Housing Scheme
-
పేదల ఇళ్ల స్థలాలు లాక్కుంటున్నారు: టీజేఆర్ సుధాకర్బాబు
సాక్షి,తాడేపల్లి: ఇళ్ల పట్టాల రూపంలో చంద్రబాబు పేదలపై పిడుగులు వేశారని,బాబు హయాంలో గతంలో ఏనాడూ పేదలకు సెంటు భూమి కూడా ఇవ్వలేదని వైఎస్సార్సీపీ నేత టీజేఆర్ సుధాకర్బాబు విమర్శించారు. శనివారం(జనవరి18) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ పార్టీ ఆఫీసులో సుధాకర్బాబు మీడియాతో మాట్లాడారు.‘వైఎస్ జగన్ తన హయాంలో 30.6లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు.71 వేల ఎకరాల భూమిని పేదలకు పంచారు.25,374 ఎకరాలను పేద ప్రజల కోసం వైఎస్ జగన్ కొనుగోలు చేశారు. టిడ్కో ఇళ్లను కట్టించి ఇచ్చారు.అప్పట్లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మూడు లక్షల మందికి భూమిని పంచి పెట్టారు.ఆయన కుమారుడు మళ్ళీ 33 లక్షలమందికి పట్టాలిచ్చారు.చంద్రబాబు కూడా అలాగే భూమిని కొనుగోలు చేసి ఇస్తే అందరూ సంతోషించేవారు.కానీ వైఎస్ జగన్ హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలను తొలగించి అదే భూమిని టీడీపీ కార్యకర్తలకు పంచాలనుకోవటం దారుణం. వైఎస్ జగన్ రాజకీయాలు చూడకుండా అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ స్థలాలను లాక్కునే హక్కు చంద్రబాబుకు ఎవరు ఇచ్చారు? ఒక్కొక్కరికి మూడు నుంచి పది లక్షల విలువైన భూమిని వైఎస్ జగన్ అందించారు.పేదలకు సంపద సృష్టించి,ఆత్మగౌరవం నిలపెట్టేలా వైఎస్ జగన్ వ్యవహరించారు.80 శాతం మంది ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనారిటీలకు పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు వారి నుంచి భూములను లాక్కుని రోడ్డున పడేస్తారా? 17 వేల ఊర్లను వైఎస్ జగన్ నిర్మించారు.ఇలా చేయాలనుకుంటే చంద్రబాబు కూడా భూమిని కొని పేదలకు అందించాలి. వైఎస్ జగన్ నిర్మించిన కాలనీలు,గ్రామ సచివాలయాలు,బాగుపడిన స్కూళ్లలోకి చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్లడం లేదు? అక్కడకు వెళ్తే వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి కనిపిస్తుందని భయమా? సచివాలయ వ్యవస్థను చంద్రబాబు ఎందుకు గౌరవించటం లేదు? సచివాలయాల నిర్మాణాలు తప్పయితే అదే విషయాన్ని ప్రకటించాలి.రాజధానిలో చంద్రబాబు పెద్ద ఎత్తున భూ స్కామ్ చేశారు. దీనిపై కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. 9 లక్షల ఎకరాలను జగన్ 22A నుంచి తప్పించి రైతులకు హక్కులు కల్పించారు.25 లక్షలమంది రైతులకు మేలు చేశారు. రాజధానిలో 50 వేల మంది పేదలకు వైఎస్ జగన్ ఇళ్ల స్థలాలిచ్చారు.చంద్రబాబు వారందరికీ అన్యాయం చేస్తూ స్థలాలను లాగేసుకున్నారు. రాజధానిలో ఎస్సీ,ఎస్టీలు ఉండకూడదా? పేదల స్థలాలను లాగేసుకుంటే న్యాయపోరాటం చేస్తాం’అని సుధాకర్బాబు హెచ్చరించారు. ఇదీ చదవండి: బాబు పవన్.. తిరుమలలో ఏం జరుగుతోంది: భూమన -
పాత విధానంలోనే పేదింటి సాయం
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు మాటలు కోటలు దాటించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు ఆయన చేతలు చతికిలబడ్డాయి. అధికారం చేజిక్కించుకునేందుకు అనేక మాయమాటలు చెప్పి పేదలను నమ్మించిన ఆయన ఇప్పుడు గద్దెనెక్కాక వంచిస్తున్నారు. ఇందులో భాగంగా.. సొంత గూడులేని పేదలను బాబు ప్రభుత్వం దగా చేస్తోంది. గత ప్రభుత్వంలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇంటి నిర్మాణానికి ఇచ్చే రూ.1.80 లక్షలు ఏమాత్రం సరిపోదని, నిర్మాణ వ్యయం ఇంకా పెంచాలని అప్పట్లో ఆయన గుండెలు బాదుకున్నారు.తాము అధికారంలోకి వస్తే నిర్మాణ సాయం పెంచుతామని పేదలందరినీ ఊరించారు. మరోవైపు.. గృహ నిర్మాణ శాఖపై నిర్వహించిన తొలి సమీక్షలోనూ పేదల ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షల సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించారు. మంత్రులు సైతం ఈ అంశాన్ని ఊదరగొట్టారు. ఎల్లోమీడియా సైతం బాబు ప్రభుత్వం నిర్మాణ సాయం పెంచేస్తోందని బాకాలు ఊదాయి. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు అదే రూ.1.80 లక్షల సాయాన్నే పేదల ఇంటి నిర్మాణానికి అందించేలా ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. అలాగే, గత ప్రభుత్వంలో అమలుచేసిన మూడు ఆప్షన్ల విధానాన్నీ యథావిధిగా కొనసాగిస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖ వెలువరించిన ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోనూ గత ప్రభుత్వంలోని యూనిట్ ధరతోనే పథకాన్ని కొనసాగిస్తామని పేర్కొంది. ఇసుక ఉచితం అంటూనే ఖరీదు కట్టారు.. గత ప్రభుత్వంలో మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో 18.01 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచి్చనట్లు వెల్లడించారు. వీటిలో ప్రస్తుతం 6.40 లక్షల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్రం ప్రభుత్వం రూ.1.50 లక్షల సాయం అందిస్తుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.30 వేలు కలిపి మొత్తం రూ.1.80 లక్షలు గత ప్రభుత్వంలో ఇచ్చారు. ఇదే తరహాలో ప్రస్తుతం కూడా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.ఇక గత ప్రభుత్వం నుంచే 20 మెట్రిక్ టన్నుల ఇసుకను ఇంటి నిర్మాణానికి సరఫరా చేస్తున్నారు. కానీ, ఇసుకను ఉచితం చేశామని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం, పేదల ఇంటికి అందించే 20 మెట్రిక్ టన్నుల ఇసుకకు రూ.15 వేలు ఖరీదు కట్టింది. గత ప్రభుత్వంలో లబ్ధిదారులకు ఉచితంగా ఇసుకను సరఫరా చేసి, వారు చెల్లించాల్సిన మొత్తాన్ని ప్రభుత్వమే భరించేది. కానీ, ఇప్పుడేమో ఇసుక ఉచితం అని చెబుతూనే రూ.15 వేలు వెలకట్టి, ఆ మేర మేలు చేసినట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకోవాలని చూస్తోందని లబి్ధదారులు ఆరోపిస్తున్నారు. రూ.4 లక్షల ఊసేలేదు.. పేదల ఇంటి నిర్మాణాలపై ప్రభుత్వం తాజాగా జారీచేసిన ఉత్తర్వుల్లో ఎక్కడా రూ.4 లక్షలకు సాయం పెంపు ఊసేలేదు. గత ప్రభుత్వంలో ఇచ్చిన రూ.1.80 లక్షల సాయాన్నే యథావిధిగా కొనసాగిస్తామని ప్రకటించడంపై పేదలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సాయం పెంచుతున్నట్లు సీఎం ప్రకటించడంతో సొంతింటి నిర్మాణానికి అదనపు చేయూత లభిస్తుందని లబి్ధదారులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం సాయం పెంచుతుందని చాలామంది నిర్మాణాలను సైతం వాయిదా వేసుకున్నారు. కానీ, రూ.1.80 లక్షలకు మించి ఇవ్వలేమని ప్రభుత్వం ప్రకటించడంతో పేదల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. -
31 లక్షల మందికి ఇళ్ల పంపిణీ.. ఇళ్లు కాదు.. ఊరులు నిర్మించిన సీఎం జగన్
-
జగనన్న గృహ నిర్మాణ పథకంతో సొంతింటికల సాకారం
-
‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’
-
త్వరలోనే కొత్త హౌసింగ్ స్కీమ్.. ధ్రువీకరించిన కేంద్ర మంత్రి
గృహ రుణాలపై వడ్డీ రాయితీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుందని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి (Hardeep Singh Puri) తాజాగా ధ్రువీకరించారు. “మేము కొత్త హోమ్ సబ్వెన్షన్ స్కీమ్ వివరాలను ఖరారు చేసే ప్రక్రియలో ఉన్నాం. ప్రధాన మంత్రి చెప్పినట్లుగా లబ్ధిదారులకు వడ్డీ రాయితీని అందించే ఇది ఒక పెద్ద పథకం. త్వరలోనే ఈ పథకం తుది వివరాలు వెల్లడిస్తాం ” అని హర్దీప్ సింగ్ పూరి మీడియా సమావేశంలో తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 15న తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో తొలుత ఈ పథకాన్ని ప్రకటించారు. పట్టణ ప్రాంతాల్లో నివసించే నిరుపేదలకు ప్రయోజనం చేకూర్చే కొత్త హౌసింగ్ లోన్ స్కీమ్ను తమ ప్రభుత్వం తీసుకువస్తోందని ఆయన ప్రకటించారు. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్న ప్రధాని మోదీ, నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని అద్దె ఇళ్లు, మురికివాడలు, అనధికార కాలనీలలో నివసించే కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే కొత్త పథకాన్ని తమ ప్రభుత్వం తీసుకువస్తుందని చెప్పారు. ‘సొంత ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్న పేదలకు వడ్డీ రేట్లు, బ్యాంకుల నుంచి రుణాల ఉపశమనంతో సహాయం చేస్తాం. అది వారికి లక్షల రూపాయలు ఆదా చేయడంలో సహాయపడుతుంది’ అని ఆగస్టు 15 ప్రసంగంలో ప్రధాని మోదీ చెప్పారు. రాయిటర్స్ కథనం ప్రకారం.. ఈ పథకం కింద పట్టణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకునే పేదలకు రూ.9 లక్షలు రుణం అందిస్తారు. దీనిపై కేవలం 3 నుంచి 6.5 శాతం వడ్డీ మాత్రమే ఉంటుంది. ఒక వేళ ఇంతకు ముందే హోమ్లోన్ తీసుకున్నట్లయితే 20 సంవత్సరాల టెన్యూర్తో రూ.50 లక్షల లోపు గృహ రుణాలు తీసుకున్నవారు మాత్రమే ఈ వడ్డీ సబ్సిడీకి అర్హులు. -
ఇల్లు కట్టుకునేవారికి శుభవార్త.. రూ.60 వేల కోట్లతో కొత్త పథకం!
పట్టణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న పేదలకు శుభవార్త ఇది. పట్టణాల్లో చిన్నపాటి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న పేదలకు తక్కువ (సబ్సిడీ) వడ్డీ రేట్లలో గృహ రుణాలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం రూ. 60,000 కోట్లు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. పట్టణ ప్రాంతాల్లోని అల్పాదాయ వర్గానికి చెందిన 20.5 లక్షల మంది రుణ దరఖాస్తుదారులకు ఇది ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా. రాయిటర్స్ కథనం ప్రకారం.. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు, కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పథకాన్ని రాబోయే నెలల్లో అమలు చేయనున్నారు. ఈ పథకం కింద పట్టణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకునే పేదలకు రూ.9 లక్షలు రుణం అందిస్తారు. దీనిపై కేవలం 3 నుంచి 6.5 శాతం వడ్డీ మాత్రమే ఉంటుంది. ఒక వేళ ఇంతకు ముందే హోమ్లోన్ తీసుకున్నట్లయితే 20 సంవత్సరాల టెన్యూర్తో రూ.50 లక్షల లోపు గృహ రుణాలు తీసుకున్నవారు మాత్రమే ఈ వడ్డీ సబ్సిడీకి అర్హులు. వడ్డీ రాయితీని ముందుగానే లబ్ధిదారుల హౌసింగ్ లోన్ ఖాతాలో జమ చేస్తారు. 2028 వరకు ప్రతిపాదించిన పథకం దాదాపు ఖరారైందని, కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందాల్సి ఉందని ప్రభుత్వ వర్గాలను రాయిటర్స్ ఉటంకిస్తూ పేర్కొంది. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రకటించారు. "రాబోయే సంవత్సరాల్లో కొత్త పథకాన్ని తీసుకువస్తాం. ఇది ప్రాంతాల్లోని అద్దె ఇళ్లల్లో, మురికివాడల్లో, అనధికార కాలనీలలో నివసిస్తున్న కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది" అని మోదీ చెప్పారు. -
హౌసింగ్ స్కీం: 5500 ఫ్లాట్లు, రూ.9.89 లక్షలకే ఫ్లాట్
ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (DDA) గృహకొనుగోలుదారులకు భలే మంచి శుభవార్త అందించింది. వివిధ ప్రదేశాలలో 5,500 ఫ్లాట్లతో కూడిన కొత్త గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో రూ. 9.89 లక్షల ప్రారంభ ధరకే ఫ్లాట్ను అందించ నుంది. శుక్రవారం (జూన్ 30) ప్రారంభించిన ఈ పథకంలో ముందుగా వచ్చిన వారికి, ముందుగా కేటాయింపు ప్రాతిపదికన వీటిని విక్రయించ నుంది. ఫ్లాట్లలో 1-BHK, 2-BHK ,3-BHK ఇళ్లు ఉన్నాయి. అత్యున్నత నిర్ణయాధికార సంస్థ జూన్ 14న ఆన్లైన్లో ఫస్ట్-కమ్, ఫస్ట్ సర్వ్ హౌసింగ్ స్కీమ్ ఫేజ్ 4ను ప్రారంభించేందుకు ఆమోదించింది. ఈ పథకం టోకెన్ చెల్లించి తమ కిష్టమైన ప్రాంతంలో ఫ్లాట్ను బుక్ చేసుకోవచ్చు. (ఆధార్-ప్యాన్ లింక్ చేశారుగా? ఐటీ శాఖ కీలక ప్రకటన) డీడీఏ హౌసింగ్ స్కీమ్లోని ఫ్లాట్ల వివరాలు 1-BHK ఫ్లాట్లు నరేలా, సిరాస్పూర్, రోహిణి, లోక్నాయక్ పురంలో ఉన్నాయి 2-BHK ఫ్లాట్లు నరేలా ,ద్వారకలో ఉన్నాయి 3-BHK ఫ్లాట్లు జసోలాలో ఉన్నాయి (టీసీఎస్: క్రెడిట్ కార్డు వినియోగదారులకు భారీ ఊరట) ఫ్లాట్లు: ధరలు సుమారుగా 1-BHK ఫ్లాట్లు: నరేలాలో రూ. 9.89 లక్షల -రూ. 26.98 లక్షలు, లోక్నాయక్ పురంలో రూ. 28.47 లక్షలకు 2-BHK ఫ్లాట్లు: నరేలాలో రూ. 1 కోటి నుండి రూ. 1.23 కోట్లకు-ద్వారకలో రూ. 1.33 కోట్లు 3-BHK ఫ్లాట్లు: రూ. 2.08 కోట్ల నుండి రూ. 2.18 కోట్లు బుకింక్ అమౌంట్ 1-BHK ఫ్లాట్లు: రూ. 50,000 (ఆర్థికంగా వెనుకబడినవారికి ), రూ. 1 లక్ష (జనరల్) 2-BHK ఫ్లాట్: రూ. 4 లక్షలు 3-BHK ఫ్లాట్: రూ. 10 లక్షలుచెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్ను పూరించి, అవసరమైన సమాచారాన్ని అప్లోడ్ చేయాల్సిఉంటుంది. జూన్ 30 సాయంత్రం 5 గంటల నుంచి రిజిస్ట్రేషన్. జూలై 10 మధ్యాహ్నం 12 గంటల నుంచి బుకింగ్స్ అందుబాటులో ఉంటాయి (మరిన్ని అప్డేట్స్కోసం చదవండి: సాక్షిబిజినెస్) -
‘గృహలక్ష్మి’పై కదలిక: ఎంపిక ఎమ్మెల్యేలకే?
సాక్షి, హైదరాబాద్: సొంతంగా స్థలాలున్న పేదలు వాటిలో ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం చేసే ‘గృహలక్ష్మి’ పథకానికి జూలైలో శ్రీకారం చుట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇల్లు కట్టుకునేందుకు ఒక్కో లబ్ధిదారుకు రూ.3 లక్షలు ఇస్తామని ఇప్పటికే ప్రకటించింది. అయి తే త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. ఈ పథకానికి లబ్ధిదారుల ఎంపిక, జాబితాల రూపకల్పన బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించనున్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని అమలు చేయడం, లబ్ధిదారుల ఎంపిక, ఆర్థిక సాయం చెక్కుల పంపిణీ కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా.. ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు చాన్స్ ఉంటుందని భావిస్తున్నట్టు తెలిసింది. బడ్జెట్లో కేటాయింపులు చేసినా.. ‘పేదలు ఇళ్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సర బడ్జెట్లోనే ఈ పథకానికి రూ.12 వేల కోట్లను కేటాయించింది. కానీ పథకానికి పూర్తిస్థాయిలో రూపకల్పన చేయకపోవటంతో అమల్లోకి రాలేదు. ఈ క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ప్రభుత్వం తిరిగి రూ.12 వేల కోట్లను కేటాయించింది. అయితే ఇప్పటివరకు మార్గదర్శకాలు సిద్ధం కాలేదు. ఈ పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.3 లక్షలను ఆర్థిక సాయంగా అందిస్తుంది. లబ్ధిదారులు అవసరమైన అదనపు మొత్తాన్ని కలిపి సొంత జాగాలో కావాల్సిన విధంగా ఇంటిని నిర్మించుకోవడానికి అవకాశం ఇవ్వనున్నారు. ఇలా ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇళ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో.. కొన్ని నెలల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. జూలై నెలలో పథకాన్ని పట్టాలెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిసింది. దీనికి తగ్గట్టుగానే ఇటీవల ఉన్నతాధికారులు భేటీ అయి ఈ పథకం తీరు తెన్నులపై చర్చించారు. వివరాలతో ముఖ్యమంత్రికి నివేదిక అందజేశారు. త్వరలో సీఎం నుంచి అనుమతి వస్తుందని, ఆ వెంటనే మార్గదర్శకాలు, ఇతర అంశాలపై కసరత్తు ముమ్మరం చేస్తామని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఇక వచ్చే ఎన్నికల్లో ఈ పథకం కీలకంగా మారుతుందని.. లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసే విషయంలో స్థానిక శాసనసభ్యులకే బాధ్యత అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. కనీసం స్థలంపై అస్పష్టత సొంత స్థలమున్న పేద లబ్ధిదారులకే గృహలక్ష్మి పథకాన్ని వర్తింపజేస్తారు. అయితే ఈ స్థలం ఎంత ఉండాలన్న విషయంలో మార్గదర్శకాలు రూపొందించాల్సి ఉంది. పట్టణ ప్రాంతాల్లో అయితే ఎంత, గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎంత స్థలం ఉంటే మంచిదన్న విషయంలో ఇప్పటివరకు స్పష్టత లేదు. ఇక కులాల వారీగా ఇళ్ల కేటాయింపులో రిజర్వేషన్ అమలు చేయాలన్న విజ్ఞప్తులూ ఉన్నాయి. వీటన్నింటిపై మార్గదర్శకాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇటీవల డబుల్ బెడ్రూం ఇళ్ల పథకంలో లబ్ధిదారుల ఎంపికపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో.. ‘గృహలక్ష్మి’కి అర్హతల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. కనీస స్థలం పరిమితులు లేకుండా ఉంటే ఎలా ఉంటుందన్న కోణంలో ప్రభుత్వం ఇటీవల ఉన్నతాధికారుల నుంచి అభిప్రాయాలు స్వీకరించిందని వివరించాయి. మొత్తంగా ఆగస్టు నాటికి అన్ని నియోజకవర్గాల్లో మొదటి విడత ఇళ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేయాలన్న దిశగా ఏర్పాట్లు జరుగుతున్నట్టు వెల్లడించాయి. -
పేదలందరికీ ఇళ్లు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: పేదలందరికీ ఇళ్లు, జగనన్న భూ హక్కు-భూ రక్ష పథకం, నాడు-నేడుపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పేదలందరికీ ఇళ్ల కార్యక్రమానికి సంబంధించి నిధులకు ఎలాంటి లోటు లేదని, 2022-23 సంవత్సరంలో 10,200 కోట్లు ఖర్చు చేశాం. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.15,810 కోట్లు ఖర్చు చేయనున్నాం.. ఎక్కడా కూడా బకాయిలు లేవు.. ఇళ్ల నిర్మాణం వల్ల ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని సీఎం పేర్కొన్నారు. ‘‘పేదలందరికీ ఇళ్ల కార్యక్రమాన్ని చురుగ్గా ముందుకు తీసుకెళ్లాలి. కొన్ని జిల్లాల అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలి. వేయికిపైగా ఇళ్లు నిర్మిస్తున్న కాలనీలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఇళ్ల లబ్ధిదారులైన మహిళలకు పావలావడ్డీకే రుణాలు ఇప్పించేలా చర్యలు ముమ్మరం చేయాలి. ఇప్పటికే 10.03 లక్షల లబ్ధిదారులకు రూ.3,534 కోట్లకుపైగా రుణాలు మంజూరు అయ్యాయి. కలెక్టర్లు బ్యాంకులతో మాట్లాడి రుణాలు ఇప్పించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ప్రతి శనివారం హౌసింగ్ డేగా పరిగణించాలి’’ అని సీఎం ఆదేశించారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ►హౌసింగ్ కార్యక్రమంలో నిమగ్నమైన అధికారులు తప్పనిసరిగా రెండు లే అవుట్లను సందర్శించాలి ►దీనివల్ల అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే తెలుస్తాయి, నిర్మాణాల్లో నాణ్యత కూడా ఉంటుంది ►ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని 48వేల మంది పేదలకు ఏసీ సీఆర్డీయే ప్రాంతంలో మే రెండో వారంలో ఇళ్ల పట్టాల పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లూ చేయాలి ►దేశంలో ఎక్కడా కూడా సమగ్ర సర్వే జరగలేదు ►100 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో చేస్తున్నాం ►దేశానికి అంతటికీ ఆదర్శప్రాయమైన కార్యక్రమం ►జాతీయ స్థాయిలో ఈకార్యక్రమం ద్వారా మనకు సముచిత స్థానం లభిస్తుంది ►భూ హక్కు పత్రాల పంపిణీ, సరిహద్దు రాళ్లు పాతడం, గ్రామాల్లో భూముల రికార్డుల్లో తుది వివరాలు నమోదు, గ్రామ సచివాలయాల్లోనే సబ్ రిజిస్ట్రార్ సేవలు లభ్యం కావడం… ఇదీ… ఈ కార్యక్రమానికి సంబంధించిన ముఖ్యమైన ఉద్దేశం చదవండి: ‘ఎన్టీఆర్ మాట్లాడిన వీడియోలు విడుదల చేసే దమ్ముందా?’ ►మొదటి విడతలో 2వేల గ్రామాల్లో చేపట్టిన కార్యక్రమం తుదిదశకు చేరుకుంటోంది ►దీన్ని త్వరగా పూర్తిచేయాలి ►కలెక్టర్లు దీనిపై దృష్టిపెట్టి రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీతోపాటు తర్వాత దశల్లో సర్వే చేపట్టే కార్యక్రమాలపై దృష్టిపెట్టాలి ►పొరపాట్లకు తావులేకుండా కచ్చితమైన వివరాలతో భూ హక్కు పత్రాలు అందాలి ►మే 25 నుంచి రెండో దశ గ్రామాల్లో సర్వే ప్రారంభం అవుతుంది పాఠశాలల్లో నాడు – నేడు కార్యక్రమం ►నాడు – నేడుకు సరిపడా నిధులు ఉన్నాయి ►తల్లిదండ్రులు కమిటీల ఖాతాల్లో రూ.734.21 కోట్లుఉన్నాయి ►పనులను వేగంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులపై ఉంది ►తదుపరి ఖర్చులకోసం మరో రూ.1400 కోట్లు కూడా అందుబాటులో ఉన్నాయి ►నాడు – నేడుకు నిధుల కొరత లేదు ►ఐఎఫ్పీ పానెళ్లు బిగించడం పూర్తి కావడంతో 15వేల కు పైగా స్కూళ్లలో చేపట్టిన మొదటి విడత నాడు – నేడు పనులు పూర్తయినట్టు అవుతుంది ►ఈ పాఠశాలల్లో డిజిటిలీకరణ కూడా పూర్తవుతుంది ►జూన్ 12 లోగా ఈ ఐఎఫ్ఎప్ ప్యానెళ్ల బిగింపు పూర్తి కావాలి ►మూడు విడతల్లో దాదాపు 45 వేల స్కూళ్లలో నాడు -నేడు పనులు పూర్తవుతాయి ►వేసవి సెలవుల్లో పనులు చేయడానికి పూర్తి అవకాశాల ఉంటాయి ►ఈ సమయాన్ని పనులకోసం బాగా వినియోగించుకోవాలి ►కలెక్టర్లు దీనిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి ►మొదటి విడతలో నాడు- నేడు కింద పనులు చేపట్టిన పాఠశాలలపై పూర్తిస్థాయి ఆడిట్ చేపట్టాలి ►ఎక్కడైనా లోపాలు ఉంటే.. వెంటనే వాటిని సరిదిద్దాలి ►ఇంత పెద్ద మొత్తంలో స్కూళ్లలో పనులు చేపడుతున్నాం ►పనుల్లో నాణ్యత లోపించకుండా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి ►గ్రామ, వార్డు సచివాలయాలను సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలి ►ఇసుక, సిమ్మెంటు, స్టీలు లాంటివి కొరతలేకుండా వాటి పంపిణీపై దృష్టిపెట్టాలి ►8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు కలిపి సుమారు 5.18 లక్షల ట్యాబులు ఇచ్చాం ►వీటి ద్వారా విద్యార్థులకు ప్రయోజనాలు అందేలా చూడాలి ►అవి సరిగ్గా పనిచేస్తున్నాయా? లేదా? అన్నదానిపై సమీక్ష చేయాలి ►సమస్యలుంటే..ఏం చేయాలన్నదానిపై దానిపై ఎస్ఓపీ రూపొందించాం ►ఏమైనా సమస్యలు ఉంటే… హెడ్మాస్టర్కు గాని, స్థానికంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయల్లోగాని ఇస్తే.. 3 రోజుల్లోగా రిపేరు చేసి తిరిగి ఇస్తారు ►ఈ ఎస్ఓపీ అమలు జరుగుతుందా? లేదా? అన్నది కలెక్టర్లు చూడాలి ►గ్రామ, వార్డు సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లు.. స్కూలుకు వెళ్లి.. అక్కడున్న ఉపాధ్యాయులు, పిల్లలకు ట్యాబుల వినియోగంపై అవగాహన కల్పిస్తారు ►నెలకోసారి తప్పనిసరిగా డిజిటల్ డే పాటిస్తూ.. వారు స్కూళ్లకు వెళ్తారు ►ప్రభుత్వం ఇచ్చిన ట్యాబుల వినియోగంపై అవగాహన కల్పించడం, వినియోగించడంపై వీరు శిక్షణ ఇస్తారు ►స్కూళ్లు జూన్ 12న తిరిగి తెరుస్తారు, అదే రోజు వారికి విద్యాకానుక అందించాలని ►ఇందులో ఎలాంటి ఆలస్యానికి తావుండకూడదు ►దాదాపు 43.01 లక్షల మందికి జగనన్న విద్యాకానుక అందుతుంది ►పంపిణీపై మంచి ప్రోటోకాల్ను పాటించాలి ►అలాగే జగనన్న విద్యాకానుక కింద అందించే వస్తువుల క్వాలిటీపైన కూడా బెస్ట్ ప్రోటోకాల్ పాటించాలి ►జగనన్న విద్యాకానుకపై ఏ స్కూలు నుంచైనా, ఏ విద్యార్థినుంచైనా నాకు ఫిర్యాదులు రాకూడదు ►స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్లు పిల్లలకు విద్యాకానుక అందించాలని ►గతంలో ఎప్పుడూ పుస్తకాలు టైముకు ఇచ్చేవారు కాదు: ►అక్టోబరు, నవంబరు వచ్చినా.. అవి పిల్లలకు అందేవి కావు: ►మనం వచ్చాక పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాం: ►మొత్తం వ్యవస్థలోనే మార్పులు తీసుకు వచ్చాం: ►స్కూళ్లలో పిల్లలకు చేస్తున్న కార్యక్రమాలను కలెక్టర్లు ఓన్ చేసుకోవాలి: ►అలాగే పాఠశాల్లో నైట్ వాచ్మెన్లును నియమించడంపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి: ►మాదక ద్రవ్యాల నివారణపై పోలీసు అధికారులు దృష్టిపెట్టాలి ►ప్రతి కాలేజీలోకూడా ఎస్ఈబీ టోల్ఫ్రీ నంబర్ను డిస్ప్లే చేయాలి ►వీటికి సంబంధించి పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టాలి ►జిల్లాల పోలీసు కార్యాలయాల్లో ప్రత్యేక డివిజన్ను ఏర్పాటు చేయాలి ►మాదక ద్రవ్యాల నివారణే వీటి ఉద్దేశం కావాలి ►కాలేజీల్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి చదవండి: బుల్లెట్ ట్రైన్లో చంద్రబాబు తిరుగుతున్నారా?.. సీపీఎం నేతలు ఫైర్ ►వారి నుంచి నిరంతరం సమాచారం తీసుకోవాలి ►పిల్లలు వీటి బారిన పడకుండా వారికి కౌన్సెలింగ్ నిర్వహించాలి ►మాదకద్రవ్యాలు తయారుచేస్తున్నవారు. రవాణా చేస్తున్నారు, పంపిణీచేస్తున్నవారిపట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలి ►గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసులకు అవగాహన కల్పించాలి ►15వేలమందికిపైగా మహిళా పోలీసులు ఉన్నారు ►వారు సమర్థవంతంగా పనిచేసేలా, వారి నుంచి మంచి సేవలు పొందేలా చూడాలి -
రాజకీయాల కోసం కాకుండా రాజ్యాంగ ఫలాలు అందేలా సాగుతున్న పాలన: మంత్రి ధర్మాన
-
చకచకా సదుపాయాలు.. జోరుగా ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. నిర్మాణం పూర్తయిన ఇళ్లకు చకచకా విద్యుత్, నీటి సరఫరా కనెక్షన్లను అందచేస్తోంది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా పేద కుటుంబాలకు పక్కా నివాసాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం కల్పిస్తున్న విషయం తెలిసిందే. దీంతో వైఎస్సార్–జగనన్న కాలనీల రూపంలో ఏకంగా పట్టణాలే నిర్మితమవుతున్నాయి. ఇప్పటివరకూ రెండు దశల్లో 21.25 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఇందులో 2.62 లక్షలు టిడ్కో ఇళ్లు కాగా, మిగిలిన 18.63 లక్షలు సాధారణ గృహాలు. సాధారణ ఇళ్లలో 16.67 లక్షల గృహాల శంకుస్థాపనలు పూర్తి కాగా, నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్లు నిర్మిస్తున్న 17 వేల కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఏకంగా రూ.32 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. 8,485 లేఅవుట్లలో విద్యుత్ సర్వే పూర్తి ఇంటి నిర్మాణాలు కొనసాగుతున్న 8,485 లేఅవుట్లలో విద్యుత్ సరఫరాకు సంబంధించిన సర్వే పూర్తయింది. 3,248 లేఅవుట్లలో విద్యుత్ స్తంభాలు నాటడం, వైర్లు లాగడం, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు లాంటి పనులు చకచకా కొనసాగుతున్నాయి. 1,411 లేఅవుట్లలో పనులు పూర్తయ్యాయి. నీటి సరఫరాకు సంబంధించి 1,561 లేఅవుట్లలో పనులు ప్రారంభించారు. 6,012 లేఅవుట్లలో పనుల కోసం టెండర్లు ఆహ్వానించారు. 1.40 లక్షలకు పైగా ఇళ్లకు విద్యుత్, నీటి కనెక్షన్లు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకూ 2.09 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. వీటిలో 1,46,440 ఇళ్లకు విద్యుత్, 1,40,986 ఇళ్లకు నీటి కనెక్షన్లు ఇచ్చారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిర్మాణాలు పూర్తయిన వెంటనే విద్యుత్, నీటి సరఫరా కనెక్షన్లు ఇచ్చేలా గృహ నిర్మాణ శాఖ చర్యలు చేపట్టింది. వైఎస్సార్–జగనన్న కాలనీలకు స్వాగత ఆర్చ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. 50 ఇళ్లకు పైగా ఉన్న లేఅవుట్లలో స్వాగత ఆర్చ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే రూ.50 కోట్లతో 1,127 లేఅవుట్లలో ఆర్చ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. వసతులపై ప్రత్యేక దృష్టి వైఎస్సార్–జగనన్న కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాం. నిర్మాణం పూర్తయిన ప్రతి ఇంటికి వెంటనే నీరు, విద్యుత్ సరఫరా కనెక్షన్లు ఇవ్వాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి సిబ్బంది ఎప్పటికప్పుడు లబ్ధిదారులతో సమన్వయం చేసుకుంటూ ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తున్నారు. నిర్మాణం తుదిదశకు చేరుకున్న సమయంలో నీరు, విద్యుత్ కనెక్షన్ల కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. డ్రెయిన్ల నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం. – అజయ్ జైన్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాకినాడ జిల్లా జగ్గంపేట డివిజన్ మురారి గ్రామంలోని వైఎస్సార్–జగనన్న కాలనీలో ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్న సిబ్బంది -
స్వగృహప్రాప్తిరస్తు.. నిర్మాణం శరవేగం
సాక్షి, భీమవరం(ప.గో. జిల్లా): పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను చేపట్టింది. త్వరితగతిన గృహాలు నిర్మించేందుకు అన్నిరకాల ప్రోత్సాహకాలు అందిస్తోంది. అలాగే సొంతంగా ఇళ్లు నిర్మించుకోలేని లబ్ధిదారులకు ఆప్షన్–3లో భాగంగా కాంట్రాక్టర్లతో నిర్మించి ఇచ్చేందుకు ప్రజాప్రతినిధులు, హౌసింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ మేరకు జిల్లాలో భీమవరం, ఆకివీడు, పాలకొల్లు, తణుకు పట్టణాల్లో సుమారు 15 వేల గృహనిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేసి వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించారు. ఈ మేరకు కాంట్రాక్టర్లతో లబ్ధిదారులు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల చొరవతో.. జిల్లాలో పేదలకు ప్రభుత్వం 77,688 ఇళ్లను మంజూరు చేయగా ఇప్పటికే పలువురు సొంతంగా నిర్మాణాలు ప్రారంభించారు. పలువురు గృహప్రవేశాలు కూడా చేసుకున్నారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు మంజూరు చేయగా డ్వాక్రా మహిళలకు బ్యాంకుల నుంచి రూ.35 వేలు రుణం ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే వ్యవసాయ కార్మికులు, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే వారికి ఇంటి నిర్మాణం కష్టం కావడంతో కాంట్రాక్టర్లు, తాపీమేస్త్రీలను పురమాయించి నిర్మాణాలు చేపట్టేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషిచేస్తున్నారు. నిబంధనల మేరకు.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం కోసం 10 అడుగుల లోతులో గోతులు తవ్వి వాటికి ఆర్సీసీ కాంక్రీట్, ఫైల్ క్యాప్ వేస్తారు. ఆర్సీసీ ప్లి్లంత్ బీమ్తో కలిసి 4 అడుగుల ఎత్తు సిమెంట్ రాయి కట్టుడు బేస్మెంట్, బేస్మెంట్ను ఇసుకతో నింపడం, రూఫ్ బీమ్, 4 అంగుళాల స్లాబ్ వంటి పనులు చేస్తారు. యంత్రాల వినియోగం కాంట్రాక్టర్లు నిర్మాణ పనులకు యంత్రాలు వినియోగిస్తున్నారు. ట్రాక్టర్కు డిగ్గర్ను అమర్చి పిల్లర్లకు గోతులు తవ్వుతున్నారు. దీంతో పనులు త్వరితగతిన జరుగుతున్నాయి. అలాగే కాంక్రీట్ కలపడానికి మిక్చర్ యంత్రం, శ్లాబ్కు లిఫ్ట్ మెషీన్ను వినియోగించేలా ఏర్పాట్లు చేశారు. లబ్ధిదారులతో ఒప్పందం ఇంటిని నిర్మించుకోవడానికి కాంట్రాక్టర్లతో లబ్ధిదారులు స్వచ్ఛందంగా ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉండటంతో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, సిమెంట్, ఇనుము కాంట్రాక్టర్లకు అందుబాటులో ఉంచుతున్నాం. దీనిలో భాగంగానే 20 వేల టన్నుల ఇసుక నిల్వ చేస్తున్నాం. వచ్చే జూన్ నాటికి నిర్మాణ పనులు పూర్తిచేసేలా కృషిచేస్తున్నాం. –ఎ.శివరామరాజు, హౌసింగ్ పీడీ, భీమవరం భీమవరంలో 3 వేల ఇళ్లు భీమవరంలోని విస్సాకోడేరు జగనన్న కాలనీలో 3 వేల ఇళ్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే 1,200 మందికి పైగా లబ్ధిదారులతో ఒప్పందం కుదుర్చుకున్నాం. కాలనీలో ఆర్సీసీ కాంక్రీట్, ఫైల్క్యాప్ వేసే పనులు చేపట్టాం. పనులు చూసిన మిగిలిన లబ్ధిదారులు కూడా ఇళ్ల నిర్మాణానికి ఒప్పందం చేసుకుంటున్నారు. త్వరితగతిన పనులు పూర్తిచేసి గృహప్రవేశాలు చేయిస్తాం. – పళ్ల ఏసుబాబు, కాంట్రాక్టర్, భీమవరం ఇళ్ల నిర్మాణం ఇలా.. జిల్లాలో పెద్ద కాలనీలు ఉన్న ప్రాంతాల్లో కాంట్రాక్టర్లు, తాపీమేస్త్రీలతో ఇళ్లు నిర్మించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. భీమవరంలో 3 వేలు, పాలకొల్లులో 3,500, తణుకులో 5,500, ఆకివీడులో 2,700 ఇళ్లను కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. అలాగే నరసాపురం, తాడేపల్లిగూడెంలో నిర్మాణానికి చర్యలు చేపట్టారు. నిర్మాణాలకు కొరత లేకుండా అధికారులు 20 వేల టన్నుల ఇసుకను నిల్వ చేశారు. కాంట్రాక్టర్లకు అవసరమైన సిమెంట్, ఇనుమును ముందుగానే అందిస్తున్నారు. నిర్మాణానికి రూ.3.30 లక్షలు ఇంటి నిర్మాణానికి మొత్తం రూ.3.30 లక్షల ఖర్చవుతుండగా ప్రభుత్వం రూ.1.80 లక్షలు మంజూరు చేస్తుంది. అలాగే డ్వాక్రా మహిళలకు రూ.35 వేలు బ్యాంకు రుణం ఇస్తున్నారు. మిగిలిన రూ.1.15 లక్షలను లబ్ధిదారులు చెల్లిస్తే సరిపోతుంది. -
పట్నంలో 50 గజాలు .. పల్లెల్లో 75 గజాలు!
సాక్షి, హైదరాబాద్: సొంత జాగాల్లో ఇళ్లను నిర్మించుకునేవారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించే సరికొత్త గృహ నిర్మాణ పథకానికి రాష్ట్ర సర్కారు విధివిధానాలను ఖరారు చేయనుంది. ప్రస్తుతం అమలులో ఉన్న రెండు పడక గదుల (డబుల్ బెడ్రూమ్) ఇళ్ల నిర్మాణ పథకం పూర్తిస్థాయి సవరణలతో, దానితో ఏ మాత్రం పోలిక లేకుండా కొత్త రూపుతో ముందుకు రానుంది. దీనికి సంబంధించిన ప్రాథమిక ప్రతిపాదనలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరాయి. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించుకునే ఇంటికి కనీసం 75 గజాల స్థలం ఉండాలి. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే 50 గజాల నుంచి 75 గజాల మధ్య ఉండాలి. అయితే కింద ఒక గది, పైన మరొక గది నిర్మించుకునేందుకు అనుమతించే పక్షంలో కనీస స్థలం 35 గజాలు అయినా సరిపోతుంది. వీటితో పాటు ఇతర విధివిధానాలను సీఎం కేసీఆర్ పరిశీలించి ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పథకాన్ని భారీగా సవరించి చేపడుతున్న నేపథ్యంలో..కొత్త పథకంలో సీఎం కేసీఆర్ మార్పులు, చేర్పులు చేస్తారని భావిస్తున్నారు. యావత్తు దేశం దృష్టినీ ఆకర్షించిన రెండు పడక గదుల ఇళ్ల పథకం విఫలమైందన్న ప్రచారానికి అవకాశం కల్పించకుండా, దీన్ని కూడా ప్రత్యేకంగా కనిపించేలా ఆయన మార్పులు చేస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి హైదరాబాద్కు రాగానే దీనిపై దృష్టి సారించే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే మార్పులు చేర్పుల ఆధారంగా తుది విధివిధానాలు రూపొందించి అధికారికంగా వెల్లడించనున్నారు. లేదంటే ప్రాథమిక అంశాలే తుది విధివిధానాలుగా ఖరారు కానున్నాయి. ఆదినుంచీ అవాంతరాలే.. రెండు పడక గదుల ఇళ్ల పథకానికి ఆది నుంచి ఎదురవుతున్న అవాంతరాలు దాన్ని సాఫీగా ముందుకు సాగనీయటం లేదు. మొత్తం 2.27 లక్షల ఇళ్లకు టెండర్లు పిలిచి ప్రారంభించారు. అయితే 1.10 లక్షల ఇళ్లే పూర్తి చేశారు. కానీ ఇప్పటివరకు కనీసం 20 వేల ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందించలేదు. మిగతా వాటికి సంబంధించి అసలు లబ్ధిదారుల జాబితాలనే రూపొందించలేదు. దీన్ని తప్పుబడుతున్న కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిధులు విడుదల చేసేందుకు ససేమిరా అంటోంది. ఈ పరిస్థితుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుడుతోంది. మార్చిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో సొంత ఇంటి పథకం మార్పు వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకు రూ.12 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. తాజాగా ప్రాథమికంగా విధివిధానాలు ఖరారు చేసింది. ప్రాథమికంగా ఇలా.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని కొత్త పథకానికి సంబంధించిన విధివిధానాలను ప్రాథమికంగా రూపొందించారు. ►ఈ ఇళ్లను దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి (బీపీఎల్) మాత్రమే మంజూరు చేస్తారు. ►ఈ ఇళ్ల కేటాయింపుల్లో ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకు రిజర్వేషన్ ఉంటుంది. గతంలో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం ఇళ్లు కేటాయించిన దాఖలాలున్నాయి. సొంత స్థలాలున్న వారి సంఖ్య అందుకు సరిపడా లేదనుకున్నప్పుడు జనాభాలో వారి శాతం ఆధారంగా రిజర్వేషన్ ఉండాలి. ►పట్టణ ప్రాంతాల్లో మైనారిటీల సంఖ్య ఎక్కువగా ఉన్నందున అక్కడ వారికి 12 శాతం ఇళ్లు కేటాయించాలి. ►ఇళ్ల కేటాయింపు ప్రక్రియను రెండు గ్రామ సభల ద్వారా చేపట్టాలి. తొలి గ్రామ సభలో దరఖాస్తులు స్వీకరించాలి. తహసీల్దార్ ఆధ్వర్యంలో వాటి పరిశీలన పూర్తి చేసి అర్హుల జాబితా రూపొందించి రెండో సభలో వివరాలు వెల్లడించాలి. అభ్యంతరాలకు కూడా అవకాశం కల్పించాలి. ►ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇళ్లను కేటాయిస్తారు. మరికొన్ని ఇళ్లు ముఖ్యమంత్రి విచక్షణాధికారం పరిధిలో ఉంటాయి. వెరసి 4 లక్షల ఇళ్లను మంజూరు చేస్తారు. ►ఒక్కో ఇంటికి గరిష్టంగా రూ.3 లక్షలు కేటాయిస్తారు. వాటిని ఇళ్ల నిర్మాణం జరిగే కొద్దీ విడతల వారీగా విడుదల చేస్తారు. ►కబ్జాలో ఉన్న ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరించేందుకు 58, 59 జీవోల ద్వారా కల్పించిన వెసులుబాటు పరిధిలో ఉన్నవారు ఈ ఇళ్లు పొందేందుకు అనర్హులు. -
1.79 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు
సాక్షి, అమరావతి: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద 2021–22 సంవత్సరానికి సంబంధించి మరో 1,79,060 ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. యూనిట్కు రూ.1.80 లక్షల చొప్పున రూ.3,223.08 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. 1.79 లక్షలలో అత్యధికంగా గుంటూరు జిల్లాకు 27,330, కర్నూలుకు 21,494, పశ్చిమగోదావరికి 19,146 ఇళ్లు కేటాయించారు. ప్రభుత్వం రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు 30 లక్షలకు పైగా ఇళ్లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి దశ కింద చేపట్టిన 15.65 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. వచ్చే ఏడాది జూన్ నాటికి తొలి దశ నిర్మాణాలన్నీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. -
భారీ కేటాయింపులు..పేదల సొంతింటి కలకు రూ.4,791కోట్లు
సాక్షి, అమరావతి: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం 2022–23 బడ్జెట్లో రూ.4,791.69 కోట్ల నిధులు కేటాయించింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి కట్టుబడి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఇళ్లులేని నిరుపేదలు ఉండరాదన్న లక్ష్యంతో సీఎం జగన్ ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం ప్రవేశపెట్టారు. పథకం కింద రెండు దశల్లో 28.30 లక్షల ఇళ్లను రూ.50,944 కోట్లతో ప్రభుత్వం నిర్మిస్తోంది. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం రూ.28,084 కోట్లతో జరుగుతోంది. వీటిలో 10.88 లక్షల ఇళ్లు ప్రస్తుతం పునాది దశలో ఉన్నాయి. 2.50 లక్షల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. 21.7 కోట్ల పనిదినాల సృష్టి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నడూలేని విధంగా తొలిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టడం ద్వారా 21.7 కోట్ల పనిదినాలు కల్పించారు. తద్వారా ఇప్పటివరకూ ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.1,146.7 కోట్లు చెల్లించింది. అదేవిధంగా ఒక్కో లబ్ధిదారురాలికి 3 శాతం వడ్డీతో రూ.35వేల రుణాన్ని ప్రభుత్వం బ్యాంకుల ద్వారా ఇప్పిస్తోంది. రుణ విముక్తి.. ఇక 2011కు ముందు గృహ నిర్మాణ సంస్థ ద్వారా రుణసాయంతో ఇళ్లు నిర్మించుకున్న వారికి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద రుణ విముక్తి కల్పిస్తున్నారు. అదే విధంగా లబ్ధిదారులకు స్పష్టమైన టైటిల్, స్వాధీన హక్కుతో ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నారు. రుణాలు పొందకుండా ఇళ్లు నిర్మించుకున్న వారికీ హక్కులు కల్పిస్తున్నారు. ఇప్పటివరకూ 8.56 లక్షల మంది పథకం ద్వారా లబ్ధిపొందారు. సచివాలయాలకు పెరిగిన కేటాయింపులు సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయాలకు ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపులను బాగా పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ శాఖకు ప్రభుత్వం ఖర్చు రూ.2,890.26 కోట్లు ఉండగా వచ్చే ఏడాదికి రూ.3,396.25 కోట్లకు పెంచింది. ఇందులో గ్రామ సచివాలయాలు, శాఖ ప్రధాన కార్యాలయాల నిర్వహణ ఖర్చులతోపాటు గ్రామ సచివాలయ ఉద్యోగుల జీతభత్యాలు, గ్రామ వలంటీర్ల గౌరవ వేతనం వంటి ఖర్చులు కలిసి ఉంటాయి. గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల ప్రొబేషనరీ ప్రకటన కసరత్తును జూన్ నెలాఖరుకల్లా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రొబేషనరీ ప్రకటనతో అర్హులైన గ్రామ సచివాలయాల ఉద్యోగులకు జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ శాఖకు బడ్జెట్ కేటాయింపులను కూడా పెంచినట్టు అధికారులు వెల్లడించారు. వార్డు సచివాలయ ఉద్యోగులకు వార్డు వలంటీర్లకు వేరుగా మునిసిపల్ శాఖ నుంచి ప్రభుత్వం వేరుగా మరికొన్ని నిధులను కేటాయించింది. -
వచ్చే ఏడాది జూన్కి ఇళ్లు పూర్తవ్వాలి
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది జూన్ నాటికి నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం తొలిదశ ఇళ్ల నిర్మాణాలన్నీ పూర్తిచేయాలని గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆ శాఖ అధికారులను ఆదేశించారు. విజయవాడలోని ఏపీ గృహనిర్మాణ సంస్థ ప్రధాన కార్యాలయంలో బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ఇళ్లు లేని నిరుపేద, మధ్య తరగతి ప్రజలకు ఇళ్లు నిర్మించి ఇచ్చే నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. ఈ నేపథ్యంలో నాణ్యతలో రాజీపడకుండా ఇళ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తిచేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులో జాప్యం ఉండరాదన్నారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పన వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సూచించారు. కాలనీల్లో ప్రజలకు ఆరోగ్యకర జీవన పరిస్థితుల కల్పనపై ప్రభుత్వానికి ప్రత్యేకశ్రద్ధ ఉందని చెప్పారు. ప్రత్యేకాధికారులు తరచు జిల్లాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పనుల తీరును పర్యవేక్షించాలని, ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలివ్వాలని సూచించారు. గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు బిల్లులు అప్లోడ్ చేయాలని కోరారు. ఈ సమావేశంలో ప్రత్యేక కార్యదర్శి రాహుల్పాండే, గృహనిర్మాణ సంస్థ ఎండీ నారాయణభరత్ గుప్తా, జేఎండీ శివప్రసాద్ పాల్గొన్నారు. -
అసైన్డ్దారులే అంగీకరించినప్పుడు మీకొచ్చిన ఇబ్బందేమిటి?
సాక్షి, అమరావతి: పేదలందరికీ ఇళ్లు పథకం కోసం ప్రభుత్వానికి భూములిచ్చేందుకు అసైన్డ్దారులే అంగీకారం తెలిపినప్పుడు మీకొచ్చిన ఇబ్బంది ఏమిటని పిటిషనర్ను హైకోర్టు ప్రశ్నించింది. అసైన్డ్దారులు అంగీకరించినప్పుడు భూ సమీకరణను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ఎందుకు విచారించాలని కూడా ప్రశ్నించింది. పేదలందరికీ ఇళ్ల పథకం కింద పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వ, అసైన్డ్ భూముల సమీకరణను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో తీర్పును వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం, అనకాపల్లి మండలాల పరిధిలో పేదలందరికీ ఇళ్ల పథకం కింద ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా 6,116 ఎకరాలు సమీకరిస్తోందంటూ రైతు కూలీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీరామ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై 2020లో విచారణ జరిపిన సీజే ధర్మాసనం భూములను స్వాధీనం చేసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం తుది విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ 1.5 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వ భూములతో పాటు అసైన్డ్ భూములను కూడా ప్రభుత్వం సమీకరిస్తోందని తెలిపారు. అసైన్డ్ భూములు ఇచ్చేందుకు అసైన్డ్దారులు లిఖితపూర్వకంగా సమ్మతి తెలియజేశారంటూ వాటిని ధర్మాసనం ముందుంచారు. అసైన్డ్దారులే వ్యవసాయ కూలీలని, అందువల్ల భూ సమీకరణ వల్ల ప్రత్యేకంగా వ్యవసాయ కూలీలు ప్రభావితం కావడం లేదని చెప్పారు. ప్రజా ప్రయోజనాల నిమిత్తం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోర్టును కోరారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కె.శ్రీనివాసమూర్తి వాదనలు వినిపిస్తూ, చట్ట నిబంధనలకు విరుద్ధంగా భూ సమీకరణ చేస్తున్నారని తెలిపారు. అసైన్డ్ భూముల సమీకరణకు చట్టం నిర్దేశించిన విధి విధానాలను ప్రభుత్వం అనుసరించలేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. -
పేదింటికి పావలా వడ్డీ రుణాలు
సాక్షి, అమరావతి: తొలి దశలో నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం లబ్ధిదారులందరికీ వారి ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు పావలా వడ్డీకి బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. ఇళ్ల నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి అయ్యేందుకు ఒక్కో లబ్ధిదారునికి రూ.35 వేలు పావలా వడ్డీకి బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు గృహ నిర్మాణ శాఖ పరిపాలన అనుమతిని మంజూరు చేసింది. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ కూడా ఈ రుణాలివ్వాలని అన్ని బ్యాంకులను ఆదేశించింది. దీంతో బ్యాంకులు త్వరితగతిన రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఇప్పటికే 2.12 లక్షల మందికి రూ.735.61 కోట్ల మేర పావలా వడ్డీ రుణాలు ఇచ్చాయి. ఈ పథకం కింద తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఒక్కో ఇంటికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు ఖర్చు చేస్తోంది. లబ్ధిదారుల వెసులుబాటు కోసం పావలా వడ్డీకే రూ.35 వేల చొప్పున రుణాలు ఇప్పిస్తోంది. ఇప్పటికే అత్యధికంగా చిత్తూరు, ప్రకాశం, అనంతరపురం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. రుణాల మంజూరులో వెనుకబడిన జిల్లాల్లో ప్రత్యేకంగా బ్యాంకర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి రుణాలిప్పించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. తరచూ జిల్లా స్థాయిలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి, త్వరితగతిన రుణాలిప్పించాలని కలెక్టర్లకు సూచించినట్లు చెప్పారు. వర్షాలు తగ్గడంతో నిర్మాణాలు వేగవంతం వర్షాలు తగ్గడంతో పేదల ఇళ్ల నిర్మాణం వేగం పుంజుకుందని అజయ్ జైన్ తెలిపారు. ఇప్పటివరకు ఉన్న పెండింగ్ బిల్లులు రూ. 934.26 కోట్లను, సామాగ్రి సరఫరా బిల్లు రూ. 42.22 కోట్లను చెల్లించేసినట్లు చెప్పారు. వచ్చే ఆరు నెలల్లో మరింత వేగంగా ఇళ్ల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. -
పీఆర్సీ గ్యారెంటీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ కచ్చితంగా ప్రకటిస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ‘ఉద్యోగులు ప్రజల్లో, ప్రభుత్వంలో భాగం. మా ప్రభుత్వ ఆలోచనలు, విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేది వారే. అలాంటి ఉద్యోగులపై ప్రభుత్వానికి ప్రేమే ఉంటుంది తప్ప కోపం ఉండదు’ అని పునరుద్ఘాటించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఎవరూ అడగకుండానే ఉద్యోగులకు 27% ఐఆర్ (మధ్యంతర భృతి) ఇచ్చారని గుర్తు చేశారు. టీడీపీ హయాంలో చంద్రబాబు పీఆర్సీని వేయడంలో తీవ్ర జాప్యం చేశారని, డీఏలు కూడా ఇవ్వలేదని ఎత్తిచూపారు. కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందన్నది ఉద్యోగులకు తెలుసని, అందుకే వారు ప్రభుత్వానికి సహకరిస్తున్నారని చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల్లోనూ అంగన్వాడీ కార్యకర్తల నుంచి అన్ని వర్గాల ఉద్యోగులకు వేతనాలు పెంచామని గుర్తు చేశారు. 2018–19లో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల చెల్లింపులు రూ.32 వేల కోట్లు ఉంటే.. 2020–21కి రూ.50 వేల కోట్లకు పెరిగాయని చెప్పారు. వేతనాలు, డీఏ తదితరాలను పెంచడం వల్ల ఏడాదికి రూ.18 వేల కోట్ల మేర ఉద్యోగులకు అదనంగా చెల్లిస్తున్నట్టు తెలిపారు. ఉద్యోగులు సంయమనం పాటించాలని, గడవులోగా పీఆర్సీ ఇస్తామని చెప్పారు. తాము తల్చుకుంటే ప్రభుత్వాలను కూల్చగలం.. నిలబెట్టగలమని నలుగురైదుగురు ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడటం సరికాదన్నారు. కావాలంటే వారు నలుగురూ రాజకీయ పార్టీలు పెట్టుకుని.. ఎన్నికల్లో పోటీ చేయవచ్చునని సూచించారు. అధికారంలో ఉన్నప్పుడెందుకు చేయలేదు బాబూ? రాష్ట్రంలో దశాబ్దాలుగా గృహ నిర్మాణ సంస్థ ద్వారా రుణాలు తీసుకుని.. ఇళ్లు నిర్మించుకున్న పేదలకు వాటిపై సంపూర్ణ హక్కు లేదని సజ్జల చెప్పారు. అసలు, వడ్డీని ఏకకాలంలో నామమాత్రపు చెల్లింపుతో పరిష్కరించి.. ఉచితంగా పేదల పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించి.. అమ్ముకోవడానికి హక్కు కల్పించేలా జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని సీఎం వైఎస్ జగన్ చేపట్టారని చెప్పారు. పేదలకు ప్రయోజనం కలిగే ఈ పథకాన్ని ప్రతిపక్ష నేత చంద్రబాబు తప్పుపట్టడంపై మండిపడ్డారు. 2014 నుంచి 2019 వరకూ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇళ్ల నిర్మాణానికి పేదలు తీసుకున్న రుణంపై వడ్డీ మాఫీ చేయాలని ఐదు సార్లు అధికారులు ప్రతిపాదనలు పంపితే.. నాటి సీఎం చంద్రబాబు అంగీకరించలేదని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వస్తే అసలు, వడ్డీని మాఫీ చేసి, ఉచితంగా ఇళ్లను అందిస్తానని బాబు చెబితే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. పేదలకు ప్రయోజనం చేకూర్చే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ పథకం కింద ఎవరినీ బలవంతం పెట్టడం లేదని.. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారికే వర్తింపజేస్తామని తేల్చిచెప్పారు. చదవండి: రాష్ట్రానికి తుపాన్ల దెబ్బ.. 90వేల కోట్లు నష్టం చంద్రబాబు ఏజెంట్ల మాటలు వినే.. రాయలసీమలో 140 ఏళ్ల తర్వాత కుంభవృష్టి కురవడంతో అన్నమయ్య ప్రాజెక్టును 3.20 లక్షల క్యూసెక్కుల వరద ముంచెత్తిందని సజ్జల చెప్పారు. ఆ ప్రాజెక్టు స్పిల్ వే సామర్థ్యం 2.17 లక్షల క్యూసెక్కులేనని, అంతకు మించి వరద రావడంతో మట్టికట్ట తెగిందన్నారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రాజెక్టు దిగువ గ్రామాల్లో ప్రజలను ఖాళీ చేయించి, పునరావాసం కల్పించామన్నారు. లేదంటే ప్రాణ నష్టం అధికంగా ఉండేదన్నారు. కేంద్ర బృందం కూడా ఇదే అంశాన్ని చెప్పిందని గుర్తు చేశారు. కేంద్ర బృందం నివేదికను పరిశీలించకుండా.. చంద్రబాబు ఏజెంట్ల మాటలు వినే కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వాస్తవ విరుద్ధమైన మాటలు మాట్లాడారని చెప్పారు. అన్నమయ్య ప్రాజెక్టుకు ఎక్కడి నుంచి ఎంత నీరు వస్తుందో అంచనా వేయడానికి ఇప్పటిదాకా ఏర్పాట్లు లేవన్నారు. చదవండి: వ్యవసాయ శాఖపై సీఎం జగన్ సమీక్ష వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు శాస్త్రీయంగా కొలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రజల మనిషని, కష్టాల్లో తోడునీడగా నిలబడతారని చెప్పారు. ప్రజలు ప్రేమతో సీఎం జగన్తో సెల్ఫీలు తీసుకుంటే తప్పుపట్టే చంద్రబాబు.. పోలీసులు బారికేడ్లు పెడితే ప్రజలంటే సీఎం జగన్కు భయమని విమర్శించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. ఎప్పుడో జరిగిన ఘటనకు ఇవాళ్టికి కూడా ఎన్ఎస్జీ గార్డులను చుట్టూ పెట్టుకుని ప్రజల్లో తిరిగే చంద్రబాబు.. సీఎం జగన్ భద్రతపై మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. -
ఏపీలో పేదల ఇళ్ల నిర్మాణానికి మార్గం సుగమం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలు ఉండకూడనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పేదలందరికీ ఇళ్లు’ నిర్మాణ పథకానికి మార్గం సుగమమైంది. రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్లు పథకంపై హైకోర్టులోని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ మంగళవారం రద్దు చేసింది. దీంతో ఇళ్ల స్థలాలపై హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను పిటిషనర్లు వెనక్కి తీసుకున్నారు. కాగా, గత నెల 8వ తేదీన పేదలందరికీ స్థలాలు పథకంలో భాగంగా ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఎటువంటి నిర్మాణాలు చేయొద్దని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పిచ్చిన విషయం తెలిసిందే. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. ఈ మేరకు హైకోర్టులోని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నట్లు డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. -
టమ టమ బండి.. భలే భలేగా ఉందండి.! ఎర్రబాబు బండికి యమ క్రేజ్..!
మచిలీపట్నం: ఏడు పదుల వయస్సులోనూ ఎవరిపైనా ఆధారపడకుండా తన రెక్కల కష్టాన్ని నమ్ముకుని కుటుంబాన్ని లాక్కొస్తున్న బందరుకు చెందిన షేక్ ఎర్రబాబు పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. కృష్ణా జిల్లా బందరు జనశక్తి నగర్లోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్న షేక్ ఎర్రబాబు తయారు చేసే ఓ ప్రత్యేకమైన చిన్నబండికి పిల్లల్లో మంచి క్రేజ్ ఉంది. తనలో ఉన్న సృజనాత్మకతను రంగరించి రెండు చక్రాలతో చిన్న బండిని తయారు చేశాడు. సైకిల్ వెనుక ఆ బండిని కట్టి బందరు వీధుల్లో విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. అమ్మకానికి తీసుకెళ్లే క్రమంలో అది టమ టమ అని శబ్ధం వస్తుండడంతో పిల్లలంతా ‘టమ టమ బండి’ వచ్చిందంటూ ఎగబడేవారు. దీంతో దానికి టమ టమ బండి అనే పేరు పెట్టాడు ఎర్రబాబు. సృజనాత్మకతను రంగరించి.. బందరులో ఉండే తమ పూర్వీకులు నాడు, మట్టి కుండలపై పల్చటి చర్మం పొరని అతికించి సంగీత వాయిద్యాలను తయారు చేసేవారు. అదే స్ఫూర్తితో ఎర్రబాబు పిల్లలు ఆడుకునేందుకు ఉపయుక్తంగా ఉండేలా చిన్న బండి తయారీకి సిద్ధమయ్యాడు. నాలుగు, ఐదు అంగులాల సైజులో ఓ డప్పును అమర్చి, బండి కదిలే సమయంలో అది టమ టమ అని శబ్ధం వచ్చేలా రూపొందించాడు. దీనికి కావాల్సిన సామగ్రి అంతటినీ బందరు మార్కెట్లోనే కొనుగోలు చేస్తాడు. రోజుకు మూడు బండ్లు తయారు చేసి.. సైకిల్కు కట్టుకుని బందరు వీధుల్లో విక్రయిస్తున్నాడు. రోజుకు సుమారు ఐదు నుంచి పది బండ్ల వరకు అమ్ముడుపోతాయి. నాలుగు అంగళాల డప్పు గల బండి రూ. 150, ఐదు అంగుళాలది రూ. 200 ధరగా ఎర్రబాబు నిర్ణయించాడు. రెక్కల కష్టంతోనే.. బందరు రైల్యే స్టేషన్కు సమీపంలో గుడిసెలో చాలా కాలం ఉండేవారు. అయితే ఇటీవల రైల్యేలైన్ విస్తరణతో అక్కడ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఆ సమయంలో డివిజన్ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ నోబుల్ థామస్ చొరవతో రాష్ట్ర మంత్రి పేర్ని నాని వారికి ఆర్థిక సాయం అందించారు. ప్రస్తుతం జనశక్తి నగర్లోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. కొంతకాలం ఇతరత్రా పనులకు వెళ్లినా..వయస్సు మీద పడుతుండడంతో.. ఆనవాయితీగా వస్తున్న బండ్లు తయారీకి మళ్లీ శ్రీకారం చుట్టాడు. ఈ క్రమంలోనే ముగ్గురు అమ్మాయిలకు పెళ్లిళ్లు చేశాడు. ఆర్థిక పరిస్థితులు సహకరించక కొడుకు ఆరో తరగతి వరకు చదివి మానేశాడు. భర్త కష్టాన్ని చూసిన భార్య జహీరాభి ఓ ఇంట్లో పనికి కుదిరి కుటుంబ భారం మోయడంలో కొంత మేరకు భాగస్వామి అయ్యింది. ఏడు పదుల వయస్సు మీదపడినా, ఆధార్లో పొరపాటున పుట్టిన సంవత్సరం తప్పుగా నమోదు కావడంతో ఎర్రబాబు వృద్ధాప్య పింఛన్కు నోచుకోలేదు. వైఎస్సార్ ఇంటి పట్టాతో ఊరట.. బందరులోనే ఏళ్ల తరబడి బతుకీడుస్తున్నప్పటికీ, సొంత ఇళ్లు లేని పరిస్థితి. ఇతని దయనీయ పరిస్థితులు గత పాలకులెవ్వరికీ కనిపించలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేసిన గృహ నిర్మాణ పథకంలో ఎర్రబాబు పేరును డిప్యూటీ మేయర్ టి కవితాథామస్ చేర్పించి, జహీరాభి పేర ఇంటి పట్టా అందజేశారు. సొంత ఇంటి వారయ్యే రోజులు సమీపంలోనే ఉన్నాయని ఎర్రబాబు కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తుంది. -
‘పేదలందరికీ ఇళ్లు’ అప్పీలుపై విచారణ 26కి వాయిదా
సాక్షి, అమరావతి: ‘పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద 30 లక్షల మందికిపైగా పేదలకు ఇచ్చిన భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదంటూ సింగిల్ జడ్జి జస్టిస్ సత్యనారాయణమూర్తి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన అప్పీల్పై విచారణ వాయిదా పడింది. ఈ అప్పీల్తో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు సర్టిఫైడ్ కాపీని జత చేయాలని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకరరెడ్డికి సూచిస్తూ తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ ప్రస్తావించని అంశాలపై కూడా సింగిల్ జడ్జి తీర్పునిచ్చారని నివేదించారు. ఆ అంశాలపై తమకు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వలేదన్నారు. అభ్యంతరం లేదు.. దుష్ట సంప్రదాయం కారాదనే పేదలందరికీ ఇళ్ల పథకం వ్యవహారం త్రిసభ్య ధర్మాసనం ఎదుట విచారణ పెండింగ్లో ఉందని, ఈ విషయాన్ని పట్టించుకోకుండా సింగిల్ జడ్జి తీర్పునిచ్చారని ఏఏజీ పేర్కొన్నారు. సింగిల్ జడ్జి తీర్పు వల్ల 30 లక్షల మందికిపైగా ప్రభావితం అవుతున్నారని తెలిపారు. ఈ సమయంలో ప్రభుత్వ అప్పీల్ను పరిశీలించిన ధర్మాసనం సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు సర్టిఫైడ్ కాపీ లేకపోవడాన్ని గమనించింది. దీనిపై ఏఏజీ సుధాకర్రెడ్డిని వివరణ కోరింది. ఈ నెల 8న సింగిల్ జడ్జి తీర్పునిచ్చారని, ఆ మరుసటి రోజే తాము అప్పీల్ దాఖలు చేశామని, అప్పటికి తీర్పు సర్టిఫైడ్ కాపీ అందుబాటులో లేనందున అప్పీల్తో జత చేయలేకపోయామని తెలిపారు. సర్టిఫైడ్ కాపీ స్థానంలో వెబ్ కాపీని జత చేశామని వివరించారు. అందువల్ల సర్టిఫైడ్ కాపీ దాఖలు నుంచి మినహాయింపునివ్వాలని కోరుతూ అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేశామని తెలిపారు. ఈ అనుబంధ పిటిషన్ను అనుమతించడానికి తమకు అభ్యంతరం లేదని, అయితే సర్టిఫైడ్ కాపీ లేకుండా ప్రభుత్వ అప్పీల్ను విచారిస్తే అది ఒక దుష్ట సంప్రదాయంగా మారుతుందని, రేపు ప్రతి ఒక్కరూ సర్టిఫైడ్ కాపీ లేకుండా అప్పీళ్లు వేసి విచారించాలని కోరతారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో సర్టిఫైడ్ కాపీని తమ ముందుంచాలని సూచిస్తూ అప్పీల్పై విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది. -
ఈ పాపం టీడీపీదే
సాక్షి ప్రతినిధి, గుంటూరు, తెనాలి, తెనాలి రూరల్: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైన వ్యవహారంలో తెరపై సూత్రధారులు తెనాలి కొత్తపేటకు చెందిన జి.అమ్మేశ్వరరావు, మల్లేశ్వరరావులు కాగా, తెరవెనుక టీడీపీ ప్రముఖులు కథ నడిపినట్లు స్పష్టమవుతోంది. పిటిషన్లు వేయడానికి కారణమైన వీరిద్దరికి టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. గతంలో ఓ కార్మిక సంఘంలో పని చేసిన అమ్మేశ్వరరావుతో పాటు ఒక కుల సంఘం నేతగా ఉన్న ఎం.మల్లేశ్వరరావులు పేదలకు ఇళ్ల స్థలాలను ఇప్పిస్తామని నమ్మబలికి, వారి నుంచి ధృవీకరణ పత్రాలు, సంతకాలు సేకరించారు. వీటి ద్వారా 2016లో అప్పటి మండల తహశీల్దారుపై అమ్మేశ్వరరావు హైకోర్టులో కేసు వేశారు. అదే కేసులో పిటిషనుదారుల్లో చాలా మంది పేర్లతో మళ్లీ గత డిసెంబర్లో పేదలందరికీ ఇళ్లు పథకంపై పిటిషను దాఖలు చేశారు. హైదరాబాద్కు చెందిన సివిల్ న్యాయవాదికి తాను ఈ పత్రాలు ఇచ్చినట్టు అమ్మేశ్వరరావు స్థానికుల వద్ద అంగీకరించాడు. అదేమని అడిగితే ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలం సరిపోదని, అందుకే హైదరాబాద్లో సివిల్ న్యాయవాదికి ఇచ్చి పిటిషన్ వేయించినట్టు చెబుతున్నాడు. ‘మీ అంతట మీరే కేసు వేశారా? ఎవరి ప్రోద్భలమైనా ఉందా? ఇళ్ల స్థలాల అర్జీలకంటూ సంతకాలు తీసుకుని, వారి పేర్లతో పిటిషన్ వేయటం ఏమిటి’ అన్న బాధితుల ప్రశ్నలకు అతను సమాధానం ఇవ్వడం లేదు. కొత్తపేటలోని పట్టాభి రోడ్డులో డ్రైనేజి కాలువ పక్కన చిన్న ఇంటిలో నివసించే అమ్మేశ్వరరావు.. హైకోర్టు లాయరుకు భారీ ఫీజులు చెల్లించి.. కోర్టులో పిటిషన్ వేసేంత స్థోమత లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ కేసు కోసం సుమారు 10 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టినట్లు తెలిసింది. ప్రస్తుతం టీడీపీ నాయకులతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్న అమ్మేశ్వరరావుకు ఆ పార్టీకి చెందిన పెద్దలు సహకరించడం వల్లే ఇది సాధ్యమైందని తెలుస్తోంది. టీడీపీ పెద్దలు తెరవెనుక నుంచి ఇచ్చిన సూచనల మేరకు కొంత మంది ఆ పార్టీ నేతల ద్వారా ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. అయితే పిటిషన్ వేసిన వారిలో మృతి చెందిన మహిళ ఉండటం, పేర్లు సరిచూసుకోక పోవడం తదితర కారణాల వల్ల ఇట్టే దొరికి పోవాల్సి వస్తోందని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో జి.అమ్మేశ్వరరావు నివసిస్తున్న ఇల్లు మాకు ఏ పాపం తెలియదు ‘మేం తెనాలి చంద్రబాబుకాలనీ వాసులం. మాకు తెలియకుండా, మా ప్రమేయం లేకుండా మా సంతకాలు ఫోర్జరీ చేసి గౌరవ హైకోర్టులో మాకు ప్రభుత్వం వారు ఇచ్చిన ఇళ్ల స్థలాల గురించి కేసు వేసి స్టే ఉత్తర్వులు తీసుకున్నట్లు మాకు టీవీలు, పేపర్ల ద్వారా తెలిసింది. నాలుగేళ్ల క్రితం గుండెమెడ అమ్మేశ్వరరావు, ఎం. మల్లేశ్వరరావులు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామంటే ఆధార్కార్డులు, రేషన్ కార్డు జిరాక్స్లు ఇచ్చాము. తర్వాత ఎన్నిసార్లు అడిగినా స్పందించలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక మాకు ఇళ్ల స్థలాలు వచ్చాయి. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు వేయలేదు. మాకు తెలియకుండా మా వివరాలతో కేసు వేసిన కుట్రదారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోండి’ అంటూ గుంటూరు జిల్లా తెనాలికి చెందిన తుమ్మపూడి అశోక్కుమార్, పరుచూరు బేబీ సరోజిని, కొండా నాగమంజుల, కనికరం రాంబాబు, శేని సత్యవతి, ఎస్ లీలాప్రసాద్, చనగవరపు శివకుమారి, షేక్ జిలాని, భీమిశెట్టి రామ్మోహన్రావు తదితరులు తెనాలి త్రీటౌన్ పోలీసు స్టేషన్లో బుధవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. కుట్రదారులను విచారించండి ఈ ప్రభుత్వ వచ్చిన తర్వాత ‘నవరత్నాలు–పేదలందరికి ఇళ్లు’ పథకంలో భాగంగా తమకు ఇళ్ల స్థలాలు మంజూరు అయ్యాయని, స్థలాన్ని తమకు స్వాధీనం చేశారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము ఇళ్ల స్థలాల కోసం ఏ కోర్టులోనూ ఎటువంటి కేసులు వేయలేదని, ఏ ప్లీడర్ను కలవలేదని ఫిర్యాదులో వివరించారు. తమ వద్ద నుంచి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు తీసుకున్న గుండెమెడ అమ్మేశ్వరరావు, ఎం. మల్లేశ్వరరావు వారి రాజకీయ స్వలాభం కోసం తమ సంతకాలు ఫోర్జరీ చేసి హైకోర్టులో వేసిన ఈ కేసుతో తమకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ కుట్రకు పాల్పడిందెవరో పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. పేదల్లో కలవరం పేదలందరికీ ఇళ్ల పథకానికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 369, జీవో 488, జీవో 99లను సవాలు చేస్తూ గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పొదిలి శివమురళి, మరో 128 మంది గతేడాది డిసెంబర్లో హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు న్యాయమూర్తి మల్లవోలు సత్యనారాయణమూర్తి ఈనెల 8న ఇళ్ల పథకానికి బ్రేక్ వేస్తూ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పత్రికల ద్వారా తెలుసుకున్న పొదిలి శివమురళి ఈ కేసుతో తమకు సంబంధం లేదంటూ మీడియా ముందుకు రావడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఇళ్ల పథకాన్ని నిలిపివేయమని ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పులో తెనాలివాసుల పేర్లు ఉన్నాయన్న సమాచారం చాలా మంది పేదల్లో కలవరం కలిగించింది. పలువురు తమ పేరు ఉందేమోనన్న ఆందోళనతో పట్టణ 23వ వార్డులోని సచివాలయానికి వెళ్లారు. పిటిషనులో తమ పేర్లు ఉన్నాయేమో చూడాలని సచివాలయం సిబ్బందిని కోరారు. పిటిషన్లో పేర్లు లేని మరికొంత మంది కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామంటే అమ్మేశ్వరరావుకు డబ్బులు ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. చాలాసార్లు అతడి కోసం తిరిగి, ఆశలు వదిలేసుకున్నామని మీడియాకు తెలిపారు. పిటిషన్లో చనిపోయిన మహిళ పేరు ఇళ్ల స్థలాలపై హైకోర్టులో వేసిన పిటిషన్లో తెనాలికి చెందిన కొండెం ప్రమీల పేరు ఉంది. ఈ పిటిషన్ను గత ఏడాది డిసెంబర్లో వేశారు. అయితే కొండెం ప్రమీల అనారోగ్యంతో గత ఏడాది మార్చి 4వ తేదీ చనిపోయినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. చనిపోయిన ఈమె ఎలా పిటిషన్ వేస్తుందని ఆ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ఇద్దరి పేర్లు రిపీట్ అవ్వగా, కొందరి అడ్రస్లు తప్పుడువి ఇచ్చారు. చాలా మంది పిటిషన్లో పేర్కొన్న చిరునామాలలో ఉండటం లేదు. తొలుత ఈ వ్యవహారాన్ని ‘సాక్షి’ బయటపెట్టగానే తెలుగుదేశం నేతలు భుజాలు తడుముకోవడం పలు అనుమానాలకు దారితీసింది. పిటిషన్ దారుల్లో మొదటి వ్యక్తిగా చెబుతున్న పొదిలి శివమురళి తాను తమ కులపెద్ద ఎం.మల్లేశ్వరరావుకు ఆధార్కార్డు ఇచ్చానని చెబితే, తెనాలి ఎమ్మెల్యే పేరు చెప్పినట్లుగా వక్రీకరిస్తూ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా విలేకరుల సమావేశం పెట్టడంతో ఇందులో తెలుగుదేశం నాయకుల పాత్ర ఉన్నట్లు స్పష్టంగా అర్థం అవుతోంది. కేసు వేయించింది ఆలపాటి రాజాయే – తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ మండిపాటు ఇళ్ల స్థలాల పథకంపై హైకోర్టులో కేసు వేయించింది మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా అని తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మండిపడ్డారు. ఇళ్ల స్థలాల పథకంపై హైకోర్టును ఆశ్రయించిన పిటిషనుదారుల్లో ప్రథముడైన పొదిలి శివమురళి వీడియో సాక్షిగా చెప్పిన అంశాన్ని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా వక్రీకరించి, తనకు ఆపాదించాలని చూశారని విమర్శించారు. రికార్డు స్థాయిలో ఇళ్ల నిర్మాణం ద్వారా తెనాలిలో ఇక తనకు స్థానం లేదన్న దుగ్ధతో ఆలపాటి రాజానే ఈ కేసు వేయించారని చెప్పారు. దీని వెనుక ప్రజల్లో అనుమానాలు రేకెత్తించాలనే భారీ కుట్ర ఉందంటూ బుధవారం విలేకరుల సమావేశంలో నిప్పులు చెరిగారు. ముందుగా పిటిషనుదారుల్లో ఒకరైన పొదిలి శివమురళి మాట్లాడిన వీడియోను, దాని ఆధారంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆలపాటి రాజా ప్రెస్మీట్ వీడియోను మీడియా ఎదుట ప్రదర్శించారు. తాను నాయీబ్రాహ్మణ కులస్తుడినని, తన కులపెద్ద ఎం.మల్లేశ్వరరావుకు ఇళ్ల స్థలాల కోసమని డబ్బులు, ధృవీకరణ పత్రాలు ఇచ్చానని శివమురళి చెబితే, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు ఇచ్చానని చెప్పాడంటూ రాజా తనపై ఆరోపణ చేయటం ఏమిటని శివకుమార్ ప్రశ్నించారు. ఇళ్ల స్థలాలను అడ్డుకునే కుట్ర టీడీపీ కేంద్ర కార్యాలయంలోనే పురుడుపోసుకుందని చెప్పారు. పంచాయతీ కార్యాలయాలపై పార్టీ రంగులు తొలగించాలంటూ టీడీపీకి చెందిన వెంకట్రావుతో కేసు వేయించిందీ రాజానేనని చెప్పారు. క్రిమినల్ మైండ్ కలిగిన రాజా, కోర్టుల్లో తనకు అపారమైన పలుకుబడి ఉందని చెప్పుకుంటూ, సెటిల్మెంట్లు చేయటం అలవాటని ఆరోపించారు. టీడీపీకి చెందిన నన్నపనేని సుధాకర్ దగ్గర కోర్టు కేసు విషయంలో రాజా రూ.25 లక్షలు తీసుకున్నాడని తాను ఏడాది క్రితం ఆరోపించినట్టు ఆయన గుర్తు చేశారు. ఆ తర్వాత రెండు నెలలకు రూ.10 లక్షలు తిరిగి ఇచ్చాడనే విషయాన్ని సుధాకర్ స్వయంగా తనకు చెప్పారని తెలిపారు. -
హైకోర్టులో రిట్ అప్పీల్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం
సాక్షి, అమరావతి: పేదల ఇళ్ల పథకంపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్లో ఏపీ ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. రిట్ అప్పీల్ విచారణపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం కోసం న్యాయమూర్తులు పంపారు. ఈనెల 20న ఈ పిటిషన్పై విచారణ జరిగే అవకాశం ఉంది. -
ఏపీలోనే పేదల ఇళ్ల నిర్మాణం విస్తీర్ణం ఎక్కువ
సాక్షి, అమరావతి: పేదలకు ఇళ్ల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోంది. కేంద్ర నిబంధనలకు లోబడే పేదల ఇళ్ల నిర్మాణం చేపడుతోంది. ఏపీతో పోలిస్తే చాలా రాష్ట్రాల్లో నిర్మిస్తున్న ఇళ్ల విస్తీర్ణం తక్కువగా ఉంది. ఆయా రాష్ట్రాలు 247 చదరపు అడుగుల నుంచి 322 చదరపు అడుగుల మధ్యనే ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నాయి. అరుణాచల్ప్రదేశ్లో 255.1, ఉత్తరప్రదేశ్లో 291.7, నాగాలాండ్లో 292.45, ఉత్తరాఖండ్లో 293.74, ఒడిశాలో 302.14, తమిళనాడులో 304.08, జార్ఖండ్లో 305, జమ్మూకశ్మీర్లో 318.5 చ.అడుగుల్లోనే ప్రభుత్వాలు పేదల ఇళ్లు నిర్మిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద 30 లక్షల మంది పేదలకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం 340 చ.అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించి ఇస్తోంది. ఈ లెక్కన దేశంలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తున్న 7 రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో నిర్మిస్తున్న ఇళ్ల విస్తీర్ణం 18 నుంచి 93 చ.అడుగులు ఎక్కువగా ఉంటోంది. ఏపీ తరహాలోనే.. దేశంలో 12 రాష్ట్రాలు పేదల ఇళ్ల నిర్మాణానికి స్థలాలు పంపిణీ చేస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఏపీ తరహాలో లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన దాఖలాలు లేవు. 10 రాష్ట్రాలు ఇళ్లు పంపిణీ చేయడం లేదు. స్థలాలు పంపిణీ చేస్తున్న జాబితాలో ఉన్న యూపీ, మహారాష్ట్రల్లో ఏపీ తరహాలోనే 1 సెంటు, 1.5 సెంట్లను ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్నాయి. దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ కన్నా ఏపీనే ఎక్కువ ఇళ్లను నిర్మిస్తోంది. పక్కాగా సెట్బ్యాక్స్.. ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల్లో నేషనల్ బిల్డింగ్ కోడ్ (ఎన్బీసీ)–2016, ఏపీ బిల్డింగ్ రూల్స్–2017, ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిబంధనలను పక్కాగా పాటిస్తోంది. నిబంధనల ప్రకారం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ విస్తీర్ణాన్ని కేటాయిస్తూ ఇళ్ల నిర్మాణాలు చేపడుతోంది. -
‘పేదలందరికీ ఇళ్ల నిర్మాణం’పై ప్రభుత్వం అప్పీల్
సాక్షి, అమరావతి: పేదలందరికీ ఇళ్లు పథకం కింద పేదలకు ఇచ్చిన స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దంటూ సింగిల్ జడ్జి జస్టిస్ సత్యనారాయణమూర్తి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ మంగళవారం విచారణకు రానుంది. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తులు జస్టిస్ సత్యనారాయణమూర్తి, జస్టిస్ రావు రఘునందన్రావులతో కూడిన ధర్మాసనం విచారించనుంది. రిట్ పిటిషన్లో సింగిల్ జడ్జిగా జస్టిస్ సత్యనారాయణమూర్తి తీర్పు ఇచ్చారు కాబట్టి తన తీర్పుపై తానే విచారణ జరిపే అవకాశం ఉండదు. అందువల్ల ఆయన ఈ అప్పీల్ను మరో ధర్మాసనానికి నివేదించే అవకాశం ఉంది. ప్రభుత్వ అప్పీల్ విచారణ కోసం ప్రస్తుతం వెకేషన్ జడ్జీలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జస్టిస్ మంతోజు గంగారావు, జస్టిస్ రఘునందన్రావులతో ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఒకవేళ జస్టిస్ సత్యనారాయణమూర్తి ప్రభుత్వ అప్పీల్పై విచారణ అంత అత్యవసరం కాదని భావిస్తే విచారణను దసరా సెలవుల తర్వాతకు వాయిదా వేసే అవకాశం ఉంది. 30 లక్షల మంది లబ్ధిదారుల ప్రయోజనాలకు సంబంధించిన వ్యవహారాన్ని హైకోర్టు అత్యవసరం కాదని భావిస్తుందా? అనేదానిపై మంగళవారం స్పష్టత రానుంది. వాస్తవానికి ప్రభుత్వం.. తీర్పు వచ్చిన మరుసటి రోజే అత్యవసరంగా హౌస్ మోషన్ రూపంలో అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీల్పై విచారణ జరిపేందుకు సీజే అరూప్కుమార్ గోస్వామి సానుకూలంగా స్పందించారు. అయితే ఆయనకు బదిలీ ఉత్తర్వులు రావడంతో ప్రభుత్వ అప్పీల్ను పక్కన పెట్టారు. అయినప్పటికీ ప్రభుత్వం తన ప్రయత్నాలను విడిచిపెట్టలేదు. సోమవారం హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. వ్యాజ్యంపై విచారణ జరపాల్సిన అత్యవసరాన్ని, ఆవశ్యకతను ప్రభుత్వం అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి ద్వారా రిజిస్ట్రీకి వివరించింది. -
గతం కన్నా మిన్నగా.. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద పేదల ఇళ్ల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని నిబంధనలను అనుసరిస్తోందని, నేషనల్ బిల్డింగ్ కోడ్(ఎన్బీసీ), ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఎన్బీసీ నిబంధనలతో పోలిస్తే ఎక్కువ విస్తీర్ణంలోనే ఇళ్లను కడుతోందని వారు పేర్కొంటున్నారు. అలాగే గతంలో ప్రభుత్వాలు నిర్మించిన దాని కన్నా ఎక్కువ విస్తీర్ణంలోనే ఇళ్ల నిర్మాణం చేపడుతోందని గణాంకాలు చెబుతున్నాయి. అన్ని వసతులు ఉన్న పట్టణాల్లోని కాలనీల్లో 435.56 చదరపు అడుగుల స్థలంలో, గ్రామాల్లో 653.34 చదరపు అడుగుల స్థలంలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తోంది. ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న లబ్ధిదారులను న్యాయస్థానం తీర్పు ఎంతో నిరాశపరిచింది. ఎన్బీసీ నిబంధనలతో పోలిస్తే.. ఎన్బీసీ నిబంధనల ప్రకారం ఇంటిలో పడక గది, హాల్ విస్తీర్ణం 167 చ.అ ఉండాలి. ప్రస్తుతం ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లలో ఆ విస్తీర్ణం 169.54 చ.అ ఉంటోంది. అంటే పడక గది విస్తీర్ణం 97 చదరపు అడుగులకు గాను 97.07 చ.అడుగుల లోనూ, హాల్ విస్తీర్ణం 70 చ.అ గాను 72.47 చ.అడుగుల విస్తీర్ణంలోను ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తోంది. అదే విధంగా వంట గది 35.5 చ.అ లకు గాను 35.75 చ.అ ల్లో నిర్మిస్తున్నారు. బాత్రూమ్ విస్తీర్ణం 19.4 చ.అ లకు గాను 20.52 చ.అ ఉండేలా ఇళ్లకు ప్రణాళికను రూపొందించారని అధికారులు వివరించారు. గతంతో పోలిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల ప్లింత్ ఏరియా 215 చదరపు అడుగులు, కార్పెట్ ఏరియా 144 చదరపు అడుగులుగా ఉండేది. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఎన్టీఆర్ రూరల్ ఇళ్ల ప్లింత్ ఏరియా 224 చ.అ, కార్పెట్ ఏరియా 180 చ.అవిస్తీర్ణం. ప్రస్తుతం ప్రభుత్వం నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద నిర్మిస్తున్న ఇళ్ల ప్లింత్ ఏరియా 340చ.అ, కార్పెట్ ఏరియా 218.65 చ.అ విస్తీర్ణం ఉంటోంది. (సాధారణంగా కార్పెట్ ఏరియా అంటే గోడలు కాకుండా ఇంటిలో ఉపయోగించే స్థలాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. అదే గోడలు కలుపుకొని ఇంట్లోని మొత్తం స్థలాన్ని ప్లింత్ ఏరియాగా పరిగణిస్తారు. -
కేంద్ర విధానాల ప్రకారమే ఇళ్ల నిర్మాణ పథకం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: కేంద్ర ప్రభుత్వం సూచించిన విధివిధానాల ప్రకారమే రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణ పథకాన్ని చేపట్టామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పేదల ఇళ్ల నిర్మాణాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు బాధనిపించిందని తెలిపారు. విజయనగరంలో శనివారం ఉదయం బొత్స మీడియాతో మాట్లాడారు. న్యాయస్థానాలు, న్యాయమూర్తులు, వారి తీర్పులపై తమకు పూర్తి గౌరవం ఉందని చెప్పారు. న్యాయస్థానాల అభిప్రాయాలతో తామెప్పుడూ విభేదించబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ఇస్తున్న జీవోలను ఏ స్ఫూర్తితో ఇస్తున్నాం.. ఎవరి కోసం ఇస్తున్నాం అనే వాటిపై న్యాయస్థానాలు ఆలోచించాలని విన్నవించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ ఇంకా ఏమన్నారంటే.. సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్కు వెళ్తాం.. పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం స్థలం ఇవ్వడంతోపాటు దానికి తగ్గట్టుగా కొన్ని వేల కోట్ల రూపాయలతో సదుపాయాలు కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలను పేదలకు ఒక్కో ఇంటికి అందజేస్తోంది. కేంద్రం 220 చదరపు అడుగుల విస్తీర్ణంలో మాత్రమే ఇంటి నిర్మాణానికి అనుమతిస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం 270 చదరపు అడుగుల విస్తీర్ణంలో పేదలకు ఇళ్లు నిర్మిస్తోంది. ఇవే నిబంధనల ప్రకారం.. దేశమంతా కడుతున్న ఇళ్ల నిర్మాణాలను ఆపేస్తారా? అలా ఆపేస్తే.. పేదలకు అసలు ఇళ్లు ఉంటాయా?. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా రాష్ట్రంలో ఇళ్లు కావాలని 30 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారంటే.. వాటిని చూసి బాధపడాలో.. సిగ్గుపడాలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇళ్ల నిర్మాణాలపై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీల్కు వెళ్తాం (తర్వాత ప్రభుత్వం అప్పీల్కు వెళ్లింది). పేదలకు న్యాయం జరిగేలా చేస్తాం. పక్కా ఇళ్ల నిర్మాణమనే యజ్ఞాన్ని టీడీపీ నేతలు సాంకేతిక అంశాలను ఆసరా చేసుకుని అడ్డుకుంటున్నారు. తమ పలుకుబడితో వ్యవస్థలను మేనేజ్ చేస్తూ పేదల పొట్టకొడుతున్నారు. దీన్ని ప్రజలెవరూ హర్షించరు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన ఘనత చంద్రబాబుదే.. ప్రభుత్వంపై ఆరోపణలు చేసే ముందు ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒకసారి గతాన్ని గుర్తు చేసుకోవాలి. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన ఘనత బాబుదే. ఇరవై ఏళ్ల క్రితమే ప్రభుత్వ ఆస్తులను అమ్మిన ఆయనే ఇప్పుడు ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. గతంలో ఆయన అధిక టారిఫ్లకు విద్యుత్ కొనుగోలు చేయడం వల్లే ఇప్పుడు విద్యుత్ పంపిణీ సంస్థలు నష్టాల్లో కూరుకుపోయాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చెల్లించకుండా వదిలేసిన బకాయిలన్నింటినీ చెల్లిస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసి వెళ్లిన చంద్రబాబు ఇవాళ నీతి కబుర్లు చెబుతుండటం విడ్డూరం. -
పేదల ఆశలు, భావోద్వేగాలపై దెబ్బ కొట్టారు
జీవో 367లోని 3వ మార్గదర్శకాన్ని కొట్టేసిన సింగిల్ జడ్జి, అదే మార్గదర్శకం ప్రకారం లబ్ధిదారులకు కన్వేయన్స్ డీడ్స్ స్థానంలో డీ–ఫాం పట్టా ఇవ్వాలని ఆదేశించడం అనాలోచితం. పట్టణ ప్రాంతాల్లో ఒక సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో ఒకటిన్నర సెంటు భూమి సరిపోదని చెప్పారు. అది సరిపోదని ఏ చట్టంలో లేదు. లబ్ధిదారులకు ఎంత భూమి ఇవ్వాలన్నది పూర్తిగా ప్రభుత్వాల పరిధిలోని అంశం. లబ్ధిదారుల సంఖ్య, అందుబాటులో ఉన్న భూమి ఆధారంగా కేటాయింపు జరుగుతుంది. కేటాయింపు ప్రభుత్వ విధాన నిర్ణయం అయినప్పుడు ఎంత ఇవ్వాలన్న దానిపై ప్రభుత్వమే సరైన న్యాయ నిర్ణేత అవుతుంది. – రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ బిల్డింగ్ కోడ్ నిర్ధేశించిన విధానంలోనే ‘పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద నిర్మిస్తున్న ఇళ్లకు సంబంధించిన గదుల విస్తీర్ణం ఉంది. సింగిల్ జడ్జి ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా జీవోల్లోని పలు క్లాజులను కొట్టేశారు. చక్కటి ప్రణాళికతో రోడ్లు, లైట్లు, మంచి నీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్, పార్కులు, పాఠశాలలతో పాటు ఇతర కనీస వసతులు కల్పిస్తున్న విషయాన్ని విస్మరించారు. రాజ్యాంగ విధి విధానాలను, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ప్రభుత్వం మహిళల పేరుతో మాత్రమే పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఒక వేళ పురుషులకు, ట్రాన్స్జెండర్లకు సైతం పట్టాలు ఇవ్వాలన్నదే సింగిల్ జడ్జి ఉద్దేశం అయితే ఆ మేర ఆదేశం ఇవ్వాలే తప్ప, మహిళలకు ఇవ్వాలన్న మార్గదర్శకాన్ని మొత్తంగా కొట్టేసి ఉండకూడదు. – రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఇల్లు లేని పేదలకు ఇచ్చిన భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. ఆ తీర్పును రద్దు చేయాలని ధర్మాసనాన్ని కోరింది. పేదల కోసం సదుద్దేశంతో తీసుకొచ్చిన పథకాన్ని ఆపాలని ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా రాజ్యాంగం నిర్ధేశించిన హద్దులను, లక్ష్మణ రేఖను సింగిల్ జడ్జి దాటారని పేర్కొంది. సింగిల్ జడ్జి తీర్పు వల్ల 25 లక్షల మంది లబ్ధిదారులు ఎలా ముందుకెళ్లాలో తెలియక క్రాస్రోడ్లో నిల్చునే పరిస్థితి వచ్చిందని, వారి భావోద్వేగ బంధంపై దెబ్బ పడిందని తెలిపింది. మహిళలకే ఇళ్ల పట్టాలు ఇవ్వడాన్ని ఆక్షేపిస్తూ కోర్టుకెక్కిన పిటిషనర్లలో పలువురి భార్యలు ఇళ్ల పట్టాలు పొందారని వివరించింది. హౌస్ మోషన్ రూపంలో అత్యవసరంగా రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఈ అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై అత్యవసరంగా విచారణ జరపాలని రిజిస్ట్రీ ద్వారా ప్రధాన న్యాయమూర్తిని కోరింది. ఇందుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను, వివరాలను ప్రధాన న్యాయమూర్తి పరిశీలిస్తుండగానే, కేంద్ర ప్రభుత్వం ఆయన బదిలీకి సంబంధించి రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను నోటిఫై చేసింది. దీంతో ఈ అప్పీల్పై విచారించడం నైతికంగా సబబు కాదని భావించి, దీనిని పక్కనపెట్టారు. ప్రభుత్వ అప్పీల్లోని ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి. లబ్ధిదారుల మనసులో భయాందోళన ► ప్రజా సంక్షేమాన్ని ఆశించి ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలు.. ప్రాథమిక హక్కులకు, మానవ హక్కులకు రాజ్యాంగ విరుద్ధమన్న రీతిలో సింగిల్ జడ్జి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన గురించి పిటిషనర్లు తమ పిటిషన్లో ఎలాంటి అభ్యర్థన చేయలేదు. కానీ సింగిల్ జడ్జి మాత్రం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిందన్న అభిప్రాయానికి వచ్చారు. ► 25 లక్షల మందికి పట్టాలు ఇచ్చాం. అందులో 15.6 లక్షల మందికి ఇళ్లు మంజూరు అయ్యాయి. 9 లక్షల మంది ఇంటి నిర్మాణ పనులు చేపట్టి వాటిని పూర్తి చేసే దశలో ఉన్నారు. మిగిలిన వారు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. తమ తమ ఇళ్లపై లబ్ధిదారులు తమ కష్టార్జితాన్ని వెచ్చించారు. ఈ దశలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు వారి మనసులో తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. మౌలిక వసతుల కోసం ఇప్పటికే భారీగా ఖర్చు ► భూముల సేకరణ, లేఔట్ల రూప కల్పన, మౌలిక వసతుల కల్పన తదితరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్లు ఖర్చు చేసింది. ప్రజా సంక్షేమం కోసం ఇంత భారీ మొత్తాలను ఖర్చు చేసినప్పుడు ఈ పథకం చట్ట ప్రకారం తప్పు అన్న నిర్ణయానికి సింగిల్ జడ్జి వచ్చే ముందు పూర్తి స్థాయిలో మా వాదన వినిపించేందుకు అవకాశం ఇచ్చి ఉండాల్సింది. ► సింగిల్ జడ్జి తీర్పు వల్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం వచ్చింది. ఈ తీర్పు వల్ల నిర్మాణాలు నిలిచి పోవడంతో అది తమపై తీవ్ర ఆర్థిక భారం మోపుతుందన్న ఆందోళనలో లబ్ధిదారులు ఉన్నారు. సింగిల్ జడ్జి తీర్పు అటు ప్రభుత్వానికి, ఇటు లబ్ధిదారులకు పూడ్చలేని నష్టాన్ని కలిగిస్తుంది. అందువల్ల ఈ తీర్పు అమలును నిలుపుదల చేయాలి. ► సామాజిక అసమానతలను తొలగించి, లబ్ధిదారుల జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు రాజ్యాంగం నిర్ధేశించిన విధానాలకు లోబడి ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయంలో జోక్యం చేసుకునేటప్పుడు న్యాయమూర్తి స్వీయ నియంత్రణ పాటించాల్సింది. ► సింగిల్ జడ్జి తన తీర్పులో ప్రస్తుత కేసుకు వర్తించని అనేక అంశాలను ప్రస్తావించారు. వాదనల సందర్భంగా ప్రభుత్వం 8 తీర్పులను ప్రస్తావించింది. పిటిషనర్లు ఎలాంటి తీర్పులను ప్రస్తావించలేదు. అయితే సింగిల్ జడ్జి మాత్రం తన తీర్పులో ఏకంగా 77 తీర్పులను ప్రస్తావించారు. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో పరిధి దాటి వెళ్లకూడదు ► రాజ్యాంగంలోని అధికరణ 15(3)ను పరిగణనలోకి తీసుకుని పేదలందరికీ ఇళ్ల పథకం కింద మార్గదర్శకాలను రూపొందించింది. అధికరణ 15(3)కు విరుద్ధంగా ప్రభుత్వ ఉత్తర్వులు ఉంటే, వాటిని కొట్టేయవచ్చు. అయితే మహిళలు, పిల్లల సంక్షేమం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం తగదు. ► ప్రభుత్వ విచక్షణకు సంబంధించిన నిర్ణయాల్లో న్యాయస్థానం తన న్యాయ సమీక్ష పరిధి దాటి వెళ్లకూడదు. పిటిషనర్లు లేవనెత్తని అనేక అంశాలను సింగిల్ జడ్జి తన తీర్పులో ప్రస్తావించారు. ఇదే సమయంలో అనేక అంశాల్లో ప్రభుత్వానికి వాదన వినిపించే అవకాశం ఇవ్వలేదు. ► సింగిల్ జడ్జి తన తీర్పులో పర్యావరణ ప్రభావ అంచనా నోటిఫికేషన్, నేషనల్ బిల్డింగ్ కోడ్, ఏపీ బిల్డింగ్ రూల్స్ గురించి చర్చించారు. అయితే వీటి గురించి పిటిషనర్లు కనీస స్థాయిలో కూడా తమ పిటిషన్లో ఎలాంటి అభ్యర్థన చేయలేదు. దీంతో సింగిల్ జడ్జి లేవనెత్తిన చాలా అంశాలకు సమాధానం ఇచ్చే అవకాశం ప్రభుత్వానికి లేకుండా పోయింది. ► 25 లక్షల మంది లబ్దిదారుల వాదన కూడా వినకుండా సింగిల్ జడ్జి వారి ప్రయోజనాలకు విఘాతం కలిగేలా తీర్పు ఇచ్చారు. సాధారణంగా తీర్పు వల్ల ప్రభావితం అయ్యే వారికి నోటీసులు ఇచ్చి, వాదనలు వినడం పరిపాటి. కాని ఈ కేసులో సింగిల్ జడ్జి లబ్ధిదారులెవ్వరికీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వాదనలు వినకుండా తీర్పు ఇవ్వడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు ► ప్రధాన మంత్రి అవాస్ యోజన (పీఎంఏవై) పథకం మార్గదర్శకాల ప్రకారం ఇంటి విస్తీర్ణం విషయంలో నిర్ణయం తీసుకునే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అంతేకాక మహిళ పేరు మీదనే ఇంటి పట్టా ఇవ్వడం పీఎంఏవై మార్గదర్శకాలకు అనుగుణంగానే ఉంది. ► సింగిల్ జడ్జి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. వివరాలు కోరి ఉంటే వాటిని ఆయన ముందు ఉంచే వాళ్లం. లబ్ధిదారులకు కన్వేయన్స్ డీడ్ ఇవ్వాలా? లేక డీ–ఫాం పట్టా ఇవ్వాలా? అన్న అంశం హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ముందు పెండింగ్లో ఉంది. మళ్లీ కమిటీ అవసరం లేదు.. ► లబ్ధిదారులకు జరిపిన కేటాయింపులన్నింటికీ కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. కేంద్రం ఒక్కో యూనిట్కు రూ.1.5 లక్షల సబ్సిడీ కూడా ఇస్తోంది. పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వంగా కేంద్రం ఇచ్చే సబ్సిడీకి అదనంగా మరో రూ.30 వేలు సబ్సిడీ కింద మేం ఇస్తున్నాం. అంతేకాక లబ్ధిదారులకు గృహ నిర్మాణం నిమిత్తం ఇసుక ఉచితంగా ఇస్తున్నాం. ఇతర సామగ్రిని రాయితీ ధరకు అందజేస్తున్నాం. ఈ విషయాలను సింగిల్ జడ్జి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ► అందరికీ ఇళ్లు అన్నది ప్రధాన మంత్రి కల. దీని ప్రకారం 2022 నాటికి అందరికీ ఇళ్లు ఉండాలి. దీంతో నిర్ధిష్ట సమయం ప్రకారం ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంటుంది. పీఎంఏవై కింద దేశంలోనే అత్యధిక ఇళ్లు రాష్ట్రానికే మంజూరు అయ్యాయి. ఇందులో భాగంగా తక్కువ సమయంలోనే భూమిని లబ్ధిదారులకు అందుబాటులోకి తెచ్చాం. ► కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, సామాజిక న్యాయం, సాధికార శాఖ, ఆర్థిక శాఖల కార్యదర్శులతో కూడిన పర్యవేక్షణ కమిటీ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని.. రాష్ట్రానికి ఇళ్లను మంజూరు చేసింది. అందువల్ల సింగిల్ జడ్జి ఆదేశించిన విధంగా ఇప్పుడు తిరిగి మరో కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేనే లేదు. ► పేదలందరికీ ఇళ్ల పథకం పురోగతిని అడ్డుకునేలా ఆదేశాలు ఇస్తే అది పేదలపై, ప్రభుత్వ దార్శనికతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. లబ్ధిదారులు సొంత ఇంటి నిర్మాణం కోసం తమ కష్టార్జితాన్ని వెచ్చించారు. వారి ఇంటిపై వారికి భావోద్వేగ బంధం ఏర్పడింది. ఇప్పుడు సింగిల్ జడ్జి తీర్పు వారిపై భావోద్వేగ ప్రభావాన్ని చూపుతుంది. ► గతంలో ఉన్న గృహ నిర్మాణ పథకాలకన్నా ఈ పథకం ఉత్తమమైంది. ఈ విషయాన్ని గుర్తించడంలో సింగిల్ జడ్జి విఫలమయ్యారు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయాలి. -
కృష్ణా జిల్లాలో ఏడుగురు ఏఈలపై చర్యలు
గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఇళ్ల పథకంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏడుగురు హౌసింగ్ ఏఈలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కృష్ణాజిల్లా కలెక్టర్ జె.నివాస్ వెల్లడించారు. పథకం అమలుపై మండల స్థాయి అధికారులతో గురువారం సాయంత్రం నందిగామ నియోజకవర్గం వీరులపాడు తహసీల్దార్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గృహ నిర్మాణ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ల నిర్లక్ష్యం కారణంగా ఇళ్ల నిర్మాణం కోస జిల్లాకు కేటాయించిన 750 టన్నుల ఉక్కు ఇతర జిల్లాలకు తరలిపోయిందన్నారు. జగనన్న కాలనీలలో లే అవుట్లు పూర్తి అయి, ఇళ్ల నిర్మాణానికి అనుకూలంగా ఉన్నా ఇంకా గ్రౌండింగ్ చేయని లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేసి వెంటనే నిర్మాణం చేపట్టేలా ఏఈలు చూడాలన్నారు. ఈ విషయంలో ప్రగతి సాధించని ఏఈలను సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. డ్వాక్రా మహిళలకు రుణం రాని కారణంగా ఇళ్ల నిర్మాణానికి కొందరు ముందుకు రావడం లేదన్న కారణం సరికాదని, వారికి ఇచ్చే రుణాలు ఇళ్ల నిర్మాణానికి అదనపు సహాయం మాత్రమేనని చెప్పారు. వీరిపై శాఖాపరమైన చర్యలు... గృహ నిర్మాణ శాఖ ఏఈలు పి.సుబ్బారావు (అవనిగడ్డ), బి.నెహ్రూ (కంకిపాడు), ఎన్.వెంకటేశ్వరరావు (నందిగామ), వెంకటేశ్వరరావు(చందర్లపాడు), సీహెచ్ ఎస్ఎస్ఆర్వీ ప్రసాద్ (విజయవాడ రూరల్), ఎన్.సాయిబాబు (వీరులపాడు), ఎ.నరసింహారావు (కంచికచర్ల) లపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. -
ఏపీ గృహ నిర్మాణశాఖ రివర్స్ టెండరింగ్తో భారీగా ఆదా
సాక్షి, అమరావతి: ఏపీ గృహ నిర్మాణ శాఖలో చేపట్టిన రివర్స్ టెండరింగ్ సత్పాలితాలనిస్తోంది. తాజాగా వెల్లడైన నివేదికల్లో భారీగా ఆదా అయినట్టు గృహ నిర్మాణశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. దీని ప్రకారం తొలివిడతలో 6500 కోట్ల రూపాయలు మిగలనున్నాయి. ఒక్కో ఇంటి వ్యయంపై రూ.32,821 ఆదా అవుతున్నాయి. ఒక్కో ఇంటికి 14 వస్తువులకు రూ. లక్షా 31 వేల 676 ఖర్చు అవుతుండగా.. రివర్స్ టెండరింగ్లో రూ. 88 వేల 854కు భారం తగ్గింది. లబ్ది దారులు కోరుకున్న ఐఎస్ఐ మార్క్ ఉన్న వస్తువులే ఏపీ ప్రభుత్వం సరఫరా చేయనుంది. ఉచిత ఇసుక సరఫరాతో కలిపి లబ్ధిదారులకు 6500 కోట్ల రూపాయలు ఆదా అవనుంది. ఇసుక కాకుండా 14 రకాల వస్తువులపై 5 వేల 120 కోట్ల రూపాయలు ఆదా అవనుంది. చదవండి: ఆంధ్రప్రదేశ్లో 20న మొహర్రం సెలవు -
నవరత్నాలు-పేదలందరికి ఇళ్ల నిర్మాణంపై మంత్రి అవంతి సమీక్ష
-
టీడీపీ అసత్య ప్రచారాలు నమ్మొద్దు : మంత్రి అనిల్
-
ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా వైఎస్సార్ జగనన్న కాలనీల్లో తొలి దశలో చేపట్టిన ఇళ్ల నిర్మాణంపై గృహనిర్మాణ శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈనెల 1, 3, 4 తేదీల్లో ‘మెగా ఇళ్ల శంకుస్థాపన’ కార్యక్రమాన్ని చేపట్టి.. రికార్డు స్థాయిలో గృహాల నిర్మాణానికి భూమిపూజలు చేయించారు. రెండ్రోజుల నుంచి లబ్ధిదారులుకు బిల్లులు చెల్లించడానికి వీలుగా వారి వివరాలను గృహనిర్మాణ శాఖ వెబ్సైట్లో నమోదు చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. శనివారం రాత్రి 8 గంటలకు 7,87,917 మంది లబ్ధిదారుల వివరాలను వెబ్సైట్లో నమోదు చేశారు. ఈ కార్యక్రమాన్ని గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్, గృహనిర్మాణ సంస్థ ఎండీ నారాయణభరత్ గుప్తా పర్యవేక్షించారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, సిమెంట్, స్టీల్ వంటి వాటిని లేఅవుట్లకు చేర్చాలని అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలకు ఎన్.కమలాకరబాబు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఎం.శివప్రసాద్, కర్నూలు, వైఎస్సార్, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు సీఈ శ్రీరాములును ప్రత్యేక అధికారులుగా నియమించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్దేశించిన మేరకు 2022 జూన్ నాటికి తొలి దశ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని అజయ్జైన్ అధికారులను ఆదేశించారు. -
‘ప్రతి లే-అవుట్లో పండగ వాతావరణం కనపడుతుంది’
గుంటూరు: ఆంధ్రప్రదేశ్లో జగనన్న ఇళ్ల నిర్మాణాలు ఒక యజ్ఞంలా జరుగుతున్నాయని ఏపీ గృహనిర్మాణ శాఖా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిరుపేదల సొంతింటి కల సీఎం జగన్ వలన సాకారమైందని తెలిపారు. ఏపీలోని ప్రతి లే-అవుట్లో పండగ వాతావారణం కనపడుతోందని, అదే విధంగా, పేదలకోసం.. 5 లక్షల 7 వేల ఇళ్లకు శంకుస్థాపనలు జరుగుతున్నాయని అన్నారు. అదే సమయంలో జగనన్న కాలనీల వలన చాలా మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుందని తెలిపారు. -
‘తూర్పు’న జగనన్న ఇచ్చిన పొదరిల్లు
రంగంపేట: మేడంటే మేడా కాదు.. గూడంటే గూడూ కాదు.. పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది.. అంటూ దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన గీతం గుర్తొస్తుంది ఈ దంపతుల ఆనందం చూస్తుంటే. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం పెదరాయవరానికి చెందిన ఈ భార్యాభర్తల పేర్లు ఇళ్లపు సత్తిబాబు, దుర్గాభవాని. ఇద్దరూ వ్యవసాయ కూలీలు. కుమారులిద్దరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. సొంతిల్లు లేక ఈ కుటుంబం నానా అవస్థలు పడేది. పోరంబోకు స్థలంలో పూరిగుడిసెలో తలదాచుకునేవారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద పెదరాయవరంలో 195 మందికి ప్రభుత్వం ఇంటిపట్టాలు, ఇళ్లు మంజూరు చేసింది. వీటిలో దుర్గాభవాని పేరిట కూడా పట్టా, ఇల్లు మంజూరయ్యాయి. ఈ కాలనీలో 71 మంది ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సత్తిబాబు, దుర్గాభవాని దంపతులు ఎంతో ఉత్సాహంతో సొంతింటి కలను సాకారం చేసుకోడానికి వెంటనే నిర్మాణానికి పూనుకున్నారు. నిర్మాణానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనలో అధికారులు చేదోడువాదోడుగా నిలిచారు. ఇప్పటివరకు రూ.1.01 లక్షలు, డ్వాక్రా ద్వారా మరో రూ.50 వేలు మంజూరయ్యాయి. 50 బస్తాల సిమెంట్, ఇసుక ఉచితంగా అందజేశారు. దీంతో కొద్దిరోజుల్లోనే ఇంటి నిర్మాణం పూర్తిచేశారు. అంతేకాదు.. శనివారం (ఈ నెల 3న) గృహప్రవేశం చేయనున్నారు. జిల్లాలోని జగనన్న కాలనీల్లో మొదటగా జరుగుతున్న వీరి గృహప్రవేశానికి అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, జిల్లా జాయింటు కలెక్టర్ (హౌసింగ్) ఎ.భార్గవ్తేజ్ హాజరుకానున్నారు. ఇళ్ల లబ్ధిదారులంతా ఈ దంపతుల మాదిరిగా త్వరితగతిన ఇళ్లు నిర్మించుకుంటే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశించిన కొత్త ఊళ్లు త్వరలోనే సాక్షాత్కారమవుతాయి. ఇప్పటివరకు సత్తిబాబు, భవానీ ఉన్న ఇల్లు జగనన్న దయతో.. ఎన్నో ఏళ్లుగా సొంత ఇల్లులేక ఇబ్బందులు పడుతున్నాం. ఇద్దరు పిల్లలతో రోడ్డు పక్కన పూరి గుడిసెలో జీవనం సాగిస్తున్నాం. పిల్లలు పెద్దవాళ్లు అవుతున్న తరుణంలో సొంత ఇల్లు ఉంటే బాగుంటుందని అనుకునేవాళ్లం. గత ప్రభుత్వంలో అర్జీలు పెట్టుకున్నాం. సెంటు భూమి కూడా ఇవ్వలేదు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలందరికీ ఇళ్లు ఇస్తామన్న మాట నెరవేర్చి మాలాంటి వాళ్ల బతుకుల్లో ఆనందం నింపారు. – సత్తిబాబు, దుర్గాభవాని, పెదరాయవరం సౌకర్యాల నిలయాలు పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు సందడిగా సాగుతున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే దిశగా జాతీయ స్థాయి ప్రమాణాలకు మించి లోగిళ్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. గత సర్కారు హయాంలో కంటే అదనంగా 116 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లను కడుతున్నారు. ఉచితంగా గృహోపకరణాలు, కాలనీల్లో మెరుగైన మౌలిక వసతులు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇళ్ల నిర్మాణం ద్వారా వైఎస్సార్ – జగనన్న కాలనీల్లో పేదలకు ఉత్తమ జీవన ప్రమాణాలు సమకూరనున్నాయి. దేశ చరిత్రలోనే తొలిసారిగా పేదలందరికీ 30.76 లక్షల ఇళ్ల పట్టాలను అక్క చెల్లెమ్మల పేరుతో పంపిణీ చేసి, రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణంలోనూ అంతే వేగంగా ముందుకు వెళుతోంది. ఇళ్ల స్థలాలు పొందిన వారికి రెండు దశల్లో మొత్తం 28,30,227 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నాడు అలా ► టీడీపీ సర్కారు హయాంలో 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు, 24 చదరపు అడుగుల్లో టాయిలెట్ నిర్మించారు. ► ఒక బెడ్ రూం, వంటగదితో కూడిన లివింగ్ రూమ్ నిర్మించారు. ► 2014–19 మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.8,082.89 కోట్లతో 6,03,986 ఇళ్లను మాత్రమే నిర్మించారు. ► మౌలిక సదుపాయాల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. నేడు ఇలా ► ఉత్తమ జీవన ప్రమాణాలతో ఇళ్లు నిర్మించేలా డిజైన్. ► 340 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం. ► ఒక బెడ్రూం, లివింగ్ రూం, కిచెన్, టాయిలెట్, వరండా. ► ఉచితంగా రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్ లైట్లు, నాలుగు బల్బ్లు, సింటెక్స్ ట్యాంక్. ► కాలనీల్లో రహదారులు, డ్రైనేజీ, ఇతరత్రా సౌకర్యాల కల్పన -
ఏపీలో భారీగా ఇళ్ల నిర్మాణం
-
YS Jagan: ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం..
ఎకానమీకి బూస్ట్... కోవిడ్ సమయంలో ఈ ఇళ్ల నిర్మాణం ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుంది. ఎందుకంటే కార్మికులకు సొంత ఇళ్ల వద్దే పెద్ద ఎత్తున ఉపాధి దొరుకుతుంది. కార్పెంటర్లు, ప్లంబర్లు లాంటి రకరకాల వృత్తుల వారికి దీర్ఘకాలం ఉపాధి లభిస్తుంది. స్టీల్, సిమెంట్ తదితర గృహ నిర్మాణ సామగ్రి కొనుగోలు చేయడం వల్ల వ్యాపార లావాదేవీలు సజావుగా కొనసాగి ఎకానమీ బూస్ట్ అవుతుంది. కాబట్టి దీనికి చాలా ప్రాధాన్యం ఇవ్వాలి. ఇళ్ల నిర్మాణంలో లెవలింగ్ చాలా ముఖ్యం. దాదాపు 1.95 లక్షల ప్లాట్లకు ఈ సమస్య ఉంది. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ – జగనన్న కాలనీల్లో జూన్ 1వ తేదీన తొలిదశ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను ఈ నెల 25 నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కోవిడ్ సమయంలో ఇళ్ల నిర్మాణ కార్యకలాపాలు చేపట్టడం వల్ల ఆర్థిక వ్యవస్థకు వృద్ధి చేకూర్చడమే కాకుండా కార్మికులకు పెద్ద ఎత్తున పని దొరుకుతుందని.. స్టీల్, సిమెంట్ ఇతర మెటీరియల్ కొనుగోళ్లతో వ్యాపార లావాదేవీలు సాఫీగా కొనసాగుతాయని సీఎం పేర్కొన్నారు. కర్ఫ్యూ సమయంలోనూ ఈ పనులేవీ ఆగకూడదని, మధ్యాహ్నం 12 వరకు యథావిధిగా కార్యకలాపాలు కొనసాగించాలని సూచించారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’, వైఎస్సార్–జగనన్న కాలనీల్లో వసతుల కల్పన, టిడ్కో ఇళ్ల నిర్మాణాలపై సీఎం బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ.. సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇళ్ల పనులేవీ ఆగకూడదు.. జగనన్న కాలనీలలో జూన్ 1న ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలి. ఆ మేరకు ఈనెల 25 నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి. కర్ఫ్యూ ఉన్నప్పటికీ ఆ పనులేవీ ఆగకూడదు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు యథావిథిగా కార్యకలాపాలు కొనసాగించాలి. ఇళ్ల నిర్మాణానికి నీరు, విద్యుత్ కీలకం కాబట్టి వెంటనే ఆ ఏర్పాట్లు చేసుకోవాలి. మోడల్హౌస్ తప్పనిసరి.. ప్రతి లేఅవుట్లో తప్పనిసరిగా ఒక మోడల్ హౌస్ నిర్మించి సమగ్ర నివేదిక తెప్పించుకోవాలి. ఎక్కడైనా నిర్మాణ వ్యయం అంచనాను మించి పోయిందా? ఇంకా ఎక్కడైనా వ్యయాన్ని నియంత్రించవచ్చా? ఇంకా బాగా ఇంటి నిర్మాణం ఎలా చేయవచ్చు..? లాంటి అంశాలను ఆ నివేదిక ఆధారంగా సమీక్షించాలి. సొంతంగా కట్టుకుంటే మెటీరియల్.. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో స్టీల్ వినియోగం తగ్గి రేట్లలో తేడా వచ్చే వీలుంది. నిజానికి స్టీల్ ఫ్యాక్టరీలు ఆక్సిజన్ను కూడా ఉత్పత్తి చేస్తున్నాయి కాబట్టి ఉత్పత్తి ఆగదు. మనకు 7.50 లక్షల టన్నుల స్టీల్ కావాలి. స్టీల్ కంపెనీలతో ప్రత్యేకంగా మాట్లాడండి. ఎవరైనా సొంతంగా ఇల్లు నిర్మించుకుంటామంటే కాదనవద్దు. వారికి కావాల్సిన మెటీరియల్ తప్పనిసరిగా అందించాలి. అన్ని వసతులు ఉండాలి.. కేవలం ఇళ్లు నిర్మించడమే కాదు. తగిన మౌలిక వసతులు కూడా కల్పించాలి. లేఅవుట్ పక్కాగా ఉండాలి. సీసీ రోడ్లు, భూగర్భ సీసీ డ్రెయిన్లు, నీటి సరఫరా (జేజేఎం), విద్యుదీకరణ, ఇంటర్నెట్ లాంటివి మౌలిక వసతుల్లో ముఖ్యమైన కాంపోనెంట్స్. కరెంటు, నీటి సరఫరాతో పాటు రోడ్లు కూడా నిర్మించాలి. అవి లేకపోతే ఆ ఇళ్లలోకి ఎవరూ రారు. భూగర్భ కేబుల్ వ్యవస్థ.. భవిష్యత్తులో అంతా భూగర్భ కేబుల్ వ్యవస్థే. ఒక్కసారి వేసిన తర్వాత పెద్దగా సమస్యలు కూడా ఉండవు. నీటి పైపులైన్లు, విద్యుత్ కేబుళ్లు, ఇతర కేబుళ్లు కూడా భవిష్యత్తులో పూర్తిగా భూగర్భంలోనే వేయబోతున్నారు. ఆ పనులు చేసేటప్పుడు లోతు, నీరు, విద్యుత్, ఇంటర్నెట్ కేబుళ్ల మధ్య దూరం తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్త పడాలి. కేంద్రాన్ని అదనపు నిధులు కోరదాం.. ఈ స్థాయిలో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా నిధులు కోరదాం. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో కేంద్రం ఎలాగూ వాటా ఇస్తోంది. ప్రభుత్వం ఇంత పెద్ద స్థాయిలో ఇళ్లు నిర్మిస్తోంది కాబట్టి అదనపు నిధుల కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేద్దాం. టిడ్కో ఇళ్లపై పెయింటింగ్స్ తప్పనిసరిగా వేయాలి. వాటిని అన్ని వసతులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి. ఏడాదిలో ఇళ్లు పూర్తి రాష్ట్రంలో చేపట్టిన వివిధ ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుల వివరాలపై సమావేశంలో అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, వైఎస్సార్ అర్బన్–బీఎల్సీ తొలి దశ కింద మొత్తం 15,60,227 ఇళ్లు మంజూరు కాగా కోర్టు వివాదాల్లో 71,502 ఇళ్లు ఉన్నాయని, అందువల్ల వాటికి ప్రత్యామ్నాయం కోరుతూ లేఖ రాసినట్లు వెల్లడించారు. మిగిలిన 14,88,725 ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు మంజూరు ప్రక్రియ కూడా పూర్తి చేశామని తెలిపారు. ఇప్పటికే 13,71,592 ఇళ్లకు సంబంధించి వెబ్సైట్లో మ్యాపింగ్ జరిగిందని వివరించారు. ఒక లే అవుట్లో పనులన్నీ ఒకే కంపెనీకి అప్పగిస్తే సమన్వయ లోపం, డూప్లికేషన్కు తావు ఉండదని అధికారులు ప్రతిపాదించారు. 81,040 టిడ్కో ఇళ్లు 90 శాతం పూర్తి జగనన్న లేఅవుట్లలో పనులు ఈ జూన్లో మొదలు పెట్టి సెప్టెంబరు నాటికి బేస్మెంట్, డిసెంబరు నాటికి గోడల నిర్మాణాలు, వచ్చే ఏడాది జూన్ నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. టిడ్కో ఇళ్లలో 81,040 దాదాపు పూర్తయ్యే దశ (90 శాతం పనులు)లో ఉండగా మరో 71,448 ఇళ్లు 75 శాతం పూర్తయ్యాయని చెప్పారు. సమీక్షలో పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్, మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, గృహ నిర్మాణ సంస్థ ఎండీ నారాయణ భరత్గుప్తాతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇళ్ల నిర్మాణం
వైఎస్సార్ జగనన్న కాలనీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉండేలా చూడాలి. రోడ్ల నిర్మాణం జనాభాకు అనుగుణంగా ఉండాలి. ఒకసారి అన్ని లేఅవుట్లను మళ్లీ పరిశీలించి అన్ని సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలి. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సుందరీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలి. నిధుల కొరత లేకుండా చూసుకుంటూ, వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి. ప్రజలకు మంచి జీవన ప్రమాణాలు అందాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: వైఎస్సార్ జగనన్న కాలనీలు ఆదర్శంగా ఉండాలే తప్ప, ఎట్టి పరిస్థితుల్లో మురికి వాడలుగా మారకూడదని సీఎం వైఎస్ జగన్ అధికారులకు స్పష్టం చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేదలకు ఇళ్లు ఇస్తున్నామని, అవి సౌకర్యవంతంగా ఉండాలని చెప్పారు. కాలనీల సుందరీకరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ప్రతి లేఅవు ట్ను మళ్లీ పరిశీలించి అందంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. పేదలకు ఇళ్ల నిర్మాణంపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి సకాలంలో నిధులు విడుదలయ్యేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. ఏయే సమయాల్లో ఏ మేరకు నిధులు విడుదల చేయాలన్న దానిపై ప్రణాళిక రూపొందించాలన్నారు. ఇందువల్ల పేదల ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా ముందుకు సాగుతాయని చెప్పారు. లబ్ధిదారులందరితో ఆప్షన్లు తీసుకోవాలి ►తొలి విడతలో దాదాపు 15 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం. మూడు ఆప్షన్లలో ఏదో ఒకదాన్ని ఇప్పటికే 83 శాతం మంది లబ్ధిదారులు ఎంపిక చేసుకున్నందున, మిగతా వారి నుంచి కూడా వెంటనే ఆప్షన్లు స్వీకరించాలి. ►3 ఆప్షన్లలో లబ్ధిదారులు ఏ ఆప్షన్ ఎంచుకున్నా, వారికి సబ్సిడీపై సిమెంట్, స్టీల్ అందించాలి. బయట మార్కెట్లో కన్నా తక్కువ ధరకే లభిస్తున్నందన ఆ అవకాశం అందరికీ వర్తింపచేయాలి. సామగ్రి అందరికీ అందుబాటులో ఉంచాలి. ►దీనివల్ల తామే ఇళ్లు కట్టుకుంటామంటూ ఆప్షన్ ఎంచుకున్న వారికి లబ్ధి చేకూరుతుంది. ఏ ఆప్షన్ ఎంపిక చేసుకున్నా, వారికి తక్కువ ధరలకు సామగ్రి లభ్యం అయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. దీనివల్ల లబ్ధిదారులకు మేలు జరుగుతుంది. ►కాలనీల్లో జనాభాకు తగినట్టుగా రోడ్లు, ఇతరత్రా మౌలిక సదుపాయాలు ఉండాలి. కాలనీల డిజైనింగ్, మౌలిక సదుపాయాల విషయంలో ఇంకా ఏవైనా చర్యలు తీసుకోవాల్సి ఉంటే వెంటనే ఆ పనులు పూర్తి చేయాలి. మంచి మొక్కలు నాటాలి ►వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ప్రతి 2 వేల జనాభాకు అంగన్వాడీ కేంద్రం ఉండాలి. 1500 నుంచి 5 వేల ఇళ్లకు లైబ్రరీ అందుబాటులో ఉండాలి. పార్కులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ►కాలనీల్లో మొక్కలు నాటే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఏవంటే అవి కాకుండా ఆహ్లాదం, ఆరోగ్యాన్ని అందించే మొక్కలను నాటాలి. మంచి వృక్ష జాతులను ఎంచుకోవాలి. ఇంటి ముందు నుంచి వీధి రోడ్లు, కాలనీ ప్రధాన రోడ్ల వరకు మొక్కలను నాటడానికి మార్కింగ్ వేసుకోవాలి. ►అన్ని ఇళ్లను జియో ట్యాగింగ్ చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. సమీక్షలో మంత్రులు బొత్స, చెరుకువాడ, చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ పాల్గొన్నారు. మధ్యతరగతి ప్రజల కాలనీల డిజైన్లు పరీశీలన పట్టణాలు, నగరాల్లో మధ్య తరగతి ప్రజలకు సరసమైన ధరలకు ప్లాట్లు ఇవ్వడం ద్వారా ఏర్పాటు కానున్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు ఎలా ఉండాలన్న దానిపై సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా కాలనీల డిజైన్లను ఆయన పరీశీలించారు. రోడ్ల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పార్కులు, ఇతర మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలకు అత్యుత్తమ జీవన ప్రమాణాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలనీల్లో పారిశుధ్యం, పరిశుభ్రత విషయంలో ఉత్తమ విధానాలను అనుసరించాలని సూచించారు. -
మనం కట్టేవి ఇళ్లు కావు.. ఊళ్లు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స సత్యన్నారాయణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. డిసెంబర్ 25న ఇళ్ల స్థలాలు పంపిణీతో పాటు అదే రోజు ఇళ్ల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. డిసెంబర్ 25 నుంచి జనవరి 7 వరకూ కార్యక్రమం కొనసాగనుంది. అన్ని నియోజకవర్గాల్లో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు.(చదవండి: ఏలూరు ఘటనపై సీఎం జగన్ సమీక్ష) కోర్టు కేసులు వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా చూడాలని, న్యాయస్థానాల ముందు తగిన వివరాలు ఉంచాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. లబ్ధిదారులు ఎలా కావాలంటే.. అలా ఇళ్లు కట్టించి ఇస్తామని సీఎం తెలిపారు. ‘‘లబ్ధిదారులు ఇళ్లు కట్టించి ఇవ్వమంటే.. ఇళ్లు కట్టించి ఇస్తాం. మెటీరియల్ ఇవ్వండి, లేబర్ కాంపొనెంట్కు సంబంధించి డబ్బు ఇవ్వండి అంటే అది చేస్తాం. లేదు డబ్బులు ఇవ్వండి అంటే డబ్బులు ఇస్తాం, ఇళ్లు లబ్ధిదారుడు కట్టుకోవచ్చు. ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో ముందుకెళ్లాలి. ఇళ్ల నిర్మాణం ప్రారంభించిన తర్వాత శరవేగంతో పనులు సాగాలి. దీని కోసం ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగాలి. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత చాలా ముఖ్యమని’’ సీఎం స్పష్టం చేశారు. (చదవండి: బాబు గారి కపట నాటకం) ప్రతి లేఅవుట్ను ఒక యూనిట్గా తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. ఆ లేఅవుట్లో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి సెంట్రింగ్ వంటి పనులకు అవసరమైన సామాగ్రిని అక్కడే సిద్ధం చేసుకోవాలని, దీని వల్ల సమయం ఆదా అవ్వడంతో పాటు ఇళ్ల నిర్మాణం చురుగ్గా ముందుకు సాగుతుందని సీఎం తెలిపారు. ఇటీవల వర్షాలను దృష్టిలో ఉంచుకుని, ఆయా లే అవుట్లలో అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు. అవసరమైన విధంగా డ్రైయిన్లు నిర్మాణం, ఇతరత్రా చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అసౌకర్యం లేకుండా, సమస్యలు లేకుండా చూడాలని.. ప్రతి లే అవుట్పైనా సమగ్ర పరిశీలన, అధ్యయనం చేయాలని, దీని తర్వాత తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. మనం కట్టేవి ఇళ్లు కావు, ఊళ్లన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఏ పని చేసినా కాలనీల అందాన్ని పెంచేలా చూడాలి. వీధి లైట్ల దగ్గర నుంచి అక్కడ ఏర్పాటు చేసే ప్రతి సదుపాయంపైనా దృష్టి పెట్టాలి. ప్రతి లే అవుట్లో నమూనా ఇంటిని (మోడల్ హౌజ్) నిర్మించాలని’’ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ♦మొత్తంగా 30.75 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు ♦3,65,987 ఇళ్లస్థలాలపై కోర్టు కేసులు ♦ఇళ్ల స్థలాల కోసం 68,361 ఎకరాల సేకరణ ♦రూ.23,535 కోట్ల విలువైన ఇళ్ల స్థలాల పంపిణీ ♦కోర్టు కేసులు కారణంగా ఇళ్ల స్థలాలు ఇవ్వలేక పోతున్న ప్రాంతాల్లో లబ్ధిదారులుగా ఎంపికైన వారికి, కేసులు పరిష్కారం కాగానే పట్టా ఇస్తామంటూ లేఖ ఇవ్వాలని నిర్ణయం ♦వచ్చే మూడేళ్లలో 28.3 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక ♦పట్టాలు ఇచ్చిన ప్రాంతాల్లో డిసెంబర్ 25నే 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభం ♦175 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 8,914 ఇళ్లు చొప్పున పనులు ప్రారంభం ♦8,838 కొత్త లే అవుట్లలో 11.26 లక్షల ఇళ్ల నిర్మాణం ♦రెండో దశలో 12.7 లక్షల ఇళ్ల నిర్మాణం ♦టిడ్కో ఇళ్లలో 365, 430 చదరపు అడుగుల ఫ్లాట్లపై సీఎం ప్రకటించిన తాజా రాయితీల ప్రకారం అదనంగా రూ.482 కోట్ల ఖర్చును భరించనున్న ప్రభుత్వం ♦300 చదరపు అడుగుల ఫ్లాట్లను కేవలం రూ.1 రూపాయికే ఇవ్వనున్న ప్రభుత్వం -
బాబు కుటుంబాన్ని తిడుతూనే ఉంటా: కొడాలి
సాక్షి, కృష్ణా : రాష్ట్రంలో పేదలకు అందించే ఇళ్ల స్థలాలు మహిళల పేరు మీదే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. గురువారం గుడివాడలో పర్యటించిన మంత్రి కొడాలి మీడియాతో మాట్లాడారు. కొన్ని చోట్ల న్యాయస్థానం స్టే ఇవ్వడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ అడ్డంకుల కారణంగా ఇళ్ళ స్దలాల పంపిణీ వాయిదా వేశామన్నారు. ఎవరు ఎన్ని కేసులు వేసినా వాటన్నింటిని పరిష్కరించుకొని మహిళల పేరునే రిజష్ట్రేషన్ చేసి ఇళ్ల స్దలాలు అందిస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో పనిలేని వారే తనపై అనవసర ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. తనపై ఎంతమంది వ్యతిరేకంగా మాట్లాడినా చంద్రబాబు కుటుంబాన్ని తిడుతూనే ఉంటానని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. (చదవండి : రాజధాని విషయంలో మా జోక్యం ఉండదు) -
‘చేయూత’ డబ్బుపై బ్యాంకులకు హక్కు లేదు: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలోనే చేపడతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. రూ.22వేల కోట్ల విలువైన ఆస్తులను.. 30లక్షల మంది అక్కాచెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేయబోతున్నామని హర్షం వ్యక్తం చేశారు. ఇళ్ల పట్టాల పంపిణీ సహా వివిధ అంశాలపై సీఎం వైఎస్ జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాట్ల అభివృద్ధి, మార్కింగ్, ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కాగా టీడీపీ నాయకుల తీరు కారణంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘దేశంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం జరగలేదు. మంచి కార్యక్రమానికి శత్రువులు ఎక్కువగా ఉన్నారు. చంద్రబాబు, టీడీపీ నేతలు కేసులు వేసి అడ్డుకుంటున్నారు. ఆ సమస్యలను అధిగమించేందుకు వివిధ వేదికలపై పోరాటం చేయాల్సి వస్తోంది. కొంత సమయం పట్టినా చివరకు న్యాయమే గెలుస్తుంది’’ అని పేర్కొన్నారు.(చదవండి: కోవిడ్ చికిత్సలకు అధిక రేట్లు.. సీఎం జగన్ సీరియస్) పనులు వేగంగా జరగాలి: సీఎం జగన్ గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ నిర్మాణంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ‘‘ప్రతి జిల్లాలో ప్రతి వారం రూ.10 కోట్ల మెటీరియల్ కాంపౌనెంట్ పనులు జరగాలి. పనులు వేగంగా జరగాలి’’అని ఈ సందర్బంగా అధికారులను ఆదేశించారు. అదే విధంగా పాఠశాలల్లో నాడు- నేడు కార్యక్రమంపై సమీక్ష సమావేశంలో భాగంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అంగన్వాడీ పాఠశాలను వైఎస్సార్ ప్రీప్రైమరీ స్కూల్స్గా మారుస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో 55వేల అంగన్వాడీల్లో నాడు-నేడు కింద పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంపై కలెక్టర్లు, జేసీలు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. సెప్టెంబర్ 5 నుంచి స్కూళ్లు తెరవాలనే ఆలోచన ఉన్నందున.. అంతకంటే ముందే వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.(చదవండి: అవినీతిపై బ్రహ్మాస్త్రం) వైఎస్సార్ చేయూత, స్వయం సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ‘వైఎస్సార్ చేయూత’ ద్వారా ఆర్థిక సహాయం అందించామని.. బ్యాంకులకు ఈ డబ్బుపై ఎలాంటి హక్కు లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఎక్కడైనా సమస్యలు వస్తే కలెక్టర్లు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. మహిళలకు స్థిరమైన జీవనోపాధి మార్గాలను చూపడానికి.. హిందూస్థాన్, యూనిలీవర్, ఐటీసీ, పీ&జి, రిలయన్స్, అమూల్.. అలానా గ్రూపులతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామన్న ముఖ్యమంత్రి.. రాష్ట్ర స్థాయిలో ప్రతి 15 రోజులకోసారి మంత్రుల బృందం రివ్యూ చేస్తుందని తెలిపారు. మహిళలు ఎంపిక చేసుకున్న జీవనోపాధి మార్గాల్లో చేయూతనివ్వాలని.. వారికి ఏం కావాలో దగ్గరుండి చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. (చదవండి:‘ చేయూత’తో స్వయం సమృద్ధి) ఎరువులు పంపిణీ చేయండి: సీఎం జగన్ మండలాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని ఒక యూనిట్గా తీసుకుని ఎరువులు పంపిణీ చేయాలని సీఎం జగన్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అదే విధంగా నూటికి నూరు శాతం ఇ-క్రాపింగ్ పూర్తి చేసి.. వ్యవసాయ యాంత్రీకరణపై కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ‘‘రైతుల గ్రూపులను ఏర్పాటు చేసి యంత్రాలను డెలివరీ చేయాలి. మండల స్థాయిలో కూడా రైతులతో గ్రూపులను ఏర్పాటు చేయాలి. వర్షాలు బాగా పడినందున ఎరువుల డిమాండ్ పెరుగుతుంది. రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులను పంపిణీ చేయాలి. ప్రతి రైతు భరోసా కేంద్రం పరిధిలో ఒక ఎకరా భూమిని గుర్తించాలి’’అని ఆదేశించారు. ‘‘మల్టీపర్పస్ ఫెసిలిటీస్ను ఏర్పాటు చేస్తున్నాం. అదే విధంగా గోడౌన్లు, పంట ఆరబెట్టుకోవడానికి ప్లాట్ ఫాం, ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు.. పశువుల శాఖ, కలెక్షన్ సెంటర్ కార్యకలాపాల కోసం వసతులు ఏర్పాటు చేయనున్నాం’’ అని తెలిపారు. -
మోడల్ హౌస్ నిర్మాణాన్ని పరిశీలించిన మంత్రి
సాక్షి, తాడేపల్లి: తాడేపల్లి సీతానగరం వద్ద హౌసింగ్ కార్పొరేషన్ నిర్మిస్తున్న మోడల్ హౌస్ నిర్మాణాన్ని గృహ నిర్మాణ శాఖా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అన్ని జిల్లాలో కూడా మోడల్ హౌస్లు నిర్మించి.. ఇదే తరహాలో పేదలు ఇళ్ళు నిర్మించుకునేందుకు అవసరమైన ముడిసరుకు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అన్ని గృహాలకు ఇసుక ఉచితంగా ఇస్తున్నామని.. సిమెంట్ వంటి సరుకులకు తక్కువ ధరకు అందిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో ఇల్లు 2.5 లక్షలు ఖర్చు కావాల్సి ఉంటే సబ్సిడీలతో 1.80 లక్షలకు నిర్మించి ఇస్తున్నామని పేర్కొన్నారు. (అక్కాచెల్లెమ్మలకు ఆస్తి ఇవ్వాలనే: సీఎం జగన్) అదే విధంగా అర్బన్లో ఇండిపెండెంట్ హౌస్ నిర్మాణమే జరుగుతుందని స్పష్టం చేశారు. త్వరలోనే ఈ మోడల్ నిర్మాణాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా పరిశీలిస్తారని వెల్లడించారు. ‘‘పేదలకు తొలుత 25 లక్షల ఇల్లు ఇవ్వాలని సీఎం జగన్ భావించారు. అయితే రాష్ట్రంలో సర్వే నిర్వహించిన తర్వాత 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ఒక బెడ్ రూమ్, హాలు, బాత్ రూమ్, కిచెన్, వరండా ఉండే విధంగా పేదలకు ఇళ్లు నిర్మించనున్నాం’’అని శ్రీరంగనాథరాజు తెలిపారు. -
దీన్ని బ్లాక్ డేగా చెప్పుకోవాలి: వాసిరెడ్డి పద్మ
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలోని దాదాపు 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడాన్ని పండగలా జరపాలనుకున్నామని.. ఇలాంటి కార్యక్రమానికి రాజకీయ పార్టీలు అడ్డు పడటం దారుణమని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ఇస్తున్న ఇళ్ల పట్టాలను ప్రతిపక్షాలు అడ్డుకోవడాన్ని ‘బ్లాక్ డే’ గా చెప్పుకోవాలని విమర్శించారు. రాజకీయ పార్టీలు తాత్కాలికంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఆపవచ్చు గానీ.. ప్రభుత్వం త్వరలోనే చెప్పిన విధంగా అర్హులకు ఇళ్ల పట్టాలను అందిస్తుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ మహిళలకు వీరోచిత చరిత్ర ఉంది.. ఏదైనా పోరాడి సాధించుకోగలరని పేర్కొన్నారు. మంగళవారమిక్కడ ఆమె మాట్లాడుతూ.. మహిళలకు ఇస్తున్న ఇళ్ల పట్టాలను ఇవ్వకుండా టీడీపీ అడ్డుకుంటుందని ధ్వజమెత్తారు. ‘‘గతంలో ఏ ప్రభుత్వానికి రాని ఆలోచన మా ప్రభుత్వానికి వచ్చింది. ఇళ్ల పట్టాలు మహిళల పేరు మీద ఇచ్చేందుకు సిద్ధం చేసింది. మహిళలను ఆర్ధికంగా ఆదుకునేందుకు రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అనుకుంది. గత సంవత్సరం కాలం నుంచి మహిళల స్థితిగతులలో మార్పు కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో అన్ని రంగాల్లో మహిళలకు ఈ ప్రభుత్వం 50 శాతం మహిళలకు కేటాయిస్తోంది. అన్ని పథకాలకు సంబంధించిన నగదు నేరుగా మహిళల అకౌంట్లోకే వేస్తోంది. మద్యం అమ్మకాలని గణనీయంగా తగ్గించి దేశానికే ఆదర్శంగా నిలిచింది. ప్రభుత్వ నిర్ణయానికి దేశ వ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. సినీతారలు, ఇతర రాష్ట్రాల రాజకీయ నాయకులు, క్రీడాకారులు, ఇలా అన్ని రంగాలకు చెందిన మహిళలు అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్నీ ప్రశంసిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా అమలు చేయాలని కోరుతున్నారు. గత ప్రభుత్వాలు ప్రకటనల్లో తప్ప నిజ జీవితంలో మహిళలను పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న ఇళ్ల పట్టాలను ప్రతిపక్షాలు అడ్డుకోవడాన్ని ఒక బ్లాక్ డే గా చెప్పుకోవాలి’’ అని వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రాజకీయ పార్టీల తీరు దారుణం
-
రూపాయి కూడా అప్పు లేకుండా ఇల్లు..
-
పేదలకు ఏపీ ప్రభుత్వం మరో తీపి కబురు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేద ప్రజలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. గత ప్రభుత్వం పేదలకు పెట్టిన ఇళ్ల బకాయిలను చెల్లించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 3,38,144 ఇళ్లకు గానూ రూ.1,323 కోట్లు చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వం బకాయిపెట్టినా, పేదలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని సీఎం వ్యాఖ్యానించారు. ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా ఈ చెల్లింపులు చేయాలని సీఎం స్పష్టం చేశారు. నిధులు సమీకరించుకుని చెల్లింపులకు ఒక తేదీ ప్రకటించాలని సీఎం అధికారులకు చెప్పారు. పేదలకు ఇళ్ల నిర్మాణంపై సీఎం తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, గృహనిర్మాణశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్జైన్సహా అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. (చదవండి: మోదీపై విశ్వాసం: టాప్-5లో సీఎం జగన్) మొదటి విడతలో చేపట్టబోయే 15 లక్షల ఇళ్ల నిర్మాణంపై సమీక్షించిన సీఎం అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. వైజాగ్, కర్నూల్, నెల్లూరు జిల్లాల్లో మొదటి దశలో చేపట్టబోయే ఇళ్ల సంఖ్యను పెంచేలా చూడాలని సీఎం ఆదేశించారు. నిర్దేశిత డిజైన్లో భాగంగా పేదలకు నిర్మించబోయే ఇళ్లలో అందిస్తున్న సదుపాయాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. డిజైన్లో భాగంగా బెడ్ రూం, కిచెన్, లివింగ్ రూం, టాయిలెట్, వరండా సహా సదుపాయాలు ఉండేలా చూస్తున్నామని సీఎం తెలిపారు. ఇళ్ల నిర్మాణంలో అన్ని రకాల జాగ్రత్తలు, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సీఎం తెలిపారు. సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. ‘పేదవాడిపై ఒక్క రూపాయి అప్పు లేకుండా ఇంటిని సమకూర్చాలి. పేదలకు ఇళ్లు ఇవ్వాలన్న సదుద్దేశంతో ఈ భారీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అత్యంత పారదర్శకంగా, నాణ్యతతో ఈ కార్యక్రమం కొనసాగాలి. పేదల ముఖాల్లో చిరునవ్వులు చూడాలి. గవర్నమెంటు అంటే నాసిరకం అనే పేరుపోవాలి, గవర్నమెంటు చేస్తే నాణ్యతతో పనిచేస్తుందనే పేరు రావాలి. పేదలకోసం చేస్తున్న ఈకార్యక్రమంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తే పుణ్యం దక్కుతుంది. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఇళ్లపట్టాలు, ఇళ్ల నిర్మాణం కార్యక్రమాలు చేపడుతున్నాం’అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. (చదవండి: మూడు రోజులు శ్రీవారి దర్శనం ట్రయల్ రన్) ఇళ్ల నిర్మాణం ద్వారా ఏర్పడుతున్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపైనా, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా జులై 8న పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ కార్యక్రమంపైనా సీఎం సమీక్షించారు. భౌతిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని ఆయన సూచించారు. వారికి కేటాయించిన స్థలంవద్దే అక్కచెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి తెలిపారు. -
దాదాపు 30 లక్షల మందికి.. గృహ యోగం!
సాక్షి, అమరావతి: నాలుగేళ్లలో 30 లక్షల గృహాలు.. మరో సంచలన నిర్ణయంతో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు దాదాపు 30 లక్షల ఇళ్లను నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. నాలుగేళ్లలో వీటి నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. గృహ నిర్మాణశాఖపై శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి శ్రీరంగనాథరాజు, అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. గూడులేని నిరుపేదల సొంతింటి కలను 2024 నాటికి నెరవేర్చే దిశగా ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇళ్లపై పూర్తిస్థాయిలో దృష్టి పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన కార్యాచరణ, ఏటా చేరుకోవాల్సిన లక్ష్యాలపై సమావేశంలో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం ఇవ్వనున్న ఇళ్ల పట్టాలు, నిర్మించాల్సిన ఇళ్లపై పూర్తిస్థాయిలో సమీక్షించారు. పట్టణ, నగరాభివృద్ధి సంస్థలు, గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల నిర్మాణంపై కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా ఇప్పటివరకు మంజూరైన వాటి వివరాలను పరిశీలించారు. రాష్ట్రానికి ఇంకా ఎన్ని ఇళ్లు మంజూరు కావడానికి ఆస్కారం ఉందో గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ మేరకు నిధులు అవసరమవుతాయో సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎం సమీక్షలో ఇతర ముఖ్యాంశాలు... – ఈ ఉగాదికి పేదలకు 26.6 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ. – ప్రస్తుతం పట్టాలు పొందే పేదలతోపాటు సొంతంగా ఇళ్ల స్థలాలున్న పేదలకూ ఇళ్లు మంజూరు. – రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాల్టీలు, నగరాభివృద్ధి సంస్థల పరిధిలో 19.3 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక. – ఒక పడక గది, వంట గది, వరండా, మరుగుదొడ్డి ఉండేలా ఇళ్ల డిజైన్ తయారీ. – ఇళ్లన్నీ ఒకే నమూనాలో అత్యంత నాణ్యంగా, అందంగా ఉండేలా నిర్మాణం. – 14,097 వైఎస్సార్ జగనన్న కాలనీల నిర్మాణం. – గృహ నిర్మాణ శాఖలోని 4,500 మంది ఇంజనీర్లతోపాటు గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్తగా నియమించిన 45 వేల మంది సిబ్బంది పేదలకు అందచేసే 30 లక్షల ఇళ్ల నిర్మాణ క్రతువులో పాలుపంచుకుంటారు. – అధిక వడ్డీలతో పేదలు ఇతరులపై ఆధారపడాల్సిన దుస్థితి లేకుండా గృహాల నిర్మాణం పూర్తయిన తర్వాత ఒక్కో ఇంటిపై రూ.25 వేల వరకు పావలా వడ్డీకే బ్యాంకు రుణం అందచేసి మిగిలిన వడ్డీని ప్రభుత్వమే భరిస్తుంది. – పేదల కోసం నిర్మిస్తున్న కాలనీల్లో పెద్ద ఎత్తున చెట్లు నాటడంతో పాటు సమగ్ర మురుగునీటి వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. – కాలనీల్లో విద్యుత్, తాగునీటి సదుపాయాలు కల్పిస్తారు. -
ఉగాది నాటికి 26.6 లక్షల ఇళ్ల పట్టాలు
ప్రతిపేదవాడికి సొంతింటికలను నిజం చేసే దిశగా ప్రభుత్వం బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఉగాది రోజున 26.6 లక్షల ఇళ్లపట్టాల పంపిణీకి సిద్ధమైన ప్రభుత్వం.. వచ్చే నాలుగేళ్లలో 30లక్షలకుపైగా ఇళ్లను నిర్మించడానికి కార్యాచరణను సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ గృహనిర్మాణ రంగంలో కొత్త చరిత్రను సృష్టించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు సమాయత్తమైంది. 2024 నాటికి ఈ కలను సాకారం చేసేదిశగా అడుగులేస్తోంది. సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం గృహ నిర్మాణ శాఖ అధికారులతో క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పుడిస్తున్న ఇళ్లపట్టాలు, నిర్మించాల్సిన ఇళ్లపై పూర్తిస్థాయిలో సమీక్షించారు. ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రతిఏటా నిర్మించాల్సిన లక్ష్యాలపైనా చర్చించారు. పట్టణ, నగరాభివృద్ధి సంస్థలు, గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు, వాటినుంచి ఇప్పటివరకూ మంజూరైన ఇళ్ల వివరాలను సీఎం వైఎస్ జగన్ అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమల్లో భాగంగా ఇంకా ఎన్ని ఇళ్లు రాష్ట్రానికి మంజూరు అవడానికి ఆస్కారం ఉందన్న అంశాలపై అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేందుకు ఆస్కారం ఉన్న నిధులు, అదిపోనూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ మేరకు నిధులు అవసరమన్న దానిపై చర్చించారు. మొత్తం మీద ఈ ఉగాది నాటికి 26.6 లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వనున్నామని, వచ్చే నాలుగేళ్లలో 30 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించబోతున్నామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. సమావేశంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మహా క్రతువులో 45 వేల మంది.. ఇప్పుడు పట్టాలు పొందుతున్న పేదలతోపాటు, సొంతంగా ఇళ్లస్థలాలు ఉన్న పేదలకూ ఇళ్లు నిర్మిస్తామని, మున్సిపాలిటీలు, నగరాభివృద్ధి సంస్థల పరిధిలోనే దాదాపు 19.3 లక్షలకుపైగా ఇళ్లను నిర్మించడానికి ప్రణాళికలు వేసినట్టు అధికారులు సీఎంకు తెలిపారు. గృహనిర్మాణ శాఖలో ఉన్న 4,500 మంది ఇంజనీర్లతోపాటు గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్తగా నియామకం అయిన సిబ్బందిలో 45 వేల మంది కూడా 30 లక్షల ఇళ్ల నిర్మాణ క్రతువులో భాగస్వాములు అవుతారని అధికారులు వెల్లడించారు. మొత్తంగా 45వేల మంది సిబ్బందితో ఈ మహాక్రతువును నిర్వహిస్తామని చెప్పారు. నాణ్యంగా.. అందంగా.. ఇళ్లన్నీ ఒకే నమూనాలో ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. డిజైన్లో కొన్ని మార్పులు చేర్పులు సూచించారు. నిర్మాణం అత్యంత నాణ్యంగా, అందంగా ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. బెడ్రూం, కిచెన్, వరండా, టాయిలెట్ ఉండేలా డిజైన్ రూపొందించారు. ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇంటిపై రూ.25వేల రూపాయల వరకు పావలా వడ్డీకే రుణం ఇచ్చేలా బ్యాంకులతో మాట్లాడాలని, మిగిలిన వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందని సీఎం అధికారులకు తెలిపారు. అత్యవసరాలకు ఈ డబ్బు పేదవాడికి చాలా మేలు చేస్తుందని, అధిక వడ్డీలు చెల్లిస్తూ ఇతరులపై ఆధారపడే పరిస్థితి ఉండదని సీఎం అన్నారు. పేదలకు కడుతున్న కాలనీల్లో చెట్లు నాటాలని, డ్రైనేజీ ఏర్పాటుపైనా సరైన ప్రణాళిక అమలు చేయాలని సీఎం ఆదేశించారు. కరెంటు, తాగునీటి వసతి కూడా కల్పించాలన్నారు. -
ఉగాది నాటికి 26.6 లక్షల ఇళ్ల పట్టాలు
-
ఇళ్లు కనిపించడం లేదు.. కాస్త వెతికి పెట్టండి
సాక్షి, చెన్నై: గృహ నిర్మాణ పథకం కింద తమకు ప్రభుత్వం కట్టి ఇచ్చిన ఇళ్లు కనిపించడం లేదని ఓ దంపతులు నామక్కల్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇది కాస్త గృహ నిర్మాణ పథకం విభాగ అధికారులకు ముచ్చెమటలు పట్టించింది. నామక్కల్ జిల్లా పరమత్తి వేలూరు పచ్చ పాళయంకు చెందిన మురుగేష్, కవిత దంపతులు శనివారం కలెక్టరేట్కు వచ్చారు. తమ వద్ద ఉన్న ఫొటోలు, ఇతర ఆధారాల్ని కలెక్టరేట్లోని ఫిర్యాదుల విభాగానికి సమర్పించారు. గతంలో తమకు ప్రభుత్వం తరఫున గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు మంజూరైనట్టు ఫిర్యాదులో వివరించారు. ఇంటి పనులకు పునాదులు వేసే సమయంలో అధికారులు వచ్చారని, ఆ తర్వాత ఏ ఒక్కరూ అటు వైపుగా రాలేదని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం ఆ గృహ నిర్మాణం పూర్తైనట్టు, తమకు ఆ గృహాన్ని కేటాయించినట్టు రికార్డుల్లో పేర్కొన్నారని వివరించారు. ఈ విషయంగా గ్రామ అధికారుల్ని నిలదీయగా, ఇళ్లు కట్టి ఇచ్చేశామని, ఇక, తమకు సంబంధం లేదని తేల్చినట్టు పేర్కొన్నారు. తమకు కట్టి ఇచ్చినట్టుగా చెబుతున్న ఇళ్లు ప్రస్తుతం కనిపించడం లేదని, దీనిని తమరే కనిపెట్టి ఇవ్వాలని కలెక్టర్కు విన్నవించుకున్నారు. అయితే, ఆ దంపతులకు గృహం నిర్మించి, కేటాయించినట్టుగా రికార్డుల్లో ఉండడంతో, ఈ నిధుల్ని స్వాహా చేసిన వాళ్లెవ్వరో అన్న ప్రశ్న బయలు దేరింది. దీంతో గృహ నిర్మాణ పథకం విభాగం స్థానిక అధికారుల్లో టెన్షన్ బయలుదేరింది. తమకు ఇళ్లు నిర్మించి ఇవ్వకుండానే, ఇచ్చేసినట్టుగా లెక్కలు తేల్చిన దృష్ట్యా, ఆ ఇళ్లు కనిపించ లేదని, కలెక్టరేట్లో ఫిర్యాదు చేశామని, దీనిపై కలెక్టర్ విచారించి తమకు న్యాయం చేకూర్చాలని మీడియాతో మాట్లాడుతూ, ఆ దంపతులు విజ్ఞప్తి చేసుకున్నారు. -
లెక్క తప్పించారా?
ప్రభుత్వ ఆదేశాలపై గత ప్రభుత్వ గృహ లబ్ధిదారుల అర్హత పరిశీలన మమ అనిపించిన అధికారులుజిల్లాలో 34,382 గృహాల మంజూరు, నిర్మాణాలు సక్రమమేనట! వీటికి రూ.105.9 కోట్ల బిల్లులు ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదిక అనర్హమైనవిగా తేల్చిన గృహాలు 1,454 గత ప్రభుత్వంలోనే వెలుగులోకి అక్రమాలు గృహనిర్మాణశాఖ నివేదికలపై అనుమానాలు గత టీడీపీ పాలనలో మంజూరు చేసిన పక్కాగృహాల లబ్ధిదారుల అర్హతపై పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. పరిశీలనలో అధికారులు తేల్చిన నిజాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.ప్రధానంగా గత ప్రభుత్వంలో 2018 నవంబర్లో మంజూరైన ఇళ్లల్లో 2,270 ఇళ్లను పరిశీలిస్తేఅందులో 1,308 నిర్మాణస్థాయి, ఫొటోల్లోతేడాలున్నట్టు గుర్తించారు. 962 ఇళ్ల నిర్మాణాలు మాత్రమే సక్రమంగా ఉన్నాయని నిర్ధారించారు. ప్రస్తుతం అధికారులు పరిశీలించిన 35,836 ఇళ్లల్లో 1,454 గృహాలు అనర్హులకు కేటాయించారని తేల్చారు. మిగిలినవన్నీ అర్హులకే కేటాయించారని బిల్లులు చెల్లించాలని నివేదించడంపైఅనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బి.కొత్తకోట: ప్రభుత్వ చర్యల నుంచి తప్పించుకునేందుకు ఇళ్ల కేటాయింపులో అక్రమాలను అధికారులు తక్కువ చేసి చూపారని తెలుస్తోంది. దీనికోసమే అనర్హత లెక్క మొక్కుబడిగా వేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వంలో జిల్లాకు 55,351 ఇళ్లను మంజూరు చేయగా వాటిలో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఎన్నికల ముందు నుంచి బిల్లులు పెండింగ్లో పెట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బిల్లుల విషయంలో లబ్ధిదారులు నిజమైన అర్హులా.. కాదా తేల్చాలని ఆదేశించింది. ఇందులో జిల్లాకు సంబంధించి 35,836 ఇళ్లకు బిల్లులు చెల్లించాల్సి ఉండగా.. వీటిని పరిశీలించి అర్హులను తేల్చాలని ప్రభుత్వం ఆదేశిస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. ఆ మేరకు వలంటీర్లు, పంచాయతీ కార్యదర్శులు, హౌసింగ్ ఏఈలు భాగమై చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వంలో అనర్హులకు, టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఇళ్లను పంచిపెట్టారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయం పరిశీలనలో వెల్లడిస్తే తమకు ఇబ్బందులు తప్పవని అధికారులు లెక్క తక్కువగా చూపించారని తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా అనర్హులకు ఇచ్చినవి 1,454 గృçహాలు మాత్రమే అని తేల్చారు. అందులోఅతి తక్కువగా తంబళ్లపల్లె నియోజకవర్గంలో9, జీడీ నెల్లూరులో 20,కుప్పంలో 36 గృహాలు అనర్హులకు ఇచ్చారని గుర్తించారు. అనర్హులు పోగా మిగిలిన లబ్ధిదారులకు రూ.105.9కోట్ల బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి నివేదించారు. పంచుకున్నారు గత ప్రభుత్వంలో పక్కా గృహాలను టీడీపీ గ్రామ, మండల స్థాయి నాయకులు, జన్మభూమి కమిటీలు, కార్యకర్తలు పంచుకున్నారు. ఒక్క గృహ నిర్మాణానికి రూ.1.50 లక్షలు మంజూరు చేసిన ప్రభుత్వం మూడు విడతల్లో ఇళ్లు మంజూరు చేసింది. 2016–17లో తొలి ఇళ్ల కేటాయింపులో టీడీపీ శ్రేణులకే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. రెండో విడతలోనూ ఇదే పరిస్థితి ఉండగా మూడో విడతలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇళ్లను కేటాయించింది. ఇళ్ల నిర్మాణాల్లో వాస్తవ ప్రమాణాలు పాటించకపోగా అనర్హులకు ఇచ్చిన కారణంగా పెద్దపెద్ద భవంతులు నిర్మించుకున్నారు. సాధారణ లబ్ధిదారులు రూ.లక్షన్నరతో కూడుబెట్టుకున్న కొద్దిపాటు సొమ్ముతో జీవించగలిగేలా ఇళ్లను నిర్మించుకుంటే అనర్హులు ఖరీదైనా విశాలమైన భవనాలు నిర్మించారు. ఇవికూడా అర్హుల జాబితాలో చేరడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చర్యలకు భయపడే గృహాల కేటాయింపులో అనర్హులు అధిక సంఖ్యలో ఉన్నట్టు నిర్ధారించి నివేదిస్తే అందుకు అప్పట్లో పనిచేసిన అధికారులకు చిక్కులొస్తాయని, అలాగే అప్లోడ్ చేసిన బిల్లులు మంజూరు కాకుంటే ఇబ్బందులు తప్పవని భావించి లెక్క తక్కువ చేశారన్న అనుమానాలు ఉన్నాయి. పరిశీలన ప్రారంభమైన సెప్టెంబర్ 11 నుంచి 23వ తేదీ వరకు ఒక్క అనర్హుడు లేరని నివేదించగా దీనిపై ‘ఏరివేతలో మాయ’ శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైన తర్వాత నివేదిక పంపే నాటికి అనర్హులు జాబితా 1,454కు ఎలా చేరిందో అధికారులకే తెలియాలి. టీడీపీ హయాంలోనే తేల్చారు గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణాలపై 2018 నవంబర్లో ఉన్నతస్థాయి అధికారులు జిల్లాలో 2,270 ఇళ్లకు బిల్లు మంజూరుకోసం అప్లోడ్ చేసిన ఫొటోలను పరిశీలిస్తే 962 గృహాలు మాత్రమే సక్రమంగా ఉన్నట్టు తేల్చారు. మిగిలినవ్నీ నిర్మాణ స్థాయికి మించి బిల్లులు అప్లోడ్ చేయడం, నిబంధనలు పాటించ లేదని నిర్ధారించారు. ఇందులో మాజీ సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పం మండలంలో 49 ఇళ్లను పరిశీలిస్తే ఒక్కటీ సక్రమంగా లేదు. పూతలపట్టు మండలంలో 22 ఇళ్లు, పాలసముద్రం మండలంలో 14, చిన్నగొట్టిగల్లు మండలంలో 14, యర్రావారిపాళ్యం మండలంలో 27 గృహ నిర్మాణాల్లో ఒక్క ఇల్లు కూడా నిర్మాణ బిల్లు మంజూరు స్థాయిలో లేదని నిర్ధారించారు. తిరుపతిలో 32 గృహాలకు 7, చిత్తూరులో 115 గృహాలకు 31, మదనపల్లెలో 59 గృహాలకు 28, పుంగనూరులో 84 గృçహాలకు 66, శ్రీకాళహస్తిలో 83 గృహాలకు 8, నగరిలో 80 గృహాలకు 63, పలమనేరులో 27 గృహాలకు 14, పుత్తూరులో 79 గృహాలకు 50 గృహాలు మాత్రమే సక్రమంగా ఉన్నట్టు నిర్ధారించారు. మిగిలిన గృçహాలకు సంబంధించిన తప్పులను గుర్తించారు. గత ప్రభుత్వంలోనే అక్రమాలు జరినట్టు నిర్ధారణ జరిగితే ప్రస్తుత పరిశీలనలో అక్రమాల లెక్కను తక్కువ చేసి చూపడం తీవ్ర చర్చనీయాంశమైంది. పరిశీలనలో తేలిందిదే ప్రభుత్వం ఆదేశాల ప్రకారం గత ప్రభుత్వంలో మంజూరై, బిల్లులు చెల్లించాల్సిన గృహాలపై నిర్వహించిన పరిశీలనలో తేలిన వాస్తవాలనే నివేదించారు. అర్హతలేని వారికి 1,454 గృహాలు మంజూరు చేసినట్టు తేలింది. ఈ మేరకే ప్రభుత్వానికి నివేదించి మిగిలిన ఇళ్లకు రూ.105కోట్ల బిల్లులు చెల్లించాలని ప్రతిపాదించాం. – నగేష్,ఇన్చార్జ్ పీడీ, చిత్తూరు -
లక్షణంగా ఇళ్లు
జిల్లాలోని పట్టణ ప్రాంతాల పరిధిలో గూడులేని నిరుపేదలసొంతింటి కల నెరవేరనుంది. 2020 జనవరికి జిల్లావ్యాప్తంగా లక్ష గృహాల లక్ష్యం నెరవేరనుంది. ఇప్పటికే రెండు విడతల్లో 49,157 గృహాలకు మోక్షం కలిగింది. మూడో విడతలో మరో 52,215 గృహాల మంజూరుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతి పాదించినట్లు జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ నగేష్ తెలిపారు. వీటిని ఈ నెల 30వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఆమోదించనున్నట్లు తెలియజేశారు. చిత్తూరు అగ్రికల్చర్: గూడులేని నిరుపేదలకు పక్కాగృహాలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. ఉగాది పండుగ నాటికి అర్హులైన పేదలందరికీ ఇళ్లపట్టాలు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ఇందులో భాగంగా ఇప్పటికే పక్కాగృహాల నిర్మాణానికి అవసరమైన భూములను గుర్తించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో పక్కాగృహాల మంజూరుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రెండు విడతల్లో 49,157 పక్కాగృహాలను మంజూరు చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదాన్ని తెలిపాయి. మొదటి విడతలో 35,764 గృహాలు మంజూరుకాగా, రెండో విడతలో 13,393 గృహాలను మంజూరు చేసింది. మూడో విడతలో మరో 52,215 పక్కా గృహాలకు జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులు ప్రతిపాదనలు చేసి ప్రభుత్వానికి నివేదించారు. ఈ ప్రతిపాదలను శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ కమిటీ ఆమోదించింది. ఈ నెల 30వ తేదీన ఢిల్లీలో జరగనున్న కేంద్ర ప్రభుత్వ కమిటీ ఆమోదించాల్సి ఉంది. దీంతో జిల్లాలో మొత్తం 1,01,372 పక్కాగృహాలు నిరుపేదల దరిచేరనున్నాయి. పథకం అమలు ఇలా.. పట్టణ ప్రాంతాల్లో పక్కా గృహాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే వైఎస్సార్ అర్బన్ పక్కాగృహాల పథకాల కింద నిధులను సంయుక్తంగా మంజూరు చేస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సబ్సిడీతో రూ.2 లక్షలు, లబ్ధిదారుని వాటా రూ.50 వేలు చొప్పున వెచ్చించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.50 వేలు చొప్పున అందిస్తాయి. గతంలో గ్రామీణ ప్రాంతాల పరిధిలో ఉండి ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన అర్బన్ పరిధిలోకి వచ్చిన మండలాల్లోని లబ్ధిదారుకు కూడా ఈ విధానం వర్తిస్తుంది. భూసేకరణకు కసరత్తు ముమ్మరం జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో అర్హులైన మహిళల పేరుతో ఇళ్ల పట్టాల మంజూరుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. క్షేత్రస్థాయిలో పర్యటించి, భూసేకరణకు నివేదికలు తయారు చేశారు. ప్రభుత్వ భూమి లేనిచోట ప్రైవేట్ భూమిని కొనుగోలు చేసేలా చర్యలు చేపడుతున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో 79 రెవెన్యూ గ్రామాలకు గాను 60 గ్రామాల్లో భూమి ఉండగా 13 గ్రామాల్లో భూమి అందుబాటులో లేదు. పీలేరు పరిధిలో 100 గ్రామాలకు గాను 84 గ్రామాల్లో 100 శాతం, మదనపల్లె పరిధిలో 46కు 41, పుంగనూరు పరిధిలో 82కి 71, చంద్రగిరి పరిధిలో 111కు 67, శ్రీకాళహస్తి పరిధిలో 173కి 48, సత్యవేడు పరిధిలో 169కి 129, నగరి పరిధిలో 102కి 54, జీడీ నెల్లూరు పరిధిలో 167కి 123, చిత్తూరు పరిధిలో 73కి 39, పూతలపట్టులో 114కి 49, పలమనేరులో 114కి 100, కుప్పం పరిధిలో 210కి 178 గ్రామాల్లో వంద శాతం భూమి ఉన్నట్లు అధికారులు తేల్చారు. మిగిలిన గ్రామాల్లో ప్రభుత్వ భూమికోసం కసరత్తు చేస్తున్నారు. పూర్తిగా లేనిచోట కొనుగోలు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. 14 నియోజకవర్గాల్లో 1,540 రెవెన్యూ గ్రామాల పరిధిలో 1,043 గ్రామాల్లో 100 శాతం ప్రభుత్వం ఉంది. మిగిలిన 328 గ్రామాల్లో భూసేకరణ కోసం ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. చంద్రగిరి, శ్రీకాళహస్తి, నగరి, చిత్తూరు, పూతలపట్టు, తిరుపతి నియోజకవర్గాల్లో భూమి కొరత ఉంది. జిల్లాలోని 8 నగరపాలక, మున్సిపాలిటీల పరిధిలో 34,609 మందికి 368.27 ఎకరాల భూమి అవసరముందని అధికారులు వెల్లడిస్తున్నారు. అందులో 148.93 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన భూమిని కొనుగోలు చేయాల్సి ఉంటుందని అధికారుల నివేదికలు పేర్కొంటున్నాయి. జిల్లావ్యాప్తంగా భూమి కొనుగోలుకు రూ.22.72కోట్లు అవసరమని అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. పకడ్బందీగా కసరత్తు నిర్వహిస్తున్నాం.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇళ్ల పట్టాలు అందజేయడానికి పకడ్బందీగా కసరత్తు నిర్వహిస్తున్నాం. జిల్లాలోని మదనపల్లె, చిత్తూరు, తిరుపతి డివిజన్లలో సమీక్షలు నిర్వహించాం. ప్రభుత్వ భూమి కొరత ఉన్న చోట సమీపంలో మరో చోట ప్రభుత్వ భూమి ఉంటే స్వాధీనం చేసుకుంటున్నాం. గుర్తించిన భూమిని చదును చేయించే కార్యక్రమాన్ని తహసీల్దార్లు పర్యవేక్షిస్తున్నారు.– మార్కండేయులు, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ -
పట్టణ పేదలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త
సొంత ఇల్లు ఉండాలని... అందులో హాయిగా జీవించాలనీ... తరతరాలకూ అది తమకు స్థిరాస్తిగా నిలవాలనీ ప్రతి ఒక్కరి ఆశ. అందులో ఏ ఒక్కరూ మినహాయింపు కాదు. కానీ నిరుపేదల ఆశలు తీరేదెలా? ఇల్లు కట్టేంత స్థోమత వారికెక్కడిదీ? వీటన్నింటికీ సమాధానమే పీఎం ఆవాస్యోజనా. పట్టణ ప్రాంత పేదలకోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పథకం ద్వారా అర్హులైనవారికి ఇళ్లు మంజూరు కానున్నాయి. ఇందుకోసం జిల్లాకు 30,760 యూనిట్లు కేటాయించారు. త్వరలో వీటి పంపిణీకి ఏర్పాట్లు చేయనున్నారు. విజయనగరం: కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో పట్టణ ప్రాంతాల్లోని పేదలకు గృహాలు మంజూరు చేసింది. విజయనగరం జిల్లాలో వీఎంఆర్డీఏ, బుడా పరిధిలో ఉన్న నియోజకవర్గాలకు, మున్సిపాలిటీలకు 30,760 ఇళ్లు కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా వీఎంఆర్డీఏ పరిధిలో 13,950, బుడా పరిధిలో 12384 ఇళ్లతో పాటు బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం మున్సిపాలిటీలకు 4426 ఇళ్లు మంజూరు చేసింది. ఇందులో వీఎంఆర్డీఏ పరిధిలో ఉన్న నెల్లిమర్ల మండలానికి 7101 గృహాలు, చీపురుపల్లి మండలానికి 3415 గృహాలు, ఎస్కోట మండలానికి 3434 గృహాలు మంజూరయ్యాయి. అదేవిధంగా స్థానిక సంస్థలైన బొబ్బిలి మున్సిపాలిటీకి 453, సాలూరు మున్సిపాలిటీకి 267, పార్వతీపురం మున్సిపాలిటీకి 3706 గృహాలు మంజూరు చేశారు. బుడా పరిధిలోని కురుపాం మండలానికి 431, సాలూరు మండలానికి 4095, పార్వతీపురం మండలానికి 1071, సీతానగరం మండలానికి 1271, బొబ్బిలి మండలానికి 4191, దత్తిరాజేరు మండలానికి 1325 గృహాలకు కేంద్రం ఆమోదం తెలిపింది. సొంత ఇల్లు నిర్మించుకోవటానికి పేదలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. చాలీచాలనీ అద్దె గదుల్లో జీవనం సాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గృహాలు మంజూరు చేయడంతో పేదల సొంతింటి కల నెరవేరనుంది. నిర్మాణ వ్యయం పెరిగింది. దీన్ని దష్టిలో ఉంచుకుని యూనిట్ విలువలో కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు గృహాలకు రూ.2లక్షల నుంచి రూ.2.5లక్షలు రాయితీ ఇస్తున్నాయి. దీంతో లబ్ధిదారులు నిర్మాణాలకు ముందుకు రానున్నారు. స్థలం ఉన్న వారికి తొలుత ఇళ్లు మంజూరు చేస్తారు. ప్రభుత్వం ఉగాది నాటికి పేదలకు ఖాళీ స్థలాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. స్థలాలు అందితే మరింత మందికి గృహయోగం కలుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయం.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, వైఎస్సార్ అర్బన్ గృహ నిర్మాణ పథకంలో కేటాయించిన గృహాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించనున్నాయి. పట్టణాల్లో ఇంటికి రూ.3.5లక్షలుగా నిర్ణయించారు. దీనిలో కేంద్రం రూ.1.5లక్షలు, రాష్ట్రం రూ.లక్ష రాయితీ ఇస్తారు. బ్యాంకు రుణం రూ.75వేలు వస్తోంది. లబ్ధిదారు తన వాటాగా రూ.25వేలు భరించాల్సి ఉంటుంది. పట్టణ అభివృద్ధి సంస్థ పరిధిలో కేటాయించిన గృహాలకు ఒక్కో దానికి రూ.2లక్షలు యూనిట్ ధర నిర్ణయించారు. దీనిలో కేంద్రం రూ.1.5లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.50వేలు ఇస్తుంది. వలంటీర్ల సర్వేద్వారా లబ్ధిదారుల ఎంపిక.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్, వైఎస్సార్ అర్బన్ పథకంలో మంజూరైన గృహాలకు అర్హులైనవారిని వార్డు, గ్రామ వలంటీర్ల ద్వారా ఎంపిక చేస్తారు. వారు నిర్వహించిన సర్వే ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే వలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలను సేకరించారు. వీరిలో పేదలకు ఇళ్లు మంజూరు చేస్తారని సమాచారం. 30,760 ఇళ్లు మంజూరు.. పీఎం ఆవాస్ యోజన పథకంలో జిల్లాకు 30,760 ఇళ్లు మంజూరు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిధులు కేటాయిస్తాయి. రాష్టంలో వైఎస్సార్ గృహ నిర్మాణ పథకంలో నిధులు మంజూరు చేస్తారు. పట్టణాలు, గ్రామాల్లో వలంటీర్లు చేసిన సర్వే ఆధారంగా పేదలను గుర్తించి లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. దీనికి కుటుంబ సభ్యుల అందరి ఆధార్ వివరాలు సేకరించేందుకు ప్రత్యేక ప్రొఫార్మా సిద్ధం చేస్తున్నాం. – ఎస్.వి.రమణ, పీడీ, హౌసింగ్ -
‘ఇళ్ల స్థలాలపై పేదలకు యాజమాన్య హక్కు’
సాక్షి, అమరావతి: పేదలకు ఇళ్ల స్థలాలపై యాజమాన్య హక్కు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు హామీ ఇచ్చారు. పెండింగ్లో ఉన్న గృహ నిర్మాణ బిల్లులను కూడా మంజూరు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘పట్టణాల్లో అపార్టుమెంట్లు కాకుండా ఇళ్ల స్థలాలు ఇస్తాం. ఒక సెంటు భూమిని ఇంటి నిర్మాణం కోసం ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. రూరల్లో ఒకటిన్నర సెంటు, అర్బన్లో సెంటు భూమి ఇస్తాం. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి 24 లక్షల ఇళ్లు ఇచ్చారు. మళ్లీ ఆయన కుమారుడు సీఎం జగన్ ఇప్పుడు 25 లక్షల ఇల్లు నిర్మించాలని సంకల్పించారు. సీఎం నవరత్నాలలో భాగంగా ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం. వాలంటీర్లు ద్వారా లబ్ధిదారులను గుర్తించాం. మొత్తంగా సుమారు 26 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించాం. ఇళ్ల పట్టాల కోసం భూమిని సేకరిస్తాం. కానీ అందుకోసం దేవాలయాల భూములు సేకరిస్తామని తాము చెప్పలేద’ని మంత్రి స్పష్టం చేశారు. -
ప్రభుత్వ భూముల్లో నివసించే పేదలకు శుభవార్త
సాక్షి, విజయవాడ : ప్రభుత్వ భూముల్లో నివసించే పేదలకు ఒక చక్కని శుభవార్త అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఏఎండీ. ఇంతియాజ్ చెప్పారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఇళ్ల స్థలాల పంపిణీ, భూసేకరణ తదితర అంశాలను అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న పేదలు తమ ఇంటి స్థలాన్ని క్రమబద్దీకరించుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేదలకు సూచించారు. దారిద్రరేఖకు దిగువన జీవిస్తున్న పేదలు ప్రభుత్వ భూముల్లో నివాసం ఉండేవారు 100 చదరపు గజాలలోపు నివాసం ఉంటే వాటిని క్రమబద్దీకరణకు రూ. 1 చెల్లించాలన్నారు. 300 చదరపు గజాల కంటే ఎక్కవ ప్రభుత్వ స్థలంలో నివాసం ఉన్న వారికి తమ నివాస స్థలాన్ని ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్ణయించిన ధరను చెల్లించి తమ స్థలాలను క్రమబద్దీకరించుకోవచ్చన్నారు. అభ్యంతరం లేని ప్రభుత్వ భూమిలో నివాసం ఉంటున్న పేదలు వారి ఇంటి క్రమబద్దీకరణ కోసం తహసీల్దార్, గ్రామ సచివాలయాల్లో తమ దరఖాస్తులు దాఖలు చేయాలన్నారు. దీనికి సంబంధించి ఈనెల 6వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారని చెప్పారు. ఈ సదవకాశాన్ని పేదలందరు వినియోగించుకునేలా రెవెన్యూ అధికారులు గ్రామసభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్గించాలన్నారు. వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి 120 రోజుల్లోగా నిబంధనల మేరకు అర్హత కల్గిన పేదల స్థలాలను క్రమబద్దీకరణకు చర్యలు తీసుకుంటారన్నారు. జిల్లాలో 2,71లక్షల మంది పేదలు ఇళ్ల స్థలాల కోసం అర్హులుగా గుర్తించామన్నారు. ఇందుకోసం 4,497 ఎకరాలు భూమి అవసరమని, ప్రస్తుతం 2,132 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందన్నారు. మిగిలిన ప్రవేటు భూమిని త్వరితగతిన భూసేకరణ చేపట్టాలని రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. ఇళ్ల స్తలాల పంపిణీకి సంబందించి ఈనెల 16వ తేదీన అన్ని మండలాల్లోను సోషల్ అడిట్ నిర్వహించి లబి్ధదారుల జాబితాపై చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత, సబ్–కలెక్టర్లు స్వప్నిల్ దినకర్, హెచ్.ఎం. ధ్యానచంద్ర, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చక్రపాణి, ఆర్డీఓలు ఖాజావలి, సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. -
అమ్ముకున్నారు.. రెచ్చగొడుతున్నారు
సాక్షి, మంగళగిరి: ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు కేవలం ఓట్ల కోసం టీడీపీ ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు అంటూ పథకానికి శ్రీకారం చుట్టింది. పథకాన్ని పేదలకు కాకుండా తాము సొమ్ము చేసుకునేందుకు అన్నట్లుగా మున్సిపల్ టీడీపీ పాలకులు వార్డుల వారీగా ఇళ్లు కేటాయించుకుని ఒక్కో ఇంటిని రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు విక్రయించుకుని సొమ్ము చేసుకున్నారు. పథకంలో జరిగిన అవినీతిపై టీడీపీ ప్రజాప్రతినిధులే ధర్నాలకు దిగడంతో లబ్ధిదారుల జాబితాను ప్రకటించలేకపోయారు. ఒక్కో కౌన్సిలర్ వార్డుకు కేటాయించిన ఇళ్లకు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షలు వసూలు చేయగా, చైర్మన్, షాడో చైర్మన్లు రూ.కోటికిపైగా సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఎన్నికలలో టీడీపీ ఓటమి చెందడం వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడంతో డబ్బులు వసూలు చేసిన ప్రజాప్రతినిధుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. లబ్ధిదారులు తమకు ఇళ్లు రాకపోతే తీసుకున్న డబ్బులు ఇవ్వడంతో పాటు ప్రభుత్వానికి కట్టిన డీడీల డబ్బులు తిరిగి ఇవ్వాలని పట్టుబడుతుండడంతో కొత్తనాటకానికి తెరతీశారు. లబ్ధిదారులలో తమ బినామీలైన ఐదుగురు మహిళలను గ్రూపు లీడర్లుగా ఎంపిక చేసి, కొంత మంది లబ్ధిదారులను రెచ్చగొట్టి ప్రతి రోజు తమకు ఇళ్లు కావాలంటూ మున్సిపాల్టీతో పాటు ఇళ్ల నిర్మాణం వద్ద ఆందోళనలు చేయిస్తున్నారనే విమర్శలున్నాయి. 2,300 మంది లబ్ధిదారులుండగా ప్రతి రోజు ఆందోళన పేరుతో 30 మంది మహిళలు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తుండగా, ఐదుగురు మహిళలు వారికి లీడర్లుగా వ్యవహరిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు మున్సిపల్ అధికారులు డీడీలు కట్టిన అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పకుండా ఇళ్లు వస్తాయని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకుండా ప్రతి రోజు ఆందోళన చేస్తుండడం వెనుక డబ్బులు తీసుకున్న కొందరు కౌన్సిలర్లు ఉన్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. విజిలెన్స్ విచారణ వాస్తవానికి డీడీలు కట్టిన అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు ఇచ్చేదానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అందరికీ ఇళ్లు పథకంపై విజిలెన్స్ విచారణ కోరగా, విజలెన్స్ విచారణ చేపట్టింది. విచారణ పూర్తయిన వెంటనే అర్హులు జాబితాను విడుదల చేసి ఇళ్లు కేటాయిస్తామని ఎమ్మెల్యే ఆర్కేతో పాటు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఈ లోపు తాము ఎక్కడ తీసుకున్న డబ్బులు వెనక్కి ఇవ్వాలనే ఆందోళనతో మాజీ కౌన్సిలర్లు పన్నాగం ప్రకారం లబ్ధిదారులతో పాటు అమ్ముకున్న ఇళ్ల వారిని రెచ్చకొట్టి ఆందోళనలు చేయిస్తున్నారని తెలిసింది. వాస్తవానికి గత కొద్ది కాలంగా మాజీ కౌన్సిలర్లకు డబ్బులు ఇచ్చిన లబ్ధిదారులు అనర్హులు తమకు ఇళ్లు రావని తెలుసుకుని తాము ఇచ్చిన డబ్బులు తిరిగివ్వాలని మాజీ కౌన్సిలర్ల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. కొందరు మాజీ కౌన్సిలర్లు స్థానికంగా ఉన్న బలంతో ఇళ్లు వస్తాయని, రాకుంటే మీ డబ్బు మీకు ఇస్తామంటూ బాధితుల నోరు మూయిస్తున్నారు. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు ఒక్కో వార్డులో రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన మాజీ కౌన్సిలర్లతో పాటు రూ.కోట్లు వసూలు చేసిన మున్సిపల్ మాజీ చైర్మన్, షాడో చైర్మన్లు బాధితులు తీసుకువస్తున్న ఒత్తిడి నుంచి బయటపడే పరిస్థితి తెలియక కొట్టుమిట్టాడుతున్నట్లు తెలిసింది. మరికొద్ది రోజుల్లో విజిలెన్స్ విచారణ అనంతరం అధికారులు అర్హుల జాబితాను విడుదల చేసినట్లయితే అనర్హుల నుంచి వసూలు చేసిన డబ్బులతో అర్హుల వద్ద అధిక సంఖ్యలో వసూలు చేసిన డబ్బులు వెనక్కి తిరిగి ఇవ్వకతప్పదు. గత ఐదేళ్ల పాలనలో మున్సిపాల్టీని అవినీతి కూపంగా మార్చారనే అపప్రద మూటకట్టుకున్న టీడీపీతో పాటు మిత్రపక్షాలు ఇప్పుడు అందరికీ ఇళ్ల పథకంలో అంటిన అవినీతి మురికిని వదిలించుకోలేని పరిస్థితిలో బాధితులు కేసులు పెడితే శిక్ష నుంచి తప్పించుకునే పరిస్థితే లేదని అధికారులతో పాటు ఆయా పార్టీల నాయకులు చెబుతుండడం విశేషం. దీనిపై మున్సిపల్ కమిషనర్ హేమమాలిని మాట్లాడుతూ అందరికీ ఇళ్లు పథకంలో గతంలో డీడీలు కట్టిన అర్హులందరికీ తప్పకుండా ఇళ్లు ఇస్తామని తెలిపారు. విచారణ పూర్తయిన వెంటనే జాబితాను ప్రకటిస్తామని చెప్పారు. అనర్హులు తేలితే వారిని తొలగించి వారి స్థానంలో 1,728 ఇళ్ల జాబితా అనంతరం డీడీలు కట్టిన అర్హులకు కేటాయిస్తామని తెలిపారు. అనవసరంగా ఆందోళనలు చేసి అధికారుల సమయం వృథా చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అర్హులందరికీ న్యాయం జరుగుతుందని వివరించారు. -
పేదింటి కల.. సాకారం ఇలా..
గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు.. పట్టణ ప్రాంతాల్లో ఒక సెంటు స్థలం పట్టణాల్లో జీ ప్లస్ 3.. ఎకరంలో 100 యూనిట్లు మహిళల పేరుపై ఉగాది పండుగ రోజు పట్టాల పంపిణీగ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఎంపిక.. లబ్ధిదారుల ముసాయిదా జాబితా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రచురణ తహసీల్దారు, మున్సిపల్ కమిషనర్ ద్వారా జాబితాకు జిల్లా కలెక్టర్ల ఆమోదం ఇప్పటికే అందుబాటులో 11 లక్షల మందికి ఇళ్ల స్థలాలు సంప్రదింపులు లేదా భూసేకరణ ద్వారా మరో 14 లక్షల మందికి అవసరానికి మించి ప్రభుత్వ సంస్థల వద్ద ఉన్న భూముల వినియోగం గతంలో ఇచ్చిన స్థలాలు ఉపయోగించుకోకపోతే స్వాధీనంమార్గదర్శకాలతో కూడిన ప్రభుత్వ ఉత్తర్వులు జారీ సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలోని నవరత్నాల్లో భాగమైన పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణతో కూడిన మార్గదర్శకాలను ప్రకటించింది. వచ్చే ఉగాది పండుగ రోజు అర్హులైన 25 లక్షల మంది పేదలందరికీ ఇళ్ల స్థలాలను పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అందుకు అనుగుణంగా ఈ పథకాన్ని అమల్లోకి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక, అవసరమైన స్థలాల గుర్తింపు, సేకరణ తదితర అంశాలతో విధాన పరమైన మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ జారీ చేశారు. కుల, వర్గ, మతాలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇందు కోసం ఇప్పటి నుంచే అవసరమైన స్థలాలను గుర్తించడం, సేకరించడం, లబ్ధిదారుల ఎంపిక ప్రాతిపదిక, అర్హతలు, పథకం అమలుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఇల్లు లేని పేదలందరికీ పక్కా గృహాలను దశల వారీగా నిర్మించి ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఉగాది రోజు అర్హులైన 25 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం 11 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి భూమి అందుబాటులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరో 14 లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీకి అవసరమైన భూములను గుర్తించాలని నిర్ణయించారు. ఇళ్ల స్థలాలకు అవసరమైన భూమి గుర్తింపు ఇలా.. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములన్నింటినీ జిల్లా కలెక్టర్లు గుర్తించాలి ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్లు, కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ సంస్థలు అవసరానికి మించి భూములు కలిగి ఉంటే గుర్తించి, ఇళ్ల స్థలాలకు అనువుగా ఉంటే నిబంధనల మేరకు స్వాధీనం చేసుకోవాలి. చిన్న చిన్న వివాదాల్లో ఉన్న సీలింగ్ భూములు, ఇనామ్, ఎస్టేట్, ఎల్టీఆర్ భూములను గుర్తించి వివాదాలను పరిష్కరించి కొద్ది నెలల్లోనే స్వాధీనం చేసుకోవాలి. ఇళ్ల స్థలాలకు అనువుగా ఉన్న ఏపీఐఐసీ పారిశ్రామిక పార్కుల కోసం అభివృద్ధి చేసిన భూములను పారిశ్రామిక కార్మికుల కోసం వినియోగించాలి. ల్యాండ్ పూలింగ్ స్కీము కింద భూములు అందుబాటులో ఉంటే స్వాధీనం చేసుకోవాలి. గ్రామ కంఠంలో అర్హులైన లబ్ధిదారులకు సొంత స్థలం ఉంటే ఇంటి నిర్మాణాలకు అనుమతిస్తూ పొజిషన్ సర్టిఫికెట్ జారీ చేయాలి. గతంలో వివిధ శాఖలు ఇళ్ల స్థలాలను మంజూరు చేసినప్పటికీ నిర్మాణాలు చేయకుండా ఖాళీగా ఉంటే అలాంటి స్థలాలను గుర్తించి నిబంధనల మేరకు స్వాధీనం చేసుకోవాలి. ఇల్లు లేని పేదల కోసం ఎవరైనా భూములను దానం చేసేందుకు ముందుకు వస్తే అలాంటి వారిని జిల్లా కలెక్టర్లు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి. సంప్రదింపులు లేదా భూ సేకరణ ద్వారా జిల్లా కలెక్టర్లు అవసరమైన భూములను తీసుకోవాలి. ఇతర ప్రత్యామ్నాయాలు లేని పక్షంలోనే అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుని నిబంధనల మేరకు పరిహారం చెల్లించాలి. గ్రామ, పట్టణ యూనిట్గా తగిన ఇళ్ల స్థలాలను గుర్తించాలి. గుర్తించిన ఇళ్ల స్థలాలను జిల్లా కలెక్టర్లు గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణ శాఖకు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ శాఖలకు స్వాధీనం చేయాలి. స్వాధీనం చేసుకున్న స్థలాల్లో ఎటువంటి జాప్యం లేకుండా గృహ నిర్మాణ శాఖ, మున్సిపల్ శాఖ నిబంధన మేరకు లేఅవుట్స్ను రూపొందించాలి. ల్యాండ్ సర్వే, సబ్ డివిజన్స్ లే అవుట్ అండ్ పెగ్ మార్కింగ్లో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ సహకారం అందించాలి. గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్ల స్థలాలను చదును చేసేందుకు ఉపాధి హామీ నిధులను వినియోగించేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలను చదును చేసేందుకు పట్టణ స్థానిక సంస్థలు, ఏపీటీఐడిసీవో, ఇతర ప్రభుత్వ ఏజెన్సీలు చర్యలు తీసుకోవాలి. భూ సేకరణ పరిహారం చెల్లించేందుకు, లే అవుట్స్ రూపకల్పన, వ్యక్తిగత ప్లాటింగ్, ఇతర కార్యకలాపాలకు అవసరమైన నిధులను బడ్జెట్ నుంచి రెవెన్యూ శాఖ జిల్లా కలెక్టర్లకు సమకూరుస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడైనా ఇళ్ల స్థలాలు కేటాయిస్తే అలాంటి వాటిని రద్దు చేసి అర్హులైన ఇతరులకు కేటాయించాలి. పర్యవేక్షణకు మూడు కమిటీలు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం అమలును రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షించేందుకు డిప్యూటీ సీఎం (రెవెన్యూ) అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీలో మున్సిపల్, గృహ నిర్మాణం, రెవెన్యూ శాఖ ప్రత్యేక సీఎస్, మున్సిపల్ పట్టణాభివృద్ది కార్యదర్శి, సీసీఎల్ఏ లేదా ప్రత్యేక సీఎస్, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సభ్యులుగా ఉంటారు. సీసీఎల్ఏ ప్రత్యేక కమిషనర్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. రాష్ట్ర స్థాయిలో సంబంధిత శాఖల మధ్య సమన్వయం కోసం రెవెన్యూ శాఖ (ల్యాండ్) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, మున్సిపల్ పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి సభ్యులుగా సీసీఎల్ఏ ప్రత్యేక కమిషనర్ సభ్య కన్వీనర్గా కమిటీ ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో కార్యక్రమం అమలు పర్యవేక్షణకు జిల్లా ఇన్చార్జి మంత్రి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కో–చైర్మన్గా జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జాయింట్ కలెక్టర్, జిల్లా పరిషత్ సీఈవో, గృహ నిర్మాణ ప్రాజెక్టు డైరెక్టర్, మున్సిపల్ కమిషనర్లు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ, జిల్లా పంచాయతీ ఆఫీసర్, జిల్లా రిజిస్ట్రార్, గిరిజన ప్రాంతాల్లో ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్లు సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేశారు. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు వీలుగా అవసరమైన సాఫ్ట్వేర్ అప్లికేషన్స్, డేటా సేకరణకు సాంకేతిక సహాయాన్ని ఐటీ శాఖ రియల్ టైమ్ గవర్నెన్స్ అందిస్తాయి. జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తారు. సమన్వయ బాధ్యతలను డిప్యూటీ కలెక్టర్కు అప్పగిస్తారు. ఈ కార్యక్రమం అమలు తీరుపై జాయింట్ కలెక్టర్ తరచూ సీసీఎల్ఏకు నివేదిక పంపించాలి. గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారుల అర్హతలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్లు తెల్ల రేషన్ కార్డు ఉండాలి. లబ్ధిదారులకు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇళ్ల స్థలం ఉండరాదు. కేంద్ర, రాష్ట్ర గృహ నిర్మాణ పథకాల కింద గతంలో లబ్ధిదారులుగా ప్రయోజనం పొంది ఉండరాదు. రెండున్నర ఎకరాలకుపైగా మాగాణి లేదా ఐదు ఎకరాలకు పైగా మెట్ట భూమి ఉండరాదు. లబ్ధిదారుల అనుమతితోనే ఆధార్, ఇతర వివరాలు సేకరించాలి. పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారుల అర్హతలు లబ్ధిదారులకు రాష్ట్రంలో ఎక్కడా ఇళ్ల స్థలం ఉండరాదు. కేంద్ర, రాష్ట్ర గృహ నిర్మాణ పథకాల కింద గతంలో లబ్ధిదారులుగా ప్రయోజనం పొంది ఉండరాదు. రెండున్నర ఎకరాలకు పైగా మాగాణి లేదా ఐదు ఎకరాలకు పైగా మెట్ట భూమి ఉండరాదు. వార్షిక ఆదాయం మూడు లక్షల రూపాయలకు మించ రాదు. లబ్ధిదారుల అనుమతితోనే ఆధార్, ఇతర వివరాలు సేకరించాలి. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఇలా.. గ్రామ, పట్టణ యూనిట్గా గ్రామ, వార్డు స్థాయిలో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తారు. అర్హత నిబంధనల మేరకు దరఖాస్తులను గ్రామ, వార్డు వలంటీర్లు పరిశీలిస్తారు. అర్హత గల లబ్ధిదారుల ముసాయిదా జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రచురిస్తారు. ముసాయిదా జాబితాలో లబ్ధిదారులపై అభ్యంతరాలను, క్లెయిమ్లను స్వీకరిస్తారు. అభ్యంతరాలను, క్లెయిమ్లను పరిగణనలోకి తీసుకుంటూ గ్రామ, వార్డు సభలను నిర్వహించి తుది జాబితాలను ఖరారు చేస్తారు. తుది జాబితాలను గ్రామీణ ప్రాంతాల్లో తహసీల్దార్ల ద్వారా, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ల ద్వారా జిల్లా కలెక్టర్ల ఆమోదానికి పంపుతారు. జిల్లా కలెక్టర్లు ఆమోదించిన లబ్ధిదారుల జాబితాలను తిరిగి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రచురిస్తారు. ఈ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు, క్లెయిమ్లు ఉంటే సంబంధిత తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు జిల్లా కలెక్టర్ల అనుమతితో పరిష్కరిస్తారు. మార్గదర్శకాలు ఇవీ.. గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులకు 1.5 సెంట్ల ఇంటి స్థలం ఇస్తారు. వచ్చే ఏడాది ఉగాది పండుగ రోజు మహిళల పేరు మీద పట్టాలను పంపిణీ చేస్తారు. వ్యక్తిగత లబ్ధిదారులు ఆ స్థలాల్లో ఇల్లు నిర్మించుకునేందుకు గృహ నిర్మాణ శాఖ అందుబాటులో ఉన్న పథకాల కింద దశల వారీగా నిధులు మంజూరు చేస్తుంది. పట్టణ ప్రాంతాల్లో జీ ప్లస్ 3 విధానంలో ఇళ్ల నిర్మాణం చేపడతారు. ఎకరంలో 100 యూనిట్లు నిర్మిస్తారు. ఇందులో భాగంగా పట్టణ లబ్ధిదారులకు ఒక సెంటు చొప్పున కేటాయిస్తూ మహిళల పేరు మీద ఉగాది రోజున పట్టాలు పంపిణీ చేస్తారు. వ్యక్తిగత లబ్ధిదారులందరి ప్లాట్లకు 11 అంకెలతో విశిష్ట భూధార్ నంబర్ ఇస్తారు. -
‘అందరికీ ఇళ్లు’లో అడ్డంకులొద్దు
న్యూఢిల్లీ: 2022కల్లా అందరికీ ఇళ్లు పథకం లక్ష్యా న్ని చేరుకోవడంలో ఎదురయ్యే అవాంతరాలను తొలగించాలని ఉన్నతాధికారులను ప్రధాని మోదీ ఆదేశించారు. కేంద్రంలో రెండోసారి ఎన్డీఏ సర్కార్ కొలువుదీరాక తొలి ‘ప్రగతి (ప్రో–యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్) సమీక్షా సమావేశం బుధవారం మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో పీఎం ఆవాస్ యోజన(పట్టణ) పథకంలో ఎదురవుతున్న అవాంతరాలను ఎలా అధిగమించాలనే దానిపై సమీక్షించారు. ‘నీటి సంరక్షణపైన ప్రత్యేకంగా వానాకాలంలో తీసుకున్న చర్యలపైనా రాష్ట్రాలు పూర్తి సన్నద్ధతతో పనిచేయాలని ప్రధాని సూచించారు’ అని ఓ అధికారిక ప్రకటన పేర్కొంది. మోదీ ప్రధానిగా ఎన్డీఏ తొలి పాలన కాలంలో ఇలాంటి 29 ‘ప్రగతి’ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో రూ.12లక్షల కోట్ల విలువైన 257 ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. ప్రజా సమస్యలు, అందరికీ ఆరోగ్యబీమా పథకమైన ‘ఆయుష్మాన్ భారత్’ అంశాలపైనా సమీక్ష జరిగింది. -
నెరవేరనున్న పేదింటి కల!
సాక్షి, విజయనగరం : ప్రతి మనిషికి కూడు..గూడు..గుడ్డ కనీస అవసరాలు. వాటిని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. కానీ గత పాలకులు తమ స్వార్ధప్రయోజనాలకే పెద్దపీట వేసి పేదల అవసరాలను కనీసం పట్టించుకోలేదు. ఇళ్లకోసం ఎన్నిమార్లు దరఖాస్తు చేసుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం ఇంటిస్థలమైనా ఇవ్వమని వేడుకున్నా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో సొంతిల్లులేని నిరుపేదలు ఉండకూడదన్న లక్ష్యంతో వేస్తున్న అడుగులు వారికి ఊరటకలిగిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో చాలా మంది అర్హులకు సొంత ఇల్లు సమకూరలేదు. కొందరికి ఇళ్లు మంజూరైనా వాటి నిర్మాణం పూర్తి కాలేదు. చాలా ఇళ్లకు రుణ మొత్తాలు విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి వచ్చే ఉగాది నాడు అర్హులైనవారందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి సిద్ధమవుతున్నారు. దీని కోసం జిల్లాలో ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడున్నాయనే వివరాలను సేకరించాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అయితే అత్యధిక స్థలాలు గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతల భూదాహానికి ఖాళీ అయ్యాయి. జిల్లాలో 6వేల ఎకరాల ప్రభుత్వ భూములున్నా యి. వీటిలో చాలా వరకూ నివాసయోగ్యంగా లేవు. కొండలు, గుట్టలతో నిండి ఉన్నాయి. వీటి ని ఇళ్ల నిర్మాణానికి తగిన విధంగా తయారుచేయాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేకపోతే ప్రైవేటు భూములైనా కొనుగోలు చేసి పేదలకు పంచిపెట్టాలని సీఎం జగన్ స్పష్టం చేయడంతో ఆ దిశగా కూడా చర్యలు మొదలవుతున్నాయి.స్థలాలు కొనాలన్నా... ఖర్చుతో కూడుకున్నపనే. ఉన్న స్థలాలను అనుకూలంగా మా ర్చుకోవాలా... లేక ప్రైవేటు స్థలాలు కొనుగోలు చేయాలా... అన్న చర్చలు అధికార వర్గాల్లో జరుగుతున్నాయి. ఇప్పటికిప్పుడు పేదలకు పంచి పెట్టడానికి జిల్లాలో అందుబాటులో ఉన్న ది కేవలం 130 ఎకరాలు మాత్రమే. సీఎం జగన్మోహన్రెడ్డి చెప్పినట్లుగా ఇల్లు లేని ప్రతిపేదవాడికీ 1.5సెంట్ల భూమి ఇవ్వాలంటే ఈ 130 ఎకరాలను 8,666 మందికి పంచవచ్చు.జిల్లాలో 7.13లక్షల మంది తెల్లరేషన్ కార్డు కలిగినవారున్నారు. వీరంతా పేద ప్రజలు. 2006 నుంచి 2019 వరకూ మంజూరైన ఇళ్లు దాదాపు 3.63లక్షలు. మిగిలిన 3.5లక్షల మందిలో సొంతిళ్లు ఎందరికి ఉందనేది తేలాల్సి ఉంది. అదీగాక గత ప్రభుత్వాల్లో ఇళ్లు మంజూరవ్వడమేగానీ మంజూరైనవన్నీ నిర్మాణం పూర్తిచేసుకోలేదు. టీడీపీ హయాంలో 2014–15, 2015–16 ఆర్థిక సంవత్సరంలో ఒక్క ఇల్లయినా మంజూరు కాలేదు. తర్వాత మూడేళ్ల కాలంలో జిల్లాకు వివిధ స్కీంల ద్వారా 99,297 ఇళ్లు మంజూరు కాగా అందులో 74,876 ఇళ్లకు పరిపాలన అనుమతులు వచ్చాయి. వాటిలో పైకప్పు వరకూ(ఆర్సి) కంప్లీట్ అయినవి 30,324 ఇళ్లు, పూర్తిగా నిర్మాణం జరిగినవి 43,188 ఇళ్లు మాత్రమే. ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తే తప్ప ఎందరికి ఇళ్లు అవసరమనే వాస్తవ సంఖ్య తేలదు. ఈ నేపథ్యంలో అధికారులు ఒక వైపు గృహæ, స్థల లబ్ధిదారులను గుర్తించేందుకు సర్వే ప్రారంభించారు. -
అందరికీ అందుబాటు ఇల్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో :అందరికీ ఇళ్లు దిశగా నరేంద్ర మోదీ 2.0 ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. అందుబాటు గృహాలను (అఫర్డబుల్ హౌజింగ్) దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ను రూపొందించారు. అఫర్డబుల్ హౌజింగ్లకు అదనపు వడ్డీ రాయితీలు, ప్రభుత్వ స్థలాల కేటాయింపులు, నిర్మాణ గడువు కుదింపు వంటివన్నీ ఈ విభాగాన్ని బలోపేతం చేయనున్నాయి.ఆర్ధికాభివృద్ధిలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి అత్యంత కీలకం. మౌలిక సదుపాయాల అభివృద్ధే ప్రభుత్వ ఎజెండా. దీన్నే ఫోకస్ చేస్తూ నిర్మలా సీతారామన్ తొలి బడ్జెట్ను రూపొందించారు. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా నిర్మాణ రంగానికి ప్రయోజనాలు కలుగుతాయి. అందుబాటు గృహాలకు (అఫర్డబుల్ హౌజింగ్) వడ్డీ మినహాయింపును రూ.3.5 లక్షలకు పెంచారు. ఇది తొలిసారి గృహ కొనుగోలుదారులను ఆకర్షిస్తుంది. రూ.45 లక్షల లోపు గృహాలను కొనుగోలు చేసే వారికి ఈ వడ్డీ రాయితీ అందుతుంది. 1.95 కోట్ల పీఎంఏవై గృహాలు.. ప్రధాన్మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) గ్రామీణంలో 2020–22 ఆర్ధిక సంవత్సరంలో లబ్ధిదారులకు 1.95 కోట్ల గృహాలను అందించాలని నిర్ణయించారు. అలాగే గతంలో 2015–16లో పీఎంఏవై కింద ఒక గృహ నిర్మాణానికి 314 రోజుల సమయాన్ని ప్రతిపాదించింది. కానీ, 2017 నుంచి దీన్ని 114 రోజులకు తగ్గించేసింది. అంటే నిర్మాణంలో వేగం పెంచింది. అందుబాటు గృహాల నిర్మాణాల వైపు డెవలపర్లను ఆకర్షించేందుకు ప్రభుత్వ స్థలాలను కేటాయించనున్నారు. జాయింట్ డెవలప్మెంట్ కింద వీటిని నిర్మిస్తారు. ఇప్పటికే నిరుపయోగంగా ఉన్న స్థలాలను గుర్తించాలని అన్ని ప్రభుత్వ విభాగాలను ఆదేశించారు. దేశవ్యాప్తంగా కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఉన్న స్థలాల్లో మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో అందుబాటు గృహాల నిర్మాణానికి స్థానిక డెవలపర్లు ముందుకొచ్చే అవకాశముందని క్రెడాయ్ మాజీ జాతీయ అధ్యక్షుడు సి. శేఖర్ రెడ్డి తెలిపారు. లాజిస్టిక్, వేర్హౌజ్లకు ఊతం.. పారిశ్రామిక కారిడార్లు, ప్రత్యేకమైన సరుకు రవాణా కారిడార్లు, రైల్వే, ఎయిర్ లైన్స్ కారిడార్లలో మౌలిక వసతుల అభివృద్ధికి ఫోకస్ చేసింది. ఇందుకోసం వచ్చే ఐదేళ్లలో రూ.100 కోట్లను కేటాయించింది. దీంతో రియల్టీ రంగంలో లాజిస్టిక్, వేర్ హౌజ్ విభా గాలకు డిమాండ్ పెరుగుతుందని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ చైర్మన్ అనూజ్ పురీ తెలిపారు. పునర్వినియోగ ప్లాస్టిక్ గ్రీన్ టెక్నాలజీ వినియోగంతో రోడ్ల నిర్మాణాన్ని ప్రతిపాదించింది. 30 వేల కి.మీ. నిర్మించనున్నారు. దీంతో రోడ్ల నిర్మాణ వ్యయం తగ్గుతుంది. పర్యావరణహితమైన రోడ్లను ప్రతిపాదించింది. రెంటల్ పాలసీతో జోష్.. తాజా బడ్జెట్లో పాత రెంటల్ పాలసీలో సంస్కరణలు చేయాలని నిర్ణయించారు. త్వరలోనే నేషనల్ అర్బన్ రెంటల్ హౌజింగ్ పాలసీని తీసుకురానున్నారు. దీంతో గృహాల సరఫరా తక్కువగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో అద్దె గృహాలను సరఫరా పెరుగుతుంది. అద్దె గృహాలను పెంచేందుకు స్పష్టమైన ప్రోత్సాహాకాలు ఉంటాయి. ఈ పాలసీని అన్ని రాష్ట్రాల్లో అమలుకు చర్యలు తీసుకుంటారు. హౌజింగ్ ఫర్ ఆల్ను వేగవంతం చేసేందుకు అద్దె గృహాలను వినియోగించుకునే అవకాశం ఉంది. స్టూడెంట్ హౌజింగ్కు డిమాండ్.. నివాస విభాగంలో స్టూడెంట్ హౌజింగ్కు డిమాండ్ను సృష్టిస్తుంది. ఉన్నత విద్యారంగంలో విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు స్టడీ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఇందుకోసం ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.400 కోట్లను కేటాయించింది. దీంతో స్టూడెంట్ హౌజింగ్కు డిమాండ్ పెరుగుతుంది. పెట్టుబడులకు అవకాశాలు కల్పించింది. హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీల నియంత్రణ అధికారాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి నేషనల్ హౌజింగ్ బోర్డ్ (ఎన్హెచ్బీ)కి బదిలీ చేశారు. దీంతో పారదర్శకత నెలకొంటుంది. అతిక్రమణలను తగ్గించడంతో పాటూ నియంత్రణ సులువవుతుంది. రిటైల్, హాస్పిటాలిటీలో వృద్ధి.. చిన్న రిటైలర్ల రిజిస్ట్రేషన్ విధానాన్ని సులభతరం చేశారు. సింగిల్ బ్రాండ్ రిటైల్ కోసం స్థానిక సోర్సింగ్ నిబంధనలను సరళీకృతం చేశారు. దీంతో భవిష్యత్తులో రిటైల్ రంగానికి ప్రయోజనం చేకూరుతుంది. అసంఘటిత రిటైల్ రంగంలో ఊత్సాహం నెలకొంటుంది. ఆతిధ్య రంగాన్ని ప్రోత్సహించేందుకు 17 ఐకానిక్ పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయనుంది. దీంతో దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇది ఆతిధ్య రంగానికి బూస్ట్నిస్తుంది. ముడి ఉత్పత్తుల ధరల పెరుగుదల.. ఈసారి బడ్జెట్లో రియల్ ఎస్టేట్ రంగానికి మౌలిక రంగ హోదా ప్రతిపాదన ఊసేలేదు. పన్నులు, భూముల విధానాల్లో ఎలాంటి సంస్కరణలు చేయలేదు. పైగా పీవీసీ, వినైల్ ఫ్లోరింగ్ షీట్స్, టైల్స్ వంటి నిర్మాణ ముడి సరకుల దిగుమతి సుంకాన్ని పెంచారు. ముడి ఉత్పత్తుల మీద 1 శాతం ఇన్ఫ్రా సర్చార్జీని పెంచారు. దీంతో డెవలపర్లకు నిర్మాణ వ్యయం పెరుగుతుంది. అంతిమంగా కొనుగోలుదారులకు ధరలు పెరిగే ప్రమాదముంది. వడ్డీ మినహాయింపుపై పరిమితి తగదు వడ్డీ మినహాయింపులు కేవలం రూ.45 లక్షల ధర గృహాలకు మాత్రమే పరిమితం చేయడం కొంత అసంతృప్తి. ఎందుకంటే ప్రస్తుతం మెట్రో నగరాల్లో ఈ ధర గృహాలకు ఆశించిన స్థాయిలో సప్లై లేదు. అందుకే అన్ని రకాల గృహాలకు వడ్డీ మినహాయింపును ఇవ్వాలి.– జక్షయ్ షా, చైర్మన్, క్రెడాయ్ అందరికీ ఇళ్లు లక్ష్యం చేరుకుంటాం కేంద్ర ప్రభుత్వం హౌజింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. అందుబాటు గృహా లకు ప్రభుత్వ స్థలాల కేటాయింపు, వడ్డీ రాయితీలు వంటివి ఈ విభాగానికి బూస్ట్నిస్తాయి. – నిరంజన్ హిర్నందానీ,ప్రెసిడెంట్, నరెడ్కో నగరాల్లో అద్దె గృహాలకు డిమాండ్ రూ.1.5 లక్షల అదనపు వడ్డీ రాయితీ, రెంటల్ పాలసీ, పీఎంఏవై కేటాయింపులు గృహ విభాగంలో డిమాండ్ తీసుకొస్తాయి. గృహల సరఫరా పెరగడంతో పాటూ బ్యాంక్లకు లిక్విడితో కొనుగోళ్లు కూడా పెరుగుతాయి. రెంటల్ హౌజింగ్ పాలసీతో ప్రధాన నగరాల్లో అద్దె గృహాల సరఫరా పెరిగే అవకాశముంది. – అన్షుమన్ మేగజైన్, చైర్మన్, 45 లక్షల లోపు గృహాలకు డిమాండ్ రూ.1.5 లక్షల వడ్డీ మినహాయిపు కారణంగా తొలిసారి గృహ కొనుగోలుదారుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతుంది. రూ.45 లక్షల లోపు ధర ఉన్న గృహాలకు డిమాండ్ పెరుగుతుంది.– నాయర్, సీఈఓ, జేఎల్ఎల్ ఇండియా -
కల నిజమాయె!
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ ప్రజలు సొంతింటి కలను నెరవేర్చుకుంటున్నారు. నిర్మాణం పూర్తయిన ఫ్లాట్లు, ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో నిర్మాణ రంగం జెట్ స్పీడుతో దూసుకెళుతోంది. ఫ్లాట్లపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) తగ్గడంతో కొత్తగా ప్రారంభమవుతున్న నిర్మాణాలకు గిరాకీ పెరుగుతోందని అనరాక్ ప్రాపర్టీస్ సంస్థ చేసిన తాజా అధ్యయనంలో తేలింది. ప్రధానంగా అన్ని హంగులతో నిర్మాణం పూర్తయి, గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఫ్లాట్లపై కొనుగోలుదార్లు ఎక్కువగా ఆకర్షితులవుతున్నట్టు ఈ అధ్యయనం వెల్లడించింది. గతంతో పోలిస్తే ఈ సెగ్మెంట్లో ఇళ్లకు డిమాండ్ 5 నుంచి 18 శాతానికి పెరిగినట్లు తెలిపింది. ఇళ్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసేవారిలో 58 శాతం మంది తాము నివాసం ఉండేందుకు కొనుగోలు చేస్తుండగా.. మరో 42 శాతం మంది సమీప భవిష్యత్లో మంచి ధర పలకుతుందని, తమ పెట్టుబడికి మంచి లాభదాయకంగా ఉంటుందన్న ఉద్దేశంతో కొనుగోలు చేస్తుండడం విశేషం. జీఎస్టీ తగ్గింపే అసలు కారణం స్థిరాస్తి నియంత్రణ చట్టం (రెరా) అమల్లోకి రావడం, జీఎస్టీ రేట్లు తగ్గడంతో కొత్త నిర్మాణాలపై కొనుగోలుదార్లకు నమ్మకం పెరుగుతోందని ఈ సర్వేలో ప్రకటించారు. నగరంలో ప్రధానంగా అధిక శాతం మధ్యతరగతి వేతనజీవులు రూ.80 లక్షల లోపు స్థిరాస్తులను కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. ఏప్రిల్ 1 నుంచి అందుబాటు ధరల గృహాలపై జీఎస్టీ రేటు 8 శాతం నుంచి 1 శాతానికి తగ్గింది. అదే సమయంలో ఈ విభాగంలోకి రాని నిర్మాణాలపై 12 శాతం ఉన్న జీఎస్టీ 5 శాతానికి చేరడంతో అమ్మకాలు, కొనుగోళ్లు ఊపందుకున్నాయి. తాజా పరిణామం ఫ్లాట్ల కొనుగోలుదారులకు భారం తగ్గించిందని, గిరాకీ పెరగడానికి దోహదం చేసిందని అనరాక్ సంస్థ తెలిపింది. పన్ను పరంగా ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలతో పాటు, మార్కెట్ పరిస్థితులు కూడా కలిసి వస్తుండటంతో నగరంలో స్థిరాస్తి రంగం వేగం పుంజుకుందని తెలిపింది. శివార్లలో రియల్ భూమ్ గ్రేటర్ శివార్లలో రియల్ భూములకు రెక్కలొచ్చాయి. ప్రధానంగా నిర్మాణ రంగానికి శివార్లు కొంగుబంగారంగా మారాయి. అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలు అధికంగా కొనుగోలుచేసే గృహ సముదాయాలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది రెట్టింపు స్థాయిలో ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టులకు పలు నిర్మాణ రంగ సంస్థలు శ్రీకారం చుట్టి వేంగా ప్రజెక్టులను పూర్తి చేస్తుండడం విశేషం. ఈ ప్రాంతాలు అదరహో.. నిర్మాణ రంగం వేగంగా విస్తరిస్తున్న ప్రాంతాల్లో ప్రధానంగా కొండాపూర్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లా, షేక్పేట్, నార్సింగి, పుప్పాలగూడ, బాచుపల్లి, కొంపల్లి, బొల్లారం, ఎల్బీనగర్, హయత్నగర్, యాంజాల్ తదితర ప్రాంతాల్లో నూతన నిర్మాణ రంగ ప్రాజెక్టులు ఊపందుకుంటున్నాయి. ఆయా ప్రాంతాల్లో రూ.40–80 లక్షల సెగ్మెంట్లో నివాస గృహాలతో పాటు సువిశాలమైన, విలాసవంతమైన ఫ్లాట్లు, విల్లాల కొనుగోళ్లు ఇటీవలి కాలంలో భారీగా పెరుగుతున్నట్లు రియల్టీ వ్యాపారులు చెబుతున్నారు. ఇక విలాసవంతమైన(లగ్జరీ) ఇళ్ల విభాగంలో తెల్లాపూర్, కొల్లూరు, గోపన్పల్లి, కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో చేపట్టిన నిర్మాణ రంగ ప్రాజెక్టుల్లో బుకింగ్స్ అత్యధికంగా ఉన్నట్లు గుర్తించారు. గతంతో పోలిస్తే అత్యధికం నగర శివార్లలో 2017లో సుమారు ఆరు వేల నిర్మాణ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. ఇక 2018లో ఏడువేల నూతన ప్రాజెక్టులు సాకారంకాగా.. ఈ ఏడాదిలో సుమారు 15 వేల ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశాలున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాంటే గ్రేటర్లో ఇళ్లకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. పొరుగు రాష్ట్రాల వారు సైతం.. ఐటీ, బీపీఓ, కేపీఓ, ఫార్మా, బల్క్డ్రగ్ పరిశ్రమలకు గ్రేటర్ కేంద్రంగా మారింది. దీంతో విద్య, ఉద్యోగం, ఉపాధి, వాణిజ్యాల కోసం పొరుగు రాష్ట్రాలైన ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి భారీగా వలస వస్తున్నారు. వీరంతా నగర శివార్లలో వారి స్తోమతను బట్టి అపార్ట్మెంట్లు, విల్లాలు, ఫ్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఈ ఏడాది పలు నిర్మాణ సంస్థలు నూతన ప్రాజెక్టులను ప్రారంభించాయి. వీటిలో అపర్ణ, రాజపుష్ప, వాసవి, బ్రిగేడ్, సుమధుర వంటి సంస్థలు నూతన ప్రాజెక్టులను చేపట్టాయి. ఈ ఏడాది చివరినాటికి ఇవి పూర్తి కానున్నట్లు ‘రియల్’ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇళ్ల ధరలు ఇలా.. అల్పాదాయ, మధ్యాదాయ, వేతన జీవులు ప్రధానంగా రూ.40లక్షల నుంచి రూ.80 లక్షల విలువచేసే అపార్ట్మెంట్లు, స్వతంత్ర గృహాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ఇక ఎగువ మధ్యతరగతి వర్గం కొనుగోలు చేసే ఇళ్లు, ఫ్లాట్లు, విల్లాల ధరలు చదరపు అడుగుకు రూ.4000–6500 మధ్య ఉన్నాయి. సంపన్న శ్రేణి కొనుగోలుచేసే సువిశాలమైన లగ్జరీ విల్లాలు, ప్లాట్లు చదరపు అడుగుకు సుమారు రూ.7500– రూ.13000 వరకు ధర పలుకుతుండడం విశేషం. -
అడిగితే.. అలకేంటి రాజా?
సాక్షి, సామర్లకోట(పెద్దాపురం): ఆ గ్రామంలో టీడీపీ నాయకుల అక్రమాలు పెరిగాయి.హౌసింగ్ రుణాల పేరుతో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. సొమ్ములు ముట్టజెప్పిన వారికే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. అభివృద్ధి పనుల్లోనూ ‘పచ్చ’పాత వైఖరి అవలంబిస్తున్నారు. వీటన్నింటిని సహిస్తూ.. భరిస్తూ ఉన్నారు నిజమైన లబ్ధిదారులు. వీటిపై కొందరు తెగించి స్థానిక టీడీపీ నాయకులను ప్రశ్నిస్తే.. వారిపై కేసులు బనాయించడం అక్కడ అలవాటుగా మారింది. అయితే ప్రస్తుత ఎన్నికల వేళ.. ఆ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి, ఏపీ ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి చినరాజప్ప ఆ గ్రామానికి ప్రచారానికి వెళ్లారు. ఇన్నాళ్లూ తాము పడిన ఇబ్బందిని ఆగ్రామ జనం ఆయన దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో జరుగుతోన్న అన్యాయాలు, అక్రమాలపై ఆయనను ప్రశ్నించారు. దీంతో అవాక్కయిన రాజప్ప స్థానికులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. దీంతో గ్రామస్తులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. చినరాజప్పకు చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన పెద్దాపురం నియోజకవర్గ పరిధిలోని హుస్సేన్పురం గ్రామంలో చోటుచేసుకుంది. మండల పరిధిలో హుస్సేన్పురం గ్రామానికి టీడీపీ అభ్యర్ధి, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ఆ సమయంలో గ్రామానికి చెందిన మహిళలు, యువకులు డిప్యూటీ సీఎం కాన్వాయ్ను అడ్డగించారు. దీంతో డిప్యూటీ సీఎంను అడ్డగించిన వారిని వేధించే అవకాశం ఉండడంతో ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆందోళన కారులకు అండగా నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. గ్రామ సమస్యలపై సమాధానం ఇచ్చి ముందుకు వెళ్లాలని డిమాండ్ చేసినా ఉపముఖ్యమంత్రి పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ‘‘సమస్యలు ఉంటే క్యాంప్ కార్యాలయానికి వచ్చి చర్చించాలని, ఎన్నికల పర్యటనలో ఉన్నాను’’ అని తన వాహనాన్ని ముందుకు తీసుకుపోవడం ఎంత వరకు సమంజసమని గ్రామస్తులు ప్రశ్నిస్తు న్నారు. అధికారంలో ఉన్న సమయంలోనే సమస్యలు పరిష్కారం కాక పోతే తరువాత ఎవరేం చేస్తారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు చెప్పుకోనివ్వరా.. గ్రామ టీడీపీ నాయకులు హౌసింగ్ లోన్లు ఇప్పిస్తామని చెప్పి మొండి చేయి చూపారని, ఈ సమస్య చెప్పుకోవడానికి కూడా రాజప్ప అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హౌసింగ్ లోన్ వస్తుందనే ఆశతో గ్రామంలోని అనేక మంది ఉన్న గుడిసెను తొలగించుకున్నామని, ఎండకు, వానకు ఉండలేక అప్పులు చేసుకొని ఇంటి నిర్మాణాలు చేసుకున్నామని, అయితే ఎన్నికలు సమీపించినా హౌసింగ్ రుణాలు రాకపోవడంతో ఈ విషయాన్ని మంత్రి రాజప్పకు చెప్పుకోవడానికి వస్తే అవకాశం ఇవ్వలేదని లబ్ధిదారులు వాపోతున్నారు. మంజూరైన హౌసింగ్లోన్లు వారికి కావలసిన వారికే జన్మభూమి కమిటీ సభ్యులు అప్పగించారని ఆరోపించారు. అదే విధంగా పింఛన్లు కూడా తమకు నచ్చిన వారికే ఇచ్చారని, అర్హత ఉన్నా ఎంపిక చేయలేదనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో వారికి నచ్చిన ప్రాంతాల్లోనే రోడ్లు, డ్రైన్లు నిర్మించారని, ముంపునకు గురవుతున్న ప్రాంతాలను విస్మరించారనే వాదనలు ఉన్నాయి. పరిశ్రమల కాలుష్యం మధ్య అనారోగ్యానికి గురవుతూ జీవనం గడుపుతున్నా పట్టించుకునే వారు కరువైపోయారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జన్మభూమి కమిటీ నాయకులు టీడీపీ పాలనలో రూ.కోట్లు సంపాదించుకొంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామంలోని సమస్యలపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వాట్సాప్లో పెడితే అమాయకులపై తప్పుడు కేసులు నమోదు చేశారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ అప్పు తీర్చలేని పరిస్థితి ఇంటి రుణం వస్తుందని ఆశ చూపి రూ.రెండు వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పు చేసి రూ.రెండు వేలు టీడీపీ నాయకులకు ఇచ్చా ను. అయితే హౌసింగ్ లోన్ రాలేదు. అప్పు చేసి ఇచ్చిన రూ.రెండు వేలు తీర్చలేని పరిస్థితిలో ఉన్నాను. అప్పు చేసి నిర్మాణం చేసిన ఇళ్లు అసంపూర్తిగా ఉంది. – కోట ఏగులమ్మ, బాధితురాలు, హుస్సేన్పురం మండల స్థాయి నాయకుల దృష్టికి తీసుకు వెళ్లినా స్పందన లేదు గ్రామంలో హౌసింగ్లోను కావాలంటే రూ.రెండు వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం. పేద వారు ఏవిధంగా ఇస్తారని, ఎంపీపీతో టీడీపీకి చెందిన ఇతర మండల స్థాయి అధికారుల దృష్టికి సమస్యను తీసుకు వెళ్లినా వారు స్పందించలేదు. – మార్ని చక్రం, మాజీ సర్పంచ్, హుస్సేన్పురం -
అందరికీ అను‘గృహం’..
సాక్షి, ప్రత్తిపాడు : పేదవాని గూడు గోడుగానే మిగిలిపోతోంది. కలల సౌథం కూలిపోతోంది. అర్హత ఉండీ ఇళ్లు మంజూరు కాని వారు కొందరు..మంజూరై బిల్లులు రాని వారు ఇంకొందరు.. బిల్లులు రాక ఇళ్ల నిర్మాణాన్ని మధ్యలోనే నిలిపివేసిన వారు మరికొందరు.. ఇలా ఎన్టీఆర్ హౌసింగ్ కింద ఇళ్లు నిర్మించుకున్న వారి బాధ అంతులేకుండా ఉంది. ఇలాంటి పేదలందరికీ గూడు కల్పించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అర్హులైన ప్రతి పేదవానికీ పక్కా ఇల్లు కట్టించి ఇస్తానని మాట ఇచ్చారు. అంతేకాదు ఇచ్చిన రోజునే ఆ ఇంట్లోని అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేయిస్తానని చెప్పారు. దీనిపై ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. వైఎస్ జగన్ ప్రకటించిన పథకం వివరాలు పేదలందరికీ పక్కా ఇళ్లు ఐదేళ్లలో 25 లక్షల పక్కా ఇళ్ల నిర్మాణం ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లోని అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ డబ్బు అవసరమైతే అదే ఇంటి మీద పావలా వడ్డీకే రుణ సదుపాయం పక్కా ఇళ్ల నిర్మాణాల వివరాలు.. టీడీపీ హయాంలో మంజూరైన ఇళ్లు : 3,61,732 అసంపూర్తిగా నిలిచిన ఇళ్లు : 21,568 ప్రారంభం కాని ఇళ్లు : 60,279 అందరికీ ఇళ్లు గొప్ప విషయం టీడీపీ ప్రభుత్వ హయాం లో పక్కా ఇళ్లు నిర్మించుకోవాలంటే జన్మభూమి కమిటీల దయ తప్పని సరి. అలాంటి వారికే ఇల్లు మంజూరు చేస్తున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అందరికీ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి సిఫార్సులు లేకుండా అర్హులకు ఇస్తామని చెప్పడం గొప్ప విషయం. – కొత్త అమేష్, బీకేపాలెం జగన్ హామీ హర్షణీయం ఇళ్లు నిర్మించుకుని బిల్లులు రాక లబ్ధిదారులు అగచాట్లు పడుతున్నారు. మండలాల్లోని హౌసింగ్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది. నిర్మించుకున్న ఐదారు నెలలకు కూడా బిల్లులు రాని దుస్థితి ఉంది.వైఎస్ జగన్మోహన్రెడ్డి అందరికీ ఇల్లు నిర్మిస్తామని చెప్పారు. ఆయన మాటిస్తే నెరవేరుస్తారు. అందుకే అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. – బాపతు శ్రీనివాసరెడ్డి, ప్రత్తిపాడు -
ప్రతి కుటుంబానికీ పక్కా ఇల్లు
ఏలూరు (మెట్రో): జిల్లాలో ప్రతి కుటుంబానికీ పక్కా ఇల్లు ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని జిల్లా కలెక్టర్ ప్రవీణ్కుమార్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్లో బుధవారం సాయంత్రం జిల్లాలో గృహనిర్మాణ ప్రగతి తీరును, సంవత్సరం, పథకాల వారీగా, ఏఈల వారీగా గృహ నిర్మాణాల ఇంజినీర్లతో కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి కుటుంబానికి నూరు శాతం ఇళ్లు ఇవ్వాలన్నదే లక్ష్యమన్నారు. ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే ఎంతమందికి ఇళ్లు మంజూరు చేయాలో కచ్చితమైన అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. 2017, 2018, 2019 సంవత్సరా ల్లో మంజూరైన ఇళ్లలో ఇంకా ప్రారంభం కాని నిర్మాణాలు ఉన్నాయన్నారు. వాటిపై దృష్టిపెట్టి ఫిబ్రవరి మొదటి వారం నాటికి పనులు ప్రారంభమయ్యేలా శ్రద్ధ పెట్టాలన్నారు. ఈ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించవద్దని చెప్పారు. ఇంజినీర్లు వారపు లక్ష్యాలను నిర్దేశించుకుని పనులు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఫిబ్రవరి 2 నుంచి మూడు రోజుల పాటు నియోజకవర్గ స్థాయిలో పసుపు, కుంకుమ ద్వారా అందించే సహాయం, పెన్షన్ల పంపిణీ వాటితో పాటు దరఖాస్తు చేసుకున్న వారికి ఇళ్ల మంజూరు పత్రాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో గృహ నిర్మాణశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఇ.శ్రీనివాసరావు, టిడ్కో ఎస్ఈ శ్రీనివాసరావు, కమిషనర్ మోహనరావు, మునిసిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశం జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్కు వచ్చిన పలువురు సమస్యలు తెలుసుకుని కలెక్టర్ ప్రవీణ్కుమార్ ఆ సమస్యలు పరిష్కరించాలని సంబంధితాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ విధులుకు వస్తున్న సమయంలో కొందరు ప్రజలు సమస్యల అర్జీలతో కలెక్టర్కు కనిపించారు. సంబంధిత ప్రజలను కలెక్టర్ పలకరించి ఆ సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. బదిలీ ప్రక్రియ నిర్ణీత సమయంలో పూర్తి ఎన్నికలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న అధికారుల బదిలీ ప్రక్రియలను నిర్ణీత సమయంలో పూర్తి చేస్తామని కలెక్టర్ ప్రవీణ్కుమార్ చెప్పారు. ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల సంసిద్ధత వంటి అంశాలపై రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులతో బుధవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర ఫనేఠ విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పునేత మాట్లాడుతూ త్వరలో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న దృష్ట్యా ఎన్నికలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న అధికారులను బదిలీలు చేయాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.సత్యనారాయణ, ట్రైనీ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య పాల్గొన్నారు. -
హౌసింగ్ జాబితా ఇచ్చేందుకు హైడ్రామా
శ్రీకాకుళం, ఆమదాలవలస: టిట్కో స్కీం(ఏహెచ్పీ) పథకం కింద మంజూరైన లబ్ధిదారుల జాబితా ఇచ్చే విషయమై ఆమదాలవలస మున్సిపాలిటీ వద్ద మంగళవారం హైడ్రామా చోటుచేసుకుంది. జాబితాలు ఇచ్చే విషయంలో అధికారులు తీవ్ర జాప్యం చేయడంపై వైఎస్సార్సీపీ నాయకులు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఏహెచ్పీ పథకం కింద ఆమదాలవలస మున్సిపాలిటీలోని జగ్గు శాస్త్రులపేటలో నిర్మిస్తున్న ఇళ్లకు సంబంధించి డీడీలు తీసిన లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ కూన రవికుమార్ హడావిడిగా మంజూరుపత్రాలు అందించారు. చాలామంది టీడీపీ కార్యకర్తలకు, ఇల్లు ఉన్న వారికే ఇల్లు ఇచ్చిన వైనం చోటుచేసుకుంది. దీంతో మున్సిపల్ ఫ్లోర్లీడర్ బొడ్డేపల్లి రమేష్కుమార్ మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధికారులను సంబంధిత జాబితాలు ఇవ్వాలని కోరారు. సమావేశం పూర్తయిన తర్వాత జాబితాలు ఇస్తామని తొలుత ప్రకటించిన అధికారులు తర్వాత క్లర్క్ లేడని, జాబితాలు లేవని చెప్పారు. దీంతో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు పోడియం వద్ద నిరసన తెలియజేశారు. జాబితాలు ఇచ్చే వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. ఈలోగా మున్సిపల్ అధికారులు స్థానిక సీఐ ఎస్.ఆదాంకు సమాచారం అందించగా పోలీసు బలగాలను మోహరింపజేశారు. సీఐ వచ్చాక సాయంత్రం 5 గంటల సమయంలో కమిషనర్ పి.బాలాజీ ప్రసాద్ బయటకు వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో కౌన్సిలర్లు గేటు వద్ద బైఠాయించి వెల్లకుండా అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, పార్టీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవినాగ్లు అక్కడికి చేరుకున్నారు. తమ్మినేని వెంటనే జిల్లా కలెక్టర్తో మాట్లాడి లబ్ధిదారుల జాబితాను అడిగితే కమిషనర్ స్పందించడం లేదని చెప్పారు. దీనికి స్పందించిన కలెక్టర్ ఆర్డీఓ చేత కమిషనర్తో మాట్లాడించి జాబితాలు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో చేసేది ఏమీ లేక 8 గంటల సమయంలో మున్సిపల్ మేనేజర్ కె.శ్రీనివాసరావు జాబితాలను తీసుకువచ్చి తమ్మినేని చేతికి అందించారు. జాబితాతో గుట్టురట్టు.. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ కమిషనర్ పచ్చచొక్కా వేసుకుని పనిచేస్తున్నారని, కౌన్సిలర్ల పట్ల ఇంత నిర్లక్ష్యం పనికిరాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లు మంజూరు విషయంలో అక్రమాలకు పాల్పడకపోతే జాబితాలు ఇచ్చేందుకు ఇంత హైడ్రామా ఎందుకని ప్రశ్నించారు. మున్సిపాలిటీలో ఇళ్లు పేదలకు అందాలనే ధ్యేయంతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. అనర్హులకు, ఇళ్లు ఉన్న వారికి, సొంత మనుషులకు గృహాలు మంజూరు చేసి అవకతవకలకు పాల్పడటం లేదని విప్ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. జాబితాలతోనే గుట్టు రట్టు అయ్యిందన్నారు. మొత్తం 523 మందికి ఇళ్లు మంజూరైనట్లు వెల్లడించిన అధికారులు ఇంకా 50 మంది వరకు జాబితాల్లో పేర్లు నమోదు చేయకపోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. డీడీలు చెల్లించిన వారందరికీ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా సేవాదల్ అధ్యక్షుడు ఎ.ఉమామహేశ్వరరావు, కౌన్సిలర్లు బి.అజంతాకుమారి, దుంపల శ్యామలరావు, డి.చిరంజీవిరావు, పొన్నాడ కృష్ణవేణి, సారిక అమ్మాజీ, ఎం.వెంకటేష్, పార్టీ నాయకులు పొన్నాడ రామారావు, ఎస్.దాసునాయుడు, చలపతిరావు, కూర్మారావు, పొన్నాడ చిన్నారావు, చెంచెల చిన్నారావు, కూన రామకృష్ణ, ముద్దు, పొన్నాడ విజయ్కృష్ణ, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
సిఫార్సులకే ప్రాధాన్యం
‘పేదలకు ఇళ్లు కేటాయిస్తున్నాం. లోటు బడ్జెట్ ఉన్నా ఎంతో చేస్తున్నాం.’ అని వీలు చిక్కినప్పుడల్లా టీడీపీ పెద్దలు చెబుతుంటారు. అదంతా ప్రచార ఆర్భాటంగా తేలిపోయింది. అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా గృహాలను అర్హులను కాదని టీడీపీ నాయకుల సిఫార్సులున్న వారికే కేటాయిస్తున్నారనే విమర్శలున్నాయి. నెల్లూరు సిటీ: నగరపాలక సంస్థ పరిధిలో అందరికీ ఇళ్లు పథకం కింద మొత్తం 35 వేలు గృహాలు నిర్మించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్ణయించాయి. వెంకటేశ్వరపురంలో 4,800, అల్లీపురంలో 12,856, అక్కచెరువుపాడులో 7,344, కల్లూరుపల్లిలో 10,112 ఇళ్లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అందులో భాగంగా వెంకటేశ్వరపురంలో 90 శాతం నిర్మాణాలు పూర్తికాగా, అల్లీపురంలో 40 శాతం అయింది. కార్పొరేషన్ పరిధిలో సుమారు 50 వేలకు మందికిపైగా ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎనిమిది నెలల క్రితం వెంకటేశ్వరపురంలోని 4,800 ఇళ్లను, అల్లీపురంలోని కొన్ని ఇళ్లను కంప్యూటరైజ్డ్ లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులకు కేటాయించారు. ఇటీవల అల్లీపురం, అక్కచెరువుపాడు, కల్లూరుపల్లి ప్రాంతాల్లో 18 వేలు ఇళ్లను లాటరీ పద్ధతి ద్వారా కేటాయించారు. వారిచ్చిన పత్రం ఉంటేనే.. టీడీపీ నాయకుల సిఫార్సు ఉంటేనే ఇళ్లు మంజూరు చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఇన్చార్జిలు, ఇతర పదవుల్లో నాయకులు సంతకాలు చేసిన పత్రాలను మాత్రమే కార్పొరేషన్లో అధికారులు నమోదు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దరఖాస్తు చేసుకున్న సామాన్యులు లాటరీలో వారి పేర్లు రాకపోవడంతో బిక్కమొహం వేస్తున్నారు. నాయకులు అనుచరగణం చెప్పిన వారికి మాత్రం పత్రాలిచ్చి అర్హులకు అన్యాయం చేస్తున్నారు. తిరుగుతున్నా.. ఇళ్లు రాకపోవడంతో లబ్ధిదారులు నగరపాలక సంస్థ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకటికి రెండుసార్లు పత్రాలను తీసుకురావాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో తప్పని పరిస్థితుల్లో జెరాక్స్లు, రవాణా చార్జీలకు ఖర్చు చేసి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇదిలా ఉండగా దివ్యాంగులకు, 70 సంవత్సరాలు దాటిన వృద్ధులకు అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఇళ్లు కేటాయిస్తామని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. అయితే వారికి రెండు, మూడు ఫ్లోర్లలో కేటాయిస్తుండడంతో ఆవేదన చెందుతున్నారు. కాళ్లు లేని వారికి సైతం మూడో ఫ్లోర్లో ఇల్లు కేటాయించడం గమనార్హం. -
గృహం.. ఏదీ అనుగ్రహం..!
తాడేపల్లిగూడెం: ‘అందరికీ ఇళ్లు’ ఇది ప్రభుత్వ నినాదం అయితే కొందరికి కూడా దక్కని పరిస్థితి. క్షేత్రస్థాయిలో ఇటుక వేయడానికి నెలలు, కాగితాల మీద ఆర్డర్లు కార్యరూపం దాల్చడానికి మరికొన్ని నెలలు గడిచిపోయాయి. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి రెండేళ్లు గడుస్తున్నా జిల్లాలో ఒక్క గృహప్రవేశం కూడా జరగలేదు. జిల్లాలో ఇళ్ల నిర్మాణం వ్యవహారం చూస్తుంటే హౌసెస్ ఫర్ హాఫ్ అన్నచందంగా కనిపిస్తోంది. సంగంతో మమ అనిపించేలా ఈ వ్యవహారం నడుస్తోంది. 2018 జనవరిలో గృహప్రవేశాలు చేయిస్తామన్న నేతలు అంకెను మార్చి 2019 జనవరిలో చేయించడానికి కసరత్తు చేస్తున్నట్టు కనిపిస్తోంది. సగంతోనే మమ జిల్లాలో ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు పట్టణాలకు 34,211 ఇళ్లను అందరికీ ఇళ్లు పథకంలో కేటాయించారు. ఏలూరుకు 12,176, పాలకొల్లుకు 7,159, తాడేపల్లిగూడెంకు 5,376, భీమవరంకు 9,500 ఇళ్లకు అనుమతులు ఇచ్చారు. ♦ ఏలూరులో ఇంతవరకు ఈ ప్రక్రియకు అంకురార్పణ జరగలేదు. ♦ తాడేపల్లిగూడెంలో 5,376 ఇళ్ల కోసం 4,500 డీడీలను అర్హులుగా చెప్పిన వారు సమర్పించారు. పలు వడపోతల అనంతరం ఇక్కడ డీడీలు చెల్లించిన వారిలో 2,927 మందిని మాత్రమే అర్హులుగా తేల్చారు. వీరికి సరిపడా ఎల్.అగ్రహారం వద్ద ఇళ్ల నిర్మాణం పూర్తికాలేదు. కేవలం 600 ఫ్లాట్లు మాత్రమే ఇప్పటివరకు పూర్తయ్యాయి. ♦ భీమవరంలో 9,500 ఇళ్లకు గాను 8,352 మంది డీడీలు చెల్లించారు. వీరిలో 5,900 మందిని అర్హులుగా గుర్తించారు. ♦ పాలకొల్లులో 7,159 ఇళ్లకు గాను 6,784 మంది డీడీలు సమర్పించారు. వీరిలో 4,400 మందిని అర్హులుగా గుర్తించారు. గూడెంలో భారీ కోత జిల్లాలో ఈ పథకం అమలుచేస్తున్న ఏ పట్టణంలో లేనివిధంగా తాడేపల్లిగూడెంలో లబ్ధిదారుల జాబితాలో కొర్రీ పడింది. 5,376 ఇళ్లు మంజూరు కాగా, 4,500 మంది డీడీలు చెల్లించారు. వీరిలో 1,573 మందిని అనర్హులుగా తేల్చారు. కేవలం 2,927 మందినే అర్హులుగా గుర్తించారు. కోత ఎలా పడిందంటే... సామాజిక సర్వే పేరుతో ఉన్న వివరాలను సరిపోల్చుకుని జాబితాలోని కొన్ని పేర్లు ఎత్తేశారు. పాన్ కార్డు వివరాల ఆధారంగా కొన్ని పేర్లు తీసేశారు. ఐటీ అసెస్సీ జాబితా పేరుతో మరికొందరికి నామం పెట్టారు. భార్య పేరిట లేదంటే కుటుంబ సభ్యుల పేరిట ఇళ్లు ఉన్నాయనే సాకుతో మరి కొందరిని బ్లాక్ లిస్టులో పెట్టేశారు. ఆధార్ మిస్ మ్యాచింగ్ పేరుతో ఒక్కో పట్టణంలో 500 మంది వంతున పక్కకు లాగేశారు. గతంలో హౌసింగ్ స్కీమ్లను ఉపయోగించుకున్నారనే సాకుతో ఒక్క తాడేపల్లిగూడెంలోనే 680 మందిని అనర్హులుగా తేల్చారు. ఇళ్ల కోసం తొలి విడత సొమ్ము నిమిత్తం చెల్లించిన డీడీలు కాలం చెల్లిపోతున్నాయి. వీటిని రెన్యువల్ చేయించుకోవాలంటే ఎంతోకొంత చేతి చమురు వదిలించుకోవాల్సిన పరిస్థితి. యూఎల్బీల పురోగతి అంతంత మాత్రమే జిల్లాలో అందరికీ ఇళ్లు పథకం కాకుండా అర్బన్ లోకల్ బాడీలకు ఇళ్ల కేటాయింపులు (యూఎల్బీ) చేశారు. జంగారెడ్డిగూడెంకు 2,883, కొవ్వూరుకు 2,450, నరసాపురానికి 2,467, నిడదవోలుకు 2,571, తణుకులో 3,539 ఇళ్లను జిల్లా మొత్తంగా 13,910 ఇళ్లు కేటాయించారు. వీటి నిర్మాణాలు ఇదే రీతిలో ఉన్నాయి. రెండో జాబితా ఉంటుంది తాడేపల్లిగూడెంలో అందరికి ఇళ్లకోసం డీడీలు కట్టిన వారు ఆందోళన చెందనక్కరలేదు. అర్హులైన వారు ఇంకా మిగిలి ఉంటే రెండో జాబితాలో చేరుస్తారు. సాంకేతిక కారణాలు, సర్వేలో వెల్లడైన వివరాల ఆధారంగా జాబితాలో ఉన్న కొందరు అనర్హులుగా తేలారు. డీడీలు ల్యాప్స్ కావు. ఆధార్ మిస్ మ్యాచింగ్ పెద్ద విషయం కాదు. వేగంగా ప్రక్రియ సాగేందుకు ప్రయత్నిస్తున్నాం. – బి.బాలస్వామి, కమిషనర్, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ -
కేంద్రం పథకంలో తెలంగాణ సున్నాశాతం పనితీరు!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం అమల్లో తెలంగాణ రాష్ట్రం పూర్తిగా వెనుకబడింది. 0శాతం పనితీరుతో తెలంగాణ రాష్ట్రాల జాబితాలో చివరిస్థానంలో ఉండటం గమనార్హం. కేంద్రం తాజాగా విడుదల చేసిన ఈ జాబితాలో 43శాతం పనితీరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 17వ స్థానంలో ఉంది. ఇక 86శాతం పనితీరుతో ఛత్తీస్గఢ్ రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచింది. -
ఇళ్ల నిర్మాణంలో భారీ దోపిడీ
నెల్లూరు రూరల్: నగరంలోని జనార్దన్రెడ్డి కాలనీలో హౌస్ ఫర్ ఆల్ ఇళ్ల నిర్మాణంలో ఒక చదరపు అడుగును రూ.1900కు చేపట్టడంతో ప్రజలకు భారంగా మారిందని, తాను చదరపు అడుగును రూ.1300కే నిర్మిస్తానని, లేకుంటే రాజకీయాల నుంచి తప్పుకొంటానని, నిర్మిస్తే మంత్రి నారాయణ రాజకీయాల నుంచి తప్పుకొంటారానని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్కుమార్యాదవ్ ప్రశ్నించారు. హౌస్ ఫర్ ఆల్ నిర్మాణంలో జరుగుతున్న దోపిడీపై ఎమ్మెల్యే అనిల్ బుధవారం అన్ని రాజకీయ పార్టీల నేతలను కలిసి వివరించారు. బాలాజీనగర్లోని సీపీఎం జిల్లా కార్యాలయానికి వెళ్లి సీపీఎం నేతలతో చర్చించారు. అనంతరం ఇందిరాభవన్లో కాంగ్రెస్ నేతలతో మాట్లాడారు. పక్క రాష్ట్రాల్లో కూడా ఒక చదరపు అడుగు ఈ రేటు లేదని, నెల్లూరు నగరంలో ఎందుకు ఇంత ఖర్చు చేస్తున్నారో అర్థం కావ డం లేదన్నారు. నగరం, రాష్ట్రంలో గా నీ, చివరికి నారాయణ సంస్థల్లో గానీ షేర్వాల్ టెక్నాలజీని ఉపయోగించలేదని, హౌస్ ఫర్ ఆల్ నిర్మాణంలో ఎందుకు ఉపయోగించారని ప్రశ్నిం చారు. షేర్వాల్ టెక్నాలజీతో కాకుం డా అపార్ట్మెంట్ పద్ధతిలో ఇళ్లను నిర్మించినా ఒక్కో ఇంటికి అడుగు రూ.600 మిగిలేదన్నారు. ఇళ్ల నిర్మాణ బాధ్యతను తనకు అప్పగిస్తే నాణ్యతతో చదరపు అడుగును రూ.1300కే ఏడాదిలోపు నిర్మించి చూపిస్తానని చెప్పారు. హౌస్ ఫర్ ఆల్ పథకంలో దోపిడీ జరుగుతోందని చర్చకు రమ్మ ంటే.. దాని గురించి మాట్లాడకుండా వైఎస్సార్నగర్లోని ఇళ్లు, రాజీవ్ స్వ గృహ ఇళ్ల నాణ్యతపై మాట్లాడుతున్నారని చెప్పారు. అప్పటి నగర, రూరల్ ఎమ్మెల్యేల పర్యవేక్షణలో ఇళ్ల నిర్మాణం జరిగిందని, ప్రస్తుతం వారు టీడీపీలోనే ఉన్నారనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని ప్రశ్నించారు. అప్పుడు ఇళ్లు నిర్మించిన కాంట్రాక్టర్లు, ఇటుక రాళ్లను సరఫరా చేసిన వారు మీ పక్కనే ఉన్నారని, వారిని వదిలేసి ఆ నిందలను తమపై వేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మాదాల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు ఉడతా వెంకట్రావు, కార్పొరేటర్లు ఓబిలి రవి చంద్ర, ఊటుకూరు మాధవయ్య, గో గుల నాగరాజు, ఖలీల్ అహ్మద్, నాయకులు కర్తం ప్రతాప్రెడ్డి, వేలూరు మహేష్, కుంచాల శ్రీనివాసులు, వందవాసి రంగ, దార్ల వెంకటేశ్వర్లు, లోకిరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి, ముదిరెడ్డి లక్ష్మీరెడ్డి, పోలంరెడ్డి వెంకటేశ్వర్లు రెడ్డి, రఘు, రవి, తదితరులు పాల్గొన్నారు. -
బిల్లు బిల్లుకూ మామూళ్లు!
ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని భైరిపురం...గృహనిర్మాణ పథకంలో ఇల్లు కావాలని 30 మంది దరఖాస్తు చేసుకున్నారు. అధికార పార్టీ నాయకులు, జన్మభూమి కమిటీ సభ్యులు కలిసి ఆ దరఖాస్తుదారుల్లో 18 మందితో మాత్రమే దరఖాస్తు చేయించారు. ఈ ప్రక్రియ కోసం రూ.5 వేలు, తర్వాత ఇల్లు మంజూరు కోసమంటూ రూ.25 వేలు వరకూ వసూళ్లు జరిగాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంటే రూ.1.50 లక్షల ఇంటి సొమ్ము కోసం రూ.30 వేల వరకూ కమీషన్లు కొట్టేస్తున్నారని సొంత పార్టీవారే ఆరోపిస్తున్నారు. ఎక్కడైనా నిలదీస్తే తమ ఇల్లు ఎక్కడ చేజారిపోతుందోనని వారే భయపడుతుండటం గమనార్హం!! సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులు అధికార పార్టీ నాయకుల తీరుతో నష్టపోతున్నారు. ఈ పరిస్థితి ఒక్క ఇచ్ఛాపురం నియోజకవర్గంలోనే కాదు జిల్లావ్యాప్తంగా ఉంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఊరించీ ఊరించీ రెండున్నరేళ్ల తర్వాత ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం కింద ఇళ్లు ఇస్తామని టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది! ఆ ఇళ్లు కూడా టీడీపీ నాయకుల అనుయాయులకే కట్టబెడుతున్నారు. జన్మభూమి కమిటీల సభ్యులు రంగంలోకి దిగి వసూళ్ల పర్వానికి తెరలేపారు. అలాగే ఇల్లు మంజూరయ్యాక బిల్లుల చెల్లింపు సమయంలో హౌసింగ్ అధికారులకూ కమీషన్లు ఇవ్వాలని చెప్పి కలెక్షన్లు చేస్తున్నారు. దీంతో లబ్ధిదారుల పరిస్థితి మింగ లేక కక్కలేకా అన్నట్లుగా తయారైంది. పథకం కింద ఇంటి నిర్మాణానికొచ్చేది రూ.1.50 లక్షలైతే అందులో రూ.30 వేల వరకూ ఆమ్యామ్యాలకే పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎక్కడ నోరువిప్పితే బిల్లులు అర్ధంతరంగా నిలిపేస్తారేమోననే భయం వారిని వెంటాడుతోంది. టీడీపీ ప్రభుత్వం తొలి రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఇళ్లేవీ మంజూరు చేయలేదు. ఎన్టీఆర్ గ్రామీణ గృహనిర్మాణ పథకం కింద 2016–17లో మాత్రం నియోజకవర్గానికి 1,250 చొప్పున ప్రకటించింది. ఆ తర్వాత 12,235 ఇళ్లు ఇస్తున్నట్లు హామీ ఇచ్చింది. ఈ సంవత్సరం మరో 13,486 ప్రకటించింది. కానీ ఇవేవీ వాస్తవ అర్హులకు చేరట్లేదు. కేవలం టీడీపీ కార్యకర్తలకే కట్టబెడుతున్నారు. వారి నుంచి కూడా కమీషన్లు వసూలు జరుగుతోంది. ఈ పథకం కింద యూనిట్ విలువ రూ.1.50 లక్షలు. అయితే దీనిలో రూ.95 వేలు హౌసింగ్ కార్పొరేషన్ విడుదల చేస్తుంది. మిగిలిన రూ.55 వేలు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) కింద వస్తాయి. ఈ యూనిట్ మొత్తంలోనే సిమెంట్, ద్వారాలు, కిటికీలు లబ్ధిదారులకు అందజేస్తారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి తప్పనిసరి. యూనిట్ విలువ మొత్తానికి మూడు నాలుగు దఫదఫాలుగా చెల్లింపులు చేస్తున్నారు. ఈ సమయాల్లోనే లంచాలు ఎక్కువవుతున్నాయనే కారణంతోనే బిల్లు మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేసే విధానం తీసుకొచ్చారు. అయినా సంబంధిత హౌసింగ్ సిబ్బంది జన్మభూమి కమిటీలతో కుమ్మక్కై... బిల్లులు బ్యాంకులో జమ అయిన తక్షణమే లబ్ధిదారుల నుంచి కమిషన్లను ముందుగానే వసూలు చేస్తున్నారు. లబ్ధిదారుల బ్యాంకుపాస్ పుస్తకాలు జన్మభూమి కమిటీల వద్దే ఉంచేస్తున్నారు. ఇలా ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.30 వేల వరకూ దఫదఫాలుగా దండేస్తున్నారు. చివరకు మిగిలేది అప్పులే... వాస్తవానికి చిన్న ఇల్లు నిర్మించుకోవాలన్నా ప్రస్తుత పరిస్థితుల్లో రూ.5 లక్షలకు పైమాటే! దీనిలో హౌసింగ్ పథకం కింద రూ.1.50 లక్షలు వస్తే కొంత ఊరట కలుగుతుందనేదీ పేదప్రజల ఆశ. కానీ బిల్లుల మొత్తం చేతికొచ్చేసరికి అందులో రూ.30 వేల వరకూ జేబుకు చిల్లుపడుతోంది. ఇటీవల కాలంలో సిమెంట్, ఇనుము, ఇటుక ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండట్లేదు. ఇక ఇసుక ఉచితమే ప్రభుత్వం ప్రకటించినా ఇంటికి తెచ్చుకునేసరికి లోడుకు వాస్తవ ధర కన్నా రెట్టింపు మొత్తం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇల్లు పూర్తయ్యేసరికి అప్పులే మిగులుతున్నాయనే ఆవేదన లబ్ధిదారుల్లో వ్యక్తమవుతోంది. ఎంతమందికి ఇల్లు వచ్చిందో తెలియదు భైరిపురం గ్రామంలో ఎన్టీఆర్ గహనిర్మాణ పథకం కింద ఎంతమందికి ఇల్లు మంజూరైందో ఇంతవరకు అధికారులు చెప్పడం లేదు. కానీ ఇల్లు పేరుతో భారీఎత్తున వసూళ్లు జరుగుతున్నాయి. అంతా అయోమయమైన పరిస్థితి. వాస్తవాలను అధికారులు వెల్లడించకపోవడం వల్ల పేదలు మోసపోతున్నారు. –యలమంచిలి నీలయ్య, కవటి మండల ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్సీపీ -
గృహ నిర్మాణంలో... రూ.200 కోట్ల స్కాం
ధర్మవరంటౌన్ : ప్రభుత్వం నిరుపేదలకు సొంతింటి కలను నిజం చేస్తామంటూ గృహ నిర్మాణ పథకం ద్వారా అపార్ట్మెంట్లు నిర్మించి ఇస్తామని చెబుతూ అవినీతికి బాటవేసిందని, ఒక్క ధర్మవరం నియోజకవర్గంలోనే రూ.200 కోట్ల స్కాంకు టీడీపీ ప్రజా ప్రతినిధులు తెరలేపారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వాలు పేదలకు ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సింది పోయి లబ్ధిదారులపై బ్యాంక్ భారం మోపి నెల నెలా రూ.4 వేలు చెల్లించేలా ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. వివిధ పథకాల పేరుతో రూ.500కే ఇళ్లు నిర్మించి ఇస్తామని పేద ప్రజలకు భ్రమలు కల్పిస్తోందన్నారు. రూ.200 కోట్ల స్కాం ధర్మవరం నియోజకవర్గంలో అపార్ట్మెంట్ నిర్మాణంలో రూ.200 కోట్ల స్కాంకు టీడీపీ ప్రజా ప్రతినిధి తెరలేపారని కేతిరెడ్డి పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు బినామీ కాంట్రాక్టర్లు అయిన సాహోజి పల్లంజీలకు ఈ కాంట్రాక్ట్ దక్కేలా ప్రభుత్వం పావులు కదిపిందన్నారు. ధర్మవరం నియోజకర్గంలో ఓ టీడీపీ ప్రజా ప్రతినిధి 8 వేల మందికి అపార్ట్మెంట్ ద్వారా ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం డీడీలు స్వీకరించిందన్నారు. అపార్ట్మెంట్ నిర్మాణం చదరపు గజం రూ.1.20 లక్షలు బహిరంగ మార్కెట్లో ధర ఉంటే ప్రస్తుతం లబ్ధిదారుల నుండి కాంట్రాక్టర్ వసూలు చేస్తున్న మొత్తం రెట్టింపుగా ఉందన్నారు. 8,832 మందికి బహిరంగ మార్కెట్లో అపార్ట్మెంట్లు నిర్మించి ఇవ్వడానికి రూ.300 కోట్లు ఖర్చు అయితే కాంట్రాక్టర్ మాత్రం రూ.544.67 కోట్లకు అంచనా వ్యయం పెంచేశారన్నారు. ఫలితంగా ఎటుచూసిన స్థానిక ప్రజా ప్రతినిధులకు రూ.200 కోట్లు అక్రమార్జన రూపంలో స్వాహాకు సిద్ధమయ్యారని విమర్శించారు. పట్టాలు మంజూరు చేయరా ? పట్టణంలో విభిన్న ప్రతిభావంతులకు ఇచ్చిన పట్టాలను వెనక్కి తీసుకొని ఆ స్థలంలో అపార్ట్మెంట్ నిర్మించేందుకు సన్నాహాలు ప్రారంభించారన్నారు. ప్రస్తుతం ఆ స్థలంలో తొలి విడతగా 8 వేల మందికి అపార్ట్మెంట్ ద్వారా ఇళ్లు నిర్మించేందుకు అనుమతి వచ్చినా వారికి అధికారులు పట్టాలు మంజూరు చేయక పోవడం దారుణమన్నారు. ఒకవైపు అపార్ట్మెంట్ నిర్మించి ఇస్తామని చెప్పి మరోవైపు మండలంలోని పోతులనాగేపల్లి, కుణుతూరు, రేగాటిపల్లి వద్ద వందల ఎకరాల భూములను స్థల సేకరణ చేస్తున్నారని.. ఆ భూములు ఎవరికి కట్టబెట్టడానికని ప్రశ్నించారు. పట్టణంలో ఇంటిస్థలం ఇస్తామని చెబుతూ టీడీపీ నాయకులు జాబితా సిద్ధం చేశారని ప్రస్తుతం స్థల సేకరణ చేసిన ప్రాంతంలోని గ్రామాల్లోని టీడీపీ కార్యకర్తలకు ఇంటిపట్టాలు ఇచ్చి దొంగ ఓట్లు నమోదు చేసేందుకు భారీ ప్రణాళిక సిద్ధం చేశారని వీరికి రెవెన్యూ అధికారులు కూడా వంత పాడుతున్నారన్నారు. ధర్మవరంలో జరుగుతున్న అపార్ట్మెంట్ దోపిడీని ప్రజలు నమ్మొద్దని ఈ అవినీతి కార్యక్రమంపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పోరాటం చేపడతామన్నారు. చేనేతల పరిస్థితేంటి? ధర్మవరంలో అత్యధిక సంఖ్యాకులైన చేనేత కార్మికులందరూ చేనేత మగ్గం నేసుకొని జీవనం సాగిస్తున్నారని అపార్ట్మెంట్ ద్వారా వారికి గదులు కేటాయిస్తే మగ్గం ఎలా వేసుకుంటారని కేతిరెడ్డి ప్రశ్నించారు. అంతేకాక అపార్ట్మెంట్లో ఉండటం ఇక్కడ ప్రాంతంలో సాధ్యం కాదని కేవలం స్థానిక ఎమ్మెల్యే వరదాపురం సూరి కంకర, ఇసుకను అమ్ముకునేందుకు మాత్రం ఇది ఉపయోపడుతుందన్నారు. -
ఈపీఎఫ్ఓ చందాదారులకు ఇళ్లు..!
న్యూఢిల్లీ: ఐదు కోట్ల మంది చందాదారులకు గృహ నిర్మాణ పథకాన్ని అందుబాటులోకి తేవాలన్న ప్రతిపాదనపై ఈపీఎఫ్ఓ (భవిష్య నిధి) ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తమ పెన్షన్ నిధి చందాదారులకు గృహ నిర్మాణ పథకాన్ని ఎలా అమలు చేయాలనే అంశంతో పాటు ఇతర అంశాలనూ పరిశీలించి, నెల రోజుల్లోగా ఒక నివేదికను అందజేసింది. దీనికి ఛైర్మన్గా మనీష్ గుప్తాను నియమించారు. సామాజిక ప్రయోజనాల కింద ఈపీఎఫ్వో చందాదారులకు గృహాల నిర్మాణ ప్రతిపాదనపై కసరత్తు చేస్తున్నట్లు గత వారం కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ పార్లమెంటులో ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈపీఎఫ్ఓ దాదాపు 6.5 లక్షల కోట్ల ఫండ్ను నిర్వహిస్తోంది. దీనికి వార్షికంగా రూ.70వేల కోట్లు జమవుతూ వస్తున్నాయి. దీంతో ‘2022 నాటికి అందరికీ ఇళ్లు’ అనే ప్రభుత్వ లక్ష్యాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అందుబాటు ధరల్లో ఇళ్లను అందించేలా మెగా హౌసింగ్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. దీంట్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఎన్బీసీసీ వంటి ప్రభుత్వ రంగ నిర్మాణ సంస్థలు, హుడా, డీడీఏ, పుడా వంటి స్థానిక సంస్థలనూ భాగస్వాముల్ని చేయాలని చూస్తోంది. రూ.15వేల లోపువారే అధికం... ఈపీఎఫ్ఓ చందాదారుల్లో రూ.15000 కన్నా తక్కువ బేసిక్ ఉన్నవారే దాదాపు 70 శాతం మంది. దీంతో వీరందరికీ అందుబాటు ధరల్లో ఇళ్లను నిర్మించే పథకం గురించి ఆలోచించాలని, అందుకోసం నిధులను ఉపయోగించాలని ఈపీఎఫ్ఓను కోరుతూ ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) ఇటీవల ఓ నోట్ను పంపింది. ‘‘ఈపీఎఫ్ఓ నిధుల్లో 15 శాతం తీస్తే రూ.70వేల కోట్లవుతాయి. దీంతో 3.5 లక్షల ఇళ్లు నిర్మించొచ్చు’’ అని ఆ నోట్లో పేర్కొంది. -
పీఎఫ్ చందాదారులకు ఇళ్ల పథకం!
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్వో)లో చందాదారులుగా ఉన్న 5 కోట్ల మందికి ఇళ్ల నిర్మాణ పథకం చేపట్టేందుకు కసరత్తు సాగుతోందని కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ లోక్సభలో తెలిపారు. ఈ మేరకు సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(సీబీటీ) కిందటేడాది డిసెంబర్లో ఒక కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. -
రూ. 4.60 లక్షల ఖర్చుతో పేదలకు ఇళ్లు
పేదలకు ఒక్కొక్కరికి రూ. 4.60 లక్షల ఖర్చుతో ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి ఇవ్వనున్నట్లు తెలంగాణ గృహనిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. గతంలో ప్రభుత్వం వీటికి రూ. 3.50 లక్షలు మాత్రమే ఖర్చవుతుందని అంచనా వేశారు. పెరిగిన అంచనా వ్యయంపై ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఇంద్రకరణ్ చెప్పారు. తెలంగాణ గృహ నిర్మాణ శాఖపై మంత్రి సోమవారం సమీక్షించారు. వచ్చే నెల నుంచి ఈ పథకాన్ని ప్రారంభించాలని భావిస్తున్నట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. ఏడాదికి రూ. 2 లక్షల ఇళ్ల చొప్పున మొత్తం 10 లక్షల ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై సీఐడీ నివేదిక వచ్చాక అఖిలపక్షంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. -
డీడీఏ వెబ్సైట్కు విశేష స్పందన
న్యూఢిల్లీ: హౌసింగ్ స్కీమ్-2014 కోసం ఢిల్లీ అభివృద్ధి సంస్థ(డీడీఏ) ప్రారంభించిన వెబ్సైట్కు నగరవాసుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కేవలం 48 గంటల్లో 18.25 లక్షల మంది ఈ హౌసింగ్ స్కీమ్ వివరాల కోసం డీడీఏ వెబ్సైట్ను సందర్శించారు. పేరుతో ప్రారంభించిన వెబ్సైట్ సోమవారం క్రాష్ కావడంతో దానిని మళ్లీ పునరుద్ధరించామని, వెబ్సైట్ ద్వారా అందిస్తున్న అన్ని ఆన్లైన్ సేవలు ఇకపై కూడా అందుతాయని డీడీఏ అధికారి ఒకరు మంగళవారం తెలిపారు. ప్రారంభించిన రోజే 11 లక్షల మంది వెబ్సైట్ను సందర్శించగా రెండో రోజు పునరుద్ధరించిన తర్వాత 7.25 లక్షల మంది వెబ్సైట్ను సందర్శించారని డీడీఏ సిస్టమ్స్ డెరైక్టర్ వి.ఎస్. తోమర్ తెలిపారు. వెబ్సైట్ క్రాష్ అయిన తర్వాత తమ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు శ్రమించి మరింత మెరుగ్గా వెబ్సైట్ను తీర్చిదిద్దారని, దీంతో ఆన్లైన్ సేవలు అందించడం ఇకపై మరింత సులువుతుందని తోమర్ అభిప్రాయపడ్డారు. -
పేదింటికి రూ.3,100 కోట్లు
ఆర్థిక మంత్రికి గృహనిర్మాణ శాఖ ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: నిరుపేదలకు రెండు పడక గదులతో ఇళ్లను నిర్మించి ఇచ్చే గృహనిర్మాణ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో వచ్చే బడ్జెట్లో తమకు రూ.3100 కోట్లను కేటాయించాలని గృహ నిర్మాణశాఖ ప్రతిపాదించింది. ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ నిర్వహించిన సన్నాహక సమావేశంలో గృహ నిర్మాణశాఖ పక్షాన ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఆ శాఖ చీఫ్ ఇంజనీర్ ఈశ్వరయ్యతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖ అంచనాలతో రూపొందించిన ప్రతిపాదనలను అందజేశారు. గతంలో ప్రారంభించి అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇళ్లను (నిర్మాణదశలో ఉన్నవి) కొనసాగించేందుకు రూ.1650 కోట్లు, కేసీఆర్ ఎన్నికల హామీలో పేర్కొన్న రెండు పడకగదుల ఇళ్ల కోసం రూ.1450 కోట్లను కేటాయించాల్సిందిగా ఇందులో కోరారు. -
జూలైలో గృహనిర్మాణ పథకం
న్యూఢిల్లీ: నగరవాసులకు శుభవార్త. ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) వచ్చే నెలలో భారీ గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభించనుంది. మొత్తం 26 వేల ఫ్లాట్ల నిర్మాణం చేపట్టింది. ఈ విషయాన్ని డీడీఏ ఉపాధ్యక్షుడు బల్వీందర్కుమార్ వెల్లడించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఒక పడక గది ఉండే 24 వేల ఫ్లాట్లతోపాటు మరో రెండు వేల ఫ్లాట్లను నిర్మిస్తున్నామన్నారు. ఈ పథకం జూలైలో అందుబాటులోకి వస్తుందన్నారు. డీడీఏ, 2014లో భాగంగా దీనిని చేపట్టామన్నారు. ద్వారకా, నరేలా, రోహిణి ప్రాంతాల్లో వీటిని నిర్మిస్తున్నామన్నారు. వీటి ధరలు రూ. 14 లక్షల నుంచి మొదలుకుని రూ. కోటిదాకా ఉంటాయన్నారు. కాగా ఈ పథకం నాలుగు ఏళ్ల విరామం తరువాత ప్రారంభమవనుంది. 2010లో డీడీఏ 16 వేల ఫ్లాట్లను నిర్మించిన సంగతి విదితమే. తాజా పథకంలో భాగంగా 24 వేల ఫ్లాట్లను చవక ధరలకు విక్రయించనుంది. మిగతా ఫ్లాట్లను ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీలుగా విభజించింది. సింగిల్ బెడ్రూం ఫ్లాట్లను ఆర్థికంగా వెనుకబడినవారికి కేటాయించాలా లేక మరెవరికి కేటాయించాలనే విషయమై త ్వరలో సమావేశమై ఓ నిర్ణయం తీసుకుంటామని బల్వీందర్కుమార్ తెలిపారు. ఈ ఫ్లాట్లలో అత్యధిక శాతం ప్రీ-ఫ్యాబ్రికేటెడ్గా నిర్మించామన్నారు. ఇవి హరిత లక్షణాలను కలిగి ఉంటాయన్నారు. 2021, ఢిల్లీ మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా నిర్మించామన్నారు. ద్వారకా, నరేలా, రోహిణి ప్రాంతాల్లో నాలుగు అంతస్తులు లేదా ఆపైన నిర్మించామన్నారు. జూలై చివరినాటికల్లా 15 వేల ఫ్లాట్లను సిద్ధం చేస్తామన్నారు. మిగతా వాటి నిర్మాణం వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకల్లా పూర్తవుతుందన్నారు. ఆ తర్వాత ఆయా లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. -
హౌసింగ్స్కీమ్పై స్పెషల్ డ్రైవ్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో చేపట్టిన హౌసింగ్స్కీమ్ ప్రయోజనాల గురించి లబ్ధిదారులకు తెలిసేలా స్పెషల్డ్రైవ్ నిర్వహించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్ హైదరాబాద్ కలెక్టర్ ముఖేశ్కుమార్ మీనా, సంబంధిత విభాగాల సీనియర్ అధికారులకు సూచించారు. శనివారం తన చాంబర్లో హౌసింగ్ స్కీమ్పై సమీక్ష సమావేశం నిర్వహించారు. హౌసింగ్స్కీమ్కు లబ్ధిదారులు చెల్లించాల్సిన కంట్రిబ్యూషన్ చెల్లించకపోవడం., రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రాకపోవడం తదితర ఇబ్బందులున్నాయని అధికారులు తెలిపారు. అందుకు స్పందిస్తూ కమిషనర్ బ్యాంకర్ల జాబితా..రుణాల వివరాలతో నివేదిక రూపొందించాలని అన్నారు. అవసరమైతే ఆయా బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు తగిన అవగాహన కల్పిస్తే ముందుకొస్తారంటూ ఆస్తిపన్ను వసూళ్లకు ఇటీవల నిర్వహించిన ఎర్లీబర్డ్ పథకాన్ని ప్రస్తావించారు. సమావేశంలో ఆయా విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.