google maps
-
గూగుల్లో ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’
శాన్ ఫ్రాన్సిస్కో: అమెరికా ప్రభుత్వ ఆదేశాల మేరకు అమెరికా తీరప్రాంతమైన చరిత్రాత్మక ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో(Gulf of Mexico)’పేరును సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్.. ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’(Gulf of America)గా పేర్కొంది. అయితే ఈ పేరు మార్పును కేవలం అమెరికా ఇంటర్నెట్ వినియోగదారులకు పరిమితం చేసింది. మెక్సికోలో ఇంటర్నెట్ వినియోగదారులు ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’అని టైప్ చేస్తే అదే పాత పేరుతోనే సెర్చ్ రిజల్ట్ వస్తుంది. మిగతా ప్రపంచానికి గల్ఫ్ ఆఫ్ మెక్సికో(గల్ఫ్ ఆఫ్ అమెరికా) అని కనిపిస్తుంది. ఈ విషయాన్ని తమ ‘గూగుల్ మ్యాప్స్(Google Maps)’బ్లాగ్లో గూగుల్ పోస్ట్ చేసింది.ఇలా ఒకేప్రాంతానికి మూడు పేర్లతో పిలవనున్నట్లు గూగుల్ తన వెబ్మ్యాపింగ్ ప్లాట్ఫామ్లో పేర్కొంది. అంటే ప్రపంచంలోని ఒకే భౌగోళిక ప్రాంత మ్యాప్ అమెరికాలో ఒక పేరుతో, మెక్సికోలో ఇంకో పేరుతో, మిగతా దేశాలకు రెండూ కలిపి కనిపిస్తుందన్నమాట. ‘‘అమెరికాలో జియోగ్రాఫిక్ నేమ్స్ ఇన్ఫర్మేషన్ సిస్టం (జీఎన్ఐఎస్) అధికారికంగా ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ను ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా మార్చేసింది. మేము రెండు వారాల క్రితం ప్రకటించినట్లుగా, మేం అనుసరిస్తున్న విధానాలకు అనుగుణంగా ఈ మార్పులను చేశాం’’అని బ్లాగ్లో గూగుల్ పేర్కొంది. ‘‘అమెరికాలో గూగుల్ మ్యాప్ను ఉపయోగించే వినియోగదారులకు ఆ భౌగోళిక ప్రాంతం ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా కనిపిస్తుంది. మెక్సికో ప్రజలకు ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’గా కనిపిస్తుంది. ప్రపంచంలోని మిగతా దేశాల్లో యూజర్లకు గల్ఫ్ ఆఫ్ మెక్సికో(గల్ఫ్ ఆఫ్ అమెరికా) అని కనిపిస్తుంది.‘గల్ఫ్ ఆఫ్ అమెరికా డే’పేరు మార్పు కోసం కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేసిన తరువాత ఫిబ్రవరి 9వ తేదీని ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా దినోత్సవం’గా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. గల్ఫ్లో ఉన్న న్యూ ఓర్లీన్స్లోని సూపర్»ౌల్కు వెళ్తూ ఫిబ్రవరి 10న డిక్లరేషన్పై ఆయన సంతకం చేశారు. ‘‘గల్ఫ్ ఆఫ్ అమెరికా పేరు మార్చిన తర్వాత ఈ రోజు నేను తొలిసారి సందర్శిస్తున్నాను’’అని వైట్హౌస్ వెబ్సైట్లో ప్రచురించిన డిక్లరేషన్లో ట్రంప్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 9న వేడుకలు జరుపుకోవాలని, పలు కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన ప్రభుత్వ అధికారులకు, అమెరికా ప్రజలకు పిలుపునిచ్చారు.ప్రమాణ స్వీకారం రోజే పేరు మార్పు జనవరి 20న అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’పేరు మార్పుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఇంటీరియర్ డిపార్ట్మెంట్కు 30 రోజుల గడువు ఇస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ట్రంప్ ప్రభుత్వంలోని అంతర్గత విభాగం అధికారికంగా పేరు మార్పును అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. వెంటనే, యూఎస్ కోస్ట్గార్డ్ సైతం గల్ఫ్ ఆఫ్ అమెరికాను ఉపయోగించడం ప్రారంభించింది. అధ్యక్షుడి ఆదేశాల మేరకు గల్ఫ్ ఆఫ్ మెక్సికోను అధికారికంగా గల్ఫ్ ఆఫ్ అమెరికాగా, ఉత్తర అమెరికాలోని ఎత్తైన శిఖరం డెనాలీ పేరును దాని పూర్వపు పేరు ‘మౌంట్ మెక్ కిన్లీ’గా మారుస్తున్నట్లు అంతర్గత విభాగం తెలిపింది. 2015లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా అలాస్కా పర్వతాన్ని డెనాలీగా అధికారికంగా గుర్తించారు. ఈ పేరును శతాబ్దాలుగా అలాస్కా స్థానికులు ఉపయోగిస్తున్నారు. అయితే ట్రంప్ పేరు మార్పును అలాస్కాలోని స్థానిక సమూహాలు విమర్శిస్తున్నాయి. -
గూగుల్ ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ పేరు మార్పు
అమెరికాలోని యూజర్ల కోసం గల్ఫ్ ఆఫ్ మెక్సికో(Gulf of Mexico) పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికా(Gulf of America)గా మార్చాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో గూగుల్ మ్యాప్స్(Google Maps) ఇటీవల ముఖ్యమైన అప్డేట్ను ప్రకటించింది. పేర్ల మార్పునకు సంబంధించి జియోగ్రాఫిక్ నేమ్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(జీఎన్ఐఎస్)కు యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది ఇంటీరియర్ సమాచారం అందించింది. దాంతో గూగుల్ మ్యాప్స్లో ఈ మేరకు త్వరలో అప్డేట్ చేస్తామని ఆల్ఫాబెట్ ఇంక్. తెలిపింది.అమెరికా యూజర్ల కోసం గల్ఫ్ ఆఫ మెక్సికోను ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’ అనే కొత్త పేరును ప్రతిబింబించేలా గూగుల్ మ్యాప్స్ ప్లాట్ఫామ్లో అప్డేట్ అందించనుంది. అధికారిక ప్రభుత్వ వర్గాలు పేరు మార్చిన తర్వాత ఈ మార్పు అమల్లోకి రానునున్నట్లు పేర్కొంది. యూఎస్ వెలుపల వినియోగదారుల కోసం, గూగుల్ మ్యాప్స్ స్పష్టత, ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి పాత పేరు ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ను, కొత్త పేరు ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’ను రెండింటినీ డిస్ప్లే చేయనుంది.ఇదీ చదవండి: చైనా ఏఐ డీప్సీక్పై ఓపెన్ఏఐ సీఈఓ స్పందనఅధికారిక ప్రభుత్వ వర్గాల్లో పేరు మార్పులకు సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు గూగుల్ మ్యాప్స్ సదరు పేరు మార్పులు చేయడం ఆనవాయితీ. గల్ఫ్ ఆఫ్ అమెరికా అప్డేట్తో పాటు, గూగుల్ మ్యాప్స్ అమెరికా వినియోగదారుల కోసం మౌంట్ మెకిన్లీని డెనాలీగా పేరు మార్చనుంది. ఒబామా హయాంలో మౌంట్ మెకిన్లీని డెనాలీగా పిలిచేవారు. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు ఖచ్చితమైన, సమగ్రమైన భౌగోళిక సమాచారం అందించేందుకు గూగుల్ మ్యాప్స్ సేవలందిస్తోంది. గతంలో సీ ఆఫ్ జపాన్(ఈస్ట్ సీ), పర్షియన్ గల్ఫ్ (అరేబియా గల్ఫ్)ల పేర్లు మార్చడం వల్ల కంపెనీ సవాళ్లను ఎదుర్కొంది. -
తప్పుదారి చూపిన గూగులమ్మ..
అన్నానగర్: గూగుల్ మ్యాప్స్పై ఆధారపడి పళని మురుగన్ ఆలయానికి బయలుదేరారు. ఈక్రమంలో డాక్టర్ దంపతులు కారు సహా బురదలో చిక్కుకున్నారు. వివరాలు.. ధర్మపురి జిల్లా నల్లంపల్లి ప్రాంతానికి చెందిన పళనిసామి (27). ఇతని భార్య కృతిక (27). ఇద్దరూ డాక్టర్లే. ఈ దంపతులకు 4 నెలల బాబు ఉన్నాడు. కృతిక తమ్ముడు పావేందర్ (25). ఇతను కూడా డాక్టర్. పళనిసామి తన కుటుంబంతో సహా పళని మురుగన్ ఆలయానికి వెళ్లి సామిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం రాత్రి భార్య, 4 నెలల పాప, బావమరిదితో కలిసి ధర్మపురి నుంచి పళనికి కారులో బయలుదేరాడు. కారును వావేందర్ డ్రైవ్ చేశాడు. శ్రీగూగుల్ మ్యాప్శ్రీ సాయంతో ధర్మపురి నుంచి పళని వైపు వస్తున్నారు. కారు కరూర్–దిండుక్కల్ నాలుగు లైన్ల హైవేపైకి వచ్చింది. సోమవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో వేడచందూర్ సమీపంలోని తమ్మనంపట్టి ప్రాంతంలో కారు ఫ్లై ఓవర్ దాటింది. నాలుగు లేన్ల రహదారిని తప్పించి కుడివైపున లింక్ రోడ్డులా ఉన్న మట్టిరోడ్డుపై తిరిగి వెళ్లాలని శ్రీగూగుల్ మ్యాప్శ్రీ సూచించినట్లు తెలుస్తోంది. ఇది నమ్మిన బావేందర్ కూడా కారును కుడివైపునకు తిప్పి నాలుగు లైన్ల రోడ్డును వదిలి మట్టిరోడ్డుపైకి వెళ్లాడు. ఈ క్రమంలో కారు ఒక్కసారిగా బురదలో చిక్కుకుంది. అనంతరం వేడచందూర్ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. వారి సహాయంతో బురదలో కూరుకుపోయిన కారును రోడ్డుపైకి తీసుకొచ్చారు. -
సరైన సమయానికి.. అనువైన ఫీచర్: ఎయిర్ క్వాలిటీ ఇట్టే చెప్పేస్తుంది
ఇప్పటి వరకు గూగుల్ మ్యాప్స్లో ఏదైనా ప్రదేశాలను సెర్చ్ చేయడానికి, కొత్త ప్రాంతాలను సందర్శించడానికి.. ఇతరత్రా వంటి వాటికోసం ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు సంస్థ తాజాగా ఎయిర్ క్వాలిటీని చెక్ చేయడానికి 'ఎయిర్ వ్యూ ప్లస్' (Air View+) అనే తీసుకువచ్చింది. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..ఈ వారం ప్రారంభంలో ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 491 గరిష్ట స్థాయికి చేరుకోవడంతో.. సంస్థ గాలిలోని ఎయిర్ క్వాలిటీ తెలుసుకోవడం ముఖ్యమని భావించింది. ఈ కారణంగానే ఎయిర్ వ్యూ ప్లస్ ఫీచర్ తీసుకువచ్చింది. ఇది ఏఐ ద్వారా పనిచేస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు వాతావరణంలోని గాలి నాణ్యతను గురించి తెలుసుకోవచ్చు.గూగుల్ ఎయిర్ వ్యూ ప్లస్ ఫీచర్ ఇండియాలోని వంద నగరాల్లోని గాలి నాణ్యతకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తుంది. సాధారణంగా.. గాలిలోని ఎయిర్ క్వాలిటీని సంబంధిత శాఖ అధికారులు వెల్లడిస్తేనే తెలిసేది. కానీ ఇప్పుడు గూగుల్ పరిచయం చేసిన కొత్త ఫీచర్ సాయంతో ఎప్పుడైనా తెలుసుకోవచ్చు.ఇదీ చదవండి: ఇంటర్నెట్ లేకుండా ట్రాన్సక్షన్స్: వచ్చేస్తోంది 'యూపీఐ 123 పే'గూగుల్ ఎయిర్ వ్యూ ప్లస్ ఫీచర్ కోసం.. క్లైమేట్ టెక్ సంస్థలు, ఆరస్సూర్, రెస్పిరర్ లివింగ్ సైన్సెస్ వంటివి కీలక పాత్ర పోషించాయి. అంతే కాకుండా ఈ ఫీచర్ను ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ హైదరాబాద్, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సీఎస్టీఈపీ వంటివి టెస్ట్ చేసి ధ్రువీకరించినట్లు సమాచారం.'ఎయిర్ వ్యూ ప్లస్'లో ఎయిర్ క్వాలిటీ కనుక్కోవడం ఎలా?•మొబైల్ ఫోన్లో గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయాలి.•సెర్చ్ బార్లో ఏదైనా లొకేషన్పై ట్యాప్ చేయాలి.•ఆలా చేసిన తరువాత లొకేషన్ పక్కనే నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (NAQI) కనిపిస్తుంది.•దానిపైన క్లిక్ చేసిన తరువాత టెంపరేషన్ కనిపిస్తుంది, దాని కిందనే ఎయిర్ క్వాలిటీ కూడా కనిపిస్తుంది. -
‘ఓలా మా డేటా కాపీ చేసింది’
స్వదేశీ డిజిటల్ మ్యాపింగ్ సేవల సంస్థ మ్యాప్ మై ఇండియా తన డేటాను ఓలా ఎలక్ట్రిక్ కాపీ చేసిందని ఆరోపించింది. ఓలా మ్యాప్స్లో సంస్థ తయారుచేసిన మ్యాప్ డేటాను వాడుతున్నట్లు మ్యాప్ మై ఇండియా చెప్పింది. గతంలో ఇరు కంపెనీలు చేసుకున్న ఒప్పందాన్ని ఓలా ఎలక్ట్రిక్ ఉల్లంఘించిందని తెలియజేస్తూ కోర్టును ఆశ్రయించింది.ఓలా ఎలక్ట్రిక్ బైక్లో మ్యాపింగ్ సేవలందించేందుకు రెండు కంపెనీలు గతంలో ఒప్పందం చేసుకున్నాయి. అయితే మ్యాప్ మై ఇండియా మాతృ సంస్థ సీఈ ఇన్ఫో సిస్టమ్స్ ద్వారా ‘కో-మింగ్లింగ్’, రివర్స్ ఇంజినీరింగ్, ఏపీఐ(అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్), ఎస్డీకే(సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్)లోని కీలక మ్యాప్ డేటా వివరాలను ఒప్పందానికి విరుద్ధంగా ఓలా కంపెనీ కాపీ చేసినట్లు ఆరోపణల్లో తెలిపింది. ఓలా ఒప్పంద నియమాలను ఉల్లంఘించినందుకు కోర్టులో దావా వేసినట్లు మ్యాప్ మై ఇండియా పేర్కొంది. ఈమేరకు మ్యాప్ మై ఇండియా సీఈ ఇన్ఫో సిస్టమ్స్ ద్వారా ఓలాకు నోటీసులు పంపించింది.ఈ వ్యవహారంపై ఓలా స్పందిస్తూ..మ్యాప్ మై ఇండియా చేసిన ఆరోపణనలను తీవ్రంగా ఖండించింది. సీఈ ఇన్ఫో సిస్టమ్స్ చేసిన వాదనలను తోసిపుచ్చింది. ఈ ఆరోపణలు దురుద్దేశపూరితమైనవని, తప్పుదోవ పట్టించేవని తెలిపింది. ఓలా ఎలక్ట్రిక్ వ్యాపార పద్ధతుల సమగ్రతకు కట్టుబడి ఉందని పేర్కొంది. మ్యాప్ మై ఇండియా పంపిన నోటీసుకు త్వరలో తగిన విధంగా స్పందిస్తామని చెప్పింది.ఇదీ చదవండి: రూ.1,799కే 4జీ ఫోన్!ఇదిలాఉండగా, జులై మొదటివారంలో ఓలా ప్లాట్పామ్లో గూగుల్ మ్యాప్స్ను వినియోగించబోమని ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. ఇందుకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక సొంత లొకేషన్ ఇంటెలిజెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. గూగుల్ మ్యాప్స్తో ఒప్పందం రద్దు చేసుకోవడం వల్ల కంపెనీకి ఏటా రూ.100 కోట్లు ఆదా అవుతాయని పేర్కొంది. గ్లోబల్ మ్యాపింగ్ లీడర్ గూగుల్ భారతదేశంలోని కస్టమర్ల కోసం గూగుల్ మ్యాప్స్ ధరలను 70 శాతం తగ్గించడం గమనార్హం. -
బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు.. కారు కంటే నడుస్తూ వెళ్లడమే బెటర్
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు పేరు చెబితేనే ట్రాఫిక్ సమస్యలు గుర్తుకువస్తాయి. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలుచుకునే బెంగళూరులో ఐటీ ఉద్యోగులు భారీగా నివసిస్తుండటంతో బెంగళూరు నగరంలో ట్రాఫిక్ కష్టాలు భరించలేనంత ఉంటుంది.కిలోమీటర్ దూరం ప్రయాణించాలంటే వాహనాల మధ్య గంటల తరబడి ఇరుక్కుపోవాల్సి ఉంటుంది. రోడ్లపైకి వస్తే తిరిగి ఎప్పుడు ఇంటికి వెళ్తామో కూడా తెలియని పరిస్థితులు బెంగళూరు నగరంలో కనిపిస్తూ ఉంటాయి. ఇక వానకాలం కావడంతో బెంగళూరులో రోడ్లు మరీ దారుణంగా తయారయ్యాయి.తాజాగా బెంగళూరు ట్రాఫిక్ గురించి గూగుల్ మ్యాప్స్ వెల్లడించిన అంశం ఆసక్తిగా మారింది. నెట్టింట్లో వైరల్గా మారింది. బెంగళూరు రోడ్లపై 6 కిలోమీటర్ల దూరం డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం కంటే, నడస్తూ వెళ్లడం ద్వారా త్వరగా చేరుకోవచ్చట. వి విషయాన్ని ఆయుష్ సింగ్ అనే వ్యక్తి గూగుల్ మ్యాప్ స్క్రీన్షాట్ను ట్విటర్లో షేర్ చేశాడు.ఇందులో బెంగళూరులో కేఆర్ పురం రైల్వే స్టేషన్ నుంచి గరుడాచార్ పాళ్యలోని బ్రిగేడ్ మెట్రోపొలిస్ వరకు ఏదైనా వాహనంలో వెళ్లడానికి 44 నిమిషాల సమయం పడితే, అదే దూరం నడిచి వెళ్లడానికి 42 నిమిషాలు పడుతుందని గూగుల్ మ్యాప్స్ చెబుతోంది. ఇది కేవలం బెంగుళూరులోనే సాద్యమంటూ షేర్ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింటా వైరల్గా మారింది.This happens only in Bangalore pic.twitter.com/MQlCP7DsU7— Ayush Singh (@imabhinashS) July 25, 2024 ఒక్కరోజులోనే మూడు లక్షలకు పైగా లైకులు సంపాదించింది. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. బెంగళూరు భారత్కు ట్రాఫిక్ రాజధాని అని, ముంబై, ఢిల్లీలో కూడా ఇదే రకమైన ట్రాఫిక్ ఉంటుందని చెబుతున్నారు. -
గూగుల్ ‘మ్యాప్’ వార్!
న్యూఢిల్లీ: దేశీయంగా ఓలా మ్యాప్స్ నుంచి పోటీ తీవ్రతరం కావడంతో గూగుల్ జోరు పెంచింది. భారత్లో యూజర్లను ఆకట్టుకోవడం కోసం గురువారం పలు సరికొత్త ఫీచర్లను ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జింగ్ స్టేషన్లు, ఫ్లైఓవర్లతో పాటు కారు డ్రైవర్లు ఇరుకు సందుల్లో చిక్కుకోకుండా ఏఐ ఆధారిత రూటింగ్ సమాచారం వంటివి ఇందులో ఉన్నాయి. ఓలా ఫౌండర్, సీఈఓ భవీశ్ అగర్వాల్ దేశీ డెవలపర్ల కోసం ఓలా మ్యాప్స్ను అందుబాటులోకి తీసుకొచి్చన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, గూగుల్ మ్యాప్స్ను వాడొద్దని కూడా ఆయన పిలుపునివ్వడంతో మ్యాప్స్ వార్కు తెరలేచింది. దేశీ డెవలపర్లకు గాలం వేయడానికి ఏడాది పాటు ఓలా మ్యాప్స్ను ఉచితంగా వాడుకునే సదుపాయాన్ని కూడా అగర్వాల్ ప్రకటించడం విశేషం. దీంతో గూగుల్ కూడా వెంటనే రంగంలోకి దిగింది. గూగుల్ మ్యాప్స్ ప్లాట్ఫామ్ను ఉపయోగించే డెవలపర్లకు ఆగస్ట్ 1 నుంచి 70 శాతం వరకు ఫీజులను తగ్గిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది. దేశీ యూజర్లకు మేలు చేసేందుకే... ఓలా పోటీ కారణంగానే ధరల కోత ప్రకటించాల్సి వచి్చందా అన్న ప్రశ్నకు గూగుల్ మ్యాప్స్ వైస్ ప్రెసిడెంట్, జీఎం మిరియమ్ డేనియల్ స్పందిస్తూ... వాస్తవానికి పోటీ సంస్థలపై మేము దృష్టి సారించమని, తమ యూజర్లు, డెవలపర్ల ప్రయోజనాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ‘మా పార్ట్నర్స్ చాన్నాళ్లుగా ధరలను తగ్గించాలని కోరుతున్నారు. మా యూజర్లతో పాటు డెవలపర్లకు మేలు చేయడంపై దృష్టి సారించాం. అందులో భాగంగానే రేట్ల కోతను ప్రకటించాం. వ్యాపార సంస్థలు, డెవలపర్లు, ప్రజలకు డిజిటల్ మ్యాపింగ్ను మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దడం కోసమే ఏఐ ఆధారిత రూటింగ్ తదితర కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టాం’ అని వివరించారు. భారత్లో ఇరుకు రోడ్లు అనేవి కారు డ్రైవర్ల సహనానికి పరీక్ష పెడుతుంటాయని, అందుకే వాటిని తప్పించుకునే విధంగా ఏఐ ఆధారిత రూటింగ్ ఆల్గారిథమ్ వ్యవస్థను తీర్చిదిద్దామని చెప్పారు. శాటిలైట్ చిత్రాలు, స్ట్రీట్ వ్యూతో పాటు భవనాల మధ్య దూరం, రోడ్ల రకాల వంటి సమాచారంతో రోడ్ల కచి్చతమైన వెడల్పును మ్యాప్స్లో చూడొచ్చని, తద్వారా సాధ్యమైనంత వరకు ఇరుకు సందుల్లో చిక్కుకోకుండా తప్పించుకునేందుకు వీలవుతుందని బ్లాగ్ పోస్ట్లో వివరించారు. మరోపక్క, బైకర్లు, పాదచారులు, ఇతర ప్రయాణికులు ఇప్పుడు ఈ ఇరుకు రోడ్లలో మరింత సురక్షితంగా, నమ్మకంగా వెళ్లొచ్చని చెప్పారు. అలాగే సంబంధిత రూట్లో ఎక్కడెక్కడ ఫ్లైఓవర్లు ఉన్నాయో కూడా ముందుగానే తెలియజేసే ఫీచర్ కూడా భారత్లో యూజర్లకు చాలా బాగా ఉపయోగపడుతుందన్నారు.ముందుగా ఎనిమిది నగరాల్లో... హైదరాబాద్తో సహా బెంగళూరు, చెన్నై, కోయంబత్తూరు, ఇండోర్, భోపాల్, భువనేశ్వర్, గౌహతి మొత్తం 8 నగరాల్లో ఈ ఫీచర్లు ఆండ్రాయిడ్ పరికరాల్లో ఈ వారంలోనే అందుబాటులోకి రానున్నాయి. మరిన్ని నగరాలతో పాటు ఐఓఎస్, కార్ప్లే సపోర్ట్ను కూడా త్వరలో తీసుకొస్తామని గూగుల్ పేర్కొంది. టూవీలర్ ఈవీ యూజర్లు చార్జింగ్ స్టేషన్ల సమాచారాన్ని అందించేందుకు ఎలక్ట్రిక్ పే, అథర్, కాజామ్, స్టాటిక్ వంటి దిగ్గజ చార్జింగ్ ప్రొవైడర్లతో గూగుల్ జట్టు కట్టింది. తద్వారా 8,000 చార్జింగ్ స్టేషన్ల సమాచారం దేశీయంగా గూగుల్ మ్యాప్స్తో పాటు గూగుల్ సెర్చ్లో కూడా లభిస్తుంది. కాగా, ఈ ఫీచర్ను తొలిసారిగా భారత్లోనే ప్రవేశపెట్టడం గమనార్హం. -
గూగుల్ మ్యాప్స్తో ఒప్పందం రద్దు.. రూ.100 కోట్లు ఆదా!
ప్రముఖ ఆన్లైన్ క్యాబ్ సర్వీస్ సంస్థ ఓలా గూగుల్ మ్యాప్స్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై ఓలా క్యాబ్స్ ప్లాట్పామ్లో గూగుల్ మ్యాప్స్ను వినియోగించబోమని తెలిపింది. ఇందుకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక లొకేషన్ ఇంటెలిజెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పింది. గూగుల్ మ్యాప్స్తో ఒప్పందం రద్దు చేసుకోవడం వల్ల కంపెనీకి ఏటా రూ.100 కోట్లు ఆదా అవుతాయని సంస్థ సహ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ఓలా క్యాబ్ సర్వీస్ల్లో గూగుల్ మ్యాప్స్ను రద్దు చేస్తున్నాం. ఇందుకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక లొకేషన్ ఇంటెలిజెన్స్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. గూగుల్తో ఒప్పందం రద్దు చేసుకోవడం వల్ల కంపెనీకు ఏటా రూ.100 కోట్లు ఆదా అవుతుంది. కొత్త సర్వీసులు అందుబాటులోకి రావాలంటే వినియోగదారులు తమ ఓలా యాప్ను అప్డేట్ చేసుకోవాలి. ఓలా లొకేషన్ ఇంటెలిజెన్స్లో స్ట్రీట్ వ్యూ, ఇండోర్ చిత్రాలు, డ్రోన్ మ్యాప్లు, 3డీ మ్యాప్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి’ అని చెప్పారు.ఓలా క్లౌడ్ సర్వీస్లను గతంలో మైక్రోసాఫ్ట్ అజూర్ నిర్వహించేది. కానీ ఇటీవల ఆ సంస్థతో కార్యకలాపాలు నిలిపేస్తున్నట్లు ఓలా ప్రకటించింది. అజూర్ స్థానంలో ‘క్రుత్రిమ్ ఏఐ క్లౌడ్’ సేవలు వినియోగించుకుంటున్నామని కంపెనీ తెలిపింది. ఈ క్రుత్రిమ్ ఏఐ మ్యాపింగ్ సొల్యూషన్స్ను కూడా అందిస్తుందని పేర్కొంది. త్వరలో ఈ క్లౌడ్లో మరిన్ని ప్రోడక్ట్ అప్డేట్లు వస్తాయని చెప్పింది.ఇదీ చదవండి: సంగీత్లో అదిరిపోయే స్టెప్పులేసిన అంబానీ కుటుంబంఅక్టోబర్ 2021లో ఓలా పుణెకు చెందిన జియోసాక్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ ‘జియోస్పేషియల్’ సేవలను అందిస్తోంది. గూగుల్ మ్యాప్స్ స్థానంలో ఓలా క్యాబ్స్ జియోసాక్ సేవలు వినియోగించుకుంటుంది. దాంతో కంపెనీకు ఏటా రూ.100 కోట్లు ఆదా అవుతుంది. -
గూగుల్ మ్యాప్స్ అనుసరిస్తూ నదిలోకి..
కాసర్గోడ్: అత్యవసరంగా ఆస్పత్రికి బయల్దేరిన ఇద్దరు యువకులు అనూహ్యంగా మృత్యువు అంచులదాకా వెళ్లొచ్చారు. పొరుగు రాష్ట్రం కర్ణాటకలోని ఆస్పత్రికి గూగుల్ మ్యాప్స్లో చూపించే మార్గంలో బయల్దేరి మార్గమధ్యంలో కారును నదిలోకి పోనిచ్చారు. నది ప్రవాహంలో కారు అదృష్టవశాత్తు ఒక చెట్టుకు చిక్కుకోవడంతో బయటికొచ్చి ప్రాణాలు కాపాడుకోగలిగారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేరళలోని కాసర్గోడ్ జిల్లాలోని పల్లాంచి ప్రాంతంలో ఇద్దరు యువకులు ఆదివారం తెల్లవారుజామున కర్ణాటకలోని ఆస్పత్రికి కారులో బయల్దేరారు. ‘‘గూగుల్ మ్యాప్స్ ప్రకారం వెళ్తుంటే ఎదురుగా నీళ్లు కనిపించాయి. రోడ్డుపై నీళ్లు నిలిచాయేమోనని అలాగే వెళ్లాం. అది నదిలో లోతట్టు ప్రాంతంలో కట్టిన వంతెన అని తర్వాత అర్థమైంది. ఇరువైపుల రక్షణ గోడ లేదు. నది ఉప్పొంగి పై నుంచి ప్రవహిస్తోంది. ప్రవాహం ధాటికి మా కారు కొట్టుకుపోయింది. ఒడ్డువైపుగా ఒక చెట్టుకు చిక్కుకుని ఆగింది. పోలీసులకు మా లొకేషన్ షేర్ చేయడంతో సమయానికి వచ్చి కాపాడారు. మాకిది నిజంగా పునర్జన్మ’’ అని యువకుల్లో ఒకరైన అబ్దుల్ రషీద్ చెప్పారు. సంబంధిత వీడియో వైరల్గా మారింది. -
గూగుల్ కొత్త ఫీచర్ తో ఇకపై ఆ కష్టం తీరినట్టే
-
గూగుల్ మ్యాప్స్లో కొత్త ఫీచర్.. ఇకపై ఆ కష్టం తీరినట్టే..
గూగుల్ మ్యాప్స్ పుణ్యమా అని ఇప్పుడు భూ ప్రపంచం మీద మనకు తెలియని ప్రదేశమంటూ లేకుండా పోయింది. ఫోన్ లాక్ తీసేశామా... డెస్టినేషన్ టైప్ చేసి స్టార్ నొక్కామా... రయ్యి రయ్యి మంటూ దుసుకెళ్లామా అన్నట్టు ఉంటుంది గూగూల్ మ్యాప్స్తో వ్యవహారం. బాగానే ఉంది కానీ... నిమిషం తిరిగే సరికి ఫోన్ లాక్ అయిపోతుంది కదా.. మళ్లీ మ్యాప్స్ ఓపెన్ చేయాలంటే ఇబ్బందే కదా? అంటున్నారా? ఎస్. అది ఇప్పటివరకూ ఉన్న సమస్య. ఇకపై మాత్రం ఉండబోదు. ఎందుకంటే గూగుల్ ఈ ఇబ్బందిని తొలగించే ఏర్పాట్లు చేసింది మరి! గూగుల్ మ్యాప్స్లో ఇప్పటికే వినియోగదారులకు ఉపయోగపడే అనేక ఫీచర్లను దశలవారీగా ప్రవేశపెడుతూనే ఉంది ఆ కంపెనీ. వాట్సప్ అవసరం లేకుండానే రియల్ టైమ్ లొకేషన్ షేరింగ్, ఫ్యూయెల్ సేవింగ్ వంటి ఫీచర్లను తీసుకొచ్చిన గూగుల్ మ్యాప్స్.. తాజాగా లాక్ స్క్రీన్పైనే లొకేషన్ కనిపించేలా ఏర్పాట్లు చేసింది. ఏదైనా ప్రదేశానికి వెళ్లడానికి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి వివరాలను అందిస్తే సమయం, షార్ట్కట్లు కనిపిస్తాయి. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసిన తర్వాత ఫోన్ లాక్ అయితే తిరిగి లాన్ తీసి వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్తో మొబైల్ లాక్ స్క్రీన్పై ఈటీఏ (ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ అరైవల్), వెళ్లాల్సిన ప్రదేశానికి డైరెక్షన్స్ ప్రత్యక్షమవుతాయి. అంటే ఇకపై గూగుల్ మ్యాప్స్ వినియోగించాలంటే ప్రత్యేకంగా ఫోన్ లాక్ ఓపెన్ చేసి ఉంచాల్సిన అవసరం ఉండదు. అలాగే, ఏదైనా లొకేషన్కు సంబంధించిన వివరాలు ఎంటర్ చేయగానే.. స్టార్ట్ బటన్ క్లిక్ చేయకుండానే ప్రివ్యూ కనిపిస్తుంది. ఒకవేళ మీరు వేరే రూట్లో ప్రయాణిస్తుంటే.. ఆటోమేటిక్గా రూట్ అప్డేట్ అవుతుంది. ఇదీ చదవండి..పిండం వయసును నిర్ధారించే ఏఐ.. ఎవరు తయారు చేశారంటే.. ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే.. గూగుల్ మ్యాప్స్లో గ్లాన్సబుల్ ఫీచర్ డీఫాల్ట్గా ఆఫ్లో ఉంటుంది. యాప్ ఓపెన్ చేసి పైన కుడివైపు కనిపించే మీ ప్రొఫైల్ ఐకాన్పై క్లిక్ చేయండి. అందులో సెట్టింగ్స్ను ఎంచుకొని కిందకు స్క్రోల్ చేయగానే నావిగేషన్ సెట్టింగ్స్ ఆప్షన్ను ఎంచుకోవాలి. కిందకు స్క్రోల్ చేస్తే ‘గ్లాన్సబుల్ డైరెక్షన్స్ వైల్ నావిగేటింగ్’ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. -
వాట్సప్ లేకున్నా లొకేషన్ షేర్ చేయండిలా..
మనం వెళుతున్న ప్రాంతాలకు రూట్ తెలియకపోతే వెంటనే అప్పటికే అక్కడ ఉంటున్న వారిని లొకేషన్ షేర్ చేయమని అడుగుతూంటాం. వారు వెంటనే వాట్సప్లో లొకేషన్ షేర్ చేస్తారు. దాని ఆసరాగా చేసుకుని గమ్యం చేరుతాం. కానీ కొన్నిసార్లు వాట్సప్తోపాటు ఇతర లొకేషన్ షేరింగ్ యాప్లు పనిచేయకపోతే ఎలా.. అసలు వాట్సప్ వాడని వారు ఎలా వారి లొకేషన్ షేర్ చేయాలి.. అనే అనుమానం వచ్చిందా. అయితే అలాంటి వారికోసం గూగుల్ మనం వెళ్లే రూట్లు, షార్ట్ కట్ మార్గాలను తెలుసుకోవడానికి తన గూగుల్ మ్యాప్స్లో కొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. రూట్ మ్యాప్పై రియల్ టైం లొకేషన్ షేరింగ్ ఫీచర్ను అందిస్తుంది. ఇప్పటివరకు రియల్ టైం లొకేషన్ షేర్ చేయాలంటే తప్పనిసరిగా వాట్సప్ వంటి మరో యాప్ మీద ఆధార పడాల్సిందే. ఇక నుంచి ఇటువంటి ఇబ్బందులకు తెర దించుతూ గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ సాయంతో ఏ ఇతర యాప్స్ లేకుండా కేవలం సాధారణ మెసేజ్తో రియల్ టైం లొకేషన్ షేర్ చేయొచ్చు. ఇదీ చదవండి: మస్క్ చేతికి వొడాఫోన్ ఐడియా..? క్లారిటీ ఇచ్చిన టెలికాం సంస్థ ఈ ఫీచర్ను ఉపయోగించుకునేందుకు గూగుల్ మ్యాప్స్ యాప్లో లాగిన్ అవ్వాలి. ఫ్రొఫైల్ అకౌంట్పై క్లిక్ చేసి అందులో లొకేషన్ షేరింగ్ ఆప్షన్ ఎంచుకోవాలి. స్క్రీన్పై కనిపిస్తున్న న్యూ షేర్పై క్లిక్ చేసి సమయాన్ని సెట్ చేసుకోవచ్చు. లేదా ‘అంటిల్ యు టర్న్ దిస్ ఆఫ్’ ఆప్షన్ ఎంచుకొని కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకొని మెసేజ్ పంపించాలి. -
గూగుల్ మ్యాప్స్ మీ పెట్రోలును ఆదా చేస్తుందా?
గూగుల్ మ్యాప్స్ ఉంటే ఎక్కడికైనా వెళ్లిరావొచ్చనే ధీమా ఉంటుంది. కొన్నిసార్లు కచ్చితమైన లోకేషన్లు చూపించకపోయినా.. మనం ఎంచుకున్న లోకేషన్ దగ్గరి వరకు వెళ్లేలా సహాయపడుతుంది. ఈ గూగుల్ మ్యాప్స్ను సుదూర ప్రాంతాలు, కొత్త ప్రాంతాలకు వెళుతున్నప్పుడు వెళ్లే రూట్తోపాటు వేగం తెలుసుకోవడానికి ఉపయోగిస్తూంటాం. అయితే గూగుల్ మ్యాప్స్ ఇకమీదట ఫ్యూయల్ పొదుపు చేయడంలోనూ సహాయపడనుంది. ప్రయాణంలో ఫ్యుయల్ పొదుపు చేయడానికి గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ‘ఫ్యుయల్ ఎఫిషియంట్ రూట్స్’ అనే పేరుతో గూగుల్ యూజర్లకు ఈ ఫీచర్ను పరిచయం చేసింది. ఇప్పటికే అమెరికా, ఐరోపా యూనియన్ దేశాలు, కెనడాల్లో వినియోగంలో ఉన్న ఈ ఫీచర్ ఇక భారత్లో అందుబాటులోకి తెచ్చింది. ఈ గూగుల్ మ్యాప్స్ ఫ్యూయల్ సేవింగ్స్ ఫీచర్ ఎనేబుల్ చేస్తే.. మనం వెళ్లే రూట్లో లైవ్ ట్రాఫిక్ అప్ డేట్స్, రహదారులు, ఇంధన సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది. వాహన వేగం, ఫ్యుయల్ వాడకం రెండింటిని పరిగణనలోకి తీసుకుని అందుకు అనుకూల రూట్ చూపుతుంది. అలాగే ఆ రూట్లో వెళ్లడం వల్ల ఎంత ఫ్యుయల్ ఆదా అవుతుందో తెలుపుతుంది. ఇలా సెట్ చేసుకోండి.. గూగుల్ మ్యాప్స్ యాప్ ఓపెన్ చేసి ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి. ‘సెట్టింగ్స్’లోకి వెళ్లి ‘నేవిగేషన్ సెట్టింగ్స్’ ఎంచుకోవాలి. కిందకు స్క్రోల్ చేస్తే అక్కడ కనిపించే ‘రూట్ ఆప్షన్’ అనే ట్యాబ్లో ‘ప్రిఫర్ ఫ్యుయల్ ఎఫిసెంట్ రూట్స్’ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి. వాహనం ఇంజిన్, ఫ్యుయల్ టైప్ను ఎంచుకోవాలి. నేవిగేషన్ ట్యాబ్ లోనే టోల్ ధర, స్పీడో మీటర్ వంటి ఆప్షన్లు ఎంచుకోవచ్చు. వాహన వేగంతోపాటు మీరు వెళ్లే రూట్లో ఎంత టోల్ ఫీజు పే చేయాలో ఈ ఫీచర్ చెబుతుంది. ఇదీ చదవండి: వేలకోట్ల అప్పు తీర్చే యోచనలో అదానీ గ్రూప్.. ఎలాగంటే.. -
వేగానికి చెక్ పెట్టే కొత్త ఫీచర్ - ఇదెలా పనిచేస్తుందంటే?
రోజు రోజుకి రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం.. మితిమీరిన వేగం. ఈ వేగాన్ని నియంత్రిస్తే సగం ప్రమాదాలు తగ్గుతాయనే ఉద్దేశ్యంతో గూగుల్ తన మ్యాప్స్లో ఓ కొత్త ఫీచర్ తీసుకువచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ రోడ్డుపై ప్రయాణించే సమయంలో వాహన వినియోగదారుడు తన మొబైల్లోని గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి, దానికి కుడివైపున ఉన్న ప్రొఫైల్ ఐకాన్ని ట్యాప్ చేసి సెట్టింగ్స్ ఎంచుకోవాలి, ఆ తరువాత స్క్రీన్ కిందికి స్క్రోల్ చేస్తే.. అక్కడ న్యావిగేషన్ సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి డ్రైవింగ్ సెక్షన్ ఆప్షన్లో స్పీడోమీటర్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. ఇలా సెలక్ట్ చేసుకున్న తరువాత మీరు ఎంత వేగంగా ప్రయాణిస్తున్నారనే సమాచారం ఎప్పటికప్పుడు పొందవచ్చు. వేగం పెరిగినటప్పుడు ముందుగానే మిమ్మల్ని హెచ్చరిస్తుంది కూడా. ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ మొబైల్స్లో మాత్రమే అందుబాటులో ఉంది. మితిమీరిన వేగం వల్ల కలిగే అనర్థాలు పరిమితిని మించిన వేగంతో వాహనదారుడు ప్రయాణించినట్లైతే.. అత్యవసర సమయంలో వాహనాన్ని కంట్రోల్ చేయడం అసాధ్యం, అలాంటి సమయంలో అనుకోని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు కఠినమైన నిబంధనలు ప్రవేశపెట్టాయి. ఇదీ చదవండి: ఎయిర్ ఇండియా విమానంలో వాటర్ లీక్ - వీడియో వైరల్ పరిమిత వేగాన్ని మించి వాహనాన్ని డ్రైవ్ చేస్తే.. వారికి భారీ జరిమానాలు విధించడం లేదా లైసెన్స్ క్యాన్సిల్ చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎంత వేగంలో వెళ్తున్నామని విషయాన్నీ కూడా మర్చిపోయే అవకాశం ఉంది, అలంటి వారికి గూగుల్ మ్యాప్స్లోని కొత్త ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. -
కొంపముంచిన గూగుల్ మ్యాప్.. ఇద్దరు డాక్టర్లు మృతి
తిరువనంతపురం: కేరళలో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గూగుల్ మ్యాప్ను అనుసరిస్తున్న ఈ కారు ఎడమవైపుకు వెళ్లాల్సి ఉండగా పొరపాటున నేరుగా వెళ్లడంతో కారు పెరియార్ నదిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు డాక్టర్లు మృతి చెందగా మరో ముగ్గురు మాత్రం సురక్షితంగా బయట పడ్డారని పోలీసులు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి ఇద్దరు డాక్టర్లతో పాటు మరో ముగ్గురు కలిసి హోరువానలో కారులో వెళ్తున్నారు. వీరు కొచ్చిన్ నుంచి కొడంగళ్లుర్ గూగుల్ మ్యాప్ ఆధారంగా తిరిగి వెళ్తుండగా వర్షం మరింత జోరుగా కురిసింది. మధ్యలో వారు ఎడమవైపు వెళ్లాలని మ్యాప్ సూచించగా వారు పొరపాటున నేరుగా వెళ్లిపోయారు. ఎదురుగా మొత్తం నీరు కనిపిస్తున్నప్పటికీ అక్కడ రోడ్డు నీటిలో మునిగి ఉంటుందని భావించి కారును అలాగే ముందుకు పోనిచ్చారు. కారు నీటిలోకి వెళ్లిన క్షణాల వ్యవధిలోనే అందులోకి జారుకుని పూర్తిగా మునిగిపోయింది. కారు మునిగిపోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫోన్ చేయగా అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చెరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వారిలో ముగ్గురు మాత్రం చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారని, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించామన్నారు. మిగిలిన ఇద్దరు మాత్రం ఆ నీటిలో గల్లంతయ్యారన్నారు. గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి నదిలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టగా వారిద్దరు అప్పటికే మృతిచెందడంతో మృతదేహాలను మాత్రం వెలికితీశారు. మృతులు అద్వైత్(29), అజ్మల్(29) ఇద్దరూ కొచ్చిన్ లో ఒకే ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్లుగా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: మంగళసూత్రం మింగిన గేదె.. ఐదోతనం కాపాడిన వైద్యుడు! -
గూగుల్ మ్యాప్స్లో అద్భుతమైన అప్డేట్స్, చూసి మురిసిపోవాల్సిందే!
న్యూఢిల్లీ: సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్ తన మాప్స్లో కొత్త ఫీచర్ను లాంచ్ చేసింది. తన నావిగేషన్ యాప్ వినియోగదారులను మరింత ఆకట్టుకునేలా కొత్త అప్డేట్స్ను పారిస్లో జరిగిన కార్యక్రమంలో కంపెనీ ప్రకటించింది. ఇమ్మర్సివ్ వ్యూ అనే కొత్త ఫీచర్తో గూగుల్ మ్యాప్స్లో జత చేసింది. ప్రస్తుతం యూరప్లోని ఐదు కీలక నగరాల్లో తీసుకొచ్చిన ఈ ఫీచర్ను త్వరలోనే మిగిలిన నగరాల్లో కూడా అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ ద్వారా గూగుల్మ్యాప్లో మరింత స్పష్టంగా ఆయా ప్రదేశాలను మనకు చూపించనుంది. గూగుల్ మ్యాప్స్లో సాధారణ స్ట్రీట్ వ్యూ ఫీచర్ లాగానే ఉంటుంది.మరిన్ని స్ట్రీట్ వ్యూ, ఏరియల్ ఇమేజెస్తో వర్చువల్ వరల్డ్ మోడల్ను అందిస్తుంది.వాతావరణం, ట్రాఫిక్, లొకేషన్ ఎంత బిజీగా ఉంది అనే వివరాలుంటాయి. రాబోయే నెలల్లో ఆండ్రాయిడ్, ఐవోఎస్ లో ప్రపంచవ్యాప్తంగా “గ్లాన్సబుల్ డైరెక్షన్స్” అనే కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తుందని కంపెనీ ప్రకటించింది. లండన్, లాస్ ఏంజిల్స్, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో ,టోక్యో అనే ఐదు నగరాల్లో ఇమ్మెర్సివ్ వ్యూ ని తీసుకొచ్చింది. అలాగే ఆమ్స్టర్డామ్, డబ్లిన్, ఫ్లోరెన్స్, వెనిస్లతో సహా మరిన్ని నగరాలకు ఈ ఫీచర్ను విడుదల చేయాలని భావిస్తోంది. తద్వారా ఆయా నగరాలను సందర్శించే ముందు ప్లాన్ చేసుకోవడంతోపాటు, దానిగురించి అవగాహన పొందడంలో యూజర్లకు సహాయపడుతుందని ఒక బ్లాగ్ పోస్ట్లో గూగుల్ తెలిపింది. ఈ ఫీచర్లోని ఎడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా కంప్యూటర్ వ్యూలో డిజిటల్ వరల్డ్ని వీక్షించవచ్చనిపేర్కొంది. ఈ వాస్తవిక దృశ్యాలను రూపొందించడానికి సాధారణ చిత్రాలను 3డీ ఇమేజెస్గా మార్చే అధునాతన ఏఐ సాంకేతికత అయిన న్యూరల్ రేడియన్స్ ఫీల్డ్లను (NeRF) ఉపయోగిస్తుందని గూగుల్ తెలిపింది. ఆమ్స్టర్డామ్లోని రిజ్క్స్ మ్యూజియం వీడియోను షేర్ చేసింది. వర్చువల్గా బిల్డింగ్ పైన వున్న ఫీలింగ్ కలుగుతుందని వెల్లడించింది. అలాగే ఏటీఎంలు, రెస్టారెంట్లు, పార్కులు, రెస్ట్రూమ్లు, లాంజ్లు, టాక్సీస్టాండ్లు, రెంటల్ కార్స్, ట్రాన్సిట్ స్టేషన్లు వంటి అనేక విషయాలను గుర్తించడంలో సహాయపడటానికి మరో ఫీచర్ యాడ్ చేసింది. ఏఐ, ఆగ్మెంటెడ్ రియాలిటీ సాయంతో రూపొందించిన “సెర్చ్ విత్ లైవ్ వ్యూ” గురించి కూడా పోస్ట్ వెల్లడించింది. ఈ లైవ్ వ్యూ ని లండన్, లాస్ ఏంజెల్స్, న్యూయార్క్, పారిస్, శాన్ ఫ్రాన్సిస్కో టోక్యోలలో ప్రారంచింది. బార్సిలోనా, బెర్లిన్, ఫ్రాంక్ఫర్ట్, లండన్, మాడ్రిడ్, మెల్బోర్న్, పారిస్, ప్రేగ్, సావో పాలో, సింగపూర్, సిడ్నీ తైపీ వంటి అనేక నగరాల్లోని 1,000 కొత్త విమానాశ్రయాలు, రైలు స్టేషన్లు , మాల్స్ లాంటి వివరాలు రానున్న నెలల్లో అందిస్తామని గూగుల్ వెల్లడించింది. కాగా కంపెనీ తన I/O డెవలపర్ కాన్ఫరెన్స్లో గత సంవత్సరం ఇమ్మర్సివ్ వ్యూని తొలిసారి ప్రకటించింది. ఈ ఫీచర్ 2022 చివరిలో అందుబాటులోకి వస్తుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.అప్పటినుంచి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ఫీచర్ను ఎట్టకేలకు లాంచ్ చేసింది. Google demos its new immersive maps view at its event in Paris today. pic.twitter.com/LjjXDy15gp — Richard Holmes (@richeholmes) February 8, 2023 Are you the sort of person who needs to get the feel of somewhere before you commit? 🗺 With immersive view on Google Maps, you can see what a neighborhood is like before you even set foot there📍 ✨ Coming to more cities in the next few months ✨#googlelivefromparis pic.twitter.com/VPvqHP25ai — Google Europe (@googleeurope) February 8, 2023 -
తప్పుదారి చూపిన గూగుల్.. ఒక్కసారిగా అవాక్కైన ప్రయాణికులు!
అన్నానగర్(చెన్నై): గూగుల్ మ్యాప్ను అనుసరిస్తూ.. ఓ డ్రైవర్ శుక్రవారం కడలూరు బస్టాండ్లోకి లారీని తీసుకెళ్లడం కలకలం రేపింది. వివరాలు.. మార్గం తెలియని పట్టణాల్లో వెళ్తున్నప్పుడు ఆండ్రాయిడ్ సెల్ఫోన్లో గూగుల్ మ్యాప్ను అనుసరించి డ్రైవర్లు ప్రయాణిస్తుంటారు. అయితే గూగుల్ మ్యాప్ తప్పు చూపిచడంతో ఒక్కోసారి ప్రమాదలకు సైతం గురవుతుంటారు. వివరాలు.. శుక్రవారం కడలూరులోని ఓ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి తిరుకోవిలూరు మీదుగా బెంగళూరుకు ట్రక్కులో రసాయనాలకు సంబంధించిన ముడిసరుకును ఓ డ్రైవర్ లారీలో లోడ్ చేస్తున్నాడు. షార్ట్ కట్ కోసం వెతుకుతున్న అతను గూగుల్ మ్యాప్స్ సహాయం కోరాడు. దాని ప్రకారం గూగుల్ మ్యాప్ ద్వారా కడలూరు ముత్తునగర్, ఇంపీరియల్ రోడ్డుకు వచ్చి లారె¯న్స్ రోడ్డు, వన్వే రోడ్డుకు వచ్చాడు. కానీ అక్కడ రైల్వే సొరంగం ఉండడంతో అది దాటి వెళ్లలేక వాహనాన్ని అక్కడే నిలిపాడు. ట్రాఫిక్ సమస్య ఏర్పడి ఆటో డ్రైవర్లు గొడవ పడడంతో గూగుల్ మ్యాప్స్ను అనుసరించి వస్తూ.. ఇక్కడ ఇరుక్కుపోయానని చెప్పాడు. తర్వాత ముందుకు పోనిచ్చే క్రమంలో లారీని బస్ స్టేషన్లోకి తీసుకెళ్లాడు. లారీ ఒక్కసారిగా బస్ స్టేషన్లోకి రావడంతో ప్రయాణికులు అవాక్కయ్యారు. తర్వాత స్థానికుల సహాయంతో డ్రైవర్ ఎలాగో అలా.. లారీని మెయిన్ రోడ్డులోకి తీసుకొచ్చాడు. ఈక్రమంలో ట్రాఫిక్కు భారీగా అంతరాయం ఏర్పడడంతో ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. చదవండి: ఆలయాల్లోకి సెల్ఫోన్లు నిషేధం.. వస్త్రధారణ సరిగా ఉండాలన్న మద్రాస్ హైకోర్టు -
గూగుల్ మ్యాప్స్లో కొత్త ఫీచర్.. ఇకపై ఆ సమస్య ఉండదబ్బా!
సాధారణంగా కొత్త ప్రదేశాలకు వెళ్లాలంటే మనకి మొదట గుర్తొచ్చేది గూగుల్ మ్యాప్స్. చేతిలో మొబైల్ అందులో గూగుల్ మ్యాప్స్ యాప్ ఉంటే చాలు ఏ ప్రాంతానికైనా ఈజీగా వెళ్లచ్చు. ఇక్కడి వరకు బాగానే ఉంది కాకపోతే ఇక్కడే ఓ చిక్కు కూడా ఉంది. ఈ యాప్ గమ్యాన్ని చూపించే క్రమంలో ఒక్కో సారి మనం వెళ్లాల్సిన ప్రదేశం పక్కనే ఉన్న చుట్టూ తిరిగేలా చేస్తుంది. దీని వల్ల వాహనదారులు సమయం వృథా కావడంతో పాటు ఇంధనపు ఖర్చు కూడా ఎక్కవగానే అవుతుంది. ఇలాంటి ఘటనలు చాలా మందికి ఎదురయ్యే ఉంటాయి. అందుకే ఈ సమస్యను అధిగమించేలా సరికొత్త ఫీచర్ను గూగుల్ మ్యాప్స్ తీసుకొచ్చింది. ఎకో ఫ్రెండ్లీ రూట్ పేరుతో వినియోగదారుడు వెళ్లాల్సిన గమ్యాన్ని అతి తక్కువ దారులను చూపిస్తూ ఇంధనం అయ్యేలా చూస్తుంది. దీని వల్ల మన సమయం, పెట్రోల్ తద్వారా మన ఖర్చు కూడా ఆదా అవుతుంది. "ఎకో-ఫ్రెండ్లీ రూట్" ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతోంది. అమెరికా, కెనడాలో ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ ఫీచర్ సుమారు అర మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించినట్లు అంచనా అని గూగుల్ చెప్పింది. ఐరోపా అంతటా 40 దేశాల వరకు ఈ ఫీచర్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇటీవలే జర్మనీలో కూడా ఈ ఫీచర్ను ప్రవేశపెట్టింది. చదవండి: జనవరిలో మహీంద్రా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ.. మరో రికార్డ్ క్రియేట్ చేస్తుందా! -
వార్నింగ్.. ఈ ట్రిక్తో మనల్ని ఈజీగా ట్రాక్ చేస్తారు!
టెక్నాలజీ పుణ్యమా అని ప్రపంచం మొత్తం ప్రజల అరచేతుల్లోకి వచ్చేసింది. ఇక మొబైల్ ఉంటే చాలు ఏదైనా మన ముందుకే వస్తోంది. తినే తిండి నుంచి, షాపింగ్ వరకు ఇంటి నుంచి కదలకుండా ప్రజలు వారి పనులు పూర్తి చేసుకుంటున్నారు. నాణానికి రెండు వైపులు ఉన్నట్లే టెక్నాలజీ వల్ల కూడా లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీ వల్ల వ్యక్తులు ఎక్కడ ఉన్నారో ఈజీగా కనిపెట్టవచ్చు. ఇంకో రకంగా చెప్పాలంటే సులువుగా ట్రాక్ చేయవచ్చు. దీన్ని ఈ టెక్నాలజీని కొందరు మంచికి మరికొందరు చెడుకి కూడా వాడే అవకాశాలు ఉన్నాయి. ఇలా ట్రాక్ చేసేయండి! సాధారణంగా ఎక్కడికైనా వెళ్లాలన్నా, ఏ ప్రదేశాన్నికనుక్కోవాలన్నా అందరి చూపు గూగుల్ మ్యాప్స్ వైపు. అంతేనా ఒకరిని ట్రాకింగ్ చేయాలంటే కూడా అదే దిక్కుగా మారింది. దీని ద్వారా వ్యక్తుల లొకేషన్ను ట్రాక్ చేయవచ్చు. వాళ్లు ఎక్కడికి వెళుతున్నారో కూడా తెలుసుకోవచ్చు. కాకపోతే దానికి ఎదుటివంటి పర్మిషన్ ఉండాలి. ఇప్పుడు మీకు కావాల్సిన వ్యక్తి లొకేషన్ ను ఎలా ట్రాక్ చేయాలో ఓ లుక్కేద్దాం. ఆండ్రాయిడ్ ఫోన్లో అయితే వాట్సప్లో లైవ్ లొకేషన్ షేర్ చేస్తే ఒక వ్యక్తి మరో వ్యక్తిని ట్రాక్ చేయవచ్చు. అదే ఐఫోన్, ఐపాడ్ అయితే గూగుల్ మ్యాప్స్ లో ట్రాక్ చేయాలనుకునే ఎదుటి వ్యక్తి జీమెయిల్ ఐడీని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆపై గూగుల్ మ్యాప్స్ లో మీ ప్రొపైల్ ను క్లిక్ చేసి ట్రాక్ చేయాలనుకునే వ్యక్తిని యాడ్ చేయాలి. తర్వాత షేర్ లోకేషన్ బటన్ ను క్లిక్ చేసి ఎవరికి షేర్ చేయాలనుకుంటున్నారు, ఎంతసేపు అనే వివరాలను ఇవ్వాలి. కాంటాక్ట్ నెంబర్లను యాడ్ చేయాలి. ట్రాకింగ్కు రెడీగా ఉన్నప్పుడు మీరు షేరింగ్ బటన్ను క్లిక్ చేస్తే మీరు సెలక్ట్ చేసుకున్న వ్యక్తులు మిమ్మల్ని ట్రాక్ చేయడానికి వీలు కుదురుతుంది. ఇక్కడ వరకు మన అనుమతితోనే జరుగుతుంది. అయితే మనం గుర్తు పెట్టుకోవాల్సి విషయం ఏంటంటే కొందరు ఈ ట్రిక్ని మంచికి కాకుండా చెడుగా కూడా ఉపయోగించే అవకాశం ఉంది. అందుకే మన ఈమెయిల్కి లేదా ఫోన్కి మెసేజ్ రూపంలో తెలియని వ్యక్తులు లింక్లు పంపితే, వాటిని ఓపన్ చేయకుండా, వెంటనే డెలీట్ చేయడం ఉత్తమమని నిపుణులు చెప్తున్నారు. చదవండి: Anand Mahindra: 'ప్రకృతి అందరి సరదా తీర్చేస్తుంది' కావాలంటే చూడండి.. ఆనంద్ మహీంద్రా వైరల్ వీడియో టెలిగ్రామ్, వాట్సప్లో ఈ ఇన్వెస్ట్మెంట్ సలహాలు విన్నారో.. కొంప కొల్లేరే! -
గూగుల్ స్ట్రీట్ వ్యూ 360
-
గూగుల్ గుడ్ న్యూస్: ‘స్ట్రీట్ వ్యూ’ని ఎంజాయ్ చేయండి!
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా తమ గూగుల్ మ్యాప్స్లో ’స్ట్రీట్ వ్యూ’ ఫీచర్ను భారత మార్కెట్లో మరోసారి తీసుకొచ్చింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై తదితర 10 నగరాల్లో 1,50,000 కి.మీ. విస్తీర్ణంలో ఇది బుధవారం నుండి అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం జెనెసిస్ ఇంటర్నేషనల్, టెక్ మహీంద్రాతో జట్టు కట్టినట్లు పేర్కొంది. స్థానిక సంస్థల భాగస్వామ్యంతో స్ట్రీట్ వ్యూను అందుబాటులోకి తేవడం ఇదే తొలిసారని వివరించింది. 2022 ఆఖరు నాటికి ఈ ఫీచర్ను 50 నగరాలకు విస్తరించే ప్రణాళికలు ఉన్నట్లు గూగుల్ పేర్కొంది. ఏదైనా ప్రాంతం ఇమేజీని 360 డిగ్రీల కోణంలో చూసేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. గతంలోనే దేశీయంగా ప్రవేశపెట్టినప్పటికీ భద్రతా కారణాల రీత్యా పూర్తి స్థాయిలో విస్తరించేందుకు కేంద్రం అనుమతించలేదు. మరోవైపు, ట్రాఫిక్ సిగ్నల్ టైమింగ్లను మెరుగుపర్చేందుకు బెంగళూరు ట్రాఫిక్ పోలీస్ విభాగంతో కూడా జట్టు కట్టినట్లు గూగుల్ వివరించింది. త్వరలో హైదరాబాద్, కోల్కతాలోని స్థానిక ట్రాఫిక్ విభాగంతో కూడా ఈ తరహా ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు గూగుల్ మ్యాప్స్ ఎక్స్పీరియెన్సెస్ వైస్ ప్రెసిడెంట్ మిరియం కార్తీక డేనియల్ తెలిపారు. -
కేంద్రం గ్రీన్ సిగ్నల్.. అందుబాటులోకి గూగుల్ అదిరిపోయే ఫీచర్!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ చేస్తున్న ప్రయత్నానికి భారత ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మన దేశంలో గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫీచర్ను విడుదల చేసింది. ఈ ఫీచర్ సాయంతో గూగుల్ మ్యాప్స్లో మనకు కావాల్సిన ప్రాంతాన్ని 360డిగ్రీల్లో వీక్షించొచ్చు. గూగుల్ సంస్థ..టెక్ మహీంద్రా, జెన్సె సంస్థలతో కలిసి సంయుక్తంగా అహ్మద్ నగర్, అమృత్ సర్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, నాసిక్, పూణే, వడదోరా నగరాల్లో స్ట్రీట్ వ్యూ ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. మిలియన్ల కొద్దీ 360 డిగ్రీల పనోరమిక్ ఇమేజెస్ సాయంతో మొత్తం పది నగరాల్లో లక్షా 50వేల కిలోమీటర్ల వరకు ఈ ఫీచర్ను వినియోగించుకోవచ్చు. ఈ ఏడాది చివరి నాటికి మరో 50 నగరాలకు ఈ ఫీచర్ను విస్తరించాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఫీచర్ వల్ల లాభం ఏంటంటే నేషనల్ జియోస్పేషియల్ పాలసీ నిబంధనలకు అనుగుణంగా..గూగుల్ ఇవ్వాళ విడుదల చేసిన గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫీచర్ సాయంతో గూగుల్ మ్యాప్స్ను ఓపెన్ చేసి మీకు కావాల్సిన స్ట్రీట్లో టార్గెటెడ్ షాప్స్, స్కూల్స్, టెంపుల్స్ విడివిడిగా చూడొచ్చని తెలిపింది. అంతేకాదు గూగుల్ ఎర్త్ ఇంజన్ సహాయంతో టెంపరేచర్ డేటాను పొందవచ్చు. 2016 నుంచి విశ్వ ప్రయత్నాలు గూగుల్ సంస్థ మనదేశంలో పనోరామిక్ స్ట్రీట్ లెవల్ ఇమేజ్ ఆప్షన్ను స్ట్రీట్ వ్యూ ఫీచర్ 2011లో విడుదల చేసింది. కానీ ఈ ఫీచర్తో దేశ భద్రతకు నష్టం వాటిల్లో ప్రమాదం ఉందనే కారణంతో 2016లో దీనిపై నిషేదం విధించింది. ఈ తరుణంలో గూగుల్ స్థానిక టెక్ కంపెనీల సాయంతో వీటిని తీసుకొచ్చింది. -
వాహనదారులకు గూగుల్ అదిరిపోయే ఫీచర్!
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ వాహనదారులకు అదిరిపోయే ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే వాహనదారులు టోల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆ ప్రాంతానికి చేరుకోకముందే ఛార్జీలు ఎంతో తెలిస్తే ఎలా ఉంటుంది. ఇదిగో ఈ కాన్సెప్ట్ తో గూగుల్ టోల్ ఛార్జెస్ ఎస్టిమేషన్ ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. భారత్, అమెరికా, ఇండోనేషియా ఇతర దేశాలకు చెందిన 2వేల రూట్లలో ఈ ఫీచర్లు ప్రారంభించింది. టోల్ ధరలు ఎలా తెలుసుకోవాలంటే వాహనదారులు టోల్ ధరలు తెలుసుకోవాలంటే గూగుల్ మ్యాప్స్లో ఆరిజిన్, డెస్టినేషన్ వివరాల్ని ఎంటర్ చేయాలి. దీంతో మీకు వెంటనే రోడ్డు మార్గానికి సంబంధించిన రూట్లు,షార్ట్ కట్లతో పాటు ఎస్టిమేట్ టోల్ ధరల డిస్ప్లే అవుతాయి. అంతే కాదు ఆ రూట్లో ఉన్న అన్నీ టోల్ బూత్ ధరల్ని చూపుతుంది. కాగా, గూగుల్ అందుబాటులోకి తెచ్చిన ఈ కొత్త ఫీచర్ ఇప్పటికే కర్ణాటకలో చాలా రోడ్లపై డిఫాల్ట్గా ఆన్లో ఉన్నట్లు తెలుస్తోంది. -
గూగుల్ మ్యాప్స్లోకి ‘ట్రాఫిక్ అడ్డంకుల’ అప్డేట్
Google Maps Suggest Best Routes In Hyderabad: అత్యవసర పని మీద దిల్సుఖ్నగర్ నుంచి కూకట్పల్లి వెళ్లడానికి బయలుదేరిన ఓ వాహన చోదకుడు ఆ దారిలో రద్దీని గూగుల్ మ్యాప్స్లో పరిశీలించాడు. రద్దీ సాధారణ స్థాయిలో ఉన్నట్లు కనిపించడంతో బయలుదేరాడు. ఆ వాహనం లక్డీకాపూల్ చేరుకునేసరికి.. కొద్దిసేపటి ముందే తలెత్తిన ధర్నా కారణంగా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆ రద్దీలో చిక్కుకుపోయిన అతడు ఏం చేయాలో, ఎటు వెళ్లాలో తేల్చకోలేకపోయాడు. నగరవాసులకు ఇలాంటి సమస్య తలెత్తకుండా చూసేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ వినూత్నంగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటి వరకు కేవలం ట్రాఫిక్ రద్దీ మాత్రమే కనిపించే గూగుల్ మ్యాప్స్లో హఠాత్తుగా తలెత్తే అడ్డంకులూ కనిపించేలా చర్యలు ప్రారంభించారు. దీనికి సంబంధించి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆ సంస్థతో జరిపిన సంప్రదింపులు కొలిక్కి వస్తున్నాయి. ఉన్నతాధికారుల తుది పరిశీలనలో ఉన్న ఈ ప్రాజెక్టు త్వరలో కార్యరూపంలోకి రానుంది. దీనిపై ఇప్పటికే పలు దఫాల్లో ట్రాఫిక్ పోలీసులు–గూగుల్ ప్రతినిధులు భేటీ అయ్యారు. స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడంతో.. ► ఇటీవల కాలంలో స్మార్ట్ఫోన్ల వినియోగం పెరగడంతో గూగుల్ మ్యాప్స్కు విశేష ప్రజాదరణ వచ్చింది. చిరునామాలు కనుక్కోవడానికి, ట్రాఫిక్ స్థితిగతులు తెలుసుకోవడానికి వీటిని ఎక్కువగా వాడుతున్నారు. ► స్మార్ట్ఫోన్ వినియోగదారులు గూగుల్ సంబంధిత యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు లొకేషన్కు యాక్సెస్ ఇస్తుంటారు. ఇలా ఆయా ఫోన్లు ఉన్న లొకేషన్ తెలుసుకునే అవకాశం గూగుల్ సంస్థకు కలుగుతోంది. ► వీటిని ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్న ఆ సంస్థ ఏ సమయంలో, ఏ ప్రాంతంలో, ఏ దిశలో సెల్ఫోన్లు ఎక్కువగా ఉన్నాయనేది గుర్తిస్తుంది. రహదారులపై ఉన్న సెల్ఫోన్లు సాధారణంగా వాహనచోదకులవే అయి ఉంటాయి. ► ఇలా రోడ్లపై ఉన్న ట్రాఫిక్ వివరాలు ఎప్పటికప్పుడు గూగుల్ సంస్థకు చేరుతున్నాయి. వీటి ఆధారంగానే ఆ సంస్థ తమ మ్యాప్స్లో ట్రాఫిక్ రద్దీ ఉన్న రహదారుల్ని ఎరుపు రంగులో చూపిస్తుంటుంది. ► న్యూయార్క్ పోలీసు విభాగం ‘511ఎన్వై’ పేరుతో ప్రత్యేక వెబ్సైట్ నిర్వహిస్తోంది. ఇందులో రహదారులపై ఉన్న రద్దీతో పాటు హఠా త్తుగా వచ్చిపడే అవాంతరాలను చూపిస్తుంటుంది. దీని మోడల్లోనే తమ మ్యాప్స్ అభివృద్ధి చే యడానికి గూగుల్ సంస్థ ముందుకు వచ్చింది. నగరం నుంచే పైలెట్ ప్రాజెక్టుగా.. ► ట్రాఫిక్ పోలీసుల కోరిన మీదట పైలెట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ నుంచే ఈ విధానాన్ని ప్రారంభించనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు– గూగుల్ ప్రతినిధుల సమావేశాలు ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో జరిగాయి. ► క్షేత్రస్థాయిలో సంచరించే హైదరాబాద్ ట్రాఫిక్ సిబ్బంది వద్ద ట్యాబ్స్ ఉన్నాయి. మరోపక్క ట్రాఫిక్ పోలీసులకు సంబంధించి హైదరాబాద్ ట్రాఫిక్ లైవ్ పేరుతో ప్రత్యేక యాప్ కూడా ఉంది. ఇది వారి ట్యాబ్స్, స్మార్ట్ ఫోన్లలో ఇన్స్టాల్ చేసి ఉంటోంది. వెంటనే అప్రమత్తం.. ► రహదారిపై హఠాత్తుగా ఏదైనా ప్రమాదం చోటు చేసుకున్నా, నిరసనలు తలెత్తినా స్థానికంగా ఉన్న ట్రాఫిక్ పోలీసులు అక్కడకు వెళ్తారు. అలా వెళ్లినప్పుడు సదరు ఉదంతం, కార్యక్రమం వల్ల కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటే వెంటనే అప్రమత్తం అవుతారు. ► ఈ విషయాన్ని తమ యాప్లో పొందుపరుస్తారు. ఇది ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఉండే అడ్మినిస్ట్రేటర్కు చేరుతుంది. ఆయన దాన్ని మరోసారి ఖరారు చేసుకుని ఆన్లైన్లో గూగుల్ సంస్థకు పంపిస్తారు. (క్లిక్: హైదరాబాద్ ప్రజలకు అలర్ట్! ఆ రెండు రోజులు ఆటోలు బంద్) ► ఆ సంస్థ ఉద్యోగులు ఈ విషయాన్ని తమ మ్యాప్స్లో పాయింట్తో సహా పొందుపరుస్తారు. ఆ ప్రాంతానికి అటు ఇటు ఉన్న ప్రత్యామ్నాయ రహదారుల వివరాలను ట్రాఫిక్ పోలీసుల నుంచి సేకరించి గూగుల్ మ్యాప్స్లో పాప్అప్ రూపంలో వినియోగదారులకు తెలియజేస్తారు. ► వీటిని తన స్మార్ట్ఫోన్ల ద్వారా తెలుసుకునే వాహనచోదకులు ఆ ప్రాంతాలకు వెళ్లకుండా, ప్రత్యామ్నాయ మార్గల్లో వెళ్లేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. సాంకేతిక అంశాలకు సంబంధించి తుది పరిశీలనలో ఉన్న ఈ విధానం త్వరలో హైదరాబాద్లో అందుబాటులోకి రానుంది. (చదవండి: కోవిడ్ పోయింది.. హైబ్రిడ్ వచ్చింది!) -
గూగుల్ సెట్టింగ్స్లో ఈ మార్పు చేస్తే మీ ఖాతా మరింత భద్రం..!
గూగుల్ అనగానే మనలో చాలా మందికి వెంటనే గుర్తొచ్చేది జీమెయిల్, వెబ్ బ్రౌజింగ్ ఇవేకాకుండా డ్రైవ్ స్టోరేజ్, వీడియో కాలింగ్, మెసేజింగ్, మ్యాప్స్, ఫొటోస్, క్యాలెండర్, కాంటాక్ట్స్, యూట్యూబ్, షాపింగ్, న్యూస్ ఇలా ఎన్నో రకాల సేవలను గూగుల్ అందిస్తోంది. అయితే, ఈ సేవలన్నీ అందించడానికి మనం కొంత సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మీరు ఇచ్చే పేరు, ప్రొఫైల్ ఫొటో, మెయిల్ ఐడీ, పుట్టిన తేది, జెడర్,ఉద్యోగం, నివసించే ప్రాంతం వంటి వివరాలు ఇతర యూజర్లకు కనిపించే అవకాశం ఉంది. అయితే, ఇప్పుడు మనం మన వ్యక్తి గత వివరాలను ఇతరులకు కనిపించకుండా చేసుకునే అవకాశం ఉంది. ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్కరికీ మీ సమాచారం కనిపించదు. మీ వివరాలను ఇతరులు చూడకుండా ఉండటానికి ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. మొదట పీసీ/కంప్యూటర్లో గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి ఇప్పుడు దానిపై క్లిక్ చేస్తే మేనేజ్ యవర్ గూగుల్ అకౌంట్ అనే అప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ ఓపెన్ చేస్తే గూగుల్ ఖాతా పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో పర్సనల్ మీ ఇన్ఫో సెక్షన్పై క్లిక్ చేస్తే చూజ్ వాట్ అథర్స్ సీ అనే ఆప్షన్ ఓపెన్ చేయాలి. అందులో అబౌట్ మీ లపై క్లిక్ చేస్తే యాడ్(Add), ఎడిట్, రిమూవ్ అనే ఆప్షన్లు ఉంటాయి. మీ ప్రొఫైల్కు సంబంధించి ఏదైనా సమాచారం అదనంగా చేర్చాలన్నా, ఉన్నది తొలగించాలన్నా, పేరులో మార్పులు చేయాలన్నా వాటిపై క్లిక్ చేసి మారిస్తే సరిపోతుంది. మీ సమాచారం ఎవరికి కనబడకూడదు అనుకుంటే Only Me అనే ఆప్షన్ ఎంచుకోవాలి. (చదవండి: బీజీఎంఐ గేమ్ ఆడి రూ.12.5 లక్షలు గెలుచుకున్న కుర్రాళ్లు..!) -
గూగుల్ మ్యాప్స్.. ఇక అడ్రస్ కోసం ఇబ్బంది పడక్కర్లేదు
కొత్త ప్రదేశాల్లో.. కొత్త ప్రాంతాలకు వెళ్లడానికి చాలామందికి గూగుల్ మ్యాప్స్ ఒక మార్గదర్శి. అయితే కచ్చితమైన అడ్రస్సుల విషయంలోనే ఒక్కోసారి గందరగోళం ఏర్పడవచ్చు. ఇప్పుడు ఈ సమస్యను కూడా తీర్చడానికి ఒక కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది గూగుల్ మ్యాప్స్. చాలామంది తమ హోం అడ్రస్సులను అవసరం ఉన్నప్పుడు కరెంట్ లేదంటే అడ్రస్ను టైప్ చేయడం ద్వారా వివరాల్ని షేర్ చేస్తుంటారు. ఇకపై ఆ అవసరం లేకుండా ఫ్లస్ కోడ్ని షేర్ చేస్తే సరిపోతుంది. ఫ్లస్ కోడ్లో హోం అడ్రస్ బదులు.. నెంబర్లు, లెటర్ల ఆధారంగా ఉదాహరణకు.. ‘CCMM+64G’ ఇలా నెంబర్లు, లెటర్ల ఆధారంగా కోడ్ రూపంలో కనిపిస్తుంది. మాటి మాటికి అడ్రస్ను టైప్ చేయాల్సిన అవసరం లేకుండా ఇది షేర్(ఆల్రెడీ హోం అడ్రస్గా సేవ్ చేసి ఉంటారు కాబట్టి) చేస్తే సరిపోతుంది. గూగుల్ ఫ్లస్ కోడ్ను చాలా కాలం కిందటే(2018) తీసుకొచ్చింది. చాలాకాలం పాటు ఇది ఎన్జీవోలకు, ప్రభుత్వ కార్యాలయాలకు కేరాఫ్గా నిలిచి.. ప్రజలకు ఉపయోగపడ్డాయి. ఇక ఇప్పుడు ఈ ఫీచర్ను యూజర్లందరికీ అందించనుంది. ఇది అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా గ్రిడ్ తరహాలో ప్రాంతాలను విభజించుకుంటూ పోతుంది. విశేషం ఏంటంటే.. రోడ్డు మార్గం, సరైన ల్యాండ్ మార్క్లు లేనిచోట్ల కూడా అదీ ఆఫ్లైన్లోనే(ఒక్కసారి సేవ్ చేస్తే సరిపోతుంది) ఫ్లస్ కోడ్ సరైన అడ్రస్ను లొకేట్ చేస్తుంది. కరెక్ట్గా అడ్రస్ పెడితేనే రావట్లేదు.. ఇంక ఫ్లస్ కోడ్ వర్కవుట్అవుతుందా? అంటారా? కచ్చితంగా అవుతుంది. ఎందుకంటే.. గూగుల్ మ్యాప్ తీసుకుచ్చిన ఫ్లస్ కోడ్ అనేది యూనివర్సల్. భూమ్మీద ప్రతీ లొకేషన్, అడ్రస్కు ఒక్కో ఫ్లస్ కోడ్ ఉంటుంది. పైగా ఎగ్జాట్గా హోం లొకేషన్గా సేవ్ అవుతుంది కాబట్టి. ఇది జనరేట్ చేయాలంటే.. యూజ్ యువర్ కరెంట్ లొకేషన్ ద్వారా చేయొచ్చు. సేవ్డ్ ట్యాబ్ను కూడా హోం అడ్రస్ కాపీ చేయడానికి, షేర్ చేయడానికి ఉపయోగించొచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ కేవలం ఆండ్రాయిడ్ వెర్షన్లలో మాత్రమే ఉంది. కింద వీడియోలో మరింత స్పష్టత రావొచ్చు. -
మీరు ప్రయాణించే రైలు లైవ్ స్టేటస్ గూగుల్ మ్యాప్స్లో తెలుసుకోండి ఇలా..?
రైల్వే ప్రయాణికుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్న రైల్వేశాఖ సరికొత్తగా మరికొన్ని సేవలను అందుబాటులోకి తీసుకొని వచ్చింది. రైలు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత రైల్వే ప్రయాణికులు ప్రయాణించే రైలు సమయానికే స్టేషన్ కు వస్తుందా..? ప్రస్తుతం ఎక్కడుంది..? అనే విషయాలు తెలుసుకోవడానికి చాలా మార్గాలున్నాయి. అయితే, ఇప్పుడు మీరు ప్రయాణించే రైలు లైవ్ స్టేటస్ మీ మొబైల్ ద్వారా సులభంగా తెలుసుకోవడానికి ఇండియన్ రైల్వే గూగుల్ మ్యాప్స్తో ఒప్పందం చేసుకుంది. రైలు లైవ్ స్టేటస్ కి సంబంధించిన సమాచారాన్ని గూగుల్ తన మ్యాప్స్లో అందిస్తుంది. గూగుల్ మ్యాప్స్లో రైలు లైవ్ స్టేటస్ తెలుసుకోండి ఇలా..? మొదట మీ మొబైల్ ఉన్న గూగుల్ మ్యాప్స్ యాప్ ని అప్డేట్ చేసుకోండి. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి మీరు ఎక్కాల్సిన రైల్వే స్టేషన్ మ్యాప్స్లో క్లిక్ చేయండి. మ్యాప్స్లో మీరు ఎక్కాల్సిన రైల్వే స్టేషన్ క్లిక్ చేయగానే మీకు చాలా రైళ్లకు సంబంధించిన సమాచారం కనిపిస్తుంది. ఇప్పుడు మీరు మీరు ప్రయాణించే రైలు మీద క్లిక్ చేయగానే ఆ రైలు ఎక్కడ ఉంది, ఎన్ని నిమిషాలు ఆలస్యంగా వస్తుంది అనేది మీకు చూపిస్తుంది. (చదవండి: ఉత్తర కొరియాలో రెచ్చిపోతున్న హ్యాకర్స్!! ఏం చేశారంటే..) -
20 ఏళ్లుగా పరారీలో డాన్.. ఎలా దొరికాడో తెలిస్తే సంబరపడతారు
టెక్నాలజీ.. ఆక్సిజన్ తర్వాత మనిషికి అవసరంగా మారింది. అయితే మనిషి తన కంఫర్ట్ లెవల్స్ పెరిగే కొద్దీ.. టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటూ పోతున్నాడు. ఆపత్కాలంలో మనుషుల ప్రాణాల్ని కాపాడడమే కాదు.. అవసరమైతే సంఘవిద్రోహ శక్తుల వేటలోనూ సాయం చేస్తోంది సాంకేతిక పరిజ్ఞానం. ఇందుకు ఉదాహరణే.. ఇటలీలో జరిగిన ఓ ఘటన. పోలీసుల్ని సైతం ముప్పుతిప్పలు పెట్టిన కరడు గట్టిన నేరస్తుణ్ని 20 ఏళ్ల తర్వాత టెక్నాలజీ పట్టించింది. ఇటలీ రాజధాని రోమ్లో 'స్టిడా' అనే సిసిలియన్ మాఫియా ఉంది. 2002 -03 మధ్య కాలంలో ఈ మాఫియా సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కటకటాల వెనక్కి నెట్టారు. అయితే జైలు శిక్షను అనుభవిస్తున్న మాఫియా డాన్ గియోఅచినో గామినో (61) రోమ్ రెబిబ్బియా జైలు నుండి తప్పించుకున్నాడు. అక్కడి నుంచి నుంచి తప్పించుకుని మారు పేర్లు.. రకరకాల వేషాలతో కాలం గడిపాడు. గామినో పరారై 20ఏళ్లు గడిచినా.. ఇటలీ పోలీసులకు కంటిమీద కునుకు లేదు. ఈ నేపథ్యంలో చివరి అస్త్రంగా టెక్నాలజీని వాడాలనే బుద్ధి పోలీసులకు కలిగింది. ఇందుకోసం ఫోటోగ్రామ్ సాయం తీసుకుని..గామినో కోసం గాలింపు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఫోటోగ్రామ్ ఫోటో సాయంతో గూగుల్ మ్యాప్ను అనుసంధానించారు. దేశవిదేశాల్ని జల్లెడపట్టారు. చివరికి మాడ్రిడ్(స్పెయిన్) గల్లీలపై నిఘా వేయగా.. గాలాపగర్ అనే ప్రాంతంలో ఓ పండ్ల దుకాణం ముందు ఉన్న గామినోను గూగుల్ మ్యాప్ గుర్తించింది. వెంటనే ఇటలీ పోలీసులను అలర్ట్ చేసింది. అప్రమత్తమైన పోలీసులు గామినోను చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ఇటాలియన్ యాంటీ-మాఫియా పోలీస్ యూనిట్ (డీఐఏ) డిప్యూటీ డైరెక్టర్ నికోలా అల్టీరో హర్షం వ్యక్తం చేశారు. రెండు దశాబ్దాలపాటు ముప్పుతిప్పలు పెట్టిన ఓ మాఫియా డాన్ను గూగుల్ మ్యాప్ పట్టించడంపై సోషల్ మీడియాలోనూ సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం అవుతున్నాయి. నిందితుడు ప్రస్తుతం స్పెయిన్ కస్టడీలో ఉన్నాడని, ఫిబ్రవరి చివరి నాటికి అతన్ని ఇటలీకి తరలిస్తారని సమాచారం. చదవండి: మనుషులు పట్టించుకోలేదు.. స్మార్ట్ వాచ్ బతికించింది -
గూగుల్ మ్యాప్స్లోనే కాదు..వాట్సాప్లో కూడా వెతికేయచ్చు..! ఎలాగంటే..?
WhatsApp To Let You Search Hotels, Grocery, Clothing Stores In The App: స్మార్ట్ఫోన్ రాకతో పలు విషయాలు మరింత సులువుగా మారాయి. వివిధ యాప్స్ మనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మనకు తెలియని అడ్రస్ను, దగ్గరలోని షాపు వివరాలను తెలుసుకోవడానికి గూగుల్ తీసుకొచ్చిన యాప్ గూగుల్ మ్యాప్స్ ఎంతగానో ఉపయోగపడింది. యూజర్లకే కాకుండా ఆయా వాణిజ్య , వర్తక వ్యాపారులకు కూడా గూగుల్ మ్యాప్స్ సహాయపడింది. కాగా గూగుల్ మ్యాప్స్ తరహా ఫీచర్ను వాట్సాప్ కూడా త్వరలోనే తెచ్చేందుకు ప్రయత్నాలను చేస్తోంది. గూగుల్ మ్యాప్స్ తరహాలో వెతికేయెచ్చు..! మెటా యాజమాన్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్, వ్యాపారుల కోసం వాట్సాప్ బిజినెస్ యాప్ను తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. వాట్సాప్ బిజినెస్ యాప్లో ఇప్పటికే ఎంతో మంది వ్యాపారులు రిజిస్టర్ అయ్యారు. దీంతో రాబోయే రోజుల్లో సమీపంలో ఆయా వ్యాపారుల గురించి తెలియజేసే సెర్చ్ ఆప్షన్ను వాట్సాప్లో రానుంది. బిజినెస్ నియర్ బై..! బ్రెజిల్లోని సావో పాలో నగరంలో ఇప్పటికే కొంతమంది వ్యక్తుల కోసం ‘బిజినెస్ నియర్బై’ ఫీచర్ను వాట్సాప్ విడుదల చేసింది. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. ఇది భవిష్యత్తులో యూజర్ల అందరికీ వచ్చే అవకాశం ఉందని వాట్సాప్ ట్రాకర్, డబ్ల్యూబెటాఇన్ఫో పేర్కొంది. ఈ కొత్త కూల్ ఫీచర్ ఐవోస్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. ఈ ఫీచర్ సహయంతో యూజర్లు దగ్గరలోని హోటళ్లు,కిరాణా, బట్టల దుకాణాలు మొదలైన వాటిని వెతకవచ్చును. చదవండి: ఇన్స్టాగ్రామ్లో మరో సరికొత్త ఫీచర్.. హైలెట్స్ ఆఫ్ ది ఇయర్..! -
గూగుల్ అదిరిపోయే ఫీచర్, రద్దీ ఎలా ఉందో ఇట్టే చెప్పేస్తుంది..!
షాపింగ్ చేయడానికో లేదంటే ఇతరాత్ర పనుల మీద బయటకు వెళ్లాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తింది. అందుకు కరోనానే కారణం. మహమ్మారి వల్ల మనిషి జీవన విధానం పూర్తిగా మారిపోయింది. మాట్లాడాలన్నా, ఫ్రీ గా తిరగాలన్నా సాధ్యం కావడం లేదు. రద్దీగా ఉండే ప్రాంతాలవైపు వెళ్లడమే మానేశాం. అందుకే ఆ సమస్యకు పరిష్కారం చూపుతూ ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ 'గూగుల్ మ్యాప్స్'లో సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్ని గుర్తిస్తుంది. హాలిడేస్లో సరదగా కుటుంబ సభ్యులకు బయటకు వెళ్లేందుకు, లేదంటే షాపింగ్ చేసేలా గూగుల్ మ్యాప్స్ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇందుకోసం గూగుల్ సంబంధిత ప్రాంతాలకు చెందిన వ్యాపార వివరాలు, డైరెక్టరీస్ (సంస్థల వివరాలు )ను సేకరించింది. వాటి సాయంతో లోకేషన్లో ఉన్న వ్యక్తుల కదలికలు, ఏ ప్రాంతంలో అత్యంత రద్దీగా ఉందో గుర్తించేందుకు సహాయపడనుంది. వరల్డ్ వైడ్గా గూగుల్ ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకోసం వరల్డ్ వైడ్గా అందుబాటులోకి తీసుకొనిరానుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయాలు, మాల్స్, బస్సు, రైల్వేస్టేషన్లతో పాటు, భవనాల రహదారులను గుర్తించడానికి సహాయపడుతుంది. ఈ ఫీచర్ జోడించబడిన తర్వాత, వినియోగదారులు ఒకే చోట అందుబాటులో ఉన్న అన్ని షాపులు, రెస్టారెంట్లు, విమానాశ్రయ లాంజ్లు, కార్ రెంటల్, పార్కింగ్ స్థలాల్ని ఈజీగా గుర్తించవచ్చని గూగుల్ ప్రకటనలో వెల్లడించింది. చదవండి : గూగుల్ అదిరిపోయే శుభవార్త, ఇక యూట్యూబ్లో చెలరేగిపోవచ్చు -
గూగుల్ మ్యాప్స్: ఓ గుడ్ న్యూస్-ఓ బ్యాడ్ న్యూస్
టెక్నాలజీలో గూగుల్ మ్యాప్స్ నిజంగానే ఓ గేమ్ ఛేంజర్. గమ్యస్థానం చేరుకునేందుకు సరైన మార్గం కోసం కోట్ల మంది గూగుల్ మ్యాప్స్ను ఉపయోగించుకుంటున్నారు. ఒక సెకనులో 70వేలమంది, గంటలకు 227 మిలియన్ల మంది.. ఒకరోజులో దాదాపు ఐదున్నర బిలియన్ల గూగుల్ యూజర్లు మ్యాప్స్ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి యాప్ ఇప్పుడు రెండు ఇంట్రెస్టింగ్ అప్డేట్లు అందించింది. గూగుల్ మ్యాప్.. ఓ ఆసక్తికరమైన ఫీచర్ను తీసుకురాబోతోంది. రహదారులపై టోల్ ఛార్జ్ వివరాల్ని యూజర్లకు ముందుగానే తెలియజేయబోతోంది. తద్వారా వాహనదారుడు ముందుగానే తన రూట్ను ఎంచుకునే అవకాశం కలగనుంది. ప్రస్తుతం డెవలపింగ్ స్టేజ్లో ఉన్న ఈ ఫీచర్ను వీలైనంత త్వరలోనే గూగుల్ మ్యాప్ అందుబాటులోకి రానుంది. కొందరు వాహనదారులకు కొత్త రూట్లో ప్రయాణించినప్పుడు రహదారి ఎలా ఉండబోతోంది? మధ్యలో ఎన్ని టోల్ గేట్స్ ఉన్నాయి? ఎంత వసూలు చేస్తారు? అనే వాటిపై ఒక ఐడియా ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ల కోసం గూగుల్ మ్యాప్ ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. అయితే దీనిపై గూగుల్ ఇంకా అధికారిక ప్రకటన చేయకపోయినా.. గూగుల్ మ్యాప్ ప్రివ్యూ ప్రోగ్రాం ఓ సందేశాన్ని పంపింది. చాలా దేశాల్లో వాజే మ్యాపింగ్ యాప్(ఇది కూడా గూగుల్ కిందే పని చేస్తోంది) ఇలాంటి ఫీచర్గా వాహనదారులకు ఉపయోగపడుతోంది. ఇక గూగుల్ మ్యాప్ టోల్ ట్యాక్స్ ధరలను ఎలా తెలియజేస్తుందనే దానిపై ఇప్పటివరకు స్పష్టత లేకపోయినా.. బహుశా టోల్ ఆపరేటర్లు ఫిక్స్ చేసే ధరల పట్టిక, రోడ్డు మార్గాలు తదితర వివరాల వెబ్సైట్ ఆధారంగా.. వాహనదారులకు తెలియజేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. చెల్లిస్తేనే.. ముందుకు వెళ్లేది! గూగుల్ మ్యాప్లో బెస్ట్ ఫీచర్గా ‘టర్న్ బై టర్న్’ నావిగేషన్కు పేరుంది. ముఖ్యంగా రూరల్ ఏరియాల్లో, ఇరుకు గల్లీల్లో, సిటీల్లో చాలామంది ఈ ఫీచర్ను ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇది ఉపయోగించాలంటే ఇప్పుడు ఎంతో కొంత చెల్లించాల్సిందే. అవును.. ప్రస్తుతం ఈ ఫీచర్.. గూగుల్ క్రౌడ్ఫండింగ్ ఫీచర్ కిందకు వెళ్లిపోయింది. జీపీఎస్ లొకేషన్-నేవిగేషన్ను యూజర్కు అందించడం భారంగా మారుతున్న నేపథ్యంలోనే గూగుల్ మ్యాప్.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం నుంచే ఈ ఫీచర్ను మొదలుపెట్టింది గూగుల్ మ్యాప్(అప్డేట్ చేసుకోవాల్సిందే!). అయితే మొత్తం గూగుల్ యాప్నే ‘పే అండ్ యూజ్’ కిందకు తీసుకురానుందా? అనే ప్రశ్నపై మాత్రం గూగుల్ మ్యాప్ మౌనం వహిస్తోంది. చదవండి: కంటిచూపుతోనే ఇక ఫోన్ ఆపరేటింగ్! -
గూగుల్ మ్యాప్స్తో మీ వ్యాపారాన్ని ఇలా అభివృద్ధి పరచండి..!
ప్రస్తుతం ఉన్న సాంకేతికతతో ప్రతి ఒక్కరు గూగుల్మ్యాప్స్ను ఉపయోగించి దగ్గరలో ఉన్న వివిధ షాప్లను తెలుసుకుంటున్నారు. గూగుల్ మ్యాప్స్లో ప్రత్యక్షమయ్యే ఆయా షాపు వివరాలను తెలుసుకొని వినియోగదారులు షాపులకు సందర్శిస్తున్నారు. గూగుల్ మ్యాప్స్తో ఒక్కింతా వినియోగదారులకు, వ్యాపార వర్గాల వరకు చాలా మేలు చేకూరుతుంది. మీరు వ్యాపారం చేసే రెస్టారెంట్, సెలూన్, ఇతర షాప్లను గూగుల్ మ్యాప్స్లో నమోదు చేసుకోవడం ద్వారా మీ వ్యాపారాన్ని మరింత వృద్ధి చేసుకోవచ్చునని మీకు తెలుసా..? తెలియదా అయితే ఇది మీ కోసమే..! గూగుల్మ్యాప్స్లో మీ వ్యాపారాలను నమోదు చేసుకోవడంతో మీ వ్యాపారాన్ని గణనీయంగా అభివృద్ధి చేసుకోవచ్చును. గూగుల్ మ్యాప్స్లో మీ వ్యాపారాన్ని నమోదు చేసుకోవడం ద్వారా వినియోగదారులకు మీ వ్యాపార సముదాయాలు కన్పిస్తాయి. మీ వ్యాపారాలను గూగుల్ మ్యాప్స్లో ఇలా యాడ్ చేయండి. 1. వెబ్ బ్రౌజర్లో ‘గూగుల్ మై బిజినెస్’ లో ముందుగా లాగిన్ అవ్వండి. ఒకవేళ మీకు బిజినెస్ అకౌంట్ లేకుంటే క్రియోట్ అకౌంట్ మీద క్లిక్ మీద చేయండి. 2. మై బిజినెస్ హోమ్పేజీలో ‘మేనేజ్ నౌ’ క్లిక్ చేయండి. మరో స్క్రీన్లో మీ బిజినెస్ వివరాలను సెర్చ్ బార్లో ఎంటర్ చేయండి. సెర్చ్ బార్ కింద డ్రాప్ డౌన్లో ‘క్రియేట్ బిజినెస్ విత్ దిస్ నేమ్’ ను ఎంచుకోండి. నోట్: ఒక వేళ డ్రాప్ డౌన్లో మీ బిజినెస్ నేమ్, చిరునామా కనిపిస్తే..మీ బిజినెస్ అల్రెడీ గూగుల్ మ్యాప్స్లో లిస్ట్ ఐనట్లు లెక్క. దానిని మీ వ్యాపారం గా క్లైమ్ చేసుకోండి. 3. తరువాతి పేజీలో మీ బిజినెస్ నేమ్. బిజినెస్ కేటగిరీలను ఇవ్వండి. మీ వ్యాపారానికి సంబంధించిన కేటగిరీని ఎంచుకోండి. 4. తరువాత మీ వ్యాపార స్థలం గూగుల్ మ్యాప్స్లో కనిపించాలనుకుంటున్నారా అని ఎంచుకోవాలి. ‘యాస్ ఆర్ నో’ను ఎంచుకోండి.నెక్ట్స్ బటన్పై క్లిక్ చేయండి. గమనిక: ఒక వేళ మీ వ్యాపార సముదాయం మీ ఇంటి దగ్గరలో ఉంటే వ్యాపార స్థలాన్ని గూగుల్ మ్యాప్స్లో ఉంచకపోవడం మంచింది. 5. మీరు మీ వ్యాపార సముదాయాన్ని గూగుల్ మ్యాప్స్లో కన్పించాలని ‘యాస్’ ను క్లిక్ చేసినట్లయితే తరువాతి స్టెప్లను ఫాలో అవ్వండి. తరువాతి స్క్రీన్లో మీ బిజినెస్ అడ్రస్ను ఎంటర్ చేయండి. 6. తరువాతి పేజీలో మీ బిజినెస్కు సంబంధించిన ఫోన్ నంబర్, వెబ్సైట్ను ఎంటర్ చేసి నెక్ట్స్ ను క్లిక్ చేయండి. 7. మీ వ్యాపారం కోసం గూగుల్ బిజినెస్ మీకు అప్డేట్లను, రికమేండేషన్లను పంపాలనుకుంటున్నారో లేదో ఎంచుకోండి తరువాత నెక్ట్స్ క్లిక్ చేయండి. 8. మీరు వ్యాపార అడ్రస్ను ఇవ్వకూడదని ఎంచుకుంటే, మీ వ్యాపారాన్ని ధృవీకరించడానికి మీ వ్యక్తిగత ఈ-మెయిల్ను నమోదు చేయాలి. ఈ అడ్రస్ వినియోగదారులకు కనిపించదు. మీ అడ్రస్ను నమోదు చేసి నెక్ట్స్ బటన్ నొక్కండి లేదా ‘వేరిఫై ల్యాటర్’ను ఎంచుకోండి. 9. మీ వ్యాపారాన్ని ధృవీకరించడానికి ఒక పద్ధతిని ఎంచుకోవడానికి డ్రాప్-డౌన్ను క్లిక్ చేయండి. మీ వ్యాపార రకాన్ని బట్టి, మీకు కొన్ని ధృవీకరణ పద్ధతులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మీ బిజినెస్ను ఈ-మెయిల్, ఫోన్కు గూగుల్ పంపే వేరిఫికేషన్ కోడ్ ద్వారా ధృవీకరణ చేసుకోవచ్చును. మీకు గూగుల్ సెర్చ్ కన్సోల్ అకౌంట్ ఉంటే వెంటనే వేరిఫై అవుతుంది, 10. తరువాత మీ గూగుల్ మై బిజినెస్ పేజీని సెటప్ చేయడానికి మీకు వరుస ప్రాంప్ట్ల వస్తాయి. మీరు బిజినెస్ అవర్స్ను యాడ్ చేయవచ్చును. దాంతో పాటుగా మేసేజింగ్ పర్మిషన్లను సెట్ చేయవచ్చు, మీ బిజినెస్ డిస్క్రిప్షన్(వివరణ)ను కూడా రాయవచ్చు. అంతేకాకుండా వ్యాపారానికి సంబంధించిన ఫోటోలను అప్లోడ్ చేయవచ్చు. 11. మీ వ్యాపారాన్ని సెటప్ చేయడానికి అవసరమైన అన్ని సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత, మీ గూగుల్ మై బిజినెస్ పేజీకి మళ్లీంచబడతారు, అక్కడ మీరు బిజినెస్కు సంబంధించిన లోగో, సహ-నిర్వాహకులు వంటి అదనపు సమాచారాన్ని జోడించవచ్చు. -
ఈ హెరిటేజ్ సైట్స్లోకి వెళ్లలేం.. ఇదొకటే దారి!
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు.. మన దేశంలోనూ చాలా ఉన్నాయి. ఇవన్నీ మన వారసత్వ సంపద. కొంతమంది వీటిల్లో కొన్నిటికి వెళ్లి ఉంటారు కూడా.. ఈ హెరిటేజ్ సైట్స్ గురించి మనకు తెలుసు.. మరి.. కేవలం గూగుల్ మ్యాప్లోనే చూడగల సైట్స్ గురించి మీకు తెలుసా? ఎందుకంటే.. ఇక్కడ మనకు నో ఎంట్రీ.. ఈ ఆదివారం వరల్డ్ హెరిటేజ్ డే. ఈ సందర్భంగా అలాంటి డిఫరెంట్ ప్రదేశాల గురించి కాస్త తెలుసుకుందామా.. స్నేక్ ఐలాండ్.. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ద్వీపం.. విస్తీర్ణం కేవలం 106 ఎకరాలు. బ్రెజిల్ తీరంలో ఉండే ఈ ప్రదేశం అత్యంత విషపూరితమైన సర్పాలకు నిలయం. చిన్న ద్వీపమే అయినా.. ఇక్కడ 4 వేలకు పైగా విషపూరితమైన పాములు ఉంటాయి. అందుకే.. బ్రెజిల్ ప్రభుత్వం ఇక్కడ పర్యాటకులను అనుమతించదు. శాస్త్రవేత్తలకు పరిశోధనల నిమిత్తం పరిమిత స్థాయిలో మాత్రమే అనుమతిస్తుంది. సర్ట్ట్సీ ఇదో ద్వీపం.. ఎలా ఏర్పడిందో తెలుసా? 1963లో సముద్రంలో పేలిన ఓ అగ్నిపర్వతం వల్ల.. దాని తాలూకు లావా అవన్నీ సముద్ర ఉపరితలం మీదకు వచ్చి.. కాలక్రమేణా ద్వీపంలా ఏర్పడింది. అప్పటినుంచి దీన్ని ఓ నేచర్ ల్యాబొరేటరీగా పరిరక్షిస్తున్నారు. ఏమీలేని బంజరు భూమిలాంటి దానిపై మళ్లీ జీవం పురుడుపోసుకోవడం.. మొక్కలు తదితర జీవజాతులు ఏర్పడటం వంటిదాన్ని జీవశాస్త్రవేత్తలు చాలా నిశితంగా గమనిస్తున్నారు. అందుకే ఇక్కడ ఇతరులకు ప్రవేశం నిషిద్ధం. ఈ దీవి ఐస్ల్యాండ్కు దగ్గరగా ఉంది. వాటికన్ రహస్య పత్రాలు.. ఇక్కడ ఎవరు పడితే వారు వెళ్లలేరు.. ఈ రహస్య పత్రాలపై అజమాయిషీ అంతా పోప్దే. ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, పండితులకు మాత్రమే ఇక్కడ ఎంట్రీ. ఇందుకోసం వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రకరకాల పరిశీలనల అనంతరం అనుమతి ఇస్తారు. ఇక్కడ వెయ్యేళ్ల క్రితం నాటి పత్రాలు ఉన్నాయి. అందులోనూ కొన్నిటిని మాత్రమే చూడటానికే అనుమతి ఇస్తారు.. ఇందులో ప్రఖ్యాత శాస్త్రవేత్త గెలీలియో విచారణకు సంబంధించినవి.. కింగ్ హెన్రీ–8, మార్టిన్ లూథర్ ఇలా ఎంతోమంది ప్రముఖులతో సాగించిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్నాయి. .. తొలుత అయితే.. సదరు శాస్త్రవేత్త లేదా పండితుల వయసు 75 ఏళ్లు దాటి ఉండాలనే నిబంధన కూడా ఉండేది.. తర్వాతి కాలంలో దీన్ని సడలించారు.. బొహీమియన్ గ్రోవ్.. కాలిఫోర్నియాలో 2700 ఎకరాల పరిధిలో వెయ్యేళ్లనాటి భారీ వృక్షాలతో కూడిన చిన్నపాటి అటవీ ప్రాంతంగా దీన్ని చెప్పవచ్చు. అమెరికాలోని రిచ్ అండ్ పవర్ఫుల్ వ్యక్తులకు సంబంధించిన బొహీమియన్ క్లబ్.. దీని ఓనర్. 1872లో ఈ క్లబ్ను స్థాపించారు. ఇందులో అత్యున్నత స్థాయి వ్యక్తులు, అమెరికా మాజీ అధ్యక్షులు సభ్యులుగా ఉంటారు. ఈ ప్రాంతంలో ఇతరులకు ప్రవేశం నిషిద్ధం. మాజీ సైనికులు ఇక్కడ రక్షణ బాధ్యతలు చూస్తుంటారు. ఏటా వేసవిలో క్లబ్ సభ్యులు ఇక్కడ కలుసుకుంటారు. స్వాల్బార్డ్ ప్రపంచ విత్తన బ్యాంకు నార్వేకు సంబంధించిన ఓ ద్వీపంలో ఉందీ విత్తన బ్యాంకు. ప్రపంచంలో ఆహార సంక్షోభం లాంటివాటిని ఎదుర్కోవడానికి అన్ని రకాల పంటల విత్తనాలను ఇక్కడ దాచి ఉంచుతున్నారు. ప్రస్తుతం 9.3 లక్షల విత్తనాల శాంపిల్స్ ఉన్నాయి. దీన్ని కూడా మనం గూగుల్ మ్యాప్లోనూ.. ఫొటోల్లోనూ చూడాల్సిందే.. ఇక్కడ పర్యాటకులకు ఎంట్రీ నిషిద్ధం. ఏరియా 51 ఇది చాలా ఫేమస్ ప్లేస్.. దీనిపై సినిమా కూడా తీశారు. అమెరికా ఎయిర్ఫోర్స్కు సంబంధించిన అత్యంత రహస్యమైన ప్రదేశం.. నెవడాలో ఉంది. పై నుంచి విమానాలు వెళ్లడానికి కూడా అనుమతి లేదు. ఇక మనలాంటోళ్ల సంగతి చెప్పనక్కర్లేదు. ఫొటోలే చాలా రేర్గా దొరుకుతాయి. ఇక్కడ శిక్షణ కార్యక్రమాలు నడుస్తాయని పైకి చెబుతారు కానీ.. వాస్తవంగా ఇక్కడ ఏం జరుగుతోందన్నది ఎవరికీ తెలియదు. ఉత్తర సెంటినల్ ద్వీపం.. సెంటినలీజ్.. మిగతా ప్రపంచంతో అస్సలు సంబంధం లేకుండా జీవనం సాగించే తెగ ఇది. ఈ ద్వీపానికి వాళ్లు ఎవరినీ రానివ్వరు.. కనీసం చూడటానికి కూడా ఇష్టపడరు.. వీళ్లతో కాంటాక్ట్ అవడానికి ప్రయత్నించిన కొందరిని చంపేశారు కూడా.. ఈ సెంటినల్ ద్వీపం మరెక్కడో లేదు.. మన అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఇది కూడా ఒకటి. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
గూగుల్ మ్యాప్స్ కొత్త ఆప్డేట్ ..!
మీకు గుర్తుందా..! బహుశా మీరందరూ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా చూసే ఉంటారు.. సినిమాలో సుబ్బు (నాని) దూద్కాశికి వెళ్లడానికి నాకు ట్రావెల్ గైడ్ ఏం అవసరం లేదు అని చెప్పి , నాకు గూగుల్ మ్యాప్స్ ఉంది అది చూస్తూ నేను దూద్కాశికి వెళ్లిపోతానని అంటాడు చివరికి గూగుల్ మ్యాప్స్ సుబ్బును ఎక్కడికో లోయలోకి తీసుకుపోతుంది.. ఈ సన్నివేశం చూసి మనం కడుపుబ్భా నవ్వుకున్నాం.. ఎందుకంటే మనలో కూడా చాలామందికి గూగుల్ మ్యాప్స్ నుంచి అలాంటి పరిస్థితి ఏర్పడింది. మనం వెళ్లాల్సిన ప్రాంతానికి కాకుండా వేరే ప్రాంతానికి తీసుకొని వెళ్తుంది. అంతేకాకుండా సీదా వెళ్లాల్సిన మార్గాలను వదిలేసి మనల్ని గూగుల్ మ్యాప్స్ తిప్పుకుంటూ తీసుకెళ్తుంది. దీంతో మన సమయం , అటు పెట్రోల్ వృథా అవుతోంది. అసలే దేశంలో ముడిచమురు ధరలు కొండేకుతున్నాయి. కొన్ని సార్లు గూగుల్ మ్యాప్స్ను అసలు నమ్మకూడదని నిర్ణయించుకుంటాం. తప్పుగా చూపించిన మార్గాలను రిపోర్ట్ చేసిన అంతగా ఫలితం ఉండదు. కానీ భవిష్యత్తులో గూగుల్ మ్యాప్స్నుంచి ఇలాంటి పరిస్థితులు ఎదురుకావు. ఎందుకంటే తప్పుగా ఉన్న మార్గాలను గూగుల్ మ్యాప్స్లో మనమే ఎడిట్ చేయవచ్చును. అంతేకాకుండా మిస్సయిన రోడ్లను కూడా యాడ్ చేయొచ్చు. కేవలం ఏడు రోజుల్లో యూజర్లు తెలిపిన విషయాన్ని పరిశీలించి ఆ మార్గాలను ఆప్డేట్ చేయనుంది. ఈ విషయాన్ని గూగుల్ తన బ్లాగ్లో తెలిపింది. ప్రస్తుతం ఈ టూల్ను గూగుల్టెస్ట్ చేస్తోంది. ఈ కొత్త ఆప్డేట్ రానున్న రోజుల్లో సుమారు 80 దేశాల్లో తీసుకురాబోతున్నారు. (చదవండి: నెట్ఫ్లిక్స్లో ఇకపై అలా నడవదు...!) -
గూగుల్ మ్యాప్స్లో సరికొత్త ఫీచర్
ప్రస్తుతం ప్రపంచంలో స్మార్ట్ఫోన్ లేనిది ప్రతి ఒక్కరికి పూటైనా గడవదు. మన దేశంలో సగటున ప్రతి ఒక్కరూ రోజుకి 3 నుంచి 5 గంటలు మొబైల్ మీద గడుపుతున్నారు. ఇన్ని గంటలు ఫోన్ చూడటం కొన్ని మానసిక సమస్యలతో పాటు కంటి సమస్యలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. అందుకే చాలా యాప్ కంపెనీలు యూజర్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని డార్క్ మోడ్ ఫీచర్ను తీసుకొస్తున్నాయి. దీని వల్ల కళ్లకు కాస్త శ్రమ తగ్గుతుంది. అలాగే ఎక్కువ సేపు వాడే మొబైల్లో బ్యాటరీ కూడా ఒక ప్రధాన సమస్యగా ఉంది. ఈ డార్క్ మోడ్ ఫీచర్ వల్ల ఎంతో కొంత ఆదా కానుంది. తాజాగా గూగుల్ కూడా తన మ్యాప్స్లో డార్క్ మోడ్ ఫీచర్ను తీసుకొస్తోంది. ఇది దశల వారీగా అందరికి అందుబాటులో రానుంది. గూగుల్ మ్యాప్ యాప్లోని సెట్టింగ్స్లోకి వెళ్లి థీమ్లో ఆల్వేస్ ఇన్ డార్క్ థీమ్ సెలక్ట్ చేసుకుంటే మ్యాప్స్ను డార్క్ మోడ్లో చూడొచ్చు. ఈ ఫీచర్ మరింత ఆకర్షణీయంగా ఉంటుందని గూగుల్ పేర్కొంది. ఇది ఇష్టం లేనివాళ్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు సాధారణ థీమ్లోకి మార్చుకోవచ్చు. అయితే డార్క్ మోడ్ వల్ల కళ్లపై ఒత్తిడి తగ్గడంతోపాటు బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది. గతంలో చీకటి పడుతుంటే నావేగేటింగ్ డార్క్ మోడ్లోకి, ఉదయం పూట మళ్లీ లైట్ మోడ్లోకి స్వయం చాలకంగా వచ్చేది. చదవండి: క్వాల్కామ్తో ఎయిర్టెల్ జట్టు భారత్ లో విడుదలైన లగ్జరీ బీఎండబ్ల్యూ బైక్ -
గూగుల్ మ్యాప్స్కు దీటుగా ఇస్రో మ్యాప్స్
భారత్లో ప్రస్తుతం విదేశీ యాప్లకు ప్రత్నామ్నాయంగా చాలా స్వదేశీ యాప్లు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్కు ప్రత్నామ్నాయంగా ‘కూ‘ యాప్ పై పెద్ద చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇక వాట్సాప్కు పోటీగా ‘సందేశ్‘ పేరుతో ప్రభుత్వమే ఒక యాప్ రూపొందిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా మ్యాప్స్ సేవల్లో అగ్రస్థానంలో ఉన్న గూగుల్ మ్యాప్స్ కు ప్రత్నామ్నాయంగా మరో యాప్ రాబోతున్నట్లు తెలుస్తుంది. దీని కోసం మన దేశానికి చెందిన భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో), మ్యాప్ మై ఇండియా చేతులు కలిపాయి. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో భారత వినియోగదారులకు గూగుల్ మ్యాప్స్ కు దీటుగా సేవలు అందించడమే తమ తక్షణ కర్తవ్యం అని ఇస్రో అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు సిఇ ఇన్ఫో సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్తో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్(డీవోఎస్) ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇస్రో ధృవీకరించింది. ఈ సందర్భంగా మ్యాప్ మై ఇండియా సీఈఓ రోహణ్ వర్మ మాట్లాడుతూ.." స్వదేశీ నావిగేషన్ సేవల్లో ఈ ఒప్పందం కీలక మైలురాయి అని తెలిపారు. మ్యాప్ మై ఇండియా సంస్థ బాధ్యతాయుతమైన స్వదేశీ కంపెనీ. ఈ సంస్థ దేశసార్వభౌమత్వాన్ని ప్రతిబింబించేలా మ్యాపులను రూపొందిస్తుందన్నారు. మీకు ఇకపై గూగుల్ మ్యాప్స్/ గూగుల్ ఎర్త్ అవసరం లేదు" అని అన్నారు. మ్యాప్ మై ఇండియా వినియోగదారులు ఇస్రో ఉపగ్రహాల సమాచారంతో మరింత స్పష్టంగా మ్యాపులను చూడవచ్చు అని అధికారులు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి సహకారం తమకు తప్పనిసరి అవసరమని ఇస్రో తెలిపింది. .@isro & MapmyIndia partner to offer India’s best indigenous maps, navigation & geospatial apps & services. Path-breaking #AatmanirbharBharat milestone! Now Indian users can leverage made in India maps, navigation, and GIS services. https://t.co/CTL9TX7dFO #ISRO #Maps #GIS pic.twitter.com/R2nCIbDWo4 — MapmyIndia (@MapmyIndia) February 11, 2021 చదవండి: ఎంఐ 11 అల్ట్రా ఫీచర్స్ వీడియో లీక్ ఎంఆధార్ వినియోగదారులకు తీపికబురు -
గూగుల్ మ్యాప్స్ లో మరో సరికొత్త ఫీచర్
గూగుల్ మ్యాప్స్ ఎప్పటికప్పుడు తన యూజర్స్ కోసం కొత్త కొత్త సేవలను ప్రవేశపెడుతుంది. తాజాగా మరో కొత్త ఫీచర్ ని యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. వచ్చే ఐదేళ్లలో భారతదేశం ఇంటర్నెట్ వినియోగించే జనాభా సంఖ్య 75 శాతం నుంచి 90 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. దింతో వినియోగదారులు తమ ఇష్టపడే ప్రదేశాల పేర్లను ప్రాంతీయ భాషలో సెర్చ్ చేసినప్పుడు కూడా ఆ ప్రదేశానికి సంబంధించిన సమాచారం సులభంగా తెలుసుకోవచ్చు గూగుల్ తెలిపింది. మ్యాప్స్ ఉపయోగించేప్పుడు వీధులు, ఇతర ప్రాంతాల పేర్లను 10 ప్రాంతీయ భాషల్లో తర్జుమా చేసి చూపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ హిందీ, బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళం, గుజరాతీ, కన్నడ, మలయాళం, పంజాబీ, ఒడియా వంటి 10 భాషల్లో అందుబాటులో ఉంది. దీని కోసం యూజర్స్ గూగుల్ మ్యాప్స్ యాప్లో సెట్టింగ్స్లోకి వెళ్లి నచ్చిన భాషను సెట్ చేసుకోవచ్చు. ఇప్పటికే చాలా వరకు ప్రముఖ ప్రదేశాలకు ప్రాంతీయ భాషల్లో పేర్లు వచ్చేలా మార్పులు చేశారు.(చదవండి: రూ 1.8లక్షలు ఖరీదైన సోనీ మొబైల్ విడుదల) -
మరిన్ని భాషల్లో గూగుల్ సేవలు
ప్రపంచంలో విభిన్న భాషలు గల దేశాలలో భారతదేశం ఒకటి అనే విషయం మన అందరికి తెలిసిందే. ప్రస్తుతం భారతదేశంలో 22 భాషలు అధికారిక భాషలుగా గుర్తింపు పొందాయి. ఇంకా గుర్తింపు పొందని వందలాది భాషలు దేశంలో చాలా ఉన్నాయి. ఇప్పుడు గూగుల్ తన ఉత్పత్తులను, సేవలను ఒక బిలియన్ భారతీయుల కోసం స్థానికంగా అందుబాటులోకి తేవడానికి ప్రయత్నాలు చేస్తోంది. నేడు గూగుల్ ఎల్ 10ఎన్ ఇండియా పేరిట ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో స్టార్టర్స్, వ్యాపారులు కోసం దేశంలోని గుజరాతీ, మరాఠీ, తమిళంతో సహా 9 స్థానిక భాషలలో గూగుల్ మ్యాప్స్ అందుబాటులో ఉంటుంది అని పేర్కొంది. అలాగే గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో కూడా ఈ భాషలలో సెర్చ్ చేయవచ్చని తెలిపింది. ప్రపంచంలోని మరెక్కడా లేని విధంగా ప్రతి నెలలో భారతదేశంలో ఎక్కువ మంది గూగుల్ లెన్స్ను ఉపయోగిస్తున్నారు అని తెలిపింది. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మెరుగైన సేవలు అందించడానికి భారతీయుల కోసం గూగుల్ లెన్స్ ను సెర్చ్ లో జోడించినట్లు పేర్కొంది. (చదవండి: జనవరి 1 నుండి మారబోయే అతి ముఖ్యమైనవి..) -
గూగుల్ మ్యాప్స్ లో 'గో' టాబ్ ఫీచర్
గూగుల్ మ్యాప్స్ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకొస్తుంది. ఇప్పుడు తాజాగా మరో ఫీచర్ని తీసుకొచ్చింది. వినియోగదారులు గతంలో సందర్శించిన ప్రదేశాలకు సులభంగా నావిగేట్ చెయ్యడానికి గూగుల్ మ్యాప్స్ త్వరలో కొత్తగా 'గో' టాబ్ను తీసుకురానుంది. ఈ ఫీచర్ ద్వారా మనం తరుచుగా వెళ్లే షాపింగ్ మాల్స్, స్కూల్స్, జిమ్ వంటి ప్రదేశాలను పిన్ చేసుకోవచ్చు. రోజు వెళ్లే దారిలో ఎంత ట్రాఫిక్ ఉంది, ఎంత సమయం పడుతుంది వంటి విషయాలను సులభంగా తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ రాబోయే కొన్ని వారాల్లో ఆండ్రాయిడ్ మరియు ఐఓస్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది.(చదవండి: 2021లో రానున్న ఆపిల్ ఎమ్2 ప్రాసెసర్) ప్రస్తుతం గూగుల్ మ్యాప్స్ లో ఇల్లు, పని చేసే ప్రదేశాలను మాత్రమే సేవ్ చేసుకోవడానికి అనుమతి ఉంది. త్వరలో రాబోయే కొత్త ఫీచర్ ద్వారా మనం తరుచుగా వెళ్లే ప్రదేశాలను జోడించుకోవచ్చు. వినియోగదారులు ప్రతిసారి ఈ ప్రదేశాల కోసం సెర్చ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ ఫీచర్ ద్వారా మన వ్యక్తిగత వాహనాలలో, ప్రజా రవాణాలలో ప్రయాణం చేసినప్పుడు ఏ రూట్ లో ప్రయాణిస్తే తొందరగా గమ్యానికి చేరుకుంటామో తెలియజేస్తుంది. ప్రస్తుతం ఉన్న ఎక్స్ప్లోర్, సేవ్డ్ ట్యాబ్స్ ఫీచర్ స్థానంలో ఇక మీదట గో ట్యాబ్ అందుబాటులోకి రానుంది. -
గూగుల్ మాప్స్లో సరికొత్త ఫీచర్
గూగుల్ మ్యాప్స్ సరికొత్త అప్డేట్ను తీసుకొస్తోంది. తాజా బీటా నివేదిక ప్రకారం, గూగుల్ మ్యాప్స్ లో 'రైడ్ సర్వీసెస్' అనే కొత్త సర్వీస్ ని తీసుకోరాబోతుంది. మ్యాప్స్ నుండి రైడ్-షేరింగ్ కంపెనీకి రూట్ సమాచారాన్ని పంపడం ద్వారా మరింత ఖచ్చితమైన ఛార్జీలను తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ప్రస్తుతం ఈ 'రైడ్ సర్వీసెస్' సెట్టింగ్ అనేది ఉబెర్ కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అయితే ఈ సర్వీసులు అనేవి వేర్వేరు ప్రాంతాలలో విభిన్నంగా ఉండవచ్చు. ప్రస్తుతం ఇది ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. త్వరలో ఈ సేవలు మరింత మందికి అందుబాటులోకి రానున్నాయి. గూగుల్ మ్యాప్స్ యొక్క తాజా బీటా వెర్షన్ లో బిల్డింగ్ నంబర్లు మరియు క్రాస్వాక్ గుర్తులను జోడించినట్లు నివేదిక పేర్కొంది. పరిమిత నగరాల కోసం అందుబాటులో ఉన్న ఈ సేవలు త్వరలో మరిన్నీ నగరాలకు విస్తరించనున్నట్లు సమాచారం. న్యూయార్క్ వంటి నగరాల్లోని వీధుల్లో మ్యాప్ లను జూమ్ చేయడం ద్వారా మీరు భవనాల సంఖ్యలను మరియు క్రాస్వాక్ గుర్తులను గుర్తించవచ్చని నివేదికలోని స్క్రీన్షాట్లలో తెలుస్తుంది. (చదవండి: ఫ్లిప్కార్ట్ లో మరో కొత్త సేల్) -
గూగుల్ మ్యాప్స్లో సరికొత్తగా “కమ్యూనిటీ ఫీడ్”
గత కొన్ని సంవత్సరాలుగా గూగుల్ తన మ్యాపింగ్ అప్లికేషన్లో ఎక్కువగా ఆహారానికి సంబందించిన సమాచారాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఆహార విభాగానికి సంబంధించి ఇంకా ఎక్కువ సమాచారం అందించడం కోసం "కమ్యూనిటీ ఫీడ్" సహాయాన్ని తీసుకుంటుంది. దీని కోసం గూగుల్ మ్యాప్స్లో ఇప్పుడు మీరు ఎక్సప్లోర్ అనే ఆప్షన్ ని పైకి స్వైప్ చేసినట్లయితే మీకు అక్కడ బాగా జనాదరణ పొందిన షాపింగ్ మాల్స్ వంటి ప్రదేశాలు, ఆహార స్టాల్స్, ఇతర సమాచారం అక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు వీటి స్థానంలో కొత్తగా “కమ్యూనిటీ ఫీడ్” అనే ఆప్షన్ తీసుకురాబోతుంది. నమ్మదగిన సోర్స్ నుండి ప్రతి రోజు కొత్తగా “కమ్యూనిటీ ఫీడ్”ని తీసుకొస్తుంది. ప్రస్తుతం ప్రతిరోజూ గూగుల్ 20 మిలియన్ రేటింగ్లు/ సమీక్షలు, ఫోటోలు, సమాధానాలు వస్తున్నాయని గూగుల్ తెలిపింది. అలాగే త్వరలో మీరు ఫాలో అయ్యే ప్రదేశాలు, ఆహార స్టాల్స్, పానీయాల వ్యాపారుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.(చదవండి: ఈ ఏడాది బెస్ట్ యాప్స్ ఇవే) -
గూగుల్ మ్యాప్స్ లో మరో సరికొత్త ఫీచర్
కోవిడ్ - 19 వైరస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో ఎక్కడ జనాలు అక్కడే ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ప్రయాణాలు లేకపోవడంతో మ్యాపింగ్, నావిగేషన్ సేవల వినియోగం చాలా తగ్గింది. గూగుల్ మ్యాప్స్ ఈ సమయంలో తన సేవలను మెరుగు పరుచుకుంది. అంతే కాదు, ఈ వ్యాది మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు 250 కొత్త ఫీచర్స్ ని తీసుకొచ్చింది గూగుల్. తాజాగా, గూగుల్ మ్యాప్స్ లైవ్ ట్రాన్సిట్ “క్రౌడ్నెస్(జనసమూహం)” డేటా అనే ఫీచర్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మీరు ప్రయాణిచాలనుకుంటున్న దారిలో ప్రజారవాణాకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తుంది. అంటే బస్సులు, రైళ్లు మరియు సబ్వే వంటి వాటిలో ఎక్కువ మంది ఎందులో ప్రయాణిస్తున్నారనేది మీకు ఇట్టే తెలిసిపోతుంది. దాని వల్ల మీరు మరో ప్రత్యామ్నాయం మార్గంలో ప్రయాణించొచ్చు. ఈ సమాచారం అంతా మీకు గూగుల్ మ్యాప్స్ లో ప్రజలు ఇచ్చే ఫీడ్ బ్యాక్, వారి లైవ్ స్టేటస్ ఆధారంగా తెలియజేస్తునట్లు గూగుల్ తెలిపింది. ఈ సమాచారం ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతాలలో లభిస్తుంది కావున అన్ని ప్రాంతాల్లో ఇది అందుబాటులో ఉండకపోచ్చని తెలిపింది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇది పనిచేస్తుందని వెల్లడించింది.(చదవండి: గూగుల్ పే యూజర్లకు డెబిట్ కార్డులు) మరో ముఖ్యవిషయం ఏమిటంటే మ్యాప్స్ ద్వారా ఆహార పంపిణీ(ఫుడ్ డెలివరీ)కి అనుకూలమైన కేంద్రంగా మార్చుకుంటున్నట్లు తెలిపింది. ఇప్పటికే అమెరికా, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రెజిల్, భారత్లలో ఫుడ్ డెలివరీ లైవ్ స్టేటస్, డెలివరీకి పట్టే సమయం, డెలివరీ ఛార్జీలు వంటి వివరాలను మ్యాప్స్ చూపిస్తున్నట్టు పేర్కొంది. కొద్ది రోజుల్లో ఈ ఫీచర్స్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్స్కి అందుబాటులోకి రానున్నాయని తెలిపింది. -
భార్య గుట్టు రట్టు చేసిన గూగుల్ మ్యాప్
లిమా: గూగుల్ మ్యాప్ సాయంతో ఏ ప్రాంతాన్నైనా అలవోకగా చుట్టిరావొచ్చు. ఎక్కడి ప్రదేశాన్నైనా కూర్చున్నచోటే చూసేయొచ్చు. ముఖ్యంగా మన ఇంటిని, వీధిని కూడా గూగుల్ మ్యాప్స్లో చెక్ చేసుకోవచ్చు. ఈ క్రమంలో వీధిలో ఎక్కడేం జరుగుతుందో కూడా తెలుసుకోవచ్చు. అయితే గూగుల్ మ్యాప్ వల్ల కొన్ని సరదా సంఘటనలు చోటు చేసుకున్నప్పటికీ ఓసారి మాత్రం భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టి వారిని వేరు చేసింది. అమెరికాలోని పెరూ రాష్ట్ర రాజధాని లిమాలో చెందిన ఓ వ్యక్తి గూగుల్ మ్యాప్ తెరిచి స్ట్రీట్ వ్యూ చూశాడు. ఇంతలో వీధిలోని బల్లపై ఓ మహిళ, ఆమె ఒడిలో ఓ వ్యక్తి సేదతీరుతూ కనిపించారు. ఇంత క్లోజ్గా ఊసులాడుకుంటున్న వీళ్లపై అతనికి ఎందుకో అనుమానం వేయడంతో జూమ్ చేసి చూశాడు. (వైరల్: ‘నిజమైన కుక్కను కనుక్కోవడం కష్టమే’) తీరా అక్కడున్నది ఎవరో కాదు, తన అర్ధాంగే అని తెలిసి అతని గుండె పగిలినంత పనైంది. భార్య గుట్టు రట్టు కావడంతో దాన్ని ఫొటో తీసి, ఇంటికెళ్లాక ఆమెకు చూపించాడు. అందులో ఉన్నది తాను కాదని ముందుగా బుకాయించినప్పటికీ తర్వాత ఆమె నిజాన్ని అంగీకరించ తప్పలేదు. దీంతో ఆయన.. భర్త ఉండగానే వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకున్న ఆమె తనకు ఇల్లాలుగా పనికి రాదంటూ కోర్టు మెట్లెక్కి విడాకులు తీసుకున్నాడు. 2013లో చోటు చేసుకున్న ఈ ఘటన మరోసారి ట్రెండింగ్ అవుతోంది (గూగుల్నే ఫూల్ చేశాడు!) -
గూగుల్ @కరోనా సెంటర్
న్యూఢిల్లీ: కరోనా నిర్ధారణ పరీక్షా కేంద్రాల గురించి సమాచారాన్ని ఇకపై గూగుల్ సెర్చ్, గూగుల్ అసిస్టెంట్, గూగుల్ మ్యాప్స్లో కూడా తెలుసుకోవచ్చు. తాము కొత్తగా ప్రవేశపెట్టిన ఫీచర్ ద్వారా వినియోగదారులు తమకు దగ్గరగా ఉన్న కోవిడ్ పరీక్షా కేంద్రాల గురించి తెలుసుకోవచ్చని గూగుల్ ప్రకటించింది. దీనికోసం గూగుల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), మై గవర్నమెంట్ నుంచి అధికారిక సమాచారాన్ని పొందనుంది. ఈ సమాచారం ఇంగ్లిష్తో పాటు హిందీ, బెంగాలీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, గుజరాతీ భాషల్లోనూ లభించనుంది. ఈ సమాచారాన్ని పొందడం చాలా సులభం. గూగుల్లో నెటిజన్లు కరోనా గురించిన సమాచారాన్ని వెతికేటపుడు సెర్చ్ రిజల్ట్స్లో టెస్టింగ్ అనే బటన్ కూడా కనిపించనుంది. కరోనా వైరస్ నిర్ధారణ జరిపే ల్యాబ్ వివరాలు ఆ బటన్ నొక్కడం ద్వారా పొందవచ్చని గూగుల్ తెలిపింది. ఇదే సదుపాయం గూగుల్ మ్యాప్స్లో కరోనా నిర్ధారణ ల్యాబ్ల గురించి వెతికే వారికి కనిపించనుంది. ప్రస్తుతానికి 300 నగరాల్లోని 700 పరీక్షా కేంద్రాలను గూగుల్ సెర్చ్, అసిస్టెంట్, మ్యాప్స్తో అనుసంధానం చేసినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న మరిన్ని కేంద్రాల సమాచారాన్ని పొందుపరచేందుకు అధికారులతో కలసి పని చేస్తున్నట్లు పేర్కొంది. -
జనసమ్మర్ధం ఎక్కడెంత ?
న్యూఢిల్లీ: నిత్యావసరం, అత్యవసరం అంతకు మించి గుమ్మం దాటి బయటకు రావడానికే లేదు. ఇండియా మాత్రమే కాదు. అన్ని దేశాల పరిస్థితి ఇంతే. అయినా సరే బయటకు వచ్చే జనం వస్తూనే ఉన్నారు. అయితే లాక్డౌన్కి ముందు తర్వాత పరిస్థితుల్ని పోలుస్తూ గూగుల్ మ్యాప్స్ ప్రపంచ దేశాల్లో ఏయే ప్రాంతాల్లో ఎంత రద్దీ తగ్గిందో ఒక నివేదిక రూపొందించింది. భౌతిక దూరం నిబంధనలపై ఆరోగ్య శాఖ అధికారులకు ఉపయోగపడడం కోసం ఈ నివేదిక రూపొందించింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారే అత్యధికులు కావడంతో ఇంటిపట్టున ఉండే వారి శాతం పెరిగింది. మిగిలిన అన్ని చోట్లా జనసమ్మర్థం సాధారణం కంటే 50 శాతానికిపైగా తగ్గింది. మార్చి నెలాఖరు నాటికి భారత్లో జనసమ్మర్థం పరిస్థితి ఇలా ఉంది.. -
ఆ వివరాలను బయట పెట్టనున్న గూగుల్
పారిస్: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు టెక్ దిగ్గజం గూగుల్ ఆయా దేశాల ప్రభుత్వాలకు సహాయ పడేందుకు సిద్ధమవుతోంది. గూగుల్ సాఫ్ట్వేర్ వాడుతున్న ఫోన్ల ద్వారా వినియోగదారులు ఎక్కువగా తిరుగుతున్న ప్రాంతాల సమాచారం సేకరించి, దాన్ని ఒక వెబ్సైట్ ద్వారా బయట పెట్టనున్నట్లు గూగుల్ మ్యాప్స్ అధినేత జెన్ ఫిడ్జ్ పాట్రిక్ తెలిపారు. దాదాపు 131 దేశాల్లోని వినియోగదారుల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని వెబ్సైట్ లో ఉంచనున్నట్లు వెల్లడించారు. అయితే ఇదంతా కేవలం ఒక నిర్ణీత ప్రాంతానికి వచ్చిన వారి సంఖ్య కేవలం పర్సంటేజ్ రూపంలో మాత్రమే ఉంటుందని తెలిపారు. కచ్చితంగా ఎంత మంది వచ్చారనే సంఖ్య ఉండదని స్పష్టం చేశారు. -
గూగుల్ మ్యాప్స్ కొత్త అప్డేట్స్
-
గూగుల్ మ్యాప్స్ పుట్టిన రోజు : కొత్త అప్డేట్స్
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తన యాప్లలో ప్రధాన యాప్ గూగుల్ మ్యాప్ను కొత్త లోగో, కొత్త ఫీచర్లతో అప్డేట్ చేసింది. గూగుల్ మ్యాప్ 15 వ పుట్టిన రోజు సందర్భంగా గురువారం నుంచి ఈ కీలక మార్పులు చేసింది. గూగుల్ మ్యాప్స్ 15 ఏళ్లు మైలురాయిని అధిగమించిన సందర్భంగా కలర్ఫుల్ కొత్త లోగోను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా యూజర్ల సౌలభ్యం కోసం తాజాగా అయిదు కొత్త సదుపాయాలను పరిచయం చేసింది. యాప్ అడుగుభాగంలో ఎక్స్ప్లోర్, కమ్యూట్, సేవ్డ్, కంట్రిబ్యూట్, అప్డేట్స్ (అన్వేషించండి, ప్రయాణించండి, సేవ్ చేయండి, సహకరించండి, నవీకరణ) అనే ఐదు ట్యాబ్స్ ను కొత్తగా జోడించింది. దీంతో ఇప్పటివరకు గూగుల్ మ్యాప్స్ లో అంతర్గతంగా ఉన్న సదుపాయాలన్నీ ఈ ఐదు ట్యాబ్స్లో ఇక మీదట సులభంగా అందుబాటులోకి వస్తాయన్నమాట. అన్వేషించండి: సమీప రెస్టారెంట్లు, ముఖ్య ప్రదేశాలు, సమీక్షలు , అలాగే సమీక్షలను వ్రాయడానికి, ఫోటోలను అప్లోడ్ చేయడానికి, ఇతర సిఫార్సులను అనుమతినిస్తుంది. కమ్యూట్ : ఒక ప్రదేశానికి దిశలను ఇస్తుంది, ప్రయాణ సమయ అంచనాలు, ట్రాఫిక్ హెచ్చరికలను అందిస్తుంది ఎప్పటిలాగానే. సేవ్డ్ : సులభంగా సెర్చ్ చేసేందుకు వీలుగా ఇప్పటివరకు వినియోగదారులు సేవ్ చేసిన హోం, ఆఫీస్, నచ్చిన రెస్టారెంట్లు, తదితర వివరాలు ఒకేచోట కనిపిస్తాయి. అలాగే గతంలో ఎక్కడెక్కడ తిరిగారో అన్ని వివరాలు చూపించే టైం లైన్ ఆప్షన్ కూడా దీంట్లోనే కనిపిస్తుంది. వద్దు అనుకుంటే లొకేషన్ హిస్టరీ డిజేబుల్ చేసుకోవచ్చు. కంట్రిబ్యూట్: ఎప్పటికప్పుడు వెళ్లే ప్రదేశాలకు సంబంధించిన ఫోటోలు, ఆయా రెస్టారెంట్లు ఇతర స్థలాల గురించి రివ్యూలను ప్రపంచంతో షేర్ చేసుకునే అవకాశం. అలాగే ఇప్పటికే ఉన్న ప్రదేశాలకు సంబంధించి ఏమైనా కరెక్షన్స్ ఉంటే వాటిని కూడా సూచించవచ్చు. అప్డేట్స్ : ప్రస్తుతం మీరు ఉన్న ప్రదేశానికి దగ్గరలో ఉన్న అన్ని ప్రదేశాలకు సంబంధించిన రికమండేషన్లు, స్థానిక నిపుణులు, వివిధ వ్యాపార సంస్థల మెసేజ్ల వివరాలు ఇక్కడ కనిపిస్తాయి..అలాగే బస్సు లేదా ట్రైన్ ప్రయాణం గురించి ప్రయాణం ముగిసిన వెంటనే మరింత సమాచారం ఇచ్చే విధంగా గూగుల్ మ్యాప్స్ యూజర్లను ఇక మీదట ప్రోత్సహిస్తుంది. అలాగే ఆ సమాచారాన్ని వినియోగదారులందరికీ అందుబాటులో ఉంచుతుంది. మీరు ఈ టాబ్ ద్వారా నేరుగా మ్యాప్స్లోని ఇతర వ్యాపారాలతో కూడా సంభాషించవచ్చు. వివిధ ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు ఇక మీదట అక్కడ ఉండే ఉష్ణోగ్రతలు, వీల్ ఛెయిర్ వంటి సదుపాయాలు లాంటి వివరాలు లభ్యం. ఇక చివరగా నిర్దిష్ట ప్రాంతాల్లో, మహిళల కోసం కొత్త భద్రతా సమాచారం కూడా ఉంది. ఇందులో సురక్షితమైన రవాణా మార్గాల గురించి సమాచారాన్ని అందిస్తుంది. అక్కడ ఉండే సెక్యూరిటీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు వంటి వివరాలను కూడా గూగుల్ మ్యాప్స్ మనకు తెలియజేస్తుంది. -
గూగుల్నే ఫూల్ చేశాడు!
బెర్లిన్: అందరికీ పెద్ద దిక్కైన గూగుల్నే బురిడీ కొట్టించాడో ఘనుడు. గూగుల్ మ్యాప్ మనలాంటి సాధారణ ప్రయాణికులతో ఓలా, ఉబర్ వంటి క్యాబ్ రైడింగ్ వ్యాపారాలకు కూడా ఎంతో అవసరమైనది. అలాంటి దిగ్గజ యాప్ను తప్పుదారి పట్టించాడో వ్యక్తి. ప్రయాణానికి రెడీ అయ్యేముందు మనం వెళ్లే రూటులో ఎక్కడ ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉందో చూసుకున్నాకే బండి బయటకు తీస్తాం. అలాంటిది గూగుల్ మ్యాపే స్వయంగా ఫలానా మార్గంలో ట్రాఫిక్ ఉందని వేరే రూటు వెతుక్కోండని చెప్పడంతో అక్కడి వారు నిజమేనని నమ్మి ఆ దారిలోకి అడుగుపెట్టలేదు. కానీ ఆ మార్గంలో ట్రాఫిక్ కాదు కదా కనీసం వేళ్ల మీద లెక్కేపెట్టేంత వాహనాలు కూడా లేకపోవడం గమనార్హం. బెర్లిన్కు చెందిన సిమన్ వెకర్ట్ అనే వ్యక్తి 99 సెకండ్ హ్యాండ్ ఫోన్లను ఓ చిన్నపాటి ట్రాలీలో వేసుకుని ఎంచక్కా రోడ్లపై నెమ్మదిగా నడక సాగించాడు. ఇది గూగుల్ మ్యాప్కు మరోలా అర్థమైంది. ఆ రోడ్డులో ఎన్నో వాహనాలు ఉన్నాయని, అవి నెమ్మదిగా కదులుతున్నాయని దీంతో ట్రాఫిక్ జామ్ అయిందని భావించింది. వెంటనే తక్షణ కర్తవ్యంలా.. చాలా మంది యూజర్లకు ఆ ప్రాంతంలో రద్దీ ఎక్కువగా ఉంది, వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి.. కనుక మీరు మరో మార్గాన్ని ఎంచుకోండని సూచించింది. ఇక ఆ వ్యక్తి నెమ్మదిగా ఫోన్లను లాక్కుంటూ వెళ్లడంతో ఆ రహదారి ప్రాంతం గూగుల్ మ్యాప్లో గ్రీన్ నుంచి రెడ్ కలర్కు మారిపోయింది. ఈ ప్రయోగాన్నిఅతను గూగుల్ కంపెనీకి దగ్గరలోనే చేపట్టడం గమనార్హం. గూగుల్ నిజంగానే మోసపోయిందా? ఇక దీన్నంతటిని సిమన్ వెకర్ట్ యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. కానీ దీనిగురించి పూర్తి వివరాలు తెలియపర్చలేదు. దీంతో ఆ వీడియో చూసినవారికి పలు సందేహాలు తలెత్తుతున్నాయి. అంతపెద్ద గూగుల్ కంపెనీ ఇంత చిన్నదానికే మోసపోయిందా? అసలు ఇది నిజమేనా, అంతా బూటకమేనా? అని రకరకాలుగా చర్చించుకుంటున్నారు. మరికొందరు గూగుల్ మ్యాప్పై బాహాటంగానే సెటైర్లు వేస్తున్నారు. కానీ ఇదే కనక నిజమైతే గూగుల్ వీటికి అడ్డుకట్ట వేసేందుకు ఉపక్రమించక తప్పదు. చదవండి: రియల్ రైడ్ చేయండి.. -
రియల్ రైడ్ చేయండి..
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల భాగ్యనగరంలో గణేశుడి శోభాయాత్ర జరిగింది. అప్పుడు ట్రాఫిక్ అధికారులు కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఏయే మార్గాల్లో శోభాయాత్ర జరుగుతోంది.. ఎటువైపు రోడ్లు మూసేశారు.. ఇలా అన్ని వివరాలను గూగుల్ మ్యాప్లో పొందుపరిచారు. ఎప్పటికప్పుడు సమాచారం అందించారు. దీన్నే రియల్ టైమ్ సమాచారం అందించడం అంటారు. అయితే ఇలా సాధారణ రోజుల్లో కూడా వాహనదారులకు అందించాలని ట్రాఫిక్ విభాగం యోచిస్తోంది. ఇందుకు గురువారం హైదరాబాద్ ట్రాఫిక్ చీఫ్ అనిల్కుమార్ గూగుల్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ట్రాఫిక్ పోలీసులు అందించే సమాచారం ఆధారంగా ప్రత్యేక మార్కింగ్స్తో వివరాలను మ్యాప్స్లో పొందుపరిచేందుకు గూగుల్ అంగీకరించింది. ట్రయల్ రన్ నెల రోజుల్లో అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. దాదాపు ప్రతి వాహనదారుడు గూగుల్ మ్యాప్స్ సాయం తీసుకుంటున్నాడు. అందులో సూచించిన ప్రకారం ఏయే మార్గాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉందో తెలుసుకుని ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటున్నాడు. దీంతో వాహనదారులకు మరింత మెరుగైన సమాచారం అందించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. ఇప్పుడు అమల్లోకి తీసుకొచ్చే విధానంతో ఏయే రోడ్లు మూసేశారు.. అందుకు కారణాలు.. ఎన్ని రోజుల పాటు అలా ఉంటుంది.. తదితర అంశాలు గూగుల్ మ్యాప్స్లో ప్రత్యక్షం కానున్నాయి. రహదారుల మూసివేత మాత్రమే కాకుండా కీలక సమయాల్లో విధించే ట్రాఫిక్ ఆంక్షలు/మళ్లింపులు, ధర్నాలు/ నిరసనలు, సభలు/ సమావేశాలు, ప్రమాదాలతో పాటు రోడ్డు మరమ్మతులు.. ఇలా ఏ విషయమైనా ప్రత్యేక గుర్తులతో గూగుల్ మ్యాప్స్లో పొందుపరచనున్నారు. వర్షం పడినా చెప్పేస్తుంది.. రోడ్ల మరమ్మతులతో వివిధ అభివృద్ధి పనులు చేసేందుకు ఆయా విభాగాలకు ట్రాఫిక్ అధికారులు నిర్ణీత సమయం ముందు లిఖిత పూర్వకంగా అనుమతి ఇస్తారు. అలా చేసిన వెంటనే ఆ సమాచారాన్ని గూగుల్కు అందజేస్తారు. ఆయా మార్గాల్లో మళ్లింపులు/ఆంక్షలు మొదలైన నాటి నుంచి పూర్తయ్యే వరకు ఆ సమయాన్ని సూచిస్తూ గూగుల్ మ్యాప్స్లో పొందుపరుస్తారు. వర్షం నీరు నిలవడం, ప్రమాదాలు జరగడంతో ఏర్పడే ట్రాఫిక్ జామ్ వివరాలను బషీర్బాగ్లోని హైదరాబాద్ పోలీసు కమిషనరేట్లో ఉన్న ట్రాఫిక్ కమాండ్, కంట్రోల్ సెంటర్కు చెందిన అధికారులు గూగుల్కు అందిస్తారు. ఇందుకు పలు ప్రాంతాలో అమర్చిన సీసీ కెమెరాలను వినియోగిస్తారు. క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ సిబ్బంది నుంచి సమాచారం తీసుకుంటూ గూగుల్కు అందిస్తూ మ్యాప్లో అప్డేట్ అయ్యేలా చర్యలు తీసుకోనున్నారు. -
స్వదేశీ డిజిటల్ మ్యాప్
బెంగళూరు: మీరు గూగుల్ మ్యాప్ వాడుతున్నారా ? గమ్యస్థానం చేరినప్పటికీ మ్యాప్లో కొద్ది మీటర్ల దూరం తేడా వచ్చిందా ! గూగుల్ మ్యాప్స్లో కచ్చితత్వం, కొన్ని మీటర్ల తేడాతో ఉండటం వల్ల ఈ సమస్యలు తలెత్తున్నాయి. దీన్ని అధిగమించేందుకు భారత్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలోని సర్వే ఆఫ్ ఇండియా నడుం కట్టింది. డిజిటల్ మ్యాప్గా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్టులో భాగంగా కచ్చితత్వాన్ని 10 సెంటీమీటర్ల తేడాతో గుర్తించేలా డిజిటల్ మ్యాప్ను తయారుచేయబోతోంది. దీనికోసం డ్రోన్లను, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బిగ్డేటాను ఉపయోగించుకుంటోందని ప్రభుత్వ సీనియర్ అధికారి వెల్లడించారు. కచ్చితమైన కొలతలతో... ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక మ్యాపును ప్రజలకు, గ్రామ పంచాయతీలకు, ప్రభుత్వ అధికారులకు అందివ్వనున్నారు. దీనివల్ల పరిపాలనా పరమైన ప్రయోజనాలు కూడా ఉండేలా రూపకల్పన చేస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక, హరియాణా, మహారాష్ట్ర, గంగా బేసిన్లో మ్యాప్ కోసం సర్వే ప్రారంభించారు. గంగా బేసిన్కు ఇరువైపులా 25 కిలోమీటర్ల దూరంపాటు 10 సెంటీమీటర్ల కచ్చితత్వంతో మ్యాపింగ్ చేస్తున్నట్లు సర్వే అధికారి ప్రొఫెసర్ శర్మ వెల్లడించారు. డిజిటల్ రిఫరెన్స్ పాయింట్లు... భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)తో కలసి ఈ ప్రాజెక్టు చేపట్టామన్న వార్తలు అవాస్తవమని ప్రొఫెసర్ శర్మ తెలిపారు. సాధారణంగా శాటిలైట్లు ఫొటోలు తీస్తాయని, ఇది అలాంటి సాంకేతిక కాదన్నారు. డ్రోన్లను ఉపయోగించి, మలుపులను పరిగణలోకి తీసుకొని తయారుచేసే హైరిజల్యూషన్ మ్యాప్ అన్నారు. ప్రతి 20 కిలోమీటర్లకు ఒక డిజిటల్ రిఫరెన్స్ పాయింట్ను ఏర్పాటు చేస్తామన్నారు. వీటి ద్వారా అక్షాంశాలు, రేఖాంశాలను కచ్చితత్వంతో విభజించడంతోపాటు 10 సెంటీమీటర్ల కచ్చితత్వంతో మ్యాప్ ఉంటుందన్నారు. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్) కొద్ది మీటర్ల తేడాతో ప్రదేశాలను గుర్తిస్తే ఇందులో ఆ తేడా స్వల్పమన్నారు. -
గూగుల్ మ్యాప్స్లో డైనింగ్ ఆఫర్లు
న్యూఢిల్లీ: భారతీయ యూజర్స్ కోసం గూగుల్ మ్యాప్స్ తాజాగా మరో మూడు ఫీచర్స్ ప్రవేశపెట్టింది. 11 నగరాల్లోని స్థానిక హోటళ్లలో డీల్స్ను తెలుసుకునేందుకు ఉపయోగపడే ఆఫర్ ఫీచర్ వీటిలో ఉంది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణె మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. ఈజీడైనర్ సంస్థతో కలిసి ’ఆఫర్’ ఫీచర్ అందిస్తున్నట్లు గూగుల్ వెల్లడించింది. దీనితో 4,000 పైచిలుకు రెస్టారెంట్స్లో ఆఫర్స్ గురించి తెలుసుకోవచ్చు. ఎక్స్ప్లోర్ ట్యాబ్లో ఆఫర్స్ షార్ట్కట్ను క్లిక్ చేయడం ద్వారా ఈ ఫీచర్ను ఉపయోగించుకోవచ్చు. దీని కింద గురువారం మొదలు 15 రోజుల దాకా 1,500 పైచిలుకు రెస్టారెంట్లలో ఈజీడైనర్ ప్రత్యేక ప్రైమ్ ఆఫర్స్ను, కనీసం 25 శాతం డిస్కౌంట్ను కచ్చితంగా పొందవచ్చని గూగుల్ వివరించింది. ఇక దేశీ యూజర్స్ అభిరుచులకు అనుగుణంగా ఎక్స్ప్లోర్ ట్యాబ్ను తీర్చిదిద్దామని, ఇందులో కొత్తగా రెస్టారెంట్లు, పెట్రోల్ బంకులు, ఏటీఎంలు మొదలైన ఏడు విభాగాల షార్ట్కట్స్ చేర్చామని పేర్కొంది. అలాగే కొత్తగా ప్రవేశపెట్టిన ’ఫర్ యూ’ ట్యాబ్ ద్వారా కొత్త రెస్టారెంట్లు, వార్తల్లో ఉన్న ప్రదేశాలు, యూజర్ల అభిరుచులకు అనుగుణంగా అందించే సిఫార్సులను పొందవచ్చని గూగుల్ పేర్కొంది. -
టాక్సీ దారి తప్పితే అలర్ట్
శాన్ఫ్రాన్సిస్కో: టాక్సీ డ్రైవర్లు 500 మీటర్లు దాటి రాంగ్రూట్లో వెళ్తుంటే అలర్ట్ చేసేలా గూగుల్ మ్యాప్స్ నూతన ఫీచర్ను సిద్ధం చేస్తోంది. ‘ఆఫ్ రూట్’గా వ్యవహరిస్తున్న ఈ ఫీచర్ను ప్రత్యేకంగా భారత్లోనే అందించనున్నారు. చేరాల్సిన గమ్యాన్ని మ్యాప్లో నిర్ధారించుకున్న తర్వాత మెనూలోని స్టే సేఫర్ అనే ఆప్షన్లో ఆఫ్ రూట్ అలర్ట్ అనే ఈ ఫీచర్ ఉంటుందని సోమవారం ఎక్స్డీఏ డెవలపర్లు తెలిపారు. టాక్సీ ఎంచుకున్న మార్గంలో కాకుండా వేరే మార్గంలో 500 మీటర్లు దాటిన ప్రతిసారి ఈ ఫీచర్ ద్వారా వినియోగదారునికి అలర్ట్ వస్తుందని తెలిపారు. అయితే మార్గం తప్పిన టాక్సీకి అక్కడి నుంచి తిరిగి గమ్యానికి కలిపే దారిని మాత్రం ఈ ఫీచర్ చూపించలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో గూగుల్ ఇంకా ప్రకటించలేదు. బ్రెయిన్ లైవ్ స్టేటస్, బస్ ప్రయాణ సమయం, మిక్స్డ్ మోడ్లో ఆటోరిక్షా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వంటి నూతన ఫీచర్లను గూగుల్ ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. -
గూగుల్ మ్యాప్స్లో రైళ్ల అప్డేట్స్
న్యూఢిల్లీ: గూగుల్ మ్యాప్స్ యూజర్లు ఇకపై బస్సు ప్రయాణాలకు పట్టే సమయం, ప్లాట్ఫాంపై రైళ్ల రాక గురించిన వివరాలను లైవ్లో తెలుసుకోవచ్చు. హైదరాబాద్ సహా దేశంలోని 10 పెద్ద నగరాల్లో ఈ సర్వీసులు అందుబాటులోకి తెచ్చినట్లు గూగుల్ తెలిపింది. అలాగే, ఆటో, ప్రజా రవాణా వాహనాలకు సంబంధించిన సమాచారం కూడా ఇచ్చే ఫీచర్ను మ్యాప్స్లో పొందుపర్చినట్లు వివరించింది. లైవ్ ట్రాఫిక్ వివరాలు అందించడం ద్వారా తమ యూజర్లకు ప్రయాణాలను మరింత సులభతరం చేయనున్నట్లు గూగుల్ పేర్కొంది. గూగుల్ మ్యాప్స్ ద్వారా ట్రెయిన్ రన్నింగ్ స్టేటస్ను గురించి తెలుసుకోవచ్చు. అలాగే వివిధ ప్రాంతాల మధ్య తిరిగే రైళ్ల లిస్టు వివరాలు పొందవచ్చు. గతేడాది కొనుగోలు చేసిన వేర్ ఈజ్ మై ట్రెయిన్ యాప్ సంస్థతో కలిసి ఈ ఫీచర్ను అభివృద్ధి చేసినట్లు గూగుల్ పేర్కొంది. -
గూగుల్ మ్యాప్స్లో ఆటో రిక్షా రూట్లు
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తాజాగా మ్యాప్స్ యాప్లో ఆటో రిక్షా రూట్లను కూడా పొందుపర్చింది. ఏయే ప్రాంతాలకు ఆటోల్లో ప్రయాణించేందుకు ఎంతెంత చార్జీలవుతాయన్నది ఇది ఉజ్జాయింపుగా చూపిస్తుంది. ఆయా రూట్లలో ఆటో చార్జీలపై ప్రయాణికులు ఒక అంచనాకు వచ్చేందుకు ఈ ఫీచర్ తోడ్పడగలదని గూగుల్ మ్యాప్స్ ప్రొడక్ట్ మేనేజర్ విశాల్ దత్తా తెలిపారు. దీన్ని సోమవారం నుంచి ముందుగా ఢిల్లీలో అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారాయన. ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ నుంచి సేకరించిన చార్జీల పట్టిక ఆధారంగా మ్యాప్స్ యాప్లో చార్జీలను పొందుపర్చినట్లు పేర్కొన్నారు. ‘‘ఎక్కువగా వినియోగించే ప్రజా రవాణా సాధనాలను మ్యాప్స్లో అందుబాటులో ఉంచాలన్నది మా ఉద్దేశం. చాలా మందికి తాము వెళ్లే ప్రదేశం ఎంత దూరంలో ఉంది, మెరుగైన రూట్ ఏది, ఏయే రవాణా సాధనంలో చార్జీలు ఎంతెంత అవుతాయన్నది అంతగా తెలియదు. ఇలాంటి వారికి ఆటో, బస్సు లేదా మెట్రో మొదలైన వాటిల్లో దేని ద్వారా త్వరితగతిన, తక్కువ చార్జీలతో గమ్యస్థానాలకు చేరుకోవచ్చో తెలుసుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది’’ అని దత్తా వివరించారు. బిలియన్ డాలర్లతో గూగుల్ కొత్త క్యాంపస్ న్యూయార్క్ సిటీలో దాదాపు బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్తో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్లు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ వెల్లడించింది. గూగుల్ హడ్సన్ స్క్వేర్గా వ్యవహరించే ఈ క్యాంపస్ 2020 నాటికి అందుబాటులోకి రాగలదని, ఆ తరువాతి పదేళ్లలో న్యూయార్క్ సిటీలోని తమ ఉద్యోగుల సంఖ్య రెట్టింపై 14,000కు చేరగలదని వివరించింది. -
భారత్ ‘గూగుల్ మ్యాప్స్’లో సరికొత్త ఫీచర్లు!
చండీగఢ్: భారత్లో గూగుల్ మ్యాప్స్లో త్వరలో సరికొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ తెలిపింది. భారత్లో రోడ్డు మార్గాలు, ప్రజారవాణా వ్యవస్థలను కచ్చితత్వంతో అందుబాటులోకి తెస్తామని గూగుల్ మ్యాప్స్ ఇండియా ప్రోగ్రామ్ మేనేజర్ అనల్ ఘోష్ చెప్పారు.‘ టూవీలర్స్ మాత్రమే వెళ్లగలిగే రోడ్లను, షార్ట్కట్లను గూగుల్ మ్యాప్స్లో చేరుస్తాం. దేశంలోని 12,000 రైళ్ల ప్రయాణ వివరాలు చూపేలా దీన్ని తీర్చిదిద్దుతున్నాం. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ సాయంతో పబ్లిక్ టాయిలెట్లను గూగుల్ మ్యాప్స్లో చేర్చే ప్రక్రియ కొనసాగుతోంది. దీంతోపాటు కోల్కతా, సూరత్ నగరాల్లో బస్సుల రాకపోకలపై రియల్ టైమ్ సమాచారాన్ని అందజేస్తున్నాం’ అని తెలిపారు. ఈ రియల్ టైమ్ సౌకర్యాన్ని మిగతా పట్టణాలకు విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు ఘోష్ వెల్లడించారు. -
గూగుల్ మ్యాప్తో మెట్రో పిల్లర్ నంబర్ల అనుసంధానం
-
గూగుల్ మ్యాప్తో ‘మెట్రో’ నంబర్ల అనుసంధానం
సార్.. మీకు కొరియర్ వచ్చింది.. మీ అడ్రస్ ఎక్కడ..? మెట్రో పిల్లర్ నంబర్ 1392 వద్దకు వచ్చేశావనుకో.. ఆ ఎదురు సందులో.. డాడీ క్యాబ్ బుక్ చేస్తున్నా.. సినిమా థియేటర్ అడ్రస్ ఎక్కడ..? మెట్రో పిల్లర్ నంబర్ 506.. దాని ఎదురుగానే షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్.. సాక్షి, హైదరాబాద్: త్వరలో నగరంలోని అడ్రస్లన్నింటికీ మెట్రో పిల్లర్లే మూలస్తంభంగా మారనున్నాయి. ఈ మేరకు మెట్రో రైలు పిల్లర్లను త్వరలో జీపీఎస్ సాంకేతికతతో గూగుల్ మ్యాప్ కు అనుసంధానించనున్నారు. వీటికి నంబర్లను కేటాయించడం ద్వారా పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతోపాటు వాణిజ్య, వ్యాపార సముదాయాలకు కేరాఫ్ అడ్రస్గా మారనున్నాయి. ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్– ఫలక్నుమా, నాగోల్–రాయదుర్గం మూడు మెట్రో కారిడార్లలో 66 కి.మీ. మార్గంలోని 2,541 మెట్రో పిల్లర్లకు దశలవారీగా నంబర్ల కేటాయింపు ప్రక్రియ మొదలుకానుంది. ఇప్పటికే ప్రకాశ్నగర్–రసూల్పురా మార్గంలో సీ1,300–సీ1,350 వరకు పిల్లర్లకు నంబర్లు కేటాయించారు. నీలిరంగు బోర్డుపై తెలుపు అక్షరాలతో వీటిని చిన్నగా ఏర్పాటు చేశారు. భవిష్యత్లో పెద్ద పరిమాణంలో అందరికీ కనిపించేలా రేడియంతో ఏర్పాటు చేయనున్నట్లు హెచ్ఎంఆర్ వర్గాలు తెలిపాయి. కాగా పీవీ ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్వే తరహాలో మెట్రో పిల్లర్లు సైతం నగరవాసులకు ల్యాండ్మార్క్ చిహ్నలుగా మారనుండటం విశేషం. ఎల్బీనగర్ పిల్లర్ నం.1..? మెట్రో కారిడార్లలో ‘ఏ’కారిడార్గా పిలిచే ఎల్బీనగర్–మియాపూర్ (29 కి.మీ.) మార్గంలో ఎల్బీనగర్ రింగ్రోడ్డు వద్ద పిల్లర్ నం.1 ఏర్పాటుకానుంది. ఈ మార్గంలో మొత్తం 1,108 పిల్లర్లున్నాయి. ఇక జేబీఎస్–ఫలక్నుమా (15 కి.మీ.) మార్గాన్ని ‘బీ’కారిడార్గా పిలుస్తున్నారు. ఈ మార్గంలో మొత్తం 588 పిల్లర్లున్నాయి. నాగోల్–రాయదుర్గం (28 కి.మీ.) మార్గంలో 845 పిల్లర్లున్నాయి. ఈ మార్గంలోనే ప్రస్తుతానికి ప్రకాశ్నగర్–రసూల్పురా మార్గంలోనే సి1300–సి1350 వరకు నంబర్లను కేటాయించారు. ఇక మెట్రో రెండోదశ కింద ఎబ్బీనగర్–నాగోల్, ఎల్బీనగర్–ఫలక్నుమా, రాయదుర్గం–శంషాబాద్ ఎయిర్పోర్ట్ తదితర మార్గాల్లోనూ ఏర్పాటుచేసే పిల్లర్లతో వీటి సంఖ్య మరింత పెరగనుంది. జీపీఎస్తో అడ్రస్ ఈజీ... మూడు మెట్రో కారిడార్ల పరిధిలో ప్రస్తుతం పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, ఆస్పత్రులు ఉన్నాయి. ఈ కారిడార్లకు రెండు వైపులా వేలాది కాలనీలు, బస్తీలున్నాయి. అత్యంత రద్దీగా ఉండే ఈ రూట్లలో గ్రేటర్ సిటిజన్లే కాకుండా ఇతర జిల్లాల వాసులూ రాకపోకలు సాగిస్తారు. వీరికి ఇప్పుడు ఆయా కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలను తేలికగా గుర్తించేందుకు పిల్లర్ నంబర్లే ఆధారం కానున్నాయి. ఈ పిలర్ల నెంబర్లను జీపీఎస్ సాంకేతికతతో గూగుల్ మ్యాప్కు అనుసంధానం చేయనుండటంతో.. పిల్లర్ నంబర్ ఆధారంగా గమ్యస్థానం చేరుకోవచ్చు. -
జియోఫోన్కు త్వరలో పాపులర్ గూగుల్ ఫీచర్లు
అన్ని స్మార్ట్ఫోన్లలో అందిస్తున్న పాపులర్ గూగుల్ సర్వీసులు త్వరలో రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్, జియోఫోన్లోకి రాబోతున్నాయి. గూగుల్ అసిస్టెంట్, గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్, గూగుల్ సెర్చ్లను జియో ఫోన్లో అందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. జియో ఫీచర్ ఫోన్ ప్రస్తుతం అమెరికా కంపెనీ కిఓఎస్ టెక్నాలజీస్కు చెందిన కిఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేస్తున్నాయి. గూగుల్తో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న కిఓఎస్ ఈ యాప్స్ను త్వరలో తన యూజర్లకు అందించడానికి ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తోంది. సెర్చింజన్ దిగ్గజం గూగుల్ నుంచి కిఓఎస్ టెక్నాలజీస్ సంస్థకు 22 మిలియన్ డాలర్ల సిరీస్ ఏ పెట్టుబడులు వచ్చాయని, ఈ పెట్టబడులను తర్వాతి తరం యూజర్లకు ఇంటర్నెట్ను అందించడానికి ఉపయోగిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. గూగుల్ నుంచి వచ్చిన ఈ నిధులను ఫాస్ట్-ట్రాక్ అభివృద్ధికి ఉపయోగిస్తామని, కిఓఎస్ ఆధారంగా రూపొందిన స్మార్ట్ ఫీచర్ఫోన్లను గ్లోబల్గా అందిస్తామని కిఓఎస్ చెప్పింది. ముఖ్యంగా ఇంటర్నెట్ లేని ఎమర్జింగ్ మార్కెట్లలో వీటిని ఉపయోగిస్తామని కిఓఎస్ టెక్నాలజీస్ సీఈవో సెబాస్టియన్ చెప్పారు. జియోఫోన్లు విజయవంతం కావడంతో, గూగుల్కు చెందిన పలు పాపులర్ యాప్స్ను ఈ యూజర్లకు అందించాలని కిఓఎస్ నిర్ణయించినట్టు తెలిసింది. కిఓఎస్ అనేది వెబ్ ఆధారిత ప్లాట్పామ్. జియోఫోన్కు వెల్లువెత్తిన భారీ డిమాండ్తో ఈ ఓఎస్ మొబైల్ ఓఎస్ మార్కెట్లో ఆపిల్ ఓఎస్ను బీట్ను చేసి మరీ 15 శాతం లాభాలనార్జించింది. -
‘మ్యాప్’తో గురి.. విల్లాల్లో చోరీ
సాక్షి, హైదరాబాద్: ధనవంతులే టార్గెట్గా విల్లాల్లో చోరీలకు పాల్పడుతూ రెండేళ్లుగా చిక్కకుండా తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ను మాదాపూర్ సీసీఎస్, నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్రావు తెలిపారు. గచ్చిబౌలిలోని తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన మంజుల చంద్రశేఖర్ అలియాస్ చందు తొమ్మిదేళ్లుగా విల్లాల్లో చోరీలకు పాల్పడుతున్నాడు. నిందితుడిపై మాదాపూర్, గచ్చిబౌలి, నార్సింగి, పేట్బషీరాబాద్, నార్సింగి, ఆర్సీపురం, ఖమ్మం, తిరుపతి, వైజాగ్లలో కేసులున్నాయి. నిందితుడి నుంచి రూ.30 లక్షల విలువైన ఏడు తులాల బంగారు ఆభరణాలు, నాలుగు చేతి గడియరాలు, ఏనిమిది సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వివరించారు. వైజాగ్లోని రిషీ విల్లాలో చందు చోరీ చేసిన రూ.16 లక్షలు విలువైన రోలెక్స్ గడియారం, రూ.6 లక్షల విలువైన మరో గడియారం, 100గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిని పట్టు కోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులకు రివార్డులు అందజేస్తామన్నారు. సమావేశంలో సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ జానకీ షర్మిల, సీసీఎస్ ఏసీపీ నర్సింహారెడ్డి, మాదాపూర్ ఏసీపీ శ్యామ్ప్రసాద్రావు తదితరులు పాల్గొన్నారు. గూగుల్ మ్యాప్ సహాయంతో... చంద్రశేఖర్ చోరీ చేసిన స్మార్ట్ ఫోన్ లాక్ తీయించి, సిమ్కార్డు తీసేసి వైఫై ద్వారా ఇంటర్నెట్ ఉపయోగిస్తాడు. గూగుల్లో నగర శివారు ప్రాంతాల్లో విల్లాలు ఎక్కడున్నాయో గుర్తిస్తాడు. ఫెన్సింగ్ ఉన్నప్పటికీ రెక్కీ నిర్వహించి, వీలున్నా చోటు నుంచి లోపలికి వెళ్తాడు. చందుపై దాదాపు 40 కేసులున్నాయి. ఇతనిపై పీడీ యాక్టు కూడా నమోదు చేశారు. -
గూగుల్ మ్యాప్స్ లో అద్భుత ఫీచర్
సాక్షి, న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తాజాగా మరో అద్భుతమైన ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్ వినియోగదారుల కోసం తన గూగుల్ మ్యాప్స్ అప్లికేషన్కు గాను ఓ కొత్త ఫీచర్ను లాంచ్ చేసింది. గూగుల్ మూడవ ఎడిషన్ లో వాయిస్ నావిగేషన్తో దీన్ని మంగళవారం లాంచ్ చేసింది. టూవీలర్ సెగ్మెంట్లో ప్రపంచంలో భారత్ ను అతిపెద్ద మార్కెట్గా భావిస్తున్న గూగుల్ భారత్కోసం ప్రత్యేకంగా గూగుల్ మ్యాప్స్లో ఈ ఫీచర్ను మొదటి సారిగా అందుబాటులోకి తీసుకొచ్చినట్టు గూగుల్ మాప్స్ డైరెక్టర్ మార్తా వెల్ష్ తెలిపారు. టూ వీలర్ మోడ్ పేరిట విడుదలైన ఈ ఫీచర్ సహాయంతో బైక్ రైడర్స్ గూగుల్ మ్యాప్స్ ద్వారా ప్రత్యేక ఆప్షన్ను పొందవచ్చు. ఈ ఫీచర్ టూ-వీలర్ డ్రైవర్లకు అత్యంత సరైన మార్గాన్ని మ్యాప్ చూపిస్తుంది. మ్యాప్స్లో కారు, ఫుట్, ట్రెయిన్ తదితర విభాగాల పక్కనే ఇప్పుడు టూ వీలర్ ఆప్షన్ కూడా దర్శనమిస్తుందన్న మాట. దీన్ని ఓపెన్ చేస్తే టూ వీలర్ నడిపే వారి కోసం ప్రత్యేకంగా గూగుల్ మ్యాప్స్ ఓపెన్ అవుతుంది. తద్వారా వీరు ఫాస్ట్గా వెళ్లేందుకు కావల్సిన రూట్ను సులభంగా వెదుక్కోవచ్చు. అంతేకాదు షార్ట్కట్ రూట్లను కూడా ఈ టూ వీలర్ మోడ్లో యూజర్లు పొందవచ్చు. దీంతో గమ్యస్థానానికి వేగంగా వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. దీన్ని అన్ని ప్లాట్ఫాంలకు చెందిన యూజర్లు పొందవచ్చనీ, ఈ కొత్త ఫీచర్ సహాయంతో విశ్వనీయంగా, కాన్ఫిడెంట్గా ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. -
అత్యవసరమా.. గూగుల్ మ్యాప్స్ వెతకండి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో బయటకెళ్లేవారు అవసరమైనప్పుడు పబ్లిక్ టాయ్లెట్లు కనిపించక పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. నగర ప్రజలతోపాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే టూరిస్టులకూ ఇదే దుస్థితి. నగరంలో ప్రజలకు అవసరమైనన్ని పబ్లిక్ టాయ్లెట్లు లేకపోవడమే కాక, ఉన్నవాటి గురించి కూడా తెలియకపోవడంతో పడుతున్న ఇబ్బందులెన్నో. ఈ దుస్థితి నివారించి ప్రజలకు తామున్న ప్రదేశానికి ఎంత దూరంలో పబ్లిక్ టాయ్లెట్ ఉందో తెలుసుకునే సదుపాయాన్ని జీహెచ్ఎంసీ అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి గూగుల్ మ్యాప్స్లో జియోమ్యాపింగ్ చేయించింది. దీంతో ప్రజలకు తామున్న ప్రదేశం నుంచి పబ్లిక్/కమ్యూనిటీ టాయ్లెట్ ఎంత దూరంలో ఉందో రూట్మ్యాప్తో సహా ఎన్ని నిమిషాల్లో చేరుకోవచ్చో కూడా తెలుస్తుంది. మొబైల్ ఫోన్లో గూగూల్ మ్యాప్స్లోకి వెళ్లి స్వచ్ఛ్ పబ్లిక్ టాయ్లెట్ (swachh public toilet)అని టైప్ చేస్తే వివరాలు కనిపిస్తాయని జీహెచ్ఎంసీ పేర్కొంది. -
మ్యాప్స్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్
గూగుల్ మ్యాప్స్ను, మొబైల్ సెర్చ్లను మరింత సులభతరం చేసేందుకు గూగుల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫీచర్ను లాంచ్ చేసింది. యూజర్లు వారు వెళ్లాలనుకుంటున్న ప్రదేశ సమాచారం గురించి తెలుసుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. గూగుల్ మ్యాప్స్ లేదా మొబైల్ సెర్చ్లో యూజర్లు తేలికగా లొకేషన్ను సెర్చ్ చేసి, ప్రదేశాల గురించి ప్రశ్నలు అడగవచ్చు లేదా సమాధానం చెప్పొచ్చు లేదా ఇప్పటికే కలిగి ఉన్న ప్రశ్నాసమాధాలను చెక్ చేసుకోవచ్చని గూగుల్ తెలిపింది. ఎక్కువ ఓటు వేసిన ప్రశ్నలు, సమాధానాలు ఈ సెక్షన్లో టాప్లో కనిపిస్తాయి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెక్షన్లో ఉన్న సమాచారమంతా అత్యంత కచ్చితమైనదని, అవసరమయ్యే స్థానిక సమాచారం ఇచ్చేలా ఉంటామని గూగుల్ తెలిపింది. తరుచు అడిగే ప్రశ్నలు, సమాధానాలను వ్యాపార యజమానులు దీనిలో జతచేర్చవచ్చని పేర్కొన్నారు. ఒక ప్రదేశం గురించి యూజర్లు ప్రశ్నిస్తే, వెంటనే గూగుల్ ఈ విషయాన్ని వ్యాపార యజమానికి లేదా సమాచారం అందించే ఇతర యూజర్లకు నోటిఫై చేస్తుంది. వారు తమ సమాధాన రూపంలో యూజర్లకు సమాధానాన్ని అందించవచ్చు. -
గూగుల్ మ్యాప్స్ ప్రామాణికం కాదట!
న్యూఢిల్లీ: గూగుల్ మ్యాప్లు 'ప్రామాణికం' కాదని దేశంలోని టాప్ సర్వేయర్ సర్వే ఆఫ్ ఇండియా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ మ్యాప్స్ లో అంత కచ్చితత్వం లేదంటున్నారు సర్వే ఆఫ్ ఇండియా అధికారులు. ఎందుకంటే వీటిని ప్రామాణికంగా ప్రభుత్వ రూపొందించలేదు కాబట్టి గూగుల్ మ్యాప్ను విశ్వసించవద్దంటూ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి చెందిన సర్వే ఆఫ్ ఇండియా ఈ వ్యాఖ్యలు చేసింది. గూగుల్ మాప్స్ అథెంటిక్ కాదని జనరల్ ఆఫ్ ఇండియాకు చెందిన స్వర్ణ సుబ్బారావు వ్యాఖ్యానించారు.దీనికి బదులుగా సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ఉపయోగించాలని సూచించారు. గూగుల్ మ్యాప్స్ చూసి మోసపోవద్దనిన ఆయన హెచ్చరించారు. సర్వే ఆఫ్ ఇండియా (1767) 250 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్టాంపును విడుదలకు నిర్వహించిన కార్యక్రమంలో ఒక ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చారు. డెహ్రాడూన్లోని 250 ఏళ్ల ఇన్స్టిట్యూట్ భారతదేశ సర్వే ఆఫ్ ఇండియా తయారుచేసిన పటాలు అనేక ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఉపయోగించినట్లు ఆమె చెప్పారు. రెస్టారెంట్లు, పార్కులను వెతికే చిన్న, చిన్న పనులకు మాత్రమే ఉపయోగిస్తున్నారని.. ప్రభుత్వం పెద్దగా ఈ మ్యాప్లపై ఆధారపడటంలేదని తేల్చి చెప్పారు. రోడ్ల నిర్మాణం, రైల్వే ట్రాక్ల ఏర్పాటు లాంటి కార్యక్రమాల కోసం సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లను ఉపయోగిస్తుంటుంది కేంద్రం. ఏది ఏమైనా అభివృద్ధి పనులు సరైన సర్వే తర్వాత మ్యాపింగ్ ప్రారంభించాలని సూచించారు. మరోవైపు సర్వే ఆఫ్ ఇండియా సహా, గూగుల్ లాంటి వివిధ కంపెనీలు వేర్వేరు ప్రయోజనాల కోసం తయారు చేస్తున్న ఉపగ్రహ మ్యాపింగ్లను తిరస్కరించడం తప్పు అని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యదర్శి అశుతోష్ శర్మ చెప్పారు. భారతదేశ మొట్టమొదటి తపాలా స్టాంప్, భారత రాజ్యాంగం మొదటి కాపీని ముద్రించిన ఘనత సర్వే ఆఫ్ ఇండియాకు దక్కుతుందని కమ్యూనికేషన్ సహాయ మంత్రి మనోజ్ సిన్హా వ్యాఖ్యానించారు. -
గూగుల్ మ్యాప్స్ లో ఓలా, ఉబెర్ క్యాబ్స్ సమాచారం!
న్యూఢిల్లీ: మనకు దగ్గరిలో ఉన్న ఓలా, ఉబెర్ క్యాబ్స్ సమాచారాన్ని గూగుల్ మ్యాప్స్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇందులో భాగంగా టెక్ దిగ్గజం గూగుల్.. ఓలా, ఉబెర్ సంస్థలతో జతకట్టింది. స్మార్ట్ఫోన్ ద్వారా గూగుల్ మ్యాప్స్ తాజా వెర్షన్లో ఒక ప్రాంతానికి వెళ్లడానికి డెరైక్షన్స్ కోసం సెర్చ్ చేసినప్పుడు ఒక ప్రత్యేకమైన ట్యాబ్ సాయంతో క్యాబ్ సర్వీస్ సమాచారాన్ని తెలుసుకునే వెసులుబాటు కల్పిస్తామని గూగుల్ తన బ్లాగ్లో పేర్కొంది. -
మిస్టరీని ఛేదించిన గూగుల్ మ్యాప్!
పదేళ్ళ క్రితం తప్పిపోయిన వ్యక్తి మిస్టరీ... గూగుల్ మ్యాప్ ఛేదించింది. గూగుల్ తీసిన ఏరియల్ ఇమేజ్ లో నీటి అడుగు భాగంలో ఉన్న కారులో ఓ వృద్ధుని శరీరం ఉన్నట్లు గుర్తించారు. ఎప్పుడో 2006 అక్టోబర్ 11న తప్పిపోయిన డేవీ లీ నైల్స్... మిచిగన్.. బైరాన్ టౌన్ షిప్ లోని.. జేక్స్ బార్ పాండ్ లో కనిపించాడు. లీ కుటుంబం.. ఇక 72 ఏళ్ళ ఆ వృద్ధుడి జాడ కనిపెట్టడం పై ఆశలు వదులుకున్నారు. చివరికి 2011 లో ఆయన సంస్మరణార్థం చరిత్రను పబ్లిష్ కూడా చేశారు. మిచిగన్ పాండ్ లో ఓ వ్యక్తి శరీరంతో పాటు ఉన్న కారును గూగుల్ మ్యాప్ గుర్తించడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. లీ ఓ ఫ్రెండ్ తో కలసి హఠాత్తుగా బయటకు వెళ్ళిపోయాడని, అప్పటికే అతడు క్యాన్సర్ తో బాధపడుతుండేవాడని అతడి కుటుంబం అప్పట్లో వెల్లడించింది. అయితే ఇప్పుడు కూడా అతడు ఎలా మృతి చెంది ఉంటాడో మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. అతడి సంస్మరణార్థం నిర్మించిన హోమ్ బయట క్రిస్మస్ ట్రీ ని అలంకరిస్తున్న సమయంలో లిఫ్ట్ లో నుంచి చూస్తున్న హౌస్ మ్యాన్ బ్రియాన్ కు అకస్మాత్తుగా పాండ్ లో కారు మునిగి ఉన్నట్లుగా కనిపించడంతో అతడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిజంగా పాండ్ లో కారు ఉండటం చూసి తాను ఎంతో ఆశ్చర్యపోయాను అంటూ వివరించాడు. గాఢాందకారంగా ఉన్న ఆ స్థలాన్ని ఎప్పుడూ ఎవరూ పట్టించుకోలేదని, అక్కడ అతడు ఉంటాడని కూడా ఎవరూ ఊహించలేదని అన్నాడు. అయితే గూగుల్ తీసిన చిత్రాల్లో మాత్రం కారులో నైల్స్ బాడీ ఉన్నట్లు గుర్తించారు. తొమ్మిదేళ్ళ రహస్యం బయటపడింది. అయితే అసలు ఆ సంఘటన ఎలా జరిగింది? వివరాలు మాత్రం తెలియలేదు. హౌస్ మ్యాన్ చెప్పిన వివరాలను బట్టి కెంట్ కౌంటీ షెరీఫ్స్ డిపార్ట్ర్ట్ మెంట్ సిబ్బంది పాండ్ లోని కారును గుర్తించింది. డైవ్ టీమ్ నీటిలో కారు ఉన్నట్లుగా నిర్ధారించారు. క్రేన్స్ సహాయంతో కారును బయటకు తీశారు. నైల్స్ చివరిసారి కనిపించిన ప్రాంతానికి అరమైలు దూరం లో ఆ పాండ్ ఉందని కుటుంబ సభ్యులు చెప్పిన వివరాలను బట్టి చెప్తున్నారు. కారులోని డ్రైవర్ సీటులో నైల్స్ స్కెలిటెన్ ఉండగా... మట్టితో పూడిపోయిన కారును బయటకు తీశారు. అక్కడకు వచ్చిన బంధువులు నైల్స్ శరీర అవశేషాలను చూసి దుఃఖ సాగరంలో మునిగిపోయారు. అయితే ఎట్టకేలకు పదేళ్ళ అనుమానాలకు తెరపడినందుకు ఊపిరి పీల్చుకున్నారు. ఇక శోధనకు ముగింపు దొరికినట్లేనని.. నైల్స్ అల్లుడు స్కాట్ హాత్ వే అన్నారు. ఇన్నాళ్ళు నైల్స్ జాడ తెలియకుండా దేవుడు ఎందుకు ఉంచాడో తెలియదు కానీ... చివరకు ఇంటికి చేర్చడం సంతోషంగా ఉందన్నారు. అయితే అధికారులు నైల్స్ మరణానికి సంబంధించిన మిగిలిన వివరాలను సేకరిస్తున్నారు. నైల్స్ దంతాల రికార్డును బట్టి పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉందని ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతానికి అతడి జేబులోని వాలెట్ ను బట్టి అది నైల్స్ శరీరమేనని నమ్ముతున్నారు. ఇది నాటకం అయి ఉండక పోవచ్చని అంటున్నారు. అయితే కచ్ఛితంగా అసలేం జరిగి ఉంటుంది అన్నది మాత్రం తెలుసుకోవాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. -
సీఎం కంటే ముందున్న గూగుల్!
దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు ఘనంగా నివాళులు అర్పించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భావించారు. ఆయన స్మృత్యర్థం ఢిల్లీలో ఉన్న ఔరంగజేబ్ రోడ్డు పేరును ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డుగా మార్చాలని భావించారు. ఈ విషయాన్ని ముందే ప్రకటించారు. అయితే, గూగుల్ సంస్థ మాత్రం ఆయన కంటే ఒక అడుగు ముందే ఉంది. ఇంతకుముందు ఢిల్లీలో ఉన్న ఔరంగజేబ్ రోడ్డు పేరును ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డుగా ముందుగానే తన గూగుల్ మ్యాప్స్లో మార్చేసింది. ఈ మేరకు గూగుల్ మ్యాప్స్లో చూస్తే.. దాని పేరు అబ్దుల్ కలాం రోడ్డుగా ఉంది. ఈ విధంగా దివంగత మాజీ రాష్ట్రపతి కలాంకు గూగుల్ నివాళులు అర్పించింది. -
ఆఫ్లైన్లో గూగుల్ మ్యాపులు...
కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు గూగూల్ మ్యాపులు తోడుంటే ఎంత భరోసాగా ఉంటుందో చెప్పలేం. మరి మీరు వెళ్లిన చోట నెట్ సిగ్నల్స్ రాకపోతే? ఇబ్బందేకదూ... ఆఫ్లైన్లోనూ గూగుల్ మ్యాపులను ఎలా చూడవచ్చో తెలుసుకుంటే ఈ చికాకు నుంచి కూడా తప్పించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. గూగుల్ ఈమధ్యనే ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్ ద్వారా ఇది సాధ్యమవుతోంది. ట్రాఫిక్, నావిగేషన్ అడ్రస్లు వంటి కొన్ని ఫీచర్లు లేకపోయినప్పటికీ మీరు ఎక్కడున్నారో తెలుసుకునేందుకు, తద్వారా గమ్యాన్ని సులువుగా చేరేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం... మ్యాప్లను ఆఫ్లైన్లో పొందండి ఇలా... ఆండ్రాయిడ్, ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్లలో మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. కాకపోతే ఐఫోన్ వినియోగదారులు తాజా మ్యాప్స్ ఆప్ (గూగుల్ మ్యాప్స్ వెర్షన్ 3), ఆండ్రాయిడ్ వినియోగదారులైతే (వెర్షన్ 8)ను ఉపయోగించాల్సి ఉంటుంది. 1. ముందుగా గూగుల్ అకౌంట్తో సైన్ ఇన్ కావాలి. 2. సెర్చ్బార్లో ‘ఓకే మ్యాప్స్’ అని టైప్ చేయండి. వెంటనే స్క్రీన్పైభాగంలో ‘సేవ్ దిస్ మ్యాప్’ అన్న డైలాగ్ కనిపిస్తుంది. 3. మ్యాప్ను అవసరమైతే జూమ్ ఇన్ లేదా జూమౌట్ చేసుకుని మీకు కావాల్సిన ప్రాంతాన్ని గుర్తించి సేవ్ చేసుకోండి. ఉదాహరణకు మీకు హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్ ప్రాంతంకు కావాలనుకుందాం. అక్కడి వరకూ జూమ్ చేసుని సేవ్ బటన్ను ప్రెస్ చేయాలన్నమాట. ఆ తరువాత మీరు ఆఫ్లైన్లోనైనా ఆ ప్రాంతాన్ని మరింత జూమ్ఇన్ చేసుకుంటూ చూసుకోవచ్చు. 4. మ్యాప్ సేవ్ బటన్ నొక్కగానే మ్యాప్కు పేరుపెట్టమని కోరుతూ ఓ డైలాగ్ బాక్స్ ప్రత్యక్షమవుతుంది. నచ్చిన పేరు టైప్ చేసి సేవ్ చేసుకోండి. అంతే... ఆఫ్లైన్లోనూ మీకు అవసరమైన మ్యాప్లు అందుబాటులోకి వచ్చేస్తాయి. మ్యాప్స్ స్క్రీన్పై కనిపించే వ్యక్తి బొమ్మను క్లిక్ చేస్తే మీ ప్రొఫైల్ అందుబాటులోకి వస్తుందికదా... దాంట్లోనే మీరు సేవ్ చేసుకున్న మ్యాప్లు కూడా ఉంటాయి. కావాల్సిన దాన్ని ఓపెన్ చేసుకుని చూసుకోవచ్చు. ఆఫ్లైన్ మ్యాప్లతో కొన్ని పరిమితులు ఉంటాయన్న విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి. ముందుగా మరీ ఎక్కువగా జూమ్ చేసుకోలేరు. రెండో పరిమితి. సేవ్ చేసుకున్న మ్యాప్లు నెల రోజులపాటు మాత్రమే అందుబాటులో ఉంటాయి. -
భలే ఆప్స్
మీరు గానీ ఒక ఈలగానీ వేస్తే... ఈల వేస్తే గుర్రం పరుగెత్తుకుంటూ రావడం సినిమాల్లో చూసుంటాం. మరి ఇదే మాదిరిగా మీ ఫోన్ కూడా వచ్చేస్తుందా? ‘విజిల్ మీ ఫ్రీ’ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే పరుగెత్తుకుంటూ రాకపోవచ్చుగానీ... తాను ఎక్కడున్నదీ చెప్పేస్తుంది. ఆశ్చర్యంగా ఉన్నా అంతా టెక్నాలజీ మహిమ. మీ ఈలకు ఎలా స్పందించాలన్నది కూడా మీరే నిర్ణయించుకోవచ్చు. ఉదాహరణకు రింగ్టోన్ను స్పందనగా పెట్టుకోవచ్చు. లేదంటే.. ‘ఐ యామ్ హియర్’ అని పలికేలానూ చేయవచ్చు. స్మార్ట్ఫోన్ను ఎక్కడబడితే అక్కడ పెట్టేసి మరచిపోయే వాళ్లకు చక్కటి అప్లికేషన్ ఇది. గూగుల్ ప్లే స్టోర్లో ఉచితంగా లభిస్తుంది. దారి చూపే ‘నావీమ్యాప్స్’ గూగుల్ మ్యాప్స్కు ప్రత్యామ్నాయమీ అప్లికేషన్. భారతదేశానికి సంబంధించిన ప్రత్యేక ఫీచర్లతో దీన్ని సిద్ధం చేసింది మ్యాప్మై ఇండియా సంస్థ. రెండు నెలల క్రితం ఆండ్రాయిడ్ ఫోన్లకు, తాజాగా ఐఫోన్ వెర్షన్ను విడుదల చేసింది. ఒకచోటు నుంచి మరో చోటుకు వెళ్లేందుకు ఏకకాలంలో మూడు దారులు చూపే ఈ నావిగేషన్ అప్లికేషన్తో మీరు ఉన్న ప్రాంతంతోపాటు రూట్మ్యాప్ను ఫేస్బుక్, ఈమెయిల్, మెసేజ్ల ద్వారా ఇతరులతో షేర్ చేసుకోవచ్చు కూడా. ఐఫోన్ 5, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్లో ఫ్రోయో వెర్షన్ లేదా అంతకంటే తాజా ఓఎస్తో పనిచేస్తుందీ అప్లికేషన్. ఇవి ఉచితంగా లభించే అప్లికేషన్ ఫీచర్లు కాగా, రూ.620 చెల్లించి డౌన్లోడ్ చేసుకోగల ప్రొఫెషనల్ వెర్షన్లో అదనపు ఫీచర్లు ఉన్నాయి. మార్గమధ్యంలో ఎప్పుడు ఎటువైపు తిరగాలో ఇంగ్లీషుతోపాటు పది భారతీయ భాషల్లో సూచించడం వంటివి దీన్లో ఉన్నాయి. బ్యాంబూ పేపర్... స్మార్ట్ఫోన్లో నోట్స్ రాసుకునేందుకు అప్లికేషన్లు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలోకి చేరింది ‘బ్యాంబూ పేపర్’. కాకపోతే కొంచెం తేడా ఉంది. మిగిలినవి టైప్ చేయాల్సి వస్తే... ఈ అప్లికేషన్ను సై ్టలస్తోనూ వాడుకోవచ్చు. అక్షరాలను టైప్ చేసుకోవడంతోపాటు చిన్నచిన్న గ్రాఫ్లు, బొమ్మల్ని గీసుకోవడం కూడా సై ్టలస్తో సాధ్యమవుతుంది. నోట్స్కు ఫొటోలు జతచేయగలగడం, విండోస్ 8తోపాటు సోషల్ మీడియా, డ్రాప్బాక్స్, టంబ్లర్ వంటి క్లౌడ్ ఆధారిత సర్వీసుల ద్వారా ఇతరులతో షేర్ చేసుకోవచ్చు. స్కెచ్లు గీసేందుకు, రాసుకునేందుకు వేర్వేరు సై ్టలస్లు అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఉచితంగానే లభించినప్పటికీ సరిపోయే సై ్టలస్ల ధర మాత్రం రూ.700 నుంచి మొదలవుతుంది. -
జోరుగా ఈసీ హైటెక్ బాట
ఎన్నికల కమిషన్ నుంచి తుది ఫలితాలు రావాలంటే రెండు మూడు గంటలు ఆలస్యం అయ్యేది. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంటే రెండు మూడు నెలలకు గానీ వచ్చేది కాదు. అలాంటి ఎన్నికల కమిషన్ ఇప్పుడు హైటెక్ బాట పట్టింది. ఓటరుగా నమోదు చేసుకోవాలంటే ఆన్లైన్లో నిమిషాల వ్యవధిలో పూర్తి చేయడం, ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా దానికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడం, ఓటర్ల జాబితాలో పేరు ఉందో లేదో చూసుకోవాలన్నా కూడా ఎస్ఎంఎస్, ఆన్లైన్ సౌకర్యం.. ఇలా ఒక్కసారిగా ఉన్నట్టుండి మన ఎన్నికల కమిషన్ హైటెక్ బాట పట్టింది. వీటితోనే ఆగిపోలేదు. మనం ఓటేయాల్సిన పోలింగ్ బూత్ ఎక్కడుందో చెప్పడానికి కూడా గూగుల్ మ్యాప్స్ను ఉపయోగిస్తోంది. ఈ పోలింగ్ బూత్ ఉన్న ప్రాంతంతో పాటు.. అక్కడున్న పోలింగ్ అధికారుల పేర్లు, వాళ్ల మొబైల్ నెంబర్లు కూడా అందిస్తున్నారు. ఇవన్నీ కూడా గూగుల్ మ్యాప్స్తోనే సాధ్యమయ్యేలా చేస్తున్నారు. చేతిలో ఓ స్మార్ట్ఫోన్ గానీ, కంప్యూటర్ గానీ ఉంటే చాలు.. మనం ఓటేయాల్సిన పోలింగ్ బూత్ ఎక్కడుందో ఇట్టే తెలుసుకోవచ్చన్నమాట. ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ప్రత్యేకంగా ఒక ట్యాబ్ పెట్టి, ఈ బూత్ లొకేటర్కు సంబంధించిన లింకులు అందులో ఇచ్చారు. మన నియోజకవర్గంలో ఏదైనా ఒక పోలింగ్ బూత్ వివరం తెలుసుకోవాలంటే ఎన్నికల కమిషన్ వెబ్సైట్ http://eci.nic.in ఓపెన్ చేయాలి. అందులో కుడిచేతి వైపు పోలింగ్ స్టేషన్ మ్యాప్స్ బీఎల్ఓ కాంటాక్ట్ నంబర్స్ అనే ట్యాబ్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఒక గూగుల్ మ్యాప్తో పాటు మన రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, బూత్.. ఇలాంటి వివరాలు సెలెక్ట్ చేసుకోడానికి ట్యాబ్స్ వస్తాయి. అందులో ఆయా వివరాలు ఇస్తే చాలు.. వెంటనే మన పోలింగ్ బూత్ ఎక్కడుందో మ్యాప్లో చూపిస్తుంది. అందులోనే క్లిక్ ఫర్ డీటైల్స్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే రాష్ట్రంలో ఉన్న సీఈవో (ప్రధాన ఎన్నికల అధికారి) దగ్గర్నుంచి ఆ పోలింగ్ కేంద్రానికి సంబంధించిన బీఎల్ఓ వరకు ముఖ్యమైన వాళ్ల పేర్లు, మొబైల్ నెంబర్లు అన్నీ వస్తాయి. వీటి ఆధారంగా మన పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోడానికి అవకాశం ఉంటుంది.