాయకిగా మంచి మార్కెట్ ఉండగానే నటుడు ఫాహత్ ఫాజిల్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తాజాగా సినిమాలకు రీఎంట్రీ అవుతోందనుకోండి. అది వేరే విషయం. ఈమె పెళ్లికి తానే కారణం అంటోంది నటి నిత్యామీనన్. దీని గురించి ఈమె తెలుపుతూ బెంగళూర్ డేస్ అనే మలయాళ చిత్రంలో హీరోయిన్గా నటించే అవకాశం తనకే వచ్చిందని చెప్పింది. అయితే తానప్పుడు ఇతర చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల ఆ చిత్రంలో నటించలేకపోయానని చెప్పింది. తాను వదులుకున్న అవకాశం ఆ తరువాత నటి నజ్రియాను వరించిందని చెప్పింది. ఆ చిత్ర షూటింగ్లోనే ఫాహత్ ఫాజిల్కు, నటి నజ్రియా మధ్య పరిచయం ప్రేమగా మారిందని, ఆ చిత్ర నిర్మాణం పూర్తి అయ్యేలోపే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారన్న రహస్యాన్ని నిత్యామీనన్ బయట పెట్టింది. అంతే కాదు ఏ కార్యక్రమంలో కలిసినా నీ వల్లే మా పెళ్లి జరిగిందని నటి నజ్రియా, ఫాహత్ ఫాజిల్ గొప్పగా అంటుంటారని నిత్యామీనన్ చెప్పుకొచ్చింది. ఇంతకీ మీ పెళ్లి ఎప్పుడమ్మా అంటే మాత్రం దానికి ఇంకా చాలా టైమ్ ఉంది అంటూ దాటేసే ధోర ణిలో మాట్లాడుతోంది. -
37 టేకులు తీసుకున్నా!
నటిగా రమ్యకృష్ణ ప్రూవ్డ్. విభిన్నమైన పాత్రలు చేశారు. పాజిటివ్, నెగటివ్.. ఏ షేడ్స్ అయినా స్క్రీన్ని షేక్ చేశారు. అయితే నటిగా నిరూపించేసుకున్నాం కదా అని రిలాక్స్డ్గా ఉండటం ఆమెకు నచ్చదు. కొత్త కొత్త చాలెంజ్లను స్వీకరిస్తూ తనని తాను మెరుగుపరుచుకోవడానికి ఇష్టపడుతున్నారు. లేటెస్ట్గా తమిళంలో ‘సూపర్ డీలక్స్’ అనే చిత్రంలో నటించారు రమ్యకృష్ణ. ప్రస్తుతం తమిళంలో భారీ అంచనాలు చుట్టుముట్టిన సినిమా అది. విజయ్ సేతుపతి, రమ్యకృష్ణ, సమంత, ఫాహద్ పాజిల్ ముఖ్యపాత్రల్లో నటించారు. త్యాగరాజన్ కుమారరాజ దర్శకుడు. ఇందులో రమ్యకృష్ణ శృంగార తార పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో పోషించిన పాత్ర గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘నా కెరీర్లో నేను చేసిన చాలెంజింగ్ పాత్ర ఇది. కొన్ని పాత్రలు డబ్బు కోసం, మరికొన్ని పాపులారిటీ కోసం , పేరుకోసం చేస్తాం. ఈ సినిమా ప్యాషన్ కోసం చేశాను. ఓ సన్నివేశాన్ని ఏకంగా 37 సార్లు షూట్ చేయాల్సి వచ్చింది. రెండు రోజుల పాటు ఒకే షాట్ కోసం 37 టేకులు చేశాం. నా కంటే నా అసిస్టెంట్స్ చాలా షాక్ అయ్యారు’’ అని పేర్కొన్నారామె. ‘‘37 టేకులే ఎక్కువనుకుంటే ఈ సినిమా కోసం 100, అంతకుమించి టేకులు తీసుకొని షూట్ చేసిన సీన్స్ కూడా ఉన్నాయి. రమ్యకృష్ణ ఈ పాత్ర చేస్తారా? చేయరా? అనుకున్నాం. కానీ ఆమె చాలా కూల్. తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు పుష్ చేస్తున్నట్టు కష్టపడ్డారామె’’ అని దర్శకుడు త్యాగరాజ కుమారరాజన్ తెలిపారు. -
భర్త కోసం సింగర్గా మారిన హీరోయిన్!
అందమైన మోము, అమాయకపు నటన, క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు మాలీవుడ్ బ్యూటీ నజ్రియా నజీమ్. నటుడు ఫాహద్ ఫాజిల్ను పెళ్లి చేసుకున్నాక సినిమాలకు పూర్తిగా దూరమైన ఆమె.. సుమారు నాలుగేళ్ల విరామం తర్వాత సిల్వర్ స్క్రీన్పై కనిపించేందుకు సిద్ధమయ్యారు. ‘బెంగళూర్ డేస్’ డైరెక్టర్ అంజలి మీనన్ డైరెక్షన్లో ప్రస్తుతం ఓ మలయాళ చిత్రంలో నటిస్తున్నారు. హీరోయిన్గా కొనసాగుతూనే ప్రొడ్యూసర్ కొత్త అవతారమెత్తారు. తన భర్త ఫాహద్ హీరోగా నజ్రియా నజీమ్ బ్యానర్పై ‘వరదాన్’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. మరో విశేషమేమిటంటే ఈ సినిమాలో నజియా ఓ పాట కూడా పాడారట. ఇందుకు సంబంధించిన ఫొటోను.. ‘వరదాన్’ సినిమా సంగీత దర్శకుడు సుశిన్ శ్యామ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. తమ అభిమాన హీరోయిన్ రీ ఎంట్రీ ఇవ్వడంతో పాటు, నిర్మాతగా, సింగర్గా తమను అలరించేందుకు సిద్ధమవుతున్నారంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అమల్ నీరద్ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ సినిమాలో ఫాహద్కు జోడీగా ఐశ్వర్య లక్ష్మి నటిస్తున్నారు. ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. కాగా ఇంతకుముందు ‘సాలా మొబైల్స్’ అనే మలయాళ చిత్రంలో కూడా నజియా ఓ పాటను ఆలపించారు. #studiosession #upcomingproject #songrecording #nazriyafahadh #vivekthomasproductions #varathan A post shared by Sushin Shyam (@sushintdt) on Jun 23, 2018 at 7:07am PDT -
నజ్రియా రిటర్న్స్
నయనతారకు సిస్టరా?.. నజ్రియా నజీమ్ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో చాలామంది ఇలానే అనుకున్నారు. ఎందుకంటే నయనతార పోలికలు కొంచెం నజ్రియాలో కనిపిస్తాయి. ఆ సంగతలా ఉంచితే నజ్రియా చాలా క్యూట్గా ఉంటారు. తన అమాయకపు నటన, క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో చాలామంది ఫ్యాన్స్ను సంపాదించుకున్నారామె. నటుడు ఫాహద్ ఫాజిల్ను పెళ్లి చేసుకున్నాక సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. నజ్రియా నటించిన లాస్ట్ మూవీ ‘బెంగళూర్ డేస్’. విశేషం ఏంటంటే ఆ సినిమాలో ఫాహద్ భార్యగానే నటించారామె. మళ్లీ మలయాళ స్క్రీన్పై కనిపించటానికి రెడీ అయ్యారు నజ్రియా. ‘బెంగళూర్ డేస్’ డైరెక్ట్ర్ అంజలి మీనన్ డైరెక్షన్లో ప్రస్తుతం ఓ చిత్రంలో యాక్ట్ చేస్తున్నారామె. ఈ సినిమాలో పార్వతి, పృథ్వీరాజ్ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇది కాకుండా భర్త ఫాహద్తో ఓ సినిమాలో కనిపిస్తారట నజ్రియా. అన్వర్ రషీద్ దర్శకత్వంలో రూపొందనున్న ‘ట్రాన్స్’ సినిమాలో ఫాహద్కు జోడీగా నజ్రియాను సంప్రదించినట్టు మలయాళం మీడియా టాక్. దాదాపు నాలుగేళ్ల తర్వాత నజ్రియా స్క్రీన్పై కనిపించనుండటం ఆమె అభిమానులకు ఆనందం కలిగించే విషయం. -
నందికొండ వాగుల్లోన నల్లతుమ్మ నీడల్లో...
జస్ట్... ఈ పాట ఒక్కటే తక్కువ. అక్కడ ఎవరైనా పాడితే మాత్రం... మమతా మోహన్దాస్ సిచ్యువేషన్కి సరిగ్గా సూటవుతుంది! ఇప్పుడు వాగులు–వంకలు... కొండలు–కోనలు... వెంట మమతా మోహన్దాస్ ప్రయాణం సాగుతోంది. ఎందుకంటే... మాతృభాష మలయాళంలో ‘కార్బన్’ అనే సినిమాలో నటిస్తున్నారీ బ్యూటీ. ఇందులో ఫాహద్ ఫాజిల్ హీరో. ఫారెస్ట్ అడ్వెంచర్గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ కోసం కేరళలోని అడవులన్నిటినీ చుట్టేస్తోంది చిత్రబృందం. ‘గీతాంజలి’లో ‘నందికోండ వాగుల్లో...’ పాటది హారర్ కాన్సెప్ట్. ‘కార్బన్’ కాన్సెప్ట్ ఎలా ఉంటుందో గానీ... షూటింగులో హీరోయిన్ కంపల్సరీగా ఉండాలి కదా! అఫ్కోర్స్... యూనిట్ మెంబర్స్ నీడలా మమత వెంటే నడుస్తూ జాగ్రత్తగా చూసుకుంటారనుకోండి. ఎంతైనా... అడవుల్లో అడుగులేయడమంటే ఎంతోకొంత భయం ఉంటుంది కదా! తెలుగులో ఎన్టీఆర్ ‘యమదొంగ’, వెంకటేశ్ ‘చింతకాయల రవి’, నాగార్జున ‘కింగ్’ తదితర చిత్రాల్లో నటించిన మమతా మోహన్దాస్, క్యాన్సర్ను జయించిన తర్వాత ఎక్కువగా మలయాళ సినిమాలే చేస్తున్నారు. -
వాళ్లు అయినా సిద్ధూను కరుణిస్తారా..!
చాలా రోజులుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న సౌత్ ఇండియన్ స్టార్ హీరో సిద్దార్థ్ను ఓ క్రేజీ ఆఫర్ వెతుక్కుంటూ వచ్చింది. తెలుగుతో పాటు తమిళ్లో కూడా సరైస సక్సెస్లు లేక కెరీర్ కష్టాల్లో ఉన్న సమయంలో మళయాళ ఇండస్ట్రీ పిలిచి మరీ సిద్దార్థ్కు సినిమా ఛాన్స్ ఇచ్చింది. ఇటీవల వరుస ఫెయిల్యూర్స్తో కష్టాల్లో ఉన్న ఈ సౌత్ స్టార్కు ఇది గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. మాలీవుడ్ యాడ్ ఫిలిం మేకర్ రతీష్ అంబట్ తొలి ప్రయత్నంగా తెరకెక్కిస్తున్న సినిమాలో సిద్దార్థ్ను హీరోగా ఎంపిక చేసుకున్నారు. దిలీప్ మరో లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాలో తొలుత ఫహద్ ఫాజిల్ను హీరోగా నటింపచేయాలని భావించినా, అది వర్క్ అవుట్ కాకపోవటంలో ఫైనల్గా సిద్దార్థ్ ను సెలెక్ట్ చేసుకున్నారు. కొద్ది రోజులుగా తమిళ నాట కూడ అవకాశాలు లేక, ఛాన్స్ల కోసం ఎదురుచూస్తున్న సిద్దార్థ్ ప్రస్తుతం మళయాళీ ఇండస్ట్రీలో సత్తా చాటాలని భావిస్తున్నాడు. జబర్థస్త్ సినిమా తరువాత టాలీవుడ్కి దూరమైన సిద్దార్ధ్ ఇటీవల కావ్యతలైవన్ సినిమాతో కోలీవుడ్ లో మంచి సక్సెస్ సాదించాడు. అయితే ఈ సినిమా సక్సెస్ సిద్దార్థ్ కెరీర్ను గాడిలో పెట్టలేకపోయింది. ప్రస్తుతం ఒక్క తమిళ సినిమా మాత్రమే చేతిలో ఉన్న సిద్దార్థ్ ఇప్పుడు మళయాళంలో ఆఫర్ రావటంతో కాస్త ఆనందంగా ఉన్నాడు. -
నటి నజ్రియా నజీమ్ పెళ్లి సందడి
-
పెళ్లిపీటలెక్కిన హీరోయిన్
చెన్నై: యువ నటి నజ్రియా పెళ్లిపీటలెక్కారు. తమిళంలో నేరం చిత్రం ద్వారా పరిచయం అయిన నటి మలయాళ నటి నజ్రియా నజీమ్. రాజారాణి, నయ్యాండి, తిరుమణం ఎనుమ్ నిఖా తదితర చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు పొందిన ఈ కేరళ కుట్టికి మలయాళ యువ నటుడు, దర్శకుడు ఫాజిల్ కొడుకు అయిన పాహత్ ఫాజిల్తో వివాహం గురువారం కేరళలో ఘనంగా జరిగింది. అయితే బుధవారం తిరువనంతపురం సమీపంలోని కోవళంలో గల నక్షత్ర హోటల్లో వీరి మెహందీ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. నటి కావ్యా మాధవన్ మీరానందన్, మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్ తదితర సినీ సన్నిహితులు పాల్గొన్నారు. గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు తిరువనంతపురంలోని కల్యాణ మండపంలో పాహత్ ఫాజిల్, నజ్రియాల వివాహం ముస్లిం సంప్రదాయ బద్దంగా జరిగింది. ఈ వివాహానికి సన్నిహిత బంధు మిత్రులే పాల్గొన్నారు. దీంతో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
మలయాళ నటునితో మణిరత్నం సినిమా?
రావణ, కడలి... ఇలా ఇటీవల మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రాలు ఆశించిన ఫలితం సాధించలేదు. దాంతో తన తాజా చిత్రం విషయంలో మణిరత్నం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారట. గత కొన్ని నెలలుగా ఆయన కథ తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. మామూలుగా మణిరత్నం ఈ మధ్య ఏ సినిమా చేసినా బహు భాషల్లో చేస్తున్నారు. తాజా చిత్రం కూడా ఆ కోవకే చెందుతుందని సమాచారం. ఈ చిత్రం గురించి ఏ విశేషాలూ ఇంకా బయటికి రాలేదు. అయితే, మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ని ఓ లీడ్ రోల్కి ఎంపిక చేశారట. మలయాళ తారలతో మణిరత్నం సినిమా చేయడం ఇది కొత్త కాదు. మమ్ముట్టి, మోహన్లాల్, పృధ్వీరాజ్తో ఆయన సినిమాలు చేశారు. ఇప్పుడా జాబితాలో తను చేరినందుకు ఫాహద్ ఆనందంగా ఉన్నారట.