implementation
-
పీఎన్బీ రుణ రేట్లు కట్..
న్యూఢిల్లీ: రిటైల్ రుణాలపై (గృహ, వాహన సహా) 25 బేసిస్ పాయింట్ల (0.25శాతం) మేర వడ్డీ రేటును తగ్గిస్తున్నట్టు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ప్రకటించింది. గృహ, కార్ల రుణాలు, విద్య, వ్యక్తిగత రుణాలకు ఈ తగ్గింపు అమలు కానుంది. ఐదేళ్ల విరామం తర్వాత ఆర్బీఐ ఈ నెల మొదట్లో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడం తెలిసిందే. ఈ తగ్గింపు ప్రయోజనాన్ని రుణగ్రహీతలకు బదిలీ చేస్తూ పీఎన్బీ కొత్త రేట్లను ప్రకటించింది. సవరణ తర్వాత గృహ రుణాలపై రేటు 8.15 శాతం నుంచి మొదలవుతుంది. అంటే ప్రతి లక్షకు చెల్లించాల్సిన ఈఎంఐ రూ.744గా ఉంటుందని పీఎన్బీ ప్రకటించింది. ఆటో రుణాలపై 8.50 శాతం నుంచి రేట్లు మొదలవుతాయి. ప్రతి లక్షకు రూ.1,240 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. పర్యావరణ అనుకూల ఇంధన వాహనాలకు 0.05 శాతం మేర వడ్డీలో రాయితీ ఇవ్వనుంది. అలాగే ఎక్స్ షోరూమ్ ధరపై 100 శాతం రుణంగా లభిస్తుంది. 120 నెలల కాలానికి ఎంపిక చేసుకోవచ్చు. విద్యా రుణాలపై రేట్లు 7.85 శాతానికి తగ్గాయి. వ్యక్తిగత రుణాలపై రేట్లు 11.25 శాతం నుంచి మొదలవుతాయి. కొత్త రేట్లు ఫిబ్రవరి 10 నుంచే అమల్లోకి వస్తాయని పీఎన్బీ ప్రకటించింది. -
రాష్ట్రపతి పాలన తొలిగా ఏ రాష్ట్రంలో ఎందుకు విధించారు?
ఇంఫాల్: మణిపూర్లో గురువారం(ఫిబ్రవరి 15) నుంచి రాష్ట్రపతి పాలన విధించారు. దీనికిముందు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. మణిపూర్లో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కొత్త నేత విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోనందున రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. దేశంలో ఎటువంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధిస్తారనే విషయానికొస్తే..రాజ్యాంగాన్ని అమలు చేసే యంత్రాంగం విఫలమైనప్పుడు ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి పాలన(President's rule) విధించవచ్చని రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 చెబుతోంది. అలాగే ఆర్టికల్ 356 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వాన్నయినా తొలగించి, ఆ రాష్ట్రాన్ని తన ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రపతి పాలన విధించడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం పరిపాలించలేని స్థితిలో ఉన్నప్పుడు లేదా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సూచనలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైనప్పుడు కేంద్రం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు అవకాశం ఉంది. 1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత నుంచి కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 356(Article 356)ను ఉపయోగిస్తూ వస్తోంది.దేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ 1951 జూన్ 20న పంజాబ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొలిసారిగా ఆర్టికల్ 356ను ఉపయోగించారు. ఆయన పంజాబ్ కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించారు. నాడు పంజాబ్ కమ్యూనిస్ట్ ప్రభుత్వం(Communist government)లో నెలకొన్న అంతర్గత విభేదాలను పరిష్కరించడానికే ఆ రాష్ట్రంలో రాష్ట్రపతిని విధించారని కొందరు రాజకీయ నిపుణులు చెబుతుంటారు. కాగా అధికారిక రికార్డుల ప్రకారం 1959లో మొదటిసారిగా కేరళలో ఎన్నికైన కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఆర్టికల్ 356 ఉపయోగించి రాష్ట్రపతి పాలన విధించారు. జవహర్లాల్ నెహ్రూకు కేరళ వామపక్ష ప్రభుత్వం నచ్చకపోవడమే దీనికి ప్రధాన కారణమనే ఆరోపణలున్నాయి. ఇది కూడా చదవండి: బీపీకి ఆయుర్వేద ఔషధం.. త్వరలో అందుబాటులోకి.. -
పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టిన ఇజ్రాయెల్
టెల్అవీవ్:కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత ఇటు ఇజ్రాయెల్ , అటు హమాస్ ఒప్పందం అమలు దిశగా వేగంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఒప్పదంలో భాగంగా ఇజ్రాయెల్ తాజాగా 90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. ఇప్పటికే హమాస్ తన వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరుల్లో నుంచి ముగ్గురిని విడుదల చేసింది.అనంతరం ఇజ్రాయెల్ 90 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టింది. ఇజ్రాయెల్,హమాస్ మధ్య తాజాగా కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో పదిహేను నెలల భీకర యుద్ధానికి తాత్కాలికంగా తెర పడింది. ఇజ్రాయెల్,హమాస్ మధ్య విరమణ ఒప్పందం ఆదివారం ఉదయం అమల్లోకి వచ్చింది.ఆరు వారాల్లో హమాస్ 33 మంది బందీలను, ఇజ్రాయెల్ దాదాపు 2వేల మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయనున్నాయి. మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని నెతన్యాహూ ప్రభుత్వంలో భాగస్వామి ఓజ్మా యేహూదిత్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రభుత్వం నుంచి ఆ పార్టీ వైదొలగింది. పార్టీకి చెందిన ముగ్గురు నేతలు ఇప్పటికే తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు.2023 అక్టోబర్ 7న పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్లోకి చొరబడి 1200 మందిని చంపారు.కొంత మందిని తమ వెంట బందీలుగా తీసుకెళ్లారు.దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ గాజాపై భీకర దాడులకు దిగింది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 47 వేల మంది దాకా మరణించినట్లు సమాచారం. తాజా కాల్పుల విరమణతో గాజాలో శాంతి నెలకొనే అవకాశాలున్నాయి. -
తూచా తప్పకుండా అమలవాల్సిందే
న్యూఢిల్లీ: బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు పేర్కొంది. దాని అమలులో వ్యక్తిగత వివాహ చట్టాలతో పాటు మరే ఇతర చట్టాలూ అడ్డంకి కాజాలవని స్పష్టం చేసింది. వాటిలో ఏది ముందనే ప్రశ్న తలెత్తే సందర్భంలో బాల్య వివాహాల నిషేధ చట్టమే అమలవుతుందని పేర్కొంది. సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జె.బి.పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు 141 పేజీల తీర్పు వెలువరించింది. బాల్య వివాహాల కట్టడికి మరింత సమర్థమైన విధానాలను అమలు చేయాలంటూ దాఖలైన పిల్పై ధర్మాసనం విచారణ జరిపింది. ‘‘బాల్య వివాహాలు ఒక సామాజిక రుగ్మత. బాలలకు, ముఖ్యంగా బాలికలకు ఆరోగ్యం, విద్య, ఉపాధితో పాటు జీవించే అవకాశాలనే ప్రశ్నార్థకం చేస్తుంది. కానీ భారత్లో బాల్య వివాహాలు ఇంకా ప్రబలంగా ఉండటం దురదృష్టకరం’’ అంటూ ఆవేదన వెలిబుచ్చింది. వాటి కట్టడికి జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా బాల్య వివాహాల నిషేధ అధికారులను నియమించాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. చట్టం అమలు తీరుతెన్నులపై మహిళా, శిశు సంక్షేమ, హోం శాఖలు మూడు నెలలకు ఓసారి సమీక్ష జరపాలని సూచించింది. బాల్య వివాహాలు తప్పని, వాటికి కఠిన శిక్షలు తప్పవని విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. ‘‘వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లు, ఎస్పీలపై ఉంటుంది. ఇందుకోసం పోలీసు శాఖలో జువనైల్ విభాగాన్ని ఏర్పాటు చేయాలి’’ అని పేర్కొంది. -
జమిలి ఇలా రెండు దశలుగా అమలు
కోవింద్ కమిటీ లోక్సభ ఎన్నికలకు ముందు గత మార్చిలో జమిలి ఎన్నికలపై నివేదిక సమరి్పంచింది. ’ఒక దేశం, ఒకే ఎన్నిక’ను రెండు దశల్లో అమలు చేయాలని సూచించింది. ఏం చెప్పిందంటే... → జమిలి ఎన్నికలను అమల్లోకి తెచ్చేందుకు చట్టపరంగా చెల్లుబాటయ్యే వ్యవస్థను కేంద్రం అభివృద్ధి చేయాలి. → తొలి దశలో లోక్సభకు, అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలి. → అనంతరం 100 రోజుల్లోపు రెండో దశలో పంచాయతీలు, మున్సిపాలిటీల వంటి స్థానిక సంస్థలన్నింటికీ ఎన్నికలు జరపేలా వ్యవస్థలను రూపొందించాలి. → సార్వత్రిక ఎన్నికలు జరిగి, కొత్తగా కొలువుదీరే లోక్సభ తొలిసారి సమావేశమయ్యే తేదీని ‘అపాయింటెడ్ డే’గా రాష్ట్రపతి నోటిఫై చేయాలి. దాంతో లోక్సభకు, అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు నాంది పడుతుంది. → అపాయింటెడ్ డే తర్వాత ఏర్పడే అన్ని అసెంబ్లీల గడువూ లోక్సభతో పాటే ముగుస్తుంది. తదనంతరం లోక్సభ, అన్నీ అసెంబ్లీల ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. → లోక్సభలో ఏ పారీ్టకీ మెజారిటీ రాకుండా హంగ్ ఏర్పడి, లేదా అవిశ్వాస తీర్మానం వంటివి నెగ్గి సభ రద్దయినా మళ్లీ ఎన్నికలు జరపాలి. → అలాంటి సందర్భంలో కొత్త సభ గడువు.. రద్దయిన సభలో మిగిలిన కాలావధి వరకు మాత్రమే ఉంటుంది. → అసెంబ్లీలకు కూడా ఇదే వర్తిస్తుంది. అంటే హంగ్ తదితర కారణాలతో ఎన్నికలు జరిగి మధ్యలో కొత్తగా ఏర్పడే అసెంబ్లీలు ఐదేళ్లు కొనసాగకుండా లోక్సభతో పాటే రద్దవుతాయి. → అన్ని ఎన్నికలకూ ఉమ్మడిగా ఒకే ఎలక్టోరల్ రోల్, ఓటర్ల ఫోటో గుర్తింపు కార్డు (ఎపిక్) ఉపయోగించాలి. ఆమోదం ఈజీ కాదు జమిలి ఎన్నికలకు పార్లమెంటు ఆమోదముద్ర పొందడం బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారుకు అంతా ఈజీ కాబోదు. నవంబర్ గేమ్ అధికార కూటమికి అంత అనుకూలంగా లేదు. జమిలికి సంబంధించి కోవింద్ కమిటీ పలు రాజ్యాంగ సవరణలు సూచించింది. వాటికి ఆమోదం లభించాలంటే ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మంది ఎంపీల మద్దతు తప్పనిసరి. అందుకు 543 మంది ఎంపీలున్న లోక్సభలో 362 మంది; 245 మంది ఎంపీలుండే రాజ్యసభలో 164 మంది మద్దతు అవసరం. కానీ ఎన్డీయే కూటమికి లోక్సభలో 293 మంది, రాజ్యసభలో 113 మంది ఎంపీలే అన్నారు. అయితే కోవింద్ కమిటీ ముందు జమిలిని సమరి్థంచిన పారీ్టలకున్న లోక్సభ సభ్యుల సంఖ్య 271 మాత్రమే. దాన్ని వ్యతిరేకించిన 15 పారీ్టలకు 205 మంది లోక్సభ సభ్యులున్నారు. విపక్ష ఇండియా కూటమికి రాజ్యసభలో 85 మంది సభ్యుల బలముంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రెడ్ బుక్ వేధింపులు..
-
నాడు విద్యుత్ పొదుపు భేష్
సాక్షి, అమరావతి: విద్యుత్ పొదుపులో ఆంధ్రప్రదేశ్ తీసుకున్న చర్యలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ(బీఈఈ) ఇటీవల వెల్లడించింది. రాష్ట్రంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ఉజాలా పథకం ద్వారా అందరికీ ఎల్ఈడీ బల్బులు అందుబాటులోకి తీసుకురావడం, వీధి దీపాల జాతీయ పథకం, వ్యవసాయ బోర్లకు విద్యుత్ ఆదా పంపు సెట్లు అమర్చడం వంటి ప«థకాలు సమర్థవంతంగా అమలయ్యాయి.రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలు, పంచాయతీలలో దాదాపు 29 లక్షల ఎల్ఈడీ వీధి దీపాలను ఎప్పటికప్పుడు పునరుద్ధరిస్తూ ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలిచింది. అదే విధంగా బీఈఈ ఆధ్వర్యంలో భవనాల్లో భారీ ఎత్తున విద్యుత్ పొదుపు సాధించేందుకు ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ) అమలు, రవాణా రంగంలో కాలుష్య నియంత్రణకి ఉద్దేశించిన ఎలక్ట్రిక్ వాహనాల(ఈ–మొబిలిటీ) పథకంలో విద్యుత్ వాహనాలకు రాయితీలు కల్పించడంలో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇటువంటి చర్యల ద్వారా రాష్ట్రంలో భారీగా విద్యుత్ ఆదాతో పాటు కర్బన ఉద్గారాలు తగ్గినట్లు బీఈఈ తెలిపింది. తద్వారా రాష్ట్ర విద్యుత్ వినియోగదారులకు, విద్యుత్ సంస్థలకు రూ.కోట్లలో ఆర్థిక ప్రయోజనం చేకూరినట్లు వివరించింది.ఉజాలా పథకంలో ఆదా ఇలా..దేశ వ్యాప్తంగా వార్షిక విద్యుత్ ఆదా – 47,882 మిలియన్ కిలోవాట్లు రాష్ట్రంలో వార్షిక విద్యుత్ ఆదా – 2,863 మిలియన్ కిలోవాట్లు ›దేశంలో వార్షిక విద్యుత్ వ్యయంలో మిగులు– రూ. 19,153 కోట్లు, రాష్ట్రంలో వార్షిక విద్యుత్ వ్యయంలో మిగులు – రూ.1,145 కోట్లు. దేశంలో పీక్ డిమాండ్ తగ్గుదల – 9,586 మెగావాట్లు రాష్ట్రంలో పీక్ డిమాండ్ తగ్గుదల – 573 మెగావాట్లుదేశంలో కర్బన ఉద్గారాల నియంత్రణ – 3,87,84,253 టన్నులు రాష్ట్రంలో కర్బన ఉద్గారాల నియంత్రణ – 33,18,461 టన్నులువీధి దీపాల జాతీయ పథకంలో ఆదా ఇలా.. దేశంలో వార్షిక విద్యుత్ ఆదా – 8,989.66 మిలియన్ కిలోవాట్లు రాష్ట్రంలో వార్షిక విద్యుత్ ఆదా – 1,980 మిలియన్ కిలోవాట్లు దేశ వ్యాప్తంగా పీక్ డిమాండ్ తగ్గుదల– 1,498 మెగావాట్లు రాష్ట్రంలో పీక్ డిమాండ్ తగ్గుదల– 330 మెగావాట్లుజాతీయ స్థాయిలో కర్బన ఉద్గారాల నియంత్రణ – 6.19 మిలియన్ టన్నులురాష్ట్రంలో కర్బన ఉద్గారాల నియంత్రణ – 1.36 మిలియన్ టన్నులు విద్యా సంస్థల్లో ఎనర్జీ క్లబ్లురాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ఇంధన సామర్థ్య ఫలాలను అందించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నాం. బీఈఈ ఆర్థిక సహకారంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) ద్వారా రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో ఇప్పటికే సుమారు 1,000 ఇంధన సామర్థ్య క్లబ్(ఎనర్జీ క్లబ్)లను ఏర్పాటు చేశాం. వీటి ద్వారా విద్యుత్ పొదుపుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం’’ – కె విజయానంద్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శివిద్యుత్ ఆదాలో తెలుగు రాష్ట్రాల కృషి ప్రశంసనీయంవిద్యుత్ ఆదా, లైఫ్మిషన్ అమలులో దక్షిణాది రాష్ట్రాలు, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలు చేస్తున్న కృషిని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ (సీఐసీ) హీరాలాల్ సమారియా కొనియాడారు. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అన్ని వర్గాల ప్రజలకు పర్యావరణహిత జీవన విధానాల కోసం మిషన్లైఫ్లో భాగస్వామ్యం కావాలని సమారియా పిలుపునిచ్చారు. బీఈఈ దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మీడియా సలహాదారు ఎ.చంద్రశేఖర్రెడ్డి ఢిల్లీలో సమారియాతో సోమవారం భేటీ అయ్యారు. ఏపీ సాధించిన విజయాలకు సంబంధించిన సమగ్ర నివేదికను సమారియాకు చంద్రశేఖరరెడ్డి అందించారు. – సీఐసీ హీరాలాల్ సమారియా -
ఇచ్చిన ప్రతి హామీ చంద్రబాబు అమలు చేయాలి
-
USA: ‘సీఏఏ’ అమలుపై అమెరికా కీలక ప్రకటన
వాషింగ్టన్: భారత్ తాజాగా అమలులోకి తీసుకువచ్చిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్(సీఏఏ)పై అగ్రరాజ్యం అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. సీఏఏ అమలు తీరును తాము నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయమై గురువారం అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మీడియాతో మాట్లాడారు. ‘మార్చ్ 11 సీఏఏ నోటిఫికేషన్పై మేం ఆందోళనతో ఉన్నాం. ఈ చట్టం అమలు తీరును గమనిస్తున్నాం. మత పరమైన స్వేచ్ఛను గౌరవించడం, అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించడం అనేవి ప్రజాస్వామ్య మూల సూత్రాలు’ అని మిల్లర్ పేర్కొన్నారు. అయితే హిందూ అమెరికన్లు మాత్రం సీఏఏను స్వాగతిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. US State Department spokesperson, Matthew Miller, provides the State Department's response to CAA, The Citizenship Amendment Act, being implemented in India.#CAAImplemented #CAA #CAAImplementation #CitizenshipAmendmentAct #CitizenshipAct pic.twitter.com/a9kAzL64ft — Diya TV (@DiyaTV) March 14, 2024 పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి డిసెంబర్ 31, 2014కు ముందు వలస వచ్చిన నాన్ ముస్లింలకు సీఏఏ ప్రకారం భారత పౌరసత్వం ఇస్తున్నారు. కేవలం ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే చాలు వలసవచ్చిన వారికి పౌరసత్వం జారీ చేస్తున్నారు. ఈ చట్టం కింద దేశంలోని ఒక్క ముస్లిం కూడా తమ పౌరసత్వాన్ని కోల్పోడని భారత ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. దేశంలో అన్ని మతాలు సమానమేనని స్పష్టం చేసింది. ఇదీ చదవండి.. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ పట్టుబడ్డ భారతీయులు ఇదీ చదవండి -
Lok Sabha elections 2024: కొత్త ప్రభుత్వం ఏర్పడుతూనే... 100 రోజుల అజెండా!
న్యూఢిల్లీ: ‘వికసిత్ భారత్: 2047’ దార్శనిక పత్రంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మేధోమథనం నిర్వహించారు. ఆయన ఆదివారం తన సహచర మంత్రులతో సమావేశమయ్యారు. ‘2047 నాటికి వికసిత్ భారత్’ అనే లక్ష్య సాధన కోసం రాబోయే ఐదేళ్లలో అనుసరించాల్సిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా 100 రోజుల అజెండాను మోదీ తెరపైకి తీసుకొచి్చనట్లు సమాచారం. రాబోయే మే నెలలో ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే 100 రోజుల్లో అమలు చేయాల్సిన అజెండాపై ఆయన చర్చించారు. దీనిపై కొందరు మంత్రులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. మంత్రివర్గ భేటీలో కొన్ని కీలక అంశాలపై ప్రజంటేషన్ కూడా ఇచి్చనట్లు తెలిసింది. లోక్సభ ఎన్నికల్లో ప్రజల మద్దతు పొందాలని, ఘన విజయమే లక్ష్యంగా పనిచేయాలని సహచర మంత్రులకు మోదీ సూచించారు. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమంతోపాటు దేశ అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 370కిపైగా స్థానాలు, ఎన్డీయే 400కుపైగా స్థానాలు గెలుచుకుంటాయని మరోసారి ధీమా వ్యక్తం చేశారు. రోడ్మ్యాప్ సిద్ధం ప్రధాని మోదీ లక్ష్యానికి అనుగుణంగా ‘వికసిత్ భారత్’ సాధన కోసం రోడ్మ్యాప్ సిద్ధం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. ఇందుకోసం గత రెండున్నరేళ్లలో వివిధ స్థాయిల్లో 2,700 సమావేశాలు, వర్క్షాప్లు, సెమినార్లు నిర్వహించినట్లు తెలిపాయి. 20 లక్షల మంది యువతీ యువకుల నుంచి సలహాలు సూచనలు అందినట్లు పేర్కొన్నాయి. ఈ రోడ్మ్యాప్ ఆర్థిక వృద్ధి, అభివృద్ధి లక్ష్యాలు, సులభతర జీవనం, సులభతర వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, సామాజిక సంక్షేమం వంటి అంశాలతో కూడిన ఒక సమగ్ర బ్లూప్రింట్ అని అధికారులు స్పష్టం చేశారు. 10 రోజులు.. 29 కార్యక్రమాలు లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాని మోదీ రాష్ట్రాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. రాబోయే 10 రోజుల్లో 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు చేయబోతున్నారు. ఆ సందర్భంగా మొత్తం 29 కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు అనేక ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, పశి్చమ బెంగాల్, జమ్మూకశీ్మర్, అస్సాం, అరుణాచల్ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్, ఢిల్లీలో మోదీ పర్యటిస్తారని అధికార వర్గాలు ఆదివారం పేర్కొన్నాయి. మోదీ సోమవారం తెలంగాణలో పర్యటించనున్నారు. -
నూతన క్రిమినల్ చట్టాలు అమలు ఎప్పటి నుంచో తెలుసా?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మూడు నూతన క్రిమినల్ చట్టాలు జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ మేరకు నూతన చట్టాలు జూలై 1 నుంచి అమలులోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. గత ఏడాది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులు చట్టంగా మారాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశంలో మూడు క్రిమినల్ బిల్లులను పార్లమెంట్ ఉభయసభలు ఆమోదించిన విషయం తెలిసిందే. ఇండియన్ పీనల్ కోడ్–1860, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్–1898, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్–1872 స్థానంలో ఈ మూడు బిల్లులను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం చదవండి: నూతన క్రిమినల్ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం -
ఓట్ ఫ్రమ్ హోం
సాక్షి, నరసరావుపేట: చేతికర్ర సాయంతో ఓ దివ్యాంగుడు.. ఆటోలో ఓ ముసలవ్వ.. ఇలా అనేక మంది ఎన్నికల కేంద్రాలకు వచ్చి ఓటు వేసేందుకు పడే తిప్పలు గతంలో కనిపించేవి. కేంద్ర ఎన్నికల సంఘం ఇలాంటి వారి కష్టాలకు చెక్ పెట్టింది. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40%కి మించి వైకల్యం ఉన్న వారు ఇంటి వద్ద నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ విధానాన్ని సీఈసీ ఇప్పటికే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయవంతంగా అమలు చేసింది. ఇప్పుడు ఏపీలోనూ అమలుకు చర్యలు చేపట్టింది. పోస్టల్ బ్యాలెట్ తరహాలోనే.. ఇంటి నుంచి ఓటు వేయడానికి కూడా ముందుగానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 80 ఏళ్ల పైబడి వయసు ఉన్నవారు, దివ్యాంగులు ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ఐదు రోజుల ముందే 12డీ ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వీటిని ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందాలు పరిశీలిస్తాయి. అర్హులైన వారికే ‘ఓట్ ఫ్రమ్ హోం’కు అవకాశం కల్పిస్తాయి. బూత్ లెవల్ అధికారి కూడా ఇంటి నుంచే ఓటు వేయడానికి అర్హులైన వారిని సంప్రదించి.. వారి ఆసక్తికి అనుగుణంగా దరఖాస్తు చేయిస్తారు. పోలింగ్ బూత్ తరహా ఏర్పాట్లు ఇంటి నుంచే ఓటు వేసే కార్యక్రమానికి కూడా సాధారణంగా పోలింగ్ కేంద్రంలో మాదిరిగానే జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేస్తారు. ఓటు ఎవరికి వేశారో బయటకు రాదు. పోలింగ్ సిబ్బందితో పాటు ఆయా పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు కూడా వారి వెంట ఉంటారు. ఇంటి నుంచి ఓటు వేయటానికి ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారు, ఎంత మందికి ఓటు హక్కు కల్పించారనే వివరాలను అన్ని రాజకీయ పార్టీలతో పాటు పోటీలో ఉన్న అభ్యర్థులకు కూడా ఎన్నికల సిబ్బంది సమాచారమిస్తారు. వయో వృద్ధులు, దివ్యాంగులు ఈ సదుపాయాన్ని సది్వనియోగం చేసుకోవాలని ఎన్నికల అధికారులు కోరారు. మంచి అవకాశం... 80 ఏళ్లు నిం.డిన మా లాంటి వారు పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేయాలంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఈ పరిస్థితిని గుర్తించి ఎన్నికల సంఘం ఇంటి వద్ద నుంచే ఓటు వేయడానికి అవకాశం కల్పించడం సంతోషంగా ఉంది. దీని వల్ల ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశముంది. – యెన్నం వెంకట నర్సిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్. ఉప్పలపాడు, పల్నాడు జిల్లా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేక కొంతమంది తమ విలువైన ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారు. దీనిని సరిచేసేందుకు ఎన్నికల సంఘం ఇంటి నుంచే ఓటు వేసేందుకు అవకాశం కల్పించింది. ఈ విధానం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయవంతమైంది. మన రాష్ట్రంలో అమలు చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విధానాన్ని అర్హులైన వారు వినియోగించుకునేలా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. – ఎల్ శివశంకర్, పల్నాడు జిల్లా కలెక్టర్ -
ప్రజల బాగు ప్రతిపక్షాలకు ఇష్టం లేదు
అబ్దుల్లాపూర్మెట్: ప్రజలు బాగుండటం ప్రతిపక్షాలకు ఇష్టం లేదనీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేయకుంటే బాగుండని బీఆర్ఎస్ కోరుకుంటోందని, అలాంటి ఆశలు నిజం కానివ్వబోమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తేల్చిచెప్పారు. అలాంటి పగటి కలలను కనడం బీఆర్ఎస్ మానుకోవాలని సూచించారు. ఆరు గ్యారంటీల పథకాల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని గురువారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ గ్రామంలో స్థానిక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగిన డిసెంబర్ 28నే ఆరు గ్యారంటీ పథకాల దరఖాస్తుల స్వీకరణ చేపట్టడం శుభపరిణామంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్నది దొరల ప్రభుత్వం కాదని, ప్రజల చేత, ప్రజల కోసం ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. మా పార్టీలోకి వస్తేనే పథకాలు.. అలాంటి బెదిరింపులు ఉండవు తెలంగాణ రాష్ట్ర బిడ్డలైతే చాలు ఆరు గ్యారంటీ పథకాల్లో అవకాశం కల్పిస్తామని ఈ విషయంలో ఎలాంటి రాజకీయ పక్షపాతం ఉండదని ఆయన తేల్చిచెప్పారు. గత ప్రభుత్వం మాదిరిగా మా పార్టీలోకి వస్తేనే.. మా పార్టీ కండువాలు కప్పుకుంటేనే.. సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పడం వంటిæ బెదిరింపులు కాంగ్రెస్ పాలనలో ఉండవని భట్టి స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వంలో రెవెన్యూ, పోలీస్తో పాటు ప్రతి వ్యవస్థ నా కోసమే ఉందన్న భావన ప్రతి పౌరుడికి కలిగిస్తామని చెప్పారు. పదేళ్లుగా మగ్గిపోయిన ప్రజలకు ఇప్పుడే ఊపిరి కోరి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరక పదేళ్లుగా బీఆర్ఎస్ పాలనలో మగ్గిపోయారని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రేషన్ కార్డులు, ఇళ్లు మంజూరు చేయకుండా గత ప్రభుత్వం దుర్మార్గపు పాలన కొనసాగించిందని విమర్శించారు. పదేళ్లుగా కాంగ్రెస్ పోరాటాలతో ప్రజలను చైతన్యవంతులను చేసి ఇందిరమ్మ రాజ్యం తీసుకువచ్చిందని, ఇప్పుడు అర్హులైన అందరికీ న్యాయం జరుగుతుందని భరోసానిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన గంటలోపే రాష్ట్ర మహిళలందరికీ ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం కల్పించామని గుర్తు చేశారు. పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్కుమార్ సుల్తానియా, పంచాయతీ రాజ్ కమిషనర్ హనుమంతరావు, ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ కమిషనర్ శృతిఓజా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గౌతం పొట్రు, రాచకొండ సీపీ సుధీర్బాబు పాల్గొన్నారు. -
ఏపీలో వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాల అమలు భేష్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ కింద గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించే టేక్ హోమ్ రేషన్ పంపిణీ ఆంధ్రప్రదేశ్లో బాగా అమలవుతోందని నీతి ఆయోగ్ నివేదిక కితాబు ఇచ్చిది. వివిధ రాష్ట్రాల్లో టేక్ హోమ్ రేషన్ పంపిణీల్లో మంచి పద్ధతులపై నీతి ఆయోగ్ నివేదిక రూపొందించింది. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో రక్తహీనత, పౌష్టికాహార లేమిని పూర్తిగా తొలగించడమే లక్ష్యంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిగిరిజన ప్రాంతాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్, మైదాన ప్రాంతాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాలను అంగన్వాడీ కేంద్రాల ద్వారా పక్కాగా అమలు చేస్తోందని నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేసింది. వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం కోసం ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ స్మార్ట్ ఫోన్ ఆధారిత సాఫ్ట్వేర్ను వినియోగిస్తోందని, తద్వారా టేక్ హోమ్ రేషన్ పంపిణీకి సంబంధించి బహుళ అంశాలను ట్రాక్ చేస్తున్నట్టు నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది. తద్వారా రేషన్ పంపిణీ సమయంలో లీకేజీలను నిరోధించడంతో పాటు పక్కాగా ధ్రువీకరణ జరుగుతోందని నీతి ఆయోగ్ తెలిపింది. అంగన్వాడీ కేంద్రాల వారీగా అంగన్వాడీ వర్కర్లు ప్రతినెలా వివిధ వర్గాలకు చెందిన లబ్ధిదారుల వివరాలను యాప్లో నమోదు చేయడంతోపాటు ప్రతినెలా ఆ డేటాను నవీకరిస్తున్నట్టు నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది. నీతి ఆయోగ్ ఇంకా ఏం చెప్పిందంటే.. ► ఈ–సాధన సాఫ్ట్వేర్ నుంచి లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా ప్రతినెలా టేక్ హోమ్ రేషన్ సరుకులు ఎంత పరిమాణం అవసరమో అంచనా వేస్తారు. గత నెలకు సంబంధించి నిల్వలు ఏమైనా ఉన్నాయా అనే వివరాలను పరిగణనలోకి తీసుకుని, ప్రతినెలా బడ్జెట్ అంచనాలను అభివృద్ధి చేస్తారు. ► సాఫ్ట్వేర్ డేటాతో మరోసారి రీ వెరిఫికేషన్ చేస్తున్నారు. ప్రభుత్వంలో నమోదైన సరఫరాదారులకు పాలు, గుడ్లు తదితర డ్రై రేషన్ సరుకులు అంగన్వాడీ కేంద్రాల వారీగా ఎంత పరిమాణం కావాలో తెలియజేస్తారు. ► జిల్లాల వారీగా ఏయే అంగన్ వాడీ కేంద్రాలకు ఎంత పరిమాణంలో డ్రై రేషన్ అవసరమో అంచనా మేరకు సరఫరాదారు డెలివరీ చేస్తారు. ►అవసరమైన మెటీరియల్ సరఫరా చేసారా లేదా అనే విషయాన్ని అంగన్వాడీ వర్కర్ యాప్లోని డేటా ఎంట్రీ ద్వారా బయోమెట్రిక్ ప్రమాణీకరణతో ధ్రువీకరిస్తారు. ►ఆ వెంటనే అంగన్వాడీ కేంద్రానికి సరఫరా అయిన టేక్ హోమ్ రేషన్ పరిమాణాన్ని మహిళా సూపర్వైజర్ తనిఖీ నిర్వహిస్తారు. ఆ తరువాత శిశు అభివృద్ధి ప్రాజెక్టు డైరెక్టర్ మరోసారి తనిఖీ నిర్వహిస్తారు. నాణ్యతను కూడా నిర్థారిస్తారు. -
న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాం..
సాక్షి, హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ల చట్టం తక్షణ అమలు కోసం భారత్ జాగృతి న్యాయపోరాటం చేయనున్నట్లు ఆ సంస్థ అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ మేరకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని, వారి సలహా మేరకు సుప్రీంకోర్టులో ఈ అంశంపై పెండింగ్లో ఉన్న పిటిషన్లో భారత్ జాగృతి తరఫున ఇంప్లీడ్ అవుతామని ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. తాము పోరాడి సాధించిన మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయించడానికి కూడా మరో పోరాటానికి సిద్ధమైనట్లు తెలిపారు. మహిళా రిజర్వేషన్ల చట్టం తక్షణ అమలుకు పలు రాజకీయ పార్టీలు, సంస్థలు డిమాండ్ చేస్తున్నాయని, ఈ మేరకు ఇప్పటికే పలు సంస్థలు కోర్టుకు వెళ్లాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా స్పందించి, 2024 సార్వత్రిక ఎన్నికల నుంచి రిజర్వేషన్లు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. -
మార్కెట్కు ‘ఫెడ్’ బూస్ట్!
ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఊహించినట్లే యథాతథంగా ఉంచడంతో పాటు సరళతర ద్రవ్య విధాన అమలు వ్యాఖ్యలు ఈక్విటీ మార్కెట్లలో సానుకూలతలు నింపాయి. దేశీయంగా వాహన విక్రయాలు రికార్డు గరిష్టానికి చేరుకోవడం, జీఎస్టీ వసూళ్లు పెరగడం, కార్పొరేట్ క్యూ2 ఆర్థిక ఫలితాలు మెప్పించడం కలిసొచ్చాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 490 పాయింట్లు పెరిగి 64,081 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 144 పాయింట్లు బలపడి 19,133 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం భారీ లాభాల్లో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆద్యంతం జోరు కనబరిచాయి. ఒక దశలో సెన్సెక్స్ 611 పాయింట్లు దూసుకెళ్లి 64,203 వద్ద, నిఫ్టీ 186 పాయింట్లు బలపడి 19,175 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. రియల్టీ, ప్రభుత్వరంగ బ్యాంకులు, మెటల్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా షేర్లకు చిన్న, మధ్య తరహా షేర్లు భారీ డిమాండ్ లభించింది. దీంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ సూచీలు ఒకశాతానికి పైగా ర్యాలీ చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,261 కోట్ల షేర్లను అమ్మేయగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1380 కోట్ల షేర్లు కొన్నారు. ఫెడ్ రిజర్వ్ నుంచి సానుకూల సంకేతాలు, జపాన్ ప్రభుత్వం 113 బిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీకి ప్రకటన, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ సైతం వడ్డీరేట్ల జోలికెళ్లకపోవడం తదితర పరిణామాలతో ఆసియా, యూరప్ మార్కెట్లు 1–2% ర్యాలీ చేశాయి. అమెరికా స్టాక్ మార్కెట్లు 1–1.5 శాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ► సెన్సెక్స్ ర్యాలీతో బీఎస్ఈలో ఇన్వెస్టర్లు సంపదగా భావించే కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.3.1 లక్షల కోట్లు పెరిగి రూ. 313.32 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ 30 షేర్లలో టెక్ మహీంద్రా(1%), బజాజ్ ఫైనాన్స్(0.25%) మాత్రమే నష్టపోయాయి. ► క్యూ2 నికర లాభం ఐదు రెట్లు వృద్ధి సాధించడంతో జేకే టైర్ షేరు 10% లాభపడి రూ.337 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో 14% ర్యాలీ చేసి రూ.351 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. ► క్యూ2 ఫలితాల ప్రకటన తర్వాత హీరో మోటో కార్ప్ షేరులో లాభాల స్వీకరణ జరిగింది. 1% నష్టపోయి రూ.3050 వద్ద స్థిరపడింది. -
కొందరికే ‘గృహలక్ష్మి’!
సాక్షి, హైదరాబాద్: గృహలక్ష్మి లబ్ధిదారుల జాబితా తయారీ అర్ధాంతరంగా నిలిచిపోయింది. నాలుగు లక్షల మందితో జాబితా రూపొందించాల్సి ఉండగా, సోమవారం వరకు కేవలం 1.75 లక్షల మందికి మాత్రమే మంజూరు పత్రాలు జారీ చేయగలిగారు. దీంతో అంతే సంఖ్యతో లబ్ధిదారుల జాబితా రూపొందింది. ఎన్నికల కోడ్ అమలులోకి రావటంతో జాబితా రూపొందించే పని నిలిచిపోయింది. ఎమ్మెల్యేల జాబితాలతో జాప్యం.. గృహలక్ష్మి పథకానికి గత బడ్జెట్లో ప్రభుత్వం నిధులు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. సొంత జాగా ఉన్న ఒక్కో లబ్ధిదారుకు రూ.3 లక్షలు అందించాల్సి ఉంటుంది. కానీ, దరఖాస్తుల ప్రక్రియను మాత్రం చాలా ఆలస్యంగా ప్రారంభించింది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో దరఖాస్తుల సేకరణ ప్రక్రియ ప్రారంభించగా, 15 లక్షల వరకు అందాయి. వాటి నుంచి 4 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. నియోజకవర్గంలో ఏయే ఊళ్లు, ఒక్కో ఊరు నుంచి ఎంతమంది లబ్ధిదారులు.. అన్న విషయంలో అధికారపార్టీ ఎమ్మెల్యేలకు బాధ్యతను అప్పగించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే, లబ్ధిదారుల జాబితా రూపొందించాల్సి ఉన్నా.. వివరాలు మాత్రం ఎమ్మెల్యేలు అందించాల్సి ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలు వేగంగా స్పందించగా, కొందరు జాప్యం చేశారు. ఫలితంగా జాబితా రూపొందించే ప్రక్రియ నత్తనడకన సాగింది. పూర్తి జాబితా కోసం ఈసీని అనుమతి అడుగుతామంటున్న అధికారులు ఈనెల ఆరో తేదీ తర్వాత ఏ క్షణాన్నయినా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందన్న సమాచారంతో, ఐదో తేదీ రాత్రి వరకు జాబితాను సిద్ధం చేసి సమర్పించాల్సిందిగా సచివాలయం నుంచి సంబంధిత అధికారులకు ఆదేశాలందాయి. కానీ, ఎమ్మెల్యేల నుంచి వివరాలు సకాలంలో అందకపోవటంతో.. సోమవారం నాటికి 1.75 లక్షల మందితో కూడిన లబ్ధిదారుల జాబితా సిద్ధమైనట్టు తెలిసింది. కొన్ని జిల్లాల నుంచి వివరాలు అందాల్సి ఉందని, దీంతో ఆ సంఖ్య కొంతమేర పెరిగే అవకాశం ఉందని అధికారులంటున్నారు. కోడ్ అమలులోకి వచ్చినందున, మిగతా లబ్ధిదారుల ఎంపిక ఇప్పట్లో ఉండదని, కొత్త ప్రభుత్వం కొలువు దీరిన తర్వాతనే ఉంటుందని అధికారులు అంటున్నారు. అయినా, పూర్తి జాబితా సిద్ధం చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. ఏదైనా ఇక ఎన్నికల తర్వాతనే.. ఎన్నికలు ముగిసి కోడ్ అడ్డంకి తొలగిపోయిన తర్వాతనే ప్రక్రియ పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చే ప్రభుత్వ ఆలోచనలకు వీలుగా ఈ పథకం భవిష్యత్తు ఆధారపడి ఉంది. కోడ్ అమలులోకి వచ్చే లోపు మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులకు మాత్రం రూ.3 లక్షల చొప్పున నిధులు విడుదలవుతాయి. వారు పనులు మొదలుపెట్టుకోవచ్చు. మిగతా లబ్ధిదారులకు నిధుల విడుదల ప్రక్రియ మాత్రం ఎన్నికల తర్వాతనే జరుగుతుందని అధికారులంటున్నారు. కొలువుదీరే కొత్త ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించాలనుకుంటేనే ఆ ప్రక్రియ ముందుకు సాగుతుందని, లేనిపక్షంలో తదనుగుణంగా నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. -
ఏపీలో పథకాల అమలు భేష్
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కేంద్ర, రాష్ట్ర పథకాల అమలు తీరు ప్రశంసనీయంగా ఉందని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ కనిమొళి కరుణానిధి అభినందించారు. కనిమొళి అధ్యక్షతన 11 మంది ఎంపీలతో కూడిన బృందం విశాఖ జిల్లాలోని ఆనందపురం, పద్మనాభం మండలాల్లో శనివారం పర్యటించింది. కేంద్ర నిధులతో జరుగుతున్న పనులను పరిశీలించారు. శొంఠ్యాంలోని రామ్సాగర్ అమృత్ సరోవర్ ట్యాంకుతోపాటు, చందక గ్రామంలో వ్యవసాయ భూరీ సర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు. పద్మనాభం మండలం రెడ్డిపల్లి సచివాలయంలో అందుతున్న సేవల గురించి ఆరా తీసింది. వివిధ గ్రామాలకు చెందిన స్వయం సహాయక బృందాల సభ్యులతో మాట్లాడి పథకాల అమలు తీరుపై ఆరా తీశారు. సచివాలయాల సేవలు అద్భుతం అనంతరం నగరంలోని ఓ హోటల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన సంస్థ విభాగాలకు సంబంధించిన జిల్లా అధికారులు, యూనియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ అధికారులతో శనివారం రాత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కనిమొళి మాట్లాడుతూ.. గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు అద్భుతంగా ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత అధికారులపై ఉందన్నారు. జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు తీరుని ప్రశంసించారు. సమావేశంలో పార్లమెంటరీ కమిటీ సభ్యులు మాల రాజ్యలక్ష్మీషా, అజయ్ ప్రతాప్సింగ్, తలారి రంగయ్య, నరాన్భాయ్ జె.రత్వా, ఏకేపీ చిన్రాజ్, రాజీవ్ దిలేర్, మహ్మద్ జావెద్, వాజేసింగ్భాయ్ రత్వా, ఇరన్నా కడాది, నరేంద్రకుమార్తో పాటు జిల్లా కలెక్టర్ మల్లికార్జున పాల్గొన్నారు. -
పోషణ్ అభియాన్లో ఏపీ భేష్.. జాతీయ స్థాయిలో 2వ స్థానం
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ ఫ్లాగ్షిప్ కార్యక్రమం పోషణ్ అభియాన్ను సమగ్రంగా అమలు చేయడంలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ పెద్ద రాష్ట్రాల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ మేరకు నీతి ఆయోగ్ తాజా నివేదిక వెల్లడించింది. ఇక చిన్న రాష్ట్రాల్లో సిక్కిం అత్యుత్తమ పనితీరు కనబరిచినట్లు తెలిపింది. కేంద్రపాలిత ప్రాంతాల్లో దాద్రానగర్ హవేలీ, డామన్ –డయ్యూ అగ్రస్థానంలో ఉన్నాయని పేర్కొంది. పథకాన్ని సమగ్రంగా అమలు చేయడంలో అత్యల్ప పనితీరును కనబరిచిన పెద్ద రాష్ట్రాల్లో పంజాబ్, బిహార్ ఉన్నాయని నివేదిక వెల్లడించింది. 19 పెద్ద రాష్ట్రాల్లో 12 రాష్ట్రాలు పోషణ్ అభియాన్ అమల్లో 70 శాతానికి పైగా స్కోర్ను సాధించినట్లు వివరించింది. దేశంలో పిల్లలు, మహిళలకు పోషకాహారం అందించడంలో పురోగతిని, కరోనా సమయంలో పథకం అమలు తీరును నీతి ఆయోగ్ నివేదిక విశ్లేషించింది. 75 శాతం పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెంపు 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 12–23 నెలల వయసు గల పిల్లల్లో 75 శాతం కంటే ఎక్కువ మంది పూర్తిగా రోగనిరోధక శక్తిని కలిగి ఉన్నారని నీతి అయోగ్ నివేదిక వివరించింది. అలాగే 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పూర్తిగా రోగనిరోధక శక్తిని కలిగిన పిల్లలు 25 శాతం కంటే తక్కువ మంది ఉన్నారని ఎత్తిచూపింది. అలాగే బిహార్లో (65 శాతం గర్భిణులు, 62 శాతం బాలింతలు, 52 శాతం పిల్లలు), పంజాబ్లో (78 శాతం గర్భిణులు, 76 శాతం బాలింతలు, 65 శాతం పిల్లలు) రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని పేర్కొంది. నివేదిక ప్రకారం.. 16 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 75 శాతం కంటే ఎక్కువ మంది పిల్లలు (0–59 నెలలు) ఓఆర్ఎస్తో చికిత్స పొందుతున్నారని వివరించింది. ఐదు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 25 శాతం మంది పిల్లలు డయేరియాకు ఓఆర్ఎస్తో చికిత్స పొందినట్లు తెలిపింది. నిధుల వినియోగంలో పలు రాష్ట్రాలు వెనుకంజ.. పోషణ్ అభియాన్ కింద కేంద్రం ఇచ్చే మొత్తం నిధులను వినియోగించడంలో పలు రాష్ట్రాలు వెనుకపడ్డాయని నివేదిక పేర్కొంది. 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 50 శాతం కంటే తక్కువ నిధులను ఖర్చు చేశారని నివేదిక వెల్లడించింది. పోషణ్ అభియాన్ కోసం విడుదల చేసిన నిధులు పూర్తిగా ఖర్చయ్యేలా చూడాలని సూచించింది. తగినంతగా ఆరోగ్య సదుపాయాలు, సామగ్రి ఉండేలా చూడాల్సి ఉందని పేర్కొంది. అలాగే సమీకృత శిశు అభివృద్ధి పథకం, ఆరోగ్య కార్యక్రమాలను బలోపేతం చేయాలని నిర్దేశించింది. కన్వర్జెన్స్ యాక్షన్ ప్లాన్లను (సీఏపీ) అమలు చేయాలని సూచించింది. కార్యక్రమాల అమలుకు గృహ ఆధారిత కౌన్సెలింగ్ను బలోపేతం చేయాలని తెలిపింది. చదవండి: చెప్పాడంటే చేస్తాడంతే.. సీఎం జగన్ సక్సెస్ మంత్రా ఇదే.. -
దశలవారీగా డిజిటల్ కరెన్సీ అమలు
న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని (సీబీడీసీ) హోల్సేల్, రిటైల్ విభాగాలకు దశలవారీగా అమలు చేసే ప్రక్రియలో ఉన్నట్టు భారతీయ రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. సీబీడీసీని ప్రవేశపెడుతున్నట్లు 2022-23 కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్థిక బిల్లు 2022 ఆమోదంతో ఆర్బీఐ చట్టం-1934లోని సంబంధిత సెక్షన్కు అవసరమైన సవరణలు చేసినట్టు ఆర్బీఐ ఫిన్టెక్ ఈడీ అజయ్ కుమార్ చౌదరి ఫిక్కీ సదస్సులో బుధవారం తెలిపారు. బిల్లు ఆమోదం పొందడంతో పైలట్ ప్రాజెక్ట్ను నిర్వహించి, డిజిటల్ కరెన్సీని జారీ చేసేందుకు ఆర్బీఐకి వీలు కల్పించిందని ఆయన చెప్పారు. డిజిటల్/వర్చువల్ కరెన్సీ అయిన సీబీడీసీ 2023 ప్రారంభంలో రంగ ప్రవేశం చేసే అవకాశం ఉంది. ప్రైవేట్ వర్చువల్ కరెన్సీలు లేదా క్రిప్టోకరెన్సీలతో ఇది పోల్చదగినది కాదు. ఈ ఏడాది 323 బ్యాంక్ల ద్వారా యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయని అజయ్ వెల్లడించారు. నెలవారీ లావాదేవీలు 590 కోట్లకు చేరుకున్నాయని, వీటి విలువ రూ.10,40,000 కోట్లు అని వివరించారు. -
సెంటర్ షేకైపోవాలి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు కోసం కేంద్రంపై పోరాడుతున్న అధికార టీఆర్ఎస్ తమ ఆందోళనలను ఉధృతం చేయాలని భావిస్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ సహా పలువురు మంత్రులు దీనిపై కేంద్రానికి లేఖాస్త్రాలు సంధిస్తుండగా ఇకపై క్షేత్రస్థాయి పోరాటాలకు అవసరమైన కార్యాచరణ కోసం పదును పెడుతోంది. సీసీఐ కోసం ఒత్తిడి పెంచేలా... సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆదిలాబాద్ యూనిట్ పునరుద్ధరణకు పార్లమెంటు వేదికగా కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్న మంత్రి కేటీఆర్ ఈ అంశంపై మాజీ మంత్రి జోగు రామన్న నేతృత్వంలో పార్టీ నేతలు, జిల్లా ప్రముఖులతో తాజాగా చర్చించారు. ‘సీసీఐ సాధన సమితి’గా ఏర్పడి కేంద్రంపై ఉద్యమించేందుకు కార్యాచరణ మొదలు పెట్టా లని ఈ సమావేశంలో నిర్ణయించారు. బయ్యారం స్టీల్ ప్లాంటు ఏర్పాటు డిమాండ్తో టీఆర్ఎస్ నేతలు శుక్రవారం మహబూబాబాద్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఇక కాజీపేటలో రైల్వే వ్యాగన్ల ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయిం చినా కేంద్రం మంజూరు చేయడం లేదు. దీనిపై కేంద్రం వైఖరిగా నిరసనగా అఖిలపక్షం ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శనివారం కాజీపేటలో ధర్నా చేయనుంది. సోమవారం సికింద్రాబాద్ రైల్వే జీఎం కార్యాలయం ఎదుట నిరసన చేపట్టనుంది. ప్రభుత్వరంగ సంస్థల అప్పగింతపైనా పోరు సింగరేణి సంస్థను ప్రైవేటీకరించేందుకు కేం ద్రం ప్రయత్నిస్తోందంటూ టీఆర్ఎస్ ఇప్పటి కే పలు సందర్భాల్లో నిరసన వ్యక్తం చేసింది. బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, బీడీఎల్, హెచ్ఏఎల్, డీఆర్డీఎల్, ఈసీఐల్, తపాలా, బీమా, బ్యాంకింగ్ తదితర రంగాలనూ కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు మోదీ ప్రభుత్వం కుట్రపన్నుతోందని దుయ్యబడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలతో మాజీ ఎంపీ బి.వినోద్కుమార్ ఇటీవల సమా వేశమై కేంద్రం విధానాలకు నిరసనగా జాతీయ సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. బీజేపీ ఎంపీలను ఇరుకునపెట్టేలా... రాష్ట్రానికి సంబంధించి కేంద్రం వద్ద అనేక అంశాలు పెండింగ్లో ఉన్నా ఇక్కడి నుంచి ఎన్నికైన నలుగురు బీజేపీ ఎంపీలు తమతో కలసి రావడం లేదని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో కేంద్రంతో పాటు రాష్ట్రం నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలు విఫలమవుతున్నారనే అంశా న్ని ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాల ద్వారా ఎత్తిచూపాలని టీఆర్ఎస్ భావిస్తోంది. -
ఏపీలో సంక్రాంతి తర్వాత నైట్ కర్ఫ్యూ అమలు
-
ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలులో మార్పు...
సాక్షి, అమరావతి: సంక్రాంతి పండుగ నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ అమలులో ఏపీ ప్రభుత్వం మార్పు చేసింది. సంక్రాంతి తర్వాత నైట్ కర్ఫ్యూ అమలు కానుంది. ఈ నెల 18 నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కర్ఫ్యూపై ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం సవరణ చేసింది. పండగ సమయంలో పట్టణాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున పల్లెలకు తరలివస్తుండటంతో వారికి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశ్యంతో కర్ఫ్యూ అమలును వాయిదా వేసినట్లు మంత్రి ఆళ్ల నాని తెలిపారు. చదవండి: ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనేదే మా సంకల్పం: సీఎం జగన్ థర్డ్ వేవ్ వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్క్లు ధరించకపోతే రూ.100 జరిమానా విధిస్తామని తెలిపారు. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడిలో ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని మంత్రి ఆళ్ల నాని కోరారు. -
పీఆర్సీ సిఫార్సుల అమలుకు సర్కారు సానుకూలం
సాక్షి, అమరావతి: పీఆర్సీ సిఫార్సులను వీలైనంత వరకూ పూర్తి సానుకూలంగా అమలు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ స్పష్టం చేశారు. ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో జరిగింది. సమీర్ శర్మ మాట్లాడుతూ.. పీఆర్సీ సిఫార్సుల అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై వచ్చే వారం పీఆర్సీ కమిటీ అధికారులతో సమావేశమై పూర్తిస్థాయిలో చర్చిస్తామన్నారు. పీఆర్సీ నివేదికను దాచిపెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్నారు. పీఆర్సీ నివేదికను ఉద్యోగ సంఘాలకు ఇవ్వాలన్న డిమాండ్పై ఆయన స్పందిస్తూ.. దీనిని సంబంధించి సంగ్రహ నివేదికను వారం రోజుల్లోగా అందిస్తామన్నారు. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సుమారు రెండేళ్లుగా ఆశాజనకంగా లేవని, వాస్తవ పరిస్థితులను ఉద్యోగులు అర్థం చేసుకోవాలని సూచించారు. కాంట్రాక్ట్, ఒప్పంద ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై సర్వీసెస్, హెచ్ఆర్ ముఖ్య కార్యదర్శి సమావేశం నిర్వహిస్తారని చెప్పారు. వివిధ ఉద్యోగ సంఘాలు తెలిపిన అంశాలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సర్వీసెస్, హెచ్ఆర్ఎం ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ 2010లో సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగ్గా.. పదేళ్ల అనంతరం ఇప్పుడు జరుగుతోందని చెప్పారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సతీష్చంద్ర, ప్రవీణ్కుమార్, ఎస్ఎస్ రావత్, వి.ఉషారాణి, గోపాలకృష్ణ ద్వివేది, బి.రాజశేఖర్, కార్యదర్శి శ్యామలరావు, అరుణ్కుమార్ పాల్గొన్నారు. -
గెజిట్ అమలుపై అనిశ్చితి!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలుపై అనిశ్చితి నెలకొంది. ప్రాజెక్టుల అప్పగింత విషయంగా తెలంగాణ ముం దుకురాకపోవడం, పలు అభ్యంతరాల నేపథ్యంలో గందరగోళం నెలకొంది. గెజిట్ నోటిఫికేషన్ అమలు ఎజెండాతో ఈనెల 11, 12 తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక సమావేశాల మినిట్స్ (చర్చించిన అంశాలు)ను కృష్ణా, గోదావరి బోర్డుల సభ్యకార్యదర్శులు డీఎం రాయ్పురే, బీపీ పాండే బుధవారం రెండు రాష్ట్రాలకు పంపారు. ఈ మినిట్స్ ప్రకారం.. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులను అప్పగించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే శ్రీశైలం, సాగర్ జలవిద్యుత్ కేంద్రాలను అప్పగించడంపై తెలంగాణ సర్కారు అభ్యంతరం వ్య క్తం చేసింది. ప్రాజెక్టులను బోర్డులకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసేందుకు మొగ్గుచూపలేదు. రెండు రాష్ట్రాలు కూడా ప్రాజెక్టులను అప్పగిస్తూ ఉత్తర్వులిస్తే గానీ.. వాటిని బోర్డులు తమ పరిధిలోకి తీసుకోలేవు. తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో.. నిర్దేశించిన గడువు అయిన గురువారం (అక్టోబర్ 14న) రోజు న గెజిట్ నోటిఫికేషన్ను అమలు చేయలేని పరిస్థితి ఏర్పడిందని కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లినట్టు రెండు బోర్డుల అధికారవర్గాలు తెలిపాయి. ఈ విషయంలో కేంద్రం జారీ చేసే మార్గదర్శకాల మేరకు చర్యలు చేపడతామని వెల్లడించాయి. ఏపీ రెడీ.. తెలంగాణ నో.. మంగళవారం జరిగిన సమావేశంలో ఇరురాష్ట్రాల వాదనలు విన్న కృష్ణాబోర్డు చైర్మన్ ఎంపీ సింగ్.. తొలుత ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్లను పూర్తిస్థాయిలో బోర్డు పరిధిలోకి తీసుకుంటామని తీర్మానం ప్రవేశపెట్టారు. దానిని ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. తమ భూభాగంలోని ఆరు ఔట్లెట్లను బోర్డుకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసేందుకు అంగీకరించింది. కానీ తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసే వరకు గెజిట్ నోటిఫికేషన్ అమలు చేయవద్దని వాదించింది. తెలంగాణకు విద్యుత్ అవసరాలు అధికంగా ఉన్నాయని.. శ్రీశైలం, సాగర్ విద్యుత్ కేంద్రాలను బోర్డుకు అప్పగించాలనడం సరికాదని పేర్కొంది. అయితే తెలంగాణ విద్యుత్ ప్లాంట్లను బోర్డుకు అప్పగించకపోతే.. గెజిట్ నోటిఫికేషన్ అమలు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఏపీ సర్కారు అభిప్రాయం వ్యక్తం చేసింది. విద్యుదుత్పత్తి పేరుతో తె లంగాణ సర్కారు అనధికారికంగా నీటిని వినియోగిస్తోందని, దీనిని నియంత్రించినప్పుడే రెండు రా ష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంది. పెద్దవాగుకు కృష్ణా ప్రాజెక్టులకు లంకె.. గోదావరి బోర్డుకు పెద్దవాగు ప్రాజెక్టును అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసేందుకు ఏపీ సర్కారు సిద్ధమైనా.. తెలంగాణ మాత్రం వెనుకడుగు వేస్తోంది. పెద్దవాగును గోదావరి బోర్డుకు అప్పగిస్తే.. శ్రీశైలం, సాగర్లలో పది ఔట్లెట్లను కృష్ణాబోర్డుకు అప్పగించేలా ఉత్తర్వులు జారీ చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని భావిస్తున్నట్టు తెలిసింది. ‘గెజిట్’పై తెలంగాణ నిపుణుల కమిటీ కృష్ణా, గోదావరి బోర్డులు గెజిట్ నోటిఫికేషన్ అమలు విషయంగా ప్రతిపాదించిన అంశాలపై సమగ్ర అధ్యయనం చేయాలని తెలంగాణ నిర్ణయించింది. దీనిపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. ఈఎన్సీ మురళీధర్ నేతృత్వంలో పలువురు సీనియర్ ఇంజనీర్లతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు నీటిపారుదల శాఖ ప్రకటించింది. కృష్ణా, గోదావరి బోర్డులు ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టులు, సిబ్బంది, విద్యుత్ కేంద్రాలు, ఇతర ఔట్లెట్లను అప్పగిస్తే.. ఏర్పడే పరిణామాలు, పరిస్థితులపై సమగ్రంగా అధ్యయనం చేసి 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ముఖ్యంగా ప్రాజెక్టులను బోర్డులకు స్వాధీనం చేస్తే.. వరదల నిర్వహణ (ఫ్లడ్ మేనేజ్మెంట్), విపత్తుల నిర్వహణ (డిజాస్టర్ మేనేజ్మెంట్) ఏవిధంగా చేయాల్సి ఉంటుంది, బోర్డుకు ఉండే అధికారాలేమిటి, రాష్ట్రాలకు ఉండే అధికారాలేమిటన్న అంశాలపై పరిశీలన జరపాలని సూచించింది. ప్రాజెక్టుల అప్పగింతకు సంబంధించి అంతా అనుకూలంగా ఉందని కమిటీ పరిశీలనలో వెల్లడైతేనే.. రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తుందని, లేకుంటే అభ్యంతరాలను మరోసారి బోర్డులు, కేంద్రం దృష్టికి తీసుకెళుతుందని అధికారవర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో గెజిట్ అమలుకు తెలంగాణ ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకొనే పరిస్థితి కనిపించడం లేదని.. ఈ అనిశ్చితి మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. కేంద్రం కోర్టులో బంతి! గెజిట్ నోటిఫికేషన్ అమలుకు ఏపీ సర్కారు సహకరిస్తోందని, తెలంగాణ ప్రభుత్వం దాటవేత వైఖరి అవలంబిస్తోందని.. కృష్ణా, గోదావరి బోర్డులు కేంద్ర జలశక్తి శాఖకు విన్నవించాయి. ప్రత్యేక సమావేశాల్లో చర్చించిన అంశాల(మినిట్స్)ను కేంద్రానికి పంపాయి. దీంతో ఈ అంశం కేంద్రం పరిధిలోకి వెళ్లింది. గెజిట్ నోటిఫికేషన్ అమలు దిశగా కేంద్రం ఏ చర్యలు తీసుకుంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. -
రేపట్నుంచి కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్ అమలు..
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య నలుగుతున్న జల వివాదాల పరిష్కారానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి బోర్డుల పరిధులను నిర్దేశిస్తూ వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్ ఈ నెల 14 నుంచి అమల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధమైంది. అనేక చర్చలు, వాదోపవాదాలు, అభ్యంతరాల నడుమ ప్రయోగాత్మకంగా తొలిదశలో రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న ప్రాజెక్టుల నుంచి కేంద్రం స్వాధీన ప్రక్రియ మొదలు పెట్టనుంది. గోదావరిలో ఒక్క పెద్దవాగు ప్రాజెక్టుపై బోర్డు పెత్తనం ఉండనుండగా కృష్ణా బేసిన్లో శ్రీశైలం, నాగార్జున సాగర్లపై ఉన్న 16 ఔట్లెట్లను స్వాధీనం చేసుకొని నిర్వహణ బాధ్యతలు చూసేలా రంగం సిద్ధం చేసుకుంది. కృష్ణాలో బోర్డు ప్రతిపాదించిన ఔట్లెట్లపై ఏపీ నుంచి అభ్యంతరాలు లేకున్నా తెలంగాణ మాత్రం విద్యుదుత్పత్తి కేంద్రాలు (పవర్హౌస్)లపై బోర్డు పెత్తానాన్ని సహించలేమని స్పష్టం చేస్తోంది. ప్రతిపాదిత ఔట్లెట్లను బోర్డుకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసేందుకు ఏపీ సమ్మతిస్తుండగా తెలంగాణ మాత్రం తమ ప్రభుత్వంతో చర్చించాకే వైఖరిని వెల్లడిస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉత్తర్వుల జారీపై సందిగ్ధత నెలకొంది. పవర్హౌస్లపై వాడీవేడిగా చర్చ... ఈ నెల 14 నుంచి గెజిట్ అమలు చేసే దిశగా కార్యాచరణ సిద్ధం చేసే క్రమంలో సోమవారం గోదావరి బోర్డు భేటీ కాగా మంగళవారం కృష్ణా బోర్డు భేటీ జలసౌధలో జరిగింది. కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో తెలంగాణ ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్, సీఈ మోహన్రావు తదితరలు పాల్గొన్నారు. ఏపీ తరఫున జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్సీ నారాయణరెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చంతా బోర్డుల పరిధిలో ఉండాల్సిన ప్రాజెక్టులపైనే జరిగింది. కృష్ణా బోర్డు సబ్ కమిటీ మొత్తంగా శ్రీశైలంపై ఉన్న 12 ఔట్లెట్లు, సాగర్ పరిధిలోని 18 ఔట్లెట్లను కలిపి మొత్తం 30 ఔట్లెట్లు బోర్డు పరిధిలో ఉంచాలని ప్రతిపాదించింది. అయితే దీనికి తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పవర్హౌస్లను ఎట్టి పరిస్థితుల్లోనూ బోర్డు అధీనానికి ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ‘కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా పెరగాల్సి ఉంది. రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన హక్కుల కోసం కొత్త ట్రిబ్యునల్ వేయాలని ఇప్పటికే కేంద్రం, కోర్టు ముందు ప్రతిపాదనలు పెట్టాం. ఈ దశలో నీటి కేటాయింపులు తేలేదాక గెజిట్ అమలును ఆపాలి’ అని రజత్ కుమార్ వాదించారు. అయితే గెజిట్ వెలువడ్డాక, అమలును ఆపలేమని బోర్డు చైర్మన్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఏపీ తరఫున శ్యామలరావు మాట్లాడుతూ విద్యుదుత్పత్తి ఆపాలని పదేపదే కోరుతున్నా తెలంగాణ వినిపించుకోవడం లేదని, తక్షణమే విద్యుదుత్పత్తి ఆపేలా చూడాలని కోరారు. దీనికి రజత్ కుమార్ స్పందిస్తూ రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు తీవ్రంగా ఉన్నాయని, శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు అయినందున ఉత్పత్తి ఆపడం కుదరదని తేల్చిచెప్పారు. దీనిపై మరోమారు కల్పించకున్న శ్యామల్రావు... ఈ ఏడాది పులిచింతల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ నీళ్లన్నీ వృథాగా సముద్రంలో కలుపుతున్నారన్న తమ ఫిర్యాదు నేపథ్యంలో గెజిట్ వెలువడిందని... ఈ నేపథ్యంలో పవర్హౌస్లను కాదని మిగిలిన ఔట్లెట్లను బోర్డు పరిధిలో ఉంచుతామంటే కుదరదని ఏపీ తేల్చిచెప్పింది. 16 ప్రాజెక్టులపై బోర్డు తీర్మానం... ఇరు రాష్ట్రాల వాదోపవాదాల అనంతరం పవర్హౌస్లు కలుపుకొని 16 ఔట్లెట్లను తన పరిధిలోకి తీసుకునేలా బోర్డు తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి ఏపీ ఓకే చెప్పింది. 16 ఔట్లెట్లపై బోర్డు ప్రతిపాదనలు పంపితే ప్రభుత్వపరంగా ఉత్తర్వులు జారీ చేసేందుకు సమ్మతించింది. అయితే దీనిపై తెలంగాణ మత్రం నిర్ణయం చెప్పలేదు. పవర్హౌస్లను సైతం తీసుకుంటామని చెబుతున్నందున దీనిపై ప్రతిపాదనలు వచ్చాక ప్రభుత్వంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ప్రభుత్వ అనుమతి వచ్చాకే ఔట్లెట్లను అప్పగిస్తామని తెలిపింది. ఇక ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించినా కేవలం నిర్వహణ (ఆపరేషన్స్) మాత్రమే చూడాలని, ప్రాజెక్టులపై యాజమాన్య హక్కు (ఓనర్షిప్) మాత్రం రాష్ట్రానికే ఉంటుందని స్పష్టం చేసింది. ఈ భేటీ అనంతరం ఒక ప్రకటన విడుదల చేసిన కృష్ణా బోర్డు... ‘శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రధాన రిజర్వాయర్ల పరిధిలో గెజిట్ నోటిఫికేషన్ షెడ్యూల్–2లో పేర్కొన్న అన్ని ఔట్లెట్లను ప్రాధాన్యంగా రెండు రాష్ట్రాలు ఈ నెల 14లోగా బోర్డుకు అప్పగించాలి’ అని బోర్డు భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. కాగా, ఇప్పటికే జరిగిన గోదావరి బోర్డు భేటీలో పెద్దవాగును ఆధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించగా, దీనిపై రెండు రాష్ట్రాలు ప్రభుత్వ పరంగా ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. ఇక ఇరు రాష్ట్రాలు కూడా రెండు బోర్డులకు విడివిడిగా ఇవ్వాల్సిన చెరో రూ.200 కోట్ల సీడ్ మనీకి సంబందించి ప్రభుత్వంతో చర్చించాకే నిధుల విడుదలపై నిర్ణయం చెబుతామని వెల్లడించాయి. బోర్డు బాధ్యత ఇదీ... కృష్ణా, గోదావరి బేసిన్ పరిధిలో ప్రాజెక్టుల నిర్వహణ విషయంపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించే అధికారం బోర్డులకు కట్టబెడుతూ కేంద్రం గెజిట్ విడుదల చేసింది. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను 3 షెడ్యూళ్లుగా విభజించగా రెండు రాష్ట్రాల్లోని నదులు, ఉపనదులపై ఎన్ని ప్రాజెక్టులుంటే అన్నింటినీ మొదటి షెడ్యూల్లో చేర్చింది. షెడ్యూల్– 2లో పేర్కొన్న ప్రాజెక్టులు 100 శాతం బోర్డుల పరిధిలో ఉంటాయి. ఈ ప్రాజెక్టుల్లోని ప్రతి అంశంపై బోర్డులకు పూర్తి నియంత్రణ ఉంటుంది. ప్రాజెక్టులు, కాలువల వ్యవస్థ, విద్యుదుత్పత్తి కేంద్రాలు, సరఫరా చేసే వ్యవస్థలు, కార్యాలయాల ప్రాంగణాలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికలు, ఫర్నీచర్ సహా అన్నింటినీ బోర్డులు తమ అధీనంలోకి తీసుకొని రోజువారీ నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తాయి. వాటి పరిధిలో పనిచేసే రెండు రాష్ట్రాల ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సహా అందరూ బోర్డుల పర్యవేక్షణలోనే పనిచేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టులకు సీఐఎస్ఎఫ్ బలగాలతో కేంద్రం భద్రత కల్పిస్తుంది. ఈ ప్రాజెక్టుల నిర్వహణ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించే అధికారం బోర్డులకు ఉంటుంది. బోర్డులు తాము స్వాధీనంలోకి తీసుకునే షెడ్యూల్–1లో పేర్కొన్న ప్రాజెక్టులకు సంబంధించి.. గెజిట్ నోటిఫికేషన్ ప్రచురితమైన రోజు నాటికి హైకోర్టు, సుప్రీంకోర్టు, ట్రిబ్యునళ్లలో ఏవైనా కేసులు విచారణలో ఉన్నా, భవిష్యత్లో ఏవైనా కేసులు దాఖలైనా వాటికి రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. షెడ్యూల్–3లో పేర్కొన్న ప్రాజెక్టులను బోర్డుల ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు ఉత్పన్నమైనప్పుడు ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను రెండు రాష్ట్రాలు తీసుకోవాల్సి ఉంటుంది. గెజిట్ ప్రకారం షెడ్యూల్–2లో పేర్కొన్న ప్రాజెక్టులు ఇవీ.. కృష్ణాలోః శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్వే, ఎడమ, కుడి గట్టు విద్యుత్ కేంద్రాలు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బంకచర్ల క్రాస్ రెగ్యులేటర్, నిప్పులవాగు ఎస్కేప్ కెనాల్, ఎస్ఆర్బీసీ, వెలిగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, తెలుగుగంగ, వెలిగొండ, ఎస్ఎల్బీసీ టన్నెల్, డిండి, హంద్రీనీవా, కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి, ముచ్చుమర్రి, జీఎన్ఎస్ఎస్, నాగార్జునసాగర్ పరిధిలో సాగర్ ప్రధాన విద్యుత్ కేంద్రం, కుడి, ఎడమ కాల్వలు, ఇతర బ్రాంచ్ కెనాల్లు, ఏఎంఆర్పీ, హైదరాబాద్ తాగునీటి సరఫరా, సాగర్ టెయిల్పాండ్, తుంగభద్ర, దాని పరిధిలోని హైలెవల్, లోలెవల్ కాలువలు, ఆర్డీఎస్, తుమ్మిళ్ల, కేసీ కెనాల్, సుంకేశుల, జూరాల, నెట్టెంపాడు, బీమా, కోయిల్సాగర్, పులిచింతల రిజర్వాయర్, విద్యుత్ కేంద్రం, మున్నేరు ప్రాజెక్టు, గోదావరి నుంచి కృష్ణాకు నీటిని మళ్లించే పథకాలు (కాళేశ్వరంలోని కొండపోచమ్మసాగర్ నుంచి శామీర్పేటకు నీటిని తరలించే కాల్వ, గంధమల రిజర్వాయర్, దేవాదులలోని దుబ్బవాగు–పాకాల ఇన్ఫాల్ రెగ్యులేటర్, సీతారామలోని మూడో పంప్హౌస్, ఎస్సారెస్పీ స్టేజ్–2లోని మైలవరం రిజర్వాయర్, వేంపాడు, బుడమేరు మళ్లింపు పథకం, పోలవరం ఆర్ఎంసీ–ఎన్ఎస్–ఎల్ఎంసీ లింకు, పోలవరం–కృష్ణా లింకు, కృష్ణా డెల్టా, గుంటూరు కెనాల్. గోదావరిలోః పెద్దవాగు రిజర్వాయర్ స్కీమ్, పోలవరం ప్రాజెక్టు, కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల తరలింపు, హెడ్ రెగ్యులేటర్ ద్వారా కృష్ణాకు గోదావరి నీటి తరలింపు, పోలవరం 960 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు, పుష్కర ఎత్తిపోతలు, తాడిపూడి ఎత్తిపోతలు, పట్టిసీమ, పురుషోత్తపట్టణం ఎత్తిపోతలు, సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజి, తొర్రిగడ్డ ఎత్తిపోతలు, చింతలపూడి ఎత్తిపోతలు, చాగలనాడు ఎత్తిపోతలు, వెంకటనగరం ఎత్తిపోతలు, శ్రీరాంసాగర్ స్టేజ్–1, కాళేశ్వరం, కాళేశ్వరం ప్రాజెక్టు (అదనంగా రోజుకు ఒక టీఎంసీ), చొక్కారావు ఎత్తిపోతలు, తుపాకులగూడెం బ్యారేజి, ముక్తేశ్వర్ ఎత్తిపోతలు, సీతారామ ఎత్తిపోతల, మాచ్ఖండ్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు, సీలేరు విద్యుత్ కాంప్లెక్స్లు. -
రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు ఇవ్వాలి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ సిరిసిల్ల: రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలు చేయాల్సిందేనని ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు, ఇందుకోసం అక్టోబర్ 2వ తేదీ నుంచి అన్ని నియోజకవర్గాల్లో ఉద్యమాలు ప్రారంభిస్తామని చెప్పారు. సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర గురువారం 27వ రోజు సిరిసిల్ల జిల్లాలో ప్రవేశించింది. ఈ సందర్భంగా గంభీరావుపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఉఫ్మని ఊదితే కొట్టుకుపోయే ప్రభుత్వమిదని ఎద్దేవా చేశారు. బీజేపీకి భయపడి కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించి వేధిస్తున్నారని ఆరోపించారు. కేసులకు తాము భయపడబోమని, ఇకపై కేసులు పెడితే తానే నేరుగా పోలీస్స్టేషన్లకు వస్తానని అన్నారు. అప్పుడు అక్కడికి ఏకంగా సీఎం రావాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల కాక సర్పంచులు ఆత్మహత్య లకు పాల్పడే పరిస్థితి తలెత్తిందని సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని విమర్శించారు. ఏడున్నరేళ్లలో మంత్రి కేటీఆర్ సిరిసిల్లకు ఏం చేశారని ప్రశ్నించారు. అన్ని విషయాల్లో పైసలు కేంద్రానివి.. ప్రచారం మాత్రం కేసీఆర్ చేసుకుంటారన్నారు. మాట్లాడితే పెట్రోలు చార్జీలు పెంచామంటున్న రాష్ట్ర ప్రభుత్వం అందులో రూ.40 వివిధ పన్నుల కింద తీసుకోవడం లేదా అని ప్రశ్నించారు. ఇదే అదనుగా ఆర్టీసీ, విద్యుత్తు చార్జీలు పెంచాలని చూస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
16,800 మందికి దళితబంధు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దళితబంధు అమలులో తెలంగాణ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. గతనెల 16న హుజూరాబాద్ మండలం శాలపల్లిలో నిర్వహించిన దళితబంధు సభ మొదలు ప్రభుత్వం ఈ పథకం అమలుకు అత్యంత ప్రాధాన్యం కల్పిస్తోంది. గత నెల 15 మందికి రూ.10 లక్షల చొప్పున అందజేసిన ప్రభుత్వం తాజాగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని 16,800 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10 లక్షల చొప్పున జమ చేసింది. అంటే.. మొత్తంగా రూ.1,680 కోట్ల నగదు వారి ఖాతాల్లోకి బదిలీ అయింది. ఈ మేరకు శనివారం ఉదయానికి లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమయ్యాయి. ఇప్పటికే ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం రూ.2,000 కోట్లను కరీంనగర్ కలెక్టరుకు బదిలీ చేసింది. వాటినుంచి తొలి 15 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.10 లక్షల చొప్పున జమ చేశారు. వారిలో మోటారు వాహనాలపై ఆసక్తి చూపిన నాలుగు కుటుంబాలకు ఇప్పటికే వాహనాలను అందజేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. నియోజకవర్గంలో మొత్తం 20,900 దళిత కుటుంబాలు ఉన్నాయి. తాజాగా పూర్తయిన దళితబంధు సర్వేతో అదనంగా మరో మూడువేల కుటుంబాలు చేరడంతో ఈ సంఖ్య 23,183 చేరింది. వీరందరికీ ప్రాధాన్యతాక్రమంలో దళితబంధు పథకం వర్తింపజేస్తామని అధికారులు స్పష్టం చేశారు. వాట్సాప్ గ్రూపు దళితుల జీవన స్థితిగతులను మార్చే ఉద్దేశంతో చేపట్టిన ఈ పథకం 100 శాతం విజయవంతం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉంది. అందుకే ఈ పథకం అమలు కోసం ప్రత్యేకంగా మండలానికి ఒక రిసోర్స్పర్సన్ (ఆర్పీ)ను నియమించింది. ఈ పథకం ద్వారా అందజేసే రూ.10 లక్షల నగదును లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా వారికి మార్గనిర్దేశనం చేసే వ్యూహంలో భాగంగా దళిత విశ్రాంత ఉద్యోగులను రంగంలోకి దించుతున్నారు. దళితబంధు అమలుకు నియోజకవర్గాన్ని ఏడు యూనిట్లు (హుజూరాబాద్, వీణవంక, జమ్మికుంట, కమలాపూర్, ఇల్లందకుంట మండలాలు, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీ)గా విభజించారు. ఈ ఏడు యూనిట్లలో ప్రతి యూనిట్కు ఐదుగురు విశ్రాంత ఉద్యోగులు పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా వారికి దిశానిర్దేశం చేస్తారు. ఇదే సమయంలో హుజూరాబాద్ గ్రామాల్లో ఆదర్శభావాలు కలిగి, సామాజిక చైతన్యం ఉన్న యువకులను ఏడు యూనిట్ల నుంచి ప్రతి గ్రామానికి 10 మంది చొప్పున ఎంపిక చేస్తారు. వీరికి వివిధ రంగాల్లో నిపుణులైన వారితో హైదరాబాద్లో ప్రత్యేక తరగతులు ఇప్పిస్తారు. ప్రతి మండలానికి బాధ్యులుగా ఉన్న ఐదుగురు విశ్రాంత దళిత ఉద్యోగులు, ప్రతీ గ్రామానికి 10 మంది యువకులతో ఓ వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేస్తారు. ఈ గ్రూపునకు ఆయా మండలాల రిసోర్స్ పర్సన్లు అడ్మిన్లుగా ఉంటారు. ప్రభుత్వ అధికారులు చేస్తున్న ప్రచారానికి అదనంగా వీరు కూడా పథకం ప్రయోజనాలను వివరించనున్నారు. -
రైతన్న మేలుకు కొత్త విధానం
-
పరీక్షల్లేకుండానే డిశ్చార్జి
సాక్షి, హైదరాబాద్: భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) నూతన మార్గదర్శకాల ప్రకారం కరోనా పాజిటివ్ వ్యక్తులను 10 రోజులపాటు చికిత్స అందించాక ఎటువంటి పరీక్షలు చేయకుండానే డిశ్చార్జి చేయవచ్చని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. తాజాగా పలు కీలక మార్పులతో ఐసీఎంఆర్ మార్గదర్శకాలు విడుదల చేసిందని, వాటి ప్రకారం డిశ్చార్జి పాలసీ, హోం ఐసోలేషన్, డెత్ గైడ్లైన్స్లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుందని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. డిశ్చార్జి అయిన వారిని మరో వారంపాటు హోం ఐసోలేషన్లో ఉంచాలని తెలిపిందన్నారు. ఒకవేళ లక్షణాలు ఎక్కువగా ఉన్న, ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులను మాత్రం ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందించాలని ఐసీఎంఆర్ పేర్కొందన్నారు. హోం ఐసోలేషన్ కోసం ఈ నెల 10న విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ (తృతీయ) కాంటాక్టులను లక్షణాలు లేకుంటే ఇంట్లోనే ఉంచి చికిత్స అందించాలన్నారు. ఇందుకోసం ఇంట్లో ప్రత్యేక గది ఏర్పాటు చేసి అందులో ఉంచాలని, వారికి సాయం కోసం ఒక వ్యక్తి అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, అలా సహాయం అందిస్తున్న వ్యక్తికి హెచ్సీక్యూ మాత్రలు అందించాలని ఐసీఎంఆర్ సూచించిందని ఈటల చెప్పారు. 17 రోజులపాటు వారిని పర్యవేక్షణలో ఉంచాలని, హోం ఐసోలేషన్లో ఉన్న వారికి ఉదయం, సాయంత్రం వైద్య బృందాలు పరీక్షలు నిర్వహిస్తాయని, అవసరమైన నిత్యావసర వస్తువులను జీహెచ్ఎంసీ ద్వారా అందిస్తామని మంత్రి తెలిపారు. ఆ జబ్బులతో మరణిస్తే కరోనాకు సంబంధంలేదు... ఐసీఎంఆర్ తాజా మార్గదర్శకాల ప్రకారం కేన్సర్, గుండె జబ్బులు లేదా ఇతర జబ్బులతో మరణించిన వారికి కరోనా పాజిటివ్ ఉన్నా దీర్ఘకాలిక వ్యాధులతో చనిపోయినట్టుగానే పరిగణించాల్సి ఉంటుందని మంత్రి ఈటల చెప్పారు. ఈ మరణాలకు కారణాలను విశ్లేషించడానికి ప్రొఫెసర్లతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు. వారిచ్చిన డెత్ ఆడిట్ రిపోర్ట్ ప్రకా రమే మరణాలను ప్రకటించాలని ఐసీఎంఆర్ తెలిపిందన్నారు. అయితే పాజిటివ్ కేసులు, మరణాలు దాస్తే దాగవని పేర్కొన్నారు. అదుపులో ఉంచేందుకు అన్ని చర్యలు... రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని పూర్తిస్థాయిలో అదుపులో ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈ టల తెలిపారు. హైదరాబాద్లో యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పనిచేస్తున్న నోడల్ అధికారులు, డాక్టర్లతో మంత్రి మాట్లాడారు. ఒకే కుటుంబంలో ఎక్కువ మందికి వైరస్ సోకడం వల్లే రాష్ట్రంలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని మంత్రి తెలిపారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారమే వారందరికీ చికిత్స అందిస్తున్నామన్నారు. -
జూన్లో టీఎస్–బీపాస్
సాక్షి, హైదరాబాద్: భవన నిర్మాణ అనుమతుల జారీలో పారదర్శకత కోసం ‘టీఎస్–బీపాస్’ వి ధానాన్ని ఇప్పటికే రాష్ట్రంలోని 87 పురపాలికల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టామని, జూన్ మొద టి వారంలో అన్ని పురపాలికల్లో పూర్తి స్థాయిలో అమలు చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ఈ మేరకు ఏ ర్పాట్లను పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. టీఎస్–బీపాస్ అమలుపై గురువారం ఆయనిక్కడ సమీక్ష నిర్వహిం చారు. ప్రస్తుతం 87 పురపాలికల్లో టీఎస్–బీపాస్ కింద 1,100 దరఖాస్తులను స్వీకరించడంతో పాటు ఇప్పటికే పలు అనుమతులను జారీ చేశామని అధికారులు కేటీఆర్కు వివరించారు. సాఫ్ట్వేర్, సపోర్ట్ సిస్టం పనితీరుపై క్షేత్రస్థాయి నుంచి సమాచారం వచ్చిందని, లోపాలుంటే సరిదిద్దేం దుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రా ష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలతోపాటు హైదరాబాద్లోనూ ఈ వ్యవస్థను ఏకకాలంలో ప్రారం భించేందుకు ఆలోచిస్తున్నట్లు తెలిపిన మంత్రి, ఇందుకు సంబంధించి పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులకు ప్రత్యేకంగా సూచించారు. ఇందుకోసం ఒకటి రెండు రోజుల్లోనే జీహెచ్ఎంసీ పరి ధిలోని జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ యంత్రాంగం టౌన్ ప్లానింగ్ అధికారులతో ప్రత్యేక సమావేశా న్ని ఏర్పాటు చేయాలని కేటీఆర్ పురపాలక శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. జూన్ మొదటివారంలో టీఎస్–బీపాస్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక ప్రజలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మీసేవ, పౌరసేవా కేంద్రాలతో పాటు వ్యక్తిగతంగా ఇంటర్నెట్, మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ఇవేవీ అందుబాటులో లేకుంటే నేరుగా దరఖాస్తులు స్వీకరించడానికి కూడా సిద్ధంగా ఉండాలని, దరఖాస్తు ప్రక్రియలో ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. క్షేత్ర స్థాయి నుంచి వచ్చే సమాచారం ఆధారంగా మరింత సరళీకృతం చేయాలన్నారు. ఈ సమీక్షలో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్తో పాటు, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, డైరెక్టర్ ఎ.సత్యనారాయణ పాల్గొన్నారు. టీఎస్–బీపాస్ అమలుపై సమీక్షిస్తున్న మంత్రి కేటీఆర్ -
మారటోరియం పక్కాగా అమలయ్యేలా చూడండి
న్యూఢిల్లీ: రుణాల వాయిదా చెల్లింపునకు సంబంధించి విధించిన మారటోరియం పక్కాగా అమలయ్యేలా చూడాలని రిజర్వ్ బ్యాంక్కు సుప్రీం కోర్టు సూచించింది. ఈఎంఐలను కొంతకాలం వాయిదా వేసుకునే వెసులుబాటును ఆర్బీఐ ఇచ్చినప్పటికీ.. రుణగ్రహీతలకు బ్యాంకులు ఆ ప్రయోజనాన్ని పూర్తిగా అందిస్తున్నట్లు కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలోనే మారటోరియంనకు సంబంధించిన మార్చి 27నాటి ఆదేశాలు సరిగ్గా అమలయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ అంశంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. కరోనా వైరస్పరమైన కష్టకాలంలో వాయిదాలు చెల్లించేందుకు ఆర్బీఐ మూడు నెలల పాటు మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. -
హైస్కూళ్లలో వృత్తి విద్య
సాక్షి, హైదరాబాద్: ‘దేశంలో 12వ పంచవర్ష ప్రణాళిక అంచనా ప్రకారం 19 ఏళ్ల నుంచి 24 ఏళ్ల లోపు వారిలో వృత్తి విద్యను అభ్యసిస్తున్న వారు 5 శాతం లోపే ఉన్నారు. ఇతర దేశాలతో పోల్చితే ఇది చాలా తక్కువ. ఆ వయసు వారు అమెరికాలో 52% మంది, జర్మ నీలో 75% మంది.. దక్షిణ కొరి యాలో 96% మంది వృత్తి విద్యను అభ్యసిస్తున్న వారే ఉన్నారు. కానీ మన దేశంలో పరిస్థితి అందుకు భిన్నం. అందుకే 2025 నాటికి దేశంలోని 50 శాతం మంది విద్యార్థులైనా వృత్తి కోర్సు లను అభ్యసించేలా చర్యలు చేపట్టాల్సిందే.. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య, యూనివర్సిటీల వరకు వృత్తి విద్యా కోర్సులను కచ్చితంగా ప్రవేశ పెట్టా ల్సిందే..’అని నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) నివేదికలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం 2017 జూన్లో డాక్టర్ కస్తూరి రంగన్ నేతృత్వంలో నిపు ణుల కమిటీని నియమించింది. 2019 మే నెలలో తమ డ్రాఫ్ట్ పాలసీని ఆ కమిటీ కేంద్ర మానవ వన రుల అభివృద్ధి శాఖకు (ఎంహెచ్ఆర్డీ) అంద జేసింది. దానిపై ఎంహెచ్ఆర్డీ దేశవ్యాప్తంగా నిపు ణులు, మేధావుల నుంచి అభిప్రాయాలను సేకరిం చింది. వాటిన్నింటినీ పరిగణన లోకి తీసుకొని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ–2020 ఫైనల్ కాపీని అం దుబాటులోకి తెచ్చింది. అందులో వృత్తి విద్యకు సంబంధించిన కీలక సిఫారసులు చేసింది. ఒకప్పుడు డ్రాపౌట్స్ కోసమే.. ఇతర దేశాలతో పోల్చితే వృత్తి విద్యా కోర్సులను చదువుతున్న యువత దేశంలో చాలా తక్కువగా ఉందని, ఈ నేపథ్యంలో వృత్తి విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని నూతన విద్యా విధానంలో కమిటీ సిఫారసు చేసింది. గతంలో వృత్తి విద్యా కోర్సులను కేవలం డ్రాపౌట్స్ కోసమే 8వ తరగతిలో కొనసాగించినా ఇప్పుడు దానిని పాఠశాల విద్య స్థాయి నుంచి కాలేజీల్లోనూ ప్రవేశపెట్టాల్సిన అవసర ముందని పేర్కొంది. వొకేషనల్ సబ్జెక్టులతో 11–12 తరగతులు పూర్తి చేసే వారు ఉన్నత విద్యలోలోనూ వొకేషనల్ కోర్సులను చదువుకునేలా అవకాశాలను మెరుగుప ర్చాల్సిన అవసరముందని స్పష్టంచేసింది. స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీలు.. ఇలా అన్ని స్థాయిల్లో వృత్తి విద్యను దశల వారీగా అమలు చేయాల్సిందేనని వెల్లడించింది. ప్రాథమి కోన్నత పాఠశాల దశ నుంచే నాణ్యమైన వృత్తి విద్యను అందిస్తూ ఉన్నత విద్య వరకు తీసుకెళ్లాలని స్పష్టం చేసింది. అంతేకాదు ప్రతి విద్యా ర్థి ఒక వృత్తి విద్యా కోర్సును చది వేలా చర్యలు చేపట్టాలని వెల్ల డించింది. ఇలా 2025 నాటికి కనీసంగా 50 శాతం మంది వృత్తి విద్యా కోర్సులను చదివేలా చూడాలని వివరించింది. రెగ్యులర్ కోర్సులతో పాటు దూరవిద్యలోనూ.. రెగ్యులర్ కోర్సులతోపాటు దూ ర విద్యా విధానంలోనూ వీలైన న్ని కోర్సులను అమలు చేసేందు కు చర్యలు చేపట్టాలని ఎన్ఈపీ పేర్కొంది. మొత్తానికి వచ్చే పదేళ్లలోగా వృత్తి విద్యను ప్రధా న విద్యగా అన్ని సెకండరీ స్కూళ్ల లో అమలు చేయాలని స్పష్టం చేసింది. అలాగే సెకండరీ స్కూళ్ల తో ఐటీఐలు, పాలిటెక్నిక్లు, స్థానిక పరిశ్రమలను అనుసం ధానం చేయాలని, ఉన్నత విద్యా సంస్థలు సొంతంగా లేదా పారిశ్రామిక భాగస్వామ్యంతో వృత్తి విద్యా కోర్సులను నిర్వహించాలని పేర్కొంది. ఉన్నత విద్యలో 2013లో బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ డిగ్రీని ప్రవేశపెట్టినా, అది సరిపోదని పేర్కొంది. అన్ని ఇతర డిగ్రీ కోర్సుల్లో వొకేషనల్ కోర్సులు ఉండేలా చూడాలని వెల్లడించింది. స్థానిక అవకాశాల మేరకు కోర్సులు.. ఉన్నత విద్యా సంస్థలు సాఫ్ట్ స్కిల్ తదితర సర్టిఫికెట్ కోర్సులను ప్రవేశపెట్టాలని ఎన్ఈపీ సిఫారసు చేసింది. దేశంలో ఏయే రంగాల్లో స్కిల్ గ్యాప్ ఉందో పరిశీలించి, స్థానికంగా ఉపాధి అవ కాశాలు ఏయే రంగాల్లో ఉన్నాయో చూసి అలాంటి కోర్సులను ప్రవేశ పెట్టాలని స్పష్టం చేసింది. టెక్నికల్ ఎడ్యుకేషన్, వొకేషనల్ ఎడ్యుకేషన్ను సమగ్ర విద్యా విధా నంలో భాగంగా చే యాల్సిందేనని తెలి పింది. ఇందుకోసం విద్యా మంత్రిత్వ శాఖ, పారిశ్రామిక భాగస్వా మ్యంతో నేషనల్ కమిటీ ఫర్ ది ఇంటి గ్రీషన్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ (ఎన్సీఐవీఈ) ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఇందు కు అవసరమై న బడ్జెట్ను కూడా కేటాయించాలని పేర్కొంది. విద్యా సంస్థలు అవకాశాలు ఎక్కడెక్క డ ఉన్నాయో ఆలోచించి, పరిశీలించి ఎన్సీఐవీఈ సహకారంతో కొత్త కోర్సులను ప్రారంభించాలని స్పష్టంచేసింది. -
మోటారు వాహనాల చట్టం 2019 అమలుపై వ్యతిరేకత
-
మత్తు దిగాలి..
సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్: ప్రభుత్వం కొత్త మద్యం పాలసీకి శ్రీకారం చుడుతోంది. అంచెలంచెలుగా మద్యపాన నిషేధం అమలు దిశగా అడుగులు వే స్తోంది. అక్టోబర్ 1 నుంచి ఈ నూతన విధా నం అమల్లోకి వస్తుంది. ఈ నూతన పాలసీ అమలుకు ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఎచ్చెర్లలోని జిల్లా బేవరేజెస్ కార్యాలయం, గోదాం నుంచి మద్యం సరఫరా అవుతున్న విషయం తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అంచెలంచెలుగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యం, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం మద్యం లైసెన్స్డ్ దుకాణాల నుంచి బెల్టుషాపులకు సరఫరా ప్రోత్సహిం చింది. తాగునీరు అందని గ్రామాల్లో సైతం మద్యం ఏరులై పారింది. ప్రస్తుతం జిల్లాలో 239 మద్యం షాపులున్నాయి. అవి 20 శాతం తగ్గనున్నాయి. జిల్లాలోని 14 ఎక్సైజ్ శాఖ సర్కిళ్ల పరిధిలో ప్రభుత్వమే 191 మద్యం దుకాణాలను నిర్వహించనుంది. 20 శాతం దుకాణాలు తగ్గుతాయి. సెప్టెంబర్ చివరి వారంనాటికి షాపుల గుర్తింపు, ప్రతి షాపులో పనిచేసేందుకు సేల్స్ సూపర్వైజర్, గార్డులు, షాపు సామర్థ్యం మేరకు ఇద్దరు ముగ్గురు సేల్స్ సూపర్వైజర్లను నియమిస్తారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీగా ఏర్పడ కాంట్రాక్టు పద్ధతిలో ఈ ఎంపిక నిర్వహిస్తారు. ప్రతి మద్యం సీసా కొనుగోలుకు రశీదు తప్పనిసరి ఇస్తారు. ప్రభుత్వం పక్కాగా మద్యం రిటైల్ షాపులను నిర్వహిస్తుంది. అక్రమాలకు చరమగీతం.. గత ప్రభుత్వ హయాంలో మద్యం బ్రాండ్ మిక్సింగ్ కల్తీ చేయడం, ఎంఆర్పీ నిబంధనలు అమలు చేయకపోవటం, మద్యం దుకాణాలో లూజ్ సేల్, బెల్టుషాపుల నిర్వహణ విచ్చలవిడిగా సాగాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే అమ్మకాల వల్ల ఇటువంటి అక్రమాలకు అవకాశం ఉండదు. ప్రస్తుతం మద్యం దుకాణా లను ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ నుంచి కొత్త మద్యం పాలసీలో ఉదయం 10 నుంచి రాత్రి 9 వరకు మాత్రమే అమ్ముతారు. గత ప్రభుత్వ హయాంలో బెల్టు షాపుల్లో 24 గంటలు మద్యం అందుబాటులో ఉండేది. వాస్తవంగా హైకోర్టు మార్గదర్శకాల మేరకు జాతీయ రహదారి, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల లోపు మద్యం షాపులు ఉండకూడదు. హైకోర్టు ఆదేశాలను సైతం గత ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేదన్న విమర్శలున్నాయి. నూతన మద్యం పాలసీలో మద్యం షాపులు 20 శాతం కుదింపు, విచ్చలవిడి మద్యం అమ్మకాల నియంత్రణ, కచ్చితమైన సమయపాలన వంటివి ఉంటాయి. కసరత్తు ప్రారంభించాం.. నూతన మద్యం పాలసీ అమలుకు కసరత్తు ప్రారంభించాం. అక్టోబర్ 1 నుంచి అమలు చేస్తాం. 191 మద్యం రిటైల్ దుకాణాలు ప్రారంభిస్తాం. పక్కాగా నిర్వహణ ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల మేరకు షాపులు నిర్వహిస్తాం. సమయపాలన ఉంటుంది. కొనుగోలుకు పక్కా రశీదులు ఇస్తాం. మొదటి దశలో 20 శాతం షాపుల కుదింపు జరుగుతుంది. –కె.కుమారస్వామి, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ జిల్లా డిపో మేనేజర్ -
మధ్యాహ్న భోజన పథకం అమలేది..!
సాక్షి, ఖమ్మం: జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించి మూడేళ్లయినా ముందుకెళ్లడం లేదు. కళాశాలలు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా భోజనం జాడలు కనిపిం చడం లేదు. అసలు ప్రభుత్వం భోజన పథకం అమలు చేస్తుందా.. లేదా అనే సందిగ్ధంలో విద్యార్థులున్నారు. దీనిపై విధాన నిర్ణయం ప్రభుత్వం ప్రకటించకపోగా.. విద్యార్థి సంఘాలు మాత్రం మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే పలు సంఘాలు ఆందోళనకు దిగాయి. జిల్లాలో 19 జూనియర్ కళాశాలలు ఉండగా.. వీటిలో మొదటి సంవత్సరం 3,267 మంది విద్యార్థినీ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ద్వితీయ సంవత్సరంలో 3,128 మంది ఉన్నారు. ప్రభుత్వ కళాశాలలు ప్రైవేట్ కళాశాలలకు దీటుగా బోధన చేస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయి. ఈ క్రమంలో కళాశాలల్లో విద్యార్థుల చేరిక కూడా బాగానే ఉంది. అయితే ఉదయం కళాశాలకు వచ్చిన విద్యార్థులు సాయంత్రం వరకు ఉండాల్సిన పరిస్థితి ఉంది. దీంతో మధ్యాహ్న భోజనం లేక అనేక మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు బాక్స్లు తెచ్చుకుంటున్నా.. చాలా మంది విద్యార్థులు ఉదయమే కళాశాలకు వస్తుండడంతో భోజనం తెచ్చుకోవడం వారికి వీలు కావడం లేదు. అయితే ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో కూడా మధ్యాహ్న భోజనం అమలు చేస్తామని ప్రకటిస్తూ వస్తోందని, తమకు అమలు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని విద్యార్థులు చెబుతున్నారు. కళాశాలల్లో చేరిన విద్యార్థులు.. తమ పిల్లలను దూర ప్రాంతాలకు పంపించడం ఇష్టంలేని తల్లిదండ్రులు దగ్గర్లో ఉన్న జూనియర్ కళాశాలల్లో చేర్పిస్తున్నారు. ముఖ్యంగా బాలికలు ఎక్కువ మంది స్థానికంగా ఉండే జూనియర్ కళాశాలల్లో చేరుతున్నారు. అయితే ఉదయం వెళ్లిన వారు సాయంత్రమే మళ్లీ ఇంటికి రావడం కుదురుతోంది. అయితే కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు జరుగుతుందనే ప్రచారంతో చాలా మంది విద్యార్థులు కళాశాలల్లో చేరారు. ఇప్పటివరకు మధ్యాహ్న భోజనం గురించి ప్రభుత్వం కనీసం ప్రకటన కూడా చేయకపోవడంతో విద్యార్థులు సాయంత్రం వరకు ఆకలితో అలమటించాల్సి వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయమే భోజనం సిద్ధం కాదు.. దీంతో కొందరు విద్యార్థులు కళాశాలకు వచ్చే సమయంలో ఇంటి వద్దే భోజనం చేసి బయలుదేరుతారు. ఇక సాయంత్రం వరకు వారికి తినేందుకు ఏమీ అందుబాటులో ఉండడం లేదు. మధ్యాహ్నం సమయంలో కేవలం మంచినీటితోనే కడుపు నింపుకోవాల్సి వస్తోంది. ఆకలితోనే పాఠాలు వినాల్సి వస్తోంది. కొందరు విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి వస్తుండడంతో వారు ఆకలితో, ఒత్తిడితో అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఇంటి నుంచి తెచ్చుకోవాల్సిందే.. కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు కాకపోవడంతో విద్యార్థులు ఇంటి వద్ద నుంచే భోజనం తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదయమే భోజనం సిద్ధం కాని పరిస్థితి ఉండడవంతో విద్యార్థులు హడావుడి చేయాల్సి వస్తోంది. తల్లిదండ్రులు కళాశాల సమయానికంటే ముందే లేచి తమ పిల్లలకు భోజనం సిద్ధం చేయాల్సి వస్తోంది. దూర ప్రాంత విద్యార్థులు కళాశాలకు చేరుకోవాలంటే ముందుగానే బయలుదేరాలి. అలాగే సాయంత్రం ఇంటికి చేరే వరకు సమయం ఎక్కువ పడుతోంది. బస్సులో ప్రయాణించాల్సి రావడంతో వారు తప్పనిసరిగా భోజనం తీసుకెళ్లాల్సిందే. భోజనం లేకపోతే త్వరగా నీరసం వస్తుందని పలువురు విద్యార్థులు పేర్కొంటున్నారు. విద్యార్థి సంఘాల ఆందోళన.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మధ్యాహ్న భోజనం అమలు చేస్తారనే ఉద్దేశంతో విద్యార్థులు జూనియర్ కళాశాలల్లో చేరారు. అయితే పథకం అమలు కాకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్న భోజనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ఇటీవల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. పలు కళాశాలల ఎదుట ఆందోళనలు కూడా చేశారు. ‘భోజన’ పథకాన్ని అమలు చేయాలి.. నాటి విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రభుత్వ పాఠశాలల్లో మాదిరిగానే కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అందిస్తామని మూడేళ్ల క్రితం ప్రకటించారు. ఇప్పటివరకు అమలు కాలేదు. ఈ విషయంపై ప్రస్తుత విద్యా శాఖ మంత్రి సైతం స్పందించడం లేదు. ప్రభుత్వం, అధికారులు సత్వరమే స్పందించి కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలి. – ఆజాద్, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి -
బీఎస్–6 వాహనాల క్యూ!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో బీఎస్–6 ప్రమాణాల అమలు గడువు దగ్గర పడుతుండటంతో వాహన కంపెనీలు కొత్త మోడళ్ల ఆవిష్కరణలను వేగవంతం చేశాయి. ఒకదాని వెంట ఒకటి బీఎస్–6 వేరియంట్లను సిద్ధం చేస్తున్నాయి. వాహన కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించే భారత్ స్టేజ్–6 ప్రమాణాలు 2020 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. దీనికి అనుగుణంగా కొత్త టెక్నాలజీ కోసం ఆటోమొబైల్ సంస్థలు రూ.70– 80 వేల కోట్లను వెచ్చిస్తున్నాయి. మరోవైపు బీఎస్–4తో పోలిస్తే బీఎస్–6 వాహనం మోడల్నుబట్టి 15 శాతం వరకు ఖరీదు కానుంది. ద్విచక్ర వాహన కంపెనీ హోండా బీఎస్–6 వేరియంట్ యాక్టివా–125 స్కూటర్ను ఆవిష్కరించింది. స్కూటర్స్ విభాగంలో ఇదే తొలి బీఎస్–6 వాహనం. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. హీరో మోటోకార్ప్ స్ప్లెండర్ ఐస్మార్ట్ బైక్ బీఎస్–6 ధ్రువీకరణ దక్కించుకుంది. ఐషర్ ప్రో 2000 సిరీస్ లైట్ డ్యూటీ ట్రక్ను విడుదల చేసింది. లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ నాలుగు వేరియంట్లలో లాంగ్ వీల్ బేస్ ఈ–క్లాస్ సెడాన్తోపాటు ఎస్–క్లాస్ 350డీ మోడల్ను ప్రవేశపెట్టింది. టయోటా కిర్లోస్కర్ ప్రీమియం హ్యాచ్బ్యాక్ గ్లాంజాను విడుదల చేసింది. బీఎస్–6తో మూడు నాలుగు నెలల్లో పెట్రోల్, డీజిల్ వెహికిల్స్ను ప్రవేశపెడతామని మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ పవన్ గోయెంకా చెప్పారు. మారుతి సుజుకి ఇండియా బాలెనో, ఆల్టో మోడళ్లను అందుబాటులోకి తెచ్చింది. ఇతర మోడళ్లను ప్రస్తుతం పరీక్షిస్తోంది. డెడ్లైన్లోగా అన్ని మోడళ్లను బీఎస్–6 ప్రమాణాలతో ప్రవేశపెడతామని బజాజ్ ఆటో తెలిపింది. మోపెడ్స్ విభాగంలో ఏకఛత్రాధిపత్యం కొనసాగిస్తున్న టీవీఎస్.. బీఎస్–6 వేరియంట్ను రూపొందిస్తున్నట్లు ప్రకటించింది. భారత్ స్టేజ్ ప్రమాణాలు.. భారత్లో బీఎస్–1 ప్రమాణాలు 2000 సంవత్సరంలో అమల్లోకి వచ్చాయి. 2005లో బీఎస్–2, బీఎస్–3 2010లో వచ్చాయి. ఇప్పుడున్న బీఎస్–4 ప్రమాణాలు 2017 ఏప్రిల్లో మొదలయ్యాయి. దేశంలో కాలుష్యం అంతకంతకూ పెరుగుతుండడంతో బీఎస్–5కు బదులుగా బీఎస్–6 ప్రమాణాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీఎస్–4 వాహనం 50 పీపీఎం (పార్ట్స్ పర్ మిల్లియన్) సల్ఫర్ను విడుదల చేస్తే, బీఎస్–6 వెహికల్ విషయంలో ఇది 10 పీపీఎం ఉంటుంది. డీజిల్ కార్లలో నైట్రోజన్ ఆక్సైడ్స్ 70 శాతం వరకు తగ్గితే, పెట్రోల్ కార్లలో 25 శాతం తగ్గుతుంది. బీఎస్–4 కోసం ఇప్పటికే భారీగా ఖర్చు చేసిన తయారీ సంస్థలు అతి తక్కువ కాలంలోనే నూతన టెక్నాలజీ కోసం పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. భారీ పెట్టుబడులతో... భారత్ స్టేజ్–6 ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలను అభివృద్ధి చేసేందుకు, విడిభాగాలను స్థానికంగా తయారు చేసేందుకై ప్యాసింజర్ వెహికల్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు రూ.35,000– 40,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు ఇక్రా వెల్లడించింది. అలాగే ద్విచక్ర వాహన తయారీ సంస్థల నుంచి రూ.15,000 కోట్ల వరకు పెట్టుబడులు ఉండొచ్చని సమాచారం. మొత్తంగా వాహన పరిశ్రమ రూ.70–80 వేల కోట్ల నిధులు వెచ్చిస్తున్నట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ చెబుతోంది. బీఎస్–6 గ్రేడ్ ఫ్యూయెల్స్ కోసం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రూ.28,000 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. బీఎస్–6 నూతన సాంకేతిక పరిజ్ఞానం కోసం రూ.1,000 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్టు మహీంద్రా ప్రకటించింది. హోండా మోటార్సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా రూ.800 కోట్లు వెచ్చిస్తోంది. 2019–20లో విస్తరణ నిధులు రూ.1,500 కోట్లు ఉండొచ్చని హీరో మోటోకార్ప్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పనున్న కొత్త ప్లాంటుతోపాటు బీఎస్–6 అప్గ్రెడేషన్కు ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్టు కంపెనీ సీఎఫ్వో నిరంజన్ గుప్తా తెలిపారు. ఫోర్స్ మోటార్స్ రూ.250 కోట్లు వెచ్చిస్తోంది. వచ్చే మూడేళ్లకుగాను యమహా ఇండియా రూ.100 కోట్లు ఖర్చు చేయనుంది. -
‘సోలార్’కు సై
ఖమ్మంమయూరిసెంటర్: విద్యుత్ను ఆదా చేసేందుకు.. సోలార్ విద్యుత్ను ప్రోత్సహించేందుకు.. ప్రత్యేకంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు టీఎస్ రెడ్కో(తెలంగాణ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) ద్వారా కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యుదుత్పత్తిని పెంచడం కోసం సోలార్ ఎనర్జీని కూడా ఉపయోగించుకునేందుకు వీలు కల్పిస్తోంది. జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో దీనిని ఏర్పాటు చేసేందుకు పూనుకుంది. తొలుత ప్రభుత్వ కార్యాలయాలతోపాటు విద్యా సంస్థలు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాల్లో సోలార్ రూఫ్టాప్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం నోడల్ ఏజెన్సీ అయిన టీఎస్ రెడ్కో ఆయా ప్రాంతాల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. న్యూఢిల్లీలోని రెన్యువల్ ఎనర్జీ సోర్స్ మంత్రిత్వ శాఖ సోలార్ పవర్ ప్లాంట్లను వినియోగిస్తే మొత్తం వ్యయంలో 25 శాతం సబ్సిడీ అందించేందుకు అంగీకరించింది. ఇందులో రెండు రకాలుగా సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయించేందుకు టీఎస్ రెడ్కో సన్నద్ధమవుతోంది. సోలార్ విద్యుత్ ఏర్పాటుకు వెసులుబాటు ప్రభుత్వ కార్యాలయాల్లో.. ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే సోలార్ పవర్ ప్లాంట్ల కోసం ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించింది. ప్రైవేట్ సంస్థలకు, ప్రభుత్వ సంస్థలకు అందుబాటులో వారికి వీలుగా ఉంచేందుకు క్యాపెక్స్, రెస్కో పద్ధతిలో సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. మొదటగా క్యాపెక్స్ పద్ధతిలో సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలంటే ముందస్తుగా ప్లాంట్కు అయ్యే ఖర్చును చెల్లించాల్సి ఉంటుంది. అదే రెస్కో విధానంలో అయితే ప్రతి నెలా సోలార్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్కు యూనిట్కు ఇంత చొప్పున నగదు చెల్లించాల్సి ఉంటుంది. క్యాపెక్స్ విధానంలో 1 నుంచి 10 కిలో వాల్ట్స్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే ఒక కిలో వాల్ట్స్కు రూ.53,750 చెల్లించాల్సి ఉంటుంది. అదే 11 నుంచి 100 కిలోవాల్ట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే రూ.49వేలు చెల్లించాలి. 101–1000 కిలో వాల్ట్స్ చొప్పున ఏర్పాటు చేస్తే రూ.45వేలు ఒక కిలో వాల్ట్కు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రెస్కో ద్వారా 1 నుంచి 10 కిలో వాల్ట్స్ సోలార్ పవర్ ప్లాంట్కు 25 ఏళ్ల వరకు యూనిట్కు రూ.4.75 చెల్లించాల్సి ఉంటుంది. 11–100 కిలో వాల్ట్స్కు యూనిట్కు రూ.4.30, 101–1000 కిలో వాల్ట్స్ వరకు యూనిట్కు రూ.3.33 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి నెలా సోలార్ ప్లాంట్ నుంచి సరఫరా అయ్యే విద్యుత్ను కార్యాలయంలో ఏర్పాటు చేసిన బయో డైరెక్షనల్ మీటర్ ద్వారా దిగుమతి, ఎగుమతులను లెక్కిస్తారు. సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసిన కార్యాలయాల్లో విద్యుత్ శాఖ ద్వారా సరఫరా అయ్యే విద్యుత్, సోలార్ ప్లాంట్ నుంచి సరఫరా అయ్యే విద్యుత్ ఎంత వినియోగించారనేది బయో డైరెక్షనల్ మీటర్ల ద్వారా తేలిపోతుంది. కొత్త భవనాలకు ప్రాధాన్యం కొత్త భవనాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రభుత్వ శాఖలకు సోలార్ ప్లాంట్ల ఏర్పాటులో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సోలార్ ప్లాంట్కు 25 ఏళ్ల జీవితకాలం ఉన్నందున కొత్త భవనాలపైనే వీటిని నిర్మించాలని ప్రభుత్వం, టీఎస్ రెడ్కో ఉన్నతాధికారులు నిర్ణయించారు. ప్రభుత్వ కార్యాలయాలతోపాటు పంచాయతీ కార్యాలయాలు, విద్యా సంస్థలపై వీటిని ఏర్పాటు చేయనున్నారు. టీఎస్ రెడ్కో జిల్లా అధికారులు ఆయా ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు వెళ్లి.. శాఖల అధికారులతో మాట్లాడి సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేయించేందుకు అవగాహన కల్పించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర శాఖ అధికారులు.. జిల్లా అధికారులకు సూచనలు చేయడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు టీఎస్ రెడ్కో అధికారులు ప్రక్రియను ప్రారంభించారు. జిల్లాలో నూతన భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయించుకునేందుకు ప్రభుత్వ శాఖలు ముందుకొస్తే ఆయా శాఖలకు, సోలార్ ప్లాంట్లను నిర్మించే సంస్థలకు మధ్య టీఎస్ రెడ్కో అధికారులు ఒప్పందం కుదర్చనున్నారు. ప్లాంట్ల నిర్మాణానికి ఆదేశాలు ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ ప్లాంట్లు నిర్మించాలని రాష్ట్ర అధికారులు సూచనలు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి.. శాఖల అధికారులతో చర్చించి సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయించేందుకు చర్యలు చేపట్టాం. జిల్లాలో నూతన భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీ కార్యాలయాలు, విద్యా సంస్థలను గుర్తించి వారికి సోలార్ విద్యుత్పై అవగాహన కల్పించనున్నాం. – వడపు సుబ్రహ్మణ్యం, టీఎస్ రెడ్కో, జిల్లా మేనేజర్ -
ఆధార్పై తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: ఆధార్ పథకం, దాని అమలుకు రూపొందించిన చట్టం రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. సీజేఐ జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ముందు మొత్తం 31 పిటిషన్లు దాఖలు కాగా.. వాటిలో హైకోర్టు మాజీ జడ్జి కేఎస్ పుట్టుస్వామి దాఖలు చేసిన పిటిషనూ ఉంది. ఈ పిటిషన్లపై నాలుగున్నర నెలల వ్యవధిలో మొత్తం 38 రోజులు ధర్మాసనం వాదనల్ని ఆలకించింది. 1973లో చారిత్రాత్మక కేశవానంద భారతీ కేసు అనంతరం ఎక్కువ రోజులు విచారించిన కేసు ఇదే. ధర్మాసనం ముందు పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గోపాల సుబ్రమణియమ్ వాదిస్తూ.. ‘సేవలు అందించేందుకు ఆధార్ చట్టం మాధ్యమం కాదు. ఇది కేవలం ఒక గుర్తింపు మాత్రమే. ఆధార్ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం గౌరవం, స్వేచ్ఛకు భద్రత లేదు. ధ్రువీకరణ అనేది ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. ధ్రువీకరణలో విఫలమైతే సేవల్ని నిరాకరించవచ్చని చట్టంలో పేర్కొన్నారు’ అని వాదించారు. ఆధార్ సమాచారాన్ని పొందేందుకు ప్రైవేటు వ్యక్తులకు అనుమతిచ్చారని, ఈ చట్టానికి ఎలాంటి భద్రతా లేదన్నారు. ఆధార్ వంటి చట్టానికి నియంత్రణ అవసరమని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. మనీ లాండరింగ్ నియంత్రణ చట్టం ప్రకారం ఆధార్ కేవలం బ్యాంకులకు మాత్రమే పరిమితం కాదని.. మ్యూచువల్ ఫండ్లు, బీమా పాలసీలు, క్రెడిట్ కార్డులు, ఇతర అంశాలకు అవసరమని మరో సీనియర్ న్యాయవాది అర్వింద్ దతర్ ఆందోళన వెలిబుచ్చారు. ఈ కేసులో కక్షిదారుల పక్షాన సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, పి.చిదంబరం, శ్యామ్ దివాన్, కేవీ విశ్వనాథ్, ఆనంద్ గ్రోవర్, సజన్ పూవయ్యలు వాదనలు వినిపించారు. రామన్ మెగసెసె అవార్డు గ్రహీత శాంతా సిన్హా, సామాజిక కార్యకర్తలు అరుణా రాయ్, నిఖిల్ డే, నచికెత్ ఉడుప తదితరులు ఆధార్ను వ్యతిరేకిస్తూ పిటిషన్లను దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వం, ఆధార్ అధీకృత సంస్థ(యూఐడీఏఐ), మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలు, ఆర్బీఐలు ఆధార్కు అనుకూలంగా వాదనలు వినిపించగా.. వారి తరఫున అటార్నీ జనరల్ వేణుగోపాల్, అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్, లాయర్లు రాకేశ్ ద్వివేది, జయంత్ భూషణ్లు వాదించారు. -
ఆంధ్రప్రదేశ్ రైతులకూ నేరుగా సబ్సిడీ
న్యూఢిల్లీ: 14 రాష్ట్రాల్లో గత నెలలో కేంద్రం ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టిన రైతులకు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) పథకాన్ని వచ్చే నెలనుంచి ఆంధ్రప్రదేశ్తో పాటు 5 రాష్ట్రాల్లో అమలు చేయనుంది. ఇందులో భాగంగా ఎరువుల రాయితీని నేరుగా రైతుల ఖాతాలోకే ప్రభుత్వం జమ చేయనుంది. ఈ మేరకు కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులు తెలిపారు. ప్రతియేటా రూ. 70వేల కోట్ల ఎరువులను కేంద్రం రైతులకు సబ్సిడీమీద అందజేస్తోంది. వచ్చే నెల నుంచి పంజాబ్, హరియాణా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఏపీలోని రైతులకు ఈ డీబీటీ పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి తెలిపారు. -
లోధా సిఫారసులు అమలు చేయరా?
హెచ్సీఏ తీరుపై అజహరుద్దీన్ విమర్శలు సాక్షి, హైదరాబాద్: లోధా కమిటీ సిఫారసులను హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అమలు చేయడం లేదని భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ మండిపడ్డారు. హెచ్సీఏలో నిత్యకృత్యమైన ఆర్థిక అవకతవకలు, నిధుల దుర్వినియోగంపై ఆయన విమర్శలు గుప్పించారు. మొయినుద్దౌలా గోల్డ్కప్ క్రికెట్ టోర్నీ కోసం ఎంపిక చేసిన హైదరాబాద్ జట్లలో ప్రతిభ గల కుర్రాళ్లను పక్కన బెట్టడం దారుణమన్నారు. శనివారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అజహరుద్దీన్ మాట్లాడుతూ ‘ఇది చాలా విచారకరం. హెచ్సీఏ ‘ఎ’ డివిజన్ రెండు రోజుల లీగ్లలో మూడేసి సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ను, ఐదేసి వికెట్లు తీసిన బౌలర్లను హైదరాబాద్ ఇరు జట్లకు ఎంపిక చేయలేదు. లోధా ప్యానెల్ సిఫారసుల ప్రకారం సెలక్టర్లుగా నియామకమైనవారికి కనీసం 25 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన అనుభవం ఉండాలి. కానీ దీన్ని హెచ్సీఏ పాటించట్లేదు. పీకల్లోతు అవినీతి అరోపణల్లో కూరుకుపోయిన హెచ్సీఏను ప్రక్షాళన చేయాల్సిందే. సర్వోన్నత న్యాయస్థానం నియమించిన ‘లోధా’ సిఫారసులను అమలు చేయాలి’ అని అజహరుద్దీన్ డిమాండ్ చేశారు. ఈ జనవరిలో జరిగిన హెచ్సీఏ ఎన్నికల బరిలోకి దిగేందుకు ఆయన విఫలయత్నం చేశారు. అయితే ఈ భారత మాజీ కెప్టెన్ వేసిన నామినేషన్ను రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. మరోవైపు అజహర్ విమర్శలపై హెచ్సీఏ అధ్యక్షుడు జి.వివేకానంద్ను సంప్రదించగా... ‘లోధా సిఫారసుల అమలు విషయాన్ని బోర్డు పరిపాలక కమిటీ (సీఓఏ) చూసుకుంటుంది. ఇది ఇప్పుడు కోర్టు పరిధిలోని అంశం. దీనిపై ఇంకా ఎక్కువ ఏమీ మాట్లాడలేను. ఆయన (అజహర్)కు ఏమైనా అభ్యంతరాలుంటే సుప్రీం కోర్టుకు వెళ్లవచ్చు’ అని అన్నారు. -
జీఎస్టీ గుబులు
భీమవరం/తాడేపలి్లగూడెం : వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వ్యాపార వర్గాల్లో సెగ పుట్టిస్తోంది. జూలై 1నుంచి అమల్లోకి రానున్న కొత్త పన్ను విధానం ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ నెలకొంది. కొన్ని వస్తువులకు పన్ను మినహాయింపులు, మరికొన్ని వస్తువులకు శ్లాబ్ రేట్లు పెంచనున్నారు. దీనివల్ల ఇప్పటికిప్పుడు పన్నుల ద్వారా లభించే ఆదాయంలో పెద్దగా పెరుగుదల ఉండకపోవచ్చని వాణిజ్య పన్నుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. జీఎస్టీపై జిల్లాలోని అన్నిరకాల వ్యాపారులకు అవగాహన కల్పించే పనిలో ఆ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ధాన్యం, బియ్యం, గోధుమలు, వాటితో చేసే ఉత్పత్తులు, అపరాలు, పప్పులు, అగరుబత్తి, స్కూల్ బ్యాగ్లు, ప్యాకేజ్డ్ ఆహారం వంటి వాటికి జీఎస్టీ నుంచి మినహా యింపు ఉంటుందని చెబుతున్నారు. వ్యవసాయ చేతి పనిముట్లు, దివ్యాంగులు వినియోగించే వస్తువులు, ఆక్వా, పౌల్ట్రీ ఫీడ్, తమలపాకులు, బార్లీ, తృణ ధాన్యాలు, పెరుగు, మజ్జిగ వంటి పాల పదార్థాలు, వంట చెరకు, కూరగాయలు, మరమరాలు వంటి వాటికీ మినహాయింపు లభించనుంది. మిర్చి, పత్తి, కాఫీ, టీ, ఖనిజాలు తదితర వస్తువులపై ప్రస్తుతం ఉన్న 5 శాతం పన్నులే జీఎస్టీలో కొనసాగుతాయని సమాచారం. జీఎస్టీ అమల్లోకి వస్తే స్థానికంగా తయారయ్యే వస్తువుల ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. దీర్ఘకాలంలో వస్తు ఉత్పాదక వ్యయం తగ్గి స్థానికంగా తయారయ్యే వస్తువులు వినియోగదారులకు తక్కువ ధరకే లభించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. కార్యకలాపాలు ఆన్లైన్ జీఎస్టీ కార్యకలాపాలు పూర్తిగా ఆన్లైన్ ద్వారానే జరుగుతాయి. ఈ చట్టం కింద వ్యాపారులు దాఖలు చేసే రిటర్న్స్, చెల్లించే పన్నుల ఆధారంగా వారికి రేటింగ్ ఇస్తారు. దీనివల్ల వ్యాపార కార్యాకలాపాలు అభివృద్ధి చెందుతాయంటున్నారు. జీఎస్టీ వల్ల ప్రజలకు, వ్యాపారులకు, ప్రభుత్వానికి ప్రయోజనం ఉంటుందని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ప్రచారం చేస్తున్నారు. ఒకే రకమైన పన్ను అమలు కావడం వల్ల పన్ను చెల్లించాలి్సన అవసరం నేరుగా వినియోగదారులకు ఉండదు. ఏకీకృత పన్నుల వ్యవస్థ వల్ల వినియోగదారులకు తక్కువ ధరకే వస్తువులు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. చిన్న వ్యాపార సంస్థలకు నిర్వహణ ఖర్చులు తగ్గనున్నాయి. పన్ను వసూలు సులభతరమై బకాయిలు, చట్టపరమైన వివాదాలు తగ్గుతాయనేది అధికారుల భావన. జీఎస్టీ అమల్లోకి వచ్చిన వెంటనే ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన సరుకులపై కూడా ఇన్పుట్ టాక్స్లు పొందేందుకు వ్యాపారులకు అర్హత ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాట్ చట్టం ప్రకారం నిల్వ ఉన్న ఇన్పుట్ టాక్స్ను జీఎస్టీ చట్టం అమలు తరువాత తిరిగి పొందవచ్చు. ఇప్పటికే 90 శాతానికి పైగా వ్యాపారులు జీఎస్టీ పరిధిలోకి వచ్చారు. విదేశాలకు ఎగుమతి చేసిన సరుకులు, సేవలపై కట్టిన పన్ను వాపస్ ఇస్తారు. అదనంగా లేదా పొరపాటున చెల్లించిన పన్నును కూడా వ్యాపారులు తిరిగి పొందే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ అంతా ఆన్లైన్ ద్వారానే నడుస్తుంది. అనుమానాలెన్నో.. జీఎస్టీ విధానంపై వ్యాపారులను అనేక అనుమానాలు చుట్టుముడుతున్నాయి. సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. తమ అనుమానాలను అవగాహన సదస్సుల్లో అడుగుతుంటే. అధికారులు సమాధానాలు చెప్పలేకపోతున్నారు. ప్రధానంగా ప్రస్తుతం సాగుతున్న జీరో వ్యాపారాన్ని అధికారులు జీఎస్టీ ద్వారా ఏవిధంగా నియంత్రిస్తారన్నది అర్థం కాని సమస్యగా ఉంది. ఇప్పటికీ అనేక వ్యాపార సంస్థల్లో వ్యాట్లో నమోదు చేయని సరుకుల నిల్వలు భారీగా ఉన్నాయి. జూలై 1నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తే వాటిని ఏ విధంగా చూపిం చాలనే సందేహం వ్యాపారుల నుంచి వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఉన్న పన్నుల శ్లాబులు జీఎస్టీ వల్ల మారనున్నాయి. అదనంగా పెరిగే పన్నులను ఏవిధంగా చెల్లించాలనేది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. ఇప్పటివరకు మామూళ్లకు అలవాటు పడిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులు జీఎస్టీ అమలైతే తమ ఆదాయానికి గండి పడుతుందనే ఆందోళనలో ఉన్నారు. జీఎస్టీ నాలుగు రకాలు జీఎస్టీ విధానంలో నాలుగు రకాలు ఉంటాయని చెబుతున్నారు. సీజీఎస్టీ (సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీ) ఎస్జీఎస్టీ (స్టేట్ గవర్నమెంట్ జీఎస్టీ ) యూజీఎస్టీ (కేంద్రపాలిత ప్రాంతాల జీఎస్టీ) ఐజీఎస్టీ (ఇంటర్ స్టేట్ జీఎస్టీ)గా వీటిని పిలుస్తారు. ఈ నాలుగింటిలో ఐజీఎస్టీ ఆదాయం కేంద్రం వద్దే ఉంటుంది. ఉదాహరణకు ముంబైలో తయారైన వస్తువు ఆంధ్రప్రదేశ్లో విక్రయించగా వచ్చే పన్నును ఏ దామాషాలో అక్కడి తయారీదారుకు, ఇక్కడి విక్రేతకు విధించాలనేది కేంద్రమే నిర్ణయిస్తుంది. మిగిలిన మూడు రకాల పన్నులను మార్గదర్శకాలకు అనుగుణంగా విధిస్తారు. రివర్స్ చార్జి మెకానిజం జీఎస్టీ లావాదేవీలన్నీ ఈ–ఇన్పుట్ ద్వారా సాగించాల్సి ఉంటుంది. దీనికోసం ఎన్నిరకాల ఆవర్జా పుస్తకాలు నిర్వహించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అమ్మకాలు, కొనుగోలు విషయాలకు సంబంధించి పన్ను రాయితీకి కొన్ని విధివిధానాలు నిర్ణయిస్తున్నట్టు సమాచారం. ఒక రిటైల్ వ్యాపారి హోల్సేల్ వ్యాపారి నుంచి రూ.5 లక్షల విలువైన సరుకును కొనుగోలు చేస్తే.. అది హోల్సేల్ వ్యాపారి అమ్మకాల్లోకి వెళ్లి రూ.5 లక్షల అమ్మకాలకు సంబంధించి జీఎస్టీ పన్ను చెల్లింపుల్లోకి వెళుతుంది. రిటైల్ వ్యాపారి రూ.లక్ష విలువైన సరుకును వెనక్కి ఇస్తే ఎలక్ట్రానిక్ ఇన్పుట్లో ఆ విషయాన్ని పొందుపరిస్తే.. ఆ మేరకు జీఎస్టీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. రివర్స్ చార్జ్ మెకానిజమ్గా ఈ లావాదేవీలను చూపించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం సీజీఎస్టీగా అత్యధికంగా 20 శాతం పన్ను విధించవచ్చు. ఎస్జీఎస్టీగా కూడా 20 శాతం పన్ను వేయవచ్చు. ఐజీఎస్టీగా మాత్రం అత్యధికంగా 40 శాతం పన్ను వసూలు చేయవచ్చని సమాచారం. జీఎస్టీపై దఫదఫాలుగా వాణిజ్య పన్నుల విభాగం అధికారులకు, ఉద్యోగులకు, చార్టర్డ్ అకౌంటెంట్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జూన్ నెలాఖరు వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. అప్పటికి గాని జీఎస్టీపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం లేదు. -
చేతన కొరవడితే యాతనే!
సమకాలీనం పారదర్శకత గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలిచ్చే అధినేతలకు పాలనావ్యవస్థల్లోని సమాచారం ప్రజలకు అందించడమంటేనే వెరపు! సమాచార వెల్లడితో కొత్త చిక్కుల్ని ఆహ్వానించే కన్నా గోప్యత ద్వారా పబ్బం గడుపుకోవచ్చన్న తప్పుడు ఆలోచనే ఇందుకు కారణం. సమాచారం నిరాకరించే, జాప్యం చేసే ప్రతి సందర్భంలోనూ, అంటే అన్ని ఫిర్యాదులు, అప్పీళ్లల్లో నిందితులుగా నిలవాల్సింది ప్రభుత్వ యంత్రాంగమే! తనను దోషిగా నిలబెట్టి ప్రశ్నించే ఏ పరిస్థితినైనా ప్రభుత్వ వ్యవస్థ ఎందుకు సాఫీగా అనుమతిస్తుంది? ‘సదా అప్రమత్తంగా ఉండటమే స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు మనం చెల్లించే మూల్యం’ (Eternal vigillance is the price of liberty) అని తొలుత ఎవరు చెప్పారో కానీ, గడచిన రెండు శతాబ్దాలుగా ప్రపంచమంతా ప్రాచుర్యంలో ఉన్న మాట ఇది! ఇప్పటికీ వర్తిస్తున్న మాట! ఐరిష్ న్యాయవాది జాన్ ఫిల్పోట్ తొలుత చెప్పారనేదొక ప్రచారం. అమెరికాలో సాగిన బానిసత్వ వ్యతిరేక పోరులో క్రియాశీల కార్యకర్తగా వెండెల్ ఫిలిప్స్ 1882లో ఈ మాటన్నారనీ చెబుతారు. ఆధారాల్లేకపోయినా... అమెరికా నిర్మాతల్లో ఒకరైన థామస్ జెఫర్సన్ అంతకు ముందెప్పుడో అన్నట్టు ఆయన పేరిట ప్రచారముంది. ఎవరు చెప్పినా విశ్వవ్యాప్తంగా అనేక పౌర ఉద్యమాలకు ఊపిరులూదిన, ఇంకా ఊదుతున్న గొప్ప స్ఫూర్తి వాక్యం. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు అతికినట్టు సరిపోయే ఆణిముత్యమీ మాట! పౌర సమాజం చైతన్యంతో ఉండి పోరాడితే తప్ప ప్రజాస్వామ్యపు మౌలిక హక్కులు కూడా దక్కని దుస్థితి క్రమంగా బలపడుతోంది. సమాచార హక్కు చట్టం అమలును చూస్తే అది తేటతెల్లమౌతోంది. రాజ్యాంగ స్ఫూర్తితో, చట్టం సాక్షిగా దక్కిన ఈ హక్కు అమలు పర్యవేక్షణకిక తెలుగునాట నేటితో కాలం చెల్లనుంది. పూనిక వహిస్తే తప్ప పునరుద్ధరణకు మరెంత కాలమో! తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల, నిరంతరాయంగా సాగాల్సిన చట్టం అమలు పర్యవేక్షణకు ఇప్పుడు గండి పడుతోంది. రేపట్నుంచి కొంత కాలంపాటు చట్ట శూన్యత, ఇంకా చెప్పాలంటే రాజ్యాంగ శూన్యత ఏర్పడే పరిస్థితులు దాపురించాయి. అడిగినా సమాచారం లభించని సందర్భాల్లో పౌరులు చేసుకొనే ఫిర్యాదులు, అప్పీళ్లు, చట్టం అమలును చూసే సమాచార కమిషన్ రేపట్నుంచి ఉనికిలో లేకుండా పోతోంది. రాష్ట్ర విభజన నేపధ్యంలో, రెండు రాష్ట్రాలకు విడిగా రెండు కమిషన్లను సమకూర్చుకునే జాగ్రత్తలు తీసుకోకపోగా ఉన్న ఉమ్మడి కమిషన్కు కాలం చెల్లిపోతున్నా ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. కొత్త కమిషన్, కమిషనర్ల నియామకాలు ఇంకా మొదలు కాలేదు. తెలంగాణలో ఇప్పుడిప్పుడే ప్రక్రియకు తెరలేపుతున్నా ఏపీలో కనీసం ఆ ఊసే లేదు! సహజ మరణంలా కనపడేట్టు చంపుతున్నదెవరు? ప్రభుత్వాలు ఏ కొంచెం జాగ్రత్త తీసుకున్నా కమిషన్కు ఈ పరిస్థితి తలెత్తేదే కాదు. 2014 జూన్లో రాష్ట్ర విభజన తర్వాత మిగతా పలు విభాగాల్లాగే సమాచార కమిషన్నూ పంచుకోవాల్సింది. పంపకాల జాబితాలో మొదట ఎక్కడా కమిషన్ ప్రస్తావన కూడా లేకపోవడం అందరినీ విస్మయ పరిచింది. తర్వాత జ్ఞానోదయమై, పదో షెడ్యూల్ జాబితాలో చేర్చారు. నిబంధనల ప్రకారం ఏడాదిన్నరలో ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు సయోధ్యతో కమిషన్ను పంచుకోవాలి. ఇందులో పంచుకోవడానికీ, పంపకంలో వివాదాలు తలెత్తడానికీ ఆస్తు లేం లేవు! ఉన్నదల్లా కమిషనర్లను, ఇతర సిబ్బందిని పంచుకొని ఏ రాష్ట్రపు అప్పీళ్లు, ఫిర్యాదుల్ని ఆ కమిషన్ పరిష్కరించడం, అక్కడ చట్టం అమలును పర్యవేక్షించడం. ఇంత తేలిక వ్యవహారాన్నీ సర్కార్లు తేల్చలేదు, పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. ఏడాదిన్నర గడువు మీరితే కేంద్ర ప్రభుత్వం చేసిపెట్టాలి. అదీ జరక్కుండానే మొత్తం మూడేళ్లవుతోంది. ఈ మధ్య కాలంలో ఒక్కరొక్కరుగా ముఖ్య సమాచార కమిషనర్లు పదవీ విరమణ చేశారు. పదవిలో కొనసాగుతున్న నలుగురు కమిషనర్ల నియామకమే చెల్లదంటూ లోగడ హైకోర్టిచ్చిన తీర్పును ఈ మధ్యే సుప్రీంకోర్టు ఖరారు చేసింది. దాంతో వారు ఇంటిబాట పట్టారు. అది జరిగిన ఒకట్రెండు రోజుల్లోనే అప్పటివరకు ఆపద్ధర్మ ముఖ్య కమిషనర్గా ఉన్న రతన్ పదవీ విరమణ చేశారు. ఇక కమిషన్లో మిగిలిన ఏకైక కమిషనర్ విజయబాబుకు ఈ రోజు (శుక్రవారం) ఆఖరి పనిదినం. ఇక కమిషన్ ఉనికిలో లేనట్టే! ఎందుకంటే, చట్టంలో నిబంధనలలా ఉన్నాయి. సమాచార హక్కు చట్టం–2005 సెక్షన్ 15(4) ప్రకారం ‘కమిషన్ నిత్యనిర్వహణ, దిశా నిర్దేశం అన్నది కమిషనర్ల సహకారంతో ముఖ్య కమిషనర్ నిర్వహించాలి...’ అని ఉంది. ఏ వ్యవహారమైనా కమిషనర్లు లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించజాలవు, నిర్వహించకూడదు. ముఖ్య కమిషనర్, ఇతర కమిషనర్లెవరూ లేనప్పుడు కమిషన్ ఉనికిలో లేనట్టే అని గుజరాత్, ఉత్తరాఖండ్ కమిషన్ల నిర్వహణ వివాదంలో అక్కడి ఉన్నత న్యాయస్థానాలు ఇదివరకే తేల్చిచెప్పాయి. లోగడ ఆ తీర్పులతో జడిసిన ఆయా ప్రభుత్వాలు ముఖ్య కమిషనర్ను (గుజరాత్), ఇతర కమిషనర్లను (ఉత్తరాఖండ్) సత్వరమే నియమించుకున్నాయి. అందుకే ప్రభుత్వాలు ఈ శూన్యత రాకుండా ఉండటానికి తగినంత ముందుగానే ప్రక్రియ ప్రారంభిస్తాయి. చివరి కమిషనర్ పదవీ విరమణ నాటికి కొత్తగా నియమితులైనవారు బాధ్యత తీసుకునేలా ప్రక్రియను పూర్తి చేస్తాయి. ఆ తెలివిడి ఇప్పుడు రెండు ప్రభుత్వాలకూ లేకుండా పోయింది. సర్కార్లకు శీతకన్నెందుకు? సమాచార హక్కు చట్టం పట్లనే ఈ ప్రభుత్వాలకు సదుద్దేశమున్నట్టు లేదు! అమలు చేయకుంటే నేం? అన్న ధీమాతోనే ప్రభుత్వాలు అలసత్వం ప్రదర్శిస్తుండవచ్చని ఆర్టీఐ క్రియాశీల కార్యకర్తలంటున్నారు. పాలకుల ఈ భావనలకు ఉన్నతాధికార వ్యవస్థ అనాసక్తి తోడవుతోంది. దాంతో చట్టం అమలు నీరుగారుతోంది. ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న అమలు, పర్యవేక్షణ ఇక కమిషన్ కూడా లేకుంటే మరింత కుదేలవడం ఖాయం. ఇలా కమిషన్ ఉనికే లేని పరిస్థితికి నెట్టడం సర్కార్ల నిర్లక్ష్యానికి నిదర్శనం. పాలకులు, ఉన్నతాధికార వ్యవస్థ నుంచి ప్రత్యక్షంగా–పరోక్షంగా అందే సంకేతాలను బట్టే కింది స్థాయి అధికారులు, సిబ్బంది పనితీరు ఉంటుంది. అదే ఆర్టీఐ విజయ–వైఫల్యాలను నిర్ణయిస్తుంది. పారదర్శకత గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలిచ్చే అధినేతలకు పాలనావ్యవస్థల్లోని సమాచారం ప్రజలకు అందించడమంటేనే వెరపు! పూర్వపు/తమ నిర్వాకంలోని అలసత్వం, ఆశ్రిత పక్షపాతం, అక్రమ– అవినీతి వ్యవహారాలు బట్టబయలవుతాయనే భయం కూడా కారణం కావచ్చు. సమాచార వెల్లడితో కొత్త చిక్కుల్ని ఆహ్వానించే కన్నా గోప్యత ద్వారా పబ్బం గడుపుకోవచ్చన్న తప్పుడు ఆలోచనే ఇందుకు కారణం. దాంతో సమాచార హక్కు చట్టం అమలంటేనే తప్పించుకునే దొంగదారులు వెతుకుతారు. సమాచారం నిరాకరించే, జాప్యం చేసే ప్రతి సందర్భంలోనూ, అంటే అన్ని ఫిర్యాదులు, అప్పీళ్లల్లో నిందితులుగా నిలవాల్సింది ప్రభుత్వ యంత్రాంగమే! తనను దోషిగా నిలబెట్టి ప్రశ్నించే ఏ పరిస్థితినైనా ప్రభుత్వ వ్యవస్థ ఎందుకు సాఫీగా అనుమతిస్తుంది? అందుకే ఈ అవరోధాలు. సమాచార వెల్లడికి సంబంధించి తామిచ్చే ఆదేశాలను అధికార యంత్రాంగం పాటించడం లేదని, ఈ విషయంలో సర్కారు సహకరించకుంటే నిర్వహణ కష్టమని కమిషనర్లే తమ వార్షిక సదస్సులో బాహాటంగా చేతులెత్తేసిన దుస్థితి విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రపదేశ్లో వెల్లడైంది. విభజనానంతరం ఇక ఆ కమిషన్ ఎవరికీ పట్టని సంస్థగానే మిగిలింది. ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదు. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం. ఒక దశలో కమిషన్ ఆర్థిక నిర్వహణ, కమిషనర్లు ఇతర సిబ్బంది జీతభత్యాలకూ తిప్పలు తప్పలేదు. ఇది రాజ్యాంగ విహిత బాధ్యత సమాచారం తెలుసుకోవడం అన్నది పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పలుమార్లు తీర్పుల్లో వెల్లడించింది. పౌరులు తమ వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ (అధికరణం 19 (1) (ఎ)లో అంతర్భాగంగా) వినియోగించుకునే క్రమంలోనే ఈ హక్కు సంక్రమిస్తుందనీ స్పష్టం చేసింది. దీన్ని సక్రమంగా అమలు పరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్థాయిల్లో కమిషన్లను ఏర్పాటు చేసి, నిర్వహించాలని సమాచార హక్కు చట్టం (సెక్షన్లు 12, 15) నిర్దేశిస్తోంది. ఈ నిర్వహణ లేకుంటే కచ్చితంగా ఇది చట్టోల్లంఘన, రాజ్యాం గోల్లంఘన కిందకే వస్తుందని పౌర సమాజం పేర్కొంటోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సత్వరమే ముఖ్య, ఇతర కమిషనర్ల నియామక ప్రక్రియ చేపట్టాలని ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులకు ఆర్టీఐ జాతీయ ప్రచార వేదిక (ఎన్సీపీఆర్ఐ) ఇటీవలే విడివిడిగా వినతిపత్రాలు సమర్పించింది. అరుణరాయ్, నిఖిల్డే, శైలేశ్ గాంధీ, రాకేశ్రెడ్డి, రామకృష్ణంరాజు తదితరులు ఇందులో ఉన్నారు. యోగ్యత కలిగిన సమర్థుల్ని కమిషనర్లుగా నియమిస్తూ, ఆ నియామక ప్రక్రియనూ పౌరులకు తెలిసేలా పారదర్శకంగా జరిపించాలనీ కోరారు. ‘నమిత్శర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో, నియామకాలకు ఏ ప్రక్రియను పాటించమందో కూడా ఈ వినతిపత్రంలో వారు ప్రస్తావించారు. సుప్రీం తీర్పుననుసరించి కేంద్ర ప్రభుత్వం లోగడ కేంద్ర సమాచార కమిషనర్లను నియమించేటప్పుడు పత్రికల్లో ప్రకటన జారీ చేసి ఆసక్తి గల అర్హుల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానించింది. సమాచార హక్కు చట్టం (సెక్షన్లు 12(5), 15(5) లలో) నిర్దేశించినట్టు ప్రజాజీవితంలో ప్రముఖులై ఉండి న్యాయ, శాస్త్ర–సాంకేతిక, సమాజసేవ, పత్రికారంగం, పాలన, నిర్వహణ తదితర రంగాల్లో విస్తృత పరిజ్ఞానం కలిగిన వారి దరఖాస్తుల్ని పరిశీలించాలి. ఎవరి అర్హతలేమిటో నిర్దిష్టంగా పేర్కొంటూ, జాబితా కుదింపు ప్రక్రియలో ప్రతి పేరు పక్కన మినిట్స్ నమోదు చేస్తూ ఈ సమాచారాన్ని పౌరులకు అందుబాటులో ఉంచాలి. అలా కుదించిన జాబితా నుంచి అవసరమైనన్ని పేర్లను ముఖ్యమంత్రి, విపక్షనేత, సీనియర్ మంత్రితో కూడిన త్రిసభ్య సంఘం గవర్నర్కు ప్రతిపాదిస్తుంది. ఆయన పరిశీలించి ఖరారు చేస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిది సత్వరం జరగాల్సి ఉంది. దీనికి చాలా సమయమే పట్టొచ్చు! చెవి మెలితిప్పితే తప్ప....! కొన్ని వ్యవహారాల్లో ప్రభుత్వ నిర్వాకాలు చిత్రాతిచిత్రంగా ఉంటాయి. న్యాయస్థానాలతో మొట్టికాయలు వేయించుకునే వరకు తెలిసి తెలిసీ నిస్సిగ్గుగా చట్టాల్ని, రాజ్యాంగాన్నీ ఉల్లంఘిస్తుంటాయి. ఆర్టీఐ అమలు విషయంలో ఇప్పుడిదే జరుగుతోంది. ఒక్క ఆర్టీఐ అనే కాదు, చాలా వ్యవహారాల్లో జరుగుతున్నదిదే. రెండు రాష్ట్రాల్లోనూ మానవహక్కుల సంఘం దాదాపు లేనట్టే! ఛైర్మన్, సభ్యులెవరూ లేకపోవడంతో కార్యదర్శిగా ఉన్న అధికారే ఇప్పుడు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. తెలంగాణలో పరిపాలనా ట్రిబ్యునల్ లేదు. ఇంకా చాలా సంస్థల్ని క్రమంగా నిర్వీర్యం చేస్తున్నారు. అధికార–విపక్షమనే రాజకీయ వ్యవస్థల్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం, అధికారాన్ని అడ్డుపెట్టుకొని విపక్షాల్ని బలహీనపరచడం ద్వారా ఆధిపత్య సాధన! ఇదే, ఇప్పుడు జరుగుతున్న వ్యూహాత్మక తంతు! ఇతర ఏ ప్రజాస్వామ్య వ్యవస్థల్నీ మననీయకుండా చూడటం కుట్రలా సాగుతోంది. అయితే మొత్తానికి లేకుండా చేయడం, కుదరక కొనసాగినా... నిర్వహణ పరంగా వాటిని నిర్వీ ర్యపరచడం పాలకులకు రివాజయింది. ఫలితంగా నష్టపోవడం ప్రజల వంతవుతోంది. ఈ దుస్థితిని అధిగమించడానికి పౌర చైతన్యమే మిగిలిన మార్గం. హక్కుల్ని, హక్కులు కాపాడే ప్రజాస్వామ్య సంస్థల్ని బతికించుకోవడమే పౌరసమాజ తక్షణ కర్తవ్యం. ప్రభుత్వాలేవైనా ప్రజలు గ్రహించాల్సిందిదే! ఎక్కడో శివసాగర్ (కె.జి.సత్యమూర్తి) అడిగిన ప్రశ్న గుర్తొస్తుంది. ‘ఏ పులి మేకను సంరక్షిస్తుంది? ఇది చరిత్ర చెప్పిన సత్యం!’. వ్యాసకర్త: దిలీప్ రెడ్డి ఉమ్మడి ఏపీ సమాచార పూర్వ కమిషనర్ ఈమెయిల్: dileepreddy@sakshi.com -
అమ్మో.. జీఎస్టీ!
తాడేపల్లిగూడెం : ‘జీఎస్టీ ఎప్పట్నుంచి అమల్లోకి వస్తుంది.. పన్నులు ఎలా ఉంటాయో.. డబ్బు చలామణి కుదరదంటావా.. అనామతు ఖాతాలు ఉండవటగా.. నగదు లావాదేవీలన్నీ బ్యాంకు ద్వారానే చేసి తీరాలా..’ వ్యాపారుల మధ్య నిత్యం చోటుచేసుకుంటున్న సంభాషణలివి. ఇకపై చిట్టా, ఆవర్జాలు ఎలా నిర్వహించాలి, అసలు జీఎస్టీ ఎలా ఉండబోతోందనే అనుమానాలు వారిని వెంటాడుతున్నాయి. మొత్తంగా గూడ్స్, సర్వీస్ టాక్స్ (జీఎస్టీ) అంశం వ్యాపార వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. దీని అమలుకు అమలుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. రేపోమాపో మార్గదర్శకాలు వెలువడనున్న నేపథ్యంలో వ్యాపారుల్లో గుబులు నెలకొంది. జీఎస్టీ ఆమల్లోకి వస్తే రోజుకు రూ.2 లక్షలకు మించి నగదు రూపంలో లావాదేవీలు నిర్వహించకూడదు. అంతకుమించి లావాదేవీలు చేయాల్సి వస్తే బ్యాంక్ ఖాతాలు, ఆన్లైన్ ఆర్టీజీఎస్ ద్వారా మాత్ర మే చెల్లింపులు చేయాలి. ఇంత చేసినా మామూళ్ల బెడద తప్పుతుందా లేదా అనే మీమాంస నెలకొంది. మన రాష్ట్రానికి వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఒకటి, కేంద్ర ప్రభుత్వం అధీనంలో మరొకటి చొప్పున చెక్పోస్టులు ఏర్పాటవుతాయని చెబుతున్నారు. దీనివల్ల రెండుచోట్లా మామూ ళ్లు సమర్పించుకోవాల్సి వస్తుందేమోనన్న అనుమానం వెంటాడుతోంది. రూ.కోటిన్నర టర్నోవర్ ఉండే వ్యాపారాలపై రాష్ట్రం అజమాయిషీ. రూ.కోటిన్నర దాటితే కేంద్రం ఆజమాయిషీ ఉంటుందని చెబుతున్నారు. నగదు లావాదేవీలు ఇలా.. ఆర్థిక బిల్లు–2017లో చేసిన సవరణల వల్ల వ్యాపార వర్గాల్లో కొన్ని అపోహలు ఉన్నాయి. గతంలో రోజుకు రూ.20 వేలకు మించి నగదు రూపంలో చెల్లించకూడదనే నిబంధన ఉండేది. ప్రస్తుతం ఆ మొత్తాన్ని రూ.10 వేలకు తగ్గించారు. అంటే ఏప్రిల్ 1నుంచి అద్దెలు, జీతాలు, నగదు కొనుగోళ్లు మొదలైనవి రోజుకు రూ.10 వేలకు మించి ఖర్చు చేయకూడదు. రవాణాదారులు మాత్రం గతంలో మాదిరిగానే రోజుకు రూ.35 వేలు నగదు రూపంలో చెల్లింపులు చేయవచ్చు. గతంలో మూలధన ఖర్చు నగదు రూపంలో ఎంతైనా చేసే అవకాశం ఉండేది. ప్రస్తుతం రూ.10 వేలకు మించి చేసే మూలధన ఖర్చుకు తరుగుదల అనుమతించరు. గతంలో వ్యాపార నిమిత్తం కారు, జనరేటర్, ఏసీ మొదలైనవి నేరుగా సొమ్ము చెల్లించి కొనుగోలు చేసినా తరుగుదల అనుమతించేవారు. నూతన సవరణ ప్రకారం చెక్కు, ఎలక్ట్రానిక్ ట్రా¯Œ్సఫర్ ద్వారా చేసే చెల్లింపులను మాత్రమే తరుగుదలకు అనుమతిస్తారు. నగదు రూపంలో రూ.2 లక్షల తీసుకోవడంపై వ్యాపార వర్గాల్లో ఆందోళన ఉంది. రోజుకు ఒక వ్యక్తి నుంచి నగదురూపంలో తీసుకునే మొత్తం రూ.2 లక్షలు దాటకూడదు. ఒక లావాదేవీ విలువ రూ.2 లక్షలు దాటితే నగదు రూపంలో తీసుకోకూడదు. ఏదైనా ఒక కార్యక్రమం లేదా సందర్భం విషయంలో రూ.2 లక్షలకు మించి నగదు రూపంలో చెల్లింపులు చేయడం కుదరదు. బ్యాంకు ఖాతాలో ఎంత సొమ్ము అయినా జమ చేయవచ్చు, తీసుకోవచ్చు. అయితే.. రూ.2 లక్షలకు మించి నగదుగా తీసుకున్న వ్యక్తి లేదా సంస్థ ఆ మొత్తంపై 100 శాతం అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఆందోళన వద్దు జీఎస్టీ వసూలు విధానం, రూ.2 లక్షల నగదు లావాదేవీల విషయంలో వ్యాపారులు అపోహలు పెట్టుకోవాలి్సన అవసరం లేదు. చట్టంలో ఈ విషయాలను పూర్తిగా పొందుపర్చారు. వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే మంచిది. – ఎన్వీ రమణారావు, ఇన్కం ట్యాక్స్ ఆడిటర్ -
పీటీపీకి రూ.22 కోట్ల నిధులు
పెంటపాడు: మేలుజాతి పశువుల అభివృద్ధి పథకానికి (పీటీపీ) ప్రభుత్వం రూ.22 కోట్ల నిధులు అందించనున్నట్టు జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ పాకలపాటి గాంధీ తెలిపారు. పెంటపాడులో గోపాలమిత్ర సూపర్వైజర్ల సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఐదేళ్ల ప్రోగ్రాంలో భాగంగా పలు జిల్లాలకు ఉపయోగపడేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించిందన్నారు. దీనిలో భాగంగా గ్రామాలను దత్తత తీసుకుని ఎక్కువ పాలనిచ్చే ముర్రాజాతి ఆవులు, గిత్తల యజమానులను ప్రోత్సహిస్తామన్నారు. రాష్ట్రంలోనే ఇతర జాతులను అభివృద్ధి చేయడమే పథకం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. జిల్లాలో 15 జాతుల స్వదేశీ పశువులతో కామధేను పథకం, రూ.10 కోట్ల నిధులతో సంచార వైద్యశాలల అభివృద్ధి పనులను వచ్చేనెలలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. గోపాలమిత్రల సంఘ అధ్యక్షుడు వి.సుబ్బారాయుడు, సాయిబాబు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
సెంట్రల్, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీలకు కౌన్సిల్ ఆమోదం
ముంబై: కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలులో మరో కీలక అంకం ముగిసింది. జీఎస్టీ కౌన్సిల్ 11వ కీలకమైన చట్టాలను ఆమోదించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో ఈ కౌన్సిల్ శనివారం ముంబై నిర్వహించిన ఉమ్మడి నియంత్రణపై జీఎస్టీ కౌన్సిల్ సమావేశలో చర్చలు దాదాపు కొలిక్కి వచ్చాయి. ముఖ్యంగా సెంట్రల్ జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జిఎస్టి చట్టాలకు ఆమోదం లభించింది. ఈ చట్టాలకు సంబంధించి తుది ఆమోదాన్ని తదుపరి సమావేశంలో సాధించనున్నామని పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా తెలిపారు. జీఎస్టీ అమలుకు ఇది గొప్ప ముందడుగు అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాల సాధికారతకు కేంద్రం అంగీకారం తెలపడంతో చిన్న వ్యాపారాలకు భారీ ఊతం లభించింది. పన్ను పరిధులకు సంబంధించిన ఫిట్మెంట్ అంశాలపై తదుపరి సమావేశంలో కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుంది. దేశవ్యాప్తంగా ఒకే పన్ను అమలుకు సంబంధించి పశ్చిమ బెంగాల్ సహా ఇతర రాష్ట్రాలు లేవనెత్తిన 26 పాయింట్లకు కేంద్రం ప్రభుత్వం అంగీకరించింది. నాలుగు అంచెల పన్నుల విధానాన్ని ఆమోదం లభించింది. అలాగే కనీస పన్నురేటు 5 శాతంగా మధ్యస్థంగా 12-18శాతంగాను, అత్యధికంగా 28శాతంగా ఉండనున్నాయి.దీంతో ఇప్పటికే పరోక్ష పన్ను సంస్కరణలపై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్యనున్న భిన్నాభిప్రాయాలన్నీ పరిష్కారమైన నేపథ్యంలో వస్తు-సేవల పన్ను (జీఎస్టీ) జులైనుంచి అమలు మరింత ఖాయమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్ను శాఖ ఉద్యోగులకు సమాన అధికారులు ఉండనున్నాయి. వీటిని త్వరలోనే పార్లమెంటు ఆమోదంకోసం ఉంచుతుంది. కౌన్సిల్ తదుపరి సమావేశం మార్చి 16 జరగనుంది. ఈ సమావేశంలో మిగిలిన పెండింగ్ సమస్యలపై చర్చించనున్నారు. కొత్త పరోక్ష పన్నుల చట్టం కింద రూ. 50 లక్షల లోపు వార్షిక టర్నోవర్ కలిగిన హోటల్స్ కనీస పన్ను స్లాబ్ 5 శాతంగా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన ప్రాతిపదికన ఉంటుంది. కాగా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి దీన్ని అమలు చేయాలని కేంద్రం యోచించినప్పటికీ పన్ను అధికారాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం కుదరక పోవడంతో జులై 1కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. -
‘తొలి సంతకం కూడా అమలుకాలేదు’
-
‘తొలి సంతకం కూడా అమలుకాలేదు’
హైదరాబాద్: ఎన్నికల హామీల అమలును విస్మరించి టీడీపీ, బీజేపీలు అబద్ధాలు చెప్పడంలో పోటీపడుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘టీడీపీ ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటికూడా అమలు చేయలేదు. తొలి సంతకం అయిన బెల్ట్ షాపుల తొలగింపు కూడా అమలు కాలేదు. హుద్హుద్ తుఫాన్ సహాయంగా వెయ్యి కోట్లు ప్రకటించిన ప్రధాని మోడీ నేటికి ఇచ్చింది మాత్రం 400 కోట్లు మాత్రమే. రెవిన్యూ లోటు భర్తీ, దుగ్గరాజు పట్నం ఓడరేవు, కడప ఉక్కు ఫ్యాక్టరీ, వెనుకబడిన జిల్లాలకి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ వంటి విభజన చట్ట హామీలు అమలుకు నోచుకోవడం లేదు’ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ లో సామజిక న్యాయం లోపించిందని రఘువీరారెడ్డి విమర్శించారు. క్యాబినెట్ లో మైనారిటీ, గిరిజనులకు స్థానం కల్పించకపోవడం నేరమని అన్నారు. ‘లోకేశ్ మంత్రి కాకపోయినా తెరవెనుక ప్రభుత్వ వ్యవహారాలలో జోక్యం చేసుకుంటున్నారు. లోకేశ్ అవును అంటేనే ఫైళ్లు కదులుతున్నాయి. చంద్రబాబు కు తన మంత్రులు, ఎమ్మెల్యే లపై నమ్మకం లేదు.. అందుకే లోకేశ్ కి మంత్రి పదవి ఇవ్వాలి అనుకుంటున్నారు’ అని రఘువీరారెడ్డి విమర్శించారు. రెండున్నరేళ్లుగా అబద్ధపు ప్రచారంతోనే రాజకీయాలు చేస్తున్న బీజేపీ టీడీపీలను ఎండగట్టె ఎజెండాతో ఈ నెల 10న గుంటూరులో ఏపీ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు రఘువీరారెడ్డి వెల్లడించారు. ఈ సమావేశంలో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రెండువేల మంది ప్రతినిధులు పాల్గొంటారన్నారు. విభజన హామీల అమలు, టీడీపీ ఎన్నికల హామీలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలు తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. అన్ని నియోజకవర్గం లలో మోటార్ సైకిల్ యాత్రల నిర్వహణ పై కసరత్తు చేస్తున్నామన్నారు. -
జూలై నుంచి జీఎస్టీ అమలుకు కేంద్రం అంగీకారం: ఈటల
సాక్షి, న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ను వచ్చే జూలై నుంచి అమలుపరచడానికి కేంద్ర ప్రభుత్వం సూచనప్రాయంగా అంగీకారం తెలిపిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈటల పాల్గొన్నారు. జూలై నుంచి జీఎస్టీని అమలుపరచడానికి అన్ని రాష్ట్రాలు సూచనప్రాయంగా అంగీకరించాయని, కౌన్సిల్ తదుపరి సమావేశంలో ఈ విషయంపై జైట్లీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని ఈటల వెల్లడించారు. జీఎస్టీకి సంబంధించి 99% సమస్యలు ఈ సమావేశంలో పరిష్కారమయ్యాయని, సామాన్యులపై భారం పడకుండా చూడాలని, వ్యవసాయ ఉత్పత్తులపై పన్ను వేయవద్దని నిర్ణయించామన్నారు. రాష్ట్రాలకు, కేంద్రానికి మధ్య సందిగ్ధత ఉన్న అన్ని విషయాల్లో స్పష్టత వచ్చిందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్రాల సంయుక్త నియంత్రణ అంశంపై తుది నిర్ణయానికి వచ్చామని, రూ.1.5 కోట్లు, అంతకంటే తక్కువ టర్నోవర్ ఉండే వ్యాపారంపై పన్ను వసూలు 90% వరకూ రాష్ట్రాలు చేపడతాయని, 10% కేంద్ర ప్రభుత్వం చేపట్టేలా కౌన్సిల్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. రూ.1.5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉండే వ్యాపారాలపై కేంద్రం, రాష్ట్రాలు 50% చొప్పున నియంత్రణ కలిగి ఉండాలనే ప్రతిపాదనకు కౌన్సిల్ అంగీకరించిందని చెప్పారు. పశ్చిమ బెంగాల్ తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాలు ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపాయని తెలిపారు. కౌన్సిల్ తదుపరి సమావేశం ఫిబ్రవరి 18న జరుగుతుందని చెప్పారు. -
నిపుణుల కమిటీ ఏర్పాటుచేయండి
ప్రధానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ - అందులో రైతుసంఘాలు, వాణిజ్యసంఘాల ప్రతినిధులుండాలి - గ్రామీణులకుబ్యాంకింగ్ కార్యకలాపాలు అలవాటు కావాల్సి ఉంది - అందుకు అనువైన మార్గాలను ఈ కమిటీ సూచిస్తుంది - పెద్దనోట్ల రద్దు అమలు తేదీని మార్చే విషయం పరిశీలించండి - మీ నిర్ణయం మంచిదే.. అమలులోనే అన్ని ఇబ్బందులు.. సాక్షి, హైదరాబాద్ : సమాజంలోని పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో పెద్ద నోట్ల రద్దు అమలు తేదీ అంశాన్ని పునః పరిశీలిం చాలని ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ప్రధానికి ఆయన బుధవారం ఓ లేఖ రాశారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితులను అధిగమిం చడం కోసం ఆయన ప్రధానికి కొన్ని సూచనలు చేశారు. చిరు వ్యాపారులు, అసంఘటిత కార్మికులు, వ్యవసాయ కూలీలు, రైతులు, ఇతర అన్ని రంగాలలోని కార్మికులను దశలవారీగా బ్యాంకింగ్ కార్యకలాపాలవైపు మరల్చే మార్గాలను సూచించేందుకు గాను తక్షణమే ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రధానికి జగన్ విజ్ఞప్తి చేశారు. ఆ కమిటీలో అన్ని రాజకీయపార్టీలు, రైతు సంఘాలు, వాణిజ్య సంఘాల ప్రతినిధులు, గ్రామీణ ఆర్థిక రంగ నిపుణులు ఉండాలని జగన్ సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇదొక్కటే పరిష్కార మార్గమని భావిస్తున్నట్లు ప్రధానికి రాసిన లేఖలో జగన్ పేర్కొన్నారు. నల్లధనాన్ని అరికట్టేందుకు, రాజకీయాల్లో విలువల పెంపునకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని ఒక రాజకీయ పార్టీగా మనస్ఫూర్తిగా బలపరుస్తామని, అరుుతే ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని జగన్ కోరారు. దేశంలో చలామణిలో ఉన్న డెబిట్, క్రెడిట్కార్డులు, బ్యాంక్ అకౌంట్లు, నగదు వివరాలు, గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకు శాఖల సంఖ్య సహా వివరణాత్మతంగా లేఖలో ప్రస్తావించారు. ప్రస్తుతం సమాజంలో వివిధ వర్గాల ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో పూర్త్తిగా పరిశీలించిన తర్వాతనే తానీ లేఖరాస్తు న్నట్లు ఆయన పేర్కొన్నారు. లేఖలోని ముఖ్యాంశాలివీ.. మీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. కానీ.. ‘‘పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అరుుతే సదుద్దేశంతో రూపొందించే మంచి ప్రణాళికలు కూడా సరిగ్గా అమలు చేయక పోతే విఫలమవుతారుు. అందుకు ఇపుడు సమాజంలో చోటు చేసుకుంటున్న పరిణామా లే నిదర్శనం. రైతులు, గ్రామీణ వ్యవసాయ కార్మికులు, చిన్న వ్యాపారులు, అసంఘటిత కార్మికులు, రోజు వారీ వేతన కూలీలు చిల్లర నగదును పొందడంలో అనేక సమస్యలెదు ర్కొంటున్నారు. రోజులు గడిచే కొద్దీ సమస్య లింకా జటిలం అవుతున్నారుు. చిన్న వ్యాపా రాలు, అసంఘటిత కార్మికులు, రీటైల్ రంగంలో పని చేస్తున్న వారు, పేదలు, ముఖ్యంగా వ్యవసాయరంగంలో ఉన్న వారి కష్టాలు ఇంకా పెరుగుతున్నారుు. పెద్ద మార్కెట్ యార్డులు, మండీలలో వ్యాపార కార్యకలాపాలు బాగా తగ్గు ముఖం పట్టారుు. ఈ కష్టాలు దీర్ఘకాలికంగా మారి సామాన్యుని జీవితంపై రోజు రోజుకూ తీవ్ర ప్రభావం చూపుతూ ఉండటంతో వాటిని మీ దృష్టికి తెచ్చేందుకు నేనీ లేఖను రాయక తప్పడం లేదు. సామాన్యుడి జీవితం ప్రస్తుతం ఉన్న దుర్భర స్థితి కన్నా మరింత దిగజారకుండా తదుపరి చర్యలు చేపడతారని ఆశిస్తున్నా. ప్రజలకు తగినంత సమయం ఇవ్వండి... ఓవైపు ప్రజలను జాగృతం చేస్తూ మరో వైపు తగిన విధంగా మౌలిక సదుపాయాలను కల్పిస్తూ... ఏళ్ల తరబడి అమలులో ఉన్న ఈ పురాతనమైన అలవాట్లను మార్చాల్సిన అవసరం ఉంది. 90 శాతం లావాదేవీలన్నీ నగదు ద్వారానే జరిగే పురాతన సంప్రదా యమున్న ఈ దేశంలో ప్లాస్టిక్ మనీని అమలులోకి తీసుకు రావడం అంత సులభం కాదు, ఇలా మార్పు చేయడం కష్ట సాధ్యమైన పని కనుక జనంలో అవగాహన కల్పించడం, అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారానే చేయాలి. ఆస్పత్రి బిల్లులు, రైలు, బస్సు టిక్కెట్లు , ట్యూషన్ ఫీజులు, తదితర అత్యవసర అవసరాల చెల్లింపుకు ప్రజలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గ్రామీణ బ్యాంకుల ఏర్పాటు చేయడానికి, స్వైపింగ్ యంత్రాలు సమకూర్చి ప్రజలందరికీ శిక్షణ ఇచ్చి పెద్ద నోట్ల రద్ధు ప్రభావాన్ని వివరించి వారిలో ఆత్మస్థరుుర్యం కల్పించడానికి సమయం పడుతుంది. అందువల్ల ఇవన్నీ సమకూర్చే వరకూ సమయం ఇవ్వాలి. సర్కారుకు, సామాన్యులకు ఇక్కట్లు తప్పేవి నవంబర్ 9, 2016 నుంచి బంగారు వ్యాపారం, భూములు కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లపై నిఘా వేయాలని ఆదాయపు పన్ను శాఖను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. ఇదే పద్ధతిలో నవంబర్ 9, 2016 నుంచి రూ.2.50 లక్షల కన్నా ఎక్కువ మొత్తం డిపాజిట్ చేసే వారిపై కూడా ఆదాయపు పన్ను శాఖ నిఘా వేసింది. అందువల్ల పెద్ద నోట్ల రద్దును ఏప్రిల్ 1, 2017 నుంచి అమలు చేసి ఉన్నా పెద్దగా వ్యత్యాసం ఉండేది కాదు. ఈ వ్యవధిలో అవసరమైన మేరకు కరెన్సీని ముద్రించి.. బ్యాంకులు, ఏటీఎంలు, పోస్టాఫీసులకు చేర్చే వెసుబాటు ప్రభుత్వానికి ఉండేది. డిపాజిట్లు, నోట్ల మార్పిడికి అవసరమైన ఏర్పాటు చేసుకునే అవకాశం బ్యాంకులకు కలిగేది. సాంప్రదాయ నగదు విధానం నుంచి ప్లాస్టిక్ మనీ దిశగా ప్రజలను.. ప్రధానంగా గ్రామీణులను సమర్థవంతంగా మళ్లించేలా కార్యక్రమాలు చేపట్టి అవగాహన కల్పించే అవకాశం ప్రభుత్వానికి ఉండేది.’’ అని జగన్మోహన్రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. ప్రజాజీవితాల్లో డబ్బుది చాలా చెడ్డపాత్ర ప్రజా జీవితాల్లో డబ్బు ఎంతో చెడ్డ పాత్ర పోషిస్తోంది. అందుకు ఎన్నో ఉదాహరణ లు చూడొచ్చు. రాజకీయ నేతలు సాధార ణ ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెడుతున్నారు. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడానికి రూ. 11 కోట్లు ఖర్చు పెట్టానని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే, ప్రస్తుత అసెంబ్లీ స్పీకరు కోడెల శివప్రసాదరావు ప్రముఖ తెలుగు టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు. ఈ విషయమై కేంద్ర ఎన్నికల కమిషన్కు మేం ఫిర్యాదు కూడా చేశాం. అరుుతే ఇప్పటి వరకూ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చంద్రబా బు మితిమీరిన అవినీతి, అక్రమ సంపా దనతో మా పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలను కొనుగోలు చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని, రాజ్యాంగ నియమాలను తుంగలో తొక్కు తూ ఫిరారుుంపులను ప్రోత్సహించడంపై మేం స్పీకరుకు ఫిర్యాదు చేశాం. స్పీకరు ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకో లేదు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు కోట్ల రూపాయలు చెల్లిస్తూ ఆడియో వీడియో టేపుల్లో బాబు దొరికిపోయారు. ఆడియో టేపుల్లో గొంతు తన గొంతు కాదని, తాను స్టీఫెన్సన్తో ఫోన్లో మాట్లాడలేదని చెప్పలేని బాబు ఒక సీఎంను ఫోన్లో ఎలా ట్రాప్ చేస్తారని ప్రశ్నించారు. బహుశా దేశంలో ఇలా రెడ్హ్యాండెడ్గా పట్టుబడి రాజీనామా చేయకుండా, అరెస్టు కాకుండా ఉన్న ఏకై క సీఎం చంద్రబాబే. -
‘నోట్ల రద్దు’ లోపాలు సరిదిద్దండి
- అంతవరకు నిర్ణయం వాయిదా వేయండి: ఏపీ ప్రతిపక్ష నేత జగన్ - అమలు సక్రమంగా లేకపోతే ఎలాంటి నిర్ణయాలైనా విఫలమే - పూర్తిగా సన్నద్ధమైన తర్వాతే రద్దు నిర్ణయాన్ని అమలు చేయాలి - ఫలానా తేదీ నుంచి అమలు చేస్తామంటే ఎలాంటి తేడా జరగదు - చలామణిలో ఉన్న నగదు ఎక్కడికీ పోదు - కూలీలకు కార్డులిచ్చి స్వైపింగ్ చేయమంటారా? - రద్దుపై చంద్రబాబుకు ముందే తెలుసు.. ఆయన అంతా సర్దుకున్నారు - హెరిటేజ్ షేర్లు ఫ్యూచర్ గ్రూపునకు అమ్మేశారు - అప్పుడు మోదీని పొగిడారు.. ఇప్పుడు విమర్శిస్తున్నారు - జనం తిడుతున్నారనే చంద్రబాబు ప్లేటు మార్చారు సాక్షి, రాజమహేంద్రవరం: దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలను కష్టాల పాల్జేస్తున్న పెద్ద నోట్ల రద్దు విషయంలో లోపాలను సరిదిద్దాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముందస్తు కసరత్తు లేకుండా, ప్రజల ఇబ్బందులను అంచనా వేయకుండా 86 శాతం కరెన్సీని ఎలా రద్దు చేస్తారని ఆయన నిలదీశారు. సామాన్యుల దగ్గర కొద్దోగొప్పో ఉన్న సొమ్ము నల్లధనం ఎలా అవుతుందని ప్రశ్నించారు. వైఎస్ జగన్ బుధవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అన్ని రకాలుగా లోపాలను సవరించిన తరువాతే నోట్ల రద్దు నిర్ణయాన్ని అమలు చేయాలని, అప్పటిదాకా వాయిదా వేయాలని కోరారు. ఫలానా తేదీ నుంచి అమలు చేస్తామని చెబితే ఎలాంటి తేడా జరగదని స్పష్టం చేశారు. ప్రజలను నోట్ల కష్టాల నుంచి గట్టెక్కించాలని విజ్ఞప్తి చేశారు. నోట్ల రద్దు గురించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముందే తెలుసని చెప్పారు. ఆయన అప్పటికే అంతా సర్దుకున్నారని ఆరోపించారు. జగన్ ఇంకా ఏం చెప్పారంటే... ‘‘పెద్ద నోట్ల రద్దు లాంటి పెద్ద నిర్ణయాన్ని ప్రకటించేటప్పుడు అందరి అభిప్రాయాలను తెలుసుకొని, దాని అమలుకు అవసరమైన సదుపా యాలన్నీ సిద్ధం చేసుకుంటారని అనుకుంటాం. కానీ, ఎవరూ ఊహించని విధంగా ఒక నిర్ణయం వెలువడింది. తాను లేఖ రాశాను కాబట్టే ఈ నిర్ణయం వెలువడిందని ఆ వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అది చరిత్రాత్మక నిర్ణయమని చెప్పారు. నల్లధనాన్ని అరికట్టడానికి పెద్ద నోట్లను రద్దు చేయడం మంచిదేనని ఎవరైనా అనుకుంటారు. వ్యవస్థ బాగు పడాలంటే నల్లధనం నామరూపాల్లేకుండా పోవాలని భావిస్తాం. అవినీతి, బ్లాక్ మార్కెటింగ్, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, మనీ లాండరింగ్, నకిలీ నోట్ల దందా ద్వారా పేరుకుపోతున్న నల్లధనాన్ని పూర్తిగా అరికడతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇది మంచి నిర్ణయమేనని అందరమూ అనుకున్నాం. సామాన్యుల ప్రమేయం లేకుండానే ఈ నిర్ణయం వెలువడింది. ఇవాళ పరిస్థితిని చూస్తే చాలా దయనీయంగా ఉంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సంతోషంగా ఉన్నామని ప్రజలు చెప్పడం లేదు. ప్రతిపక్షమంటే ప్రజల గొంతు. ప్రభుత్వ ఆలోచనలు బాగున్నాయని ప్రజలంతా అంటే వారికి తోడుగా బాగుందంటాం. బాగోలేవని ప్రజలు చెబితే వారి తరఫున వ్యతిరేకిస్తాం. ఎవరికీ తెలియకుండా రద్దు చేయడం నిజమేనా? మంచి ఉద్దేశాలతో బయటకు వచ్చిన ప్రణాళికలు కూడా అమలు సరిగ్గా లేకపోతే విఫలమవుతాయని మనకు చరిత్ర చెబుతోంది. గతాన్ని గమనిస్తే కొన్ని చరిత్రాత్మకమైన నిర్ణయాలు జరిగారుు. ఉదాహరణకు యూఎస్ఎస్ఆర్(యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్) అధ్యక్షుడిగా గోర్బచేవ్ తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయమేమిటో తెలుసా? అప్పుటి వరకు సోషలిస్టు ఎకానమీలో ప్రయాణిస్తున్న యూఎస్ఎస్ఆర్లో సరళీకరణ విధానాలను అమలు చేయాలనే విప్లవాత్మకమైన ఆలోచన గోర్బచేవ్ చేశారు. ఓపెన్ మిషన్ ట్రాన్సఫరెన్సీ దిశగా అడుగులు వేరుుంచారు. 15 దేశాలు ఉన్న యూఎస్ఎస్ఆర్ ఈ నిర్ణయాల వల్ల పూర్తిగా విడిపోయే పరిస్థితి వచ్చింది. ఆలోచనలు గొప్పవే కానీ అమలు సక్రమంగా లేకపోవడమే ఇందుకు కారణం. సక్రమంగా అమలు చేయలేనప్పుడు నోట్ల రద్దు నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఈ వ్యవహారాన్ని గమనిస్తే ఆశ్చర్యం కలుగుతోంది. ఎవరికీ తెలియకుండా హఠాత్తుగా నోట్లను రద్దు చేశామని కేంద్రం చెబుతోంది. అది నిజమేనా? క్రెడిట్ కొట్టేయడం బాబుకు అలవాటే ‘‘చంద్రబాబు నాయుడు వంటి వ్యక్తులకు నోట్ల రద్దు నిర్ణయం ముందే తెలుసు. ఆయన కేంద్రమంత్రులు అక్కడ ఉన్నారు. ఇక వెంకయ్యనాయుడు అరుుతే చంద్రబాబు కండువా కప్పుకొని బీజేపీలో మంత్రిగా ఉన్నారు. నోట్ల రద్దు గురించి చంద్రబాబుకు ఎలా తెలుసనేది నేనేమీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఆయనకు ఒక్కడికే తెలిసింది. ఆయన ముందుగానే అన్నీ చక్కబెట్టుకున్నారు. సామాన్యులను మాత్రం ఇబ్బందులు పాల్జేస్తున్నారు. అక్టోబరు 12న చంద్రబాబు లేఖ రాశారు. పెద్ద నోట్లు రద్దు చేయాలంటూ ప్రధానికి లేఖ రాయాలని ఎవరికై నా ఎందుకు తడుతుంది? నాకై తే తట్టలేదు. నాకు తెలిసినంత వరకూ సామాన్యులకు తట్టదు. కానీ, చంద్రబాబుకు తట్టింది. ఎందుకంటే మొత్తం సమాచారం ముందే తెలుసు కాబట్టి. ఆయన ఒకవైపు చక్కబెట్టుకుంటూనే మరోవైపు మొత్తం క్రెడిట్ తానే కొట్టేయాలని అనుకున్నారు. సత్య నాదెళ్ల తన వల్లే మైక్రోసాఫ్ట్ సీఈవో అయ్యారని చంద్రబాబు చెబుతారు. బిల్గేట్స్కు కంప్యూటర్ ఎలా ఆపరేట్ చేయాలో తానే నేర్పించానని అంటారు. సెల్ఫోన్లను తానే తీసుకొచ్చానని గొప్పలు చెప్పుకుంటారు. పీవీ సింధుకు బ్యాడ్మింటన్ తానే నేర్పించానని కూడా అంటారు. ఎక్కడేం జరిగినా క్రెడిట్ తీసుకోవడానికి తానే చేశానని చెప్పుకోవడం చంద్రబాబుకు అలావాటే. అందులో భాగంగా తనకు రహస్యంగా తెలిసిన సమాచారంతో ప్రధానమంత్రికి లేఖ రాశారు. ఇది నిజంగా ధర్మమేనా? ఆ లేఖ రాశాక సరిగ్గా నెలకన్నా కొద్దిగా తక్కువగా నవంబరు 8న నోట్ల రద్దు నిర్ణయం వచ్చింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. నవంబరు 8వ తేదీకి మూడు రోజులో రెండు రోజుల ముందో చంద్రబాబు సంస్థ అరుున హెరిటేజ్ షేర్ రూ.909కి పెరిగింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి హెరిటేజ్ షేర్ రూ.199 ఉండేది. అంటే రెండున్నరేళ్లలో 450 శాతం పెరిగింది. నిజంగా దేశం మొత్తం కరువుతో అల్లాడుతోంది. హెరిటేజ్లో గొప్ప గొప్ప మార్పులేం జరగలేదు. హెరిటేజ్ రిటైల్ నష్టాల్లో ఉంది. అరుునా కూడా హెరిటేజ్ షేర్ ధర పెరిగింది. నవంబరు 8న ప్రధాని మోదీ నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించారు. అంతకు రెండు రోజుల ముందే చంద్రబాబు అత్యధిక ధర ఉన్న హెరిటేజ్ షేర్లను ఫ్యూచర్ గ్రూపునకు అమ్మేశారు. ఇలా అంతర్గత సమాచారంతో కొందరికే లబ్ధి చేకూర్చేలా, వారు మాత్రమే అంతా చక్కబెట్టుకునేలా వ్యవహరించడం ధర్మమేనా? సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురిచేయడం న్యాయమేనా? గ్రామాల్లో నగదు మారకమే ఆధారం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అనేది భారీ ఫ్లాప్. దీనిపై తెలుగు రాష్ట్రాల్లో చాలా మందితో మాట్లాడాం. ఈ నిర్ణయం విఫలమయ్యే పరిస్థితికి వచ్చిందని గుర్తించాం. ఎలాంటి ముందస్తు కసరత్తు చేయకుండా, ప్రభావం ఎలా ఉంటుందనే అంచనాలు లేకుండా నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా చిన్నా, సన్నకారు రైతులు 40 శాతం మంది మాత్రమే బ్యాంకుల్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఇంకా దారుణమేమిటంటే 95శాతం మంది కౌలు రైతులకు బ్యాంకుల నుంచి రుణాలు అందడం లేదు. వారు బ్యాంకులకు వెళ్లే పరిస్థితే లేదు. మరి వీరంతా ఎలా బతుకుతున్నారు? బతకడానికి కారణం 90 శాతం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అంతా నగదు మారకంపైనే ఆధారపడి ఉండటం. అదంతా బ్లాక్మనీ అని కాదు. రూ.రెండున్నర లక్షల వరకు ఎవరూ పన్ను కట్టాల్సిన పనిలేదు. అదంతా బ్లాక్మనీ ఎలా అవుతుంది? వ్యవసాయంపై వచ్చే ఆదాయంపై ఇన్నేళ్లుగా పన్నులు లేవు. మరి అది బ్లాక్మనీ ఎలా అవుతుంది? 90శాతం మన భారతదేశం నగదు మారకంపైనే నడుస్తోంది. అందుకే నోట్ల రద్దు నిర్ణయం విఫలమయ్యే పరిస్థితి నెలకొంది. అన్నదాతల పరిస్థితి ఘోరం ప్రస్తుతం రైతులు పండించే పంటను మధ్యవర్తులు కొనే పరిస్థితి లేదు. కనీసం 50 శాత మద్దతు ధర చెల్లించి కొనడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. రైతులు తాము పండించిన పంటను అమ్ముకోలేకపోతున్నారు. కొత్త పంటలు వేసుకోవడానికి కూలీలకు డబ్బులు ఇవ్వలేకపోతున్నారు. కూలీలు తమ దగ్గరున్న కాస్తో కూస్తో డబ్బును మార్చుకునేందుకు బ్యాంకుల చుట్టూ తిరగడానికే సమయం సరిపోతోంది. భారతదేశంలో 6,38,000 గ్రామాలు ఉన్నారుు. ఇవన్నీ నగదు మారకంతోనే నడుస్తున్నాయి. దేశ జనాభాలో 75 శాతం మంది ప్రజలు గ్రామాల్లో నివశిస్తున్నారు. వీరంతా నగదు మారకంపై ఆధారపడుతున్నారు. వివాహాలు కూడా నగదు మారకంతోనే నడుస్తున్నారుు.. ప్రస్తుతం డబ్బుల్లేక అవి కూడా వారుుదా పడుతున్నాయి. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అవుతూనే జన్ధన్ యోజన పేరిట బ్యాంకు ఖాతాలు ప్రారంభించారు. 25 కోట్ల మందికి డెబిట్ కార్డులు ఇచ్చారు. ఈ కార్డుల్లో ఎన్ని వాడకంలో ఉన్నాయో నోట్ల రద్దు నిర్ణయం రాక ముందు పరిశీలించారా?దేశంలో రెండు కోట్ల క్రెడిట్ కార్డులున్నాయి. ఈ కార్డులన్నీ 50 లక్షల మందికి మాత్రమే ఉన్నాయి అంటే ఒక్కొక్కరి వద్ద నాలుగో, రెండో, మూడో కార్డులుంటాయి. మరి ఇవన్నీ 127 కోట్ల మంది ఉన్న మన భారతదేశానికి ఏ మూలకు సరిపోతున్నాయి? ఏ మేరకు న్యాయం జరుగుతుంది? దేశంలో 50,421 గ్రామీణ బ్యాంకుల శాఖలు మాత్రమే ఉన్నారుు. కేవలం దేశంలో 8 శాతం మంది గ్రామీణ ప్రాంత ప్రజలకు మాత్రమే బ్యాంకు శాఖలు అందుబాటులో ఉన్నాయి. అంటే 92 శాతం గ్రామీణ ప్రజలకు బ్యాంకు శాఖలు లేవు. జనాభాలో 53 శాతం మందికే బ్యాంకు ఖాతాలున్నాయి. దేశం మొత్తంమీద 2,20,000 ఏటీఎంలు ఉంటే ఇందులో 10 శాతం కూడా గ్రామాల్లో లేవు. ఈ ఎటీఎంలలో మూడు వారాల్లో రూ.2 వేల నోట్లు వస్తున్నాయని చెబుతున్నారు. ఈ రూ.2 వేల నోట్లు తీసుకుని ఏం చేస్తారు. ఆ నోట్లకు ఎవరూ చిల్లర ఇవ్వడం లేదు. అన్ని స్వైపింగ్ యంత్రాలు ఉన్నాయా? దేశ జనాభాలో 75 శాతం మంది గ్రామాల్లో ఉండగా.. వారు నెలకు రూ.6 వేలు, రూ.7 వేలు కూడా సంపాదించలేని పరిస్థితి. కూలీ పనులకు వెళ్లి రోజూ రూ.200, రూ.300 సంపాదిస్తే గానీ బతకలేని పరిస్థితి గ్రామాల్లో ఉంది. కూలీల చేతికి డబ్బు ఇవ్వం, బ్యాంకుల్లోనే వేస్తాం, మీకొక కార్డు ఇస్తాం, దుకాణానికి వెళ్లి ఆ కార్డు చూపించి స్వైప్ చేయాలని అంటే ఎన్ని స్వైపింగ్ మెషిన్లు కావాలి. 127 కోట్ల జనాభాకు ప్రతి దుకాణంలో స్వైపింగ్ యంత్రాలు పెడతారా? నాకు తెలిసినంతవరకు 127 కోట్ల మందికి తక్కువలో తక్కువ 30 కోట్ల స్వైపింగ్ యంత్రాలు కావాలి. నిజంగా అన్ని ఉన్నాయా? ఆ మేరకు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారా? రోజూ కూలీకి వెళ్లే వారికి డబ్బులు ఇవ్వం, కార్డు ఇస్తాం, స్వైప్ చేయాలంటే అది సాధ్యమేనా? ఆ కార్డు తీసుకున్న వాడు ఒకసారి కాదు, రెండుసార్లు స్కైప్ చేసి ఇచ్చేస్తే.. వాళ్ల బ్యాంకుల్లో ఉన్న డబ్బులు ఒకటికి రెండు సార్లు తగ్గిపోతే అప్పుడు పరిస్థితి ఏమిటి? కార్డు ఇస్తే బ్యాంకులు మోసం చేయవని, ఆ కార్డు తీసుకున్న వారు రెండు మూడుసార్లు స్వైప్ చేయరని ప్రజల్లో నమ్మకం కలిగించగలుగుతారా? కలిగించాలంటే ఎడ్యుకేట్ చేయాలి. ప్రజల్లో అవగాహన పెంచడానికి సమయం కావాలి. హఠాత్తుగా రద్దు చేస్తే జనం ఏమైపోవాలి? మన దేశంలోని అన్ని ప్రింటింగ్ ప్రెస్లు, మింట్స్ మూడు షిఫ్టులు విరామం లేకుండా పనిచేస్తే రూ.15 లక్షల కోట్ల విలవైన నోట్లు చలామణీలో ఉన్నారుు. కొత్త రూ.500, రూ.1000 నోట్లు ముద్రించడానికి ఆరు నెలలు పడుతుందని చెబుతున్నారు. 86 శాతం నగదు రద్దరుున రూ.500, రూ.1,000 నోట్లే. 1978లో రూ.1,000, రూ.5,000, రూ.10,000 నోట్లను రద్దు చేశారు. ఆ నోట్లు అప్పటి కరెన్సీలో కేవలం 0.6శాతం మాత్రమే. ఇప్పుడు మాత్రం 86 శాతం కరెన్సీని రద్దు చేశారు. రూ.500, రూ.1,000 నోట్లు ఇప్పుడు అందరి దగ్గారా ఉంటున్నారుు. వాటిని హఠాత్తుగా రద్దు చేస్తే జనం ఏమైపోవాలి? ఇంత దారుణంగా, ఎలాంటి కసరత్తు లేకుండా నిర్ణయాన్ని ప్రకటించగా.. తాను లేఖ రాయడం వల్లే అది వచ్చిందని చంద్రబాబు చెప్పారు. అదే చంద్రబాబు ఇప్పుడేమంటున్నాడంటే.. సహనం కోల్పోతున్నాను, మోదీ ఏంటీ, ఇప్పటికీ 12 రోజులైపోరుుంది ఏం చేస్తున్నాడని అంటున్నారు. మొదటి రోజు ఏం మాట్లాడాడు? ఇప్పుడేం మాట్లాడుతున్నాడు? ఆ రోజు స్వాగతించిన చంద్రబాబు ఈ రోజు ప్రజల్లో కోపం ఉంది కాబట్టి, ప్రజలు తిడుతున్నారు కాబట్టి ఈ నిర్ణయంపై ప్లేటు మార్చేశారు. నోట్ల రద్దు అమలులో లోపాలను సరిదిద్దే దాకా ఈ నిర్ణయాన్ని వారుుదా వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతున్నా. చేతులు మారుతుందే తప్ప ఎక్కడికీ పోదు అన్ని రకాలుగా సన్నద్ధమైన తరువాత నిర్ణయాన్ని అమలు చేయండి. ఫలానా తేదీ నుంచి(ఉదాహరణకు 2017 ఏప్రిల్ 1) అమలు చేస్తామని చెబితే ఎలాంటి తేడా జరగదు. ప్రజలకు సమస్యలుండవు. ఎందుకు తేడా జరగదంటే... రూ.15 లక్షల కోట్ల నగదు చలామణీలోనే ఉంటుంది. రియల్ ఎస్టేట్ లావాదేవీలు, బంగారం కొనుగోళ్లు, రూ.రెండున్నర లక్షలపైగా చేసిన డిపాజిట్లు అదాయపు పన్ను శాఖ నిఘాలో ఉన్నాయని ప్రధానమంత్రి గట్టిగా చెప్పి, ఇంకో తేదీ ఇస్తే ఎలాంటి నష్టం జరగదు. వాళ్లు కోరుకున్న ఉద్దేశాలన్నీ నెరవేరతారుు. రియల్ ఎస్టేట్లో భూములను అమ్మిన డబ్బులు ఎక్స్ నుంచి వైకి వెళతారుు. వై బంగారం కొంటే అతడిచ్చిన డబ్బు జడ్కు వెళ్తుంది. ఇలా చేతులు మారుతాయే తప్ప డబ్బులు ఎక్కడికీ పోవు. నోట్ల రద్దు అమలు సరిగ్గా లేదు కనుక ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకోవాలి. నిర్ణయాన్ని వారుుదే వేసేలా కేంద్రంలోని తన మంత్రుల ద్వారా ప్రధానిపై ఒత్తిడి తీసుకురావాలి. బాగుంటే నా నిర్ణయం, బాగోలేకుంటే మోదీ నిర్ణయమని చంద్రబాబు చెప్పడం ఇక కుదరదు. అమలులో లోపాలను సరిదిద్దాకే ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలని గట్టిగా చెబుతున్నా. ఒక నిర్ణయం తీసుకునేముందు అది ఆచరణ సాధ్యమేనా? అని ఆలోచించాలి. బ్యాంకుల్లో క్యూలో నిలబడి 70 మంది చనిపోయారని చెబుతున్నారు. వారికి ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి. చంద్రబాబులా పనిపాటా లేకుండా ఎవరూ లేరు ప్రతి నిర్ణయం గురించి ప్రతి రోజూ పార్టీ అధ్యక్షుడే మాట్లాడరు. పార్టీ అంటే అధికార ప్రతినిధులుంటారు. చంద్రబాబులా పనిపాటా లేకుండా ఎవరూ లేరు. ప్రతిరోజూ ఆయన ముఖం చూడటానికి, చెప్పేది వినడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బాబు ఉదయం నుంచి చెప్పిన దానికి, సాయంత్రం చెప్పే దానికి అసలు పొంతన ఉండదు. ఒకరోజ పొద్దున్నే వచ్చేస్తాడు, మోదీ నిర్ణయం బ్రహ్మాండమంటాడు. మూడు రోజుల తరువాత మోదీ ఏంటండీ, ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నాడని అంటాడు. పూర్తి డేటాతో, విషయాన్ని అర్థం చేసుకొని మాట్లాడాలి. లేదంటే ఇతడేమీ నాయకుడని అంటారు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ ముఖ్యనేత బొత్స సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బారుు తదితరులున్నారు. -
‘నోట్ల రద్దు’ లోపాలు సరిదిద్దండి: వైఎస్ జగన్
-
కేంద్రం లీకిచ్చింది.. బాబుకు ముందే తెలుసు: వైఎస్ జగన్
రాజమహేంద్రవరం: 'పెద్ద నోట్ల రద్దువంటి పెద్ద అంశాలపై అధికార ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ముందు ప్రతిపక్షాలను సంప్రదించడం, సామాన్యులను సంప్రదించడం చేస్తుంది. ఆ నిర్ణయం తర్వాత ఏర్పడే ప్రభావం నుంచి బయటపడే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం అలా చేయలేదు' అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంపై ప్రజల పక్షాన ప్రతిపక్షం గొంతు విప్పుతుందని ఆయన స్పష్టం చేశారు. పెద్ద నోట్లను రద్దు చేయగానే తన సూచన మేరకే కేంద్రం నిర్ణయం తీసుకుందని చంద్రబాబు అన్నారని, అంతవేగంగా ఆయనెలా స్పందించగలిగారని ప్రశ్నించారు. కేంద్రం సెలక్టివ్ పీపుల్స్ కు ముందే లీకులిచ్చిందని, అందులో చంద్రబాబు కూడా ఉన్నారని, అందులో భాగంగానే అక్టోబర్ 12న చంద్రబాబు రూ.500, రూ.1000నోట్లను రద్దు చేయాలని లేఖ రాశారని వైఎస్ జగన్ చెప్పారు. కేంద్రం నిర్ణయానికి సరిగ్గా నెల రోజుల ముందు చంద్రబాబు తన పరిస్థితులు చక్కబెట్టుకొని సామాన్యులను మాత్రం గాలికొదిలేశారని అన్నారు. చంద్రబాబు చర్యలు చూశాక కూడా ఎవరికీ తెలియకుండానే తాము నిర్ణయం వెలువరించామని కేంద్రం చెప్పే మాటలు తాము ఎలా నమ్మాలని ప్రశ్నించారు. నల్లడబ్బును అరికట్టేందుకే అని కేంద్రం చెప్పినా ఊహించని విధంగా నిర్ణయం వెలువరించారన్నారు. నల్లడబ్బును అరికట్టడాన్ని తాము స్వాగతిస్తామని, సరైన విధంగా అమలు చేయకపోవడం మూలంగా, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన ప్రణాళికలు కూడా సరైన విధంగా అమలు చేయకుంటే విఫలమవుతాయని అన్నారు. యూఎస్ఎస్ఆర్ ప్రెసిడెంట్ గా ఉన్న గోర్బచావ్ సోషల్ ఎకనామిక్ నుంచి లిబరల్ ఎకానమిగా మార్చే పెద్ద నిర్ణయం తీసుకున్నారని, కానీ, దాని అమలుకోసం సరైన చర్యలు తీసుకోకపోవడంతో విఫలమైందని గుర్తు చేశారు. నోట్ల రద్దు అమలులో పారదర్శకత లోపించిందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... పాత పెద్ద నోట్ల రద్దుతో చిన్న, సన్నకారు రైతులు కష్టాలు పడుతున్నారు ఇవాళ రైతులు తమ పంటను అమ్ముకోలేని, కొత్త పంటలు వేసుకోలేని పరిస్థితి ఉంది వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలో సగం కూడా రాని పరిస్థితి నెలకొంది వ్యవసాయ ఆదాయంపై పన్ను లేదు, ఇదంతా నల్లధనం ఎలా అవుంది? మనదేశంలో ఉన్న 6 లక్షల 38 వేళ్ల గ్రామాలు క్యాష్ ఎకానమీతో నడుస్తున్నాయి గ్రామాల్లో 75 శాతం మంది క్యాష్ ఎకానమీతో బతికే పరిస్థితి ఉంది 92 శాతం గ్రామాలకు బ్యాంకులు లేవు 53 శాతం జనాభాకు మాత్రమే బ్యాంకు ఖాతాలు ఉన్నాయి దేశంలో ఉన్న ఏటీఏంలలో పదిశాతం కూడా గ్రామాల్లో లేవు 2 వేల నోటు తీసుకెళితే ఎవరూ చిల్లర ఇవ్వడం లేదు 2 వేల రూపాయల నోటు ఎందుకు తెచ్చారో ఎవరికీ తెలియడం లేదు పాత పెద్ద నోట్లను రద్దు చేయడంతో పెళ్లిళ్లు కూడా వాయిదా పడుతున్నాయి ఉద్దేశాలు మంచివే.. అమలులో విఫలం దేశంలో 50 లక్షల మందికి 2 కోట్ల క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఇవన్ని 120 కోట్ల మంది జనాభాకు ఏవిధంగా సరిపోతాయి? పాత పెద్ద నోట్లు నిర్ణయం మంచిదే కానీ దీన్ని అమలు చేయడంలో విఫలమయ్యారు ముందస్తు సన్నాహాలు చేయకుండా సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సమజసం కాదు ఆర్థిక అక్షరాస్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలి, దీనికి కొంత సమయం పడుతుంది 1975లో పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు చెలామణిలో వాటి భాగం 0.6 శాతం మాత్రమే ఇప్పుడు 86 శాతం చెలామణిలో ఉన్న కరెన్సీని రద్దు చేసినప్పుడు ఎంత ప్రిపరేషన్ ఉండాలి? ముందు ప్రణాళిక లేకుండా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు సమర్థించడం దారుణం మొదట ఒక మాట, తర్వాత ప్లేటు ఫిరాయించి మరొక మాట మాట్లాడారు నోట్ల కష్టాలు తీరేవరకు పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలి రద్దు నిర్ణయాన్ని వాయిదా వేయడం వల్ల ఎటువంటి నష్టం జరగదు, వారు అనుకున్న ఉద్దేశాలు నెరవేతాయి బాగుంటే నా నిర్ణయం.. బాగా లేకుంటే మోదీ నిర్ణయం అన్నట్టుగా చంద్రబాబు స్పందన ఉంది తెలుసు కాబట్టే హెరిటేజ్ షేర్లు అమ్ముకున్నారు పెద్ద నోట్ల రద్దు విషయం చంద్రబాబుకు ముందే తెలుసు అందుకే మూడు రోజుల ముందే హెరిటేజ్ షేర్లు అమ్ముకున్నారు చంద్రబాబు సీఎం అయ్యేనాటికి హెరిటేజ్ షేర్ విలువ రూ.199 ఈ రెండున్నరేళ్లలో హెరిటేజ్ షేర్ విలువ రూ.909కి పెరిగింది. అంటే సుమారు 450శాతం విలువ పెరిగింది వాయిస్ ఆఫ్ పీపుల్ పెద్ద నిర్ణయాలను తీసుకునే ముందు కాస్తంత ఆలోచన చేయండి నల్ల డబ్బు అంతం చేయడాన్ని మేం కూడా స్వాగతిస్తాం ఏటీఎంల వద్దకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వారికి నష్ట పరిహారం ఇప్పించాలి ప్రతిపక్షం అంటే వాయిస్ ఆఫ్ పీపుల్ ప్రజలు ఒక నిర్ణయం బాగుందంటే మేం బాగుందంటాం.. వారు బాగలేదంటే బాగ లేదని చెప్తాం ప్రతిపక్షాలు అడ్డగోలుగా స్పందించకూడదు. ప్రజల స్పందన చూశాకే స్పందించాలి అనూహ్య నిర్ణయాలపై ఎలా స్పందించాలి ప్రతి ఒక్కరి నుంచి అభిప్రాయాలు, వారి బాధలు తెలుసుకున్న తర్వాతే మేం మాట్లాడుతున్నాం మేం చెప్పే ప్రతి మాట ఇప్పుడు చాలా నిర్మాణాత్మకమైనది అమలు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసిన తర్వాత నిర్ణయం వెలువరించాలి ప్రతి నిర్ణయాన్ని పార్టీ అధ్యక్షుడే చెప్పనక్కర్లేదు.. పార్టీలో అధికార ప్రతినిధులు చెప్పేవి కూడా పార్టీవే చంద్రబాబునాయుడు మాదిరిగా పని పాట లేకుండా మేం లేము ప్రజలకే బాబు ముఖం చూసి చూసి చిరాకొచ్చేస్తుంది పార్టీ నాయకుడు ప్రెస్ మీట్ పెడుతున్నాడంటే ప్రతి అంశంపై అవగాహన ఉండాలి -
ఇచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టుకోవాలి
అంతర్వేది (సఖినేటిపల్లి) : దేవాంగులకు రాజకీయ అవకాశాలు కల్పించి, వారి అభ్యున్నతికి పాటుపడతానని నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని దేవాంగ సంక్షేమ సంఘం అడహాక్ కమిటీ రాష్ట్ర సభ్యుడు టి.శ్రీనివాస విశ్వనాథ్ పేర్కొన్నారు. అప్పటి అఖిల భారత దేవాంగ సభలో ఇచ్చిన మాటను చంద్రబాబు తప్పారని విమర్శించారు. శనివారం అంతర్వేదిలో దేవాంగ ఉద్యోగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్తిక వనసమారాధనలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చేనేత జాతీయ వారసత్వ సంపదని, దీని పరిరక్షణకు అమరావతిలో 5 ఎకరాల భూమి కేటాయించి, భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కోనసీమ దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చింతా శంకరమూర్తిని, వివిధ రంగాల్లో విశిష్ట వ్యక్తులను సత్కరించారు. సంఘ అధ్యక్షుడు కె.ప్రసాద్రాజు అధ్యక్షత వహించారు. మోరి చేనేత సొసైటీ అధ్యక్షుడు చింతా వీరభద్రేశ్వరరావు, ఇంద్రజాల కళాకారుడు శ్యాం జాదూగర్, ఉద్యోగ సంఘ గౌరవాధ్యక్షుడు జాన వీరభద్రశర్మ, ప్రధాన కార్యదర్శి పి.ప్రసాదరాజు పాల్గొన్నారు. -
పదిశాతం పెరిగిన బస్సు చార్జీలు
ప్రయాణికులపై ఏడాదికి రూ.18 కోట్ల భారం మెదక్: ప్రభుత్వం ఇటీవల పెంచిన ఆర్టీసీ చార్జీలు సోమవారం నుంచి అమలులోకి వచ్చాయి. పల్లె వెలుగు బస్సుల్లో 30 కిలో మీటర్ల లోపు రూ.1లు అదనంగా వసూలు చేస్తే, ఎక్స్ప్రెస్లు, డీలక్స్, సూపర్ లగ్జరీలు పదిశాతం అదనంగా చార్జీలు వసూలు చేస్తున్నాయి. దీంతో జిల్లా ప్రజలపై ఏడాదికి రూ.18కోట్ల అదనపు భారం పడుతుంది. జిల్లాలో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, దుబ్బాక, నారాయణఖేడ్, గజ్వేల్, జహీరాబాద్ డిపోల్లో మొత్తం 618 బస్సులు ఉన్నాయి. గతకొంతకాలంగా ఆర్టీసీ నష్టాల్లో ఉంది. గత రెండేళ్లుగా కరువు కాటకాలతోపాటు కార్మికులకు పెంచిన వేతన సవరణతో గత ఏడాది జిల్లాలో ఆర్టీసీకి రూ.10కోట్ల నష్టాల్లోకి కూరుకు పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నష్టం వందల కోట్లు . కాగా ప్రభుత్వం పెంచిన బస్సు చార్జీలు ఈనెల 27వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. ఆర్డీనరీ, పల్లె వెలుగు బస్సుల్లో 30 కిలో మీటర్లలోపు రూ.1చార్జీ పెరగా, ఎక్స్ప్రెస్లు, డీలక్స్, సూపర్ లగ్జరీలకు మాత్రం ఓవరాల్గా పదిశాతం అదనపు చార్జీలు పెంచారు. దీంతో జిల్లా ప్రయాణికులపై నెలకు రూ.1.5కోట్లు, ఏడాదికి రూ.18కోట్లు అదనపు భారం పడుతుంది. గతంలో మెదక్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని అమలాపురం వెళ్లేందుకు లగ్జరీ బస్సు చార్జీ రూ.561 ఉండగా, ప్రస్తుతం రూ.612లకు పెరిగింది. ఈ లెక్కన ఒకవ్యక్తికి రూ.51లు పెరిగాయి. అలాగే కాకినాడకు గతంలో రూ.588లుండగా, ప్రస్తుతం రూ.646లకు పెరిగింది. ఈలెక్కన ఒక్కో వ్యక్తిపై రూ.58లను అదనంగా వసూలు చేస్తున్నారు. ఎక్స్ప్రెస్కు కిలో రూ.8పైసలు, డిలక్స్కు రూ.9పైసలు, సూపర్లగ్జరీ రూ.11పైసలు, ఇంద్రలో రూ.14పైసలు, గరుడలో రూ.16పైసల చొప్పున వసూలు చేస్తున్నారు. ఈలెక్కన ఓవరాల్గా బస్సు చార్జీలు 10 శాతం అదనంగా వసూలు చేస్తున్నారు. పెరిగిన బస్సుచార్జీలతో బస్సు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్నీ ధరలు పెరుగుతున్నాయి.. రాష్ట్రంలో నిత్యావసర ధరలతోపాటు డీజిల్, పెట్రోల్, కరెంట్, బస్సుచార్జీలు పెరిగాయి. అసలే కరువుతో కొట్టుమిట్టాడుతుంటే...పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. బస్సుల్లో ప్రయాణం చేయాలంటేనే భయమేస్తోంది. -సంతోష్, ప్రయాణికుడు, కరీంనగర్. మోయలేనిభారం.. పేద, సామాన్య ప్రజలు మోయలేని భారాన్ని ప్రభుత్వం మోపుతోంది. బస్సుచార్జీలు నామమాత్రమేనంటూ 10 శాతం పెంచారు. ఇక కరెంట్ చార్జీలు ఏమేరకు పెరుగుతాయనే ఆందోళన నెలకొంది. ధరల పెరుగులతో పేదప్రజలు మరింత పేదలుగానే మారుతున్నారు. -దుర్గారెడ్డి, ప్రయాణికుడు, చిట్కుల్ -
నేటినుంచి 30 వరకు పోలీస్ యాక్టు
♦ ర్యాలీలు, బహిరంగ సమావేశాలకు అనుమతి తప్పనిసరి ♦ ఎస్పీ రెమా రాజేశ్వరి వెల్లడి వికారాబాద్: గురువారం నుంచి 30 వరకు జిల్లాలో పోలీస్ యాక్టు 30 అమలులో ఉంటుందని ఎస్పీ రెమా రాజేశ్వరి పేర్కొన్నారు. ఈమేరకు బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. పోలీస్ యాక్టు 30 అమలు ప్రకారం బహిరంగ సమావేశాలు, ర్యాలీలు, దర్నాలు,రోడ్ షోలు తదితర కార్యక్రమాలకు అనుమతి తప్పనిసరి అన్నారు. సంబంధిత పోలీస్స్టేషన్ నుంచి 72 గంటల ముందు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఎస్పీ తెలిపారు. ప్రజా సంబంధాలు మెరుగుపడేలా అందరూ నడుచుకోవాలని పేర్కొన్నారు. ఏ మతానికైనా సంతోషమే ప్రతీక అని, ప్రతిఒక్కరూ కుల, మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండి పండగలను జరుపుకోవాలని సూచించారు. ఏ వర్గం వారైనా ఇతరులకు ఇబ్బంది కలగకుండా పండగలు చేసుకోవాలని తెలిపారు. ఎవరూ విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించరాదని చెప్పారు. ఈనెల 15, 19వ తేదీల్లో జరిగే శ్రీ రామ నవమి, హనుమాన్ జయంతి వేడుకలతో పాటు 22న జరిగే హనుమాన్ శోభయాత్ర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ రెమా రాజేశ్వరి జిల్లా ప్రజలను కోరారు. వేడుకల్లో అపశ్రుతులు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఎస్పీ.. పోలీస్ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. పండగలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చే యాలని సూచించారు. ఆయా ఉత్సవ సమితి నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు తీసుకోవాలని పేర్కొన్నారు. ఊరేగింపులో భారీస్థాయి సౌండ్ బాక్సులను వినియోగించరాదని తెలిపారు. అదేవిధంగా నిర్వాహకులు వివిధ కమిటీలు ఏర్పాటు చేసి బాధ్యతలు తీసుకోవాలని ఎస్పీ రెమా రాజేశ్వరి సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. సంఘ విద్రోహ శక్తులు ర్యాలీలో పాల్గొనకుండా చూడాలని పోలీసులను అదేశించారు. భద్రతా కారణాల దృష్ట్యా అవసరమైతే బైండోవర్లు కూడా చేయాలని ఎస్పీ రెమా రాజేశ్వరి సిబ్బందికి సూచించారు. ప్రజలంతా శాంతియుత వాతావరణంలో పండగలు నిర్వహించుకోవాలని తెలిపారు. వివిధ పండగల నేపథ్యంలో ఎస్పీ జిల్లావాసులకు శుభాకాంక్షలు తెలిపారు. -
అనుమతుల్లో జాప్యాలపై ఆందోళన..
రియల్టీ ప్రాజెక్టుల అమలులో అధికారులూ జవాబుదారీ కావాలి... రియల్టీ బిల్లుపై డెవలపర్లు, కన్సల్టెంట్ల అభిప్రాయం న్యూఢిల్లీ: ప్రాజెక్టుల అభివృద్ధిలో జరిగే ఆలస్యాలకు- సంబంధిత ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చేవారుసహా ఇందులో జోక్యం ఉండే ప్రభుత్వ అధికారులు, సంబంధిత స్థానిక పట్టణ సంస్థల ప్రతినిధులు అందరినీ జవాబుదారులను చేయాలని ప్రాపర్టీ డెవలపర్లు, కన్సల్టెంట్లు పేర్కొంటున్నారు. ఈ మేరకు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ బిల్లు ఉండాలని వారు కోరారు. అధికారుల నుంచి ఆమోదాలు పొందడంలో జరిగే ఆలస్యం... దీనితో ప్రాజెక్టు పూర్తిలో జాప్యం జరిగే సందర్భాల్లో సైతం డెవలపర్లనే బాధ్యులుగా చేసే వీలును ప్రతిపాదిత చట్టం కల్పిస్తోందన్న ఆందోళనను వారు వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ (రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్) బిల్లు, 2015కు కేబినెట్ ఆమోద ముద్ర వేయడం ఒక శుభపరిణామమని మాత్రం వారు వ్యాఖ్యానించారు. దీనివల్ల ప్రాజెక్టుల అమల్లో పారదర్శకత పెరుగుతుందని, కొనుగోలుదారుల్లో విశ్వాసం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. అయితే ప్రాజెక్టుల ఆలస్యం సందర్భాలకు సంబంధించి... అనుమతులు ఇచ్చినవారినీ బాధ్యులుగా చేయకుంటే.. ప్రాజెక్టుల అమల్లో ఆలస్యం కొనసాగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు దారులకు, పరిశ్రమకు ప్రోత్సాహం అందించడం లక్ష్యాలుగా రియల్టీ బిల్లు 2015లో ప్రతిపాదించిన 20 ప్రధాన సవరణలకు కేంద్ర మంత్రి మండలి గురువారం ఆమోదముద్రవేసిన సంగతి తెలిసిందే. దీనిపై పరిశ్రమ ప్రముఖుల అభిప్రాయాలను పరిశీలిస్తే... రియల్టీ మార్కెట్లో భారీ మార్పు ‘ఈ బిల్లు... రియల్టీ రంగంలో రానున్న పెద్ద మార్పు. వినియోగదారునికి రక్షణ కల్పించడమేకాదు. రియల్టీ మార్కెట్లో పెట్టుబడులకు ఈ నిర్ణయం ఊపునిస్తుంది. సకాలంలో ప్రాజెక్టుల అమలు విషయంలో ప్రభుత్వ అధికారులనూ బాధ్యులను చేయాలి’ అని సీబీఆర్ఈ, దక్షిణాసియా చైర్మన్ అంజుమన్ మాగజీన్ పేర్కొన్నారు. ‘పలు పథకాలను నియంత్రణా పరిధిలోకి తీసుకురావాలన్న ఆలోచన మంచిదే. అయితే బిల్లు పరిధిలోకి అధికారులనూ తీసుకురావాలి. గత ప్రాజెక్టులకూ వర్తించేట్లు (రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్) బిల్లు అమలుచేయడం అనుసరణీయం కాదు’ అని క్రెడాయ్ ప్రెసిడెంట్ గీతాంబర్ ఆనంద్ వ్యాఖ్యానించారు. -
‘డబుల్’... ఆచరణలో ట్రబుల్
రాజీవ్ ఆవాస్ యోజన(రే) అమలులో రాష్ట్రం నిర్లక్ష్యం డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం పేర కాలయాపన రెండేళ్లుగా మూలుగుతున్న రూ.70 కోట్ల నిధులు వాటిని వెనక్కి ఇచ్చేయాలని కేంద్రం ఘాటు లేఖ హైదరాబాద్: డబుల్ బెడ్ రూమ్ల పేరుతో రాజీవ్ ఆవాస్ యోజన(ఆర్ఏవై/రే) అమలులో నిర్లక్ష్యంపై కేంద్రం సీరియస్ అయింది. కేంద్రం మంజూరు చేసిన సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లను ‘డబుల్ బెడ్ రూమ్’లుగా నిర్మిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కాలయాపనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిం ది. ఈ పథకం కింద ఇప్పటికే రాష్ట్రానికి విడుదల చేసిన నిధులను వెనక్కి ఇచ్చేయాలంటూ కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ ఘాటుగా లేఖ రాసింది. పరిస్థితి ఇలాగే ఉంటే రాష్ట్రానికి మంజూరు చేసిన ప్రాజెక్టులన్నింటినీ రద్దు చేస్తామంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటుకు ఉపక్రమించింది. రాష్ట్ర విభజనతో పాటు పరిపాలనపర అనుమతుల జారీలో ఆలస్యం, రాష్ట్ర ప్రభుత్వ వాటా ధనం విడుదల కాకపోవడం, డబుల్ బెడ్ రూమ్ గృహాలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం తదితర కారణాలతో ఈ పథకం అమలులో జాప్యం జరిగిందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ తాజాగా కేంద్రానికి వివరణ ఇచ్చుకుంది. ఇదే అంశంపై పట్టణ గృహనిర్మాణ మంత్రిత్వశాఖ కార్యదర్శి తాజాగా రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య అధికారితో ఫోన్లో మాట్లాడి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆది నుంచే అలక్ష్యం: పట్టణ ప్రాంత మురికి వాడల నిర్మూలన కోసం గత యూపీఏ ప్రభుత్వం 2009-10లో ఆర్ఏవైను ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ఎంపికై ‘మిషన్ నగరాల్లో’ని మురికి వాడల్లో రెండు, మూడంతస్తుల(జీ+2, జీ+3) గృహ సముదాయాలనకు నిర్మించడంతో పాటు మౌలిక సౌకర్యాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గడిచిన మూడేళ్లలో రూ.300 కోట్ల అంచనా వ్యయంతో తెలంగాణకు 7 ఆర్ఏవై ప్రాజెక్టులు మంజూరయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కేశవ్నగర్లో 334 ఇళ్ల నిర్మాణానికి రూ.58.74 కోట్లతో మంజూరైన ప్రాజెక్టు మాత్రమే కార్యరూపం దాల్చింది. వరంగల్, ఖమ్మం, రామగుండం పట్టణాలకు మంజూరైన మిగిలిన 6 ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకు పురోగతి లేదు. ఏడు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ వాటా రూ.161.56 కోట్ల నుంచి తొలి విడత కింద గత రెండేళ్లలో విడుదలైన రూ.70 కోట్లు నిరుపయోగమయ్యాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు కింద సైతం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించాలని నిర్ణయించడం తో ఈ పథకం అమలు ఆలస్యమైంది. విడుదల కాని రాష్ట్ర వాటా నిధులు ఆర్ఏవై కింద రాష్ట్రానికి 4 ప్రాజెక్టులు మంజూ రై రెండేళ్లైనా ఇంకా ఇళ్ల నిర్మాణం పట్టాలెక్కలేదు. ప్రాజెక్టు మార్గదర్శకాల ప్రకారం ఒక్కో ఇంటికయ్యే వ్యయంలో కేంద్రం 75 శాతం, రాష్ట్రం 15 శాతం, పురపాలక సంస్థ 10 శాతం నిధులివ్వాలి. కేంద్రం ఇప్పటికే రెండు విడతల్లో రూ. 70 కోట్లు విడుదల చేయగా, రాష్ట్రం తమ వాటా నిధులను విడుదల చేయలేదు. -
నగరాభివృద్ధే లక్ష్యం
‘సాక్షి’ ఇంటర్వ్యూలో మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండ్యన్ హార్డ్వర్క్తోనే మెరుగైన పాలన రాజధాని నిర్మాణంలో ప్లానింగ్ కీలకం సుందరీకరణపై ప్రత్యేక దృష్టి ఆస్తిపన్ను పెంపుపై స్టడీ చేస్తున్నానని వెల్లడి సాక్షి : సింగపూర్ ట్రిప్ ఎలా సాగింది. శిక్షణలో ఏం నేర్చుకున్నారు. కమిషనర్ : చాలా బాగా సాగింది. రాజధాని నగరం ఎలా ఉండాలి... రిసోర్స్, ఇంప్లిమెంటేషన్ తదితర అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. రాజధాని నిర్మాణంలో ప్లానింగ్ చాలా ముఖ్యమనే విషయం స్పష్టంగా అర్థమైంది. సాక్షి : నగర సుందరీకరణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? కమిషనర్ : రాజధాని నేపథ్యంలో నగరాన్ని సుందరీకరించాల్సిన అవసరం ఉంది. దేశ, విదేశాల నుంచి వీఐపీలు వచ్చి వె ళుతున్నారు. ఈక్రమంలో సుందరీకరణపై ప్రధానంగా దృష్టిసారించాం. కాల్వలు, సహజవనరులు నగరంలో పుష్కలంగా ఉన్నాయి. వీటిని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలి. స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డెరైక్టర్ శ్రీధరన్, జీఎంఆర్ ఎక్స్పర్ట్స్తో త్వరలోనే చర్చిస్తాం. ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో ఖర్చు చేయాలనే దానిపై ఒక అవగాహనకు వచ్చాక సుందరీకరణ పనులు చేపడతాం. సాక్షి : స్మార్ట్ వార్డుల ఏర్పాటుకు ప్రణాళిక ఎంతవరకు వచ్చింది? కమిషనర్ : మౌలిక వసతులు, అందరికీ జీవనోపాధి, డ్రాప్ అవుట్స్ లేకపోవడం వంటి 20 లక్ష్యాలతో స్మార్ట్ వార్డులను అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, వీఐపీల భాగస్వామ్యం అవసరం. ఎంపీ, ఎమ్మెల్యేలు, మేయర్, కార్పొరేటర్లతోపాటు నగరంలోని సెలబ్రిటీలు, వ్యాపార ప్రముఖులు, సినిమా నటులను భాగస్వాములను చేయాలని నిర్ణయించాను. వీరితో చర్చలు ప్రారంభించాము. ఒక్కోవార్డును ఒక్కొక్కరికి ద త్తత ఇచ్చే విధంగా ప్రణాళిక రూపొందించాను. సాక్షి : ఆస్తిపన్ను పెంపు ప్రతిపాదన ఎంతవరకు వచ్చింది? కమిషనర్ : నగరంలో ఆస్తిపన్ను పెంపునకు సంబంధించి వివిధ వర్గాల వారి నుంచి అభిప్రాయ సేకరణ చేయాల్సి ఉంటుంది. గతంలో కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నాయి. నాన్ రెసిడె న్షియల్ టాక్స్కు సంబంధించి 2007లో సుప్రీంకోర్టులో కేసు ఫైల్ అయింది. వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఆస్తిపన్ను పెంపుపై ఒక నిర్ణయం తీసుకుంటాం. పరిస్థితులను స్టడీ చేస్తున్నా. సాక్షి : డంపింగ్యార్డు స్థల సేకరణ సమస్య ఎప్పటిలోగా పరిష్కరిస్తారు? కమిషనర్ : నగరపాలక సంస్థలో ఇది ప్రధాన సమస్య. స్థల సేకరణకు ఏర్పాట్లుచేస్తున్నాం. జి.కొండూరు మండలం కడియం పోతవరం గ్రామంలో భూమిని పరిశీలించాను. ఎకరం కోటి రూపాయలు చెబుతున్నారు. రైతులతో సంప్రదింపులు జరపాలని తహశీల్దార్తో చెప్పాను. నున్న ప్రాంతంలో స్థలాన్ని త్వరలోనే పరిశీలిస్తాను. నెల రోజుల్లో స్థలాన్ని సమకూర్చేందుకు ప్రయత్నిస్తున్నాను. సాక్షి : గడువులోపు జేఎన్ఎన్యూఆర్ఎం పనులు పూర్తిచేయగలరా? ఇళ్ల కేటాయింపుపై ఏం నిర్ణయం తీసుకున్నారు. కమిషనర్ : మార్చి 31వ తేదీలోపు జేఎన్ఎన్యూఆర్ఎం పనులను పూర్తి చేయాల్సి ఉంది. పెండింగ్ పనులు, రావాల్సిన నిధులపై ఫిబ్రవరి 2న సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటుచేశా. సాధ్యమైనంతవరకు గడువులోపు పనుల్ని పూర్తిచేస్తాం. అర్హులైన లబ్ధిదారులకు త్వరలోనే ఇళ్లు కేటాయిస్తాం. సాక్షి : నగరపాలక సంస్థలో ఆడిట్, కోర్టు కేసులు పెండింగ్ ఉన్నాయి. బడ్జెట్ తయారీలో జాప్యం జరుగుతోంది. దీనికి కారణం ఏమంటారు? కమిషనర్ : మీరు చెప్పింది నిజమే. 255 కేసులో కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి. ఆడిట్ అప్డేట్గా జరిగితేనే పాలన పారదర్శకంగా ఉంటుంది. వీటిపై ప్రత్యేక దృష్టిస్తా. బడ్జెట్ రూపొందించడంలో జాప్యం జరిగింది. అధికారులు ప్రస్తుతం బడ్జెట్ తయారు చేసేపనిలో నిమగ్నమయ్యారు. త్వరలోనే బడ్జెట్ను అప్రూవల్ కోసం స్టాండింగ్ కమిటీకి పంపుతాం. సాక్షి : ఉదయం 5.30 గంటలకే నగర పర్యటనకు వెళ్తున్నారు. దీనికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? కమిషనర్ : ఉంది. ఐఏఎస్ శిక్షణలో ఉన్న సమయంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎలా వ్యవహరించాలనే దానిపై గుల్జార్ శిక్షణ ఇచ్చారు. ఉదయం 5.30 గంటలకు రోడ్డుపైకి వెళితేనే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని ఆయన చెప్పారు. ఆ స్ఫూర్తితోనే హార్డ్వర్క్ చేస్తున్నా. జాబ్ ఏం డిమాండ్ చేస్తే అది చేయాలన్నది నా అభిప్రాయం. సాక్షి : రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా మీపైన ఉన్నాయా? కమిషనర్ : ఇప్పటివరకు అలాంటివి ఏమీ లేవు. అర్బన్ లోకల్ బాడీలో ఎలా పనిచేయాలనే దానిపై నాకు స్పష్టమైన అవగాహన ఉంది. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడం కోసం కృషిచేస్తా. నగరాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా. -
మాస్టర్ప్లాన్ అమలుకు శ్రీకారం
నగరంలో రోడ్లు విస్తరణకు సర్వే నెల్లూరు(నవాబుపేట): మాస్టర్ప్లాన్లో భాగంగా నెల్లూరులో ప్రధాన రహదారుల విస్తరణకు కార్పొరేషన్ సన్నద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన సర్వే పనులను మంగళవారం నుంచి ప్రారంభించారు. నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ నుంచి బోసుబొమ్మ, ట్రంకురోడ్డు మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు 100 అడుగుల రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్ నుంచి కేవీఆర్, కరెంట్ ఆఫీస్, వేదాయపాళెం మీదుగా అయ్యప్పగుడి వరకు 150 అడుగులు రోడ్డు, అయ్యప్పగుడి నుంచి బీవీనగర్ మీదుగా మినీబైపాస్రోడ్డు వరకు 200 అడుగులు మేర రోడ్లు విస్తరణ చేపట్టనున్నారు. సుమారు 16 కిలోమీటర్లు మేరకు రోడ్లు విస్తరణ జరగనుంది. పెరుగుతున్న జనభా, వాహనాల రాకపోకలకు అసౌకర్యం కలగకుండా మాస్టర్ ప్లాన్లో ప్రతిపాదనలు రూపొందించారు. చాలా కాలంగా దీని అమలుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్గా ఐఏఎస్ అధికారి బాధ్యతలు చేపట్టిన తరుణంలో ఈ ప్రతిపాదనలకు దుమ్ముదులిపారు. సర్వే పనులు ప్రారంభించడం ద్వారా విస్తరణ పనులకు తొలి అడుగు పడినట్టయింది. 1978లో నగరానికి సంబంధించి అప్పటి మున్సిపల్ అధికారులు మాస్టర్ప్లాన్ను రూపొందించారు. నగర అభివృద్ధిని పరిగణనలోకి తీసుకుంటూ ప్రతి పదేళ్లకోసారి మాస్టర్ప్లాన్లో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంది. అయితే ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఈ క్రమంలో ఎట్టకేలకు 2013లో మాస్టర్ప్లాన్కు మెరుగులు దిద్దారు. ప్రస్తుతం దాని అమలుకు కార్యాచరణలోకి దిగారు. ఇందుకోసం ఆరుగురు సభ్యులతో కూడిన ఒక బృందాన్ని కార్పొరేషన్ నియమించింది. ఈ బృందంలో ఇద్దరు సర్వేయర్లు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్, టౌన్ సర్వేయర్, సిటీ సర్వేయర్, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. అయ్యప్పగుడి సమీపం నుంచి రోడ్డు విస్తరణకు సంబంధించిన సర్వేకు శ్రీకారం చుట్టారు. రెండు వారల్లో ఈ సర్వే పూర్తి కావచ్చని భావిస్తున్నారు. ఇదంతా ఒక కొలిక్కి వచ్చిన తరువాత ఏయే ప్రాంతాల్లో ఎంతెంత భూ సేకరణ అవసరమవుతుందనేది కూడా తెలుస్తుంది. ఆ మేరకు తదుపరి కార్యాచరణ చేపట్టాల్సి ఉంటుంది. ట్రాఫిక్ కష్టాల నుంచి ఊరట మాస్టర్ప్లాన్లో భాగంగా రోడ్డు విస్తరణ జరిగనట్లయితే నెల్లూరు నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. నగరంలోని గాంధీబొమ్మ కూడలి, అంబేద్కర్ సర్కిల్, మద్రాసు బస్టాండు, ఆర్టీసీ, కేవీఆర్ పెట్రోలు బంకు, వేదాయపాళెం, ముత్తుకూరు గేటు సెంటర్, తదితర ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే ఇదంతా ఒక రోజులో జరిగే పని కానప్పటికీ ఎట్టకేలకు సర్వే ప్రారంభించడంతో కొంతైనా కదలిక వచ్చిందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
రుణ మాఫీ కోసం ఇక పోరుబాట
వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్టోబర్ 16న తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా సాక్షి, అనంతపురం: రుణ మాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలను మోసగించిన చంద్రబాబు అసలు స్వరూపాన్ని బయట పెట్టడంతోపాటు, రుణమాఫీ అమలు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అక్టోబర్ 16న రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలతో మనోవేదనకు గురవుతున్న రైతన్నలకు దన్నుగా, అక్కాచెల్లెళ్లకు అండగా నిలవాలన్నదే తమ పార్టీ లక్ష్యమని చెప్పారు. అక్టోబర్ 16న తహశీల్దార్ కార్యాలయాల ఎదుట చేపట్టనున్న ధర్నాలో రాష్ట్రవ్యాప్తంగా ఆయా మండలాల పరిధిలోని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, అక్కాచెల్లెళ్లు పాల్గొని చంద్రబాబు మోసాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. అనంతపురంలోని బెంగళూరు జాతీయ రహదారి పక్కన ఉన్న రామకృష్ణ ఫంక్షన్ హాలులో రెండు రోజులపాటు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో నియోజకవర్గాల వారీగా ఆయన సమీక్షలు నిర్వహించారు. శుక్రవారం అనంతపురం, కళ్యాణదుర్గం, రాప్తాడు, రాయదుర్గం, తాడిపత్రి, గుంతకల్లు నియోజకవర్గాల సమీక్ష ముగింపులో ఆయన మాట్లాడారు. అనంతరం మీడియాతోనూ ఆయన మాట్లాడారు. ఆయన ప్రసంగాల్లోని ముఖ్యాంశాలు... చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేయకపోవడంతో డ్వాక్రా చెల్లెమ్మ పొదుపు ఖాతాలో నుంచి బ్యాంకు అధికారులు డబ్బులు తీసేసుకుంటున్నారు. దీంతో కడుపుమండి చెల్లెమ్మలు నిన్నటికి నిన్న శ్రీకాకుళంలో చుట్టుముట్టారు. మీకు వడ్డీ లేని రుణాలు ఇస్తాను.. మీ వడ్డీనంతా నేనే కడతానని బాబు మోసపూరిత హామీ ఇచ్చారు. ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఇప్పుడిస్తున్నది వడ్డీ లేని రుణాలే కదా! చంద్రబాబు మాటలు నమ్మి.. బ్యాంకులకు పాత రుణాలు చెల్లించక, కొత్త రుణాలు పుట్టక, రైతులు పంటలు వేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. జూన్ 30లోపు రుణాలు కట్టలేదు కాబట్టి 13 శాతం వడ్డీ సహా బకాయిలు చెల్లించాలని బ్యాంకులు చెబుతున్నాయి. కొత్త రుణాలు ఇవ్వడం లేదు. పంటల బీమా లేదు. ఇంత దారుణంగా ప్రజలను మోసం చేస్తున్నారు. అలాంటి బాబును రక్షించేందుకు టీవీ-9, ఈనాడు, ఆంధ్రజ్యోతి కలసికట్టుగా పని చేస్తున్నాయి. బీసీలపై బాబు కపట ప్రేమ ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కేందుకే బీసీ రిజర్వేషన్ల తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారే తప్ప బీసీలపై ప్రేమతో కాదు. అనంతపురంలో ముగ్గురు బీసీ ఎమ్మెల్యేలు గెలిస్తే వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడమే బాబుకు బీసీలపై ఉన్న కపట ప్రేమకు నిదర్శనం. ప్రస్తుతం రాష్ట్రంలో తమిళనాడు తరహాలో రెండే పార్టీలు ఉన్నాయి. వైఎస్సార్సీపీ, టీడీపీ నిర్దేశించిన మూడోవంతు నియోజకవర్గాల్లో బీసీలకే టికెట్లు ఇస్తే అప్పుడు ఏ పార్టీవారు గెలిచినా అసెంబ్లీలో బీసీలకు మూడోవంతు ప్రాతినిధ్యం ఉంటుంది. అందుకు మా పార్టీ సిద్ధంగా ఉంది. చంద్రబాబు సిద్ధమేనా? పచ్చ చొక్కాల వారి కోసమే 135 జీవో పేదలకు అందాల్సిన పింఛన్లను పచ్చ చొక్కాలవారికి అందించడానికి బాబు భారీ కుట్రకు తెరలేపారు. ఇందులో భాగంగానే 135 జీవో జారీ చేశారు. ఈ జీవో ప్రకారం పింఛన్ లబ్ధిదారుల అర్హతలను గుర్తించడానికి వేసే కమిటీల్లో సభ్యులను నిర్ణయించే అధికారాన్ని మంత్రులకు కట్టబెట్టారు. టీడీపీ మంత్రులు నిర్ణయించిన వ్యక్తులతో కమిటీల ఏర్పాటు, ఆ కమిటీలు నిర్ణయించిన వారికే పింఛన్లు అందుతాయంటే ఏం జరగనుందో తెలుస్తోంది. ఏపీలో 43,11,688 మంది పింఛన్దారులుండగా కొత్త పింఛన్లకోసం 15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కొత్త దరఖాస్తులను పక్కన పెట్టినా, ప్రస్తుతం ఇస్తున్న పింఛన్ మొత్తం నెలకు రూ.130 కోట్లు చొప్పున ఐదు నెలలకు రూ.650 కోట్లు అవుతుంది. అక్టోబర్ 2 నుంచి పెంచనున్న మొత్తంతో ఏడు నెలలకు రూ.3,050 కోట్లు అవుతుంది. అంతా కలిపి రూ.3700 కోట్లు కావాల్సి ఉండగా బడ్జెట్లో చంద్రబాబు రూ.1338 కోట్లే కేటాయించారు. ఈ కేటాయింపులను బట్టి చూస్తే పింఛన్లలో భారీగా కోత పెట్టడానికి జరుగుతున్న కుట్ర ఎవరికైనా అర్థమవుతుంది. మరోవైపు ఇప్పుడు పింఛన్లు అందుకుంటున్న వారిలో చాలామంది అనర్హులు ఉన్నారనే కొత్త నాటకానికి తెర లేపారు. -
రుణమాఫీ అమలుకు కొత్త సాఫ్ట్ వేర్!
హైదరాబాద్: రైతు రుణమాఫీ అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త సాఫ్ట్వేర్ ను రూపొందిస్తుంది. లబ్దిదారుల ఎంపికకు ఏపీ సర్కార్ సాఫ్ట్ వేర్ ను వినియోగించుకోనున్నదని అధికారులుత తెలిపారు. డబుల్ ఎంట్రీలు, నకిలీ లబ్దిదారులను ప్రభుత్వం రూపొందించే సాఫ్ట్ వేర్ ద్వారా ఏరివేస్తామంటుని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈనెల 15 తర్వాత లబ్దిదారుల ఎంపిక కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. రుణమాఫీ అమలుకు 6వేల కోట్లు సర్కార్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వానికి రుణాల వివరాలు సమర్పించిన ఎస్ బీఐ, ఆంధ్రాబ్యాంక్, సిండికేట్, మిగిలిన బ్యాంకులకు 15 వరకు గడువు ఇస్తారని, వాయిదాల పద్దతిలో చెల్లింపులు చేయాలనే యోచనలో సర్కార్ ఉన్నట్టు సమాచారం. -
టీ, టిఫిన్లు ఇవ్వలేం!
మెదక్, న్యూస్లైన్: పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కలెక్టర్ స్మితా సబర్వాల్, విద్యాశాఖ అధికారి జి. రమేష్ వినూత్న ప్రణాళికకు రూపకల్పన చేశారు. ఈ మేరకు గత ఏడాది జూలై నుంచే పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళ ప్రత్యేక తరగతులు ప్రారంభించారు. ఈ యేడు జనవరి 22 నుంచి 40 రోజుల ప్రత్యేక యాక్షన్ ప్లాన్ను రూపొందించారు. క్విజ్ల ఏర్పాటు, ఉపాధ్యాయుల దత్తత, సమీప అధికారుల పరిశీలన తదితర కార్యక్రమాలు ఇప్పటికే సత్ఫలితాలిస్తున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నడుస్తుండటంతో సాయంత్రం వేళ టీ, టిఫిన్ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. సోమవారం రవ్వ ఉప్మా, మంగళవారం ఒక్కో విద్యార్థికి 3 గారెలు, బుధవారం టమాటా బాత్, గురువారం 3 వడలు, శుక్రవారం సేమియా ఉప్మా, శనివారం అటుకుల ఉప్మా(పోవ)లతోపాటు ప్రతిరోజూ విద్యార్థులందరికి టీ ఇవ్వాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే గతంలో కొన్ని పాఠశాలల్లో హెచ్ఎంలు స్థానికంగా ఉన్న దాతల సహకారంతో టీ, స్నాక్స్ అందించారు. అక్షయ పాత్ర ఉన్నచోట వారి సహాయ సహకారాలు తీసుకున్నారు. కాగా ఈసారి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు మెనూ ప్రకారం టీ, టిఫిన్లు అందించాలని, రోజువారీ విద్యార్థుల హాజరు, టిఫిన్ల వివరాలను శనివారం నుంచే విద్యాధికారులకు పంపాలని ఆదేశించారు. ఇందుకు మధ్యాహ్న భోజన ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీలను ఉపయోగించుకోవాలని, వారికి కొంతమేర బిల్లులు చెల్లిస్తామని తెలిపారు. అయితే ఒక్కో విద్యార్థికి ఎంత మొత్తంలో చెల్లిస్తారన్న విషయంపై స్పష్టత లేనట్లు తెలుస్తోంది. ఒక్కో విద్యార్థికి రోజుకు సుమారు రూ.5 చొప్పున చెల్లించే అవకాశం ఉన్నట్లు సమాచారం. జిల్లాలో 556 ఉన్నత పాఠశాలలు ఉండగా, 30 వేల మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. అయితే ప్రస్తుతం 124 పాఠశాలల్లో 26.089 మంది విద్యార్థులకు టీ, టిఫిన్లు అందించనున్నారు. బిల్లులు లేవు... రోజుకో టిఫిన్ ఎలా చేయాలి? 9,10 తరగతి విద్యార్థులకు సంబంధించిన మధ్యాహ్న భోజన బిల్లులు సుమారుగా మూడు నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు రోజుకో టిఫిన్ ఎలా చేయాలని ఏజెన్సీ మహిళలు ప్రశ్నిస్తున్నారు. వడలు, గారెలు తయారుచేయడం వ్యయప్రయాసలతో కూడుకున్న పని అని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తుండగా, మరికొంతమంది మహిళలు మాత్రం వడలు, గారెలు తమకు చేయరాదని చేతులెత్తేస్తున్నారు. వడలు, గారెలు తయారు చేయాలంటే ఎంతలేదన్న ఒక్కో విద్యార్థికి రూ.15 వరకు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. ఇప్పటికే రోజూ ఉదయం 8 గంటలకు వచ్చి సాయంత్రం 3 గంటల వరకు పనిచేస్తున్నామని, కాని తమకు రూ.1,000 మాత్రమే గౌరవ వేతనంగా చెల్లిస్తున్నారని, అవికూడా సమయానుకూలంగా రావడం లేదని ఆరోపిస్తున్నారు. ఇటీవల మధ్యాహ్న భోజనం రేట్లు పెంచినప్పటికీ ఆశించిన స్థాయిలో తమకు గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు. కాగా అటు ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ మహిళల నిరాసక్తత, ఇటు పథకం అమలుపై హెచ్ఎంలు తలలు పట్టుకుంటున్నారు. ఏజెన్సీ మహిళలే టిఫిన్లు అందించాలి విద్యార్థుల భవిష్యత్తును, మంచి ఫలితాలను ఆశించి చేపట్టిన ఈ బృహత్ పథకాన్ని ఏజెన్సీ మహిళలే నిర్వహించాలి. త్వరలో వాటి రేట్లు ప్రకటిస్తాం. ఒక్కో విద్యార్థికి సుమారు రూ.5లకు పైగా చెల్లించే అవకాశం ఉంది. అవసరమైతే హెచ్ఎంలు ముందుకు వచ్చి దాతల సహకారం తీసుకోవాలి. పథకాన్ని జయప్రదం చేయాలి. -సామెల్, డిప్యూటీఈఓ -
ఆన్లైన్లో ఉద్యోగుల సమాచారం
కలెక్టరేట్, న్యూస్లైన్: ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. అటెండర్ మొదలు ఉన్నత ఉద్యోగి వివరాలను ఇక ఆన్లైన్లో లభ్యంకానున్నాయి. అంతేకాకుండా అన్నింటికి ఇవే ప్రామాణికంకానున్నాయి. కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం(సీఎఫ్ఎంఎస్) నిర్వహణలో భాగంగా కలెక్షన్ ఆఫ్ డేటా ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ హెచ్ఆర్ఎంఎస్(మానవ వనరుల నిర్వహణ వ్యవస్థ), హెల్త్కార్డుల జారీకి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 24లోగా ఉద్యోగుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వివరాల నమోదు బాధ్యతను ఆయా శాఖల్లో ఉద్యోగుల జీతాల బిల్లులు పెట్టే డ్రాయింగ్ ఆఫీసర్లు చేపట్టాలని ఆదేశించారు. జనవరి 5లోగా నమోదు చేయకుంటే డ్రాయింగ్ ఆఫీసర్ల జీతాలు నిలిపివేయాలని ట్రెజరీకి ఆదేశాలందాయి. ఈ వివరాలే ప్రామాణికం.. ఇక నుంచి ఈ వివరాలనే ప్రామాణికంగా తీసుకుంటారు. ఉద్యోగి విధుల్లో చేరినప్పటి నుంచి ఉన్న సర్వీసు రిజిస్టర్ మొత్తం అందులో పొందుపరచాలి. కుటుంబ సభ్యులు, చిరునామా, వేతనం తదితర వివరాల నమోదును ట్రెజరీశాఖ పర్యవేక్షిస్తుంది. జిల్లాలో 29 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. ఇందులో 1900 మంది గెజిటెడ్, 23 వేల మంది నాన్గెజిటెడ్, 4100 మంది నాలుగోతరగతి ఉద్యోగులుంటారు. కాంట్రాక్ట్, ఎయిడెడ్ ఉద్యోగులు కలిపి సుమారు నాలుగు వేల మంది ఉంటారు. ఉద్యోగులకు సంబంధించిన వివరాలేవైనా ప్రభుత్వానికి అవసరమైనా ఆన్లైన్లోనివే తీసుకోనుంది. నగదు రహిత వైద్యం అందించేందుకు ప్రవేశపెట్టిన హెల్త్కార్డుల విధానానికి ఉద్యోగి వివరాలతో పాటు వారి కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్లు, ఫొటోలు తదితర వాటిని ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇచ్చాకే హెల్త్కార్డులు మంజూరు చేస్తారు. అయితే మెజార్టీ ఉద్యోగులు హెల్త్కార్డులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదు. ప్రస్తుతం అలాంటి వారి వివరాలు ఆన్లైన్లో నమోదైతే వారికి ఈ ప్రాతిపదికనే కార్డులు మంజూరు చేయనున్నారు. ఈ విషయమై ట్రెజరీ శాఖ డీడీ ఎల్ వెంకన్నగౌడ్ మాట్లాడుతూ ఇప్పటికే డ్రాయింగ్ ఆఫీసర్లకు సూచనలిచ్చామని, ఆన్లైన్లో ఉద్యోగుల వివరాలను నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.