Gail
-
ఏఎం గ్రీన్తో గెయిల్ ఒప్పందం
దేశంలో స్థిరమైన ఇంధన పరిష్కారాల అభివృద్ధికి గెయిల్ (ఇండియా) లిమిటెడ్, ఏఎం గ్రీన్ బీవీ (AMG) సంస్థలు జట్టుకట్టాయి. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈమిథనాల్ ఉత్పత్తి కోసం కార్బన్ డయాక్సైడ్ (CO2) దీర్ఘకాలిక సరఫరా, దేశం అంతటా హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అన్వేషణపై భాగస్వామ్యం దృష్టి సారిస్తుందని రెగ్యులేటరీ ఫైలింగ్లో గెయిల్ తెలిపింది.గెయిల్ డైరెక్టర్ (బిజినెస్ డెవలప్మెంట్) రాజీవ్ సింఘాల్ సమక్షంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (బిజినెస్ డెవలప్మెంట్ అండ్ ఎక్స్ప్లోరేషన్ & ప్రొడక్షన్) సుమిత్ కిషోర్, ఏఎం గ్రీన్ గ్రూప్ ప్రెసిడెంట్ మహేష్ కొల్లి అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.ఒప్పందంలో భాగంగా ఈమిథనాల్ను ఉత్పత్తి కోసం కార్బన్ డయాక్సైడ్ దీర్ఘకాలిక సరఫరా కోసం అధ్యయనాలను చేపట్టాలని రెండు కంపెనీలు భావిస్తున్నాయి. ప్రతిపాదిత ఇమిథనాల్ ప్రాజెక్ట్లో పెట్టుబడి పెట్టడానికి గెయిల్కి కూడా ఈక్విటీ ఆప్షన్ ఉంటుంది. అలాగే దేశం అంతటా 2.5 గిగావాట్స్ వరకు సోలార్/విండ్ హైబ్రిడ్ పునరుత్పాదక ప్రాజెక్టుల ఏర్పాటును సంయుక్తంగా అన్వేషించాలని ఇరు సంస్థలు భావిస్తున్నాయి. -
గెయిల్లొ 391 ఉద్యోగాలు (ఫోటోలు)
-
గెయిల్కు బీపీసీఎల్ ముడిసరుకు సరఫరా
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో నెలకొల్పుతున్న పెట్రోకెమికల్ ప్లాంటుకు అవసరమైన ముడిసరుకు కోసం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్)తో గెయిల్ (ఇండియా) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ రూ. 63,000 కోట్లు. దీని ప్రకారం 15 ఏళ్ల పాటు గెయిల్కు చెందిన ఉసార్ ప్లాంటుకు బీపీసీఎల్ తమ ఎల్పీజీ దిగుమతి కేంద్రం నుంచి ఏటా 6 లక్షల టన్నుల ప్రొపేన్ గ్యాస్ను సరఫరా చేయ నుంది. ఉసార్లో 5,00,000 టన్నుల సామర్థ్యంతో గెయిల్ దేశీయంగా తొలి ప్రొపేన్ డీహైడ్రోజినేషన్ (పీడీహెచ్) ప్లాంటును నిర్మిస్తోంది. ఈ ప్లాంటు 2025 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఫరి్నచర్ ఉపకరణాలు, బొమ్మలు మొదలైన వాటిలో ఉపయోగించే పాలీప్రొపిలీన్ తయారీ ప్లాంటుకు ఇది అనుసంధానమై ఉంటుంది. -
మూడేళ్లలో రూ. 30 వేల కోట్లు...
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ గ్యాస్ దిగ్గజం గెయిల్ (ఇండియా) భారీ స్థాయిలో కార్యకలాపాలు విస్తరించనుంది. వచ్చే మూడేళ్లలో రూ. 30,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. గెయిల్ (ఇండియా) వార్షిక సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా చైర్మన్ సందీప్ కుమార్ గుప్తా ఈ విషయాలు వెల్లడించారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 10,000 కోట్ల మేర పెట్టుబడి వ్యయాలు చేసినట్లు వివరించారు. (ఉబెర్ 'గ్రూప్ రైడ్స్' ఫీచర్: ఎగిరి గంతేస్తున్న రైడర్లు) రాబోయే మూడేళ్లలో పైప్లైన్ల ఏర్పాటు, ప్రస్తుతం కొనసాగుతున్న పెట్రోకెమికల్ ప్రాజెక్టులు, నిర్వహణపరమైన పెట్టుబడులు, గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు మొదలైన వాటి కోసం రూ. 30,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు గుప్తా చెప్పారు. ఇటీవలే కొనుగోలు చేసిన ప్రైవేట్ రంగ జేబీఎఫ్ పెట్రోకెమికల్స్తో తమ పోర్ట్ఫోలియోలో మరో కొత్త రసాయన ఉత్పత్తి (ప్యూరిఫైడ్ టెరిఫ్తాలిక్ యాసిడ్ – పీటీఏ) చేరినట్లు ఆయన తెలిపారు. మహారాష్ట్రలోని ఉసార్లో తాము తొలిసారిగా 50,000 టన్నుల ఐసోప్రొపైల్ ఆల్కహాల్ (ఐపీఏ) ఉత్పత్తి సామర్థ్యంతో స్పెషాలిటీ కెమికల్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు గుప్తా చెప్పారు. ఇలాంటి వాటి తోడ్పాటుతో తమ పెట్రోకెమికల్స్ / కెమికల్స్ పోర్ట్ఫోలియో సామర్థ్యం వార్షికంగా 3 మిలియన్ టన్నులకు చేరగలదని వివరించారు. అంతర్జాతీయంగా ఎల్ఎన్జీ (ద్రవీకృత సహజ వాయువు) దిగ్గజాల నుంచి దీర్ఘకాలికంగా కొనుగోళ్లు జరిపే అంశంపై కసరత్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అటు సహజ వాయువులో హైడ్రోజన్ను ఏయే స్థాయిలో కలిపితే ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై అధ్యయనం చేస్తున్నట్లు గుప్తా చెప్పారు. -
గెయిల్ గూటికి జేబీఎఫ్ పెట్రోకెమికల్స్
న్యూఢిల్లీ: దివాలా పరిష్కార చర్యల్లో ఉన్న జేబీఎఫ్ పెట్రోకెమికల్స్ కంపెనీని ప్రభుత్వరంగ సంస్థ గెయిల్ కొనుగోలు చేయనుంది. రూ.2,079 కోట్లతో గెయిల్ వేసిన బిడ్కు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదం లభించింది. పెట్రోకెమికల్స్ వ్యాపారాన్ని విస్తరించాలన్న పట్టుదలతో గెయిల్ కొంతకాలంగా ఉంది. ఇప్పుడు జెబీఎఫ్ కొనుగోలుతో కంపెనీ తన లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు వీలు పడుతుంది. తాము ఇచ్చిన రుణాలను జేబీఎఫ్ చెల్లించక పోవడంతో రుణదాతలు ఎన్సీఎల్టీ అనుమతితో విక్రయానికి పెట్టారు. దీనికి గెయిల్ సమర్పించిన పరిష్కార ప్రణాళికకు ఎన్సీఎల్టీ అహ్మదాబాద్ బెంచ్ ఆమోదం తెలిపినట్టు స్టాక్ ఎక్సేంజ్లకు సమాచారం ఇచ్చింది. (రిలయన్స్ అధినేత అంబానీ కళ్లు చెదిరే రెసిడెన్షియల్ ప్రాపర్టీస్) ఇండియన్ ఆయిల్, ఓఎన్జీసీ కర్సార్షియంతో పోటీ పడి మరీ గెయిల్ జేబీఎఫ్ బిడ్డింగ్లో విజేతగా నిలిచింది. ఐడీబీఐ బ్యాంక్ రూ.5628 కోట్లను రాబట్టుకునేందుకు జేబీఎఫ్ను వేలం వేసింది. కొనుగోలు లావాదేవీ ఇంకా పూర్తి కావాల్సి ఉందని గెయిల్ తెలిపింది. జేబీఎఫ్కు మంగళూరు సెజ్లో 1.25 మిలియన్ టన్నుల టెరెఫ్తాలిక్ యాసిడ్ తయారీ ప్లాంట్ ఉంది. గెయిల్కు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని పతా వద్ద పెట్రోకెమికల్ ప్లాంట్ ఉంది. ఇక్కడ 8,10,000 టన్నుల వార్షిక పాలీమర్స్ తయారు చేయగలదు. వచ్చే ఏడాదికి మహారాష్ట్రలోని ఉసార్లో ప్రొపేన్ డీహైడ్రోజెనేషన్ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది (ఇదీ చదవండి: ‘నాటు నాటు’ జోష్ పీక్స్: పలు బ్రాండ్స్ స్టెప్స్ వైరల్, ఫ్యాన్స్ ఫుల్ ఫిదా!) -
మన లక్ష్యం రూ.10,000 కోట్లు: గెయిల్
న్యూఢిల్లీ: వాటా మూలధనాన్ని రెట్టింపునకు పెంచుకోవాలని ఆశిస్తున్నట్లు ప్రభుత్వ రంగ యుటిలిటీ దిగ్గజం గెయిల్ ఇండియా తాజాగా వెల్లడించింది. అంతేకాకుండా స్పెషాలిటీ కెమికల్స్, శుద్ధ ఇంధన బిజినెస్లను జత చేసుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు పేర్కొంది. సహజవాయు రవాణా, పంపిణీ బిజినెస్కు జతగా మరిన్ని విభాగాలలోకి ప్రవేశించే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. రానున్న మూడు, నాలుగేళ్లలో అమలుచేయ తలపెట్టిన విస్తరణ ప్రణాళికలకు అనుగుణంగా వాటా మూలధనాన్ని ప్రస్తుత రూ. 5,000 కోట్ల నుంచి రూ. 10,000 కోట్లకు పెంచుకునేందుకు వాటాదారుల అనుమతిని కోరినట్లు వెల్లడించింది. జాతీయ గ్రిడ్ను సృష్టించే బాటలో కంపెనీ నేచురల్ గ్యాస్ పైప్లైన్లను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. 2030కల్లా ప్రధాన ఇంధన బాస్కెట్కు 15 శాతం సహజవాయు సరఫరాలను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా రానున్న 3–4ఏళ్లలో గెయిల్ సుమారు రూ. 30,000 కోట్ల పెట్టుబడి వ్యయ ప్రణాళికలు వేసింది. వీటిలో కొంతమేర అంతర్గత వనరులు, మరికొంత రుణాలు, ఈక్విటీ మార్గంలో సమకూర్చుకోవాలని చూస్తున్నట్లు వాటాదారులకు గెయిల్ తాజాగా తెలియజేసింది. మరోవైపు వాటాదారులకు బోనస్ షేర్ల జారీ ప్రతిపాదన సైతం ఉన్నట్లు పేర్కొంది. చదవండి: ఇదే టార్గెట్.. రూ.12,000 కోట్ల ఆస్తులు అమ్మాల్సిందే! -
గెయిల్ లాభం జూమ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ యుటిలిటీ దిగ్గజం గెయిల్ ఇండియా ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్-జూన్(క్యూ1)లో నికర లాభం 51 శాతం జంప్చేసి రూ. 3,251 కోట్లకు చేరింది. గతేడాది క్యూ1లో కేవలం రూ. 2,157 కోట్లు ఆర్జించింది. నేచురల్ గ్యాస్ మార్కెటింగ్ మార్జిన్లు భారీగా మెరుగుపడటం ఇందుకు సహకరించింది. మొత్తం ఆదాయం రెట్టింపై రూ. 38,033 కోట్లను తాకింది. గత క్యూ1లో రూ. 17,702 కోట్ల టర్నోవర్ అందుకుంది. పన్నుకుముందు లాభం ఐదు రెట్లు ఎగసి రూ. 2,318 కోట్లకు చేరింది. గత క్యూ1లో ఇది రూ. 450 కోట్లు మాత్రమే. ప్రస్తుత సమీక్షా కాలంలో గెయిల్ స్టాండెలోన్ నికర లాభం 91 శాతం దూసుకెళ్లి రూ. 2,915 కోట్లయ్యింది. ఈ కాలంలో పైపులైన్లు, పెట్రోకెమికల్స్, భాగస్వామ్య సంస్థ ఈక్విటీ పెట్టుబడులకుగాను రూ. 1,975 కోట్లు వెచ్చించింది. ఫలితాల నేపథ్యంలో గెయిల్ షేరు గురువారం 0.6 శాతం నీరసించింది. శుక్రవారం కూడా అదే ట్రెండ్ను కొనసాగిస్తూ ఏకంగా 4 శాతం పతనమైంది. -
గెయిల్ కొత్త చైర్మన్ సందీప్ కే గుప్తా!
న్యూఢిల్లీ: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ప్రస్తుతం ఫైనాన్స్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న సందీప్ కుమార్ గుప్తా, భారత్ అతిపెద్ద గ్యాస్ యుటిలిటీ సంస్థ గెయిల్ (ఇండియా) చీఫ్గా ఎంపికయ్యారు. పది మంది అభ్యర్థుల ఇంటర్వ్యూ తర్వాత 56 సంవత్సరాల గుప్తాను గెయిల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా ఎంపికచేసినట్లు ప్రభుత్వ రంగ సంస్థల నియామకాల ఎంపిక బోర్డ్ (పీఈఎస్బీ) ఒక ప్రకటనలో తెలిపింది. ఆగస్టు 31వ తేదీన ప్రస్తుత సీఎండీ మనోజ్ జైన్ పదవీ విరమణ అనంతరం గుప్తా నూతన బాధ్యతలను చేపడతారు. అయితే అంతకుముందు ఆయన నియామకానికి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వంటి అవినీతి నిరోధక సంస్థలు ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. -
లాభాల్లో ప్రభుత్వ కంపెనీ..షేర్ హోల్డర్లకి బంపరాఫర్!
న్యూఢిల్లీ: పీఎస్యూ యుటిలిటీ దిగ్గజం గెయిల్ (ఇండియా) లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2021–22) రెండో మధ్యంతర డివిడెండును ప్రకటించింది. వాటాదారులకు షేరుకి రూ. 5(50 శాతం) చొప్పున చెల్లించేందుకు బోర్డు అనుమతించినట్లు మహారత్న కంపెనీ గెయిల్ వెల్లడించింది. ఇందుకు ఈ నెల 22 రికార్డ్ డేట్కాగా.. మొత్తం చెల్లింపులకు రూ. 2,220 కోట్లకుపైగా వెచ్చించనుంది. కంపెనీ ఇప్పటికే 2021 డిసెంబర్లో షేరుకి రూ. 4 చొప్పున డివిడెండును చెల్లించింది. వెరసి ఈ ఏడాదిలో ఒక్కో షేరుకీ రూ. 9 చొప్పున మొత్తం రూ. 3,996 కోట్లకుపైగా డివిడెండు కింద వెచ్చిస్తున్నట్లు కంపెనీ చైర్మన్, ఎండీ మనోజ్ జైన్ వెల్లడించారు. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికమని తెలియజేశారు! కాగా.. ప్రస్తుతం కంపెనీలో గల 51.45% వాటా ప్రకారం ప్రభుత్వం రెండో మధ్యంతర డివిడెండుకింద రూ. 1,142 కోట్లు అందుకోనుంది. చదవండి: మే 12వరకూ ఎల్ఐసీకి గడువు -
సస్పెన్షన్లో రంగనాథన్: గెయిల్
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలపై సీబీఐ అరెస్ట్ చేసిన సంస్థ మార్కెటింగ్ డైరెక్టర్ రంగనాథన్ను సస్పెండ్ చేసినట్లు ప్రభుత్వ రంగ గ్యాస్ యుటిలిటీ సంస్థ– గెయిల్ (ఇండియా) ధ్రువీకరించింది. ప్రైవేటు కంపెనీలకు పెట్రోకెమికల్ ప్రొడక్టుల అమ్మకాలపై భారీ డిస్కౌంట్లు ఇస్తూ లంచాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై రంగనాథన్ను రెండు రోజుల క్రితం సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో ఆరుగురిని కూడా సీబీఐ అరెస్ట్ చేసింది. రంగనాథన్సహా పలువురి నివాసాలపై జరిగిన సీబీఐ దాడుల్లో దాదాపు రూ.1.25 కోట్లు డబ్బు, అంతే మొత్తం విలువైన ఆభరణాలు, కొన్ని కీలక డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. ‘గెయిల్ ఎంప్లాయీస్ (కాండక్ట్ డిసిప్లిన్ అండ్ అప్పీల్) రూల్స్, 1986లోని రూల్ 25 ప్రకారం దాఖలైన అధికారాలను అమలు చేస్తూ ఈఎస్ రంగనాథన్ను 2022 జనవరి 18వ తేదీ నుంచి అమలయ్యేలా సస్పెండ్చేస్తూ భారత్ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు’’ అని గెయిల్ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. -
గెయిల్ డైరెక్టర్ రంగనాథన్ అరెస్ట్
న్యూఢిల్లీ: లంచాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై గెయిల్ మార్కెటింగ్ వ్యవహారాల డైరెక్టర్ ఈఎస్ రంగనాథన్ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్ట్గేషన్ (సీబీఐ) అరెస్ట్ చేసింది. నోయిడాలో ఆయనకు ఉన్న నివాసంలో సోదాలు నిర్వహించి రూ.1.3 కోట్లతో పాటు విలువైన ఆభరణాలు, పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు కూడా సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదే కేసులో మరో ఐదుగురిని కూడా అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం నవంబర్ 2021లో గెయిల్ డైరెక్టర్ను ఇరువులు మధ్యవర్తులు ఎలా కలిశారు, లంచం ఎలా ఇచ్చారన్న విషయాన్ని సీబీఐ ఎఫ్ఐఆర్ వివరించింది. పెట్రో కెమికల్ ఉత్పత్తులను రాయితీపై అందజేస్తే లంచాలు అందించేందుకు సిద్ధంగా ఉన్న కంపెనీల యజమానులతో కూడా నిందితులు సమావేశం అయ్యారని ఎఫ్ఐఆర్ తెలిపింది. సీబీఐ జరిపిన దాడుల్లో రంగనాథన్ సహాయకుడు ఎన్ రామకృష్ణన్ నాయర్ నివాసం కూడా ఒకటి. ఈ నివాసం నుంచి రూ.75 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎఫ్ఐఆర్లో రంగనాథన్, నాయర్లతోపాటు పవన్ గౌర్, రాజేష్ కుమార్, యునైటెడ్ పాలిమర్ ఇండస్ట్రీస్కు చెందిన సౌరభ్ గుప్తా, బన్సల్ ఏజెన్సీస్కి చెందిన ఆదిత్య బన్సాల్ ఉన్నారు. -
గెయిల్ డైరెక్టర్ రంగనాథన్ అరెస్ట్
న్యూఢిల్లీ: లంచాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై గెయిల్ మార్కెటింగ్ వ్యవహారాల డైరెక్టర్ ఈఎస్ రంగనాథన్ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్ట్గేషన్ (సీబీఐ) అరెస్ట్ చేసింది. నోయిడాలో ఆయనకు ఉన్న నివాసంలో సోదాలు నిర్వహించి రూ.1.3 కోట్లతో పాటు విలువైన ఆభరణాలు, పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు కూడా సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదే కేసులో మరో ఐదుగురిని కూడా అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం నవంబర్ 2021లో గెయిల్ డైరెక్టర్ను ఇరువులు మధ్యవర్తులు ఎలా కలిశారు, లంచం ఎలా ఇచ్చారన్న విషయాన్ని సీబీఐ ఎఫ్ఐఆర్ వివరించింది. పెట్రో కెమికల్ ఉత్పత్తులను రాయితీపై అందజేస్తే లంచాలు అందించేందుకు సిద్ధంగా ఉన్న కంపెనీల యజమానులతో కూడా నిందితులు సమావేశం అయ్యారని ఎఫ్ఐఆర్ తెలిపింది. సీబీఐ జరిపిన దాడుల్లో రంగనాథన్ సహాయకుడు ఎన్ రామకృష్ణన్ నాయర్ నివాసం కూడా ఒకటి. ఈ నివాసం నుంచి రూ.75 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎఫ్ఐఆర్లో రంగనాథన్, నాయర్లతోపాటు పవన్ గౌర్, రాజేష్ కుమార్, యునైటెడ్ పాలిమర్ ఇండస్ట్రీస్కు చెందిన సౌరభ్ గుప్తా, బన్సల్ ఏజెన్సీస్కి చెందిన ఆదిత్య బన్సాల్ ఉన్నారు. -
అవన్నీ అనవసరమైన భయాందోళనలు
న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు కొరతతో థర్మల్ విద్యుత్ కేంద్రాలు మూతపడే పరిస్థితి వస్తుందని ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు పలు రాష్ట్రాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో సంక్షోభ నివారణకు కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది. దేశవ్యాప్తంగా విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోకుండా అవసరమైన అన్ని వనరులు వినియోగించేలా ప్రయత్నాలు మొదలుపెట్టింది. కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్.కె.సింగ్ ఎన్టీపీసీ, రిలయెన్స్ ఎనర్జీ సహా వివిధ విద్యుదుత్పత్తి కేంద్రాలు, విద్యుత్ సరఫరా కంపెనీలు, విద్యుత్ అధికారులతో ఆదివారం భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ డిమాండ్కు తగిన బొగ్గు నిల్వలు ఉన్నాయని, అనవసర భయాందోళనలు వద్దని స్పష్టం చేశారు. విద్యుదుత్పత్తి కేంద్రాల్లో 4 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని, విద్యుత్ సరఫరాకు ప్రమాదం ఏమీ లేదని భరోసా ఇచ్చారు. సమాచార లోపమే కారణం గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్), ఢిల్లీలోని డిస్కమ్ల మధ్య సమాచార లోపం వల్లే అనవసర ఆందోళనలు తలెత్తాయని చెప్పారు. ఢిల్లీ డిస్కమ్లకి, గెయిల్కి మధ్య కాంట్రాక్టు పూర్తి అయిపోవడంతో ఇక గ్యాస్ సప్లయ్ చేయలేమని గెయిల్ రాసిన లేఖతో విద్యుత్ ప్రమాదం ముంచుకొస్తోందన్న భయం తలెత్తి ఉండవచ్చునని మంత్రి అభిప్రాయపడ్డారు. ‘విద్యుత్ సంక్షోభం ముంచుకొస్తోందంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాసిన లేఖపై లెఫ్ట్నెంట్ జనరల్ నాతో మాట్లాడారు. అలాంటి పరిస్థితి రాదని వాళ్లకి చెప్పాను. దేశవ్యాప్తంగా విద్యుత్ కేంద్రాలకు అవసరమయ్యే గ్యాస్ సరఫరా చేయమని గెయిల్ సీఎండీని ఆదేశించాం. సరఫరా కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు’అని మంత్రి తెలిపారు. బొగ్గు గనులున్న ప్రాంతాల్లో భారీ వర్షాలతో తవ్వకాలు నిలిచిపోవడం, సరఫరా మందగించడం, అంతర్జాతీయంగా బొగ్గు ధరలు భారీగా పెరగడంతో భరించలేని కంపెనీలు ఉత్పత్తిపై చేతులెత్తేస్తున్నాయి. గుజరాత్లో టాటా పవర్ ఉత్పత్తి నిలిపివేత విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గుపైనే ఆధారపడిన టాటా పవర్ అధిక ధరలకు బొగ్గు కొనలేక గుజరాత్లోని ముంద్రా ప్లాంట్లో ఉత్పత్తి ఆపేసింది. ఈ ప్లాంటు ద్వారా గుజరాత్కు 1,850 మెగావాట్లు, పంజాబ్కు 475, రాజస్తాన్కు 380, మహారాష్ట్రకు 760, హరియాణాకు 380 మెగావాట్లు విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంది. బొగ్గు నిల్వలు ఎంత ఉన్నాయంటే.. బొగ్గు నిల్వలపై కేంద్ర విద్యుత్ శాఖ, బొగ్గు గనుల శాఖ వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి. విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గును సరఫరా చేస్తున్నట్టు స్పష్టం చేశాయి. కోల్ ఇండియా లిమిటెడ్, సింగరేణి కాలరీస్ కంపెనీ, క్యాప్టివ్ కోల్మైన్స్, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు అన్నీ కలుపుకుంటే అక్టోబర్ 9న మొత్తంగా 19.2 లక్షల టన్నులు సరఫరా చేస్తే , విద్యుత్ ప్లాంట్లలో 18.7 లక్షల టన్నులు వినియోగించారు. అంటే వినియోగానికి మించి సరఫరా ఉందని, కొన్ని రోజులు గడిస్తే బొగ్గు నిల్వలు పెరుగుతాయని విద్యుత్ శాఖ వెల్లడించింది. బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ మరో ప్రకటనలో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు దాదాపుగా 72 లక్షల టన్నులున్నాయని, ఇవి నాలుగు రోజులకి సరిపోతాయని పేర్కొంది. కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) దగ్గర 400 లక్షల టన్నుల స్టాకు ఉందని, విద్యుత్ ప్లాంట్లకు దానిని సరఫరా చేస్తున్నట్టుగా వివరించింది. దేశవ్యాప్తంగా విద్యుత్ కేంద్రాలకి రోజుకి 18.5 లక్షల టన్నుల బొగ్గు అవసరమైతే ప్రస్తుతం రోజుకి 17.5 లక్షల టన్నులు సరఫరా చేస్తున్నామని, వర్షాల కారణంగా పంపిణీ కాస్త నెమ్మదించిందని అంగీకరించింది. గత ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ వరకు దేశీయంగా లభించే బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి 24 శాతం పెరిగిందని వివరించింది. అప్పట్లో ఆక్సిజన్కూ కొరత లేదన్నారు: సిసోడియా కేంద్రం ప్రతీ సమస్యని తేలిగ్గా తీసుకుంటోందని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆరోపించారు. బొగ్గు సంక్షోభం తరుముకొస్తున్నా ఏమీ లేదని అంటోందని మండిపడ్డారు. కోవిడ్ రెండో వేవ్ సమయంలో ఆస్పత్రులు, డాక్టర్లు ఆక్సిజన్కి కొరత ఉందని మొరపెట్టుకున్నా అలాంటిదేమీ లేదని మభ్యపెట్టిందని, ఫలితంగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. దేశంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరిపడినంత బొగ్గు నిల్వలు ఉన్నాయని, అనవసరంగా లేనిపోని భయాందోళనలు సృష్టిస్తున్నారంటూ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కే. సింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో సిసోడియా విలేకరులతో మాట్లాడారు. ‘‘కేంద్ర విద్యుత్ మంత్రి బొగ్గుకి కొరత లేదని అంటున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రధానికి అలా లేఖ రాసి ఉండకూడదని కూడా అన్నారు. ఒక కేంద్రమంత్రిగా ఆయన చాలా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు’’అని సిసోడియా అన్నారు. సమస్య నుంచి పారిపోవాలని కేంద్రం భావిస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కోవిడ్ సమయంలో ఆక్సిజన్ కొరతని, ఇప్పటి బొగ్గు సమస్యతో పోలుస్తూ కేంద్రంపై సిసోడియా విరుచుకుపడ్డారు. -
ఈసీఐఎల్లో ఆర్టిసన్ ఉద్యోగాలు, చివరి తేది మరో నాలుగు రోజులే
హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్).. ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ ఆర్టిసన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 04 ► అర్హత: ఫిట్టర్ ట్రేడులో రెండేళ్ల ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. అసెంబ్లీ ఆఫ్ మెకానికల్, ప్రెసిషన్ మెకానికల్ పని అనుభవం ఉండాలి. ► వయసు: 31.08.2021 నాటికి 25ఏళ్లు మించకూడదు. ► వేతనం: నెలకు రూ.18,564 చెల్లిస్తారు. ► పని ప్రదేశం: మైసూరు ► ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తులకు చివరి తేది: 17.09.2021 ► పూర్తి వివరాలకు వెబ్సైట్: www.ecil.co.in గెయిల్లో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టులు గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(గెయిల్).. ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (మరిన్ని ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► పోస్టులు: ఎగ్జిక్యూటివ్ ట్రైనీలు ► విభాగాలు: ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, ఎలక్ట్రికల్. ► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/తత్సమాన ఉత్తీర్ణతతోపాటు గేట్–2022కు దరఖాస్తు చేసుకోవాలి. ► ఎంపిక విధానం: గేట్–2022లో సాధించిన స్కోర్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తులకు చివరి తేది: 24.09.2021 ► వెబ్సైట్: www.gailonline.com -
గెయిల్(ఇండియా) లిమిటెడ్లో 220 పోస్టులు
న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వ రంగ మహారత్న సంస్థ.. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(గెయిల్).. వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 220 ► పోస్టుల వివరాలు: మేనేజర్, సీనియర్ ఇంజనీర్, సీనియర్ ఆఫీసర్, ఆఫీసర్. ► విభాగాలు: మార్కెటింగ్, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్ స్ట్రుమెంటేషన్, సివిల్, హెచ్ఆర్, లా తదితరాలు. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ డిగ్రీ, ఎంబీఏ, పీజీ డిప్లొమా, సీఏ/సీఎంఏ (ఐసీడబ్ల్యూఏ) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► ఎంపిక విధానం: షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 05.08.2021 ► వెబ్సైట్ : https://www.gailonline.com -
పెట్రోకెమ్, రెన్యూవబుల్స్పై గెయిల్ దృష్టి
న్యూఢిల్లీ: పెట్రోకెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్, రెన్యూవబుల్స్ విభాగాలలో విస్తరణపై దృష్టి పెట్టినట్లు పీఎస్యూ దిగ్గజం గెయిల్ ఇండియా చైర్మన్ మనోజ్ జైన్ తాజాగా పేర్కొన్నారు. సహజవాయువు కాకుండా ఇతర విభాగాలలో బిజినెస్ను విస్తరించే కొత్త ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశారు. ‘2030 వ్యూహాలు’ పేరుతో మెరుగుపరచిన భవిష్యత్ ప్రణాళికలను అనుసరించనున్నట్లు వివరించారు. వచ్చే దశాబ్దానికిగాను సరికొత్త ప్రయాణాన్ని సాగించనున్నట్లు తెలియజేశారు. పరిశ్రమలో వస్తున్న మార్పులు, తద్వారా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడంలో ఈ వ్యూహాలు సహకరించనున్నట్లు వివరించారు. అంతేకాకుండా కొత్త విభాగాలలో విస్తరణ, వృద్ధికి దోహదం చేయగలవని అభిప్రాయపడ్డారు. కంపెనీ దేశీయంగా 70 శాతం గ్యాస్ను 13,340 కిలోమీటర్ల పరిధిలో గల ట్రంక్ పైప్లైన్ ద్వారా వివిధ ప్రాంతాలకు రవాణా చేసే సంగతి తెలిసిందే. దేశీయంగా మొత్తం సహజవాయువు అమ్మకాల్లో 55 శాతం వాటా కంపెనీదే. 17.5 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. రూ. 8,800 కోట్లు మహారాష్ట్ర రాయిగఢ్ జిల్లాలోని ఉసార్లోగల ఎల్పీజీ ప్లాంటును పాలీప్రొపిలీన్ కాంప్లెక్స్గా మార్పిడి చేస్తోంది. ఇందుకు రూ. 8,800 కోట్ల పెట్టుబడులను వెచ్చిస్తోంది. తద్వారా 2022–23కల్లా 5 లక్షల టన్నుల తయారీ సామర్థ్యాన్ని అందుకోనుంది. దీనిలో భాగంగా పాలీఎథిలీన్, పాలీప్రొపిలీన్లకు భవిష్యత్లో పెరగనున్న డిమాండును అందుకునే అవకాశాలను అందిపుచ్చుకోవాలని భావిస్తోంది. ఇక మరోవైపు కంపెనీకి గల 120 మెగావాట్ల పవన, సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యాలను 1 గివావాట్కు పెంచుకునే ప్రణాళికలు వేసింది. ఇందుకు రానున్న మూడు, నాలుగేళ్లలో రూ. 4,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఇతర రంగాలలో విస్తరిస్తున్నప్పటికీ గ్యాస్ బిజినెస్ కీలక విభాగంగా నిలవనున్నట్లు మనోజ్ పేర్కొన్నారు. వెరసి జాతీయ గ్యాస్ గ్రిడ్లో భాగంగా ప్రాధాన్యతగల సెక్షన్ల ఏర్పాటుకు రూ. 32,000 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలియజేశారు. 7,500 కిలోమీటర్లమేర ఏర్పాటు చేయనున్న లైన్లలో దేశ తూర్పు ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వెల్లడించారు. -
జనరల్ ఇన్సూరెన్స్- గెయిల్.. జూమ్
ప్రపంచ మార్కెట్ల బలహీనతలు, జూన్ ఎఫ్అండ్వో కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్లకు లోనవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 177 పాయింట్లు క్షీణించి 34,692కు చేరగా.. 54 పాయింట్ల వెనకడుగుతో నిఫ్టీ 10,251 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో సాధించిన ఫలితాల కారణంగా పీఎస్యూ కౌంటర్లు జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(జీఐసీ ఆర్ఈ), గెయిల్ ఇండియా లిమిటెడ్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి ప్రస్తావించదగ్గ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. జీఐసీ ఆర్ఈ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో జీఐసీ ఆర్ఈ నికర లాభం 98 శాతం జంప్చేసి రూ. 1197 కోట్లను తాకింది. పన్నుకు ముందు లాభం మాత్రం నామమాత్ర వెనకడుగుతో రూ. 1101 కోట్లకు పరిమితమైంది. స్థూల ప్రీమియం ఆదాయం 14 శాతం పుంజుకుని రూ. 9217 కోట్లకు చేరగా.. పూర్తిఏడాదికి 15 శాతం అధికమై రూ. 51,030 కోట్లుగా నమోదైంది. ఈ నేపథ్యంలో జీఐసీ ఆర్ఈ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 4.5 శాతం జంప్చేసి రూ. 160 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 165ను సైతం అధిగమించింది. గెయిల్ ఇండియా గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో గెయిల్ ఇండియా నికర లాభం మూడు రెట్లు ఎగసి రూ. 3018 కోట్లను తాకింది. పన్నుకు ముందు లాభం 47 శాతం జంప్చేసి రూ. 2556 కోట్లకు చేరింది. అయితే మొత్తం ఆదాయం 5 శాతం క్షీణించి రూ. 17,753 కోట్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో గెయిల్ ఇండియా షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం .5 శాతం లాభపడి రూ. 105 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 107 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. బుధవారం సైతం ఈ షేరు దాదాపు 3 శాతం బలపడింది. -
స్టాక్స్ వ్యూ
టైటాన్ కంపెనీ బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.793 టార్గెట్ ధర: రూ.1,070 ఎందుకంటే: టాటా గ్రూప్కు చెందిన ఈ కంపెనీ ఇటీవలనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక విక్రయ అంచనాలను విడుదల చేసింది. ఈ క్యూ1లో అంతంతమాత్రంగా ఉన్న జ్యుయలరీ విభాగం అమ్మకాలు ఈ క్యూ2లో పుంజుకున్నాయి. పెళ్లి ముహూర్తాలు తక్కువగా ఉండటం, పుత్తడి ధరలు అధికంగా ఉండటం, పరిశ్రమకు రుణ లభ్యత కటకటగా ఉండటం, వినియోగదారుల డిమాండ్ బలహీనంగా ఉండటం వంటి ప్రతికూలతలు జ్యుయలరీ పరిశ్రమలో నెలకొన్నాయి. అయితే జ్యుయలరీ పరిశ్రమలో పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నా, కొత్త కలెక్షన్ ఆఫర్ల కారణంగా ఈ కంపెనీ మార్కెట్ వాటా పెరిగింది. గుల్నాజ్ బ్రాండ్ కింద విలువైన రాళ్లతో కూడిన ఆభరణాలను, మియా బ్రాండ్ కింద వెండి ఆభరణాల కలెక్షన్లను అందుబాటులోకి తెచ్చింది. వీటికి వినియోగదారుల నుంచి మంచి స్పందనే లభిస్తోంది. ఇక బ్రాండ్ ప్రచారం జోరుగా ఉండటం, కొత్త ఉత్పత్తుల ఆఫర్ల కారణంగా వాచ్ల సెగ్మెంట్ కూడా మంచి విక్రయాలను సాధించింది. మార్కెటింగ్ విస్తృతంగా ఉండటం, డిస్కౌంట్ల ధరల కారణంగా కళ్ల జోళ్ల విభాగం కూడా జోరుగానే వృద్ధి సాధించింది. ఈ క్యూ2లో ఈ కంపెనీ కొత్తగా ఆరు తనిష్క్ స్టోర్లను ప్రారంభించింది. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకూ కొత్తగా ఏర్పాటు చేసిన స్టోర్ల సంఖ్య 16కు పెరిగింది. కంపెనీ ఆఫర్ చేస్తున్న ‘స్కిన్న్’ బ్రాండ్.. డిపార్ట్మెంటల్ స్టోర్లలో అత్యధికంగా అమ్ముడయ్యే సెంట్ బ్రాండ్గా నిలిచింది. ఈ బ్రాండ్ కింద కంపెనీ కొత్తగా ఆఫర్ చేసిన అమల్పి బ్లూ మంచి అమ్మకాలు సాధిస్తోంది. సేమ్ స్టోర్స్ సేల్స్ గ్రోత్ (ఎస్ఎస్ఎస్జీ) జోరుగా ఉండనుండటంతో ఈ ఆర్థిక సంవత్సరం కంపెనీ ఆదాయం 20 శాతం పెరగగలదని, అలాగే మార్జిన్లు కూడా మంచి వృద్ధి సాధించగలవని అంచనా వేస్తున్నాం. రెండేళ్లలో షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) 28 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలదని భావిస్తున్నాం. గెయిల్ బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.332 టార్గెట్ ధర: రూ.450 ఎందుకంటే: గెయిల్ కంపెనీకి సంబంధించిన నాలుగు గ్యాస్ పైప్లైన్ల తుది టారిఫ్లను పెట్రోలియమ్ అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్(పీఎన్జీఆర్బీ) ఖరారు చేసింది. ఈ నాలుగు గ్యాప్ పైప్లైన్లలో ముఖ్యమైనదైన దహేజ్–ఉరాన్–పన్వేల్/దభోల్ పైప్లైన్ టారిఫ్ 54 శాతం పెరిగింది. ఇతర మూడు గ్యాప్ పైప్లైన్లు చిన్నవే అయినప్పటికీ, వీటి టారిఫ్లు 161–691 శాతం రేంజ్లో పెరిగాయి. ఈ టారిఫ్ల పెరుగుదల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంపెనీ షేర్వారీ ఆర్జన (ఈపీఎస్) 1 శాతం, అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం ఈపీఎస్ 4 శాతం వరకూ పెరుగుతాయని అంచనా. హజీరా–విజయ్పూర్–జగదీశ్పూర్(హెచ్వీజే), దహేజ్–విజయ్పూర్ పైప్లైన్(డీవీపీఎల్)లకు సంబంధించి ఒకే టారిఫ్ ప్లాన్ ఉండాలన్న గెయిల్ ప్రతిపాదనను పీఎన్జీఆర్బీ ఆమోదిస్తే, గెయిల్ పనితీరుపై దీర్ఘకాలంలో చెప్పుకోదగ్గ సానుకూల ప్రభావం చూపుతుంది. గ్యాస్ అమ్మకాలు నిలకడగా ఉండటం, పైప్లైన్ల విస్తరణ, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్(సీజీడీ) జోరు పెరుగుతుండటం, ఎల్పీజీ, పెట్రో కెమికల్స్ ధరలు పెరుగుతుండటం.. ఇవన్నీ సానుకూలాంశాలు. 2016–17లో రూ.48,902 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి కల్లా రూ.73,782 కోట్లకు పెరుగుతుందని అంచనా. అలాగే నికర లాభం రూ.3,503 కోట్ల నుంచి రూ.5,945 కోట్లకు పెరుగుతుందని భావిస్తున్నాం. -
కొత్త వ్యాపారాల్లోకి గెయిల్!
న్యూఢిల్లీ: గెయిల్ కంపెనీ ఇతర వ్యాపారాల్లోకి ప్రవేశించాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ గ్యాస్, పెట్రో కెమికల్స్ వ్యాపారాలను నిర్వహిస్తోంది. ఈ వ్యాపారాలు కాకుండా సౌరశక్తి ప్లాంట్ల ఏర్పాటు, ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన బ్యాటరీ చార్జింగ్ స్టేషన్ల నిర్మాణం, స్టార్టప్లలో పెట్టుబడులు, తదితర రంగాల్లోకి విస్తరించాలని భావిస్తోంది. ఈ వ్యాపారాల నిర్వహణకు కంపెనీ చార్టర్లో సవరణలు చేయాలి. అందుకోసం వాటాదారుల ఆమోదాన్ని గెయిల్ కోరింది. కంపెనీ ఎంఓఏలో (మెమొ రాండమ్ ఆఫ్ అసోసియేషన్) ప్రధాన లక్ష్యాల క్లాజులో ఆరు కొత్త సెక్షన్లను చేర్చడానికి ఆమోదం తెలిపాలని వాటాదారులకు పంపిన నోటీసులో గెయిల్ కోరింది. వచ్చే నెల 11న కంపెనీ 34వ వార్షిక సాధారణ సమావేశం జరగనుంది. స్టార్టప్లలో పెట్టుబడి... తమప్రధాన వ్యాపారాలైన నేచురల్ గ్యాస్, పెట్రో కెమికల్స్, ఎనర్జీ సంబంధిత స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు కంపెనీ పేర్కొంది. వీటితో పాటు ఆరోగ్య, సామాజిక, పర్యావరణ, రక్షణ, భద్రత సంబంధిత స్టార్టప్లలోనూ పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు వెల్లడించింది. ఈ స్టార్టప్లలో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఇన్వెస్ట్ చేస్తామని తెలిపింది. స్పెషల్ పర్పస్ వెహికల్స్(ఎస్పీవీ), ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(ఏఐఎఫ్), ఫండ్ ఆఫ్ ఫండ్స్(ఎఫ్ఓఎఫ్), ట్రస్ట్ల ద్వారా ఇన్వెస్ట్ చేయనున్నామని వివరించింది. ‘‘పర్యావరణ పరిరక్షణలో భాగంగా బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లను, చార్జింగ్ సర్వీసులను ఆరంభించాలనుకుంటున్నాం. సొంత వినియోగానికే కాకుండా, విక్రయానికి కూడా వెసులుబాటుండేలా సౌరశక్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. హైడ్రో కార్బన్ పైప్లైన్ల రంగంలో ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (ఈపీసీ), ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్(ఈపీసీఎమ్), ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ(పీఎమ్సీ)సేవలను అందించ గల సత్తా ఉంది. ఈ మేరకు అవకాశాలను అందిపుచ్చుకోవాలని కూడా చూస్తున్నాం’’ అని కంపెనీ తెలిపింది. గ్యాస్ మీటర్లు, సీఎన్జీ కిట్లు వంటి ఉపకరణాల తయారీ, పంపిణీ, మార్కెటింగ్లకు సంబంధించిన వ్యాపారంలో కూడా ప్రవేశించాలని ఈ కంపెనీ యోచిస్తోంది. గురువారం జీవిత కాల గరిష్టానికి చేరిన నేపథ్యంలో గెయిల్ షేర్లో శుక్రవారం లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. దీంతో ఈ కంపెనీ షేర్ బీఎస్ఈలో 1.6 శాతం క్షీణించి రూ.387 వద్ద ముగిసింది. -
సిటీ గ్యాసు బిడ్లలో అదానీ ముందంజ
న్యూఢిల్లీ: పట్టణాల్లో సహజవాయువు పంపిణీ ప్రాజెక్టులకు సంబంధించిన బిడ్లలో అదానీ గ్రూపు ముందంజలో నిలిచింది. 52 పట్టణాల్లో ఈ సంస్థ బిడ్లు వేసి టాప్ బిడ్డర్గా నిలిచింది. ప్రభుత్వరంగ గెయిల్ 30 పట్టణాల పట్ల ఆసక్తి చూపిస్తూ బిడ్లు వేసింది. ఇక, రిలయన్స్–బీపీ మాత్రం చివరి నిమిషంలో తప్పుకోవడం గమనార్హం. అదానీ గ్యాస్ లిమిటెడ్ 32 పట్టణాల్లో సొంతగాను, 20 పట్టణాల్లో ఐవోసీతో కలసి బిడ్లు వేసింది. దేశ వ్యాప్తంగా 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో ఉన్న 174 జిల్లాల్లోని పట్టణాలు, సమీప ప్రాంతాల్లో... పైపుల ద్వారా వంట గ్యాస్ సరఫరాకు సంబంధించి 86 పర్మిట్లకు తొమ్మిదో విడతలో భాగంగా ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించింది. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ ఢిల్లీలో ఇప్పటికే సీఎన్జీ సరఫరా చేస్తుండగా, మరో 13 పట్టణాల్లో అనుమతులకు బిడ్లు దాఖలు చేసింది. ఎస్సెల్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఏడు బిడ్లు దాఖలు చేసింది. గెయిల్, మహానగర్ గ్యాస్, గుజరాత్ స్టేట్ ప్రెటోలియం కార్ప్ (జీఎస్పీసీ) కూడా ఇందులో పాల్గొన్నాయి. అయితే, ఆర్ఐఎల్, బ్రిటన్కు చెందిన బీపీ 50: 50 జాయింట్ వెంచర్ ‘ఇండియా గ్యాస్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్’ మాత్రం బిడ్లు దాఖలు చేయలేదని విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి. ఈ తొమ్మిదో విడతకు ముందు ఎనిమిది దశల్లో కేంద్రం మొత్తం 91 భౌగోళిక ప్రాంతాలను కవర్ చేసే విధంగా లైసెన్స్లను జారీ చేసింది. ఇంద్రప్రస్థ గ్యాస్, గెయిల్ గ్యాస్ లిమిటెడ్ వంటివి వీటిని దక్కించుకున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన మేఘ ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ రెండు ప్రాంతాల్లో లైసెన్సులు దక్కించుకుని దాదాపుగా సరఫరాకు సిద్ధమయింది. మొత్తంగా ప్రస్తుతానికి 24 కోట్ల జనాభా నివసిస్తున్న ప్రాంతాలు ఈ సేవల పరిధిలోకి వచ్చాయి. ప్రాథమిక ఇంధన విభాగంలో సహజవాయువు వాటా ప్రస్తుతం 6 శాతంగా ఉంటే, దాన్ని 15 శాతానికి పెంచాలన్నది కేంద్రం లక్ష్యం. అలాగే, 2020 నాటికి కోటి ఇళ్లకు పైపుల ద్వారా వంట గ్యాస్ అందించాలన్నది మోదీ సర్కారు సంకల్పం. -
కాకినాడ ఓఎన్జీసీ క్రాకర్ యూనిట్పై నీలినీడలు
సాక్షి, అమరావతి : కాకినాడలో రూ.40,000 కోట్లతో హెచ్పీసీఎల్, గెయిల్తో కలసి ఏర్పాటు చేయదల్చిన క్రాకర్ యూనిట్ ఆర్థికంగా లాభసాటి కాదన్న ఆలోచనలో కంపెనీలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇంకా ఈ ప్రాజెక్టుపై ఎటువంటి చర్యలు తీసుకోలేదంటున్నారు ప్రభుత్వరంగ ఓఎన్జీసీ సీఎండీ శశి శంకర్. నాగాయలంక బావుల నుంచి గ్యాస్, చమురును వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించడానికి వచ్చిన శశిశంకర్ ‘సాక్షి’తో మాట్లాడారు. కేజీ బేసిన్లో పెట్టుబడుల దగ్గర నుంచి సామాజిక కార్యక్రమాల వరకు పలు అంశాలపై ‘సాక్షి’తో పంచుకున్న అభిప్రాయాలు ప్రత్యేకంగా.. రాష్ట్రంలో పెట్టుబడుల విస్తరణ గురించి వివరిస్తారా? ఓఎన్జీసీ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. కేజీ బేసిన్లో ఆఫ్షోర్ బావి కేజీ డబ్ల్యూఎన్ 98/2 ఒక్కదానిపైనే సుమారుగా రూ. 35,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాం. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు వేగంగా నడుస్తున్నాయి. అదే విధంగా నాగాయలంక బ్లాక్లో రూ. 2,800 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేశాం. ఇవి కాకుండా గడిచిన ఒక్క ఏడాదే 22 బావులను తవ్వాము. వచ్చే మూడేళ్లలో సహజవాయువు ఉత్పత్తిని రెట్టింపు చేయాలన్న లక్ష్యంలో ఆంధ్రప్రదేశ్ కీలకపాత్ర పోషించనుంది. మూడేళ్లలో గ్యాస్ ఉత్పత్తిని 24 బిలియన్ క్యూబిక్ మీటర్ల నుంచి 50 బిలియన్ క్యూబిక్ మీటర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కాకినాడలో క్రాకర్ ప్రాజెక్టు ప్రతిపాదన ఎంత వరకు వచ్చింది? గెయిల్, హెచ్పీసీఎల్తో కలసి రూ. 40,000 కోట్లతో క్రాకర్ యూనిట్ ఏర్పాటు చేయాలనుకున్నాం. కానీ పరిస్థితులు దీనికి అనుకూలంగా లేవు. ప్రారంభంలో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ గురించి ఆలోచించినా ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఆర్థికంగా లాభమా కాదా అన్నదానిపై ఇంకా చర్చిస్తున్నాం. ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదు. ఓఎన్జీసీ హెచ్పీసీఎల్ విలీనంపై... ఓఎన్జీసీలో హెచ్పీసీఎల్ విలీన ప్రతిపాదనను ఆపేశాము. చమురు ఉత్పత్తికి..విక్రయించే రిటైల్ సంస్థల వ్యాపారానికి చాలా తేడా ఉంది. అందుకే మా గ్రూపునకు చెందిన రిఫైనరీ, రిటైల్ సంస్థ ఎంఆర్పీఎల్ను హెచ్పీసీఎల్లో విలీనం చేయాలనుకుంటున్నాం. అంతర్జాతీయంగా చాలా దేశాల్లో కూడా చమురు ఉత్పత్తి సంస్థలు రిటైల్ వ్యాపారాన్ని వేరే సంస్థ ద్వారా చేస్తున్నాయి. మేము కూడా ఇక్కడే అదే విధానాన్ని అమలు చేయాలనుకుంటున్నాం. రాష్ట్రంలో అమలు చేస్తున్న సామాజిక కార్యక్రమాల గురించి... రాష్ట్రం నుంచి వస్తున్న లాభాల్లో రెండు శాతం కంటే ఎక్కువగానే సామాజిక కార్యక్రమాల కోసం వెచ్చిస్తున్నాం. గతేడాది రాష్ట్రంలో సామాజిక కార్యక్రమాల కోసం రూ. 67 కోట్లు వ్యయం చేశాము. ఈ కార్యక్రమం కింద 4,500 మరుగుదొడ్లు నిర్మించాం. గతేడాది రాజమండ్రి ఆన్సైట్ నుంచి ఓఎన్జీసీకి రూ. 306 కోట్ల లాభం వచ్చింది. అయినా ఆన్సైట్ యూనిట్ ఏకంగా రూ. 18 కోట్లు సామాజిక కార్యక్రమాలకు, మరో రూ. 14 కోట్లు స్వచ్ఛ భారత్ కార్యక్రమాల కింద వినియోగించాం. ఇవన్నీ మా సైట్లు ఉన్న గ్రామాల్లో అభివృద్ధి చేస్తున్న మౌలిక వసతులకు అదనం. ఈ మౌలిక వసుతల కల్పనను నిర్వహణ వ్యయం కిందే పరిగణిస్తున్నాం. -
మార్చి నాటికి గెయిల్ విభజన
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన గ్యాస్ మార్కెటింగ్, పంపిణీ దిగ్గజం గెయిల్ను వచ్చే ఏడాది మార్చి నాటికల్లా రెండు కంపెనీలుగా విభజించాలని కేంద్రం యోచిస్తోంది. గ్యాస్ మార్కెటింగ్ విభాగాన్ని ఒక కంపెనీగాను, పైప్లైన్ల నిర్వహణ విభాగాన్ని మరో సంస్థగాను ఏర్పాటు చేయనుంది. పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ బోర్డు (పీఎన్జీఆర్బీ) చైర్మన్ డీకే సరాఫ్ ఈ విషయం తెలిపారు. విభజన ప్రక్రియ ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు సరాఫ్ పేర్కొన్నారు. గెయిల్ ఇప్పటికే గ్యాస్ పైప్లైన్, మార్కెటింగ్ వ్యాపార విభాగాలకు సంబంధించిన ఖాతాలు వేర్వేరుగానే నిర్వహిస్తున్న నేపథ్యంలో విభజన ప్రక్రియ సులభతరంగానే ఉండగలదని ఆయన తెలిపారు. 1984లో ఓఎన్జీసీ నుంచి గ్యాస్ వ్యాపార కార్యకలాపాలను విడగొట్టి గెయిల్ ఏర్పాటు చేశారు. గ్యాస్ వినియోగాన్ని పెంచేందుకే: మరిన్ని ద్రవీకృత సహజ వాయువు టెర్మినల్స్ నిర్మించేందుకు, పైప్లైన్ నెట్వర్క్ను విస్తరించేందుకు అవసరమయ్యే భారీ పెట్టుబడులను ఆకర్షించడానికి.. అలాగే గ్యాస్ వినియోగదారుల సంఖ్యను గణనీయంగా పెంచడానికి గెయిల్ కార్యకలాపాల విభజన తోడ్పడగలదని భావిస్తోంది. ప్రస్తుతం చాలా మటుకు విద్యుత్ ప్లాంట్లు, సెరామిక్.. గ్లాస్ తదితర చిన్న పరిశ్రమలు ఖరీదైన, కాలుష్యకారకమైన నాఫ్తా, డీజిల్, బొగ్గు వంటి ఇంధనాలపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. అయితే, భవిష్యత్లో వీటిని గ్యాస్ వైపు మళ్లించేందుకు, గెయిల్తో సంబంధం లేకుండా నేరుగా గ్యాస్ను కొనుగోలు చేసుకునేందుకు తాజా విభజన తోడ్పడగలదని కేంద్రం భావిస్తోంది. -
గెయిల్, ఐవోసీ నుంచి ఓఎన్జీసీ ఔట్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలైన ఐవోసీ, గెయిల్లో తనకున్న వాటాలను విక్రయించడానికి ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) సిద్ధమయింది. ఇందుకోసం కేంద్రం నుంచి అనుమతి పొందింది. ‘‘మా ప్రతిపాదనకు కేంద్రం ఇటీవలే ఆమోదముద్ర వేసింది. అయితే షేర్ల విక్రయానికి సరైన సమయం కోసం వేచి చూస్తున్నాం’’ అని ఓఎన్జీసీ వర్గాలు తెలియజేశాయి. ఈ వాటాల విక్రయం ద్వారా వచ్చిన నిధులను హెచ్పీసీఎల్ కొనుగోలు కోసం ఓఎన్జీసీ ఉపయోగించుకోనుంది. దేశీయంగా అతి పెద్ద రిఫైనరీ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఓఎన్జీసీకి 13.77 శాతం వాటాలున్నాయి. మంగళవారం నాటి షేరు ధర ప్రకారం వీటి విలువ సుమారు రూ. 26,200 కోట్లు. ఇక గెయిల్ ఇండియాలో ఓఎన్జీసీకి రూ.3,847 కోట్ల విలువ చేసే 4.86 శాతం వాటాలున్నాయి. చమురు రిఫైనింగ్, మార్కెటింగ్ సంస్థ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్లో (హెచ్పీసీఎల్) కేంద్ర ప్రభుత్వానికి చెందిన 51.11 శాతం వాటాలను ఓఎన్జీసీ కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం రూ.36,915 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఓఎన్జీసీ దగ్గర ఇప్పటికే రూ.12,000 కోట్ల పైగా నగదు నిల్వలున్నాయి. హెచ్పీసీఎల్ కొనుగోలుకు సంబంధించి రూ. 18,060 కోట్ల రుణ సమీకరణ కోసం మూడు బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఓఎన్జీసీ తెలిపింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్లు ఇందులో ఉన్నాయని స్టాక్ ఎక్సే్చంజీలకు వివరించింది. పీఎన్బీ నుంచి రూ. 10,600 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ. 4,460 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ నుంచి రూ. 3,000 కోట్లు సమీకరిస్తున్నట్లు తెలిపింది. -
గ్యాస్ పైపులైన్లు వేయటానికే గెయిల్!
న్యూఢిల్లీ: సహజ గ్యాసు పైపులైన్ల నిర్మాణంపై గెయిల్ దృష్టి సారించాలని, గ్యాస్ మార్కెటింగ్ ఎవరైనా చేయగలరని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అన్నారు. గెయిల్ నుంచి గ్యాస్ మార్కెటింగ్ వ్యాపారాన్ని వేరు చేయనున్నట్టు వస్తున్న వార్తలను బలపరిచే విధంగా మంత్రి ప్రకటన ఉండడం గమనార్హం. అయితే, ప్రభుత్వం గెయిల్ను రెండుగా చేయనుందన్న సమాచారాన్ని మంత్రి ధ్రువీకరించడం, ఖండించడం వంటివేమీ చేయలేదు. మౌలిక సదుపాయాల కల్పనను పర్యావరణ అనుకూలమైన సహజ గ్యాసు రూపంలో అనుసంధానం కాని ప్రాంతాలకు తీసుకెళ్లడమే ప్రభుత్వ ప్రాధాన్యంగా చెప్పారు. దేశాన్ని గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 1984లో ఓఎన్జీసీ నుంచి గ్యాస్ వ్యాపారాన్ని వేరు చేస్తూ ఏర్పాటు చేసిందే గెయిల్. దేశవ్యాప్తంగా 11,000 కిలోమీటర్ల సహజ గ్యాసు పైపులైన్ నెట్వర్క్ ఈ సంస్థ పరిధిలో ఉంది. గెయిల్ నుంచి గ్యాస్ మార్కెటింగ్ వ్యాపారాన్ని వేరు చేయాలన్న అంశంపై ప్రభుత్వం ఇప్పటికే పలుసార్లు సమావేశాలు కూడా నిర్వహించగా, తుది నిర్ణయానికి రాలేదని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. -
‘గెయిల్’పై దిగ్గజాల కన్ను!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ(పీఎస్యూ) చమురు–గ్యాస్ రంగంలో విలీనాలు మరింత జోరందుకోనున్నాయి. పీఎస్యూ గ్యాస్ అగ్రగామి గెయిల్ను కొనుగోలు చేసేందుకు ఆయిల్ మార్కెటింగ్ దిగ్గజాలు ఆసక్తి చూపుతున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) ఈ విషయంలో పోటీపడుతున్నాయి. సహజవాయువు ప్రాసెసింగ్, పంపిణీ చేసే గెయిల్ను కొనుగోలు చేయడం ద్వారా సమగ్ర ఇంధన వనరుల సంస్థగా ఎదగాలని ఈ కంపెనీలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా ఐవోసీ, బీపీసీఎల్.. కేంద్ర చమురు శాఖకు తమ ప్రతిపాదనలు పంపించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే, గెయిల్ మాత్రం ప్రభుత్వ రంగ గ్యాస్, చమురు దిగ్గజం ఓఎన్జీసీలో విలీనమే సరైన నిర్ణయం కాగలదని భావిస్తోంది. గ్యాస్ ఉత్పత్తి చేసే దిగ్గజానికి తమ రవాణా, మార్కెటింగ్ నెట్వర్క్ తోడైతే.. సమగ్రమైన ఇంధన సంస్థగా ఎదగవచ్చని యోచిస్తోంది. గెయిల్లో ప్రభుత్వానికి 54.89 శాతం వాటా ఉంది. దీని విలువ సుమారు రూ. 46,700 కోట్లు. ఈ ఏడాది బడ్జెట్లో బీజం... దేశ, విదేశాల్లోని ప్రైవేట్ రంగ చమురు, గ్యాస్ దిగ్గజ సంస్థలకు దీటుగా ప్రభుత్వ రంగంలోనూ భారీ స్థాయి కంపెనీల రూపకల్పన దిశగా కసరత్తు చేస్తున్నట్లు 2017–18 బడ్జెట్ ప్రసంగంలో పేర్కొనడం ద్వారా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. విలీనాల అవకాశాలను సూచనప్రాయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఒక పీఎస్యూని మరో పీఎస్యూలో విలీనం చేయడం ద్వారా వాటిపై నియంత్రణ అధికారం కోల్పోకుండానే.. వాటాల విక్రయం ద్వారా నిధులు సమీకరించుకోవచ్చన్నది ప్రభుత్వ వ్యూహం. అదే సమయంలో అంతర్జాతీయ దిగ్గజాలతో పోటీపడే దీటైన కంపెనీల సృష్టికి, తద్వారా చమురు రేట్లలో హెచ్చుతగ్గులను ఎదుర్కొనడానికి ఇది ఉపయోగపడగలదని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే హెచ్పీసీఎల్ విలీన ప్రక్రియలో ఓఎన్జీసీ.. ఓఎన్జీసీ ప్రస్తుతం చమురు రిఫైనింగ్, ఇంధన మార్కెటింగ్ సంస్థ హెచ్పీసీఎల్ను కొనుగోలు చేసే పనిలో ఉంది. ఈ ప్రతిపాదనకు క్యాబినెట్ ఇప్పటికే ఆమోదముద్ర వేసింది. హెచ్పీసీఎల్లో ప్రభుత్వానికి ఉన్న 51.11% వాటాలను ఓఎన్జీసీ కొనుగోలు చేస్తోంది. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఈ వాటా విలువ దాదాపు రూ. 33,000 కోట్లుగా ఉంటుంది. ఓఎన్జీసీ– హెచ్పీసీఎల్ డీల్ పూర్తయిన తర్వాతే.. గెయిల్ అంశాన్ని ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతిపాదనలివీ.. దేశీయంగా అతి పెద్ద చమురు రిఫైనింగ్, ఇంధన మార్కెటింగ్ సంస్థ అయిన ఐవోసీ.. మరో రిఫైనర్ని లేదా గెయిల్ వంటి గ్యాస్ కంపెనీని కొనుగోలు చేయాలని యోచిస్తోంది. నగరాల్లో గ్యాస్ సరఫరా ప్రాజెక్టులు, గ్యాస్ మార్కెటింగ్ తదితర కార్యకలాపాలతో పాటు ఎల్ఎన్జీ టెర్మినల్స్ నిర్మాణం మొదలైనవి.. గెయిల్ వంటి గ్యాస్ సంస్థ కొనుగోలుకు తోడ్పడే అంశాలని భావిస్తోంది. దేశంలోనే అతి పెద్ద గ్యాస్ రవాణా, మార్కెటింగ్ కంపెనీ అయిన గెయిల్ని దక్కించుకుంటే సమగ్రమైన ఇంధన దిగ్గజంగా ఎదగవచ్చని యోచిస్తోంది. మరోవైపు, గ్యాస్ వ్యాపార విభాగంలో దిగ్గజంగా ఎదగడంపై కసరత్తు చేస్తున్న బీపీసీఎల్ కూడా గెయిల్పై తమ ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచింది. కొనుగోలు చేసేందుకు తమ మొదటి ప్రాధాన్యత గెయిల్కే ఉంటుందని పేర్కొంది. లేని పక్షంలో రెండో ప్రాధాన్యం కింద ఆయిల్ ఇండియా (ఆయిల్) ఉంటుందని వివరించింది. ప్రస్తుతం ఆయిల్లో కేంద్రానికి 66.13 శాతం వాటాలు ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం దీని విలువ రూ. 18,000 కోట్లు ఉంటుంది. ఈ విలీనాలు పూర్తయితే, ప్రభుత్వ రంగంలో మొత్తం చమురు–గ్యాస్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల సంఖ్య మూడుకు చేరే అవకాశం ఉంది. -
గెయిల్ లాభం రూ.1,310 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ గ్యాస్ యుటిలిటీ కంపెనీ, గెయిల్ ఇండియా నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 42 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.925 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.1,310 కోట్లకు చేరుకున్నట్లు గెయిల్ ఇండియా తెలిపింది. గ్యాస్ రవాణా, మార్కెటింగ్ వ్యాపారం వృద్ధి కారణంగా ఈ స్థాయిలో నికర లాభం సాధించామని పేర్కొంది. ఆదాయం రూ.11,878 కోట్ల నుంచి 4.5 శాతం వృద్ధితో రూ.12,410 కోట్లకు పెరిగింది. ఇబిటా 35 శాతం వృద్ధితో రూ.2,070 కోట్లకు, ఇబిటా మార్జిన్ 12.9 శాతం నుంచి 16.7 శాతానికి పెరిగాయి. భారత్లో అతి పెద్ద నేచురల్ గ్యాస్ పైప్లైన్ నెట్వర్క్ను నిర్వహిస్తున్న ఈ కంపెనీ గ్యాస్ ట్రాన్స్మిషన్ వ్యాపారంలో ఈ క్యూ2లో రూ.853 కోట్ల స్థూల లాభం సాధించింది. గత క్యూ2లో ఈ స్థూల లాభం రూ.661 కోట్లుగా ఉంది. మరోవైపు గ్యాస్ మార్కెటింగ్ వ్యాపార ఆదాయం 27 శాతం వృద్ధితో రూ.420 కోట్లకు పెరగ్గా, పెట్రోకెమికల్ వ్యాపార ఆదాయం సగానికి తగ్గి, రూ.89 కోట్లకు పడిపోయిందని పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో గెయిల్ షేర్ 0.2% లాభంతో రూ.456 వద్ద ముగిసింది. -
గెయిల్, ఐవోసీలో ఓఎన్జీసీ వాటా విక్రయం..!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం ఓఎన్జీసీ ప్రస్తుతం రిఫైనరీ సంస్థ హెచ్పీసీఎల్ను కొనుగోలు చేసేందుకు అవసరమైన నిధులను సమీకరించుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, గెయిల్ ఇండియాలో తనకున్న వాటాలను విక్రయించనున్నట్లు కంపెనీ చైర్మన్ డీకే సరాఫ్ చెప్పారు. దేశీయంగా అతి పెద్ద రిఫైనర్ అయిన ఐవోసీలో ఓఎన్జీసీకి 13.77 శాతం వాటా ఉంది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం దీని విలువ సుమారు రూ. 26,600 కోట్లు. ఇక గెయిల్లో ఉన్న 4.87 శాతం వాటాల విలువ దాదాపు రూ.1,637 కోట్లు. హెచ్పీసీఎల్లో 51.11 శాతం ప్రభుత్వ వాటాలను కొనుగోలు చేసేందుకు ఓఎన్జీసీకి సుమారు రూ.32,000 కోట్లు కావాలి. స్టాండెలోన్ ప్రాతిపదికన తమకి రుణభారమేదీ లేనందున మార్కెట్ నుంచైనా సమీకరిస్తామని, అలాగే మిగతా చమురు కంపెనీల్లో వాటాలను కూడా విక్రయించి.. హెచ్పీసీఎల్ కొనుగోలుకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటామని సరాఫ్ వివరించారు. సంస్థ వద్ద ప్రస్తుతం రూ.10,000 కోట్ల నగదు నిల్వ లుండగా, రూ. 25,000 కోట్ల మేర రుణ సమీకరణ చేసేందుకు కంపెనీ షేర్హోల్డర్లు ఆమోదం తెలిపారని చెప్పారాయన. డిసెంబర్లోగా డీల్ ముగిసే అవకాశం ఉందన్నారు. యాజమాన్య బదలాయింపు మొదలైనవేమీ లేనందున ఓపెన్ ఆఫర్ ప్రకటించాల్సిన అవసరం ఉండదని ఆయన స్పష్టం చేశారు. -
గెయిల్ నికరలాభంలో 69 శాతం క్షీణత
న్యూఢిల్లీ: రత్నగిరి పవర్ప్లాంట్ విలువను తగ్గించి, ఆ మేరకు నష్టాన్ని ఖాతాల్లో నమోదుచేయడంతో ప్రభుత్వ రంగ గెయిల్ నికరలాభం 2017 మార్చితో ముగిసిన త్రైమాసికంలో 69% క్షీణతతో రూ. 260 కోట్లకు తగ్గింది. గతేడాది ఇదేకాలంలో కంపెనీ నికరలాభం రూ. 983 కోట్లు. జాయింట్ వెంచర్ అయిన రత్నగిరి ప్లాంటులో గెయిల్ పెట్టుబడి రూ. 974 కోట్లుకాగా, అందులో రూ. 783 కోట్లను ఇంపైర్మెంట్ నష్టంగా ఖాతాల్లో చూపించినట్లు గెయిల్ తెలిపింది. కాగా ముగిసిన త్రైమాసికంలో కంపెనీ టర్నోవర్ రూ. 11,738 కోట్ల నుంచి రూ. 13,643 కోట్లకు పెరిగింది. కాగా ముగిసిన త్రైమాసికంలో తమ వ్యాపార విభాగాలన్నింటిలోనూ వృద్ధి సాధించామని, పెట్రోకెమికల్స్ అమ్మకాలు 59 శాతం, నేచురల్ గ్యాస్ మార్కెటింగ్ పరిమాణం 11%, ట్రాన్స్మిషన్ పరిమాణం 6% వృద్ధి చెందినట్లు గెయిల్ ప్రకటించింది. కంపెనీ బోర్డు షేరుకు రూ. 2.7 చొప్పున తుది డివిడెండును సిఫార్సు చేసింది. -
గెయిల్ బోనస్ షేర్లు
• ప్రతి మూడు షేర్లకు ఒక షేర్ బోనస్ • ఒక్కో షేర్కు రూ.8.5 మధ్యంతర∙డివిడెండ్ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ గ్యాస్ సంస్థ.. గెయిల్ బోనస్ షేర్లను ఇవ్వనుంది. రూ.10 ముఖవిలువ గల ప్రతి 3 షేర్లకు 1 షేర్ను బోనస్గా ఇవ్వడానికి డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. దీనికి వాటాదారుల ఆమోదం పొందాల్సి ఉంది. ఇక ఈ ఆర్థిక సంవత్సరానికి 85% (ఒక్కో షేర్కు రూ.8.50) మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. బోనస్ షేర్ల జారీతో కంపెనీ చెల్లించిన వాటా మూలధనం రూ.1,268 కోట్ల నుంచి రూ.1,691 కోట్లకు పెరుగుతుంది. దాదాపు పదేళ్ల తర్వాత గెయిల్ బోనస్ షేర్లను జారీ చేస్తోంది. 2008, అక్టోబర్లో ప్రతి రెండు షేర్లకు ఒక షేర్ను బోనస్గా గెయిల్ జారీ చేసింది. స్టాక్ మార్కెట్లో లిస్టయిన తర్వాత బోనస్ షేర్లనివ్వడం ఇది రెండోసారి. మరోవైపు రూపీ బాండ్ల ద్వారా రూ.750 కోట్ల సమీకరణకు బోర్డ్ ఆమోదం తెలిపింది. -
‘గెయిల్’లో 73ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు
గెయిల్(ఇండియా) లిమిటెడ్.. వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలను గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(గేట్)–2017 స్కోర్ ఆధారంగా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలు: కెమికల్–23(ఓసీ–14, ఎస్సీ–1, ఎస్టీ–1, ఓబీసీ–7); మెకానికల్–15(ఓసీ–10, ఎస్టీ–2, ఓబీసీ–3); ఎలక్ట్రికల్–15(ఓసీ–8, ఎస్సీ–2, ఎస్టీ–2, ఓబీసీ–3); ఇన్స్ట్రుమెంటేషన్–10(ఓసీ–7, ఎస్టీ–1, ఓబీసీ–2); సివిల్–5(ఓసీ–3, ఎస్టీ–1, ఓబీసీ–1); బిజినెస్ ఇన్ఫర్మేషన్ సిస్టం–5(ఓసీ–3, ఎస్సీ–1, ఓబీసీ–1). వేతనం: రూ.24,900–50,500 పేస్కేల్ ఉంటుంది. విద్యార్హత: సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 65 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. గరిష్ట వయసు: 2017 జనవరి 20 నాటికి 28 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: గేట్–2017 స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి గ్రూప్ డిస్కషన్/పర్సనల్ ఇంటర్వూ్య/రెండూ నిర్వహిస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్. ఒక అభ్యర్థి ఒక డిసిప్లెయిన్కే దరఖాస్తు చేయాలి. దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 17 వెబ్సైట్: www.gailonline.com ‘ఐఐటీ–ఖరగ్పూర్’లో 121 నాన్ టీచింగ్ పోస్టులు ఖరగ్పూర్(పశ్చిమ బెంగాల్)లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ).. వివిధ ఉద్యోగాల నియామకానికి ప్రకటన విడుదల చేసింది. ఇందులో ప్రస్తుత ఖాళీలతోపాటు గతంలో భర్తీ కాకుండా మిగిలిన (బ్యాక్లాగ్) పోస్టులూ ఉన్నాయి. పోస్టుల వారీ వేకెన్సీ: అసిస్టెంట్ ఇంజనీర్/ఆర్కిటెక్ట్–1; ఎగ్జిక్యూటివ్–8; జూనియర్ ఇంజనీర్/ఆర్కిటెక్ట్–4; జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్–16; జూనియర్ ఎగ్జిక్యూటివ్–25; జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్–4; ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్–3; సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్–2; మెడికల్ లేబొరేటరీ టెక్నీషియన్ (పాథాలజీ/రేడియోలజీ/ఫిజియోథెరపీ)–4; స్టాఫ్ నర్స్–5; అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ (గ్రేడ్–2)–2; జూనియర్ టెక్నీషియన్/లేబొరేటరీ అసిస్టెంట్–36; జూనియర్ అసిస్టెంట్–6; సెక్యూరిటీ ఇన్స్పెక్టర్–2; డ్రైవర్(గ్రేడ్–2)–3. (క్లిక్ చేయండి : ఐఓసీఎల్లో 362 అప్రెంటీస్ పోస్టులు కోసం) వేతనం: అసిస్టెంట్ ఇంజనీర్/ఆర్కిటెక్ట్ నుంచి అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ వరకు రూ.9,300–34,800+గ్రేడ్పే రూ.4,200. మిగిలిన పోస్టులకు రూ.5,200–20,200+గ్రేడ్పే రూ.2,000. విద్యార్హత: ఎగ్జిక్యూటివ్: డిగ్రీ, సంబంధిత కొలువులో 8 ఏళ్ల అనుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం; జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్: సంబంధిత ఇంజనీరింగ్ సబ్జెక్టులో మూడేళ్ల డిప్లొమా/డిగ్రీ/తత్సమానం, సీనియర్ టెక్నీషియన్గా 8 ఏళ్ల అనుభవం; జూనియర్ ఎగ్జిక్యూటివ్: డిగ్రీ, సీనియర్ అసిస్టెంట్గా 8 ఏళ్ల అనుభవం. కంప్యూటర్ పరిజ్ఞానం; స్టాఫ్ నర్స్: ఇంటర్మీడియెట్, జీఎన్ఎం, ఏడాది అనుభవం; జూనియర్ టెక్నీషియన్/లేబొరేటరీ అసిస్టెంట్: డిగ్రీ(సైన్స్)/సంబంధిత ఇంజనీరింగ్ సబ్జెక్టులో మూడేళ్ల డిప్లొమా, వైర్మ్యాన్ లైసెన్స్/పర్మిట్ ఉండాలి; జూనియర్ అసిస్టెంట్: డిగ్రీ, 40 డబ్ల్యూపీఎం వేగంతో కంప్యూటర్పై కంపోజింగ్ (టైపింగ్) చేయగలగాలి. గరిష్ట వయోపరిమితి: పోస్టును బట్టి 30–45 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: రాత పరీక్ష/ట్రేడ్ టెస్ట్ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసి, అప్లికేషన్ హార్డ్ కాపీని అసిస్టెంట్ రిజిస్ట్రార్కు పంపాలి. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేయాలనుకుంటే దరఖాస్తులను విడివిడిగా పంపాల్సి ఉంటుంది. చివరి తేది: ఆన్లైన్లో అప్లై చేసేందుకు, హార్డ్ కాపీ పంపేందుకు: జనవరి 31 వెబ్సైట్: iitkgp.ac.in -
గెయిల్గ్యాస్ లీకై ఇద్దరు మృతి
-
పేలిన గెయిల్ గ్యాస్ పైప్లైన్
సూర్యాపేట: ప్రమాదవశాత్తూ గెయిల్కు చెందిన గ్యాస్ పైప్లైన్ లీకవ్వడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం నల్లగొండ జిల్లా సూర్యాపేట రూరల్ మండలం ఇమాంపేట గ్రామ సమీపంలో ని గెయిల్ పరిశ్రమలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... ఐదుగురు కూలీలు శనివారం గెయిల్ పైప్లను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తూ పైప్లకు ఉన్న ఫిన్ ఊడిపోవడంతో ఒక్కసారిగా గ్యాస్ పైకి ఎగిసిపడింది. దీంతో అక్కడున్న కూలీలు వెళ్లి గోడకు బలంగా ఢీ కొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిని హైదరాబాద్కు చెందిన రమేష్, రోషన్లుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన కుడకుడకు చెందిన వెంకన్నను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. మిగిలిన ఇద్దరు వ్యక్తులను స్థానిక మెట్రో ఆస్పత్రిలో చేర్పించగా వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. వీరిద్దరిని సైతం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించనున్నారు. సంఘటనా స్థలాన్ని ఆర్డీవో శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. కాగా ఈ ప్రమాదం గురించి మాట్లాడేందుకు గెయిల్ అధికారులు ఎవరూ అందుబాటులో లేరు. -
'గెయిల్' హామీని నిలబెట్టుకోవాలి
మామిడికుదురు: తూర్పు గోదావరి జిల్లాలో నగరం గ్రామ పంచాయతీని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామన్న హామీని గెయిల్ యాజమాన్యం నిలబెట్టుకోవాలని గ్రామ అభివృద్ధి కమిటీ డిమాండ్ చేసింది. గత ఏడాది జిల్లాలోని నగరం గ్రామంలో గత ఏడాది గ్యాస్ పైప్లైన్ లీకై అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఆ సందర్భంగా నగరం గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని గెయిల్ యాజమాన్యం వాగ్దానం చేసింది. కానీ హామీని అమలు చేయకపోవడంతో గ్రామస్తులు గత నాలుగు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ దీక్షలకు వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు కుడిపూడి చిట్టబ్బాయి సంఘీభావం తెలిపారు. -
మార్కెట్లకు బ్లాక్ ‘వీక్’
⇒ఈ వారం 1100 పాయింట్లు హుష్ ⇒మూడేళ్లలో ఇదే అత్యధిక నష్టం ⇒తాజాగా 251 పాయింట్లు పతనం ⇒27,351 వద్ద ముగిసిన సెన్సెక్స్ ఈ వారం స్టాక్ మార్కెట్లకు బ్లాక్ ‘వీక్’గా నిలిచింది. మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ తాజాగా 251 పాయింట్లు పతనంకావడంతో వారం మొత్తంగా 1,107 పాయింట్లు(దాదాపు 4%) కోల్పోయింది. గత మూడేళ్ల కాలంలో ఇదే అత్యధిక నష్టంకాగా, ఇంతక్రితం 2011 డిసెంబర్లో మాత్రమే ఈ స్థాయిలో నష్టపోయింది. వెరసి సెన్సెక్స్ 27,351 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 69 పాయింట్లు క్షీణించి 8,224 వద్ద స్థిరపడింది. బీఎస్ఈలో అన్ని రంగాలూ నష్టపోగా, ప్రధానంగా ఆయిల్ గ్యాస్, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, మెటల్ రంగాలు 2.5-1.5% మధ్య వెనకడుగు వేశాయి. అక్టోబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ), నవంబర్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు మరోసారి అమ్మకాలకే ప్రాధన్యమివ్వడం గమనార్హం. అమెరికా వడ్డీ పెంపు భయాలు అంచనాలకంటే ముందుగానే అమెరికా వడ్డీ రేట్ల పెంపు ఉండవచ్చునన్న భయాలు ఇన్వెస్టర్లను అమ్మకాలవైపు ఉసిగొల్పుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు ముడిచమరు ధరల పతనానికి కారణమైన అంచనాలు సైతం ఆందోళనలు పెంచుతున్నట్లు తెలిపారు. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు సైతం 1.5% స్థాయిలో నీరసించాయి. ఆయిల్ షేర్లు డీలా సెన్సెక్స్లో ఆయిల్ దిగ్గజాలు గెయిల్, ఓఎన్జీసీ, రిలయన్స్ 4.5-2.5% మధ్య పతనంకాగా, మెటల్ షేర్లు టాటా స్టీల్, సెసాస్టెరిలైట్ 4-3% మధ్య క్షీణించాయి. ఈ బాటలో భెల్, హెచ్డీఎఫ్సీ, ఎల్అండ్టీ సైతం 3-2% మధ్య తిరోగమించాయి. అయితే మరోపక్క మారుతీ, భారతీ, ఇన్ఫోసిస్ 1% స్థాయిలో బలపడ్డాయి. -
గెయిల్ తప్పిదాలే కారణం
-
గెయిల్ తప్పిదాలే కారణం
‘నగరం’ పేలుడుపై స్పష్టం చేసిన విచారణ కమిటీ నివేదిక న్యూఢిల్లీ: తూర్పుగోదావరి జిల్లా నగరం గ్రామంలో జూన్ 27న జరిగిన విస్ఫోటనానికి ప్రభుత్వరంగ సంస్థ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా(గెయిల్) తప్పిదాలే కారణమని చమురు మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన విచారణ కమిటీ తేల్చింది. ఈ ఘటనలో 22 మంది మృతి మరణించడం తెలిసిందే. దీనిపై విచారణకు చమురు మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి(రిఫైనరీస్) రాజేష్కుమార్ సింగ్ సారథ్యంలో ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను సమర్పించింది. వినియోగదారులకు డ్రై గ్యాస్ సరఫరా కోసం తాటిపాక-కొండపల్లి పైప్లైనును గెయిల్ నిర్మించింది. అయితే ఈ పైప్లైనులో నీటితో కూడిన, అధికంగా మండే స్వభావం కల హైడ్రోకార్బన్ల మిశ్రమంతో కూడిన సహజవాయువు సరఫరా అవుతుండడంతో పైపులైను తుప్పుపట్టిపోయి.. అది లీకేజీకి దారితీసిందని, తద్వారా వెలువడిన గ్యాస్ వాతావరణంలోకి దట్టంగా వ్యాపించి.. పేలుడుకు కారణమైందని నివేదిక వెల్లడించింది. ఈ పేలుడు వ్యవహారానికి వ్యక్తిగతంగా ఎవరు కారణమనేది నిర్ధారించడం కష్టసాధ్యమని తెలిపింది. అయితే అత్యధిక పీడనంతో సహజవాయువు సరఫరా జరిగే ఈ పైపులైన్లను పదేపదే మరమ్మతు చేయడంలో గెయిల్ సరైన విధానాలు పాటించకపోవడం ఈ పేలుడుకు దారితీసిన కారణాల్లో ఒకటని తేల్చింది. సహజవాయువుతోపాటు కార్బన్ డైఆకై ్సడ్, నీరు, సల్ఫర్ పైపులైన్లలో సరఫరా అవుతుండడంతో కాలక్రమంలో పైపులైను తుప్పుపట్టిందని తెలిపింది. సహజవాయువు నుంచి నీటిని, హైడ్రోకార్బన్ ద్రవాల మిశ్రమాన్ని తొలగించేందుకోసం పైపులైన్ ప్రారంభమయ్యే తాటిపాక వద్ద గ్యాస్ డీహైడ్రేషన్ యూనిట్(జీడీయూ)ను ఏర్పాటు చేస్తానన్న తన హామీని గెయిల్ నిలుపుకోలేదని తప్పుపట్టింది. అదే కనుక ఏర్పాటైనట్లయితే పైపులైను కోతకు గురికాకుండా నివారించడానికి, లీకేజీని నిరోధించడానికి వీలయ్యేదని తెలిపింది. ఇవీ సిఫార్సులు..: పైపులైన్ల నుంచి స్వచ్ఛమైన సహజవాయువు సరఫరా అయ్యేలా చూడాలి. ఇందుకుగాను అందులో ఉండే నీటిని, మండేస్వభావం కల హైడ్రోకార్బన్ ద్రవాల మిశ్రమాన్ని తొలగించేందుకు వీలుగా గ్యాస్ డీహైడ్రేషన్ సదుపాయాన్ని ఏర్పాటు చేయాలి. పైపులైన్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుండాలి. లీకేజీలను కనిపెట్టేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. నిర్వహణపరమైన వైఫల్యాలపై వివిధ స్థాయిల్లో గెయిల్ అంతర్గత విచారణను తప్పక పూర్తి చేయాలి. లోపాలకు బాధ్యులెవరో గుర్తించాలి. జగన్ కేసులో మరో చార్జిషీట్ సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల కేసులో సీబీఐ మరో చార్జిషీట్ దాఖలు చేసింది. ఇందూ ప్రాజెక్టుకోసం రాష్ట్ర హౌసింగ్ బోర్డుకు సంబంధించిన భూములను కేటాయింపు చేయడంపై ఈ చార్జిషీట్ సమర్పించింది. సీబీఐ ఎస్పీ చంద్రశేఖర్.. చార్జిషీట్ ప్రతిని మంగళవారం ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగికి అందజేశారు. రెండు పెట్టెల్లో అనుబంధ పత్రాలను కోర్టుకు సమర్పించారు. ఇందూ ప్రాజెక్టుకు భూకేటాయింపుల్లో క్విడ్ప్రోకో జరిగిందని సీబీఐ ఆరోపించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సీబీఐ 2013 సెప్టెంబర్ 17న 10వ చార్జిషీట్ దాఖలు చేయడం తెలిసిందే. తాజా చార్జిషీట్తో కలిపి ఈ కేసులో సీబీఐ ఇప్పటికి 11 చార్జిషీట్లు దాఖలు చేసింది. 10వ చార్జిషీట్ దాఖలు చేసిన దాదాపు ఏడాది తర్వాత ఈ చార్జిషీట్ దాఖలు చేయడం గమనార్హం. ఇందులో నిందితులుగా వైఎస్ జగన్మోహన్రెడ్డి, వి.విజయసాయిరెడ్డి, ఎస్ఎన్ మొహంతి, ఐ.శ్యాంప్రసాద్రెడ్డి, ఇందూ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, వైవీ సుబ్బారెడ్డి, వీవీ కృష్ణప్రసాద్, ఛిడ్కో ప్రైవేట్ లిమిటెడ్, వసంత ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇందూ ఈస్ట్రన్ ప్రొవిన్స్, జితేంద్ర విర్వానీ, ఎంబసీ రియల్టర్స్, ఇందూ రాయల్ హోం ప్రైవేట్ లిమిటెడ్, కార్మెల్ ఏషియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్లను పేర్కొంది. సీబీఐ కోర్టులో హాజరైన జగన్: తన కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి బాలయోగి ఎదుట హాజరయ్యారు. తదుపరి విచారణను ఈ నెల 23కు జడ్జి వాయిదా వేశారు. కాగా వైఎస్ జగన్ బెంగళూరు వెళ్లేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతించింది. మంగళవారం నుంచి డిసెంబర్ 31 వరకు ఇందుకు అనుమతినిస్తూ న్యాయమూర్తి బాలయోగి ఉత్తర్వులు జారీచేశారు. బెంగళూరు వెళ్లే ముందు కోర్టుకు సమాచారమివ్వాలని షరతు విధించారు. -
6 రోజుల తర్వాత నష్టాలు
ఆరు రోజుల వరుస లాభాల తరువాత మార్కెట్లు మళ్లీ నష్టపోయాయి. సెన్సెక్స్ 106 పాయింట్లు క్షీణించి 26,314 వద్ద ముగిసింది. గత ఆరు రోజుల్లో 1,091 పాయింట్లు లాభపడ్డ కారణంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ కోసం అమ్మకాలు చేపట్టినట్లు నిపుణులు విశ్లేషించారు. ఇక నిఫ్టీ సైతం 22 పాయింట్లు తగ్గి 7,875 వద్ద నిలిచింది. మంగళవారం ఇంట్రాడేలో సెన్సెక్స్ 26,530 వద్ద, నిఫ్టీ 7,918 వద్ద కొత్త రికార్డులు నెలకొల్పిన సంగతి తెలిసిందే. దేనా బ్యాంక్, ఓబీసీ డీలా కస్టమర్ల ఫిక్స్డ్ డిపాజిట్ సొమ్ము రూ. 439 కోట్లను దుర్వినియోగ పరిచాయన్న ఆరోపణలతో దేనా బ్యాంక్(రూ. 256 కోట్లు), ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(రూ. 180 కోట్లు)లపై ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆడిట్కు ఆదేశించిందన్న వార్తలు ఈ బ్యాంక్ షేర్లను పడగొట్టాయి. దేనా బ్యాంక్ 5%, ఓబీసీ 3.5% చొప్పున పతనమయ్యాయి. ఫార్మా, స్మాల్క్యాప్ షేర్ల హవా మార్కెట్ నష్టపోయినప్పటికీ బీఎస్ఈలో హెల్త్కేర్ ఇండెక్స్ 3% ఎగసింది. మార్కెట్ల ట్రెండ్కు విరుద్ధంగా స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా 1% బలపడింది. -
చమురు శాఖకు ఎదురుదెబ్బ..
న్యూఢిల్లీ: కృష్ణా గోదావరి బేసిన్లో గ్యాస్ ఉత్పత్తి లక్ష్యాలను సాధించలేకపోయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ను వ్యయ రికవరీలో అడ్డుకోవాలన్న చమురు శాఖ యత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అనుకున్న ప్రకారం కేజీ బేసిన్లో గ్యాస్ను ఉత్పత్తి చేసి ఉంటే ప్రభుత్వానికి 11.53 కోట్ల డాలర్ల లాభం వచ్చి ఉండేదని చమురు శాఖ లెక్కగట్టింది. ఈ మేరకు రిలయన్స్కు చెల్లించాల్సిన మొత్తంలో 11.5 కోట్ల డాలర్లను తగ్గించాలని గెయిల్, చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీఎల్)లను చమురు శాఖ కోరింది. ఇదే విషయాన్ని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గత నెలలో పార్లమెంటులో వెల్లడించారు కూడా. అయితే, రిలయన్స్ నుంచి కొనుగోలు చేసిన ముడిచమురు, గ్యాస్లకు తాము చెల్లించాల్సిందేమీ లేదనీ, కనుక 11.5 కోట్ల డాలర్ల చెల్లింపులను నిలిపివేయడం సాధ్యంకాదనీ ఓఎన్జీసీ, సీపీసీఎల్ ఆశక్తతను వ్యక్తంచేశాయి. 2009 మార్చి నుంచి 2014 ఏప్రిల్ వరకు కేజీ డీ6 బ్లాకు నుంచి క్రూడ్ను తాము కొనుగోలు చేసినట్లు సీపీసీఎల్ పేర్కొంది. ఆ తర్వాత చమురు కొనుగోలు టెండరును ఆర్ఐఎల్ జామ్నగర్ రిఫైనరీస్ చేజిక్కించుకోవడంతో తాము రిలయన్స్కు చెల్లించాల్సిన బాకీలేవీ లేవని చమురు శాఖకు తెలిపింది. కేజీ డీ6లో ఉత్పత్తి అయ్యే గ్యాస్లో రోజుకు 2.594 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ను తమకు కేటాయించారని గెయిల్ పేర్కొంది. అయితే, ఆ బ్లాకులో గ్యాస్ ఉత్పత్తి తగ్గిపోవడంతో గతేడాది జూన్ నాటికే తమకు సరఫరా ఆగిపోయిందని వివరించింది. గ్యాస్ కొనుగోలు ఒప్పందం గడువు కూడా గత మార్చి 31తో ముగిసిందని తెలిపింది. తాజా పరిణామాల నేపథ్యంలో చమురు శాఖ ముందు రెండు మార్గాలున్నాయి. మొదటిది జామ్నగర్ రిఫైనరీస్కు క్రూడ్ ఆయిల్ అమ్మకాన్ని ఆపేసి, దాన్ని సీపీసీఎల్ కొనేలా చేయడం. అయితే ఇందుకు కొంత కాలం పడుతుంది. రెండో మార్గం.. కేజీ డీ6లో ఉత్పత్తయ్యే గ్యాస్ అంతటినీ కొనుగోలు చేస్తున్న ఎరువుల కంపెనీలను 11.50 కోట్ల డాలర్ల చెల్లింపులను నిలిపివేయాలని కోరడం. అయితే, ఇది సంక్లిష్టమైన వ్యవహారమని సంబంధిత వర్గాలు వ్యాఖ్యానించాయి. -
నగరం ఘటనలో 22కి చేరిన మృతులు
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా నగరంలో గెయిల్ పైపు లైన్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సూరిబాబు (58) మృతి చెందాడు. దీంతో నగరం గెయిల్ పైపు లైన్ దుర్ఘటనలో మృతుల సంఖ్య 22కి చేరింది. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో గెయిల్ సంస్థకు చెందిన పైపు లైన్ పేలుడు సంభవించింది. ఆ దుర్ఘటనలో 13 మంది సజీవ దహనం కాగా, మరో 19 మంది గాయపడ్డారు. వారిలో ఏడుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇప్పటికే మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో గాయపడిన వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం అమలాపురంలోని కిమ్స్ నుంచి కాకినాడ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. అలా కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సూరిబాబు మృతి చెందాడు. -
జిసిఎస్లో పేలిన ట్రాన్స్ఫార్మర్
-
నగరం ఘటనపై కేంద్రం, గెయిల్కు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్ పైపులైన్ పేలుడు ఘటనలో కేంద్ర ప్రభుత్వం, పెట్రోలియం శాఖ, గెయిల్కు హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. ఈ ప్రమాదంపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. నగరం ప్రమాదంలో 21మంది మృతి చెందారు. జూన్ 27న 13 మంది సజీవ దహనం కాగా ఇద్దరు కిమ్స్ ఆస్పత్రిలో, ఐదుగురు కాకినాడ అపోలో ఆస్పత్రిలో చనిపోయిన సంగతి తెలిసిందే. -
'కోనసీమ గ్రామాలు గెయిల్ దత్తత తీసుకోవాలి'
తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని అన్ని గ్రామాలను గ్యాస్ అథారటీ ఆఫ్ ఇండియా (గెయిల్) సంస్థ దత్తత తీసుకునేలా చర్యలు చేపట్టాలని కొత్తపేట ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సిహెచ్. జగ్గిరెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కాకినాడలో రాష్ట్ర డిప్యూటీ సీఎం ఎన్. చినరాజప్పను జగ్గిరెడ్డి కలిశారు. 'నగరం' బాధితులకు అందాల్సిన సహాయక చర్యలు మరింత వేగవంతం చేయాని కోరారు. అలాగే గ్యాస్ పైప్లైన్ ఉన్న గ్రామాలలోని ప్రతి ఒక్కరికి బీమా చేయించాలని వినతి పత్రం అందజేశారు. జీసీఎస్లు, చమురు కేంద్రాలున్న ప్రాంతాలలో స్థానికులకు ఏ రకమైన భద్రత కల్పిస్తారో వివరించాలని జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. -
తృటిలో తప్పిన ‘బ్లో అవుట్’ ముప్పు
కేశనపల్లి: 8 బావి నుంచి భారీగా గ్యాస్లీక్ ,వాల్వ్లు మూయని నిర్లక్ష్యమే కారణం ,సకాలంలో గ్యాస్ అదుపు చేసిన వైనం మలికిపురం : తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలంలో ఓఎన్జీసీ వెస్ట్ స్ట్రక్టర్ పరిధిలోని తూర్పుపాలెంలో గల కేశనపల్లి : 8 బావిలో బ్లోఅవుట్ ప్రమాదం కొద్దిలో తప్పింది. బావి సమీపంలో బుధవారం సాయంత్రం ఆరుగంటల సమయంలో కొందరు యువకులు క్రికెట్ ఆడుకుంటుండగా భారీ శబ్దం వచ్చింది. బావి నుంచి గ్యాస్ రావడం గమనించిన యువకులు అక్కడి నుంచి పరుగు తీశారు. సుమారు 45 నిమిషాల పాటు గ్యాస్ పెద్ద ఎత్తున లీకవుతూనే ఉంది. అక్కడకు దగ్గరలోని అడవిపాలెం గ్యాస్ కలెక్షన్ స్టేషన్ ఇన్చార్జి అభిషేక్ ఆధ్వర్యంలో సిబ్బంది బావి వద్దకు చేరుకుని గ్యాస్ను అదుపు చేశారు. సిబ్బంది నిర్లక్ష్యమే గ్యాస్ లీక్కు కారణమని తెలుస్తోంది. నగరం వద్ద గెయిల్ పైపులైన్ పేలుడు నేపథ్యంలో ఇక్కడి బావుల నుంచి తాటిపాక జీసీఎస్కు గ్యాస్ సరఫరా నిలిచింది. దీంతో కొన్ని బావులపై ఒత్తిడి పెరిగింది. అడవిపాలెం జీసీఎస్కు చెందిన కేశనపల్లి : 8 బావినుంచి కూడా గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఒత్తిడి అధికమైంది. జీసీఎస్కు ఈ బావి నుంచి వెళ్లే పైపులైన్కు సరఫరా నిలిపారే తప్ప, బావి వాల్వ్లు మూయలేదు. దీంతో ఒత్తిడి వల్ల బావి క్యాప్పై ఉండే డాఫ్లన్ టేప్ పగిలిపోయింది. సిబ్బంది రావడం ఆలస్యమైనా, గ్యాస్ అదుపులో జాప్యం జరిగినా క్యాప్ పైకి లేచి పోయి బ్లో అవుట్ సంభవించేది. బావికి గల మూడు వాల్వ్లను కూడా సంఘటన అనంతరమే మూయడం గమనార్హం. -
నగరం గ్రామంలో విషాదచాయలు
-
గెయిల్ పైప్లైన్ మార్చడం కుదరదు
కోనసీమ ప్రాంతంలో ఇప్పుడున్న గెయిల్ పైప్లైన్ వ్యవస్థను మార్చడం కుదరదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. అయితే కొత్తగా వేసే పైప్లైన్లను మాత్రం జనావాసాలకు దూరంగా వేయాలని సూచించామన్నారు. బాధితులకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని గెయిల్కు తెలిపామని.. అలాగే, మృతుల కుటుంబాల్లో అర్హులకు గెయిల్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని అన్నారు. గెయిల్ ప్రమాద ఘటనలో ఊహించని ప్రాణనష్టం జరిగిందని చినరాజప్ప చెప్పారు. పరిసర గ్రామాల్లో పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని గెయిల్ను ఆదేశించామన్నారు. ఇప్పుడున్న పైప్లైన్ కాలపరిమితి ముగిసిందని తాము భావిస్తున్నామని, ఈ విషయాన్ని తేల్చేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీని నియమించామని, కమిటీ నుంచి నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. -
20కి చేరిన మృతులు
కాకినాడ: నగరం గ్రామంలో గ్యాస్ పైపులైన్ పేలిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 20కి పెరిగింది. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన కె.చిన్నా శనివారం అర్ధరాత్రి, తాటికాయల రాజ్యలక్ష్మి (25) చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందారు. రాజ్యలక్ష్మి భర్త సత్యనారాయణ, చిన్న కుమార్తె సజీవ దహనం కాగా పెద్ద కుమార్తె లక్ష్మీ జ్యోత్స్నదేవి (4) శుక్రవారం అర్ధరాత్రి మరణించింది. ఆ కుటుంబంలో మిగిలి ఉన్న రాజ్యలక్ష్మి కూడా మరణించడంతో బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ప్రమాదంలో 13 మంది సజీవ దహనం కాగా మరో ఏడుగురు చికిత్స పొందుతూ మరణించారు. చిరు, బొత్సలకు నిరసనల సెగ అమలాపురం: గెయిల్ పైపులైన్ పేలుడు బాధితులను పరామర్శించేందుకు నగరం గ్రామానికి వచ్చిన కాంగ్రెస్ బృందానికి చేదు అనుభవం ఎదురైంది. ‘మాయదారి పరామర్శలు మాకొద్దు.. న్యాయం చేసేవారే రండి. లీడర్స్ గో బ్యాక్, యూపీఏ వల్లే మాకీ దుర్గతి’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. బాధితులకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
నిర్లక్ష్యం మాటున గ్యాస్ వెల్ స్టేషన్లు
-
కేజీ బేసిన్ ఓ మందుపాతరే..
దినదిన గండంగా కాలం వెళ్లదీస్తున్న ప్రజలు మొత్తం 900 కిలోమీటర్ల పైపులైన్లు ఏళ్లు గడుస్తున్నా మార్చని చమురు సంస్థలు అది 2012 జూలై 21వ తేదీ. ఉదయం 5 గంటలు. మలికిపురం మండలం శంకరగుప్తంలో ఉన్న అడవిపాలెం గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్(జీసీఎస్) ప్రాంతం. ఉదయం కొందరు నిద్రలేచి బయటకు వెళుతున్నారు. అదే సమయంలో సమీపంలో ఉన్న గ్యాస్ పైపులైన్ భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. ఆ ప్రాంతమంతా గ్యాస్ వ్యాపించింది. తీవ్ర స్థాయిలో గ్యాస్ వాసనవస్తుంటే.. దీనిని గమనించిన ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను ఎత్తుకుని ఆ ప్రాంతం వదిలి పరుగులు తీసింది. పొయ్యి వెలిగంచొద్దంటూ అరుస్తూ.. అందరినీ అప్రమత్తం చేసింది. ఆమెతో పాటు అక్కడున్న కూలీనాలీ చేసుకునే వందలాది మంది సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. స్థానికంగా ఉన్న గెయిల్ అధికారులు తాపీగా వచ్చి అదుపు చేశారు. ఆ రోజు సాయంత్రం వరకు ఆ ప్రాంతంలో పొయ్యి వెలిగించడానికి కూడా స్థానికులు భయపడ్డారు. అప్పట్లో ప్రాణాపాయం తప్పింది. అదే పరిస్థితి గురువారం ఉదయం 5 గంటల సమయంలో మామిడికుదురు మండలం నగరం మినీ రిఫైనరీ ఎదుట చోటుచేసుకుంది. ఏం జరిగిందో తెలుసుకోక ముందే తల్లీబిడ్డలు మంటల్లో చిక్కుకుని బూడిదగా మారారు. సంఘటన ప్రదేశంలోనే 13 మంది సజీవ దహనమయ్యారు. కొంత మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరణించారు. ఓఎన్జీసీ, గెయిల్ చరిత్రలో ఇది అతి భయంకర, చేదు దుర్ఘటన. మలికిపురం/అమలాపురం : తరచూ కేజీ బేసిన్లో జరుగుతున్న ప్రమాదాలు ప్రజలను కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. భూగర్భం నుంచి చమురు నిక్షేపాలను వెలికి తీస్తున్నామని గర్వంగా చెప్పుకొనే ఆయా సంస్థలు.. పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. మొత్తం 900 కిలోమీటర్లు కేజీ బేసిన్లో చమురు, సహజ వాయువులను ఓఎన్జీసీ, రిలయన్స్, రవ్వ జాయింట్ వెంచర్, ఆయిల్ ఇండియా తదితర సంస్థలు వెలికితీస్తున్నాయి. గ్యాస్, ముడిచమురును పైపులైన్ల ద్వారా రవాణాకు గెయిల్ వంటి సంస్థల ద్వారా ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. కోనసీమలో తీరం వెంబడి ఉన్న మలికిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు, అల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ముమ్మిడివరం, ఐ.పోలవరం మండలాల్లో గ్యాస్ పైపులైన్లు విస్తరించి ఉన్నాయి. తీరప్రాంత మండలాలే కాకుండా అమలాపురం పట్టణంతో పాటు కోనసీమలోని అంబాజీపేట, అయినవిల్లి మండలాల్లో కూడా పైపులైన్లు ఉన్నాయి. అమలాపురం మీదుగా ఉన్న గ్యాస్ పైపులైన్ ప్రాంతంలో ఎన్నో ప్రధాన కట్టడాలు, కార్పొరేట్ స్కూళ్లు ఉన్నాయి. కేజీ బేసిన్లో మొత్తం 900 కిలోమీటర్ల మేరకు గ్యాస్ పైపులైన్లు విస్తరించి ఉన్నాయి. కోనసీమతో పాటు ఇక్కడి నుంచి హైదరాబాద్ వరకు వీటిని ఏర్పాటు చేశారు. నిర్వహణ లోపం గెయిల్ పైపులైన్లను తరచూ పరిశీలిస్తూ నిర్వహణ సక్రమంగా ఉండాలి. కేజీ బేసిన్లో ఈ పైపులైన్ల నిర్వహణ సక్రమంగా లేదు. వీటిలో ప్యూర్ గ్యాస్ మాత్రమే వెళ్లాలి. కానీ నీరు, క్రూ డాయిల్తో కూడిన గ్యాస్ సరఫరా అవుతోంది. దీంతో తక్కువ కాలానికే పాడైపోతున్నాయి. పూర్తి నిర్లక్ష్యం గ్యాస్ పైపులైన్లు పాడైపోతున్నా.. వాటిని మార్చాల్సిన గెయిల్తో పాటు ఇతర సంస్థలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గ్యాస్ అమ్మకాల ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నా.. ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నాయి మినహా మరమ్మతులను చేయించడం లేదు. పైపులైన్ల నిరా్మాణంలో నాణ్యత లోపం చాలా ఉంటోంది. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న పైపులైన్ల నిర్మాణంలో బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా, ఇష్టానుసారం కాంట్రాక్టులు ఇచ్చి, నాణ్యత లేని పైపులైన్లు వేయడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దోపిడీయే.. అభివృద్ధి శూన్యం ఆయిల్ నిక్షేపాలను తరలించుకుపోతున్న సంస్థలు ఈ ప్రాంత అభివృద్ధికి కేటాయిస్తున్న నిధులు కంటితుడుపుగానే ఉన్నాయి. కారు చౌకగా ప్రైవేటు సంస్థలకు గ్యాస్ను కేటాయిస్తున్నాయి. ఇక్కడ కనీసం రోడ్డు వేయడానికి నిధులు ఇవ్వరు. ఆ సంస్థ వాహనాలు తిరిగి పాడైపోతున్నా రోడ్లను ప్రభుత్వం వేయించాల్సి వస్తోంది. కుంగిన కోనసీమ ఓఎన్జీసీ, గెయిల్ కార్యకలాపాల వల్ల కోనసీమ మూడడుగులు కిందికి దిగిందని అధ్యయన బృందాలు ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జరిగిన సదస్సులో తేల్చాయి. దీంతో సముద్రం నుంచి ఉప్పునీరు భూభాగం పైకి వస్తోందని ఆ బృందం స్పష్టం చేసింది. తగ్గిన పంట దిగుబడులు ఆయిల్, గ్యాస్ వెలికితీత వల్ల కోనసీమలో వ్యవసాయ దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయని రైతులు, వ్యవసాయ నిపుణులు తేల్చారు. ఇవి అపోహలంటూ భౌగోళిక శాస్త్రవేత్తలమంటూ కొందరు సదస్సులు పెట్టి ఆ సంస్థకు వత్తాసు పలుకుతున్నారు. కక్కుర్తి పడేది నాయకులే.. ఓఎన్జీసీ, గెయిల్ చర్యలకు వ్యతిరేకంగా ఇప్పటివరకు కొంత మంది రాజకీయ నాయకులు అనేక పోరాటాలు చేశారు. ప్రజలు ఉద్యమాలు చేసినా.. నాయకులు ప్రవేశించి నీరు గార్చేశారు. చిల్లర పైసలకు కక్కుర్తి పడి నాయకులు.. ప్రజా ఉద్యమాలను అణగదొక్కించిన సంఘటనలు కోనసీమలో అనేకం ఉన్నాయి. -
గెయిల్ పైపులైన్లలో నాణ్యతెంత ?
-
గ్యాస్ లీకేజీపై అఖిలపక్షం వేయండి: సీపీఐ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్యాస్ లీకేజీ వంటి దుర్ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ కోరారు. ఈ విషయంపై అందరి అభిప్రాయాలూ తెలుసుకునేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు శనివారం లేఖ రాశారు. -
పండుల, వీహెచ్, హర్షలపై జనం కన్నెర్ర
కాకినాడలో మురళీమోహన్తో వాగ్వాదం మామిడికుదురు/ అమలాపురం (తూర్పు గోదావరి జిల్లా): గ్యాస్ పైపులైను పేలుడు ప్రాంతాన్ని సందర్శించేందుకు శనివారం నగరం గ్రామానికి వచ్చిన అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు, మాజీ ఎంపీ హర్షకుమార్, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావులపై జనం ఆగ్రహం ప్రదర్శించారు. ఎంపీ రవీంద్రబాబు తొలుత గ్రామాన్ని సందర్శించి, బాధితులను పరామర్శించగా స్థానికులు ప్రమాదం జరిగిన రోజే ఎందుకు రాలేదని నిలదీశారు. రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, మాజీ ఎంపీ హర్షకుమార్ మధ్యాహ్నం వచ్చీరాగానే టీవీ చానళ్ల వారితో మాట్లాడుతూ పైపులైన్ల నిర్వహణ సక్రమంగా లేదని చమురు సంస్థలను విమర్శించారు. అప్పటికే వారిని చుట్ట్టుముట్టిన స్థానికులు... అధికారంలో ఉన్న పదేళ్లూ మీరేం చేశారంటూ హర్షకుమార్పై ధ్వజమెత్తారు. ‘గో బ్యాక్ హర్షకుమార్... డౌన్ డౌన్ హర్షకుమార్’ అంటూ 216 జాతీయ రహదారిపై కొద్దిసేపు ధర్నా చేశారు. కాకినాడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుతో కలసి వచ్చిన రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ను బాధిత కుటుంబాలకు చెందిన వారు నిలదీశారు. -
‘గెయిల్’ అధికారులపై సెక్షన్ 304ఎ కేసు
ఉత్తరకోస్తా జిల్లాల ఐజీ అతుల్సింగ్ సాక్షి, రాజమండ్రి: నిర్లక్ష్యంగా వ్యవహరించి పలువురి ప్రాణాలు పోవడానికి కారకులైన ‘గెయిల్’ అధికారులపై సెక్షన్ 304ఎ కింద కేసు నమోదు చేసినట్టు ఉత్తరకోస్తా జిల్లాల ఐజీ అతుల్సింగ్ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో శుక్రవారం గెయిల్ గ్యాస్ పైపులైన్ పేలి పలువురు మరణించగా, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లడం తెలిసిందే. ఐజీ సింగ్ రాజమండ్రి పోలీసు అతిథి గృహంలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ విచారణ పూర్తయ్యాక అవసరమైతే సెక్షన్లు మారుస్తామన్నారు. అమలాపురం డీఎస్పీ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ఫొరెన్సిక్ నిపుణుల బృందాన్ని కూడా రప్పిస్తున్నట్టు తెలిపారు. విలేకరుల సమావేశంలో అర్బన్ జిల్లా ఎస్పీ టి.రవికుమార్మూర్తి, ఓఎస్డీ రమాదేవి, డీఎస్పీలు నామగిరి బాబ్జీ, ఉమాపతివర్మ, మురళీకృష్ణ పాల్గొన్నారు. -
మురుగు కాల్వలో దూకి తండ్రి.. ప్రహరీ దూకి కుమార్తెలు
అమలాపురం టౌన్ : గెయిల్ పైపులైన్ విస్ఫోటం నగరం గ్రామవాసులను ఇంకా వెన్నాడుతూనే ఉంది. చీకటి మాటు నుంచి మంటలు దూసుకువస్తుంటే.. అనేకమంది ప్రాణభీతితో దిక్కూదరీ ఎంచకుండా చెల్లాచెదురయ్యారు. ఇప్పుడిప్పుడే వారు మళ్లీ గ్రామానికి వస్తున్నారు. వీరిలో వాకా వీరాస్వామి కుటుంబం ఒకటి. శుక్రవారం ఉదయమే గ్రామానికి చెందిన వాకా వీరాస్వామి, కాండ్రేగుల సత్యనారాయణ, కొల్లాబత్తుల ఏసు కాలకృత్యాల కోసం వాడ్రేవుపల్లి డ్రెయిన్ ప్రాంతానికి వెళ్లారు. ఇంతలో పెద్ద శబ్దం వచ్చింది. ఆ వెంటనే పెద్ద ఎత్తున ఎగసిపడ్డ మంటలు రోడ్డు వైపు దూసుకువచ్చాయి. క్షణంలో మంటలు చుట్టుముడతాయనగా ముగ్గురూ మురుగు కాల్వలోకి దూకేశామని వీరాస్వామి చెప్పారు. మురుగు నీరైనా, కొద్దిసేపు భరించారు. ఊపిరాడకపోవడంతో చేసేది లేక కాల్వలోంచి ఒక్క ఉదుటున గట్టుపైకి వచ్చి కొబ్బరి తోటలకు అడ్డంపడి మంటలకు అందనంత దూరానికి పారిపోయారు. తమలాగే మరికొందరు కూడా మురుగుకాల్వలో దూకి ప్రాణాలు దక్కించుకున్నట్టు వీరాస్వామి చెప్పాడు. వీరాస్వామి కుమార్తెలు దుర్గ, నాగవేణిలు ఇంటి ప్రహరీ దూకి, ప్రాణాలు దక్కించుకున్నారు. పైపులైను పేలిన సమయంలో వారిద్దరూ ఇంట్లో నిద్రిస్తున్నారు. తండ్రి బయటకు వెళ్లినప్పుడు వారిద్దరూ గాఢనిద్రలో ఉన్నారు. ఇంటి ముఖ ద్వారం తలుపుల సందు నుంచి పొగలు రావడాన్ని దుర్గ గమనించింది. వెంటనే చెల్లిని లేపి కిటికీ తలుపులు తీసి చూసింది. ముఖద్వారానికి ఉన్న కర్టెన్ కాలిపోతూ కనిపించింది. ఇంటికెదురుగా ఉన్న పెంకుటింట్లోని వారు మంటల్లో చిక్కుకుని హాహాకారాలు చేస్తూ కనిపించారు. భీతావహులైన అక్కాచెల్లెళ్లు ఇంటి వెనుకే ఉన్న నగరం మార్కెట్ కమిటీ కార్యాలయం ప్రహారీని అతికష్టంపై దూకి గండం నుంచి బయటపడ్డారు. అప్పటికే వారి ఇంటిని అగ్నికీలలు చుట్టుముట్టాయి. ఇల్లు పాక్షికంగా కాలిపోయింది. తండ్రికి ఆసరాగా దుర్గ ఇంట్లోనే నిర్వహిస్తున్న ఫొటో స్టూడియో కెమెరాలు, ఇతర ఉపకరణాలు కాలిపోయాయి. -
దారుణం, దుర్మార్గం
భూమి అట్టడుగు పొరల్లో దాగివున్న చమురు, సహజవాయు నిక్షేపాలను మొరటుగా, నిర్లక్ష్యంగా తోడేస్తున్న తీరు మరోసారి కోనసీమను విషాద సీమగా మార్చింది. 17 నిండుప్రాణాలను బలితీసుకుంది. మరెందరినో చావుబతుకుల్లోకి నెట్టింది. పచ్చటి ప్రకృతిని వల్లకాటిగా మార్చింది. మామిడికుదురు మండలం నగరం గ్రామంలో శుక్రవారం వేకువజామున జరిగింది నిజానికి ప్రమాదం కాదు. ప్రమాదమంటే అనుకోకుండా ముంచుకొచ్చేది. అసంకల్పితం గా సంభవించేది. కోనసీమ నేలనుంచి నిత్యమూ పీల్చే చమురు, సహజవాయు నిక్షేపాలతో ఏటా వేల కోట్ల రూపాయలు గడిస్తున్న కంపెనీలకు...తమ పైప్లైన్లు ఎలాంటివో, వాటి నాణ్యత ఏపాటో తెలియదనుకోవడానికి లేదు. ఎందుకంటే వాళ్లంతా పెద్ద చదువులు చదువుకున్నవారు. శాస్త్రవిజ్ఞానం ఉన్నవారు. ఆ అర్హతలతోనే సంస్థను నడుపుతున్నవారు. లక్షలకు లక్షలు జీతం అందుకుంటున్నవారు. నిర్దిష్టమైన ఒత్తిడితో ఉబికి వచ్చే సహజవాయువైనా, చమురైనా పైప్లైన్ల గోడలపై ఎలాంటి ప్రభావం చూపగలవో...బయటి వాతా వరణం పైప్లైన్ల నాణ్యతను ఎలా దెబ్బతీయగలదో లెక్కలుగట్టడం రాకకాదు. ఆ లెక్కలతో పైప్లైన్లను ఎన్నేళ్లకోసారి మార్చాలో తెలియకకాదు. తెలిసీ ఉపేక్షించడం నేరం. తెలియలేదంటే అజ్ఞానం. ఈ రెండూ ఆ సంస్థల్లో కీలక స్థానాల్లో ఉండేవారిని అనర్హులుగా మార్చే అంశాలు. నిందితులుగా పరిగణించే అంశాలు. నగరం గ్రామ ప్రజలు ఏడాదినుంచి గ్యాస్ లీక్ గురించి ఫిర్యాదు చేస్తున్నారు. కానీ, అవేవీ గెయిల్ అధికారుల చెవికెక్కలేదు. జనమంటే లెక్కలేదు...జనం ప్రాణాలంటే వీసమెత్తు విలువలేదు...ఇక వారి అభ్యంతరాలకూ, నిరసనలకూ, కోపతాపాలకూ చోటెక్కడ? దుర్ఘటనకు రెండు రోజులముందు కూడా గ్యాస్ లీకవుతున్నచోట సిమెంటుతో పూడ్చారని స్థానికులు చెబుతున్నారు. అలా చేస్తే సరిపోతుందని నిర్ణయం తీసుకున్నవారు, అందుకు ఆమోదం తెలి పినవారు ఈ ఘటనలో దోషులే అవుతారు. అయితే, జరుగుతున్న పరిణామాలను చూస్తే మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు ప్రారంభ మయ్యాయని అర్ధమవుతుంది. పేరు చెప్పుకోవడానికి కూడా ధైర్యంలేని ఒకరు ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ పైప్లైన్ల నిర్వహణ చక్కగా ఉన్నదని కితాబునిచ్చారు. అంతేకాదు...గ్రామస్తుల నిర్లక్ష్యం కారణంగానే పైప్లైన్ పేలిందని భాష్యం చెప్పారు. బట్ట కాల్చి మీదేసే ఇలాంటి తత్వమే, బాధ్యతారాహిత్యమే, నిర్లక్ష్యమే నగరాన్ని బుగ్గి పాలు చేసింది. అసలు గ్యాస్ పైప్లైన్లను జనావాసాల మధ్యనుంచి, పంటపొలాల మధ్యనుంచి తీసుకెళ్లడమే నేరం. వీటిని తప్పిస్తూ తీసుకెళ్లడంవల్ల మరికొన్ని కిలోమీటర్ల నిడివిన పైప్లైన్లు వేయాల్సి రావొచ్చు. పర్యవసానంగా వ్యయం పెరగొచ్చు. అది మిగుల్చు కోవడానికి చేసిన ప్రయత్నం కోనసీమ జనావాసాలను ఇలాంటి విషాదాల్లోకి నెట్టేస్తున్నది. ఆ కంపెనీల కక్కుర్తి వేలాదిమంది ప్రజల ప్రాణాలను గాల్లో దీపంలా మారుస్తున్నది. గ్యాస్ తీసుకెళ్లే పైప్లైన్లన్నీ 20 ఏళ్లనాటివి. ఆ పైప్లు వేసేనాటికున్న సాంకేతిక విజ్ఞానం ఇప్పటికి ఎన్నో రెట్లు పెరిగింది. ఏ చిన్న లీకేజీనైనా పసిగట్టి హెచ్చరిక చేసే వ్యవస్థలూ వచ్చాయి. కానీ అడిగేవారెవరు? కనుకనే కోట్లాది రూపాయల వ్యయమయ్యే ఈ పనుల జోలికి వెళ్లడం వృథా అనుకున్నారు. ప్రమాదాలు అడపా దడపా చోటుచేసుకుంటూనే ఉన్నాయి. గడిచిన రెండు దశాబ్దాలుగా నిత్యం ఏదో ఒకచోట చిన్నదో, పెద్దదో ఘటన సంభవిస్తూనే ఉన్నది. 1993, 1995ల్లో వచ్చిన బ్లో అవుట్లు కాక ఇప్పటికి అనేకానేకసార్లు గ్యాస్ లీక్ ఘటనలు చోటుచేసుకున్నాయి. పలుమార్లు పైపులు పేలి పంట పొలాలు దెబ్బతిన్నాయి. గ్యాస్ నిక్షేపాలున్నాయని తెలిశాక కోనసీమ బతుకుచిత్రం మారిపోయింది. ఎన్నడూ చూడని భారీ వాహనాలొచ్చి రహదార్లను ధ్వంసంచేశాయి. అత్యంత సున్నితమైన పర్యావరణం క్రమేపీ దెబ్బతింటున్నది. పర్యవసానంగా కొబ్బరి, వరి దిగుబడులు తగ్గుతు న్నాయి. ప్రజారోగ్యంపై ఇది కలగజేస్తున్న ప్రభావం ఏమిటో అధ్యయనం చేయాల్సే ఉన్నది. గ్యాస్ను వెలికితీస్తున్నకొద్దీ ఆ ఖాళీలోకి సముద్రపు నీరు వచ్చిచేరుతున్నది. అందువల్ల బావుల్లోకి ఉప్పునీటి ఊట ప్రవేశిస్తున్నది. గొంతు తడుపుకోవడానికి కూడా నీళ్లులేవని స్థాని కులు గగ్గోలు పెడుతున్నా అది అరణ్యరోదనే అవుతున్నది. ఇలా జల, వాయు కాలుష్యాలు పెరుగుతున్నా, తరచుగా ఏదో ఒక ఘటన చోటుచేసుకుంటున్నా జిల్లాస్థాయిలో ఉండే విపత్తుల నివారణ సంస్థ నిమ్మకు నీరెత్తినట్టున్నది. నివేదికలు పంపాల్సిన స్థానిక రెవెన్యూ సిబ్బందికీ పట్టదు. వీరు చురుగ్గా ఉంటే ఇన్ని ప్రమాదాలు జరిగేవి కాదు. కేజీ బేసిన్నుంచి తరలిపోతున్న గ్యాస్, చమురు నిక్షేపాలవల్ల ఇంత నష్టం సంభవిస్తున్నా ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి ఆర్థిక ప్రయోజన మూ సమకూరడంలేదు. సింగరేణి కాలరీస్లో ఉత్పత్తయ్యే బొగ్గులో తెలంగాణ రాష్ట్రానికి 50 శాతం వాటా ఇస్తుండగా ఆ సూత్రాన్నే గ్యాస్ కేటాయింపు విషయంలో ఎందుకు పాటించరని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సంధించిన ప్రశ్న సహేతుకమైనదే. ఈ విష యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకుని అందరినీ కలుపుకొని రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు పోరాడాల్సిన అవసరం ఉన్నది. నగరం ఘటనలో బాధితులకు పరిహారం ఇవ్వడంతో సరిపెట్టక, సానుభూతి వాక్యాలతో చేతులు దులుపుకోక భోపాల్ గ్యాస్ లీక్ కేసు తరహాలో పైప్లైన్ల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించినవారిని గుర్తించి క్రిమినల్ కేసులు పెట్టాలి. అలాగైతేనే ఈ తరహా ఘటనలను నివారించడం సాధ్యమవుతుంది. -
గెయిల్ ఘటనపై ఆర్పి సింగ్ కమిటీ విచారణ
అమలాపురం : తూర్పుగోదావరి జిల్లా గెయిల్ గ్యాస్పైప్ లైన్ దుర్ఘటనపై విచారణ చేపట్టేందుకు కమిటీ సిద్ధమైంది. పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి ఆర్పి సింగ్ నేతృత్వంలో ఏర్పాటు అయిన ఉన్నతస్థాయి కమిటీ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించనుంది. దుర్ఘటన పూర్వాపరాలను క్షుణ్ణంగా పరిశీలించి నిజాన్ని నిగ్గు తేల్చనుంది. శుక్రవారం తెల్లవారుజామున ఓఎన్జీస్ గ్యాస్ స్టేషన్ సమీపంలో గెయిల్ గ్యాస్ పైప్లేన్లో పేలుడు సంభవించి.... 16 మంది సజీవ దహనమయ్యారు. ఘటనపై స్పందించిన కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నతస్థాయి కమిటీ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. మరోవైపు ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న గెయిల్ ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్నారు. -
ఎటు చూసినా కలచివేసే దృశ్యాలే.....
-
ఎటు చూసినా కలచివేసే దృశ్యాలే.....
అమలాపురం : సరిగ్గా ఒక్క రోజు క్రితం ఆ గ్రామం కళకళలాడింది. పచ్చని కొబ్బరి తోపులు... వాటి మధ్య వంపులు తిరుగుతూ పారే కాలువ... ఒకవైపు కేజీ బేసిన్లో చమురు, సహజ వాయువుల ఉత్పత్తిలో కీలకంగా ఉండే తాటిపాక మినీ రిఫైనరీ, ఓఎన్జీసీఎస్. మరోవైపు మార్కెట్ యార్డు గోడౌన్లు, అందమైన భవనాలు, హోటళ్లు, 216 జాతీయ రహదారి. చమురు సంస్థల్లోకి వెళ్లొచ్చే ఉద్యోగులు, ప్రయాణికులతో కిటకిటలాడే రహదారి. ఇలా ఎప్పుడూ సందడిగా ఉండే మామిడికుదురు మండలం నగరంలోని వానవాశివారి మెరక మరుభూమిగా మారిపోయింది. గెయిల్కు చెందిన పైపులైన్ దుర్ఘటనతో ఆ ప్రాంతం శ్మశానాన్ని తలపిస్తోంది. మంటల్లో కాలిపోయిన శవాలు, ఒళ్లంతా తగులబడి సహాయం కోసం క్షతగాత్రులు చేసిన ఆర్తనాదాలు..బుగ్గవుతున్న ఇళ్లు, మాడిమసైపోయిన పచ్చని కొబ్బరి చెట్లు, తప్పించుకునేందుకు వీలు లేక అగ్నికీలల బారిన పడి చనిపోయిన పశువులు, పక్షులు. ఇలా హృదయ విదారక ఈ దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టించాయి. కొంతమంది చిన్న చిన్న వ్యాపారులు ఉదయం వేళే నిద్ర లేచి తమ తమ దుకాణాలు తెరిచి పొట్టపోసుకునే సమయం... ఇంకొంత మంది ఇంకా నిద్రమత్తులోనే జోగుతున్న వేళ.. భవిష్యత్తు గురించి తియ్యటి కలలు కంటున్న తరుణం... ఆ ఆశలన్నీ సమాధైపోయాయి. వారి కలలన్నీ ఛిద్రమైపోయాయి. ఇప్పుడు ఆ ప్రాంతం ఓ శ్మశాన వాటికలా మారిపోయింది. 24 గంటల క్రితం పచ్చగా కళకళలాడిన నగరం గ్రామం ఒక్కరోజులోనే కన్నీటి సంద్రంలో కూరుకు పోయింది. గెయిల్ పైప్లైన్ పేలిన ఘటనలో 16 మంది మృత్యువాతపడిన నగరం గ్రామమంతా విషాదం నెలకొంది. -
పైపులైన్ల పడగ
విశాఖ చుట్టూగ్యాస్ పైపులైన్ల ఉచ్చు పదుల సంఖ్యలో గ్యాస్, చమురు కంపెనీలు తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్ దుర్ఘటనతో కలవరం విశాఖవాసుల్లో వణుకు విశాఖవాసులను గ్యాస్ ముప్పు కలవరపరుస్తోంది. నగరం చుట్టూ గ్యాస్ పైపులైన్లు ఉండడంతో ఏ క్షణాన ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో..ఏ పైపులైన్ లీకవుతుందోననే భయం వెన్నాడుతోంది. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన గెయిల్ గ్యాస్ పైపులైను భారీ పేలుడు దుర్ఘటన నేపథ్యంలో నగరవాసుల్లో ఆందోళన మొదలయింది. నగరం చుట్టూ అత్యంత భారీ పైపులైన్లు పాతబడి ప్రమాదకరంగా ఉన్నాయి. ఇప్పటికే నగరంలో హెచ్పీసీఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, స్టీల్ప్లాంట్, హెచ్పీ, బీపీసీ టెర్మినల్ ప్లాంట్లు, గ్యాస్ కంపెనీలు భారీగా ఉన్నాయి. ఇవన్నీ నిత్యం గ్యాస్ లోడింగ్, అన్లోడింగ్తో ప్రమాద హేతువులుగా మారాయి. సాక్షి, విశాఖపట్నం : నగరం నుంచి హైదరాబాద్కు గెయిల్ సంస్థ భారీ పైపులైన్ వేసింది. రోజుకు 2.5 లక్షల గ్యాస్ సిలెండర్లను నింపగలిగే సామర్థ్యం ఈ పైపులైన్ సొంతం. ఆ పక్కనే హెచ్పీసీఎల్ చమురు, డీజిల్ తరలించే పైపులైన్ కూడా ఉంది. స్టీల్ప్లాంట్లో భారీ స్థాయిలో గ్యాస్ వినియోగం జరుగుతోంది. హెచ్పీసీల్లోనూ గ్యాస్ పైపులైన్లు భారీస్థాయిలో పనిచేస్తున్నాయి. ఇవికాకుండా సుమారు 13 రకాల ఇండస్ట్రియల్ పార్కులు, ఎస్ఈజెడ్లు, ఉక్కు ఆథారిత కంపెనీలు గ్యాస్తో నడుస్తున్నాయి. ఇలా భారీ స్థాయిలో కంపెనీలు వందలాది పైపులైన్లు గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. ఆయా కంపెనీలు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. గతంలో స్టీల్ప్లాంట్లో అనేకసార్లు గ్యాస్ లీకై పదుల సంఖ్యలో కార్మికులు మృతి చెందారు. ఇటీవల గ్యాస్లీకై ఉక్కు ఎస్ఎంఎస్-2లో ఇద్దరు ఇంజినీర్లు మృత్యువాత పడ్డారు. 1997లో హెచ్పీసీఎల్ గ్యాస్ అన్లోడింగ్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో 60 మంది వరకు మత్యువాత పడ్డారు. 2013 ఆగస్టులో కూలింగ్ టవర్ కూలి 23మంది వరకు మృతి చెందారు. ఇలా నిత్యం ఏదొక కంపెనీలో గ్యాస్ ప్రమాదం జరుగుతూనే ఉంది. కంపెనీలు వేసిన గ్యాస్పైపులైన్లు ఇప్పుడు ప్రజలకు సైతం ప్రాణాలకు ముప్పు తెచ్చేలా ఉన్నాయి. ఈ పైపులైన్లు నిర్మించి చాలా ఏళ్లు అవుతుండడంతో ఎక్కడ, ఎప్పుడు, ఏ పైపులైను లీకవుతుందోననే భయం వెన్నాడుతోంది. సింధియా, మల్కాపురం, గాజువాక ప్రాంతాల్లో వందలాది పైపులున్నాయి. ఇవి పాతపబడిపోయి గ్యాస్, చమురు లీకవుతున్నాయి. కంపెనీలు మాత్రం ఈ పైపులైన్ల భద్రతను పట్టించుకోవడంలేదు. వాస్తవానికి గ్యాస్పైపులైన్ల వెంబడి నిత్యం కంపెనీల సిబ్బంది పహారా కాయాలి. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా తక్షణమే అప్రమత్తమై స్పందించాలి. కానీ ఇది జరగడం లేదు. పారిశ్రామిక ప్రాంతంలో ఖాళీగా ఉన్న వందలాది ఎకరాల్లో విస్తరించిన పైపులను ఏ కంపెనీ కూడా పట్టించుకోవడం లేదు. దీని వల్ల ఏ ప్రమాదం జరిగినా గ్యాస్ వాసన, రసాయనాల లీకు, అగ్ని ప్రమాదాల కారణంగా నగరవాసుల భద్రతకు ముప్పు పొంచి ఉంటుంది. గెయిల్, హెచ్సీపీఎల్ నగరం నుంచి హైదరాబాద్కు నిర్మించిన పైపులైన్లు అనేక గ్రామాల మీదుగా వెళ్తున్నాయి. వీటిపై తెలిసో తెలియకో స్థానికులు ఇళ్లు నిర్మిస్తున్నారు. చమురు కోసం దొంగలు వీటిని పగులగొట్టి ఇంధనం కాజేస్తున్నారు. ఇది ప్రమాదకరం. ఏ చిన్న నిప్పు అంటుకున్నా ఇవి పేలి రోజుల తరబడి మంటలు కొనసాగుతాయి. తూర్పుగోదావరి జిల్లా నగరం దుర్ఘటన నేపథ్యంలో మరోసారి ఆయా కంపెనీలు గ్యాస్, చమురు పైపులైన్ల భద్రతపై పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా అంతులేని నష్టం జరిగే ప్రమాదం కూడా ఉంది. నగరానికి ఇంకో గ్యాస్ పైపులైన్ ఇప్పటికే గ్యాస్ పైపులైన్లతో ఉక్కిరిబిక్కిరవుతున్న నగరానికి మరో భారీ పైపులైను రాబోతోంది. కాకినాడ నుంచి విశాఖ వరకు గృహ, పారిశ్రామిక అవసరాల కోసం ప్రత్యేకంగా పైపులైను వేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. గరిష్టంగా 10 లక్షల మంది గృహ వినియోగదారులకు, 40 భారీ కంపెనీలు, 13 ఇండస్ట్రియల్ పార్కులు, ఎస్ఈజెడ్లకు నిరంతర గ్యాస్ అందించడానికి దీన్ని నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
గెయిల్ బాధితులకు బాలకృష్ణ సంతాపం
హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా గెయిల్ పైపులైన్ పేలుడు దుర్ఘటనపై సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలక ప్రగాఢ సానుభూతి తెలిపారు. మామిడికుదురు మండలం నగరం వద్ద శుక్రవారం గ్యాస్ పైపులైన్ పేలడంతో 15 మంది మరణించారు. మరో 25 మంది గాయపడగా, వీరిలో తొమ్మిదిమంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయిల చొప్పున ఎక్స్ గ్రేసియా ప్రకటించారు. -
ప్రజాగ్రహం : సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు
-
నిర్వహణ లోపం వల్లే 'గెయిల్' పేలుడు
-
భాదితకుటుంబాలను ఆదుకుంటాం: నరసింహం
-
నిర్వహణ లోపం వల్లే 'గెయిల్' పేలుడు
తూర్పు గోదావరి జిల్లా శుక్రవారం జరిగిన గెయిల్ పైపులైన్ పేలుడుకు గల కారణాలను ఆంధ్ర విశ్వివిద్యాలయం ప్రొఫెసర్ సీవీ రామన్ విశ్లేషించారు. పైపులైన్ల నిర్వహణ, ప్రమదాలు జరగడానికి గల కారణాల గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.. డెల్టాలో చమురు తవ్వకాల వల్ల జరిగిన ప్రమాదం కాదు. ఇది కేవలం నిర్వహణలోపం వల్లే జరిగింది. పైపులైనును ఎప్పటికప్పుడు మార్చుకుంటే ఈ తరహా ప్రమాదాలను నివారించవచ్చు. ప్రమాదసంకేతాలను ముందుగా గుర్తించకపోవడం వల్ల, సమన్వయ లోపం వల్ల ఇలా జరిగింది. గెయిల్ అధికారుల దగ్గర్నుంచి స్థానిక పంచాయతీ సర్పంచి వరకు అందరి మధ్య సమన్వయం ఉండాలి. పైపులైన్ మీద ఎప్పుడూ విపరీతమైన ఒత్తిడికి గురవుతుంటాయి. అందువల్ల ప్రతి మూడు నెలలకు ఒకసారి వీటిని సాంకేతిక నిపుణులు పరిశీలించాలి. ఐదు, పదేళ్లకోసారి మాత్రమే చూస్తే లోపాలు కూడా సరిగ్గా తెలియవు. పాతికేళ్ల నాటి పైపులు అంటే.. వాటి జాయింట్ల వద్ద పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. -
''నగరం'' నిద్రపోతున్న వేళ మృత్యుజ్వాల
-
'పైప్లైన్పై చేయి వేస్తే ఆరేళ్లు జైలన్నారు'
గ్యాస్ పైప్లైన్లు తుప్పు పట్టాయని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. గెయిల్ పేలుడు ఘటనా స్థలాన్ని సందర్శించిన ఆయన మాట్లాడుతూ ఈ దుర్ఘటనకు గెయిల్ సంస్థ బాధ్యత వహించాలన్నారు. ఇప్పటికైనా పాడైపోయిన పైప్లైన్ల స్థానంలో కొత్త పైప్లైన్లు వేయాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. పైప్లైన్ల లీకేజి విషయంలో తాను కేంద్రానికి మూడుసార్లు లేఖ రాసినా, అధికార పక్షంలో ఉన్న ఎంపీ అయినా కూడా తన లేఖను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. అంతే కాకుండా 1960 నాటి పైపులైను చట్టం ప్రకారం పైప్లైన్లపై చేయి వేస్తే ఆరేళ్ల జైలు శిక్ష విధిస్తామన్నారని, ఆ నిబంధన మార్పుతో పాటు, గ్యాస్ లీక్ వల్ల ప్రమాదాలు జరిగితే బాధితులకు నష్టపరిహారం చెల్లించాలనే అంశాన్ని చేర్చాలని ప్రతిపాదించినా ఫలితం లేకపోయిందన్నారు. యూపీఏ ప్రభుత్వంలోని చమురు మంత్రిత్వశాఖ ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. పైప్లైన్ లీక్ వల్ల ఎకరం మేరకు గ్యాస్ వ్యాపించిందని, అగ్గిపుల్ల వెలిగించటంతో పేలుడు జరిగిందని హర్షకుమార్ అన్నారు. అదే ఏ పదో లేక ఇరవయ్యో ఎకరాల మేరకు గ్యాస్ వ్యాపించి ఉంటే పెను ప్రమాదమే జరిగి ఉండేదన్నారు. ఓఎన్జీసీ, గెయిల్ నిర్లకక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ఇప్పటికైనా ఆ సంస్థలు ప్రజల ప్రాణాలకు భరోసా ఇవ్వాలన్నారు. లేకుంటే కోనసీమ ప్రజలు గ్యాస్ వెలికితీత కార్యక్రమాలను పూర్తిగా బహిష్కరించే అవకాశం ఉందని హర్షకుమార్ అన్నారు. ప్రభుత్వాలు స్పందించి ప్రజలకు భద్రతతో పాటు భరోసా కల్పించాలని ఆయన కోరారు. -
మా వనరులు గుజరాత్కు తరలిస్తారు కాని, మాకు రక్షణ ఇవ్వరా?
-
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం
-
పచ్చని కోనలో ఆరని చిచ్చు