fisheries
-
మత్స్యకారుల ఆశలపై నీళ్లు చల్లిన కూటమి ప్రభుత్వం
సముద్రపు ఆటుపోటుల సమయంలో ఉండే అల జడి ఇప్పుడు మత్స్య కారుల కుటుంబాల్లో కని పిస్తోంది. నిత్యం ఉద్రేకంగా ఉరకలు వేసే సము ద్రంతో సావాసం చేసే గంగపుత్రులకు పొంచి ఉన్న మరో పెనుముప్పు ఇందుకు కారణం. గంగమ్మ కరుణిస్తేనే కడుపు నిండే తీరప్రాంత మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఉప్పెనలాంటి ముప్పు తీసుకొని వచ్చింది. కష్టాలు తీర్చవలసిన ప్రభుత్వమే ముప్పులాగ మారితే మత్స్యకారుల పరిస్థితి చుక్కాని లేని నావలా మారడం తప్ప మరొకటి కాదు. రాష్ట్రంలో సువిశాలమైన 974 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. ఈ ప్రాంతములో వేట కోసం కనీస సౌకర్యాలు లేక ఇక్కడ మత్స్య కారులు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్ళి సమస్యలు కొనితెచ్చుకొంటున్నారు.ఇది గమనించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రభుత్వ హయాంలో 10 ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వీటిలో జవ్వలిదిన్నె ఫిషింగ్ హార్చర్ ప్రారంభమయ్యింది. మరికొన్ని సగానికి పైగా పనులు పూర్తిచేసుకుంటున్నాయి. దీనితో తమ జీవితాలలో వెలుగులు రానున్నాయని ఆనందంగా ఉన్న మత్స్యకారుల ఆశలుపై కొత్తగా వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం నీళ్ళు చల్లుతూ ఫిషింగ్ హార్బర్లను ప్రైవేట్ పరం చేసేందుకు సన్నహాలు ప్రారంభించింది. ఈ ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేసి నిర్వహించేందుకు ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వనిస్తూ కూటమి ప్రభుత్వం టెండర్లను పిలిచి మత్స్యకారుల కుటుంబాల్లో అమవాస్య చీకటిని నింపింది.గతంలో వైస్ జగన్ ప్రభుత్వం రూ. 3,520 కోట్లతో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీ పట్నం, ఉప్పాడ, మంచినీళ్ళుపేట, బూడగడ్ల పాలెం, పుడిమెడక, కొత్తపట్నం, ఓడరేవు, బియ్యపుతిప్ప లాంటి 10 ప్రాంతాల్లో ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటు కోసం పనులు ప్రారంభించింది. ఈ హార్బర్లు అందుబాటులోకి వస్తే సుమారు 10,521 మెకనైజ్డ్ బోట్లు నిలిపే సామర్థ్యంతో పాటు సుమారు 5 లక్షల టన్నుల అదనపు మత్స్య సంపదను పెంచుకొనే వెసులు బాటు ఉంటుంది. దీనితోపాటు ప్రత్యక్షంగా, పరో క్షంగా వేలాది మంది మత్స్య కారులకు జీవనోపాధి పెరుగుతుంది. ఇటువంటి హార్బర్లను ప్రభుత్వం నిర్వహించకుండా ప్రైవేటుకు అప్పగిస్తే, కార్పొరేట్ల చేతుల్లోకి మత్స్యకారుల బతు కులు వెళతాయి.వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు గత ప్రభుత్వం ‘మత్స్యకార భరోసా’ పేరుతో భృతి అందించేది. దీన్ని కూడా రీ సర్వే పేరుతో కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటుకు ముందు ఉన్న చంద్రబాబు ప్రభుత్వం వేట నిషేధ సమయంలో నాలుగు వేల రూపాయల భృతి ఇచ్చేది. దాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం రూ. 10,000కు పెంచింది. అన్నిరకాల బోట్లతో పాటు, తెప్పలు, నాటు పడవలకు మత్యకార భరోసా అందించింది. గత 5 ఏళ్లలో ప్రతీ సంవత్సరం మే నెలలో మత్స్యకార భరోసా అందిస్తూ 5 ఏళ్ళల్లో రూ. 538 కోట్లు ఖర్చు చేసింది. ఈ పథకం అమలు చేయడంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తాత్సారం చేస్తోంది.చదవండి: శ్రీబాగ్ ఒడంబడిక అమలే కీలకం!జగన్ ప్రభుత్వం మత్స్యకారులకు ఇతర పథకాల ద్వారానూ చేదోడుగా వాదోడుగా నిలిచింది. చేపల వేట సమయంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు గతంలో చంద్రబాబు ప్రభుత్వం రూ. 5 లక్షలు పరిహారం అందించగా... జగన్ ప్రభుత్వం దాన్ని రూ. 10 లక్షలకు పెంచి వెనువెంటనే అందించింది. గత ఐదేళ్లలో 175 మంది గంగపుత్రులు మృతి చెందగా వారి కుటుంబాలకు ఒక్కక్కరికి రూ. 10 లక్షలు చొప్పున జగన్ ప్రభుత్వం రూ. 17.50 కోట్ల పరిహారాన్ని అందజేసింది. అదేవిధంగా గతంలో ఆరు రూపాయలుగా ఉన్న డీజిల్ సబ్సిడీని తొమ్మిది రూపాయలకు పెంచింది. ఈ లెక్కన ఐదేళ్లలో బోట్ల యజమానులకు రూ. 148 కోట్లు చెల్లించింది. వీటితో పాటు అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జీఎస్పీసీ తవ్వకాల వల్ల జీవనోపాధి కోల్పోయిన 16,554 మంది మత్స్యకార కుటుంబాలకు రూ. 78.22 కోట్లు, ఓఎన్జీసీ పైపు లైను తవ్వకాల వల్ల జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది కుటుంబాలకు 5 విడతల్లో రూ. 647.44 కోట్లు సహాయాన్ని జగన్ ప్రభుత్వం అందించింది.చదవండి: వాగ్దానాలు గాలికి వదిలినట్లేనా? మొట్టమొదటిసారిగా మత్స్యకార వర్గానికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి సమున్నత గౌరవం కల్పించింది వైఎస్సార్సీపీనే అనేది మరువరాదు. ప్రస్తుత ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కొనసాగించాలి. అలాగే ఫిషింగ్ హార్బర్ల ప్రైవేటీకరణను నిలిపి వేయాలి.- బందన పూర్ణచంద్రరావు జాతీయ మత్స్యకార సంఘం వైస్ చైర్మన్(నేడు ప్రపంచ మత్స్యకార దినోత్సవం) -
అంతర్జాతీయ ప్రాసెసింగ్ హబ్గా భారత్
సాక్షి, విశాఖపట్నం: మత్స్య రంగంలో భారత్ను అంతర్జాతీయ ప్రాసెసింగ్ హబ్గా అభివృద్ధి చేసేందుకు ఫిషరీస్ విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని కేంద్ర మత్స్య, పశుసంవర్థక, పాడి పరిశ్రమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు. రొయ్యల పెంపకం–వాల్యూచైన్ బలోపేతం చేయడంపై దృష్టి సారించేలా మత్స్య ఎగుమతి ప్రమోషన్పై వాటాదారులతో సంప్రదింపులకు విశాఖపట్నంలో శుక్రవారం జాతీయ స్థాయి సదస్సు జరిగింది. ఈ సదస్సుకు కేంద్ర మంత్రి రాజీవ్ సింగ్తో పాటు మత్స్యశాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాజీవ్ రంజన్ సింగ్ మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థలో 9 శాతం వృద్ధి రేటుతో మత్స్య రంగం ముఖ్య భూమిక పోషి స్తోందన్నారు. ఈ వృద్ధి 2047 నాటికి వికసిత్ భారత్గా అభివృద్ధి చేయడంలో కీలకంగా వ్యవహరిస్తుందన్నారు. మత్స్యశాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ మాట్లాడుతూ పీఎంఎంఎస్ వై పథకం కింద నిధుల కేటాయింపులు పెంచుతూ ఫిషరీస్, ఆక్వా పరిశ్రమలకు చేయూతనందిస్తున్నామని తెలిపారు. కొద్ది రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ రూ.1,564 కోట్ల విలు వైన 218 కొత్త ప్రాజెక్టుల అమలు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఫీడ్ ఇన్పుట్లు, ఇతర సౌకర్యాలకు సంబంధించిన దిగుమతి సుంకాలను తగ్గించామని తెలిపారు. -
ఉపాధికి గడ్డుకాలం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వ్యవసాయం, మత్స్యకార రంగాల తర్వాత శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా ఉపాధి దొరికేది గ్రానైట్ పరిశ్రమల్లోనే. ఇప్పుడా పరిశ్రమలు మూతబడ్డాయి. నూతన పాలసీ పేరుతో గ్రానైట్ పరిశ్రమలను ప్రభుత్వమే మూసివేయించింది. రెండు నెలలుగా గ్రానైట్ ఫ్యాక్టరీల్లో పనులు జరగడం లేదు. ఉపాధి లేక కార్మికులు పస్తులుండాల్సిన పరిస్థితి. వారి ఆకలికేకలను జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు.ఇప్పట్లో పరిశ్రమలు తెరుచుకునే పరిస్థితి లేదని భావిస్తున్న కార్మికులు.. మళ్లీ వలస బాట పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 150 క్వారీలు ఉన్నాయి. వాటికి అనుసంధానంగా మరో 150 పాలిíÙంగ్ యూనిట్లు, 30 క్రషర్లు ఉన్నాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా సుమారు 25 వేల మంది, పరోక్షంగా 45 వేల మంది ఉపాధి పొందుతున్నారు. వీరిలో జిల్లాకు చెందిన వారే కాకుండా ఒడిశా, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, పశి్చమ బెంగాల్కు చెందిన వారు కూడా ఉన్నారు. కూటమి నేతల పెత్తనం.. టీడీపీ అధికారంలోకి వచి్చన వెంటనే గ్రానైట్ పరిశ్రమలపై కూటమి నేతల పెత్తనం మొదలైంది. మళ్లీ తాము చెప్పేవరకు గ్రానైట్ పరిశ్రమల్లో ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకూడదని అధికారవర్గాల ద్వారా ఆదేశించారు. దీనికి నూతన గ్రానైట్ పాలసీ అనే ముసుగు తొడిగారు. పర్మిట్లను ఇవ్వకుండా నిలిపేశారు. దీంతో గ్రానైట్ క్వారీలతో పాటు వాటి అనుబంధ యూనిట్లు అన్నీ రెండు నెలల క్రితమే మూతపడ్డాయి. దీంతో వాటిపై ఆధారపడ్డ కార్మికులంతా గగ్గోలు పెడుతున్నారు.ఈ సంక్షోభం ఒక్క కార్మికులపైనే కాదు యాజమాన్యాలపైనా ప్రభావం చూపింది.. ఇక్కడ గ్రానైట్ బ్లాకులు ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్లేవి. ప్రస్తుతం విక్రయాలు నిలిచిపోయాయి. ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు తీసిన బ్లాక్లు ఆరు బయటే ఉండిపోవటంతో కలర్ మారి మార్కెట్లో విలువ తగ్గిపోయేలా ఉంది. ఫలితంగా గ్రానైట్ పరిశ్రమ తీవ్ర నష్టాల్లో కూరుకుపోనుంది. అటు కార్మికుల ఆకలికేకలు, ఇటు యాజమాన్యాల నష్టాలను క్షేత్రస్థాయిలో ‘సాక్షి’ పరిశీలించింది. కార్మికుల వేదన వర్ణనాతీతం గ్రానైట్ పరిశ్రమలు ఎక్కువగా ఉన్న టెక్కలి మండలంలో కార్మికుల వేదన వర్ణనాతీతంగా ఉంది. బొరిగిపేట సమీపంలోని ఓ క్వారీ సూపర్వైజర్ మాట్లాడుతూ.. తాను టీడీపీ అభిమానినని, కూటమి ప్రభుత్వం వచ్చాక తమకు మంచి జరుగుతుందని భావిస్తే చివరకు కడుపుకొట్టారని చెప్పారు.పరిశ్రమలు తెరిపించండి అని కోరడానికి ఇక్కడి మంత్రి వద్దకు వెళితే.. పరిశ్రమ తెరవకపోతే తినడం మానేస్తావా అంటూ వ్యంగ్యంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. జీడిపేట, మెలియాపుట్టి, దీనబంధుపురం, సవర, జాడుపల్లి, నిమ్మాడ తదితర గ్రామాల్లో నివసించే కార్మికుల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఫ్యాక్టరీలు ఆపేసి తమ ఉపాధిపై దెబ్బకొట్టి పస్తులు పెట్టడం ఏంటని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాసుల కక్కుర్తి కోసమే.. గ్రానైట్ పరిశ్రమల నుంచి కాసులు ఆశించే ఇలా చేస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. వాస్తవంగా 2014–19లో గ్రానైట్ కార్యకలాపాలన్నీ మంత్రి సోదరుడు కనుసన్నల్లోనే జరిగేవి. వారి కుటుంబానికి కూడా గ్రానైట్ అనుబంధ పరిశ్రమలు ఉండటంతో వాటి ముసుగులో చక్రం తిప్పేవారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక వారి పప్పులు ఉడకలేదు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి రావడంతో గ్రానైట్ కంపెనీలపై పెత్తనం కోసం ప్రయతి్నస్తున్నారు. దానికి నూతన పాలసీ అంటూ బూచిగా చూపిస్తున్నారు అని కార్మిక వర్గాలు చెబుతున్నాయి. ఉపాధి పోయింది మా ఊరికి దగ్గరలో మేలిసతివాడ వద్ద క్వారీలో జాకీ లేబర్గా పనిచేస్తుండేవాడిని. క్వారీలు నడవక ఉపాధి పోయింది. ఈ ప్రభుత్వం వచ్చాక మా లాంటి పేదలకు పెద్ద ఇబ్బందులు వచ్చాయి. గత ప్రభుత్వంలో బాగానే క్వారీలు నడచి జీతాలు వచ్చాయి. –కొర్రాయి నారాయణ, జీడిపేట, వీకేజీ క్వారీ మేలిసతివాడగ్రానైట్ కార్మికులను రోడ్డున పడేశారు కూటమి ప్రభుత్వం గ్రానైట్ క్వారీల నిర్వాహణపై ఆంక్షలు పెట్టింది. దీని వలన జిల్లాలోని క్వారీలు, వాటికి అనుసంధానంగా ఉన్న పాలిషింగ్ యూనిట్లు, క్రషర్లు ఆగిపోయాయి. దీంతో వేలాది మంది కార్మికులు నడిరోడ్డున పడ్డారు. జిల్లాలో ఇటువంటి పరిస్థితి ఇంతకు ముందెన్నడూ లేదు. దీని వలన జిల్లాలో వలసలు ఆరంభమయ్యాయి. జిల్లాలో వ్యవసాయ కార్మికులు, నిరుద్యోగ యువతకు ఉపాధికి ఆసరాగా ఉన్న గ్రానైట్ రంగాన్ని కుదేలు చేస్తున్నారు. –షణ్ముఖరావు, గ్రానైట్ కార్మికుల యూనియన్ జిల్లా నాయకుడుపని లేదు.. బత్తాలు లేవు ఈ ప్రభుత్వం వచ్చాక క్వారీలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. దీని వలన పని లేదు. బత్తాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. ఈ రోజు రేపు అని చెబుతున్నారు కానీ క్వారీలు తెరవడం లేదు. పని లేక పస్తులుంటున్నాం. –ముఖలింగాపురం అప్పారావు, జాకీ లేబర్, ప్రియాంక గ్రానైట్, జీడిపేట -
బీఎఫ్ఎస్సీలో సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
సాక్షి, అమరావతి: ఏపీ మత్స్య విశ్వవిద్యాలయం(నరసాపురం)లో 2024–25 విద్యా సంవత్సరానికి బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (బీఎఫ్ఎస్సీ) నాలుగేళ్ల కోర్సులో సీట్ల భర్తీ కోసం యూనివర్సిటీ రిజి్రస్టార్ ఒ.సుధాకర్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు.‡ నరసాపురంలోని కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్లో 60 సీట్లు, ముత్తుకూరులోని కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్లో 40 సీట్లు చొప్పున మొత్తం 100 సీట్లు ఉన్నాయి. పది శాతం సూపర్న్యూమరీ సీట్లను ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ప్రత్యేకంగా కేటాయిస్తారు. 25 శాతం సీట్లను గ్రామీణ ప్రాంత రైతు కుటుంబాలకు చెందిన పిల్లలకు ఇస్తారు. ఈ కోటాలో సీట్లకు దరఖాస్తు చేయాలంటే విద్యార్థులు నాలుగేళ్లు గ్రామీణ పాఠశాలల్లో చదివి ఉండాలి. తల్లిదండ్రులు లేదా విద్యార్థి కనీసం ఎకరం భూమి కలిగి ఉండాలి. మొత్తం సీట్లలో 85 శాతం స్థానికులకు ఇస్తారు. మిగిలిన 15 శాతం సీట్లకు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు పోటీపడవచ్చు. ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ నేచురల్ సైన్స్ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్ ఉత్తీర్ణులైనవారు అర్హులు. ఏపీఈఏపీసెట్–2024 ర్యాంక్ ఆధారంగా వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటాయిస్తారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 20వ తేదీ లోగా యూనివర్సిటీ వెబ్ సైట్ (ఠీఠీఠీ.్చpజu.్చp.జౌఠి.జీn) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సెపె్టంబర్ 10న సీట్లు కేటాయిస్తారు. ఇతర వివరాల కోసం 0866–3500560, 8985318321 నంబర్లలో సంప్రదించాలి. -
‘మీన’మేషాలు!
సాక్షి, సిద్దిపేట : రాష్ట్రంలో స్థానిక జాతుల చేపలు అంతరించిపోయే దశకు చేరుకుంటున్నాయి. కొన్ని రకాల చేపలనే విస్తృ తంగా పెంచడం, మిగతా వాటి బ్రీడింగ్, పరిరక్షణ లేకపోవడమే దీనికి కారణమవుతోంది. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల బీఎస్సీ (ఫిషరీస్), ఎమ్మెస్సీ (ఫిషరీస్) అధ్యాపకులు, విద్యార్థులు చేపల జీవవైవిధ్య స్టడీ ప్రాజెక్ట్ చేపట్టారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి స్థానిక చేపలను సేకరించి భద్రపరుస్తున్నారు. ప్రభుత్వం సహకరిస్తే స్థానిక రకాల చేపల బ్రీడింగ్ చేపడతామని చెబుతున్నారు. ఎన్ని ఉన్నా ఆ 4 రకాలే ఎక్కువ రాష్ట్రంలో మొత్తం 166 రకాల చేపలుండగా.. నాలుగు రకాల చేపలే ఎక్కువగా లభిస్తాయి. రోహు (రవ్వ), బొచ్చ, బంగారు తీగ, బొమ్మె చేపలే విస్తృతంగా పెంచడం, వినియోగించడం జరుగుతోంది. మిగతా రకాల చేపలు మెల్లగాఅంతరించిపోతున్నాయి. భవిష్యత్తులో పలు రకాల చేపల పేర్లు వినడమే తప్పితే చూసే పరిస్థితి ఉండదని నిపుణులు అంటున్నారు.ఇంటర్నేషనల్ యూనియన్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) తమ రెడ్బుక్లో ఇప్పటికే పలు రకాల చేపలు అంతరించిపోతున్నాయని వెల్లడించింది. అందులో తెలంగాణకు చెందిన 20 రకాల జాతుల చేపలు కూడా ఉండటం గమనార్హం.65 రకాల చేపలు సేకరించి.. చేపల జీవవైవిధ్య స్టడీ ప్రాజెక్ట్లోభాగంగా సిద్దిపేట ప్రభుత్వ పీజీ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు కలసి ఇప్పటివరకు 65 రకాల చేపలను సేకరించారు. వాటిని ముందు తరాలకు చూపించడం, అందించడం కోసం ప్రయత్నిస్తున్నారు. సహజ ఆవాసాల్లో లభించే వివిధ రకాల చేపలను సేకరించి, స్పెసిమెన్లనూ నిల్వ చేస్తున్నారు. ఇప్పటివరకు గోదావరి, మున్నేరు, కృష్ణా నదులు, వైరా, పాలేరు రిజర్వాయర్ల నుంచి మంచినీటిలోపెరిగే చేపలను తీసుకువచ్చారు. మలుగు పాము పాములా కనిపిస్తున్నా ఇది చేపనే. మలుగు పాముగా పిలిచే ఈ చేపలు సాధారణంగా2 నుంచి 3 అడుగుల మేర పెరుగుతాయి. మత్స్యకారులు దీనిని మున్నేరు వాగులో పడితే విద్యార్థులు కొనుగోలు చేసి తెచ్చారు. దీనికి పొలుసులు ఉండవు.ఇది బ్రీడింగ్ సమయంలో వలస వెళ్తుంది.మగ దుమ్మ ఈ చేప పేరు మగ దుమ్మ. ఇది వైరా రిజర్వాయర్లో లభించింది. అంతరిస్తున్న చేపల రకాల్లో ఇది కూడా ఉంది. క్యాట్ ఫిష్ జాతికి చెందిన ఈ చేపల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఒమెగా–3 ఫ్యాట్ అధికంగా ఉంటుంది. చుక్క పాంప్రెట్ చేప ఇది చుక్క పాంప్రెట్ చేప.ఈ రకం చేపలువలకు చిక్కాయంటే మత్స్యకారులకుపండగే. ఇవి బాగా రుచిగా ఉండటంతో ముంబై, కేరళ ప్రాంతాల ప్రజలు లొట్టలేసుకొని తింటారు. ఇవి మున్నేరు నదిలో ఉన్నాయి. ఒక్క సిద్దిపేటలోనే ఎమ్మెస్సీ ఫిషరీస్ కోర్సురాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల బీఎస్సీ (ఫిషరీస్) కోర్సును నిర్వహిస్తున్నా.. ఒక్క సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ,పీజీ కళాశాల (అటానమస్)లో ఎమ్మెస్సీ(ఫిషరీస్) కోర్సు అందుబాటులో ఉంది. 2017–18లో ప్రారంభమైనఈ పీజీ కోర్సును ఏటా 40 మంది విద్యార్థులు పూర్తి చేస్తున్నారు. విద్యార్థులకు ప్రత్యేకంగా చేపల ఫారి్మంగ్ తీరును చూపించేందుకు.. కళాశాల ప్రాంగణంలోనే రకరకాల చేపలను పెంచుతున్నారు. ఆ చేపలకు ఫుడ్ను కాలేజీలోనే తయారు చేస్తున్నారు. అలాగే ఎక్వేరియం చేపల బ్రీడింగ్ కూడా చేస్తున్నారు. బ్రామ బెలగారి ఈ చేపను ఓసియో బ్రామ బెలగారి చేపఅంటారు. దీనిని గోదావరి నది నుంచితీసుకువచ్చారు. ఇవి అచ్చం పరక చేపల మాదిరిగా ఉంటాయి. ఈ రకం చేపలుఅంతరించిపోతున్న జాబితాలో ఉన్నాయి. స్థానిక చేపల విత్తనోత్పత్తి చేస్తాం స్థానికంగా లభించే రకరకాల చేపలు అంతరించి పోతున్నాయి. స్థానిక చేపల విత్తనోత్పత్తి దిశగా ముందుకు సాగుతున్నాం. ప్రభుత్వం సహకరిస్తే స్థానిక చేపల విత్తనోత్పత్తి చేసి అందిస్తాం. మా కళాశాలలో చదివిన విద్యార్థులు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో చేపల ఉత్పత్తిని పెంచేందుకు ఫిషరీస్ చేసిన విద్యార్థులను వినియోగించుకోవడం వల్ల మేలు జరుగుతుంది. – అయోధ్యరెడ్డి, ఫిషరీస్ హెడ్, ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల సిద్దిపేట65 రకాలు సేకరించాం.. చేపల జీవవైవిధ్య స్టడీ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటివరకు 65 రకాల చేపలను సేకరించి భద్రపరిచాం. కృష్ణా, గోదావరి, మున్నేరు నదులు, వైరా, పాలేరు రిజర్వాయర్ల నుంచి అంతరించి పోతున్న చేపలను సేకరించాం. ఏదైనా కొత్త రకం చేప పడితే చెప్పాలని మత్స్యకారులను కోరాం. ఫిషరీస్ చదివిన వారికి ప్రభుత్వంఉద్యోగాలు కల్పించి మన మత్స్య సంపదను కాపాడాలి. – సాయికుమార్, ఎమ్మెస్సీ సెకండియర్ -
మత్స్య రంగంలో ఏపీ అద్భుత ప్రగతి
సాక్షి, అమరావతి/తాడేపల్లిగూడెం: మత్స్య రంగంలో ఆంధ్రప్రదేశ్ అద్భుత ప్రగతి సాధించిందని కేంద్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తమ్ రూపాల కితాబిచ్చారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. 2023లో బెస్ట్ మెరైన్ స్టేట్గా ఎంపికైన ఆంధ్రప్రదేశ్ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మంగళవారం అహ్మదాబాద్లో జరిగిన గ్లోబల్ ఫిషరీస్ కాన్ఫరెన్స్ ఇండియా–2023లో కేంద్రమంత్రి రూపాల చేతుల మీదుగా ప్రతిష్టాత్మక బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డును రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (ఆప్సడా) కో–వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్, మత్స్యశాఖ అడిషనల్ కమిషనర్ అంజలి అందుకున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రూపాల మాట్లాడుతూ.. మత్స్య ఉత్పత్తుల దిగుబడులు, ఎగుమతుల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు. ఈ రంగంలో వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయన్నారు. ఆక్వా ఆధారిత రాష్ట్రాలు ఆంధ్రలో తీసుకొచ్చిన చట్టాలు, మార్పులపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం ఇస్తున్న చేయూతతో నాణ్యమైన ఉత్పత్తుల సాధనకు మార్కెటింగ్ సౌకర్యాలు మరింత మెరుగు పర్చాలని సూచించారు. సీఎం వైఎస్ జగన్ కృషి ఫలితమే ఈ సందర్భంగా అప్సడా కో–వైస్ చైర్మన్ రఘురామ్ మాట్లాడుతూ.. నాలుగేళ్లలో రెండోసారి బెస్ట్ మెరైన్ స్టేట్గా ఏపీ నిలవడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో మత్స్యరంగ సుస్థిరాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలు, విప్లవాత్మక మార్పులే కారణమన్నారు. ఆక్వా కార్యకలాపాలన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడంతో పాటు ఆక్వా రైతులకు భరోసా, భద్రత కల్పించేందుకు అప్సడా చట్టంతో పాటు నాణ్యమైన సీడ్, ఫీడ్ సరఫరా కోసం ఏపీ స్టేట్ సీడ్, ఫీడ్ యాక్టులను తీసుకొచ్చిందన్నారు. అడిషనల్ కమిషనర్ అంజలి మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా 2018–19లో 39 లక్షల టన్నులున్న దిగుబడులు 2022–23లో ఏకంగా 52 లక్షల టన్నులకు పెరిగిందన్నారు. -
Live Stock Expo : పశు సంపద రంగానికి తగినంత గుర్తింపు రావాలి
ఎల్డిఎఫ్ ఇండియా, పశువులు, పాడి పరిశ్రమ మరియు మత్స్య పర్యావరణ వ్యవస్థలన్నింటిని ఒకే పైకప్పు కిందకు తీసుకువచ్చే భారతదేశపు మొట్టమొదటి ఎక్స్పో గురువారం హైటెక్స్లో ప్రారంభమైంది. ఆదివారం వరకు మూడురోజుల పాటు జరిగే ఈ ఎక్స్పోలో సుమారు 80 స్టాల్స్ హైలైట్గా నిలవనున్నాయి. ఈ కార్యక్రమాన్ని హైటెక్స్, ఆక్వా ఫార్మింగ్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ (AFTS) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. డాక్టర్ తరుణ్ శ్రీధర్, మాజీ యూనియన్ సెక్రటరీలతో పాటు పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఈ వేడుకలో పాల్గిన్నారు. ఈ సందర్భంగా డా. తరుణ్ శ్రీధర్ మాట్లాడుతూ.. పశుసంపద సరైన గుర్తింపుకు నోచుకోలేదని, భారత్లో ఇప్పటికే చాలామంది గ్రామాల్లోనే నివసిస్తున్నారని తెలిపారు. అసలు పశువులతో సంబంధం లేకుండా ఏ రైతును చూడలేరన్నారు. భారతదేశం గణనీయమైన పశువుల జనాభాను కలిగి ఉందని, ప్రపంచ చేపల ఉత్పత్తి సహా పాల ఉత్పత్తి వినియోగంలో భారత్ ముందుందని పేర్కొన్నారు. ఎల్డిఎఫ్పై అంకితమైన ఎక్స్పో చాలా అవసరం. ఇది త్వరలో ప్రపంచ స్థాయిలో బోస్టన్ సీఫుడ్స్తో సమానంగా ఎదుగుతుందనన్నారు.ఇలాంటి ఎక్స్పోలు మన బలాన్ని ప్రదర్శించడమే కాకుండా విధి విధానాలను నిర్మించే ప్రభుత్వ అధికారులను మేల్కొల్పుతాయని అన్నారు డాక్టర్ తరుణ్ శ్రీధర్. 2022-23లో రికార్డు స్థాయిలో 174 లక్షల టన్నుల చేపల ఉత్పత్తిని సాధించింది. ఇది రూ.63,960 కోట్ల సీఫుడ్ ఎగుమతులను సాధించిందని, ఇంకా, భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆక్వాకల్చర్ ఉత్పత్తిదారు అని భారతదేశంలోని చేపలలో 68% ఆక్వాకల్చర్ రంగం నుండి వస్తుందని తెలిపారు. పశువులు శక్తి. పశువులు ఎల్లప్పుడూ వ్యవసాయంలో అంతర్భాగంగా ఉంటాయి. కానీ ఇది చాలా మంచి సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, యువతకు ఆకర్షణీయంగా కనిపించదు. అయితే ప్రపంచం మొత్తం సహజ, సేంద్రియ, పున రుత్పత్తి వ్యవసాయం గురించి మాట్లాడుతున్నందున మంచి రోజులు వచ్చాయి. పశుసంవర్ధక రంగం ఇప్పుడు ఆహార భద్రత నే కాక, పోషకాహార భద్రతగానూ గొప్ప సంభావ్యత కలిగిన చాలా పెద్ద రంగంగా పరిగణించబడుతుంది. ప్రపంచ ఆకలి సూచీలో 121 స్థానాల్లో భారతదేశం 107 స్థానాల్లో ఉన్న నేపథ్యంలో పశు సంపదకు సంబంధించిన ఉత్పత్తులకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. మాంసం తినే జనాభాలో 70% కంటే ఎక్కువ భారతదేశం. 2050లో 18.1 MT తలసరి మాంసం వినియోగం 13.8 కిలోల అంచనాగా ఉందని NABARD చీఫ్ జనరల్ మేనేజర్ సుశీల చింతల అన్నారు. గోదావరి కట్స్లో 25 కిలోల ఎల్లోఫిన్ ట్యూనా అనే అరుదైన చేపలను ప్రదర్శించారు. ఎల్లోఫిన్ ఆరు లేదా ఏడు సంవత్సరాల వరకు జీవించగలదు. ఇవి అధిక వలసలు, పసిఫిక్, అట్లాంటిక్ -హిందూ మహాసముద్రాల అంతటా కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద జీవరాశి అయిన ఎల్లో ఫిష్ ట్యూనా అంతరించిపోతోంది. భారత ప్రభుత్వంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ అదనపు డెవలప్మెంట్ కమీషనర్ డి. చంద్ర శేఖర్ మాట్లాడుతూ.. ''భారతదేశంలో 46 (23 మంది స్థానిక, 23 మంది స్థానికేతర) సూక్ష్మ, చిన్న వ్యాపారవేత్తలు పాల్గొనేందుకు మంత్రిత్వ శాఖ వీలు కల్పించింది. రిటైర్డ్ బ్యూరోక్రాట్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయిన డబ్ల్యువిఆర్ రెడ్డి మాట్లాడుతూ మనమందరం చిన్నతనం నుండే పశువులతో ముడిపడి ఉన్నాం. కానీ మన యువత ఇప్పుడు దానిపై ఆసక్తి చూపడం లేదు. యువతను ఆకర్షించేందుకు వీలుగా ఈ రంగాన్ని బ్లూ కాలర్ లాంటి రంగంగా మార్చాలి. మీరు సాంకేతికతపరమైన ఆవిష్కరణలను తీసుకురావాలని ఆయన పిలుపునిచారు.దళిత బంధు లబ్ధిదారులు కూడా అవకాశాలను అన్వేషించడానికి ఎక్స్పోను సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారు. ఎక్స్పోలో కంట్రీ చికెన్ వంటి అనేక స్టాల్స్ ఉన్నాయి. దీనిని ఇద్దరు యువ పారిశ్రామికవేత్తలు సాయికేష్ గౌండ్, మొహమ్మద్ సమీ ఉద్దీన్ స్థాపించారు. ఆధునిక,పరిశుభ్రమైన మాంసం దుకాణాలు అవసరమని చాలా మంది తెలియచేశారు. కూరగాయలకు మంచి, పరిశుభ్రమైన దుకాణాలు ఉన్నప్పటికీ, పరిశుభ్రమైన మాంసం దుకాణాలు ఎక్కువగా కనిపించవు. గడ్డకట్టిన చేపలను కొనడానికి ప్రజలు నిరాకరిస్తారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు అన్నీ క్రమంగా మారుతూ వస్తున్నాయి. అందరూ తమ వ్యాపారాలకి ప్రజలను ఆకర్షించే కొత్త దారులను వెతుకుతున్నారు. -
సిగ్నల్ లేకపోయినా క్షణాల్లో సమాచారం
సాక్షి, అమరావతి: మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సముద్రంలో మత్స్య సంపదను వేటాడే వేళ గంగపుత్రులు ఆపదలో చిక్కుకుంటే.. రక్షించేందుకు వీలుగా అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందుకోసం ఇస్రో అభివృద్ధి చేసిన కమ్యూనికేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ను త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సెల్ సిగ్నల్ అందకపోయినా.. రక్షణ పరిధిలోకి తీరం నుంచి సముద్రంలో 12 నాటికల్ మైళ్ల వరకు రాష్ట్ర పరిధిలో ఉండగా.. 12 నుంచి 200 నాటికల్ మైళ్ల వరకు దేశీయ జలాలు. 200 నాటికల్ మైళ్ల దూరం దాటితే అంతర్జాతీయ జలాలుగా పరిగణిస్తారు. సంప్రదాయ, నాన్ మోటరైజ్డ్ బోట్లు తీరం నుంచి 4 నాటికల్ మైళ్ల వరకు వెళ్తుంటాయి. మోటరైజ్డ్ బోట్లు 12 నాటికల్ మైళ్ల వరకు, మెకనైజ్డ్ బోట్లు 12 నుంచి 200 నాటికల్ మైళ్ల వరకు వెళ్లి వేట సాగిస్తుంటాయి. రాష్ట్రంలో 1,610 మెకనైజ్డ్, 22 వేల మోటరైజ్డ్, 6,343 సంప్రదాయ బోట్లు ఉన్నాయి. వీటిపై ఆధారపడి 1.60 లక్షల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. ఇప్పటివరకు వేట సాగించే మత్స్యకారులకు ఇన్కాయిస్ సంస్థ శాటిలైట్ ద్వారా సముద్రంలో మత్స్య సంపద ఎక్కువగా ఉండే ప్రదేశాలను (పీఎఫ్జెడ్–పొటెన్షియల్ ఫిషింగ్ జోన్స్) గుర్తించి బోట్లలో అమర్చే ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఏఐఎస్), మత్స్య శాఖ అభివృద్ధి చేసిన మొబైల్ యాప్స్ ద్వారా 12 నాటికల్ మైళ్ల పైబడి దూరం వెళ్లే మెకనైజ్డ్ బోట్లకు సమాచారం అందిస్తున్నాయి. ఈ సమాచారం సంప్రదాయ, మోటరైజ్డ్ బోట్లకు అందించే అవకాశం లేదు. పైగా ఇది 2–3 రోజులు మాత్రమే ఉపయోగపడుతుంది. మరో వైపు ఏదైనా ఆపదలో ఉంటే తమ క్షేమ సమాచారం మొబైల్స్కు ఉండే సిగ్నల్స్పై ఆధారపడి ఉంటుంది. సిగ్నల్ మిస్ అయితే తీరానికి కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోతుంది. ఈ పరిస్థితికి ఇక చెక్ పెడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. 100 శాతం సబ్సిడీపై.. కమ్యూనికేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ (ట్రాన్స్పాండర్)ను 12 నాటికల్ మైళ్లకు పైబడి దూరం వెళ్లే మరబోట్లు, మెకనైజ్డ్ బోట్లకు అమర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రూ.36,400 విలువైన ఈ పరికరాన్ని 100 శాతం సబ్సిడీతో అమర్చనున్నారు. తీరంలో గస్తీ కోసం అభివృద్ధి చేసిన ఐఆర్ఎన్ఎస్ (నావిక్), జీపీఎస్ శాటిలైట్స్తో ఈ డివైస్ అనుసంధానమై పనిచేస్తుంది. బోట్లలోని మత్స్యకారుల వద్ద ఉండే స్మార్ట్ ఫోన్లను బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకుంటే చాలు సిగ్నల్తో సంబంధం లేకుండా రెండువైపులా సమాచారాన్ని పరస్పరం పంపించుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ అప్లికేషన్ను అభివృద్ధి చేస్తున్నారు. సమయం వృథా కాకుండా.. మరోవైపు ఇన్కాయిస్ సంస్థ అందించే పీఎఫ్జెడ్ సమాచారాన్ని కచ్చితమైన లొకేషన్స్తో బోట్లలోని మత్స్యకారులకు పంపడం వలన వారు క్షణాల్లో అక్కడకు చేరుకొని వేట సాగించడం ద్వారా సమయం, ఆయిల్ ఆదా అవుతుంది. పట్టుబడిన మత్స్యసంపదను ఏ సమయంలో ఏ రేవుకు తీసుకొస్తే మంచి రేటు వస్తుందో కూడా ఈ డివైస్ ద్వారా సమాచారం పంపిస్తారు. దీంతో తీరానికి చేరుకున్న తర్వాత తగిన ధర లేక మత్స్యకారులు నష్టపోయే పరిస్థితి ఉండదు. అయితే ఈ డివైస్ పనిచేయాలన్నా, సిగ్నల్తో సంబంధం లేకుండా స్మార్ట్ ఫోన్ పనిచేయాలన్నా.. సంబంధిత బోట్లలో రీ జనరేట్ చేసుకునే పవర్ సిస్టమ్ అవసరం ఉంటుంది. వైపరీత్యాల వేళ అప్రమత్తం చేయొచ్చు తుపాను హెచ్చరికలు, అకాల వర్షాలు, ఈదురు గాలులకు సంబంధించిన సమాచారాన్ని ఈ డివైస్ ద్వారా లోతు జలాల్లో వేట సాగించే అన్నిరకాల బోట్లకు క్షణాల్లో పంపించి వారిని అప్రమత్తం చేయవచ్చు. లోతు జలాల్లో ఉన్నవారిని సాధ్యమైనంత త్వరగా తీరానికి చేరుకునేలా హెచ్చరికలు జారీ చేయొచ్చు. ఎవరైనా ఆపదలో చిక్కుకుంటే ఈ డివైస్ ద్వారా సమాచారం పంపితే శాటిలైట్ ద్వారా గ్రౌండ్ స్టేషన్కు చేరుతుంది. అక్కడ నుంచి క్షణాల్లో ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేçస్తున్న మోనిటరింగ్ స్టేషన్స్తోపాటు కోస్ట్ గార్డు, మెరైన్, నేవీ విభాగాలతోపాటు సమీపంలో ఉండే కమర్షియల్ వెసల్స్కు కూడా సమాచారం అందిస్తారు. తద్వారా క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకుని ఆపదలో ఉన్న వారిని ప్రాణాలతో రక్షించే అవకాశం ఉంటుంది. దశల వారీగా అమర్చుతాం కమ్యూనికేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ (ట్రాన్స్పాండర్)ను లోతు జలాల్లో మత్స్య వేట సాగించే బోట్లకు దశల వారీగా అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. తొలి దశలో 4,484 బోట్లలో అమర్చనున్నాం. అక్టోబర్ నాటికి వీటి సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నాం. – వీవీ రావు, జేడీ, మత్స్య శాఖ (సముద్ర విభాగం) -
వర్షం తక్కువున్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లోటు వర్షపాతం ఉన్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు కంటింజెన్సీ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా. కేఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు, వ్యవసాయం, పశువుల గ్రాసం తదితర అంశాలపై ఆయన శనివారం వ్యవసాయ, పశు సంవర్థక, మత్స్య, ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖల అధికారులతో సమీక్షించారు. ఆరు జిల్లాల్లోని 130 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైందని, ఈ జిల్లాల్లో ఆగస్టులో కూడా వర్షాలు తక్కువ ఉంటే ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు సిద్ధం చేయాలని సీఎస్ ఆదేశించారు. అధిక వర్షాల కారణంగా వరి నారు దెబ్బతిన్న రైతులకు స్వల్పకాలంలో దిగుబడినిచ్చే విత్తనాలు సరఫరా చేయాలని చెప్పారు. రాష్ట్రంలో వర్షాలు, వ్యవసాయంపై వ్యవసాయ, పశు సంవర్థక, మత్స్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో ఖరీఫ్ లో మొత్తం 34.39 లక్షల హెక్టార్లు సాధారణ విస్తీర్ణం కాగా ఇప్పటివరకు 9.22 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు వేశారని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో సాధారణంకంటే 20 నుండి 50 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. కృష్ణా జిల్లాలో 60 శాతం పైగా అధిక వర్షపాతం నమోదైందని చెప్పారు. అంబేడ్కర్ కోనసీమ,పశ్చిమ గోదావరి, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో 20 నుండి 59 మిల్లీ మీటర్ల తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. వర్షపాతం తక్కువున్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటల కోసం సుమారు 10 వేల క్వింటాళ్ల మినుము, పెసర, కంది, ఉలవ, జొన్న, పొద్దుతిరుగుడు, వేరుశనగ తదితర విత్తనాలను ఏపీ సీడ్స్ వద్ద సిద్ధంగా ఉంచామని చెప్పారు. అధిక వర్షాలతో వరి నారు మడులు దెబ్బతిన్న రైతులకు స్వల్ప కాలంలో పంట దిగుబడినిచ్చే ఎంటీయూ 1010, 1121,1153, బీపీటీ 5204, ఎన్ఎల్ఆర్ 34449 వరి విత్తనాలను సుమారు 30 వేల క్వింటాళ్లు సిద్ధం చేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ సీహెచ్ హరికిరణ్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా. బి.ఆర్.అంబేద్కర్, పశు సంవర్థక శాఖ సంచాలకులు అమరేంద్ర కుమార్, ఏపీ సీడ్స్ ఎండీ శేఖర్ బాబు, మత్స్య శాఖ అదనపు సంచాలకులు డా. అంజలి, ఉద్యాన శాఖ అదనపు సంచాలకులు బాలాజీ నాయక్, వెంకటేశ్వర్లు తదితర అధికారులుపాల్గొన్నారు. -
'363 బీచ్లు' కోస్తా తీరానికి కొత్త అందాలు
సాక్షి, అమరావతి: బీచ్ పర్యాటకంతో కోస్తా తీరానికి కొత్త కళ చేకూరనుంది. 12 జిల్లాల్లో కోస్తా తీరం వెంట 363 బీచ్లను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫిషరీస్ యూనివర్సిటీ, పర్యాటక శాఖ, మత్స్యశాఖలతో కూడిన 11 బృందాలు కోస్తా తీరం వెంట సర్వే చేసి ఎక్కడెక్కడ బీచ్లను అభివృద్ధి చేయవచ్చో గుర్తించాయి. ఆయా ప్రాంతాల్లో కోస్టల్ జోన్ టూరిజం పేరుతో మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేస్తారు. చేపల ఉత్పత్తి, మత్స్యకారుల జీవనోపాధికి విఘాతం కలగకుండా పర్యావరణానికి అనుకూలంగా బీచ్లను తీర్చిదిద్దనున్నారు. కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ చట్ట ప్రకారం బీచ్లకు అనుమతి కోసం పర్యాటక శాఖ కలెక్టర్లకు నివేదిక పంపించింది. బీచ్ల అభివృద్ధిపై ఇటీవల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి సమీక్షించారు.మత్స్యకారులతో పాటు టూరిజం ఆపరేటర్లను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచి బీచ్లను ఖరారు చేసి పర్యాటక అథారిటీకి వివరాలు పంపాలని సూచించారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో67 బీచ్లను అభివృద్ధి చేయనున్నారు. బ్లూ ఫ్లాగ్ బీచ్లు ♦ మంగినపూడి (కృష్ణా జిల్లా) ♦ పేరుపాలెం, మొల్లపర్రు (పశ్చిమ గోదావరి జిల్లా) ♦ కాకినాడ (కాకినాడ జిల్లా) ♦ మైపాడు (నెల్లూరు జిల్లా) ♦ సూర్యలంక, రామాపురం (బాపట్ల జిల్లా) ♦ చింతలమోరి (బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా) బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటే..? బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటే 33 ప్రమాణాల ఆధారంగా ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సంస్థ బీచ్లను పరిశీలించి ధృవీకరిస్తుంది. పర్యావరణం, స్నానపు నీటి నాణ్యత, నిర్వహణ, భద్రత, సేవలు లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. బీచ్లు పరిశుభ్రంగా ఉండాలి. సందర్శకులకు మెరుగైన సేవలను అందించేందుకు అధికారుల కమిటీ, విశేషాలను వివరించేందుకు సిబ్బంది ఉండాలి. రుషికొండ తరహాలో 8 బ్లూఫ్లాగ్ బీచ్లు విశాఖలోని రుషికొండ తరహాలో మరో ఎనిమిది బ్లూ ఫ్లాగ్ బీచ్లను అభివృద్ధి చేయనున్నారు. పర్యాటకాన్ని ప్రోత్సహించేలా మౌలిక వసతులను కల్పించేందుకు భూ కేటాయింపు ప్రతిపాదనలను సీసీఎల్ఏకు పంపాలని సీఎస్ ఆదేశించారు. దేశంలో 10 బ్లూ ఫాగ్ బీచ్లుండగా అందులో రుషికొండ చోటు సాధించింది. కోస్టల్ జోన్ రెగ్యులేషన్కు అనుగుణంగా బీచ్ల అభివృద్ధి: కన్నబాబు కేంద్రం 2019లో విడుదల చేసిన కోస్టల్ జోన్ రెగ్యులేషన్ నోటిఫికేషన్ ప్రకారం బీచ్లను అభివృద్ధి చేయనున్నట్లు పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె.కన్నబాబు తెలిపారు. మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధమైనట్లు చెప్పారు. బ్లూ ఫ్లాగ్ బీచ్లకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి రాగానే పనులు చేపడతామన్నారు. స్థానికులకు ఉపాధితో పాటు సేవల రంగం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. -
Andhra Pradesh: మినీ పోర్టులా ఉప్పాడ!
(ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ నుంచి సాక్షి ప్రతినిధి చంద్రశేఖర్ మైలవరపు): ఉప్పాడ వద్ద రాష్ట్ర ప్రభుత్వం రూ.361 కోట్లతో భారీ ఫిషింగ్ హార్బర్ను వేగవంతంగా నిర్మిస్తుండటం పట్ల స్థానిక మత్స్యకారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న మంచి రోజులు కనుల ముందు కనిపిస్తున్నాయి. అన్ని పనులూ పూర్తి చేసుకుని డిసెంబర్ నాటికి అందుబాటులోకి రానుండటంతో మత్స్యకార కుటుంబాల్లో సంతోషం అంతా ఇంతా కాదు. ఇకపై తమ కష్టం వృథా కాదన్న ధీమా ఏర్పడిందని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. రాష్ట్రంలోని సముద్ర తీరాల్లో కాకినాడ వద్ద అత్యంత విలువైన ట్యూనా, సొర వంటి చేపలు ఉన్నా.. సరైన వసతులు లేకపోవడంతో మత్స్యకారులు ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. నడి సముద్రంలోకి వెళ్లి పది రోజుల వరకు ఉండి చేపలు పట్టుకునే భారీ స్థాయి బోట్లను నిలుపుకునే చోటు లేకపోవడమే ఇందుకు కారణం. ఇప్పుడు ఈ సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం చక్కటి పరిష్కారాన్ని చూపిస్తూ రాష్ట్రంలోనే భారీ ఫిషింగ్ హర్బర్ను ఉప్పాడ వద్ద నిర్మిస్తోంది. మిగిలిన హార్బర్లలో సముద్రం నుంచి లోతైన కాలువను తవ్వి అక్కడ బోట్లు నిలుపుకోవడానికి జెట్టీలను నిర్మిస్తుంటే.. ఉప్పాడ వద్ద మాత్రం పోర్టు మాదిరిగానే సముద్ర ఒడ్డుకు ఆనుకునే బోట్లను నిలుపుకునే విధంగా హార్బర్ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే 55 శాతం పనులు పూర్తి చేసుకున్న ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ను ఈ సంవత్సరాంతానికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ఉత్తర, దక్షిణ బ్రేక్ వాటర్ పనులు పూర్తి స్థాయిలో పూర్తవగా.. డ్రెడ్జింగ్ పనులు, ఒడ్డున బిల్డింగ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 2,500 బోట్లు నిలుపుకునేలా.. ♦ రెండ్రోజుల నుంచి 10 రోజుల వరకు ఏకబిగిన వేట కొనసాగించే విధంగా వివిధ పరిమాణాల బోట్లను నిలుపుకునేందుకు అనువుగా ఈ హార్బర్ను తీర్చిదిద్దుతున్నారు. ♦ సుమారు 2,500 బోట్లను నిలుపుకునేలా జెట్టీని నిర్మిస్తున్నారు. ♦ దాదాపు 58 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ హార్బర్లో ఫిషింగ్ హ్యాండ్లింగ్, వేలం కేంద్రం, పది టన్నుల ఐస్ ప్లాంట్, 20 టన్నుల శీతల గిడ్డంగి, పరిపాలన కార్యాలయాలతో పాటు ట్యూనా చేపల కోసం ప్రత్యేకంగా ట్యూనా ఫిష్ హ్యాండ్లింగ్, ప్యాకింగ్ హాల్స్ను ఏర్పాటు చేస్తున్నారు. ♦ ట్యూనా చేపలు పట్టుకునేందుకు వీలుగా తొమ్మిది మీటర్ల నుంచి 24 మీటర్ల వరకు ఉండే లాంగ్లైన్ బోట్లను ఇక్కడ నిలుపుకునే అవకాశముంది. ♦ ఈ ఫిషింగ్ హార్బర్ ద్వారా ఏటా రూ.859 కోట్ల విలువైన 1,10,600 టన్నుల మత్స్య సంపద వస్తుందని అధికారుల అంచనా. 17,700 మందికి ఉపాధి లభించనుంది. పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం రాష్ట్రంలోని మత్యకారులు వేట కోసం ఇతర రాష్ట్రాలు, దేశాలు వలస వెళ్లకుండా స్థానికంగానే చేపలు పట్టుకోవాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏక కాలంలో 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టారు. తొలి దశలో చేపట్టిన నాలుగు ఫిషింగ్ హార్బర్లయిన జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడలు ఈ సంవత్సరాంతానికి అందుబాటులోకి తీసుకొస్తున్నాం. సుమారు రూ.3,500 కోట్లకు పైగా నిధులతో 60,858 మత్యకార కుటుంబాలకు ప్రయోజనం కలిగేలా వీటిని నిర్మిస్తున్నాం. మినీ పోర్టు తరహాలో వీటి నిర్మాణం చేపట్టడమే కాక వీటిపక్కనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటుచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. – ప్రవీణ్కుమార్, సీఈఓ, ఏపీ మారిటైమ్ బోర్డు త్వరలో మంచి రోజులు ఇప్పటి వరకు బోట్లు నిలుపుకోవడానికే సరైన సదుపాయాల్లేక ఐదారుచోట్ల నిలుపుకునేందుకు నానా అవస్థలు పడుతుండేవాళ్లం. పాదయాత్ర సమయంలో మా పరిస్థితిని వైఎస్ జగన్ దృష్టికి తీసుకొస్తే మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామన్నారు. కానీ, ఇప్పుడు ఏకంగా రూ.361 కోట్లతో రాష్ట్రంలోనే అతిపెద్ద హార్బరును మినీపోర్టు స్థాయిలో నిర్మిస్తున్నారు. బోట్లు నిలుపుకోవడం దగ్గర నుంచి రిపేర్లు, డీజిల్, వేలంపాటలు, అమ్మకాలు అన్నీ ఒకేచోట ఉండేలా నిర్మిస్తుండటంతో వ్యయం తగ్గి లాభాలు పెరుగుతాయి. దీని ద్వారా తొండంగి, కొత్తపల్లి, కాకినాడ రూరల్ మండలాలకు చెందిన 50,000 మత్యకార ప్రజలకు ప్రయోజనం లభిస్తుంది. ఈ స్థాయిలో హార్బర్ నిర్మాణ పనులు ఇంత వేగంగా జరుగుతాయని ఎవ్వరూ ఊహించలేదు. మేమంతా సీఎం వైఎస్ జగన్కు రుణపడి ఉంటాం. – ఎన్. మణికంఠబాబు, సర్పంచ్, అమినాబాద్ గతంలో ఎంతటి భారీ చేప తీసుకొచ్చినా పొద్దున రూ.1,000 ధర ఉంటే సాయంత్రం రూ.500కు పడిపోయేది. దీంతో బాగా నష్టపోయే వాళ్లం. ఇప్పుడు ఈ హార్బర్ రావడం.. ఇక్కడ శీతల గిడ్డంగులు ఉండటంతో ఆ భయం ఉండదిక. నచ్చిన ధర వచ్చినప్పుడే అమ్ముకునే వెసులుబాటు కలుగుతుంది. గతంలో హార్బర్ లేకపోవడం వల్ల పోటు సమయంలో బోటు నిలుపుకోవడానికి కష్టంగా ఉండేది. సరుకు దింపే సమయంలో ప్రమాదాలు జరిగేవి. మనుషులు గల్లంతైన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడా భయాలు మాకు ఉండవు. సునామీ వచ్చినా మా పడవలు భద్రంగా నిలుపుకోవచ్చు. – ఉమ్మడి యోహాను, మత్స్యకారుడు, ఉప్పాడ -
మత్స్య, ఆక్వా పెట్టుబడుల హబ్గా ఏపీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మత్స్య, ఆక్వా రంగాల్లో పెట్టుబడుల హబ్గా నిలవబోతోందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) జాతీయ కమిటీ కో చైర్మన్ అరబింద్దాస్ చెప్పారు. సముద్ర ఉత్పత్తులు, ఎగుమతుల్లో అగ్రగామిగా ఏపీని నిలబెట్టే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సీఐఐ కట్టుబడి ఉందన్నారు. సీఐఐ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మత్స్య, ఆక్వారంగాల సుస్థిరాభివృద్ధిపై విజయవాడలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. ఆక్వారంగంలో పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దేందుకు సీఐఐ కృషి చేస్తుందన్నారు. మత్స్యరంగంపై ఆధారపడి జీవిస్తున్నవారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు పలు సంక్షేమ కార్యక్రమాలతో పాటు తీరం వెంబడి పెద్దఎత్తున మౌలికసదుపాయాల కల్పనకు కృషిచేస్తున్న ప్రభుత్వ తీరు ప్రశంసనీయమన్నారు. తీరం వెంబడి చేపల కేజ్ కల్చర్కు ప్రోత్సాహం ఏపీ మారిటైమ్ బోర్డ్ డిప్యూటీ సీఈవో లెఫ్టినెంట్ సి.డి.రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు పెంచేందుకు కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఫిషింగ్ హార్బర్లు, ఇంటిగ్రేటెడ్ సీ పార్కుల ఏర్పాటుకు కృషి జరుగుతోందన్నారు. తీరం వెంబడి చేపల కేజ్ కల్చర్ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఒక పాలసీని తీసుకొచ్చేందుకు పరిశీలిస్తోందని చెప్పారు. మత్స్య, ఆక్వారంగాల్లో నైపుణ్యత కలిగిన మానవ వనరుల అభివృద్ధి లక్ష్యంగా ఏపీæ ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మత్స్యశాఖ అదనపు సంచాలకులు డాక్టర్ ఎస్.ఏంజెలి మాట్లాడుతూ రాష్ట్రంలో మత్స్యరంగాభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. సీఐఐ రాష్ట్రశాఖ వైస్ చైర్మన్ డాక్టర్ ఎం.లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ మత్స్య రంగాభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వానికి లోతైన, వ్యూహాత్మక ఆలోచన ఉందని చెప్పారు. ఈ రంగంపై ఆధారపడిన వర్గాల జీవనోపాధికి, ముఖ్యంగా మహిళలకు ఉద్యోగకల్పన, మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ తమకు స్ఫూర్తినిస్తున్నట్లు తెలిపారు. మత్స్యశాఖతో పాటు ఈ రంగంలోని వాటాదారులందరితో సీఐఐ కలిసి పనిచేస్తుందని చెప్పారు. వాటర్బేస్ లిమిటెడ్ సీఈవో రమాకాంత్, డెల్టా ఫిష్ ఫార్మర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వి.రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. ఫిష్ బాస్కెట్గా రాష్ట్రం సదస్సులో వర్చువల్గా పాల్గొన్న రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ నిర్దిష్టమైన ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగా ఫిష్ బాస్కెట్గా రాష్ట్రం నిలిచిందన్నారు. హేచరీలు, విత్తన పెంపకం, బ్రూడ్ బ్యాంకులు, బ్రూడ్ స్టాక్ మల్టిప్లికేషన్ సెంటర్లు, న్యూక్లియర్ బ్రీడింగ్ సెంటర్లు, పంట అనంతర నష్టాన్ని తగ్గించడానికి తగిన మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని వివరించారు. పంటకోతకు ముందు, అనంతర మౌలిక సదుపాయాల కల్పనలో ప్రైవేటురంగ పాత్ర చాలా కీలకమన్నారు. సప్లయి చైన్ను బలోపేతం చేయడం ద్వారా చేపలు, ఆక్వా ఉత్పత్తులకు అదనపు విలువ జోడింపునకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. -
గంగపుత్రులకు మరింత చేరువగా..
కొవ్వూరు: జిల్లాల పునర్విభజన పుణ్యమా అని మత్స్యకారులకు ఆ శాఖ సేవలు మరింత చేరువయ్యాయి. గతంలో ఉన్న జాయింట్ డైరెక్టర్ పోస్టును ఇప్పుడు జిల్లా మత్స్యశాఖ అధికారిగా మార్చారు. రాజమహేంద్రవరంలో 10, కొవ్వూరులో 9 మండలాలు ఉండేటట్లు జిల్లాను రెండు డివిజన్లుగా విభజించారు. అసిస్టెంట్ డైరెక్టర్ల (ఏడీ) పర్యవేక్షణలో ఈ డివిజన్లు పని చేస్తాయి. రాజమహేంద్రవరం డివిజన్లో రాజమహేంద్రవరం అర్బన్, రూరల్, కడియం, కోరుకొండ, సీతానగరం, గోకవరం, రాజానగరం, అనపర్తి, బిక్కవోలు, రంగంపేట మండలాలు ఉంటాయి. ఈ డివిజన్లో ఏడీతో పాటు ఇద్దరు మత్స్యశాఖ డెవలప్మెంట్ అధికారులు, ఇద్దరు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్లు, 10 మంది గ్రామ మత్స్యశాఖ సహాయకులు పని చేస్తారు. కొవ్వూరు డివిజన్లో కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి, నిడదవోలు, గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల, పెరవలి, ఉండ్రాజవరం మండలాలు ఉంటాయి. ఈ ఏడీ పరిధిలో ఇద్దరు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్లు, గ్రామ మత్స్యశాఖ సహాయకులు ఉంటారు. గోదారే ఆధారం జిల్లావ్యాప్తంగా రాజమహేంద్రవరం అర్బన్, రూరల్, సీతానగరం, కొవ్వూరు, తాళ్లపూడి, గోపాలపురం మండలాల్లో మాత్రమే మత్స్యకారులున్నారు. వీరిలో గోపాలపురం మినహా మిగిలిన చోట్ల మత్స్యకారులు ప్రధానంగా గోదావరి నది పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మత్స్యసంపద అభివృద్ధికి జిల్లాలో అవకాశాలు అధికంగా ఉన్నాయి. పురుషోత్తపట్నం నుంచి ధవళేశ్వరం ఆనకట్ట వరకూ 41 కిలోమీటర్ల పొడవునా గోదావరి విస్తీర్ణం 12 వేల హెక్టార్లు కాగా, ఇందులో వెయ్యి హెక్టార్లలో నిరంతరం నీరుంటుందని మత్స్యశాఖ అధికారులు లెక్కలు కట్టారు. చేపలు గుడ్డు పెట్టే దశ కావడంతో ఏటా మే 1 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకూ గోదావరిలో వేట నిషేధం అమలులో ఉంటుంది. మత్స్యకారుల ఉపాధిని దృష్టిలో ఉంచుకుని మత్స్యశాఖ ఆధ్వర్యాన ఏటా 20 లక్షల నుంచి 30 లక్షల వరకూ చేప పిల్లలను గోదావరి నదిలో విడిచిపెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 16 మండలాల్లోని 489 మంది రైతులు 974.99 ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. ప్రధానంగా నిడదవోలు, పెరవలి, బిక్కవోలు, సీతానగరం, చాగల్లు తదితర మండలాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. మిగిలిన మండలాల్లో 50 ఎకరాల్లోపే ఈ సాగు జరుగుతోంది. కడియంలో చేప పిల్లల నర్సరీ కడియంలో 6.54 ఎకరాల్లో మేజర్ చేపల పిల్లల నర్సరీ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏటా చిరు చేపపిల్లలు (స్పాన్) 5 కోట్లు, 12 ఎంఎం చేప పిల్లలు 53.21 లక్షలు, 80 నుంచి 100 మిల్లీమీటర్ల సైజు చేపపిల్లలు 20 లక్షలు ఉత్పత్తి చేస్తున్నారు. కోనసీమ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు అవసరమైన చేప పిల్లలను ఇక్కడి నుంచే సరాఫరా చేస్తున్నారు. గోదావరితో పాటు, ఏలేరు రిజర్వాయర్కు ఉచితంగా చేప పిల్లలను అందిస్తున్నారు. రైతులకు అవసరమైన చేప స్పాన్ను విక్రయిస్తారు. ప్రధానంగా బొచ్చలు, శీలావతి, మోసే, బంగారు తీగ రకాల చేప పిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు. మత్స్యసంపద అభివృద్ధికి చాన్స్ గోదావరి తీర ప్రాంతం కావడంతో మత్స్యసంపద అభివృద్ధికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. మత్స్యకారుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఏటా 20 లక్షల నుంచి 30 లక్షల చేపపిల్లల్ని నదిలో విడిచిపెడుతోంది. ఏపీ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మేషన్ ప్రాజెక్టు (ఏపీఐఐఏటీపీ) కింద ఒక హెక్టారు చెరువు తవ్వి చేపపిల్లల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నాం. కడియం నర్సరీ ద్వారా అవసరమైన వారందరికీ చేపపిల్లలను అందిస్తున్నాం. 50 ఏళ్లు దాటిన మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం పింఛను అందిస్తోంది. మత్స్యకారులకు సబ్సిడీపై వివిధ వాహనాలు, బోట్లు అందజేస్తున్నాం. వీటిని మత్స్యకారులు వినియోగించుకోవాలి. – ఇ.కృష్ణారావు, జిల్లా మత్స్యశాఖాధికారి -
అర్హులైన ప్రతి ఒక్కరికీ సభ్యత్వం
సాక్షి, హైదరాబాద్: మత్స్యరంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో విదేశీ సంస్థలు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయని పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సొసైటీల్లో సభ్య త్వం మత్స్యకారుల హక్కు అని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సభ్యత్వం కల్పిస్తామని తెలిపారు. సోమ వారం పశుసంవర్థకశాఖ డైరెక్టర్ కార్యాలయంలో అన్ని జిల్లాల మత్స్య శాఖ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో ఎక్క డా లేని విధంగా ఉచితంగా చేప, రొయ్య పిల్లల పంపిణీ వంటి కార్యక్రమాలతో రాష్ట్రంలో మత్స్య సంపద భారీగా పెరిగిందని వివరించారు. నూతన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఏర్పాటు, నూతన సభ్యత్వంపై స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు తెలి పారు. 18 ఏళ్లు నిండిన మత్స్యకార కులాలకు చెందిన వారిని అర్హులుగా గుర్తించాలని సూచించా రు. ఇప్పటికే రాష్ట్రంలో 4,753 సొసైటీలు ఉన్నాయని, అందులో 3,47,901 మంది సభ్యులుగా ఉన్నా రన్నారు. ఇంకా 1,185 సంఘాలను ఏర్పాటు చే సేందుకు అవకాశం ఉందని చెప్పారు. మే 15లోగా 100 శాతం సభ్యత్వ నమోదును పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు సభ్యత్వం పొం దేందుకు అనర్హులు అవుతారని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మత్స్యకార సంఘాల ఏర్పాటుకు స్థాని క గిరిజనులు మాత్రమే అర్హులని స్పష్టంచేశారు. అనంతరం నూతన మత్స్య సహకార సంఘాల రిజిస్ట్రేషన్ స్పెషల్ డ్రైవ్ పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం, అడిషనల్ డైరెక్టర్ శంకర్ రాథోడ్ పాల్గొన్నారు. -
వలలో వరాలు.. అదృష్టం అంటే ఇదే!
సాక్షి,అరసవల్లి( శ్రీకాకుళం): ఉద్దానం మత్స్యకారుల వలలో వరాలు పడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో అరుదుగా దొరికే ట్యూనా చేపలు నాలుగు రోజులుగా ఇక్కడి గంగపుత్రులకు దండిగా దొరుకుతున్నాయి. టన్నుల కొద్దీ చేపలను ఇతర రాష్ట్రాలకు తరలించి వారు సంబరపడుతున్నారు. జిల్లాలో అక్టోబర్–డిసెంబర్ మధ్యకాలంలో ఉద్దానం తీరాల్లో తక్కువ మొత్తంలోనే ట్యూనా దొరికేది. ఎవరికో గానీ ఆ అదృష్టం వరించేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం దాదాపుగా వేటకు వెళ్లిన అన్ని వలలకు ట్యూనా చేపలు పడటం విశేషం. నాలుగు రోజుల్లో 200 టన్నులు.. జిల్లాలో సోంపేట, కవిటి మండలాల పరిధిలోనే ట్యూనా చేపలు లభ్యమవుతున్నాయని స్థానిక మత్స్యకారులు, అధికారులు చెబుతున్నారు. బారువ, ఇసుకలపాలెం, ఉప్పలాం, గొల్లగండి తదితర తీర ప్రాంతాల్లో గత నాలుగైదు రోజుల నుంచి భారీగా ట్యూనా చేపలు లభ్యమయ్యాయి. ఈ చేపల లభ్యత సమాచారాన్ని తెలుసుకున్న చేపల వ్యాపారస్తులు స్థానికులతో ఫోన్లలో బేరాసారాలు చేసుకుని రవాణా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే గత నాలుగు రోజుల్లో సుమారు 200 టన్నుల ట్యూనా చేపలు కేరళ, ఒడిశా, కర్ణాటక తదితర రాష్ట్రాలకు తరలించారు. తొలి రెండు రోజుల్లో కిలో చేపల ధర రూ.30 వరకు ఉంటే, ఇప్పుడు రూ.38 నుంచి రూ.45కి చేరింది. ఇదే ధరలతో కేరళకు భారీగా చేపలు విక్రయాలు జరిగినట్లుగా మత్స్యశాఖాధికారులు చెబుతున్నారు. ఇక ఈ చేపలకు జపాన్ తదితర నార్త్ ఈస్ట్ దేశాల్లో గిరాకీ అధికంగా ఉండడంతో ఇక్కడి నుంచి చేపలను ఎగుమతి చేసేందుకు వ్యాపారులు సన్నాహాలు చేస్తున్నారు. విదేశాల్లో డిమాండ్ ఉంది ట్యూనా చేపలను స్థానికంగా సూరలని పిలుస్తుంటారు. ఇక్కడి వారి కంటే ఇతర దేశస్తులు అధికంగా ఆహారంగా తీసుకుంటారు. గతంలో పోల్చితే ఈసారి అధికంగా చేపల సంతతి బయటపడటంతో అక్కడి వలలకు చిక్కాయి. దేశంలోనే చేపల అభివృద్ధిలో ప్రథమ స్థానంలో మన రాష్ట్రం నిలిచింది. అలాగే ఇందులో మన జిల్లా కూడా ప్రాధాన్యతను పొందడం విశేషం. – పీవీ శ్రీనివాసరావు, మత్స్యశాఖ, జేడీ ఇన్ని ఎప్పుడూ దొరకలేదు ట్యూనా చేపలు అప్పుడప్పుడూ దొరుకుతాయి. అయితే ఇంత ఎక్కువ ఎప్పుడూ చూడలేదు. కేజి రూ.38 చొప్పున సుమారు 60 టన్నుల వరకు కేరళ రాష్ట్రానికి పంపించాం. ముందు రోజుల్లో ధర కాస్తా తగ్గించి ఇచ్చాం. ట్యూనా చేపలతో లాభం బాగుంది. – చిడిపల్లి గురుమూర్తి, మత్స్యకారుడు వచ్చే నెల వరకు చిక్కుతాయి ట్యూనా చేపలకు డిమాండ్ ఉంది. మరో నెల రోజుల వరకు కూడా చేపలు వలలకు చిక్కుతాయనే అనుకుంటున్నాం. అందుకే మళ్లీ వేటకు వెళ్తాం. ఇతర దేశాలకు ఉద్దాన తీర ప్రాంత చేపల రుచి చేరనుంది. వాతావరణం అనుకూలిస్తే మరిన్ని రోజులు వేట కొనసాగిస్తాం. – సవధాల ఢిల్లేసు, మత్స్యకారుడు చదవండి: విదేశీ అతిథులు రా..రమ్మంటున్నాయి.. -
మత్స్యరంగంలో ఏపీ అద్భుత ప్రగతి
సాక్షి, అమరావతి: మత్స్యరంగంలో ఆంధ్రప్రదేశ్ అద్భుత ప్రగతి సాధిస్తోందని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి పరుషోత్తమ్ రూపాలా ప్రశంసించారు. విప్లవాత్మక సంస్కరణలతో ఏపీ మత్స్య రంగం గణనీయమైన పురోగతి దిశగా అడుగులేస్తోందని అభినందించారు. మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఆదివారం భువనేశ్వర్లో జరిగిన కార్యక్రమంలో జాతీయ స్థాయిలో బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డును ఏపీ మత్స్య శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, కమిషనర్ కె.కన్నబాబులకు కేంద్ర మంత్రి ప్రదానం చేశారు. అవార్డు కింద రూ.10 లక్షల చెక్కుతో పాటు ప్రత్యేక ప్రశంసాపత్రాన్ని అందజేశారు. చదవండి: AP: శరవేగంగా విద్యుత్ పునరుద్ధరణ అనంతరం పూనం మాలకొండయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో మత్స్యరంగ సుస్థిరాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారని వివరించారు. వైఎస్సార్ మత్స్యకార భరోసా అందించడంతో పాటు డీజిల్ సబ్సిడీ పెంపు, ఆక్వా రైతులకు విద్యుత్ టారిఫ్ తగ్గింపు తదితర ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వం అమలుచేస్తోందన్నారు. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన సీడ్, ఫీడ్ను ఆక్వా రైతులకు అందజేస్తున్నామని చెప్పారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా సాగు విస్తీర్ణంతో పాటు దిగుబడుల ఎగుమతుల్లో పెరుగుదల నమోదైందని చెప్పారు. 8 ఫిషింగ్ హార్బర్లు, రెండు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, నాలుగు ఫ్లోటింగ్ జెట్టీలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్ద పీట వేసిందన్నారు. 70 ఆక్వా హబ్లు, 14 వేలకు పైగా అవుట్లెట్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కేంద్రమంత్రి స్పందిస్తూ.. మత్స్య రంగంలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అభినందించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15 మిలియన్ మెట్రిక్ టన్నులున్న మత్స్య ఉత్పత్తులను.. 22 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. కేంద్ర మంత్రి మురుగన్ తదితరులు పాల్గొన్నారు. -
World Fisheries Day: మత్స్యకారులకు సీఎం జగన్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మత్స్యకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో డీజిల్పై సబ్సిడీ నుంచి మత్స్యకార భరోసా వరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకుంటుందని అన్నారు. మత్స్యకారులకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ‘‘మత్స్యకార సోదరులందరికీ శుభాకాంక్షలు. డీజిల్ సబ్సిడీ నుంచి మత్స్యకార భరోసా వరకూ, కొత్త హార్బర్ల నిర్మాణం ద్వారా ఉపాధి అవకాశాలు అందించడంలోనూ ఈ ప్రభుత్వం మీకు ఎప్పుడూ అండగా నిలిచింది. ఇక పైనా మీ సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది.’’ అని సీఎం ట్వీట్ చేశారు. చదవండి: ఆ ప్రాంతాల మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్ కీలక ఆదేశాలు మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకార సోదరులందరికీ శుభాకాంక్షలు. డీజిల్ సబ్సిడీ నుండి మత్స్యకార భరోసా వరకూ, కొత్త హార్బర్ల నిర్మాణం ద్వారా ఉపాధి అవకాశాలు అందించడంలోనూ ఈ ప్రభుత్వం మీకు ఎప్పుడూ అండగా నిలిచింది. ఇకపైనా మీ సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది.#MatsyakaraDinotsavam — YS Jagan Mohan Reddy (@ysjagan) November 21, 2021 -
మత్స్యకారుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్ని నాని అన్నారు. గన్నవరంలో 30 లక్షల వ్యయంతో నిర్మించిన మత్స్య సహకార నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారన్నారు. గుజరాత్లో డ్రగ్స్ కేసుల్ని ఏపీకి అంటగట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు. (చదవండి: ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదు: సీఎం జగన్) దసరాకు 4వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని మంత్రి వెల్లడించారు. అధిక ధరలు వసూలు చేసే ప్రైవేట్ బస్సులపై చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ఫిర్యాదుల కోసం త్వరలో ప్రత్యేక వాట్సాప్ నెంబర్ అందుటులోకి తీసుకువస్తామన్నారు. ఆన్ లైన్ టిక్కెట్లపై ఎప్పటికప్పుడు ప్రత్యేక నిఘా పెట్టామని మంత్రి పేర్ని నాని తెలిపారు. చదవండి: దసరా పండుగకు ప్రత్యేక రైళ్లు -
పత్తి ఏరాల్సిన చోట.. చేనులో చేపల వేట
ఇటీవల కురిసిన వర్షాలకు మంచిర్యాల జిల్లాలో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండడంతో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న పంట చేలలోకి వరద నీరు చేరింది. గోదావరి నదిలో వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో బుధవారం చేపల వేటకు అధికారులు అనుమతించలేదు. అయితే కొందరు మత్య్సకారులు నీరు నిలిచిన పొలాల్లో చేపల వేట కొనసాగించడం ఆసక్తికరంగా మారింది. పరివాహక ప్రాంతంలోని పంట చేలలో వరద నీటిపై తెప్పలు వేసుకుని వెళ్లి మత్య్సకారులు చేపలు పట్టారు. తమ రెక్కల కష్టం వరద పాలైందని రైతులు వాపోతున్నారు. పంట నష్టం జరిగిన పొలాలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. పత్తి ఏరాల్సిన చోట చేపలు పట్టడం వింతగా ఉంది. - సాక్షి ఫొటోగ్రాఫర్, మంచిర్యాల -
కార్గో ఫ్లైట్ ద్వారా మత్స్య సంపద ఎగుమతి చేసేందుకు ప్రయత్నాలు
-
చేపల వినియోగం పెంచడానికి హబ్లను ఏర్పాటు చేస్తున్నాం: సీఎం జగన్
సాక్షి,అమరావతి: ఆక్వా రైతులకు మంచి ధరలు అందాలని, ఈ లక్ష్యాలను చేరుకోవడానికి రాష్ట్రంలో వినియోగం పెంచే దిశగా ఆక్వా హబ్లను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. చేపల వినియోగం పెరగాలని, సరసమైన ధరలకు ప్రజలకు చేరాలని ఆయన అధికారులకు సూచించారు. పశుసంవర్ధకశాఖ, డెయిరీ, ఫిషరీస్ విభాగాలపై వైఎస్ జగన్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. చేపల రవాణా, నిల్వ తదితర అంశాల్లో అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలన్నారు. ఆక్వా యూనివర్శిటీ ఏర్పాటుపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. ఆక్వా లాబ్స్ను వినియోగించుకోవడంపై ప్రచారం, అవగాహన కల్పించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఆక్వా రంగానికి సంబంధించి క్వాలిటీ చెకింగ్స్ ఎలా చేయించుకోవాలన్నదానిపై అవగాహన పెంచాలన్నారు. ఈ ల్యాబ్లను ఆర్బీకేలకు అనుసంధానం చేయాలని, ఆక్వా సీడ్, ఫీడ్ల విషయంలో ఎలాంటి కల్తీలు ఉండకూడదని తెలిపారు. కేజ్ ఫిష్ కల్చర్పై కార్యాచరణ ప్రణాళిక 5 ఫిషింగ్ హార్బర్లు, 1 ఫిస్ ల్యాండ్ సెంటర్లో పనులు ప్రారంభమయ్యాయని అధికారులు సీఎం జగన్కు తెలిపారు. మిగిలిన చోట్ల కూడా పనులు ప్రారంభమయ్యేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. కేజ్ ఫిష్ కల్చర్, మరీకల్చర్లపై దృష్టి పెట్టాలని, ఆదాయాలు బాగా పెరుగుతాయని తెలిపారు. కేజ్ ఫిష్ కల్చర్పై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని, రైతులు, ఔత్సాహికులతో కలిసి ముందుకు సాగేలా ఒక ప్రణాళిక తీసుకురావాలని తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద మూడు చోట్ల కేజ్ ఫిష్ కల్చర్, మూడు చోట్ల మరీకల్చర్లను మొదలుపెట్టాలని తెలిపారు. వెటర్నరీ డిస్పెన్సరీల్లో హేతుబద్ధత ఉండాలని, ప్రతి గ్రామం, మండలంలో ఏం ఉండాలనేదాన్ని నిర్ధారించాలని అధికారులకు సీఎం సూచించారు. డిస్పెన్సరీలు ఆర్బీకేలతో అనుసంధానం హేతుబద్ధత ప్రకారం డిస్పెన్సరీలను పెట్టాలని, తర్వాత వాటిని మెరుగ్గా నిర్వహించాలని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. డిస్పెన్సరీలు ఆర్బీకేలతో అనుసంధానం చేయాలన్నారు. అయితే కొన్ని డిస్పెన్సరీలు లేని మండలాలు కూడా ఉన్నాయని అధికారులు ముందు మ్యాపింగ్ చేసి తర్వాత వాటిని ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పశువుల ఆస్పత్రుల్లో నాడు-నేడుపై కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. నాడు-నేడులో భాగంగా నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలను ముందు నిర్దారించుకోలన్నారు. తర్వాత పనులు ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి సీదిరి అప్పలరాజు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
31 నుంచి ఆక్వా ఎక్స్పో–2019
హైదరాబాద్: ఆక్వా రంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఇండియన్ ఫిషరీస్ అండ్ ఆక్వా కల్చర్, మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఆక్వా ఎక్స్పో–2019 జరగనుంది. ఈ మేరకు గురువారం మత్స్యశాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ సుల్తానియా ఎక్స్పో బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులనూ, కొనుగోలుదారులనూ, సరఫరా దారులనూ, పరిశ్రమ నిపుణులనూ ఒక గొడుగు కిందకు తీసుకురావడమే ఎక్స్పో ఉద్దేశమని పేర్కొన్నారు. రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎక్స్పో జరుగుతుందన్నారు. మత్స్యకారులు ఒక సంఘంగా ఏర్పాటైతే వారికి కావలసిన పరికరాలు అందిస్తామని సుల్తానియా చెప్పారు. కార్యక్రమంలో జాతీయ మత్య్సశాఖ అభివృద్ధి బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాణి కుముదిని, మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ, సొసైటీ ఫర్ ఇండియన్ ఫిషరీ‹ -
క్యాట్ఫిష్ అక్రమ రవాణా!
సాక్షి, కామారెడ్డి: ఆఫ్రికన్ క్యాట్ఫిష్ అక్రమ దందా కొనసాగుతోంది. కర్ణాటక రాష్ట్రంలోని చింతామణి ప్రాంతం నుంచి 44వ నంబర్ జాతీయ రహదారి మీదుగా మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాలకు పెద్ద ఎత్తున రవాణా అవుతోంది. సోమవారం జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో క్యాట్ఫిష్ అక్రమ రవాణా వ్యవహారం వెలుగు చూసింది. చింతామణి ప్రాంతంలో ఆఫ్రికన్ క్యాట్ఫిష్ పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతున్నట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి లారీల్లో బెంగళూరు–నాగ్పూర్ జాతీయ రహదారి మీదుగా మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు తరలిస్తున్నారని సమాచారం. ఈనెల 19న లారీలో క్యాట్ఫిష్ తరలిస్తున్న ముఠా.. కామారెడ్డి జిల్లా సదాశివనగర్లో లారీలో నీటిని నింపుకోవడానికి యత్నించింది. ఈ సందర్భంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు అనుమానం వచ్చి లారీపై కప్పిన కవర్ను విప్పి చూశారు. అవి ఆఫ్రికన్ క్యాట్ఫిష్ అని తేలింది. దీంతో మత్స్యశాఖ అధికారులు జేసీబీని తెప్పించి పెద్ద గుంతను తవ్వి లారీలో ఉన్న దాదాపు నాలుగు టన్నుల క్యాట్ఫిష్ను పారబోయించి పూడ్చి వేశారు. వీటి విలువ రూ. 2 లక్షలపైనే ఉంటుందని అంచనా. ‘క్యాట్ఫిష్’ వెనుక మాఫియా క్యాట్ఫిష్ ఉత్పత్తి, పెంపకం, రవాణా, అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ ఫిష్ను తింటే అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయనే ఉద్దేశంతోనే ప్రభుత్వం వాటిపై నిషేధం విధించిందని మత్స్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. కానీ అక్రమార్కులు తమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. క్యాట్ఫిష్ అక్రమ రవాణా వెనుక పెద్ద మాఫియా ఉండి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. కాగా క్యాట్ఫిష్ను స్వాధీనం చేసుకుని పూడ్చివేయించిన పోలీసులు.. డ్రైవర్ మీద మాత్రమే కేసు నమోదు చేశారు. క్యాట్ఫిష్ రవాణా నేరం క్యాట్ఫిష్ వల్ల అనేక రకాల సమస్యలు వస్తున్నాయని ప్రభుత్వం వాటిపై నిషేధం విధించింది. క్యాట్ఫిష్ను పెంచినా, అమ్మినా, రవాణా చేసినా చర్యలు తప్పవు. జాతీయ రహదారిపై పోలీసులు లారీని పట్టుకుని మాకు సమాచారం ఇవ్వడంతో వెళ్లి పరిశీలించాం. అవి క్యాట్ఫిష్ అని తేలడంతో వాటిని గుంతలో వేసి, పూడ్చి వేయించాం. –పూర్ణిమ, జిల్లా మత్స్యశాఖ అధికారి, కామారెడ్డి -
వెజిటేరియన్ కొర్రమీను మేడిన్ చైనా!
కొర్రమీను ఉత్పత్తి పెంపునకు చైనా టెక్నాలజీ - రాష్ట్రంలో వాటి సంతతిని తిరిగి పెంచే యత్నంలో మత్స్యశాఖ - వాటి అలవాటునే మార్చేసిన చైనా శాస్త్రవేత్తలు - మాంసాహార చేపలు శాకాహారులుగా మార్పు - వేటాడే లక్షణమూ బంద్.. - బయటినుంచి వేసిన ఆహారం తినేలా పరిజ్ఞానం కొర్రమట్ట.. కొర్రమీను.. ఎలా పిలిచినా ఆ చేపను ఇష్టపడనివారుండరు. పులుసు, ఫ్రై ఎలా వండినా లోట్టలేసుకుంటూ తినేస్తారు.. ముళ్లు తక్కువగా ఉండడం, రుచి ఎక్కువగా ఉండడం దీని ప్రత్యేకత. కానీ రానురాను కొర్రమీను దొరకడం కష్టమవుతోంది. డిమాండ్ పెరిగిపోవడంతో ఏకంగా కిలో రూ.600 వరకు పలుకుతోంది. కృత్రిమంగా వీటి సంతతిని పెంచడానికి అవకాశాలూ లేవు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మత్స్య శాఖ కొర్రమీను సంతతి పెంచడమెలాగనే దానిపై దృష్టి సారించింది. చైనాలో కొర్రమీను చేప పిల్లలను ఉత్పత్తి చేసి, పెంచే టెక్నాలజీని అభివృద్ధి చేయడంతో.. అధికారులు ఆ దేశానికి వెళ్లి పరిశీలించి వచ్చారు.ఆ తరహా టెక్నాలజీతో రాష్ట్రంలోని కోయిల్సాగర్ రిజర్వా యర్లో కొర్రమీనులను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ ముళ్లు తక్కువ.. రుచి ఎక్కువ ఇతర చేపలేవైనా దాదాపు చనిపోయిన స్థితిలోనే విక్రయిస్తారు. కానీ కొర్రమీనును బతికుండగా విక్రయిస్తారు. ఇతర చేపలు కేవలం నీటిలోని ఆక్సిజన్ను సంగ్రహించే బతుకుతాయి. కానీ కొర్రమీను మాత్రం తక్కువ నీటిలోనూ బతకగలదు. అవి నీటితోపాటు గాలిలోని ఆక్సిజన్నూ సంగ్రహించగలవు. ఇక కొర్రమీనులో ముళ్లు తక్కువ.. రుచి చాలా ఎక్కువ. వండటానికి ముందే ముళ్లను పూర్తిగా తీసేయవచ్చు కూడా. దీంతో చిన్న పిల్లలూ ఇష్టంగా తింటారు. ఇక కొర్రమీను పులుసుతో కీళ్ల సంబంధిత నొప్పులు తగ్గుతాయని, పలు ఇతర సమస్యలు ఉపశమించేందుకూ తోడ్పడుతుందన్న ప్రచారం ఉంది. రాష్ట్రంలో గోదావరి నదిలో శ్రీరాంసాగర్ ప్రాంతం నుంచి కరీంనగర్, వరంగల్ జిల్లాల వరకు కొర్రమీను లభిస్తుంది. కాలువల వసతి ఉన్న ప్రాంతాల నుంచి కొంత లభ్యమవుతుంది. రాష్ట్రంలో ఏడాదికి 2.5 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి అవుతుంటే.. అందులో కొర్రమీను కేవలం 2 శాతమే ఉండటం గమనార్హం. ఇది రాష్ట్ర అధికారిక చేప కూడా. ఏటికేడు తగ్గిపోతూ కొర్రమీను చేపల సంతతి ఏడాదికేడాది తగ్గిపోతోంది. కొర్రమీను సహజ లక్షణాలకు తోడు, ఇతర చేపల్లా కొర్రమీనును ప్రత్యేకంగా ఉత్పత్తి చేయలేకపోవడం దీనికి కారణం. పునరుత్పత్తి (హేచరీస్) కేంద్రాల్లో ప్రత్యేకంగా విత్తనాన్ని (చేప పిల్లలను) ఉత్పత్తి చేసి వాటిని జలాశయాలు, చెరువులు, కుంటల్లో వదలడం ద్వారా ఇతర చేపలను పెంచవచ్చు. ఆయా హేచరీస్లలో చేపలకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి చేప విత్తనాన్ని తయారు చేస్తారు. బొచ్చె, బంగారుతీగ, గడ్డి చేప పిల్లలను అలాగే ఉత్పత్తి చేస్తారు. అయితే అలాంటి పరిజ్ఞానం కొర్రమీను చేపల విషయంలో అందుబాటులో లేదు. ఇది సహజ సిద్ధంగా చెరువులు, జలాశయాల్లో గుడ్లు పెట్టి పిల్లలను కంటుంది. దీని ప్రత్యుత్పత్తి సహజంగా జరుగుతుంది. పైగా ఇది మాంసహార చేప. ఇతర చేప పిల్లలను, చిన్న చేపలను వేటాడి తింటుంది. అందువల్ల వీటిని పునరుత్పత్తి కేంద్రాల్లో పెంచడం సాధ్యంకాదు. దీంతో కరువు, కాటకాల సమయంలో చెరువులు, జలాశయాల్లోకి నీరు చేరని సమయంలో వీటి సంతతి బాగా పడిపోతుంది. మరోవైపు పంట పొలాల్లో అధికంగా వాడే ఎరువులు, పురుగుమందులు వర్షాలతో చెరువులు, కుంటల్లోకి చేరి.. ఆ కలుషిత నీటి కారణంగా కొర్రమీను సంతతి తగ్గిపోతోంది. తమ పిల్లలను తామే... సహజంగా గుడ్లు పెట్టి పిల్లలను కనే కొర్రమీను చేపలు ఆ పిల్లలను కొన్నాళ్ల వరకు మగ, ఆడ కలసి కాపాడతాయి. ఇతర చేపల నుంచి ఎటువంటి హాని జరగకుండా చూస్తాయి. పిల్లలను 40–50 రోజుల తర్వాత వదిలేస్తాయి. కానీ వాటిని వదిలేశాక ఏవి తన పిల్లలో గుర్తుపట్టక తామే తినేస్తుం టాయి కూడా. కొర్రమీను సంతతి తగ్గిపోవడానికి ఇదీ కూడా కారణమని మత్స్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొర్రమీను అలవాటునే మార్చిన చైనా చైనాలో కొర్రమీను కిలో ధర మన కరెన్సీలో రూ.200 మాత్రమే. దానికి కారణం అక్కడ కొర్రమీను ఉత్పత్తి పెరగడమే. ఆ దేశంలో పునరుత్పత్తి కేంద్రాల్లో కొర్రమీను విత్తనాన్ని తయారు చేసి జలాశయాల్లో వదిలేస్తున్నారు. ఇందుకోసం దాదాపుగా ఐదు తరాలపై పెద్ద ప్రయోగం చేశారు. కొర్రమీను సహజ స్వభావాలను మార్చారు. దాంతో కొర్రమీను వేటాడే లక్షణం, మాంసహార స్వభావం పోయి.. శాకాహారిగా మారిపోయింది. అంతేకాదు పునరుత్పత్తి కేంద్రాల్లో ఇతర చేపల్లా హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి చేప విత్తనాన్ని తయారు చేశారు. ఆ చేప పిల్లలను చెరువులు, జలాశయాల్లో వదిలి ఇతర చేపల్లా పెరిగేలా చేశారు. దీంతో అక్కడ కొర్రమీను ఉత్పత్తి బాగా పెరిగింది. రాష్ట్ర మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ చైనాకు వెళ్లి.. ఈ విషయంపై అధ్యయనం కూడా చేసి వచ్చారు. అయితే కొర్రమీను విత్తనాన్ని ఉత్పత్తి చేసేందుకు ఉపయోగించే టెక్నాలజీని బహిర్గత పరచడానికి చైనా శాస్త్రవేత్తలు ముందుకు రాలేదని ఆయన ‘సాక్షి’కి వివరించారు. వియత్నాం దేశంలోనూ ఇటువంటి టెక్నాలజీ ఉందని చెప్పారు. ఇక్కడా చైనా తరహా టెక్నాలజీ.. చైనాలో దాదాపు ఐదు తరాలుగా కృషి చేసి కొర్రమీను చేపల అలవాట్లనే మార్చేశారు. దాంతో అక్కడ కొర్రమీను సంతతి పెరిగింది. అయితే కొర్రమీనును ప్రత్యేకంగా పునరుత్పత్తి చేసే టెక్నాలజీని బహిర్గతం చేయడానికి వాళ్లు ఇష్టపడడం లేదు. కానీ ఒడిశాలోని భువనేశ్వర్లో ఉన్న మంచినీటి చేపల పరిశోధన కేంద్రంలో చైనా తరహా టెక్నాలజీతో కొర్రమీను చేప విత్తనం తయారు చేసే విధానాన్ని అభివృద్ధి చేస్తున్నారు. దీనిని వచ్చే ఏడాది కోయిల్సాగర్లో ప్రయో గాత్మకంగా పరిశీలించాలని అనుకుంటున్నాం. అందుకోసం భువనేశ్వర్ చేపల పరిశోధన కేంద్రంతో ఒప్పందం చేసుకోవాలని అనుకుంటున్నాం.. – శ్రీనివాస్,మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ -
క్రేజ్ కల్చర్
ఈసారి ఏడు చెరువుల్లో నూతన విధానంలో చేపల పెంపకం ► ‘అలీసాగర్’ సత్ఫలితాలివ్వడంతో జిల్లాలో పెరిగిన యూనిట్లు ► ఇతర జిల్లాల నుంచి నిధుల మళ్లింపు సాక్షి, నిజామాబాద్: కేజ్కల్చర్.. అధునాతన పద్ధతుల్లో చేపల పెంపకం చేపట్టడం. జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ‘కేజ్కల్చర్’ సత్ఫలితాలు ఇవ్వడంతో.. ఈ విధానాన్ని మరిన్ని చెరువులకు విస్తరించా లని అధికారులు నిర్ణయించారు. ఇతర జిల్లాలకు కేటాయించిన నిధులను కూడా నిజామాబాద్ జిల్లాకు మళ్లించేందుకు సర్కారు అంగీకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం కేజ్ కల్చర్ విధానాన్ని ప్రోత్సహిస్తోం ది. ఇందులో భాగంగా గతేడాది అలీ సాగర్లో కేజ్కల్చర్ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఇది సత్ఫలితాలు ఇవ్వడంతో ఈ విధానాన్ని జిల్లాలోని మరిన్ని చెరువులకు విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. కేజ్ కల్చర్ యూనిట్ల కోసం వివిధ జిల్లాలకు కేటాయించిన నిధులు సకాలంలో వినియోగం కాకపోవడం, నిజామాబాద్ జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన కేజ్కల్చర్ విధానంలో చేపల పెంపకం సత్ఫలితాలు ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఖమ్మం, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలకు కేటాయించిన నిధులను మన జిల్లాకు మళ్లిస్తున్నారు. దీంతో గతేడాది ఒక్క అశోక్సాగర్కే పరిమితమైన కేజ్కల్చర్ యూనిట్ను ఈసారి మరిన్ని చోట్ల ఏర్పాటు చేయనున్నారు. యూనిట్ల విస్తరణ.. నీలి విప్లవం పథకంలో భాగంగాప్రభుత్వం కేజ్కల్చర్ను సాగు చేసే మత్స్యకారులకు పెద్ద మొత్తంలో సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తోంది. యూనిట్ వ్యయంలో 80 శాతం సబ్సిడీ ఇస్తోంది. మిగిలిన 20 శాతం లబ్ధిదారులు చెల్లించాలి. ఆయా మత్స్య సహకార సంఘాలు ఈ 20 శాతం వాటాను చెల్లించాల్సి ఉంటుంది. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎసీడీసీ) కింద ఈ నిధులు మంజూరవుతున్నాయి. వంద ఎకరాల కంటే ఎక్కువ ఆయకట్టు ఉన్న పెద్ద చెరువుల్లో ఈ యూనిట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. గతేడాది ఒక్క అలీసాగర్లో మాత్రమే ఈ విధానంలో చేపల పెంపకం చేపట్టారు. ఈసారి అలీసాగర్తో పాటు గుత్ప, వెల్మల్, కుద్వాన్పూర్, రెంజల్, మెండోరా, రెంజర్ల చెరువుల్లో కేజ్ కల్చర్ యూనిట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అలీసాగర్లో సత్ఫలితాలు.. అలీసాగర్లో చెరువులో చేపట్టిన కేజ్ కల్చర్ చేపల పెంపకం విధానం మంచి ఫలితాలనిచ్చింది. పంగాసిస్, తిలాపియా అనే రెండు రకాల చేపలను పెంచారు. ఒక్కో కేజ్ (పంజరం) 96 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో ఉన్నాయి. ఇలా మొత్తం పది కేజ్లలో చేపల పెంపకం చేపట్టారు. సుమారు 11 టన్నుల చేపల ఉత్పత్తి జరిగినట్లు మత్స్యశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. వీటిని కిలోకు రూ.వంద చొప్పున విక్రయించారు. అది కూడా ఎలాంటి రవాణా, ఇతర ఖర్చు లేకుండా చెరువు గట్టుపైనే విక్రయించడంతో 11 టన్నులకు సుమారు రూ.11 లక్షల వరకు ఆదాయం వచ్చిందని అంచనా వేశారు. మొత్తంగా కేజ్ కల్చర్ ప్రయోగం సత్ఫలితాలనివ్వడంతో మరో ఏడు చెరువులకు విస్తరించాలని నిర్ణయించారు. ఈ నెలలో యూనిట్ల ఏర్పాటు ఈ నెలలోనే కేజ్ కల్చర్కు సంబంధించిన యూనిట్లను ఏర్పాటు చేయనున్నాం. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో టెండర్లు పిలిచారు. ఈ పనులు దక్కిం చుకున్న సంస్థలే యూనిట్లను ఏర్పాటు చేసి, ఆయా మత్స్య సహకార సంఘాలకు అప్పగిస్తాయి. చేప పిల్లలను కూడా ఉచితంగా సరఫరా చేస్తాం. – మహిపాల్, అసిస్టెంట్ డైరెక్టర్, ఫిషరీస్ -
నిషేధానికి తూట్లు
► సముద్రంలో కొనసాగుతున్న వేట ► చీరాలలో రెండు బోట్లు సీజ్ ► నిబంధనలకు విరుద్ధంగా వెళితే చర్యలు తప్పవు ► మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ హెచ్చరిక ఒంగోలు టౌన్: సముద్ర సంపద పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం సముద్రంలో విధించిన వేట నిషేధానికి జిల్లాలో కొంతమంది మత్స్యకారులు తూట్లు పొడుస్తున్నారు. వేటను నిషేధించినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా చీరాల సముద్ర తీర ప్రాంతంలో వేట సాగిస్తున్న రెండు బోట్లను మత్స్యశాఖ అధికారులు గుర్తించి వాటిని సీజ్ చేశారు. జిల్లాలోని సముద్ర తీర ప్రాంతంలోఅక్కడక్కడా వేట సాగిస్తున్నట్లు తెలుస్తోంది. మత్స్యశాఖ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టి వేటను అడ్డుకోకుంటే భవిష్యత్లో మత్స్యకారులు నష్టపోయే ప్రమాదం ఉంది. జిల్లాలోని 10 తీర ప్రాంత మండలాల్లో 102 కిలోమీటర్లమేర సముద్ర తీరం విస్తరించి ఉంది. 1700 సంప్రదాయ పడవలు, 43 మెకనైజ్డ్ బోట్లు, 2400 మోటరైజ్డ్ బోట్లు ఉన్నాయి. వీటి ద్వారా 15 వేల మంది మత్స్యకారులు సముద్రంలో చేపలు పట్టుకొని జీవనం సాగిస్తుంటారు. సంప్రదాయ పడవలు సముద్రంలో 8 కిలోమీటర్లలోపు మాత్రమే వెళ్తుంటాయి. మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లు మాత్రం సముద్రంలో 20 కిలోమీటర్ల వరకు వెళ్లి వేటను సాగిస్తూ ఉంటాయి. సముద్రంలో చేపలు గుడ్లు పెట్టే దశలో ఉన్నందున సంప్రదాయ పడవలతో వేట సాగించడం వల్ల మత్స్యకారులకు ఎలాంటి ఉపయోగం ఉండదు. మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లు మరింత లోపలికి వెళ్లి వేటను సాగిస్తున్నందున ఆ రెండు కేటగిరీలకు చెందిన బోట్లపై మత్స్యశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సముద్రంలో చేపలు గుడ్లు పెడుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేటను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్దంగా ఎవరైనా వేట సాగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించింది. జిల్లాలో నాలుగు వేలకుపైగా మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లు ఉన్నాయి. ఈ బోట్లు సముద్రంలో 20 కిలోమీటర్లకు పైగా దూరం వెళ్లి వేట సాగిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు రకాల బోట్ల ద్వారా సాగించే వేటను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. వేటపై నిషేధం విధించి పక్షం రోజులు కూడా కాకముందే కొంతమంది మత్స్యకారులు నిబంధనలకు విరుద్ధంగా వేట సాగించడంతో ఈ ప్రభావం మిగిలిన మత్స్యకారులపై కూడా చూపిస్తోంది. సాయం దూరం.. సముద్రంలో వేట నిషేధించిన కాలంలో మత్స్యకారుల జీవనోపాధికి వేట సాగించే ప్రతి మత్స్యకారుడికి రూ.4 వేల చొప్పున సాయం అందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ సకాలంలో ఎన్నడూ మత్స్యకారులు ఆ సాయాన్ని పొందిన దాఖలాలు లేవు. జిల్లాలో ఎన్ని తీర ప్రాంతాలు ఉన్నాయి, ఎంతమంది మత్స్యకారులు వేట సాగిస్తున్నారు, వారి బ్యాంకు ఖాతా నంబర్లు, ఆధార్ నంబర్లు మత్స్యశాఖ సహాయ సంచాలకుల కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయి. పూర్తి స్థాయిలో మత్స్యకారులకు సంబంధించిన డేటా ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం వారి గురించి సకాలంలో స్పందించకుండా విస్మరిస్తూనే ఉంది. వాస్తవానికి వేట నిషేధానికి ముందు ఆర్ధిక సాయం అందిస్తే ఆ రెండు నెలలు మత్స్యకారుల కుటుంబాల జీవనోపాధికి కొంతమేర ఆసరాగా ఉంటుంది. ప్రభుత్వం నెలల తరబడి సాయం అందించకపోవడంతో ఆ పథకం ఉండికూడా ఉపయోగం లేకుండా పోతోందని మత్స్యకారులు వాపోతున్నారు. ‘ఉపాధి’కి నోచుకోని మత్స్యకారులు జిల్లాలోని తీర ప్రాంత మండలాలకు చెందిన మత్స్యకారులు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులకు నోచుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం రెండు నెలలపాటు సముద్రంలో వేటను నిషేధించిన నేపథ్యంలో సముద్రేతర మండలాల్లో ఉపాధి హామీ పథకం పనులు యధావిధిగా జరుగుతూనే ఉన్నాయి. అయితే తీర ప్రాంత మండలాల్లోని మత్స్యకారులకు మాత్రం ఉపాధి హామీ పథకం అందని ద్రాక్షగా మారింది. ఏటా కేంద్ర ప్రభుత్వం సముద్రంలో చేపల వేటను నిషేధించిన సమయంలో ఉపాధి హామీ పథకం కింద తమకు జీవనోపాధి కల్పించాలని మత్స్యకారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించుకుంటున్నప్పటికీ వాటి చెవికెక్కడంలేదు. సముద్రతీర ప్రాంత మండలాల్లో ఉపాధి హామీ పనులు చేపట్టడం ద్వారా ఒకవైపు తీర ప్రాంత గ్రామాల్లో అభివృద్ధి జరగడంతోపాటు మత్స్యకారులకు కూడా ఉపాధి లభిస్తుంది. -
మత్స్యకారుల సంక్షేమం వైఎస్సార్ సీపీ లక్ష్యం
వైఎస్సార్ సీపీ నేత జక్కంపూడి విజయలక్ష్మి ఘనంగా ప్రపంచ మత్స్యకార దినోత్సవం ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం) : మత్స్యకారుల అభ్యున్నతి, సంక్షేమం వైఎస్సార్ సీపీ లక్ష్యమని ఆ పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి తెలిపారు. స్థానిక వాటర్ వర్క్సు ఇసుక ర్యాంపు వద్ద వివిధ మత్స్యకార సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రపంచ మత్స్యకార దినోత్సవంలో ముఖ్య అతిథిగా ఆమె మాట్లాడారు. కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో గతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన మత్స్యకారులకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రూ.40 లక్షల విలువైన వస్తువులను అందజేశారని తెలిపారు. కోరుకొండ మండలంలో మత్స్యకారులు మృతి చెందినప్పుడు రూ.7 లక్షల ఆర్థిక సాయం అందించారని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నగర కో-ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ జాంపేట మార్కెట్లో దళారుల వ్యవస్థ లేకుండా మత్స్యకారులకు అవకాశం కల్పించాలని సూచించారు. ఇతర ఇసుక ర్యాంపులలో కూడా మత్స్యకారులకు అవకాశం కల్పించాలని కోరారు. నగర మేయర్ పంతం రజనిశేషసాయి మాట్లాడుతూ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కల్లుగీత, చేనేత కార్మికుల మాదిరిగా మత్స్యకారులకు కూడా 55 ఏళ్లకే ఫించను మంజూరు చేయాలన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ చంద్రన్న బీమా పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. మత్స్యకారులు మద్యం వ్యసనానికి దూరంగా ఉండాలని క్రైం డీఎస్పీ త్రినాథరావు సూచించారు. మత్స్యకార సంఘాల అధ్యక్షులు వెలమ లక్ష్మణరావు, లక్ష్మీ ,ప్రభాకరరావు మత్స్యకారులు సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ ప్రజాప్రతినిధులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోదావరిలో లక్ష చేప, రొయ్య పిల్లలను వదిలారు. అనంతరం మత్స్యకారులకు వస్త్రదానం చేశారు. గోదావరి మాత ఫిషర్ మెన్ సంఘం, శ్రీ గోదావరి బెస్త సేండ్ అండ్ క్వారీ బోట్స్ మెన్ కో-ఆపరేటివ్ సొసైటీ, గోదావరి మాత సేండ్ అండ్ క్వారీ మహిళామత్స్య సహకారం సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఇన్నమూరి రాంబాబు, పొలసానపల్లి హనుమంతరావు, యజ్జరపు మరిడయ్య, మన కోసం సమాచార హక్కుచట్టం అధ్యక్షుడు తొంటెపు హరికృష్ణ, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ శ్రీనివాస్, న్యాయవాది వల్లూరి సురేష్, మత్స్యశాఖాధికారులు రామకృష్ణ, రమేష్, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ గోపి, బండారు కోదండం తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధికి ఊతం
మత్స్యకారులకు మంచిరోజులు.. జిల్లాలో 4.44 కోట్ల చేప పిల్లల పెంపకం లక్ష్యం మాదన్నపేట చెరువులో నేడు ప్రారంభం నర్సంపేట: జిల్లాలో మత్స్య సంపద పెంపునకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. నీలి విప్లవానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుడుతోంది. చేపల పెంపకాన్ని ప్రోత్సహించడంతో పాటు కార్మికులకు ఉపాధి కల్పించాలని నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని మధ్య, చిన్న, తరహా జలాశయాలు, చెరువులు, కుంటల్లో చేపల పెంపకానికి కార్యాచరణ పూర్తి చేసింది. జిల్లాలో 16 రిజర్వాయర్లతోపాటు 715 చెరువులు, గ్రామపంచాయతీలకు సంబంధించిన కుంటలు, చెరువులో మరో 3600 ఉన్నాయి. వీటిలో 4 కోట్ల 44 లక్షల 38 వేల చేప పిల్లలు పెంచనున్నారు. జిల్లాలో ప్రథమంగా బుధవారం(నేడు) నర్సంపేటలోని మాధన్నపేట చెరువులో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీ సీతారాంనాయక్ చేప పిల్లలు వదిలి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జిల్లాలోని 715 సంఘాలకు చేప పిల్లల్ని ఉచితంగా సరఫరా చేయనున్నారు. చేపల పెంపకం, మత్స్యకారులకు ఉపాధి, మార్కెటింగ్ తదితర అవసరాలు తీర్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మత్స్య కార్మికులకు రాయతీపై వలలు, వాహనాలను అందజేయనున్నారు. జిల్లాలోని జలాశయాల కింద స్థలాల్లో చేపల ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం మత్స్యశాఖ అ«ధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మత్స్యకారులను ఆదుకునేందుకు చేపల ఉత్పత్తి, పెంపకం కేంద్రాలకు అనువైన జలాశయాలు ఎంపికలో అ«ధికారులు నిమగ్నమయ్యారు. 73 వేల మందికి ఉపాధి మెరుగు ... జిల్లాలోని 650 సహకార సంఘాలు ఉండగా 84 మహిళా మత్స్యకార్మిక సంఘాలు ఉన్నాయి. వీటిలోని 73 వేల మంది ఉపాధి పొందనున్నారు. ఇందులో సహకార సంఘాలలో 53 వేల మందికి సభ్యత్వాలు ఉండగా, మరో 20 వేల మంది అనధికారికంగా ఉపాధి పొందనున్నారు. ప్రభుత్వం చేపట్టనున్న నీలి విప్లవం ద్వారా వీరందరికి ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడటంతో పాటు భద్రత చేకూరనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మత్స్యకారులను ఆదుకునేందుకు 75శాతం రాయితీలపై వాహనాలు, లైసెన్సులు ఉన్న మత్స్యకారులకు 50 శాతం రాయితీపై వలలు అందించనున్నారు. దళారీ వ్యవస్థ నుంచి విముక్తి - బుస్స మల్లేషం, మత్స్యపారిశ్రామిక సొసైటీ జిల్లా అధ్యక్షుడు ఇప్పటి వరకు జిల్లాలో చాలాచోట్ల చేపల అమ్మకం వ్యవస్థను దళారులు కొనసాగిస్తున్నారు. ఈ విధానాన్ని మార్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దోహదపడుతాయి. దళారీ వ్యవస్థ లేకుండా చేసేందుకు మత్స్యకారులకు రాయతీ అందించడంతోపాటు నిరంతరం శిక్షణ, అవగాహన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం. -
ముగిసిన మత్స్య పారిశ్రామిక సంఘం ఎన్నికలు
పోచమ్మమైదాన్ : జిల్లాలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఎన్నికలు శుక్రవారం తో ఎన్నికలు ముగిశాయి. భూపాలపల్లి మం డ లం ఉడతలకొత్తపల్లి సంఘం అధ్యక్షుడిగా మం డల రవీందర్, ఉపాధ్యక్షుడిగా సమ్మయ్య, కార్యదర్శిగా మర్రి రాజ య్య, మద్దూరు మండలం వల్లంపట్లకు నారదాసు శ్రీధర్, చిట్టి లింగం, లింగయ్యలు ఎన్నికయ్యారు. అలాగే ధర్మసాగర్ మండలం వేలేరు అధ్యక్షుడిగా రాజు, ఉపా«ధ్య క్షుడిగా పిట్టల రాజు, ప్రధానకార్యదర్శిగా శంకరయ్య, భూపాలపల్లి మండలం గొర్లవీడుకు మొగిలయ్య, సాగర్, రావుల శంకరయ్య, కేసముద్రం మండలం పెనుగొండకు చిన్న లక్ష్మయ్య, వెంకన్న, నరేష్, లింగాలఘన్పూర్ మండలం నాగారం అధ్యక్షునిగా రాజేందర్, వెంకటయ్య, రవి, సంగెం మండ లం గవిచర్లకు రావుల బిక్షపతి, రఘుపతి, రాజులు ఎన్ని కయ్యారు. మొగుళ్ళపల్లి మండలం పోతుగల్కు రమేష్, చిలువరు రమేష్, నా రాయణ, డోర్నకల్ మండలం మన్నెగుడెంకు బాబు, రోశయ్య, ఉపేంద్ర, వెంకటాపూ ర్ మండలం పెద్దపూర్కు శ్రీనివాస్, సారయ్య, వీరయ్యలు ఎన్ని క య్యారు. అలాగే నర్సింహులపేట మండలం పెద్ద ముప్పారం కొండ వెంకన్న, రాంచందర్, ఎల్లయ్య, పర్వతగిరికి నీరటి శ్యాం, చంద్రయ్య, వెంకటేశ్వర్లు, నెక్కొండ మం డలం తపనపల్లికి సురేష్, భిక్షపతి, శ్రీని వాస్, భూపాలపల్లి మం డలం వెలిశాలపల్లికి పర్శబోయిన సాంబయ్య, లక్ష్మయ్య, స్వామిలు ఎన్ని కయ్యారు. తొర్రూర్ మండలం అమ్మపురం రా జు, రవి, యాకయ్య, «ధర్మాసాగర్ మండలం ధర్మసాగర్కు సదానం దం, శ్రీనివాస్, సుధాకర్, పరకాల మండలం నడికూడకు రాజు, బాబు, రమేష్లు ఎన్ని కయ్యారు. మరిపెడ మండలం ఉగ్గంపల్లికి యాక య్య, ఉప్పలయ్య, సుధాకర్, కిల్లించర్లకు ధనుం జయ, సత్యం, ఉపేందర్, చెన్నారావుపేట ము గ్దంపురం ప్రభాకర్, రవి, సాంబయ్య, నెల్లికుదు రు మండలం మేచరాజుపల్లికి విజయ్ కుమార్, వెంకన్న, గొడుకు వెంకన్నలు ఎన్నికయ్యారు. కురవి మండలం నారాయణపురం పిట్టల రామక్రిష్ణ, వీ రయ్య, సత్యం, చిట్యాల మండలం ఓడితలకు రాజయ్య, కృష్ణ, రాజేందర్లు ఎన్ని కయ్యారు. అలాగే నల్లబెల్లి మండలం శనిగరం నీలం రవి, రాజు, నర్సింహులు, ఆత్మకూరు మండలం కొగిల్వాయి వీరయ్య, అనిల్, లక్ష్మ య్యలు ఎన్ని కయ్యారు. బచ్చన్నపేట మండలం కో న్నం శ్రీనివాస్, బైరయ్య, బాలయ్య, వెంకటాపూర్ మండలం అడవి రంగాపూర్ మల్ల య్య, సమ్మయ్య, దేవేందర్, పర్వతగిరి మం డలం సోమారం అధ్యక్షునిగా చిట్ల శ్యాం, ఉపాధ్యక్షుడిగా పాడయ్య, కార్యదర్శిగా శ్రీనివాస్లు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా ఎఫ్డీఓలు వేణుగోపాల్, నరేష్ కుమార్ నాయుడు, సీనియర్ అసిస్టెంట్ రియాజ్ అహ్మద్, కిరణ్ కుమార్, వీరన్నలు వ్యవహరించారు. -
పెద్ద చెరువు మత్స్య సంఘం అధ్యక్షడిగా ‘వేముల’
కోదాడ: పెద్దచెరువు మత్య్ససహకార సంఘం నూతన కార్యవర్గం గురువారం బాధ్యతలు స్వీకరించింది. మున్సిపల్ కార్యాలయంలో సమావేశమైన డైరెక్టర్లు నూతన అధ్యక్షుడిగా వేముల రాముడుని, కార్యదర్శిగా గాదె మధుని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా ఐతేబోయిన ధనమూర్తి, కోశాధికారిగా సింగం శ్రీనులను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారి సూర్యదత్ నూతన పాలకవర్గం చేత ప్రమాణస్వీకారం చేయించారు. రాష్ట్ర ముదిరాజ్ మహసభ అధ్యక్షుడు బండా ప్రకాశ్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఫెడరేషన్ చైర్మన్ పోలు లక్ష్మణ్, రాష్ట్ర ముదిరాజ్ యూత్ అధ్యక్షుడు గుళ్లపల్లి శ్రీను, కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, వల్లూరి రామిరెడ్డి, పార సీతయ్య, కుక్కడపు బాబు తదితరులు పాల్గొన్నారు. -
మత్స్యకార్మికుల సమస్యలు పరిష్కరించాలి
మత్స్యకార్మిక సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి శంకర్ ఇబ్రహీంపట్నం : మత్స్య కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మత్స్యకారుల, మత్స్యకార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్.శంకర్ అన్నారు. జిల్లా తూర్పు డివిజన్ మత్స్యకారుల సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులతో సమావేశాన్ని మంగళవారం ఇబ్రహీంపట్నంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కరువు పరిస్థితుల్లో మత్స్యకార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం స్పందించాలన్నారు. రూ.2వేల నగదు, 60 కిలోల బియ్యాన్ని ప్రభుత్వం ఇచ్చి ఆదుకోవాలని...50 సంవత్సరాలు నిండిన మత్స్యకార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. మత్స్య సొసైటీలకు సరిపడే నాణ్యమైన 3 అంగుళాల చేపపిల్లలు, రొయ్యలను ఉచితంగా పంపిణీ చేయాలని కోరారు. చెరువులు, కుంటలు కబ్జాలకు గురికాకుండా వాటి చుట్టూ ఫెన్సింగ్ వేయాలని, కాలుష్యానికి గురికాకుంగా కాపాడాలన్నారు. మిషన్ కాకతీయ పనుల్లో మత్స్యకారులను భాగస్వామ్యం చేయాలని కోరారు. చెరువులు, కుంటల లీజు రద్దు అయిందని, దీనిని మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు లక్ష్మయ్య, వెంకటేష్, శ్రీనివాస్, కె.రవీందర్, సతీష్, అశోక్, దయాకర్, నాగరాజు, నాగేష్లు, బాలగణేష్లు పాల్గొన్నారు. -
చెరువులకు చేపపిల్లల విత్తనాలు అందిస్తాం
బీర్కూర్ : జిల్లాలో మత్స్యశాఖ పరిధిలోని 531 చెరువులకు ప్రభుత్వం 100 శాతం సబ్సిడీపై చేపపిల్లల విత్తనాలు సరఫరా చేస్తోందని మత్స్య పరిశ్రమశాఖ సహకార సంస్థ జిల్లా చైర్మన్ సాయిబాబా తెలిపారు. సోమవారం ఆయన బీర్కూర్లో విలేకరులతో మాట్లాడారు. దళారీ వ్యవస్థను రూపుమాపడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. మత్స్యకార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. విత్తనాలకోసం సుమారు రూ. 48 కోట్లు విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు పోచారం శ్రీనివాస్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్లకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో మరో 2,265 చెరువులు పంచాయితీల పరిధిలో ఉన్నాయని, వాటిని కూడా మత్స్యశాఖకే కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు నర్ససాయిలు, గంగారాం, బాబబోయి తదితరులు పాల్గొన్నారు. -
పూట గడవదు
సముద్రంలో చేపల వేటకు అడుగడుగునా అడ్డంకులే పూడిక దశకు చేరుకున్న సముద్రపు మొగ వేటపై ఈదురుగాలుల ప్రభావం హార్బర్ వద్దనిలిచిపోయిన బోట్లు ఆందోళనలో మత్స్యకార కుటుంబాలు ఇంకా అందని నిషేధకాలపు జీవనభృతి మచిలీపట్నం సబర్బన్ : సముద్రంలో చేపలు, రొయ్యల వేటకు ఈ ఏడాది అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. వేట నిషేధకాలం పూర్తయినా సముద్రంలోకి బోట్లను తీసుకెళ్లి వేట కొనసాగించే వీలు లేకపోవటంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. సముద్రపు మొగ పూడిక దశకు చేరుకోవటం, ప్రకృతి వైపరీత్యాలు ఇందుకు ప్రధాన కారణంగా వారు చెబుతున్నారు. దాదాపు మూడు నెలలుగా వేట లేకపోవటంతో అందినకాడికి అధిక వడ్డీలకు అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడి బోట్లు అక్కడే... జిల్లాలో సుమారు 80 కిలోమీటర్లు విస్తరించిన సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులు 99 మెకనైజ్డ్, 850 మోటరైజ్డ్ బోట్లలో వేట కొనసాగిస్తూ జీవనం సాగిస్తుంటారు. ఒక్కో మెకనైజ్డ్ బోటుకు 8 నుంచి 10 మంది, మోటరైజ్డ్ బోటుకు 3 నుంచి 5 మంది కళాసీలు పనిచేస్తుంటారు. నాగాయలంక, కోడూరు, మచిలీపట్నం, కృత్తివెన్ను మండలాల్లోని మత్స్యకారులు దాదాపు 4,500 మంది అత్యధికంగా సముద్రంలో చేపల వేటపైనే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి తరతరాలుగా బతుకు బండిని లాగిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో మత్స్య సంపద వేటపై నిషేధం కొనసాగింది. జూన్ 15 నుంచి వేటకు ప్రభుత్వ అనుమతి వచ్చినా ప్రకృతి, ప్రభుత్వ సహకారం లేకపోవటంతో ఎక్కడి బోట్లు అక్కడే నిలిచిపోయి కనిపిస్తున్నాయి. కారణాలు ఇవీ... →సముద్రంలో 5 నుంచి 10 రోజుల వేటను కొనసాగించే మెకనైజ్డ్ బోట్లు స్థానిక గిలకలదిండి హార్బర్ నుంచి బకింగ్హామ్ కెనాల్ ద్వారా సముద్రంలోకి చేరుకుంటాయి. →కెనాల్ సముద్రంలో కలిసే ప్రాంతం (మొగ) పూర్తిగా పూడిక దశకు చేరింది. →గత కొన్నేళ్లుగా పూడికతీత పనులు చేపట్టకపోవటంతో సముద్రపు ఆటుపోటుల ప్రభావానికి మట్టి తీవ్రస్థాయిలో మేట వేసింది. →బోటు సజావుగా సముద్రంలోకి చేరుకోవటానికి కనీసంగా ఆరడుగుల లోతు ఉండాలి. ప్రస్తుతం మొగ వద్ద సముద్రపు పోటు నీరు వచ్చే సమయంలో నాలుగడుగులు, పాటు సమయంలో రెండడుగులు మాత్రమే ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు. →దీని కారణంగా బోటు నీటిలో నడిచేందుకు సహాయంగా ఉండే పంకాలు, చక్రాలు నేలకు తగిలి విరిగిపోతున్నాయని బోటు యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. →నెల రోజుల వ్యవధిలో రెండు పర్యాయాలు చోటు చేసుకున్న వాతావరణ మార్పుల కారణంగా మోటరైజ్డ్ బోట్లు వేటకు దూరంగా ఉంటున్నాయి. →మచిలీపట్నం, కోడూరు, నాగాయలంక, కృత్తివెన్ను మండలాల్లో ఈ బోట్లు అత్యధికంగా ఉంటాయి. మూడు రోజుల పాటు సముద్రంలో వేటను కొనసాగించే ఈ చిన్న బోట్లు రాత్రి సమయంలో బలంగా వీస్తున్న ఈదురు గాలులకు నిలబడలేకపోతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. దీంతో వేటకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటున్నామని చెబుతున్నారు. -
వెనామీ.. జాగ్రత్త సుమీ..
యూజమాన్య పద్ధతులతో వెనామీ సాగు లాభదాయం వ్యాధులపై అప్రమత్తత అవసరం కైకలూరు : రొయ్యల సాగు ఒడిదుడుకుల్లో పడింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ కలిగిన వెనామీ రొయ్యల సాగు జిల్లాలో ఇటీవల పెరిగింది. జిల్లాలో ప్రస్తుతం 22 వేల ఎకరాల్లో సాగవుతోంది. సరైన శాస్త్రీయ పద్ధతులు పాటించకపోవడంతోనే నష్టాల బారిన పడుతున్నారు. రొయ్యల సాగు లాభాలొస్తే కుబేరుడిని, నష్టాలొస్తే బిచ్చగాడిని చేస్తుందని నానుడి. అందుకే రైతులు యూజమాన్య పద్ధతులు పాటించి పంటను కాపాడుకోవాలని కైకలూరు మత్స్యశాఖ అభివృద్ధి అధికారి బీ రాజ్కుమార్ సూచిస్తున్నారు. చెరువును ఎండ బెట్టడం ఉత్తమం... రొయ్యల చెరువులో మట్టి తన సహజ లక్షణాలను కోల్పోతుంది. ఎండిన తర్వాత మూడు సార్లు దుక్కి దున్ని, దుక్కికి దుక్కికి మధ్య ఏడు రోజులు విరామం ఇవ్వాలి. నేలను రోలర్తో చదును చేయాలి. చెరువును బాగా ఎండబెట్టడంతో అడుగున చేపలు, నత్తలు వంటి జీవులు నశిస్తాయి. ఒకవేళ చెరువు పూర్తిగా ఎండని పక్షంలో టీ సీడ్ కేకు, కాపర్ సల్ఫేట్ను ఉపయోగించాలి. పూర్తిగా ఆరిన చెరువులో సూర్యరశ్మి వల్ల అడుగున ఉండే వ్యర్థాలు ఆక్సీకరణం చెంది, తొలగించడానికి సులువుగా ఉంటుంది. రొయ్యలు అడుగు భాగాన సంచరించే జీవులు కాబట్టి నేల స్వభావం రొయ్య ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. జీవభద్రత వ్యవస్థను పటిష్టం చేయాలి... వెనామీ రొయ్యల చెరువులో జీవ వాతావరణ వ్యవస్థ ఎంతో కీలకం. నేల, నీరు, సీడ్, గాలి, జంతువులు, మనుషులు ఇలా ఆరు మాధ్యమాల ద్వారా సూక్ష్మజీవులు చెరువులోకి ప్రవేశిస్తారుు. పీతలు, తాబేళ్లు, కప్పలు, పాములు, కుక్కలు, నక్కలు వంటివి రొయ్యల చెరువు వద్దకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పీతలు, నత్తల బొరియల్లో గ్యాస్ బిల్లలు వేసి పూడ్చివేయాలి. చెరువులోకి నీటిని నింపేటప్పుడు 40 లేదా 60 నంబరు మెష్ హపాను కట్టాలి. నీటిని నింపిన తర్వాత 30 లేదా 40 పీపీఎంతో క్లోరినేషన్ చేసుకోవాలి. నత్తలు, పీతలు పైకి ఎక్కకుండా 30-50 సెంటీ మీటర్ల ఎత్తులో క్రాబ్ ఫెన్సింగ్ను ఏర్పాటు చేయాలి. ఆకాశంలో ఎగిరే పక్షులు వ్యర్థ పదార్థాలను పడవేసినా లోపలికి వెళ్లకుండా ఎరుపు వలలతో బర్డ్ ఫెన్సింగ్ నిర్మించుకోవాలి. రొయ్య పిల్లలను వదిలే ముందు మూడు సార్లు పీసీఆర్ టెస్టులు చేయించాలి. రొయ్యల చెరువుకు ఉపయోగించే వల, బకెట్, టబ్స్, పని చేసే సిబ్బంది చేతులు 100 పీపీఎం, అయోడిన్ ద్రావకంతో శుభ్రపర్చుకోవాలి. ఏరియేటర్లు కీలకం... రొయ్యలకు నిత్యం ఆక్సిజన్ అందుబాటులో ఉండాలి. దీనికి ఏరియేటర్లను ఉపయోగిస్తారు. వీటిని ఏర్పాటు చేసేటప్పుడు నీటి ప్రవాహ దిశను బట్టి దాని పైపు భూమిలో బలంగా నాటాలి. నీటి ప్రవాహం వృత్తాకారంలో ఉండేలా తగిన మార్పులు చేసి బిగించాలి. ఏరియేటర్లతో చిన్న దశలో రొయ్య పిల్లలకు ఆరోగ్యకర వాతావరణం ఏర్పడి చెరువు అడుగుభాగాన పరిశుభ్రంగా ఉంచడానికి ఉపయోగపడుతోంది. బయోమాస్ ఆధారంగా హెచ్పీ మోటర్లు వినియోగించాలి. -
ఫినిష్..!
ఏడేళ్లుగా నిరుపయోగంగా ఉన్న ఫిష్ ల్యాండింగ్ సెంటర్ బోట్లు నిలిపేందుకు జెట్టీ లేక మత్స్యకారుల అవస్థలు అక్కరకు రాని అభివృద్ధి ఫలాలు రూ.80 లక్షల ప్రజాధనం వృథా అధికారులకు ముందుచూపు లేని ఫలితం మత్స్యశాఖ అధికారుల నిర్లక్ష్యం లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని వృథా అయ్యేలా చేసింది. ముందుచూపు లేకుండా తీసుకున్న నిర్ణయాల ఫలితం ఏడేళ్ల కిందట నిర్మించిన భవనాన్ని నిరుపయోగంగా మార్చింది. మత్స్యకారుల సౌకర్యం కోసమంటూ ఫిష్ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటు చేసిన అధికారులు, ఇప్పుడు అక్కడ బోట్లు నిలిపేందుకు అనువుగా లేదని, మరో చోట నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చావుకబురు చల్లగా చెబుతున్నారు. రేపల్లె: సముద్ర తీర ప్రాంతమైన నిజాంపట్నం మండలం కొత్తపాలెం పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల నుంచి మత్స్యకారులు మరబోట్లలో చేపల వేటకు వెళ్తుంటారు. ఈ ప్రాంతం నుంచి సుమారు 300 బోట్లు నిత్యం సముద్రంలోకి వెళ్తుంటాయి. వీరంతా వేటాడి ఒడ్డుకు చేర్చిన మత్స్య సంపదను అమ్ముకునే వరకు నిల్వ ఉంచడానికి.. ఉప్పు నిల్వలు, వలల మరమ్మతులు వంటి కార్యకాలాపాలు నిర్వహించుకునేందుకు ఇబ్బందిగా మారింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు తీరంలో ఫిష్ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని మత్స్యశాఖ అధికారులు నిర్ణయించారు. దీనికి సమీపంలో ఉన్న రేవులో బోట్లు నిలిపేందుకు వీలుగా జెట్టీ నిర్మించాలని భావించారు. అనుకున్నదే తడవుగా నిజాంపట్నం మండలం కొత్తపాలెం పంచాయతీ పరిధిలోని గొంది సముద్రంలో రూ.80 లక్షల వ్యయంతో భవనాన్ని నిర్మించారు. చుట్టూ ప్రహరీ, ఇనుప గేట్లు పకడ్బందీగా ఏర్పాటు చేశారు. రాకపోకలకు అనువుగా సీసీ రోడ్డు నిర్మించారు. ఈ తతంగమంతా జరిగి దాదాపు ఏడు సంవత్సరాలు కావస్తోంది. నేటికీ ఆ భవనం ప్రారంభానికి నోచుకోలేదు. బోట్లు నిలిపేందుకు జెట్టీ నిర్మించలేదు. ఏళ్ల తరబడి వినియోగంలో లేకపోవడంతో రాళ్లు లేచి రోడ్డు అధ్వానంగా తయారైంది. గేట్లు తుప్పు పట్టి విరిగిపోయాయి. కాంపౌండ్ లోపల పిచ్చిమొక్కలు మొలిచి అధ్వాన స్థితికి చేరింది. మత్స్యకారుల కోసం రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన భవనం అక్కరకు రాకుండాపోయింది. జెట్టీ ఏర్పాటుకు వినతి.. కొత్తపాలెం పంచాయితీ పరిధిలోని బోట్లు ఆగేందుకు అక్కడ అనువుగా జెట్టీ లేకపోవడంతో మత్స్యకారులు ఇతర ప్రాంతాల్లో నిలుపుకుని తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. లక్షలు ఖర్చుపెట్టి నిర్మించిన ఫిష్లాండింగ్ భవనానికి మరమ్మతులు చేసి పునరుద్ధరించాలని, దానికి అనువుగా రేవులో జెట్టీ ఏర్పాటు చేయాలని మత్స్యకారులు విన్నవిస్తున్నారు. మరోచోట భవనం ఏర్పాటు చేస్తాం.. గొంది సముద్రంలో బోట్లు ఎక్కువగా నిలుపుకునేందుకు అనువుగా లేకపోవటం వల్ల అక్కడ జె ట్టీ నిర్మాణం చేపట్టలేదు. నక్షత్రనగర్లోని రేవు వద్ద బోట్లు ఎక్కువగా నిలుపుకునేందుకు అనువుగా ఉంది. దీంతో అక్కడే జెట్టీ ఏర్పాటు చేసి దానికి అనువుగా ఫిష్ల్యాండింగ్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. - ఎ.రాఘవరెడ్డి, మత్యశాఖ అభివృద్ధి అధికారి, నిజాంపట్నం. -
కొల్లేరు పరిధిలో మరోసారి ఉద్రిక్తత
ఏలూరు: కొల్లేరు అభయారణ్యం పరిధిలో.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రూరల్ మండలం పైడిచింతపాడు గ్రామ పరిసరాల్లో చెరువు గట్లు ఏర్పాటు చేసుకుని స్థానికులు చేపల పెంపకానికి ఉద్యుక్తులు కావడంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం వారి చర్యలను అటవీ అధికారులు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్థులు అధికారుల వాహనాన్ని చుట్టుముట్టి ఘోరావ్ చేశారు. కొల్లేరు అభయారణ్యం పరిధిలో పర్యావరణ పరిరక్షణ కోసం గతంలో చెరువు గట్లను తొలగించిన విషయం తెలిసిందే. -
రాత్రికి రాత్రే కాలనీ అంతా బుగ్గి
మచిలీపట్నం (కృష్ణా జిల్లా): అగ్ని ప్రమాదంలో ఓ కాలనీ మొత్తం బూడిదై పోయింది. పదిమందికి పైగా గాయాలపాలయ్యారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం మంగినపూడి బీచ్ వద్ద వైఎస్ ఆర్ కాలనీలో గురువారం రాత్రి ఈ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మంగినపూడి బీచ్ వద్ద వైఎస్సార్ ఫిషర్ కాలనీలో సుమారు 250 వరుకు గుడిసెలు ఉన్నాయి. సముద్రంలో చేపల వేట ద్వారా జీవనం సాగించే మత్స్యకారులు ఇక్కడ గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. వీరంతా తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ నుంచి వలస వచ్చిన కార్మికులు. అయితే, చేపల వేటపై నిషేధంతో వీరిలో చాలా మంది ఇళ్లకు తాళాలు వేసి ఉప్పాడు వెళ్లారు. కొద్ది మంది మాత్రమే ఇళ్లలో ఉన్నారు. గురువారం రాత్రి ఈ కాలనీలో ఒక్కసారిగా మంటలు లేవగా... అన్నీ గుడిసెలే కావడంతో స్వల్ప వ్యవధిలోనే మొత్తం తగలబడిపోయాయి. అవనిగడ్డ, పామర్రు, బంటుమిల్లి, గుడివాడ తదితర ప్రాంతాల నుంచి ఐదు అగ్ని మాపక శకటాలు వచ్చి మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ప్రమాద సమయంలో గుడిసెల్లో ఉన్న కొందరు కొన్ని వస్తువులను తీసుకుని క్షేమంగా బయటకు రాగా, కొందరు మాత్రం పోయిన బంగారు వస్తువుల కోసం గాలించిన పరిస్థితి కనిపించింది. ఆస్తి నష్టంపై అధికారులు ఇంకా అంచనాకు రాలేదు. ప్రమాద స్థలిని ఆర్డీవో సాయిబాబు, తహశీల్దారు నారదముని, డీఎస్పీ శ్రవణ్కుమార్ పరిశీలించారు. -
అన్నంగిలో విషాదం
పరవళ్లు తొక్కుతున్న గుండ్లకమ్మ.. మనువడిని అమాంతం మింగింది సుడులు తిరుగుతున్న నీటి ప్రవాహం.. తాతను క్షణాల్లో మాయం చేసింది ఎప్పుడూ కలిసి ఉండే తాతామనవళ్లు.. ఇప్పుడు వేరై మళ్లీ ఒక్కటయ్యారా? మద్దిపాడు : చేపల వేటకు వెళ్లి తాతామనువడు గల్లంతయ్యారు. కొద్దిసేపటికి మనువడు మృతి చెందగా తాత ఆచూకీ తెలియ రాలేదు. ఈ సంఘటన మండలంలోని ఆన్నంగి వద్ద గుండ్లకమ్మ రిజర్వాయర్లో సోమవారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. అన్నంగికి చెందిన కుంచాల పెద్ద గోవిందు(65) చేపల వేట కొనసాగిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనకు తన కుమారుడు కొడుకు (మనుమవడు)తో మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో యథావిధిగా పెద్ద గోవిందు చేపల వేటకు బయల్దేరుతుండగా తానూ వస్తానంటూ మనువడు లక్ష్మయ్య పట్టుబట్టాడు. సముదాయించినా మనువడు పట్టువీడలేదు. చేసేదిలేక తనతో పాటు లక్ష్మయ్యను పెద్ద గోవిందు వేటకు తీసుకెళ్లాడు. అప్పటికే గ్రామంలోని ఇతర మత్స్యకారులు వేట ముగించుకుని తిరిగి ఇంటి ముఖం పట్టారు. గోవిందు తన మనువడితో కలిసి వడివడిగా వేటకు బయల్దేరాడు. వేట అనంరతరం తిరగు ప్రయాణంలో ఉండగా తాతామనువడు ప్రయాణిస్తున్న తెప్ప (థర్మాకోల్ షీట్లతో చేసింది) తిరగబడటంతో తాత ఒకచోట మనువడు మరో చోట నీటిలో పడిపోయారు. ఎంతకీ వారు ఇంటి కి రాకపోవడంతో లక్ష్మయ్య తల్లి ఆదిలక్ష్మి విషయాన్ని తన భర్త అంకమ్మరావుతో చెప్పింది. అంకమ్మరావు చుట్టుపక్కల వారితో కలిసి రిజర్వాయర్ వద్దకు వె ళ్లగా తెప్ప కనిపించింది. స్థానిక మత్స్యకారులు నీటిలోకి దిగి వెతకగా లక్ష్మయ్య (11)వలలో అపస్మారక స్థితిలో కనిపిం చాడు. వెంటనే బాలుడిని ఒడ్డుకు చేర్చి దగ్గరలోని మేదరమెట్ల ఆస్పత్రికి తరలించగా అప్పటికే లక్ష్మయ్య మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని స్వగ్రామం అన్నంగి తరలించారు. పెద్ద గోవిం దు ఆచూకీ కోసం సహచర మత్స్యకారులు గాలిస్తూనే ఉన్నారు. తహశీల్దార్ కేఎల్ నరసింహారావు, ఎస్సై మహేష్లు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. నా భర్త ఆచూకీ చెప్పండయ్యా.. గ్రామంలో వడియరాజులపాలెం శోకసంద్రంలో మునిగిపోయింది. రోజూ కలిసి తిరిగే తాతా మనువళ్లను గుర్తుకు తెచ్చుకుని బంధువులు కన్నీరు పెట్టుకుంటున్నారు. కుమారుడు మృతి చెందడం.. తండ్రి ఆచూకీ తెలియకపోవడంతో అంకమ్మరావు దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్నారు. లక్ష్మయ్య 5వ తరగతి చదువుతున్నాడు. పెద్ద గోవిందు భార్య ఏసు తీరని దుఖంతో కనిపించిన ప్రతివారిని పట్టుకుని మా ఆయన ఏడయ్యా.. అంటూ విలపిస్తోంది. కుమారుడిని పోగొట్టుకుని అంకమ్మరావు భార్య ఆదిలక్ష్మి విలపిస్తున్న తీరు స్థానికులను కలచి వేసింది. -
కిన్నెరసాని రిజర్వాయర్లో జోరుగా చేపలవేట
పాల్వంచ రూరల్: కిన్నెరసాని రిజర్వాయర్లో చేపలవేట జోరుగా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా కొందరు తెప్పలు కట్టుకుని వెళ్లి వలలు వేసి చేపలు పట్టుకుంటున్నారు. కొందరు వాటిని మార్కెట్లోకి తెచ్చి అమ్ముకుంటుండగా మరికొందరు ఒడ్డునే ఈ వ్యాపారం చేస్తున్నారు. మొసళ్లు సంతచరించే ఈ రిజర్వాయర్లోకి వెళ్లడం ప్రమాదకరమని తెలిసినా యథేచ్ఛగా చేపల వేట కొనసాగుతున్నారు. రిజర్వాయర్లోకి వెళ్లడం నిషేధమైనప్పటిప్పటికీ అలాంటి నిబంధనలేవీ తమకు వర్తించవన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా కేటీపీఎస్ అధికారులు, అటవీశాఖ అనుబంధ వైల్డ్లైఫ్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కళ్లెదుటే చేపల వేట జరుగుతుండడం, ఒడ్డున డ్యామ్ పక్కనే విక్రయాలు సాగుతుండడం లాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నా చూసీచూడనట్లు వదిలేస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. రిజర్వాయర్ వద్ద పహారా కాసే కేటీపీఎస్, వైల్డ్లైఫ్ సిబ్బంది తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. -
వేట
సాక్షి ప్రతినిధి, కడప: అక్రమార్జనకు కాదేదీ అనర్హం అన్నట్లుగా మత్స్యశాఖలో అవినీతి తాండవిస్తోంది. అడ్డదారుల్లో లెసైన్సులు విచ్ఛలవిడిగా మంజూరు చేస్తున్నారు. సోమశిల బ్యాక్ వాటర్లో మునిగిపోయిన రంగాయపల్లె గ్రామస్తుల పేరిట వందలాది మందికి చేపలవేటకు అవకాశం కల్పించారు. అవకాశం దక్కిందే తడువుగా నిషేధిత వలలతో చేపల మాఫియా చెలరేగిపోతోంది. జనసంచారమే నిషిద్ధమైన అభయారణ్యంలో భారీ వాహనాలు యధేచ్ఛగా తిరుగుతున్నాయి. అటు మత్స్యశాఖ, ఇటు అటవీ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి.సోమశిల బ్యాక్వాటర్లో చేపల వేటకు అక్రమంగా అనుమతిని ఇస్తున్నారు. ఈతరహా వ్యవహరంలో కొంతమంది సిబ్బంది నేర్పరితనాన్ని ప్రదర్శిస్తున్నారు. అక్కడ చేపల వేట ద్వారా జీవనం గడిపేవాళ్లు లేకపోయినా ఇతర జిల్లాలకు చెందిన చేపల వేట దారులను పోత్సహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వలల ను వాడుతూ చేపలను కొల్లగొడుతున్నారు. ఉభయగోదావరి జిల్లాలకు చెందిన వారు అభయారణ్యంలో తిష్టవేసి అక్రమ కార్యకలాపాలు నిర్విహస్తున్నారు. ఇందుకు ప్రత్యక్షంగా మత్స్యశాఖ ప్రోత్సాహం ఉంటే, పరోక్షంగా అట వీశాఖ సహకరిస్తోంది. వెరసి సోమశిల వెనుక జలాల్లో చేపల మాఫియా రాజ్యమేలుతోంది. మునక గ్రామం పేరుతో లెసైన్సులు... లెసైన్సుదారులు మాత్రమే చేపల వేటను నిర్వహించాలి. సోమశిల వెనుక జలాలు నిల్వ ఉన్న ప్రాంతాలలో చేపల వేటదారులు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అత్యధికంగా లభ్యమయ్యే ఇక్కడి చేపల కోసం ఇతర జిల్లాల వారు కన్నేశారు. ఆమేరకు మత్స్యశాఖ సిబ్బందిని మచ్చిక చేసుకున్నారు. వారి మధ్య ఒప్పందం కుదరడంతో విచ్చలవిడిగా లెసైన్సులు మంజూరు అయ్యాయి. నందలూరు మండలం రంగాయపల్లె గ్రామం సోమశిల మునకలో ఉంది. అక్కడ జనవాసాలు లేవు. ఆ గ్రామం పేరిట దాదాపు 250 మందికి లెసైన్సులు జారీ చేశారు. వీరిపేరుతో కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వారితోపాటు ఉయభగోదావరి జిల్లాలకు చెందిన చేపల వేటదారులు అడవిలో తిష్టవేసి అక్రమంగా చేపలను వేటాడుతున్నారు. లెసైన్సులు జారీ చేసేందుకు ఆధార్ అనుసంధానం చేయాలని నిబంధనలు ఉన్నా, అవేవీ మత్స్యశాఖ పాటించడం లేదు. దీంతో అక్రమవేటగాళ్లు లారీలతో ఇతర ప్రాంతాలకు చేపలను ఎగుమతి చేస్తున్నారు. అభయారణ్యంలో వాహనాల సంచారం.... సోమశిల బ్యాక్ వాటర్ ప్రాంతం పెనుశిల నరసింహాస్వామి అభయారణ్యం ప్రాంతంలో ఉంది. జీఓ ఎంఎస్ నెంబర్ 106/1997లో ఆమేరకు గెజిట్ విడుదల అయింది. అభయారణ్యంలో జనసంచారం నిషిద్ధం. అలాంటి ప్రదేశంలో ఏకంగా లారీలు నడుస్తున్నాయి. 2014 సెప్టెంబర్ 1 నుంచి 2015 జూన్ 30వరకూ వాహనాలకు లెసైన్సులు సైతం జారీ చేశారు. చేపల వేటగాళ్లు ఎగుమతి నిమిత్తం తీసుకెళ్లే చేపలకు ఆటంకాలు లేకుండా ఉండేందుకు వాహనాలకు లెసైన్సులు జారీ చేశారు. అందులో వెళ్లే సరుకును అటవీ యంత్రాంగం తనిఖీ చేయకుండా ఉండేందుకే ఈ తతంగమని సమాచారం. చేపలమాటున ఇంకేం తరలి వెళ్లినా ఎలాంటి ఇబ్బంది ఉండదని పలువురు చెప్పుకొస్తున్నారు. అభయారణ్యంలోకి స్థానికు లు మేకలు మేపుకునేందుకు వెళ్లినా కేసులు బనాయించే అటవీ యంత్రాంగానికి యధేచ్ఛగా పదుల సంఖ్యలో వాహనాలు సంచరిస్తున్నా నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. అందుకు ఆయా విభాగాల యంత్రాంగాని కి భారీగా లబ్ధి చేకూరుతున్నట్లు తెలుస్తోంది. -
కొల్లేరుకు కొత్త అందాలు!
రాష్ట్ర విభజనతో కొల్లేరుకు పెరిగిన ప్రాధాన్యం పర్యాటక రంగ అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం ఆటపాక పక్షుల కేంద్రానికి ఆధునిక హంగులు కైకలూరు : ప్రకృతి రమణీయతకు మారుపేరైన కొల్లేరు తీరం సరికొత్త అందాలను సంతరించుకోనుంది. విదేశీ పక్షుల సందడితో పర్యాటకులకు కనువిందు చేసే ఆటపాకలో ఆధునిక వసతులు కొలువుదీరనున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొల్లేరు ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మరోవైపు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల మీదుగా పర్యాటక రూట్ మ్యాప్కు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. కొల్లేరు మత్స్య సంపద ద్వారా కూడా ఆదాయం సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇందుకోసమైనా కొల్లేరు ప్రాంతంలో వసతులు మెరుగుపరిచే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. ప్రస్తుత రాష్ట్ర బడ్జెట్లో అటవీ, పర్యావరణ అభివృద్ధికి ప్రభుత్వం రూ.418 కోట్లు కేటాయించింది. ఈ నిధుల్లో కొంత అయినా ఖర్చు చేసి కొల్లేరు ఆభయారణ్యంలో వసతులు కల్పించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కొల్లేరు తీరం ఇలా... కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో 77,125 ఎకరాల్లో కొల్లేరు అభయారణ్యం విస్తరించి ఉన్నట్లు నిర్ధారించారు. కైకలూరు, మండవల్లి మండలాల్లో 14 గ్రామాలు కొల్లేరు పరిధిలో ఉన్నాయి. అరుదైన పక్షులను తిలకించేందుకు పశ్చిమగోదావరి జిల్లాలో గుడివాకలంక, మొండికోడు, కృష్ణా జిల్లాలో ఆటపాక, మణుగునూరులంక గ్రామాల్లో ప్రదేశాలు ఉన్నాయి. విదేశీ పక్షులను దగ్గర నుంచి చూసే అవకాశం మాత్రం కైకలూరు మండలం ఆటపాక పక్షుల విహార కేంద్రంలోనే ఉంది. ఈ కేంద్రం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రతిపాదనలకే పరిమితం.. కొల్లేరు ప్రాంతంలో పర్యాటక రంగ అభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చర్యలు చేపట్టారు. ఆయన కృషి మేరకు కొల్లేరు అభివృద్ధి, యాత్రికులకు సదుపాయాల కోసం రూ.950 కోట్లు అవసరమని 2009లో విస్సా అనే ప్రయివేటు సంస్థ నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికను అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్కు అందజేసింది. ఈ నిధులతో రహదారులు, రిసార్ట్లు, పక్షుల సంరక్షణ కేంద్రాల నిర్మాణం వంటివి ఏర్పాటు చేయాలని సూచించారు. వైఎస్ మరణానంతరం ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. మళ్లీ 2013లో కోస్తా ప్రాంత పర్యాటక అభివృద్ధికి రూ.500 కోట్లతో ప్రణాళిక రూపొందిస్తున్నట్లు అప్పటి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ప్రకటించారు. కొండపల్లి హెరిటేజ్ పేరుతో విజయవాడలోని భవానీ ద్వీపం, గాంధీహిల్, కూచిపూడి, మొవ్వ, హంసలదీవి, పెడన కలంకారీ, కొల్లేరులో పర్యాటక అభివృధికి రూ.50 కోట్లును కేటాయిస్తున్నట్లు చిరంజీవి చెప్పారు. కొల్లేరుకు వచ్చే పర్యాటకులు విశ్రాంతి తీసుకోడానికి ఆలపాడు ఉప్పుటేరు వద్ద కాటేజీలు నిర్మించాలని భావించారు. కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెం రేవు వద్ద నుంచి ఉప్పుటేరు మీదుగా కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం వరకు బోటు యాత్ర, ఆటపాక పక్షుల కేంద్రం నుంచి కొల్లేటి పెద్దింట్లమ్మ దేవస్థానం వరకు బోటు యాత్రకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఉప్పుటేరు వద్ద కాటేజీలు నిర్మిస్తే కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల యాత్రికులకు అనుకూలంగా ఉంటుందని ప్రణాళికలు రూపొందించినా, పనులు పూర్తికాలేదు. పుణ్యక్షేత్రాలకు అనుసంధానం : బాపూజీ కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రాలను అనుసంధానం చేస్తూ కొల్లేరు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయాలని భావిస్తున్నట్లు టూరిజం డీఎం బాపూజీ చెప్పారు. అదే విధంగా కొల్లేరులో బోటు షికారు, కాటేజీల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని తెలిపారు. ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లా ఆగడాలలంక వద్ద కొల్లేరు సందర్శకుల కోసం రిసార్ట్లు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. అటవీ పర్యావరణాన్ని అభివృద్ధి చేస్తాం : శ్రీదర్ ఆటపాక పక్షుల కేంద్రం మాదిరిగా మరిన్ని విహార కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఉందని అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు శ్రీధర్ చెప్పారు. విదేశీ పక్షులు విడిది కేంద్రంగా కొల్లేరు నిలిచిందని పేర్కొన్నారు. ఆటపాక పక్షుల కేంద్రంలో ఇప్పటికే పక్షుల ఆవాసల కోసం కృత్రిమ స్టాండ్లను ఏర్పాటు చేశామన్నారు. మణుగునూరులంక వద్ద మరో విహార కేంద్రాన్ని అభివృద్ధి చేశామన్నారు. రానున్న రోజుల్లో పక్షుల సంరక్షణ కేంద్రాలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తామని ఆయన తెలిపారు. -
ఆశల పల్లకి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలకవర్గాల నియామకంలో గత పాలకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, కొత్త ప్రభుత్వం మార్పులు, చేర్పులు చేయాలని సంకల్పించింది. గతంలో పాలకమండలిలో 18 మంది ఉంటే, అందులో నలుగురు మార్కెటింగ్, మత్స్య, ఉద్యానవన, వ్యవసాయ శాఖల ఏడీలు సభ్యులుగా ఉండేవా రు. మిగతా 14 మందిలో ఐదుగురు సన్న, చిన్నకారు రైతులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళావర్గాల నుం చి ఒక్కొక్కరు ఉండేవారు. కొత్త కమిటీల ఏర్పాటు నేపథ్యంలో మార్పులు ఉండవచ్చని భావిస్తున్నారు. మరోవైపు జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల పరిధి లో ఉన్న 13 మార్కెట్ కమిటీల చైర్మన్ పదవులకు తీవ్ర పోటీ నెలకొంది. నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి 10 నుంచి 15 మంది పోటీ పడుతున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి, నిజామాబాద్, ధర్పల్లి, జక్రాన్పల్లి మండలాలు కూడా ఈ మార్కెట్లోకే వస్తాయి. మాక్లూర్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన దాదన్నగారి విఠల్రావుకు కేసీఆర్ గట్టి హామీ ఇచ్చా రని అంటున్నారు. డిచ్పల్లి జడ్పీటీసీ మాజీ సభ్యుడు దినేశ్కుమార్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శక్కరికొండ కృష్ణ, ధర్పల్లి నుంచి పీసు రాజ్పాల్రెడ్డి, సిరికొండ మండలం నుంచి గడీల రాములు, జక్రాన్పల్లి మండలం నుంచి అర్గుల్ నర్సయ్య రేసులో ఉన్నారు. టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి కూడా ఈ పదవిని కోరుకుంటున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో కామారెడ్డి, భిక్కనూర్ మార్కెట్ కమిటీలున్నాయి. కామారెడ్డి చైర్మన్ పదవిని ఇటీవల జడ్పీటీసీ సభ్యునిగా పోటీ చేసి ఓడిపోయిన మంద వెంకటేశ్వర్రెడ్డి ఆశిస్తున్నారు. ఆయనకు ఎమ్మెల్యే గంప గోవర్ధన్ హామీ ఇచ్చిన ట్టు ప్రచారం జరుగుతోంది. మార్కెట్ కమి టీ మాజీ చైర్మన్ మాచారెడ్డి మండలం అక్కాపూర్కు చెందిన పొన్నాల లక్ష్మారెడ్డి కూడా రేసులో ఉన్నారు. భిక్కనూరు మార్కెట్ కమిటీకి సంబంధించి అధికారిక ప్రక్రి య పూర్తి కాకపోవడంతో ఇంకా అక్క డ చైర్మన్ పదవి విషయంలో ఎవరూ బయటపడటం లేదు. ఆర్మూర్లో ఆర్మూర్, జక్రాన్పల్లి, బాల్కొండ, వేల్పూర్ మండలాలను కలుపుతూ మార్కెట్ కమిటీ ఉంది. ఆర్మూర్ నియోజకర్గ పరిధిలోని ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని బాల్కొండ, వేల్పూర్ మండలాలు, నిజామాబాద్ రూరల్ పరిధిలోని జక్రాన్పల్లి మండలం ఉండడంతో ముగ్గురు శాసనసభ్యులకు సమ్మతమయ్యే నేతనే మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎంపిక చేసే అవకాశం ఉంది. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డికి సన్నిహతులుగా ఉన్న పలువురు నాయకులు చైర్మన్ పీఠాన్ని దక్కిం చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్మూర్ మండల పార్టీ అధ్యక్షుడు మిట్టపల్లి గంగారెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జీ యామాద్రి భాస్కర్, అంకాపూర్ సొసైటీ చైర్మన్ మార గంగారెడ్డి, వేల్పూర్ మండల పార్టీ అధ్యక్షుడు కొట్టాల చిన్నారెడ్డి తదితరులు పోటీలో ఉన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో మద్నూర్, పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. మద్నూర్ చైర్మన్ కోసం జుక్కల్ మండలానికి చెందిన మాజీ జడ్పీటీసీ సాయాగౌడ్, బిచ్కుంద మండలానికి చెందిన శ్రీహరి, సీతారాంపల్లికి చెందిన ఎం.సిద్ధిరాం రేసులో ఉన్నారు. పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని నిజాంసాగర్ మండ లానికి చెందిన జడ్పీటీసీ మాజీ సభ్యుడు, టీఆర్ఎస్ నాయకుడు వినయ్కుమార్, పిట్లం మండలానికి చెందిన అన్నారం వెంకట్రాంరెడ్డి, తిమ్మానగర్ దేవేందర్రెడ్డితో పాటు ప్రస్తుత మార్కె ట్ కమిటి చైర్మన్ క్రిష్ణారెడ్డి ఆశిస్తున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎల్లారెడ్డి, గాంధారి మార్కెట్ కమిటీలున్నాయి. ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం కృష్ణాగౌడ్ (సిట్టింగ్ చైర్మన్), అశోక్రెడ్డి (లింగంపేట మండలం శెట్పల్లిసంగారెడ్డి) వెంకట్రెడ్డి (నాగిరెడ్డిపేట) పోటీ పడుతున్నారు. గాంధారి చైర్మన్ పదవిని సత్యం (సర్వాపూర్), రాంకిషన్రావు (గాంధారి) ఆశిస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడ నియోజకవర్గంలోని బాన్సువాడ మార్కెట్ కమిటీ అధ్యక్ష పదవికి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నార్ల సురేష్ గుప్తా పోటీలో ఉన్నా రు. వర్ని మార్కెట్ కమిటీ అధ్యక్ష పదవికి మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు నరొజీ గంగారాం పోటీలో ఉన్నారు. మంత్రి ఆశీస్సులు మెండుగా ఉన్న వీరిద్దరు చైర్మన్లుగా ఖరారైనట్లేనన్న చర్చ ఉంది. బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి మా ర్కెట్ కమిటీకి ఉప్లూర్కు చెందిన చిన్నారెడ్డి, భీమ్గల్ జడ్పీటీసీ మాజీ సభ్యుడు ప్రకాష్గౌడ్, కమ్మర్పల్లి నాయకులు స్వామిరెడ్డి, వే ముల శ్రీనివాస్, మోర్తాడ్ మండలం సుంకెట్కు చెందిన తీగెల సంతోష్ పోటీ పడుతున్నారు. చిన్నారెడ్డికి ఎమ్మెల్యేలు ప్రశాంత్రె డ్డి, జీవన్రెడ్డి, ఎంపీ కవితల ఆశీస్సులున్నాయన్న ప్రచారం ఉంది. ప్రకాష్గౌడ్కు కేసీఆ ర్తోనే సత్సంబంధాలు ఉన్నాయంటుం డగా, మిగిలిన నాయకులు ప్రశాంత్రెడ్డి మెప్పు కోసం యత్నిస్తున్నారు. బోధన్ వ్యవసాయ మార్కెట్ కోసం చాలామందే పోటీ పడుతున్నారు. ఖండ్గాం ఎం పీటీసీ సభ్యుడు, టీఆర్ఎస్ మండల అధ్యక్షు డు వి.శ్యాంరావు, బోధన్కు చెందిన ప్రము ఖ వ్యాపారి, మైనార్టీ నాయకుడు కరీం ఈ ప దవిని ఆశిస్తున్నారు. ఇంతకు ముందు మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి అనుచరులే చైర్మన్లుగా వ్యవహరించగా, ఎమ్మెల్యే షకీల్ ఎవరికి అ వకాశం ఇస్తారనే చర్చ జరుగుతోంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి, ధర్పల్లి, జక్రాన్పల్లి మండలాలు ని జామాబాద్ మార్కెట్ కమిటీ పరిధిలోకి వ స్తాయి. ఈ నియోజకవర్గంలోని సిరికొండ మండలం మాత్రం భీంగల్ మార్కెట్ కమిటీ పరిధికి వస్తుంది. భీమ్గల్ చైర్మన్ పదవి కో సం పలువురు పోటీ పడుతున్నారు. -
ముగిసిన విరామం నేటినుంచి చేపలవేట
981 బోట్లు సముద్రంలోకి మత్స్యకారులకు నేటికీ అందని భత్యం మచిలీపట్నం, న్యూస్లైన్ : నెలన్నర రోజుల విరామం అనంతరం సముద్రంలో చేపల వేట జిల్లాలో శనివారం నుంచి ప్రారంభం కానుంది. చేపలు, రొయ్యలు గుడ్లు పెట్టే సమయం కావటంతో ఏప్రిల్ 15 నుంచి మే 31 వరకు సముద్రంలో చేపలవేటపై మత్స్యశాఖ నిషేధం విధించింది. నిషేధం సమయం ముగియటంతో మత్స్యకారులు చేపల వేటకు సంసిద్ధులయ్యారు. 38 గ్రామాలు..1.12 లక్షల మంది మత్స్యకారులు... జిల్లా వ్యాప్తంగా 111 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. సముద్రతీరంలోని 38 గ్రామాల్లో 1.12 లక్షలమంది మత్స్యకారులు చేపల వేటే ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. 95 మెకనైజ్డ్ బోట్లతో పాటు 886 మర పడవల ద్వారా సముద్రంలో చేపల వేట ద్వారా వచ్చే ఆదాయమే వారికి ప్రధాన ఆధారం. ఒక రోజు ముందే బయలుదేరిన బోట్లు... గిలకలదిండి హార్బర్ వద్ద సముద్ర ముఖద్వారం మేట వేయటంతో సముద్రంలోకి మెకనైజ్డ్ బోట్లు వెళ్లి రావటం ఇబ్బందికరంగా మారింది. అమావాస్య, పౌర్ణమి సమయాల్లో సముద్రపోటు అధికంగా ఉంటుంది. ఈ నెల 28న అమావాస్య వచ్చింది. అమావాస్య అనంతరం రెండు, మూడు రోజులకు సముద్రపు పోటు తగ్గుతుంది. ఈ నేపథ్యంలో విదియ రోజునే గిలకలదిండి హార్బర్ నుంచి మెకనైజ్డ్ బోట్లు సముద్రంలోకి వెళ్లాయి. శనివారం మరిన్ని బోట్లు వెళ్లే అవకాశం ఉన్నట్లు బోటు యజమానులు చెబుతున్నారు. సముద్ర తీరంలోని నాగాయలంక, కోడూరు, మోపిదేవి, బందరు, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల నుంచి మరో 886 మోటారైజ్డ్(ఫైబర్) బోట్ల ద్వారా చేపల వేటను మత్స్యకారులు కొనసాగిస్తూ ఉంటారు. తీరం నుంచి 15 నాటికల్ మైళ్ల పరిధి వరకు వీరు చేపల వేటను కొనసాగించేందుకు వెసులుబాటు ఉంది. మెకనైజ్డ్ బోటు చేపల వేటకు వెళితే తిరిగి రావడానికి వారం రోజుల సమయం పడుతుంది. ఫైబర్ బోట్ల ద్వారా చేపల వేట కొనసాగించేవారు వేకువజామున మూడు గంటలకు బయలుదేరి వెళ్లి అదే రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో తిరిగి వస్తారు. సమాచారం కరువు... సముద్రంలో చేపల సంచారాన్ని శాటిలైట్ ద్వారా తెలుసుకునే పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. చేపలు, రొయ్యలు సముద్రంలో ఏ ప్రాంతంలో సంచరిస్తున్నాయో శాటిలైట్ ద్వారా గుర్తించి ఆ సమాచారాన్ని సముద్రంలో చేపలవేట చేస్తున్న మత్స్యకారులకు అందజేయాలి. ఈ ప్రక్రియ అంతగా కొనసాగటం లేదని మత్స్యకారులు చెబుతున్నారు. గతంలో మత్స్యశాఖ అధికారులు చేపల వేట కొనసాగించేవారికి ఎస్ఎంఎస్ ద్వారా, హ్యామ్ రేడియోల ద్వారా సమాచారం అందించేవారని పేర్కొంటున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా సమాచారం ఇవ్వటం లేదని మత్స్యకారులు చెబుతున్నారు. గిలకలదిండి హార్బర్, గిరిపురంలలో ఈ సమాచార కేంద్రాలను ఏర్పాటుచేసినా ఉపయోగం లేకుండాపోయింది. బియ్యం పంపిణీ లేదు... వేట నిషేధం సమయంలో మత్స్యకారుల కుటుంబాలకు జీవనం కోసం ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి 31 కిలోల బియ్యం పంపిణీ చేయాలి. ఈ పంపిణీ కార్యక్రమం ఈ ఏడాది చేయలేదని మత్స్యకారులు చెబుతున్నారు. చేపలవేట కొనసాగించే మత్స్యకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియ ముందుకు సాగటం లేదు. గుర్తింపు కార్డు లేకపోవడం వల్ల చేపల వేట సమయంలో అధికారులు తనిఖీ చేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తోందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.