Kanna Laxmi Narayana
-
ఇంకా ఎన్నాళ్లు ఈ ముసుగు కన్నా?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్కు లేఖ రాయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ఈమేరకు సోమవారం తన ట్విటర్ ఖాతాలో.. కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు కోవర్టు అని మళ్లీ స్పష్టమైందని ఎద్దేవా చేశారు. సొంత పార్టీ అభిప్రాయానికి వ్యతిరేకంగా చంద్రబాబుకు అనుకూలంగా రాజధాని బిల్లు ఆమోదించవద్దని గవర్నర్కు లేఖ రాశారని విమర్శించారు. దీనితో పార్టీ అధిష్టానం ఆగ్రహానికి గురయ్యారని వ్యాఖ్యానించారు. ఇంకా ఎన్నాళ్లు ఈ ముసుగు కన్నా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (వ్యవస్థలను నాశనం చేయడం మీకు కొత్త కాదుగా!) చదవండి: (ఏం చేసినా చిట్టినాయుడు స్టైలే వేరు..) -
టీడీపీ గొప్పలు చెప్పుకుంది: కన్నా
సాక్షి,విజయవాడ: అవినీతి కేసులో మాజీమంత్రి, టీడీపీఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్ట్ కావడాన్ని బీజేపీ స్వాగతిస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చట్టానికి ఎవరు అతీతులు కాదని తెలిపారు. తాము పారదర్శక పాలన అందించామని టీడీపీ గొప్పలు చెప్పుకుందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు అరెస్టులు అక్రమమని ఘోషిస్తోందని, అవినీతి చేయకపోతే టీడీపీ నేతలకు భయమెందుకని తీవ్రంగా ప్రశ్నించారు. (జేసీ ప్రభాకర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్) అవినీతి పరులకు శిక్ష తప్పదని, టీడీపీ హయాంలో రాజధానిలో ఇంసైడర్ ట్రేడింగ్ జరిగిందని కన్నా అన్నారు. పోలవరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని తెలిపారు. పోలవరంలో నిధులు పక్కదారి పట్టాయని, టీడీపీ అవినీతిపై బీజేపీ పెద్ద ఎత్తున పోరాటం చేసిందని కన్నా గుర్తుచేశారు. ఇక ఈఎస్ఐ కుంభకోణం కేసులో ఏ2గా ఉన్న అచ్చెన్నాయుడికి ఏసీబీ న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.(‘రాష్ట్రంలో అరెస్టుల పర్వం మొదలైంది’) -
'తప్పును ఒప్పుకొని లెంపలేసుకుంటే బాగుంటుంది'
సాక్షి, విజయవాడ : తప్పును ఒప్పుకొని లెంపలు వేసుకుంటే బాగుంటుదని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణను ఉద్దేశించి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. మీ పార్టీ నిర్ణయాన్ని మా ప్రభుత్వానికి అంట కట్టవద్దంటూ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ' వైఎస్సార్సీపీ ప్రభుత్వం తప్పు ఎప్పుడు..ఎక్కడ జరిగిందనేది పూర్తి ఆధారాలతో బయటపెట్టింది. ఆనాడు తప్పుడు నిర్ణయం తీసుకున్న మీ పార్టీ నేతలకు ప్రజలే చెంపదెబ్బలే వేస్తారు. టీటీడీ ఆస్తులను మా ప్రభుత్వమే సంరక్షిస్తుంది. మీ రాజకీయ మనుగడ కోసం, పదవి కాపాడుకోవడానికి భక్తులను, ప్రజలను గందరగోళానికి గురి చేసింది మీరు. మీ పార్టీ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు మంత్రిగా ఉన్న సమయంలో టీటీడీ కమిటీలో సభ్యుడిగా ఉన్న బీజేపీకి చెందిన నేత ఈ నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ భూముల అమ్మకాలను నిలుపుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఈ అంశాన్ని పునఃపరిశీలించాలనే నిర్ణయం తీసుకున్నట్లు' పేర్కొన్నారు. మత పెద్దలు, భక్తులు, ఇతరుల అభిప్రాయం తీసుకోవాలని వైసీపీ ప్రభుత్వం టీటీడీ బోర్డుకు సూచించినట్లు వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. -
'దిక్కుమాలిన రాజకీయాలు మానుకుంటే మంచిది'
సాక్షి, విజయవాడ : విజయవాడ కనక దుర్గమ్మ వారధి వద్ద వలస కార్మికులకు ఏర్పాటు చేసిన ఆహార పంపిణీ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వలస కూలీలకు ఆహరం అందజేశారు. అనంతరం మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. ' వలస కూలీలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శ్రామిక్ రైళ్లు, బస్సులు ద్వారా వారిని స్వస్థలాలకు చేరుస్తున్నాం. వలస కార్మికులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనుక్షణం ఆలోచిస్తున్నారు. వలస కూలీలపై కొన్ని ప్రతిపక్ష పార్టీలు అనవసర రాజకీయాలు చేయాలని చూస్తున్నాయి. ('వలస కూలీలు ఇకపై ఇబ్బంది పడకూడదు') కన్నా లక్ష్మీ నారాయణ లెటర్లు రాసి బురద చల్లాలని చూస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వలస కార్మికులు భరోసా ఇచ్చారా....? జూమ్ యాప్ ,టెలీ కాన్ఫరెన్స్ల పేరుతో హైదరాబాద్లో ఉండి హడావిడి చేస్తున్నారు. కార్మికుల, శ్రామికుల పార్టీలు అని చెప్పుకునే వామపక్షాలు సైతం కుటిల రాజకీయాలు చేస్తున్నాయి. బెంగాల్ వలస కార్మికులను రెచ్చగొడుతున్నారు. బెంగాల్ రాష్ట్ర సీఎం మమతను వలస కార్మికులను తమ రాష్ట్రంలోకి అనుమతించాలంటూ లేఖ పంపాము.. వారి నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు. ఒక గంట సేపు దీక్ష చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వలస కూలీలకు మంచినీళ్లు అయినా ఇచ్చారా?. విద్యుత్ చార్జీలపై ప్రభుత్వం ఒక్క పైసా కూడా పెంచలేదు. రెండు నెలల బిల్లులు ఒకేసారి రావడంతో ప్రజలు అధికంగా వచ్చాయన్న బావన లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో పనిచేసే తోక పార్టీల నాయకులు కరెంటు బిల్లులపై ప్రజలను తప్పదోవ పట్టిస్తున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో ఎవరు ఉన్నారని వీడియో కాన్ఫరెన్స్ లు పెడతారు... రెండు చోట్ల ఓడిపోయిన నాయకుడు పవన్ కల్యాణ్.టీడీపీ హయాంలో అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. విపత్తు సమయంలో సైతం జగన్ రైతులకు అండగా నిలిచారు. రైతు భరోసా ఇచ్చి వారిలో దైర్యాన్ని నింపారు. రైతు భరోసా కేంద్రాలు అందుబాటులోకి తీసుకు వచ్చారు. రూ.3 వేల కోట్లతో రైతుల కోసం మూలనిధి ఏర్పాటు చేశారు. రైతు భరోసా రూపంలో ఒక్కో రైతుకు వారి ఖాతాల్లో రూ. 5500 జమచేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కన్నా లక్ష్మీనారాయణలు దిక్కుమాలిన రాజకీయాలు మానుకోవాలి' అంటూ తెలిపారు. -
ప్రమాణానికి రెడీ..
-
అవినీతి చేయలేదని కన్నా ప్రమాణం చేస్తారా?
-
మొదటి ముద్దాయి చంద్రబాబు: జీవీఎల్
న్యూఢిల్లీ: రాజధాని ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు మరోసారి స్పష్టం చేశారు. శివరామకృష్ణన్ కమిటీ వద్దని చెప్పినా గత టీడీపీ ప్రభుత్వం అమరావతిలో రాజధాని ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. మంగళవారం జీవీఎల్ విలేకరులతో మాట్లాడుతూ.. అమరావతి విషయంలో చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. నాడు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని తాము డిమాండ్ చేశామని.. అయితే చంద్రబాబు అందుకు ఒప్పుకోలేదని తెలిపారు. ఇప్పుడేమో ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని టీడీపీ నేతలు అంటున్నారని దుయ్యబట్టారు. తాము పెద్దన్నగా వ్యవహరిస్తే 23 మంది ఎమ్మెల్యేలున్న టీడీపీ దద్దమ్మ పాత్ర పోషిస్తుందా అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు హైకోర్టు ఏర్పాటుకు తాము పూర్తిగా సహకారం అందిస్తామన్నారు. మొదటి ముద్దాయి చంద్రబాబు ‘రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్పై విచారణకు ఆదేశించాలి. అమరావతిలో నాలుగేళ్లలో నాలుగు బిల్డింగులు కూడా కట్టని చంద్రబాబు చేతగాని వ్యక్తి. చంద్రబాబుది దద్దమ్మ ప్రభుత్వం. అందువల్లే అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేయలేదు. అమరావతిలో మొదటి ముద్దాయి చంద్రబాబు. అమరావతి పేరుతో సేకరించిన నిధులు స్వాహా చేశారు. అమరావతిలో వేల కోట్లు దుర్వినియోగం చేశారు’ అని టీడీపీ అధినేత చంద్రబాబు తీరును జీవీఎల్ ఎండగట్టారు. కాగా రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని.. అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయాన్ని తాము సమర్థిస్తున్నట్లు జీవీఎల్ గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే.(3 రాజధానులు: జీవీఎల్ కీలక వ్యాఖ్యలు) అభివృద్ధి వికేంద్రీకరణ మా సిద్ధాంతం.. అభివృద్ధి వికేంద్రీకరణ తమ సిద్ధాంతమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధే తమ మొదటి ప్రాధన్యత అని పేర్కొన్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుకు సహకరిస్తామని తెలిపారు. అమరావతిని చంద్రబాబు రియల్ ఎస్టేట్కు అడ్డాగా మార్చారని మండిపడ్డారు. జనసేనతో కలిసి తాము పోరాటం చేస్తామని... రాజధాని నిర్మాణానికి అదనంగా సేకరించిన భూములు వెనక్కి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబుకు నమస్కరిస్తున్నా: చెవిరెడ్డి సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం అమరావతి దుస్థితికి బాబే కారకుడు! -
మహిళా జర్నలిస్టులపై దాడి
-
రైతుల ముసుగులో జర్నలిస్టులపై దాడి
సాక్షి, ఉద్దండరాయునిపాలెం : ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దీక్ష కవరేజ్ చేస్తున్న జర్నలిస్టులపై కొందరు వ్యక్తులు దాడికి దిగారు. ఓ చానల్కు చెందిన మహిళా జర్నలిస్ట్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. మరో మీడియా ప్రతినిధిపైనా కూడా దాడి చేశారు. మీడియా ప్రతినిధులపైన దాడిని అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై కూడా కొందరు దాడికి తెగబడినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఓ మీడియా వాహనానం అద్దాలను కర్రలతో ధ్వంసం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మీడియా ప్రతినిధుల మీద రైతులు ముసుగులో కొందరు కావాలనే దాడి చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రైతుల ముసుగులో అసాంఘిక శక్తులు ప్రవేశించాయని పోలీసులు అనుమానిస్తున్నారు. శాంతి భద్రతల సమస్యను సృష్టించేందుకు కుట్ర చేశారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ చేపడతున్నారు. అమరావతి ప్రాంతంలో ఏదో జరిగిపోతుందనే తప్పుడు సంకేతాలను పంపించే ఉద్దేశంతోనే.. పథకం ప్రకారం మీడియా ప్రతినిధులపైన దాడి జరిగిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, టీడీపీ నాయకులే అమరావతిలో రైతులతో ఉద్యమం చేపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు మీడియా ప్రతినిధులపైన దాడిని జర్నలిస్టు సంఘాలు ఖండిస్తున్నాయి. గతంలో తాము చాలా సార్లు ఈ ప్రాంతంలో వార్తలు కవర్ చేశామని.. కానీ రైతులు ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదని పలువురు జర్నలిస్టులు తెలిపారు. మీడియా ప్రతినిధులపై దాడి చేసింది రైతులు కాదని వారు అభిప్రాయపడుతున్నారు. -
చంద్రబాబు డైరెక్షన్.. కన్నా యాక్షన్
సాక్షి, కోవూరు: ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అబద్ధాల కోరు. చంద్రబాబునాయుడు డైరెక్షన్లోనే ఆయన యాక్షన్ చేస్తున్నారు’ అని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి అన్నారు. మండలంలోని పడుగుపాడు గ్రామంలో ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ విధివిధానాలు కన్నాకు తెలియదని, అలాంటి వ్యక్తి చేతికి బీజేపీ రాష్ట్ర బాధ్యతలు అప్పగించడం దారుణమన్నారు. రాష్ట్రంలో, జిల్లాలో బీజేపీ నాయకులంటే తమకు, తమ పార్టీ నాయకులకు గౌరవం ఉందన్నారు. అయితే లక్ష్మీనారాయణ వంటి వ్యక్తుల వల్ల ఆ గౌరవం సన్నగిల్లుతోందన్నారు. కన్నాకు గుంటూరులో రౌడీగా ముద్ర ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయాలు, గ్రామ వలంటీర్ల విధివిధానాలను అపహాస్యం చేస్తూ కన్నా రాష్ట్ర గవర్నర్కు వినతిపత్రం ఇవ్వడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. ఖజానాను ఖాళీ చేసి అప్పుల ఊబిని తమ పార్టీకి అప్పగించడం జరిగిందన్నారు. దానిని ఒక సవాల్గా స్వీకరించి ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్లేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు. ఇతర దేశాల ప్రతినిధులతో పారిశ్రామికవేత్తలతో సమావేశాలు ఏర్పాటుచేసి ఏ ప్రాంతంలో ఎటువంటి పరిశ్రమలు ఏర్పాటుచేయాలనే ఆలోచనతో ముందుకెళుతున్నట్లు చెప్పారు. చంద్రబాబు లాంటి నీచరాజకీయాలు చేసే వ్యక్తితో కన్నా చేయి కలపడం దారుణమన్నారు. చంద్రబాబు, కన్నా వల్ల రాష్ట్ర ప్రజలకు ఏమి ఒరగదన్నారు. ఎవరెన్ని డ్రామాలు ఆడినా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోలేరన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దీంతో లక్షలాదిమందికి లబ్ధి చేకూరుతుందన్నారు. సమావేశంలో కాటంరెడ్డి దినేష్రెడ్డి, ఆర్.మల్లికార్జున్రెడ్డి, డి.నిరంజన్బాబురెడ్డి, మండల కన్వీనర్ నలుబోలు సుబ్బారెడ్డి, ఎస్కే అహ్మద్, సొసైటీ అధ్యక్షులు ములుమూడి సుబ్బరామిరెడ్డి, ఎస్.నరసింహులురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్, జనసేన నేతలు బీజేపీలో చేరిక
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా మైదుకూరు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మల్లికార్జున మూర్తి, కృష్ణా జిల్లా జనసేన కన్వీనర్ పాలడుగు డేవిడ్ రాజు ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో బీజేపీలో చేరారు. పార్టీలో చేరినవారిలో మరో 10 మంది న్యాయవాదులు ఉన్నారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బీజేపీ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ అని, ప్రభుత్వపరంగా మోదీ, పార్టీ పరంగా అమిత్ షా కలిసి నడిపిస్తున్నారన్నారు. నేడు ప్రాంతీయ పార్టీల్లో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయన్నారు. రాష్ట్రంలో టీడీపీ, వైఎస్సార్సీపీలతో ప్రయోజనం లేదని ప్రజలు గుర్తిస్తున్నారన్నారు. దేశ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని నమ్మి మోదీకి పట్టం కట్టారని చెప్పారు. -
టీడీపీతో పొత్తు పెట్టుకొని నష్టపోయాం: బీజేపీ
సాక్షి, గుంటూరు : టీడీపీ, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు గురువారం బీజేపీలో చేరారు. వీరిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ పార్టీ కండువా కప్పి ఆహ్మనించారు. కేంద్రంలో మోడీ పరిపాలనకు ప్రజలు ఆకర్షితులవుతున్నారని, అందుకే అధిక సంఖ్యలో బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. పేదరిక నిర్మూలనే బీజేపీ సిద్దాంతామని పేర్కొన్నారు. పార్టీ సభ్యత్వాల సంఖ్యను ఈసారి మరింత పెంచగలిగామని, టీడీపీలో జరిగిన అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకొని రెండు సార్లు నష్టపోయామని, ఇక నుంచి స్వయంగానే ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. -
హోదా ఇవ్వడం జరిగేది కాదు : కన్నా
సాక్షి, గిద్దలూరు(ప్రకాశం) : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం జరిగేది కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం కర్నూలు నుంచి విజయవాడ వెళ్తూ మార్గంమధ్యలో గిద్దలూరు నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జి పిడతల సరస్వతి నివాసానికి వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదని ఎప్పుడో చెప్పారని, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రత్యేక హోదాకు మించి ప్రత్యేక ప్యాకేజీ నిధులు ఇచ్చామన్నారు. ఆ నిధులను అప్పటి ప్రభుత్వం ఇష్టానుసారంగా ఖర్చు చేసి రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్నారు. అందుకే వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారన్నారు. ప్రస్తుతం టీడీపీ భయంగా బతుకుతోందన్నారు. గత ప్రభుత్వం అవినీతి చేస్తే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన కన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రాస్తే తప్పకుండా విచారణ చేయిస్తామన్నారు. ప్రతిపక్ష పాత్ర పోషించలేక టీడీపీ ఇబ్బంది పడుతోందని, రాష్ట్రంలో బీజేపీనే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోందన్నారు. మంచి ప్రతిపక్షంగా ఉంటూ రాష్ట్రంలో ప్రజల అభిమానాన్ని సంపాదించి 2024లో వైఎస్సార్సీపీకి ప్రధాన పోటీగా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఉందని, రాచర్ల గేటులో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని పిడతల సరస్వతి కన్నాను కోరారు. కన్నా లక్ష్మీనారాయణతో పాటు నంద్యాల మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి, జిల్లా ఇన్చార్జి శశిభూషణ్రెడ్డి, పలువురు నాయకులు ఉన్నారు. -
‘భారతీయుడినని సగర్వంగా చెప్పుకునేలా చేశాడు’
సాక్షి, పశ్చిమ గోదావరి: ‘జమ్మూకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణ 370, 35ఏను రద్దు చేసి దేశమంతటా ఒకే రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకువచ్చిన ధీరుడు ప్రధాని నరేంద్ర మోదీ’ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం పోడూరు మండలం వేడంగిలో బీజేపీ సభ్యత్వ నమోదులో కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి ఒక్కరు భారతీయుడు అని సగర్వంగా చెప్పుకునే విధంగా మోదీ సుపరిపాలన అందిస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్చి తామే వాటిని అమలు చేసినట్లు దుష్ప్రచారం చేసిందని టీడీపీని విమర్శించారు. పైగా ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నాయకులు అందినకాడికి ప్రజలను దోచుకున్నారని మండిపడ్డారు. -
మమతా బెనర్జీ హత్యా రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నారు
-
ఆమెను చంద్రబాబు సమర్థిస్తారా?
సాక్షి, విజయవాడ: పశ్చిమ బెంగాల్లో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా చేపట్టిన ర్యాలీపై తృణముల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన రాళ్ల దాడికి నిరసనగా విజయవాడలో బీజేపీ నేతలు, కార్యకర్తలు బుధవారం నిరసన చేపట్టారు. డౌన్ డౌన్ మమతా బెనర్జీ అంటూ నినాదాలు చేశారు. ఈ ధర్నాలో బీజేపీ ఏపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణతో పాటు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. అమిత్ షాపై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. మమతా బెనర్జీ హత్యా రాజకీయాల్ని ప్రోత్సహిస్తోందని, వెంటనే ఆమెపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మమతా బెనర్జీని సమర్ధిస్తున్న చంద్రబాబు నాయుడిపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు రాజకీయ దొంగలంతా ఏకమయ్యారని ఆరోపించారు. ప్రతిపక్షాలు ఎన్నికుట్రలకు పాల్పడినా ప్రజలు బీజేపీకే పట్టం కట్టనున్నారని వ్యాఖ్యానించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : మమతా బెనర్జీ హత్యా రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నారు -
‘మమతా బెనర్టీని అరెస్ట్ చేయండి’
సాక్షి, విజయవాడ: ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై జరిగిన దాడికి నిరసనగా దేశ వ్యాప్తంగా బీజేపీ నేతలు ఆందోళన నిర్వహిస్తున్నారు. అమిత్ షాపై రాళ్ల దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మమత బెనర్జీ హింసద్వారా గెలవాలని ప్రయత్నిస్తున్నారని, దేశంలో ప్రజాస్వామ్యాం ఉందా అనిపిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. వెంటనే దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోని, బెంగాల్ సీఎం మమతా బెనర్జీని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రాగానే రాష్ట్రాలు వారి జాగీరుగా భావిస్తున్నాయని తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యాంలో ఇది మంచి పరిణామం కాదన్నారు. బీజేపీపై ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని, అయినా ప్రజలు బీజేపీకే మద్దతు ఇవ్వబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి రాబోతుందని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. -
‘టార్గెట్ పెట్టి మరీ మద్యాన్ని అమ్మిస్తున్నారు’
సాక్షి, గుంటూరు : మద్యం వల్ల అత్యాచారాలు, కిరాయి హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని, టార్గెట్లు పెట్టి మరీ ప్రభుత్వాలు మద్యాన్ని అమ్మిస్తున్నాయని వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో.. దశలవారీగా మద్యనిషేధం అమలుపై చర్చా వేదికలో మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన సమాజం ఉన్న దేశాలు ఆర్థికంగా ముందుకు వెళ్తున్నాయని అన్నారు. ఎన్నికల్లో మద్యం పంపిణీ వల్ల చిన్న పిల్లలు సైతం మద్యానికి బానిసలవుతున్నారని పేర్కొన్నారు. మద్యంపై అందరికీ అవగాహనం కలిగించినప్పుడే మార్పు వస్తుందని, వైఎస్ జగన్ దశలవారీగా మద్యపాన నియంత్రణ చేస్తానన్నారని పునరుద్ఘాటించారు. ఇదే కార్యక్రమాని హాజరైన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. ‘అప్పట్లో ఎన్టీఆర్ మద్యనిషేధం చేస్తానంటే మహిళలు చాలా ఆనందించారు. కానీ ఇప్పటి ప్రభుత్వాలు మద్యాన్ని హోమ్ డెలివరీ చేసే వరకు దిగజారాయి. అనంతపురంలో మంచి నీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే, మద్యం వల్ల ప్రభుత్వం రూ.244 కోట్లు ఆదాయం పొందింది. ఆ డబ్బుతో మంచి నీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం తన ఖజానాలో వేసుకుంది. చిన్నపిల్లలు సైతం తాగుడుకు అలవాటు పడుతున్నారు.. తల్లిదండ్రులు కూడా పిల్లలను గమనిస్తూ వుండాలి. అందరూ బాధ్యతతో వ్యవహరిస్తే మద్యాన్ని నిర్మూలించవచ్చ’న్నారు. మాజీ సీఎస్ అజేయ కల్లం మాట్లాడుతూ.. ‘మద్యపానం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ప్రభుత్వాలు మద్యాన్ని ఆదాయ వనరుగా చూడకూడదు. సమాజం మీద బాధ్యత లేనట్టు వ్యహరించకూడదు. మద్యపాన నిషేధంపై స్వచ్చంద సంస్థలు పోరాటం చేయాలి. దశలవారీగా మద్యపాన నిషేధంపై సమగ్ర చర్చ జరగాలి’ అని పేర్కొన్నారు. ‘మద్యం వల్ల చిన్న చిన్న కుటుంబాలు మరింతగా ఛిన్నాబిన్నం అవుతున్నాయి. డ్రైవర్లు తాగి వాహనం నడిపితే ఎన్నో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. రోడ్డుప్రమాదాలపై సమీక్ష చేస్తే మద్యం వల్ల జరుగుతున్న ప్రమాదాలే ఎక్కువని తేలాయి. మద్యపాన నిషేధం అమలు చేయలేరా? అని నన్ను చాలామంది అడుగుతుంటారు. పాలకులకు చిత్తశుద్ధి ఉంటే కచ్చితంగా అమలు చేయవచ్చ’ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. -
కలెక్టర్లపై పొగడ్తలు.. అనుమానాలకు తావు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై బీజేపీ ఏపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మరోసారి మండిపడ్డారు. గుంటూరులో మంగళవారం కన్నా విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు పదేపదే ఈవీఎంలపై చేస్తోన్న గొడవ పలు అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. తనకు సంబంధించిన కలెక్టర్లను పెట్టుకుని ఎన్నికలను మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు. దానిని ఎదుటివారిపై రుద్దుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి తన రివ్యూలలో కలెక్టర్లను పొగడటం అనుమానాలకు తావిస్తోందన్నారు. 2014 ఎన్నికలు, నంద్యాల ఉప ఎన్నికల్లో చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఉండొచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులపై ఎన్నికల కమిషన్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర ఎన్నికల అధికారిని స్వయంగా వెళ్లి విచారణ జరపాలని కోరతామన్నారు. కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో చంద్రబాబు ప్రచారానికి వెళ్లి సోనియా గాంధీ, ఏపీని బాగా విభజించిందని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. సోనియాగాంధీ ఏపీని బాగా విభజించిందన్నందుకు ఆంధ్ర ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిత్యం అబద్ధాలాడే వ్యక్తి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉండటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలో మద్యం, డబ్బు విచ్చలవిడిగా పంపిణీ చేశారని ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని ఎన్నికల అధికారిని కోరితే ఇంతవరకూ స్పందించలేదని తెలిపారు. రూ.50 కోట్లు ఖర్చుపెట్టామని చెబుతున్న టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై ఈసీ ఎందుకు చర్యలు తీసుకోలేదని సూటిగా ప్రశ్నించారు. -
చంద్రబాబుది చింతామణి డ్రామా: కన్నా
అమరావతి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు స్టిక్కర్లు వేసుకుని ఏపీలో లబ్ధిపొందేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని బీజేపీ ఏపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. బుధవారం ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేదీని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, పార్టీ అధికార ప్రతినిధి విజయ్ బాబు, తదితరులు కలిసి ఫిర్యాదు చేశారు. సత్తెనల్లి నియోజకవర్గంలో పోలీసులే టీడీపీ తరపున డబ్బులు పంపిణీ చేస్తున్నారని ద్వివేదీకి వివరించారు. ఎన్నికల్లో టీడీపీ దురాగతాలకు అడ్డుకట్టవేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు చింతామణి డ్రామాని రక్తికట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుది బ్లాక్మెయిలింగ్ స్వభావమని, ముందుకాళ్లకి బంధం వేయటంలో ఆయన దిట్టని విమర్శించారు. తన పనిని సక్రమంగా నిర్వర్తిస్తోన్న ఈసీని బెదిరించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో డబ్బులు, మద్యం ఏరులైపారుతోందని చెప్పారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ పెద్ద డ్రామా క్రియేట్ చేసి సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ప్రభుత్వ అధికారులే టీడీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని, పోలీసు వాహనాలు, అంబులెన్స్ల్లో డబ్బులు తరలిస్తున్నారని చెప్పారు. బాబు ఓటమిని అంగీకరించారు: జీవీఎల్ చంద్రబాబు నాయుడు ఓటమిని ముందుగానే అంగీకరించారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాక్యానించారు. అధికార పార్టీ ద్వారా వేల కోట్ల నల్లధనం చేతులు మారుతోందని ఆరోపించారు. చంద్రబాబు దిగజారుడు మాటలు రాజకీయ దివాళా కోరుతనానికి నిదర్శనమన్నారు. హైకోర్టు చివాట్లు పెట్టినా బాబుకు బుద్ధి రాలేదని అన్నారు. రాష్ట్రపతి పాలనలో ఎన్నికలు జరిగితే పారదర్శకంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని జోస్యం చెప్పారు. పోలింగ్ రోజున కూడా టీడీపీ కుట్రలు పన్నే అవకాశముందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. -
ఇన్నాళ్లకు బాబుకు తత్త్వం బోధపడింది
సాక్షి, అమరావతి : ఇన్నాళ్లకు చంద్రబాబుకు తత్త్వం బోధపడినట్టు కనపడుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. బాబు సత్యాన్ని గ్రహించారు. రాబోయే ఎన్నికల్లో వెలువడే ఫలితాన్ని ముందుగానే అంచనావేశారు. ఇక తన అనుభవం ఈ రాష్ట్రానికి చాలునని చంద్రబాబు గ్రహించినట్టున్నారు. ఈ ఎన్నికల్లో తాను ఓడినంత మాత్రాన తనకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదంటూ.. తనకు ఫ్యామిలీ ఉందని, మనవడు కూడా ఉన్నాడని వేదాంతధోరణిని ఎత్తుకున్నారు. బీజేపీ నాయకుడు కన్నా లక్మీ నారాయణ.. చంద్రబాబు మాట్లాడిన వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘అదిరిందయ్య చంద్రం..! ఇన్నాళ్లకు మీ 40 ఏళ్ల అనుభవంతో మీ భవిష్యత్తు ని సరిగ్గా అంచనా వేసుకున్నారు.. తథాస్తు దేవతలు తప్పక మీ కోరిక నెరవేరుస్తారు. మీ విషయంలో ప్రజలు కూడా అదే భావనతో ఉన్నారు..మరో వారం తరువాత శాశ్వతంగా మీరు మనవడితో పూర్తి సమయం ఆడుకునే అవకాశం ఇవ్వబోతున్నారు.’అంటూ ట్వీట్ చేశారు. -
ఇన్నాళ్లకు బాబుకు తత్త్వం బోధపడింది
-
‘దొంగే.. దొంగ అని అరవటం బాబుకు అలవాటు’
సాక్షి, గుంటూరు : ప్రభుత్వానికి కొమ్ముకాస్తూ విధులు నిర్వహించిన ఇంటెలిజెన్స్ ఏడీజీ, ఐపీఎస్లపై ఈసీ వేటు వేయడంతో.. చంద్రబాబు ఈసీపై కక్షసాధించేందుకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. దొంగే దొంగ అని అరవటం చంద్రబాబుకు అలవాటైపోయిందన్నారు. స్వతంత్రంగా పనిచేసే ఎన్నికల కమిషన్కు నోటీస్ ఇవ్వడం అంటే అది రాజ్యాంగ వ్యతిరేకమని, చంద్రబాబు ఈసీని బ్లాక్మెయిల్ చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటినుంచి రాజ్యాంగ విరుద్దంగా పనిచేస్తూ అరాచకం సృష్టిస్తూనే ఉన్నారంటూ ఆరోపించారు. ఎన్నికల కమిషన్ టీడీపీపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఓ గాలి పార్టీ అని అది ఇప్పుడు డ్రామా కంపెనీగా మారిందంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని.. అలాంటి వ్యక్తి మరోసారి సీఎం అయితే ఈ రాష్ట్రానికే ప్రమాదమని పేర్కొన్నారు. చంద్రబాబు తాను చెప్పిందే జరగాలంటూ డిక్టేటర్లా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. -
ఆయనెవరో తెలుసా?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విటర్ వేదికగా ఆసక్తికరమైన చర్చకు తెరతీశారు. ఎన్నికల వేళ రాజకీయ వేడి పెంచేలా ట్విటర్లో ఆయన చేసిన పోస్ట్ వైరల్గా మారింది. ‘కేంద్రానికి లెక్కలు చెప్పం.. మీడియాకు నిజాలు చెప్పం.. అయినా నన్ను నమ్మండి ఎందుకంటే నాది కుప్పం.. ఇలా మాట్లాడే ఆయన ఎవరో తెలుసా??’ అంటూ కన్నా ఓ ప్రశ్నను నెటిజన్ల ముందుంచారు. అందుకు హింట్ అంటూ.. ‘వెన్నుపోటుకి వారసుడు.. యూ టర్న్కు దగ్గరి చుట్టం’ అని కూడా పేర్కొన్నారు. అంతేకాకుండా ఓ ఊసరవెల్లి ఫోటోను కూడా ఆయన పోస్ట్ చేశారు. కన్నా చేసిన కామెంట్లు ఓ రాజకీయ పార్టీని ఉద్దేశించి చేసినట్టుగా తెలుస్తుంది. కన్నా చేసిన ట్విట్పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. " ప్రజలకి సమాధానం చెప్పం.. కేంద్రానికి లెక్కలు చెప్పం.. మీడియాకి నిజాలు చెప్పం.. ఐనా నన్ను నమ్మండి ఎందుకంటే నాది కుప్పం..! " ఇలా మాట్లాడే ఆయన ఎవరో తెలుసా!?!?!? Hint :-వెన్నుపోటుకి వారసుడు.. U టర్న్ కి దగ్గరి చుట్టం.. pic.twitter.com/HCiIOD5bq5 — Kanna Lakshmi Narayana (@klnbjp) March 13, 2019 -
తక్షణమే ఏపీ డీజీపీని మార్చాలి
సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్న డేటాచోరీ కేసుపై ఏపీ బీజేపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీ మాధవ్ తదితరులు శుక్రవారం సీఈసీ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఆధార్, ఓటర్ జాబితా, ప్రభుత్వ పథకాల లబ్దిదారుల వివరాలను ఏపీ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగించిన వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ సేవామిత్ర యాప్లో ఏపీ ప్రజల ఓటార్ ఐడీ కార్డు వివరాలు, ఆధార్ వివరాలు ఉన్న విషయంపై జోక్యం చేసుకోవాలని, థర్డ్ పార్టీ విచారణ జరిపించి తక్షణం చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. (దేశం దాటిన డేటా చోరీ!) ఏపీ డీజీపీని మార్చాలి.. ఏపీలోని అధికార యంత్రాంగం టీడీపీకి తొత్తుగా వ్యవహరిస్తోందని కన్నా విమర్శలు గుప్పించారు. ఓట్ల తొగింపుపై సరైన విచారణ జరగకుండా ఎన్నికలు జరిగితే ఎన్నికల్లో న్యాయం జరగదని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితాలో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, ఏపీ డీజీపీని మార్చాలని డిమాండ్ చేశారు.కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ....ఓట్ల తొలగింపుపై థర్డ్ పార్టీ విచారణ జరపాలని ఈసీని కోరాం. నమోదు అయిన నకిలీ ఓట్లను ఈసీ తొలగించాలి. ఏపీ డీజీపీని తక్షణం మార్చాలి. రాష్ట్రంలో అధికార యంత్రాంగం టీడీపీ తొత్తులుగా మారిపోయారు. ఓట్ల తొలగింపుపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలి. ఓట్ల అక్రమాల జాబితా వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేయాలని అన్నారు. ఫారం-7 ఎవరైనా దాఖలు చేయొచ్చని ఎంపీ జీవీఎల్ పేర్కొన్నారు. దొంగ ఓట్లను తొలగించకుండా ఉండేందుకు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ తప్పుడు పనులు చేస్తోంది. ఆధార్ డేటా, ఎన్నికల సంఘం మాస్టర్ డేటాను చోరీ చేసి, రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ వాడుకుంటోంది. సీనియర్ అధికారులు టీడీపీ కార్యకర్తలుగా మారారు. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారు. డేటా చోరీపై ఎన్నికల సంఘం విచారణ జరపాలి. ఓటర్ల జాబితాలో అక్రమాలను సరిదిద్దాలి. ఏపీ డీజీపీ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షానికి చెందిన కార్యకర్తలను వేధిస్తున్నారని జీవీఎల్ ధ్వజమెత్తారు. -
ఏపీలో క్షీణించిన శాంతి భద్రతలు: కన్నా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు క్షీణించాయని బీజేపీ ఏపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. బుధవారం గవర్నర్ నరసింహన్తో కన్నా లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు. గవర్నర్ నరసింహన్ను కలిసిన అనంతరం మాట్లాడుతూ..ఏపీలో వ్యవస్థలన్నీ దిగజారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీ గ్రిడ్ అనే ఓ ప్రైవేటు కంపెనీ మీద ఫిర్యాదు చేస్తే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ పెద్దలు ఎందుకు స్పందిస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. ఈ విషయంలో ఏపీ పోలీసులు హైదరాబాద్ దాకా ఎందుకు వచ్చారో అస్సలు అర్ధం కావడం లేదని విమర్శించారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయి మా దగ్గరే ఉన్నాడని టీడీపీ చెప్పడం సిగ్గుచేటన్నారు. ఈ డేటా చోరీ కేసును నిస్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చట్టం తన పని తాను చేసుకోనీయకుండా ఏపీ ప్రభుత్వం అడ్డుపడుతోందని ఆరోపించారు. తనతో పాటు ఏపీ బీజేపీ నేతలంతా గవర్నర్ను కలిసి ఏపీ ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసినట్లు వివరించారు. ఎన్నికల కమిషన్ను కలుస్తామని తెలిపారు. ఈ డేటా చోరీ కేసు ఏపీ, తెలంగాణ సమస్య కాదని, 5 కోట్ల ఆంధ్రుల సమస్య అని వ్యాఖ్యానించారు. విషయాన్ని పక్కదారి పట్టించడానికి కుట్రలు సాగుతున్నాయని, టీడీపీ నాయకులు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. -
ఏపీలో అవినీతి,కుటుంబ పాలన
(విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ప్రతి విషయంలోనూ యూటర్న్లు తీసుకునే వ్యక్తి ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ ప్రాంత అభివృద్ధికి ఎలా పాటు పడతారో రాష్ట్ర ప్రజలే ఆలోచించుకోవాలని ప్రధాని మోదీ పరోక్షంగా సీఎం చంద్రబాబునుద్దేశించి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఏ నేతా, ఏ వ్యక్తి తీసుకోనన్ని యూటర్న్లు తీసుకున్న వ్యక్తి తన అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికే మోదీని తిట్టడానికే తన సమయాన్ని అంతా వెచ్చిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం విశాఖపట్నం రైల్వే గ్రౌండ్లో నిర్వహించిన ‘ప్రజా చైతన్యసభ– సత్యమేవ జయతే’ బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగించారు. ప్రధాని హిందీలో చేసిన ప్రసంగాన్ని బీజేపీ జాతీయ మహిళా మోర్చా ఇన్చార్జి దగ్గుబాటి పురందేశ్వరి తెలుగులోకి అనువాదం చేశారు. రాత్రి ఏడున్నరకు మోదీ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ సభికులతో మూడుసార్లు భారతమాతకు జై అని నినాదాలు చేయించారు. కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నంలో రైల్వే జోను ఏర్పాటుతోపాటు ఆంధ్రప్రదేశ్లో పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలను నెలకొల్పి యువత ఉపాధి కోసం పాటు పడుతుంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న వారు మాత్రం వారి పిల్లల అభివృద్ధి కోసమే పని చేస్తున్నారని మోదీ విమర్శించారు. ‘దేశం కోసం మేం గట్టి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామంటే మాకెటువంటి బెరుకు లేదు. ఒకవేళ నిర్ణయం తీసుకుంటే వెనక ఎవరైనా వచ్చి మా ఫైళ్లు తెరుస్తారనో, అవినీతి ఆరోపణలు చేస్తారనో భయం నాకే మాత్రం లేదు. ఇవాళ ఇక్కడ ఉన్న నాయకులు భయపడాలి. ఎందుకంటే వారు చేసిన అవినీతి వారిని ఎల్లప్పుడూ వెంటాడుతుంది. ఈ విషయం వారికీ తెలుసు. అవినీతి చేయడంలో, ముఖ్యమంత్రిగా ఉంటూ తన కుటుంబ ప్రయోజనాల కోసమే పనిచేసి తప్పు చేశారని వారికి తెలుసు’ అని దుయ్యబట్టారు. ‘నిత్యం అసత్యాలు చెబుతున్న వారు వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి తప్పులను మనపైకి నెడుతున్నారు. వారి బండారాన్ని మనమంతా తేటతెల్లం చేయాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు. ఆయన ఎలాంటి వారితో జతకట్టారో తెలుసా..? టీడీపీ–కాంగ్రెస్ స్నేహంపై మోదీ మాట్లాడుతూ æయూటర్న్ తీసుకున్న ఈ నాయకుడు ఎలాంటి వారితో జతకట్టారో రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడంతో పాటు రాష్ట్ర ప్రజల ఉనికిని సైతం దెబ్బతీసేలా వ్యవహరించిన వారితో జతకట్టారంటూ దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం గట్టి నిర్ణయాలు తీసుకుంటూ అవినీతికి తావు లేకుండా పేదలు, బలహీన వర్గాల కోసం పనిచేస్తుంటే కూటమి కట్టిన నాయకులు తమ ప్రభుత్వాన్ని కూల్చి వేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. దేశ ప్రజలంతా కూటమి నేతల కుటిల నీతిని గుర్తించారని చెప్పారు. పాక్కు గుణపాఠం చెబితే మోదీ హఠావో అంటారా? ప్రపంచ దేశాలన్నీ పాకిస్తాన్ని వేలెత్తి చూపుతున్న తరుణంలో దేశంలోని కొందరు నాయకులు మాత్రం శత్రు దేశానికి అనుకూలంగా మాట్లాడుతున్నారని మోదీ ఆరోపించారు. అలాంటి నేతలు మన సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే యత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నాయకులు మాట్లాడే మాటలను ఆ దేశంలోని పార్లమెంట్లో ప్రస్తావిస్తున్నారంటే పరిస్థితి ఏమిటో ప్రజలే గమనించాలని సూచించారు. అలా మాట్లాడుతున్న వారిని ప్రజలే ప్రశ్నించాలని కోరారు. వీరంతా దేశాన్ని ఎలా కించపరుస్తున్నారో ఆలోచించాలన్నారు. కేంద్రంలో బలహీనమైన ప్రభుత్వాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో ఉన్నారని ధ్వజమెత్తారు. మోదీని విరోధిగా చిత్రీకరించాలని చూస్తూ దేశాన్ని అస్థిరçపరిచే చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. పాకిస్తాన్కు గుణపాఠం చెబుతున్న తరుణంలో మోదీ హఠావో అనడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ అధికారమిస్తే మెరుగైన పాలన... దేశంలో బలమైన ప్రభుత్వం ఉన్నప్పుడే వీర జవానైనా, రైతులైనా సురక్షితంగా ఉంటారని ప్రధాని పేర్కొన్నారు. రైతుల ప్రగతిని దృష్టిలో పెట్టుకొని ప్రతి చిన్న, సన్నకారు రైతు ఖాతాలో నాలుగు నెలల కొకసారి రూ.రెండు వేల చొప్పున జమ చేస్తామన్నారు. మళ్లీ వచ్చే ఎన్నికల్లో కూడా తనకు మద్దతు ఇస్తే «ఇంతకంటే ధృడమైన, మెరుగైన పాలన అందిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ప్యాకేజీకి ఒప్పుకోలేదని కాణిపాకం వినాయకుడిపై ఒట్టేస్తారా? – సీఎం చంద్రబాబుకు కన్నా సవాల్ ఏపీకి ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ తీసుకోవడానికి ఒప్పుకోలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు కాణిపాకం వినాయకుడిపై ఒట్టేసి చెప్పగలరా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సవాల్ విసిరారు. విశాఖలో ప్రధాని పాల్గొన్న సభలో ఆయన మాట్లాడుతూ నాలుగున్నరేళ్లుగా చేసిన అవినీతిపై మోదీ ఎక్కడ చర్యలు చేపడతారోనని చంద్రబాబుకు భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. ఈ భయంతోనే ఆయన మానసికంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. మానసిక వ్యాధితో ఉన్నవారు ముఖ్యమంత్రిగా ఉండడానికి అనర్హులన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ను ఏర్పాటు చేయడంపై ఎంపీ హరిబాబు కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రధాని మోదీ రేపు విశాఖ రాక
సాక్షి, అమరావతి: ప్రధాని నరేంద్రమోదీ నెల వ్యవధిలోనే రెండోసారి రాష్ట్ర పర్యటనకు రానున్నారు. శుక్రవారం సాయంత్రం విశాఖపట్నం తాటిచెట్లపాలెం ప్రాంతంలోని రైల్వే గ్రౌండ్స్లో బీజేపీ ఏపీ శాఖ ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 10న ఆయన గుంటూరులో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సభతో పాటు వారం కిందట పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా రాజమండ్రి పర్యటనలో ఆశించిన స్థాయిలో జనం తరలిరావడంతో.. విశాఖ సభకు లక్ష మంది దాకా హాజరవుతారని పార్టీ నేతల అంచనా. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రెండు రోజులుగా విశాఖలో మకాంవేసి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. విశాఖలో కంభంపాటి హరిబాబు లోక్సభ సభ్యుడిగా, విష్ణుకుమార్రాజు ఎమ్మెల్యేగా, పీవీఎన్ మాధవ్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న నేపథ్యంలో సభను విజయవంతం చేసేందుకు వారు కృషిచేస్తున్నారని పార్టీ వర్గాలంటున్నాయి. అయితే భారత్–పాక్ సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని సభ వాయిదా పడే అవకాశాలేమైనా ఉన్నాయా.. అని కూడా పార్టీ ముఖ్యులు అనుమానిస్తున్నారు. -
బాబు అంత డ్రామా యాక్టర్ మరొకరు లేరు
విశాఖపట్నం: ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి లాంటి డ్రామా యాక్టర్ మరొకరు లేరని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. విశాఖపట్నంలో కన్నా విలేకరులతో మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ ఏపీకి ద్రోహం చేసిందని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు కాంగ్రెస్ను మించిన మంచిపార్టీ మరొకటి లేదంటున్నారు...ఏవిధంగా అర్ధం చేసుకోవాలో ప్రజలు గమనించాలన్నారు. చంద్రబాబు మతిస్థిమితం లేని వ్యక్తిగా మాట్లాడుతున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు. చంద్రబాబుకు బీజేపీ మీద బురద వేయటం, తీయటం అలవాటుగా మారిందన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇచ్చిన ప్రాజెక్టులను ఒక్కోటి వివరించి బాబుకు సవాల్ విసిరారు. ఎయిర్ఫోర్స్ సిబ్బందికి అభినందనలు పాక్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఇండియన్ ఎయిర్ఫోర్స్ సిబ్బందిని అభినందిస్తున్నట్లు తెలియజేశారు. ఇంకా సరిహద్దుల్లో వీరోచితంగా పోరాడుతోన్న వారికి మరోధైర్యం కలగాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. మార్చి 1న ప్రధాని సభ విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. మోదీ సభకు హాజరై ఆయన ఏమి మాట్లాడతారో అనే ఆసక్తి ప్రజల్లో ఉందన్నారు. విశాఖ రైల్వే జోన్ మీద ప్రకటన వస్తుందని ఆశిస్తున్నట్లు తెలియజేశారు. -
‘చంద్రబాబును తరిమే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన సహాయాన్ని బయటకు చెప్పకుండా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిత్తులమారి నక్కల వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. శనివారం ఏపీ బీజేపీ నేతలు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు. అనంతరం కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. రెండు దశాబ్దాలుగా ఉన్న విశాఖ రైల్వే జోన్ సమస్యను పరిష్కరించాలన్న తమ విజ్ఞప్తిపై మంత్రి గోయల్ సానుకూలంగా స్పందించారన్నారు. రైల్వే జోన్ అంశాన్ని పరిశీలిస్తామని గోయల్ చెప్పారన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వని నిధులను కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిందన్నారు. కేంద్రం చేసిన మేలును చంద్రబాబు తెలివిగా బయటకు రానివ్వడంలేదని ఆరోపించారు. విభజన చట్టంలోని 90 అంశాలను కేంద్రం పూర్తి చేసిందని తెలిపారు. పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం వందశాతం నిధులను ఇస్తుందని చెప్పారు. అన్ని నిధుల్లోనూ చంద్రబాబు కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. చంద్రబాబును ప్రజలు తరిమే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. హోదాపై రాహుల్ మోసం చేస్తున్నారు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మరోసారి మోసం చేస్తున్నారని కన్నా ఆరోపించారు. ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అంశాన్ని పరిశీలించమని మాత్రమే చట్టంలో ఉందన్నారు. వీరప్ప మొయిలీ అడ్డుకోవడంతోనే హోదా అంశాన్ని చట్టంలో పెట్టలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ది ఉంటే హోదా అంశాన్ని చట్టంలో పెట్టేదన్నారు. నరేంద్ర మోదీ హోదా అంశాన్ని ప్రకటించినట్లుగా వీడియో మార్ఫింగ్ చేసి చూపింస్తున్నారని మండిపడ్డారు. -
‘బాబు చేసిన తప్పులు కేంద్రం మీద వేస్తే ఎలా’
విశాఖపట్నం: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసిన తప్పులను కూడా కేంద్రం మీద నెట్టి వేస్తే ఎలా అని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ సూటిగా ప్రశ్నించారు. విశాఖలో కన్నా లక్ష్మీనారాయణ విలేకరులతో మాట్లాడుతూ.. మార్చి 1న న్యూ కాలనీ రైల్వే గ్రౌండ్స్లో పెద్ద ఎత్తున ‘ ప్రజా చైతన్య యాత్ర- సత్యమేవ జయతే’ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సభకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు. రాష్ట్రానికి నరేంద్ర మోదీ నాయకత్వంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను బహిరంగసభలో వివరిస్తారని చెప్పారు. 2019లో దేశానికి మోదీ రావాలన్న ఉద్దేశ్యంతో ప్రజలంతా రావాలని పిలుపునిచ్చారు. విశాఖ రైల్వే జోన్ ఖచ్చితంగా తెస్తామని వ్యాఖ్యానించారు. రైల్వే జోన్ కావాలన్న డిమాండ్తో బీజేపీ నేతలంతా రైల్వే మంత్రి పీయూష్ గోయల్ను రేపు కలుస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో పెట్టలేదని సూటిగా ప్రశ్నించారు. కేవలం పరిశీలించమని మాత్రమే పెట్టారని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పి ప్రజల ముందుకు రావడం కరెక్ట కాదని అభిప్రాయపడ్డారు. పోలవరం ముంపు ప్రాంతాలను కేబినేట్ ద్వారా నరేంద్ర మోదీ కలపకపోతే పోలవరం రాష్ట్రానికి ఒక కలగా ఉండిపోయేదన్నారు. -
‘వాటిని అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించారు’
సాక్షి, రాజమండ్రి : మార్చి ఒకటిన విశాఖలో బీజేపీ కార్యకర్తలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమవుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ తెలిపారు. ఈ సందర్భంగా శనివారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబుకు దమ్ముంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని సవాలు చేశారు. స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ) ఏర్పాటు చేస్తే రెవెన్యూ లోటు భర్తీ చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కన్నా తెలిపారు. చంద్రబాబు ప్యాకేజిని సమర్థించిన తీర్మానాలను అసెంబ్లీ రికార్డుల నుంచి తీసేశారని మండి పడ్డారు. టీడీపీ ఓ డ్రామా కంపెనీ అని.. చంద్రబాబులా తాము రోజుకో వేషం వెయ్యలేమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు.. ఏపీలో మాత్రం ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో ఒంటరిగానే పోటీ చేస్తామని కన్నా తెలిపారు. -
ఉగ్రవాద అంతమే మా లక్ష్యం
విజయవాడ: దేశంలో ఉగ్రవాదాన్ని సమూలంగా అంతం చేయటమే మా అంతిమ లక్ష్యమని బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ వ్యాఖ్యానించారు. గురువారం విజయవాడ నగరంలోని హోటల్ మురళీ ఫార్చ్యూన్లో బీజేపీ ఆధ్వర్యంలో భారత్ కే మన్ కీ బాత్ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన రాంమాధవ్, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణతో కలిసి చాంబర్ ఆఫ్ కామర్స్, లారీ ఓనర్స్ అసోసియేషన్, చార్టర్డ్ అకౌంటెంట్స్, వ్యాపారవర్గాలతో భేటీ అయ్యారు. అనంతరం రాంమాధవ్ విలేకరులతో మాట్లాడారు. కశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో అమరులైన సైనికులకు నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. వీర జవానుల కుటుంబాలను మా ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. మన్కీ బాత్.. మోదీ కే సాత్ పేరుతో విజన్ డాక్యుమెంట్ను రూపొందించామని వెల్లడించారు. మోదీ జగన్నాధ రథాన్ని ఎన్ని ప్రతిపక్షాలు కలిసినా ఆపలేరని వ్యాఖ్యానించారు. ఐదేళ్లపాటు అవినీతి, అసమర్థపాలన ఏపీలో కొనసాగిందని, మార్చిలో బీజేపీ విజన్ డాక్యుమెంట్(మ్యానిఫెస్టో) విడుదల చేస్తామని చెప్పారు. 85 శాతం హామీలు ఏపీలో అమలు చేశామని, కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం జరగకపోవడానికి ఏపీ ప్రభుత్వ జాప్యమే కారణమని వివరించారు. ఐదేళ్లలో చరిత్రాత్మక నిర్ణయాలు: కన్నా పేదరిక నిర్మూలనకు కృషి చేసిన వ్యక్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అని ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ కొనియాడారు. ఐదేళ్లలో ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలు మోదీ తీసుకున్నారని అన్నారు. వచ్చే ఐదేళ్లలో ఏపీకి ఏమి చెయ్యాలో చర్చించామని, అలాగే వివిధ రంగాల వారి సలహాలు కూడా తీసుకున్నట్లు చెప్పారు. -
నల్లచొక్కాతో చంద్రబాబు కొత్తవేషాలు
విశాఖపట్నం, మద్దిలపాలెం: అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నల్లచొక్కాతో సరికొత్త డ్రామాలు వేస్తున్నారని, అధికారమే పరమవ«ధిగా రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకు పడరాని పాట్లు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు.శుక్రవారం ఆయన పార్టీ నగర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్రాజుపై వాడిన పదజాలం ఆయన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి తగినట్టుగా లేదన్నారు. అసెంబ్లీ సాక్షిగా నాలుగున్నరేళ్ల క్రితం నరేంద్ర మోదీని కీర్తించి, అభినందిస్తూ తీర్మానంచేసిన బాబు నేడు ఎన్నికలలో రాష్ట్ర ప్రజలను దగా చేసేందుకు.. అదే నరేంద్ర మోదీమోసం చేసారని పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలో మోదీ, అమిత్షా సభలు ప్రధాని నరేంద్ర మోదీ రెండుసార్లు, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా మూడు సార్లు రాష్ట్రంలో పర్యటించనున్నారని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఈనెల 10న గుంటూరులో, 16న విశాఖలో జరిగే సభలకు మోదీ హాజరవుతారన్నారు. శక్తి కేంద్రాలను బలోపేతం చేయడానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈనెల 4న విజయనగరంలో జరిగే పార్లమెంట్ స్థాయి శక్తి కేంద్రాల సభ్యులతో సమావేశమవుతారన్నారు. అనంతరం పలాస నుంచి సత్యమేవ జయతే బస్సు యాత్రను ఆయన ప్రారంభిస్తారన్నారు. 19న ఒంగోలు, 21 రాజమహేంద్రవరంలో శక్తి కేంద్రాల సభ్యులతో సమావేశం అవుతారన్నారు. సమావేశంలో సీనియర్ నాయకుడు చలపతిరావు, నగర అధ్యక్షుడు ఎం.నాగేంద్ర, పార్టీ రాష్ట ఉపాధ్యక్షుడు కె.నాగభూషణ్, రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని, జాతీయ కార్యవర్గ సభ్యుడు పేర్ల సాంబశివరావు, సన్యాసిరావు, రాష్ట ఇన్చార్జి గోయల్ పాల్గొన్నారు. -
‘రాష్ట్ర సంపదను రసం పీల్చే పురుగులా తిన్నారు’
-
‘రాష్ట్ర సంపదను రసం పీల్చే పురుగులా తిన్నారు’
సాక్షి, అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. చంద్రబాబు అవినీతి చూస్తుంటే ప్రజల రక్తం ఉడికిపోతోందని, మనిషిగా ఉండే అర్హతను ఆయన ఎప్పుడో కోల్పోయారని ట్వీట్ చేశారు. బీజేపీ నేతలపై చంద్రబాబు చేసిన విమర్శలకు ఆయన శుక్రవారం ట్విట్టర్లో స్పందించారు. ‘మీకు సిగ్గుంటే కేంద్ర ప్రభుత్వ పథకాలను మీవిగా దొంగ ప్రచారం చేసుకోరు. రాష్ట్ర కోసం మీరేదో హెరిటేజ్ డబ్బులు పెడుతున్నట్లు మాట్లాడుతున్నారు. చంద్రబాబు భాషను సరిచేసుకోని క్షమాపణలు చెప్పాలి. మనిషిగా ఉండే అర్హతను మీరు ఎప్పుడో కోల్పోయారు. నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి, కేంద్ర ఇచ్చిన లక్షల కోట్ల నిధులను దోచేసి ఇప్పుడు మమ్మల్నే తిడతావా?. రాష్ట్ర సంపదను రసం పీల్చే పురుగులా తినేస్తు.. లెక్కలు అడిగితే యూటర్న్ తీసుకుని మాపై నిందలు వేస్తావా’’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. @ncbn మీ అవినీతి చూస్తుంటే ప్రజలకి రక్తం ఉడికిపోతోంది బాబు గారు. రాష్ట్రం కోసం మీరేదో హెరిటేజ్ డబ్బులు పెడుతున్నట్లు మాట్లాడుతున్నారు?? సిగ్గు ఉంటే కేంద్ర పథకాలను మీవిగా దొంగ ప్రచారం చేసుకోరు. మనిషిగా వుండే అర్హత మీరు ఎప్పుడో కోల్పోయారు. మీ భాషను సరిచేసుకుని క్షమాపణ చెప్పాలి. https://t.co/6urXxP064X — BJP ANDHRA PRADESH (@BJP4Andhra) February 1, 2019 -
‘అందుకే చంద్రబాబుపై కేసు వేశా..’
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై చంద్రబాబుకు తాను వంద ప్రశ్నలు సంధిస్తే వాటికి సమాధానం కూడా లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు అవినీతిని రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, మీడియా దృష్టికి తీసుకెళ్లానని.. చివరిగా ఆయన అవినీతిపై హైకోర్టులో కేసు వేసినట్టు వెల్లడించారు. కేంద్రం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తానే చేశానని డబ్బాలు కొట్టుకుంటున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు విహారయాత్ర కేంద్రంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు సందర్శనకు ప్రజల సొమ్ముతో రైతులను తరలిస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ మేకిన్ ఇండియాలో భాగంగా కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్కు రప్పించారని తెలిపారు. కియా మోటార్స్ను కేంద్రం ఏపీకి ఇచ్చిందని మంత్రి నారా లోకేశ్ స్వయంగా చెప్పారని అన్నారు. స్థానిక టీడీపీ నేతల అవినీతి వేధింపులు తట్టుకోలేక కియా మోటార్స్ వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడిందని.. ప్రధాని కార్యాలయం జోక్యం చేసుకోవడంతో పరిస్థితి చక్కబడిందని చెప్పారు. ఎవరిని మోసం చేయడానికి చంద్రబాబు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. నాడు ప్రత్యేక హోదాకు బదులు.. ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుంది చంద్రబాబు కాదా అని నిలదీశారు. ప్యాకేజీ ఇచ్చినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపింది చంద్రబాబేనని గుర్తుచేశారు. -
‘కుట్ర కత్తి’పై బాబుకెందుకు భయం పట్టుకుంది..!
సాక్షి, తూర్పు గోదావరి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శల వర్షం కురిపించారు. వైఎస్ జగన్పై కోడి కత్తితో దాడి జరిగినపుడు సింపుల్గా మాట్లాడిన చంద్రబాబు నేడు ఎన్ఐఏ విచారణ వద్దంటూ ఎందుకు గగ్గోలు పెడుతున్నారని ప్రశ్నించారు. దొరికిపోతాననే భయంతోనే బాబు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారని ఆరోపించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్థికి కేంద్రంలోని బీజేపీ పాటుపడుతోందని అన్నారు. సర్వశిక్ష అభియాన్ కింద కస్తూర్బా పాఠశాలకు కేంద్రం 600 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. మోరంపూడిలో ఫ్లైఓవర్ నిర్మాణానికి, హార్టికల్చర్ సబ్ సెంటర్లకు నిధులను కూడా కేంద్రమే ఇచ్చిందన్నారు. అగ్రవర్ణాల పేదలకు కేంద్రం 10 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తే.. దానిలో నుంచి కాపులకు ఏపీలో 5 శాతం రిజర్వేషన్లు ఎలా ఇవ్వగలదని ప్రశ్నించారు. ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాజకీయ వ్యవస్థలో ఉన్న సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించాలని హితవు పలికారు. చంద్రబాబు పరిపక్వత లేని నిర్ణయంతో సమాజంలోని రెండు వర్గాల మధ్య దూరం పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులకు, అగ్రవర్ణాలకు చిచ్చు..! అధికారం కోసమే అగ్ర అగ్రవర్ణాల రిజర్వేషన్లలో 5 ఐదు శాతం కాపులకు ఇస్తామని చంద్రబాబు చెబుతున్నారని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. బాబు అగ్రవర్ణాలు, కాపుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ‘గతంలో మాల మాదిగల మధ్య, మొన్నటికి మొన్న బీసీలు, కాపుల మధ్య గొడవ పెట్టారు. బాబు మోసాన్ని కాపులు గమనించాలి’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని తాను ఎవరికి లేఖ రాయలేదని అన్నారు. ఇక్కడ ఉన్న శాంతి భద్రతలపై మాత్రమే హోం మంత్రికి లేఖ రాశానని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలపై స్వయంగా మంత్రి అయ్యన్న పాత్రుడే చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం చేసిన సహాయంపై మంత్రి మాటలకన్నా ఇంకేం ఆధారం కావాలని చురకలంటించారు. -
‘ఏ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోదు’
విజయనగరం: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణ స్పష్టం చేశారు. విజయనగరంలో లక్ష్మీనారాయణ విలేకరులతో మాట్లాడుతూ..తెలంగాణాలో ఒంటరిగా పోటీ చేశామని, అలాగే రేపు ఏపీలోనూ ఒంటరిగానే వెళ్తామని చెప్పారు. విభజన హామీలకు సంబంధించి కేంద్రం స్పష్టంగా ఉందని కేవలం రాష్ట్ర ప్రభుత్వమే అయోమయానికి గురిచేసిందని వ్యాఖ్యానించారు. అన్ని రాష్ట్రాల కంటే అధికంగా కేంద్రం, ఏపీకి నిధులు ఇచ్చిందని తెలిపారు. చంద్రబాబు నిజం చెప్పిన దాఖలాలు లేవని అన్నారు. ఆయన చెప్పే ప్రతిమాటా అబద్ధమేనని అన్నారు. జన్మభూమి కమిటీలను రద్దు చేశామని చంద్రబాబు ప్రకటించినప్పటికీ ఇప్పటికీ ఆ కమిటీల ద్వారానే గ్రామాల్లో పాలన నడుస్తోందని విమర్శించారు. జన్మభూమి కమిటీలను రాజ్యాంగేతర శక్తిగా మార్చి గ్రామీణ పాలనను నిర్వీర్యం చేసింది టీడీపీ ప్రభుత్వమేనని విమర్శించారు. భారతదేశమంతా చంద్రబాబు చక్రం తిరిగినట్లు తిరిగారు.. ఏ ఫ్రంట్ ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నూటికి నూరుపాళ్లు సిద్ధంగా ఉందని వెల్లడించారు. చంద్రబాబుకు రాజకీయం తప్ప రాష్ట్రాభివృద్ధి పట్టడం లేదన్నారు. విభజన హామీలను నెరవేర్చడానికి బాబు సహకరించడం లేదని ఆరోపించారు. సుమారు 15 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు, ఆయన పేరు చెప్పుకునేందుకు ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా అని ప్రశ్నించారు. -
‘పోలవరం బాబుకు బంగారు బాతులాంటిది’
సాక్షి, అమరావతి : నలభైఏళ్ల రాజకీయ అనుభవమని చెప్పుకునే చంద్రబాబు నాయుడు తన అనుభవంతో ఏం సాధించారని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. తన బతుకంతా వాళ్లనీ, వీళ్లనీ విమర్శించడం తప్ప సాధించిందేమీ లేదని ఘటూ వ్యాఖ్యలు చేశారు. ఓటుకునోటు వంటి కేసుల్లో ఇరుక్కోని పక్క రాష్ట్రం నుంచి పారిపోయి వచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను ఏపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును కేవలం దోచుకోవడం కోసమే నిర్మిస్తున్నారని మండిపడ్డారు. ఆ ప్రాజెక్టు ఆయనకు బంగారు బాతులా మారిందని అన్నారు. సమావేశంలో కన్నా మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు బతుకంతా ఇతరులను తిట్టడానికి సరిపోయింది. వట్టి గాలి మాటలు తప్ప ఆయన సాధించింది ఏమీ లేదు. గడిచిన ఐదేళ్ల కాలంలో అగ్రిగోల్డ్, భూకుంభకోణం, జన్మభూమి కమిటీ వంటి అనేక కుంభకోణాలు వెలుగు చుశాయి. చంద్రబాబు దురాగతాలను కప్పిపుచ్చడానికి ఓ వార్త ఛానల్ మాపై అనేక అరోపణలు చేస్తోంది. మీకు కుల పిచ్చి ఉంటే, వారిని కాపాడుకోండి. కానీ మాపై, ప్రధాని నరేంద్ర మోదీపై తప్పుడు వార్తలను మాత్రం ప్రచురించకండి’’ అని అన్నారు. ‘‘రాఫెల్ విషయంలో కేంద్రంపై విమర్శలు చేసినవారంతా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. మన శత్రుదేశాలైన చైనా, పాకిస్తాన్లతో రాహుల్ గాంధీ రహస్య చర్చలు జరిపారు. మిమల్ని ప్రజలు క్షమించరు. జనవరి 6న నరేంద్ర మోదీ ఏపీ పర్యటకు వస్తున్నారు. గుంటూరులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. సభ ద్వారా రాష్ట్రానికి ఇచ్చిన నిధుల లెక్కల్ని భయటపెడుతాం’’ అని పేర్కొన్నారు. -
‘దేశంలో దొంగలు పడ్డారు’
సాక్షి, ఢిల్లీ: రాఫెల్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇకనైనా ప్రతిపక్షాలకు కనువిప్పుకలగాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్షీనారాయణ వ్యాఖ్యానించారు. రాఫెల్ పిటిషన్ల్ను సుప్రీంకోర్టు తిరస్కరిస్తూ శుక్రవారం ఇచ్చిన తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. దీనిపై మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేత కుటుంబరావు పెద్ద స్కాం బయటపెడతానని చెప్పి లేని కుంభకోణాన్ని సృష్టించారని అన్నారు. ఏనుగు పోతుంటే కుక్కుల మొరుగుతుంటాయని ఎద్దేవా చేశారు. ‘‘తెలుగుదేశం పార్టీ పెద్ద డ్రామా కంపెనీ. ఆ కంపెనీకి డైరెక్టర్ చంద్రబాబు నాయుడు. ఆయన గురించి పట్టించుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. దేశంలో దొంగలు పడ్డారు. వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. కొందరు బురదలో దొర్లి దానిని ఇతరులకు అంటిచాలని ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ స్నేహం చేస్తే తెలంగాణలో చేతులు కాలినట్లు మళ్లీ కాల్చుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ఆయన పట్ల జాగ్రత్తగా ఉండాలి. కాపు, వాల్మీకి రిజర్వేషన్ల గురించి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, జయల్ ఓరంతో చర్చించాము. చంద్రబాబు వారిని ఏవిధంగా మోసం చేశాడో వివరించాము. త్వరలో రిజర్వేషన్లపై క్లారిటీ వస్తుంది’’ అని అన్నారు. -
చంద్రబాబు వల్లే తెలంగాణలో కాంగ్రెస్ దెబ్బతింది
-
అన్నం పెట్టిన చేతిని నరకడం బాబు నైజం : కన్నా
సాక్షి, కాకినాడ : పిల్ల కాంగ్రెస్కు ఓటేస్తే తల్లి కాంగ్రెస్కు ఓటేసినట్లు అన్న చంద్రబాబు.. ఇప్పుడు తల్లి కాంగ్రెస్ చంకెక్కారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణ ఎద్దేవా చేశారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అన్నం పెట్టిన చేతిని నరకడం చంద్రబాబు సహజ గుణమంటూ విమర్శించారు. బీజేపీ నల్ల ధనాన్ని వెనక్కి తీసుకొచ్చే చర్యలు తీసుకోబట్టే దొంగలంతా ఒకటవుతున్నారని తెలిపారు. అందుకే సూట్కేస్ కంపెనీలు కూడా మూతపడుతున్నాయన్నారు. కేసుల నుంచి తనను తాను కాపాడుకోవడం కోసం దొంగ చంద్రబాబు ఎన్ని రాష్ట్రాలు తిరుగుతున్నాడో అందరికి తెలుసన్నారు. మాతో మిత్ర పక్షంగా ఉన్నప్పుడు కూడా బాబు దొంగగానే కనిపించాడంటూ కన్నా ఆరోపించారు. 2014లో చంద్రబాబు నేను మారాను నమ్మండంటూ వస్తే మాతో పాటు మోదీ కూడా నమ్మారని తెలిపారు. ఎస్పీవీ ఏర్పాటు చేయకుండా కేంద్రం నుంచి రూ. 16, 500 కోట్లు చంద్రబాబు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లుగా కేంద్రం ఇచ్చిన నిధులను చంద్రబాబు దోచేశారంటూ ఆరోపించారు. పిల్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. అందులో కొందరికి మంత్రి పదవులను కట్టబెట్టి బాబు తన ప్రభుత్వాన్ని నడుపుకుంటున్నారంటూ కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘అన్నం పెట్టే చేతిని తెగనరికే గుణం బాబుది’
గుంటూరు: అన్నం పెట్టే చేతిని తెగనరికే గుణం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణ విలేకరులతో మాట్లాడుతూ.. సొంతంగా ఎన్నికలలో పోటీ చేసే దమ్మూ ధైర్యం చంద్రబాబుకు లేదని దుయ్యబట్టారు. బాబు మోసగాడు, అవినీతిపరుడు, డ్రామా ఆర్టిస్ట్ అని తీవ్రంగా విమర్శించారు. బాబు తన అనుకూల మీడియాతో మోదీ ఇమేజ్ను దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. నటుడు శివాజీ, మేధావి చలసాని శ్రీనివాస్లు బాబు కనుసన్నలలోనే నడుస్తున్నారని ఆరోపించారు. గోదావరి పుష్కరాల సమయంలోనే బాబు అవినీతి గురించి మాట్లాడానని తెలిపారు. నాలుగేళ్ల క్రితమే బాబు నిజస్వరూపం గురించి బీజేపీ పెద్దలకు వివరించారని కన్నా అన్నారు. డిసెంబర్ 1 నుంచి 16 వరకు ఇంటింటికి బీజేపీ కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. ఇప్పటి వరకు ఇచ్చిన నిధులు, ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో చెప్పిన వాటితో పాటు చెప్పని వాటిని కూడా చేశామని, ఏపీ అభివృధ్దే బీజేపీ ధ్యేయమన్నారు. చంద్రబాబు మాతో లేకపోయినా ఏపీ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. -
‘మాణిక్యాలరావు గృహనిర్బంధం చట్ట విరుద్ధం’
సాక్షి, అమరావతి : బీజేపీ నేతలు పైడికొండల మాణిక్యాల రావు గృహ నిర్బంధం.. కన్నా లక్ష్మీ నారాయణ అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ నాయకులు ఖండించారు. అనంతరం డీజీపీని కలిసి.. ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి సత్యమూర్తి విలేకరులతో మాట్లాడుతూ.. స్పీకర్ అనుమతి లేకుండా మాణిక్యాలరావుని గృహ నిర్బంధం చేయడం చట్ట విరుద్ధమన్నారు. దేశమంతా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటున్న సీఎం చంద్రబాబు నాయుడు ఏపీలో మాత్రం ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేస్తున్నారంటూ మండి పడ్డారు. చంద్రబాబు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. బాబు చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉన్నాయంటూ మండిపడ్డారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై డీజీపీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. జరిగిన ఘటనపై విచారణ జరిపిస్తామని డీజీపీ హామీ ఇచ్చారన్నారు. -
రాష్ట్రానికి వచ్చేదెంత.. కంపెనీలకు ఇచ్చేదెంత?
గుంటూరు: బీజేపీ ఏపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మరో సారి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి లేఖాస్త్రం సంధించారు. ఈ దఫా మరో 8 ప్రశ్నలు వేశారు. ఇలా ప్రశ్నలు పంపడం ఇది 19వ సారి. 18 సార్లు ఐదు ప్రశ్నల చొప్పున పంపిన వాటికి ఇంతవరకూ సీఎం చంద్రబాబు నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. అయినప్పటికీ కన్నా తన ప్రశ్నల పరంపరను సాగిస్తూనే ఉన్నారు. ప్రశ్న నెంబర్ 93: రాష్ట్రానికి బ్రహ్మాండంగా పెట్టుబడులు తెస్తున్నామని చెప్పేందుకు, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు కంపెనీలకు మీరు ఇస్తున్న రాయితీలు రాష్ట్రానికి నష్టం కలిగించడం లేదని చెప్పగలరా? 12 సంవత్సరాలలో రూ.700 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన హెచ్సీఎల్ కంపెనీకి మీరు ఇచ్చిన రాయితీలు రూ.2,223.9 కోట్లు. ముఖ్యంగా వారికి కేటాయించిన 49.86 ఎకరాల విలువే సుమారు రూ.700 కోట్లు. వీటన్నింటిలో ముడుపులు అందలేదని చెప్పగలరా? గొప్ప ఆర్ధిక వేత్తను అని చెప్పుకునే మీరు ‘ రాష్ట్రానికి వచ్చేది ఎంత- రాష్ట్రం ఈ కంపెనీలకు ఇచ్చేది ఎంత’ అని బేరీజు వేసుకోవాల్సిన అవసరం లేదా? ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు సిద్ధమా? ప్రశ్న నెంబర్ 94: నెల్లూరు జిల్లాలోని కిసాన్ సెజ్లో భూకేటాయింపులు, భూములను కేటాయించిన సంస్థలు పరిశ్రమలను ప్రారంభించకపోవడం, ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టు పలుమార్లు మీ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మాట నిజం కాదా? ఇందులో కోదండ రామస్వామి దేవాలయానికి సంబంధించిన 1000 ఎకరాలు ఉన్న మాట వాస్తవం కాదా? దేవుడి భూములు అనే భయం, భక్తి కూడా మీకు, మీ ప్రభుత్వానికి ? దేవాలయానికి సంబంధించిన ఈ భూములకు ఎలాంటి పరిహారం చెల్లించకుండా, అమ్మోనియా యూరియా ప్లాంట్కు కేటాయించిన ఈ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా చేస్తున్నదని చీఫ్ జస్టిస్ టీబీ రాధాకృష్ణన్, ఎస్వీ భట్ల హైకోర్టు ధర్మాసనం వ్యాక్యానించలేదా? ఎకరం రూ.13 వేల రూపాయలకు ఈ భూములన్నీ కేటాయిస్తే, వాటిని ఎకరం రూ.50 లక్షలకు అమ్మిన మాట వాస్తవం కాదా? ఈ మొత్తం వ్యవహారంలో మీకు, మీ పార్టీ వారికి ఎలాంటి ముడుపులు అందలేదని ప్రకటించగలరా? దీనిపై సీబీఐ విచారణకు సిద్ధమా? సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ పండుగలకు చంద్రన్న కానుకల పేరిట ఇస్తున్న సరుకుల సరఫరా బాధ్యత మీ వందిమాగదులకు అప్పగించి, నాసిరకం సరుకులు ప్రశ్నించలేని పేదలకు పంపిణీ చేసి జేబులు నింపుకుంటున్న విషయం వాస్తవం కాదా? పేదలకు, పిల్లలకు, మహిళలకు, వృద్ధులకు నిర్దేశించబడిన సంక్షేమ పథకాలు వారికి అందించే విషయంలో విఫలమైన మీ అవినీతి పాలన ఇంకా కావాలా ప్రజలకు? ప్రశ్న నెంబర్ 95: మీ అసమర్థ, అవినీతి పాలన వల్ల రాష్ట్రంలో సంక్షేమ పథకాలు లబ్దిదారులకు సక్రమంగా చేరకపోవడం వల్ల రూ.వేల కోట్లు దుర్వినియోగం అయిన మాట వాస్తవం కాదా? సాక్షాత్తూ ప్రభుత్వ విజిలెన్సు అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తన 791 నివేదికలలో రూ.10,773 కోట్ల మేరకు సంక్షేమ పథకాలలో నష్టం వాటిల్లిందని, ఇది కూడా ప్రభుత్వ వైఫల్యం వల్లనే జరిగిందని పేర్కొనలేదా? పేదలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తోన్న బియ్యం వారికి చేరకుండా తిరిగి ప్రభుత్వ ఖజానాకే జమ అవుతోన్న తీరుతో ప్రభుత్వమే పేద ప్రజల పొట్టకొడుతున్న మాట నిజం కాదా? ఈ పాస్ విధానం ప్రవేశపెట్టాక 2015 నుంచి ఇప్పటివరకు రేషన్ బియ్యం తీసుకోని కారణంగా ప్రభుత్వానికి రూ.1800 కోట్ల విలువైన బియ్యం ఆదా చేసుకున్న విషయం వాస్తవం కాదా? ఆ రేషన్ బియ్యం అంతా కూడా రెక్కాడితే గానీ డొక్కాడని వలస కూలీలకు సంబంధించినవి కాదా? వారి పొట్టగొట్టడానికి మీకు మనసెలా వచ్చింది? ప్రశ్న నెంబర్ 96: మొత్తం రాష్ట్రం ఆస్తులన్నీ ఎడాపెడా ఎందుకు తాకట్టులు పెడుతున్నారో ప్రజలకి ఒకసారి వివరిస్తారా? ఇష్టా రాజ్యంగా ఒకవైపు దుబారా ఖర్చులు చేయడం, ఎఫ్ఆర్బీఎం నిబంధనలను తప్పించుకోవడానికి సీఆర్డీఏ, ఇతర ప్రభుత్వ విభాగాల చేత అప్పులు చేయించడం, దానికి రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ ఇవ్వడం, మొత్తానికి చాలా గొప్ప స్కెచ్ వేశారు. రాష్ట్రాన్ని ప్రభుత్వ విభాగాలను అప్పులపాలు చేసి వెళ్లేందుకు సిద్ధపడ్డారు. సుమారు రూ.11 వేల కోట్లు అప్పులు చేసేందుకు ఏర్పాట్లు జరిగిన మాట వాస్తవం కాదా? ఈ అస్తవ్యస్త ప్రణాళికల ద్వారా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని గందరగోళంలోకి నెట్టేస్తున్న మాట నిజం కాదా? ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకి సిద్ధమా? ప్రశ్న నెంబర్ 97: అవినీతిలో మీ అనుచరులు మిమ్మల్నే మించిపోయారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించే దానికి వచ్చే రైతులకు, ఇతర సందర్శకులకు అల్పాహారం, భోజనం ఏర్పాటు చేసినందుకు ఒక్కొక్కరికి రూ.275 చెల్లిస్తున్నారు. మీరు నియమించిన అడ్వోకేట్ జనరల్ బంధువు నిర్వహిస్తున్న ఈ భోజనశాలలో 10 మంది వచ్చినా బస్సు నిండా వచ్చినట్లు రికార్డుల్లో రాసుకుని ఇందులో కూడా అవినీతి చేయగలిగిన మీ అనుచరులను మెచ్చుకోవాల్సిందే. ప్రశ్న నెంబర్ 98: దళితులను అవమానించడం, మోసగించడం తప్ప మీకు మీప్రభుత్వానికి వేరే పని లేదా? భోగాపురం విమానాశ్రయానికి సేకరించిన దళితుల భూముల విషయంలో వారికిచ్చే పరిహారంలో మోసపూరిత వేలిముద్రలు వేయించుకోవటమా? ప్రభుత్వం ఇంత అన్యాయం చేయటమా? మీ అన్యాయాన్ని తెలుసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్ర రావు మీ ప్రభుత్వానికి అక్షింతలు వేసి, దళితులకు కూడా మిగిలిన వారి వలె ఎకరానికి రూ.28 లక్షలు చెల్లించామని ఆదేశించలేదా? తప్పుడు వేలిముద్రలు వేయించుకున్నందుకు మీ ప్రభుత్వం మీద చీటింగ్ కేసు పెట్టనక్కరేలా? ప్రశ్న నెంబర్ 99: పేద ప్రజలకు అత్యంత ప్రధానమైన వైద్య, ఆరోగ్య రంగాలను మీ ప్రభుత్వం సర్వనాశనం చేయలేదని చెప్పగలరా? ఆదివాసీలకు, గిరిజనులకు, బలహీనవర్గాల ప్రజల కోసం ఉండే ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను కునారిల్లే విధంగా చేసేశారు. వైద్య ఆరోగ్య సర్వీసులన్నీ ప్రైవేటీకరించి, అవినీతికి తెరతీయలేదా? జాతీయ హెల్త్ మిషన్ నిధులు వినియోగించకుండా బ్యాంకుల్లో ఎందుకు ఉంచాల్సి వచ్చిందో చెప్పగలరా? దేశంలో వినూత్న ప్రయోగం అని ఆర్భాటం చేసిన విశాఖపట్నం మెడిటెక్లో జరుగుతున్న అవకతవకలకు ప్రజలకు సమాధానం చెప్పరా? సీఈఓగా నియమితులైన జితేంద్ర కుమార్ శర్మ ఆధ్వర్యంలో, మీ కుమారుని కనుసన్నలలో జరుగుతున్న భూ కుంభకోణం, బినామీలకు చెల్లింపులు, వీటన్నింటి మీద సీబీఐ విచారణకు సిద్ధమా? ప్రశ్న నెంబర్ 100 : రాష్ట్రంలో పంటకుంటల తవ్వకంలో జరిగిన కోట్లాది రూపాయల కుంభకోణంపై మీకు సమాచారం లేదా? కేంద్ర ప్రభుత్వం అందించిన ఉపాధి హామీ నిధులలో ఒక్క అనంతపురం జిల్లాలోనే 61,729 కుంటలను తవ్వినట్లు తప్పుడు లెక్కలు చూపించి కోట్లాది రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులను మింగిన మాట వాస్తవం కాదా? దీనిపై సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నారా? -
‘చంద్రబాబుది శవాల మీద పెంకులు ఏరుకునే తత్వం’
సాక్షి, విశాఖపట్నం : ప్రభుత్వంపై ఆరోపణలు చేసే వారిపై చంద్రబాబు విరుచుకుపడుతున్నారని.. చంద్రబాబుది శవాల మీద పెంకులు ఏరుకునే తత్వమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మండిపడ్డారు. అగ్రిగోల్డ్ బాధితులకు మద్దతుగా నిర్వహిస్తున్న మహాధర్నాలో పాల్గొన్న కన్నా మాట్లాడుతూ.. సెక్స్రాకెట్, మనీ లాండరింగ్కు పాల్పడినవారిని పక్కన పెట్టుకుని వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అగ్రిగోల్డ్ అంశాన్ని రాజకీయంగా తీసుకోవడం లేదని.. నెలరోజుల్లోగా బాధితులకు న్యాయం చేయకపోతే ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరించారు. పోలవరం యాత్రను విహారయాత్రగా చేసుకున్నారని, కుటుంబ సభ్యులతో క్యాట్ వాక్ చేశారని దూషించారు. హుద్హుద్ తుఫానుకు చేసిన హడావుడిలో కనీసం పది శాతమైనా తిత్లీ విషయంలో చూపలేదని విమర్శించారు. చంద్రబాబుకు కావాల్సిందే రాజకీయమే కానీ ప్రజాసంక్షేమం కాదని తెలిపారు. రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబుకు మతిమరుపు వ్యాధి వచ్చిందేమో కానీ, ప్రజలు మర్చిపోలేదన్నారు. ఈ ధర్నాలో కేంద్ర మాజీ మంత్రి షానవాజ్ హుస్సేన్, పురందేశ్వరి, జీవీఎల్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో ప్రతిపక్షాలు లేకుండా చేసే కుట్ర: కన్నా
గుంటూరు: ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలు లేకుండా చేసే కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాడి జరిగిందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విటర్ ద్వారా తెలిపారు. తిరుపతిలో అమిత్ షా వాహనంపై దాడి, రాష్ట్ర పర్యటనలో తనపై దాడి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై దాడికి పెద్ద కుట్ర జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. వీటిని పరిశీలించి చూస్తే ఏపీలో ప్రజాస్వామ్యం, శాంతిభద్రతలు ఏస్థాయిలో ఉన్నాయో అర్ధమవుతోందని పేర్కొన్నారు. ఏపీలో శాంతి భద్రతలు దారుణమైన స్థితిలో ఉన్నాయని అనడానికి ఈ దాడే నిదర్శమన్నారు. జగన్పై దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. టీడీపీ ప్రభుత్వమే ఈ దాడులకు బాధ్యత వహించాలని అన్నారు. -
‘టీడీపీలో కాల్మనీ, సెక్స్ రాకెట్ నిందితులు’
గుంటూరు: టీడీపీపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మండిపడ్డారు. కాల్మనీ, సెక్స్రాకెట్ నిందితులు, దుర్గగుడిలో కొబ్బరి చిప్పలు, చెప్పులు దొంగిలించే దొంగలే టీడీపీలో ఉన్నారని తీవ్రంగా విమర్శించారు. టీడీపీ నేతలు ఉపయోగించే బాష అభ్యంతరకరంగా ఉందని వ్యాఖ్యానించారు. దీనిపై గతంలో కూడా ధర్నా చేశామని తెలిపారు.టీడీపీ అధినేతను తెలంగాణ సీఎం కేసీఆర్ తిట్టగానే అందరూ దాని గురించే మాట్లాడుతున్నారు..కానీ మోదీని చంద్రబాబు తిట్టినప్పుడు మీరంతా ఏం చేశారని ప్రశ్నించారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని టీడీపీ నేతలు మాట్లాడాలని చెప్పారు. టీడీపీ ఎంపీ సీఎం రమేశ్, జీవీఎల్ నరసింహారావును టీవీ లైవ్లో పచ్చిబూతులు తిట్టారని చెప్పారు. టీడీపీ నేతలు రాష్ట్రాన్ని దోచుకుతింటూ కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని విమర్శించారు. శవాల మీద పైసలు ఏరుకునే విధంగా టీడీపీ నేతల ప్రవర్తన ఉందన్నారు. కేంద్రాన్ని తిట్టి సీఎం బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, తిత్లీ విపత్తును కూడా రాజకీయాలకు వాడుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రికి మరో ఐదు ప్రశ్నలు అలాగే కన్నా లక్ష్మీనారాయణ మరో సారి ముఖ్యమంత్రికి ఐదు ప్రశ్నలు సంధించారు. మొదటి ప్రశ్న: పల్నాడులో అక్రమ మైనింగ్పై సీబీఐతో విచారణ జరిపించుకోగలరా ? రెండవ ప్రశ్న: ఎస్టిమేషన్లు పెంచి సీఎం రమేశ్కు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చిన మాట వాస్తవం కాదా? మూడో ప్రశ్న: మంత్రి ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బా రెడ్డిలను కూర్చోబెట్టి వాటాలు పెంచుకోమని చెప్పలేదా? నాలుగోప్రశ్న: రూ.480 కోట్ల రూపాయలతో నిరుద్యోగులకు ఇచ్చే శిక్షణకు ప్రైవేటు సంస్థలకు ఇవ్వడంలో అంతర్యం ఏమిటి? ఐదో ప్రశ్న: ఐటీ దాడులు చేస్తే రాష్ట్రంలో భావోద్వేగాలను ఎందుకు రెచ్చగొడుతున్నారు? -
‘పోలవరం పేరుతో చంద్రబాబు క్యాట్వాక్లు’
గుంటూరు: పోలవరం నిర్మాణ బాధ్యతను ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్నారని, అధికార టీడీపీ ప్రభుత్వం సహకరించకపోయినా పోలవరం నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ వ్యాఖ్యానించారు. అమరావతిలో జరుగుతున్న బహిరంగ సభలో మాట్లాడుతూ..సబ్ కాంట్రాక్టుల్లో కమిషన్లు, దళిత, గిరిజనుల భూముల పేరుతో టీడీపీ దోచుకుంటుందని ఆరోపించారు. పోలవరం పేరుతో ప్రతి సోమవారం చంద్రబాబు క్యాట్వాక్లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి వస్తోన్న నిధులన్నీ జన్మభూమి కమిటీలు మొదలు, చంద్రబాబు వరకు దోచుకుంటున్నారని విమర్శించారు. రాజధానికి రైతులిచ్చిన భూములతో చంద్రబాబు , లోకేష్లు వ్యాపారం చేసుకుంటున్నారని ఆరోపించారు. 2014లో ఏ కాంగ్రెస్ పార్టీని బాబు తిట్టాడో 2019లో అదే కాంగ్రెస్ పార్టీతో కలసి ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు కుట్రలను తిప్పికొడతామని వ్యాఖ్యానించారు. -
‘బాబు అధికారంలోకి వస్తే డెయిరీలు మూతే’
తిరుపతి: టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చక్కెర కర్మాగారాలు, పాల డెయిరీలు మూత పడుతూనే ఉంటాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రేణిగుంట సమీపంలోని గాజుల మాండ్యం చక్కెర ఫ్యాక్టరీని మూయించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని వ్యాఖ్యానించారు. చక్కెర ఫ్యాక్టరీని నమ్ముకున్న రైతులు, కార్మికులు ఇప్పుడు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికంతటికీ చంద్రబాబు నాయుడే కారణమని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో రైతులు చంద్రబాబుకు తగిన గుణపాఠం చెబుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రోజు గాజుల మాండ్యం చక్కెర ఫ్యాక్టరీ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
ఎవరిది నిజం? ఎవరిది అబద్దం?
సాక్షి, గుంటూరు: బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ 14వ సారి ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరో ఐదు ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు చంద్రబాబుకు కన్నా బహిరంగ లేఖను రాశారు. నాలుగేళ్ల పాలనలో వైఫల్యాలు, అవినీతిపై కన్నా ప్రతి వారం ఐదు ప్రశ్నలతో సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా తాజాగా సంధించిన మరో ఐదు ప్రశ్నలు ఇవే... ప్రశ్న నెంబర్ 66: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ఎంతో ద్రోహం చేసిందని, నిధులు ఇవ్వటం లేదని దొంగ ధర్మపోరాట దీక్షలు, సమావేశాలు పెట్టి గగ్గోలు పెడుతున్నారు. కేంద్రం నుంచి ఎక్కువ నిధులు వచ్చాయని స్వయానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమారే చెప్పారు. 2017-18 ఆర్ధిక సంవత్సరానికి కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రూ.9700 కోట్లు లక్ష్యంగా నిర్దేశించుకోగా, రూ.17,500 కోట్ల నిధులు గ్రాంట్ల రూపంలో వచ్చాయని చెప్పారు. 2018-19 ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి అంటే 6 మాసాలకే రూ.10,372 కోట్ల గ్రాంట్ వచ్చిందని కూడా చెప్పారు. ఈ ప్రకటనతో మీరు చేస్తున్న ఆరోపణలు, దొంగ దీక్షలు అన్ని మోసపూరితమని అంగీకరిస్తారా? చెంపలు వేసుకుని ప్రజలకు నిజాలను వెల్లడిస్తారా? ప్రశ్న నెంబర్ 67: రాష్ర్టంలో అన్ని జిల్లాల్లో మట్టి, ఇసుక, గనులు, దేనినీ వదలకుండా మీ కుమారుడి కనుసన్నలలో కబ్జాలు అయిపోతున్నాయి. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట నుంచి కాకరపల్లి వరకు సముద్రతీరాన ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉప్పు శాఖ వారి వేలాది ఎకరాలను టీడీపీ నాయకులు కబ్జా చేసిన మాట వాస్తవం కాదా? దీనిపై సీబీఐ విచారణకు సిద్ధమా? ప్రశ్న నెంబర్ 68: ప్రచార ఆర్భాటంలో, ప్రజలను మభ్యపెట్టడంలో, మాయ చేయడంలో మీరు మీ కుమారులు ఒకరిని మించినవారొకరు అయిపోయారు. సెప్టెంబర్ 18 నుంచి 20 వరకు చైనాలో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో ప్రసంగించేందుకు మీ కుమారుడికి ప్రత్యేక ఆహ్వానం అందిందని ఎంతో హడావిడి చేశారు. మరయితే ఇందుకు అయిన ఖర్చు అంతా రాష్ట్రమే ఎందుకు భరించవలసి వచ్చిందో చెప్పగలరా? అదీ చాలా తెలివిగా ముందు ఏపీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజెన్సీకి 6-7-2018న జీ.ఓ.ఎంఎస్ నెంబర్ 64 ద్వారా 18 కోట్ల రూపాయలు కేటాయించి, మళ్లీ ఆ సంస్థ ద్వారా చైనా ఖర్చులకి 6-9-2018న జీ.ఓ.ఎంఎస్ 1947 ద్వారా భరించిన మాట వాస్తవం కాదా? పెట్టుబడుల ప్రమోషన్లకా లేక మీ కుమారుని ప్రమోషన్కా ఈ ఖర్చు అయింది? అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని మీ ఇద్దరి దుబారా ఆర్భాటపు ఖర్చులతో ఇంకా అప్పుల ఊబిలోకి నెట్టడం లేదా? ప్రశ్న నెంబర్ 69: పులిచింతల కాంట్రాక్టర్కు లబ్ధి చేకూర్చేందుకు విజయవాడలో స్వరాజ్ మైదానాన్ని మీకు కావలసిన బొల్లినేని శీనయ్య కంపెనీకి కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగా కోర్టులో సవాల్ చేయని విషయం వాస్తవం కాదా? పులిచింతల కాంట్రాక్టర్ తాను రూ.199 కోట్ల మేర అదనపు పనులు చేశానని, అందుకు తనకు చెల్లింపులు చేయాలని కోర్టుకి ఎక్కితే రాష్ట్ర ప్రభుత్వం కావాలని సకాలంలో అఫిడవిట్ దాఖలు చేయకపోవడం వల్ల ఆ కాంట్రాక్టర్కు చెల్లించవలసిన మొత్తం రూ.400 కోట్లకు చేరిన మాట వాస్తవం కాదా? ఆ మొత్తం సకాలంలో చెల్లించనందున విజయవాడలోని స్వరాజ్ మైదానం, పులిచింతల కోసం సేకరించిన 48 ఎకరాల భూమిని వేలం వేసి ఆ కాంట్రాక్టరుకు ఆ సొమ్ము చెల్లించాలని మచిలీపట్టణం కోర్టు ఆదేశాలను జారీ చేయలేదా? ఈ మొత్తం కుంభకోణం మీ కనుసన్నలలో జరగలేదా? ప్రశ్న నెంబర్ 70: అమెరికాలో ప్రకృతి వ్యవసాయం మీద ప్రత్యే ప్రసంగంగా చెప్పబడుతున్న మీ ప్రసంగంలో రాష్ట్రంలో 5 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లు సెలవిచ్చారు. స్వయానా వ్యవసాయశాఖ మంత్రి అసెంబ్లీలో 2018-19 వ్యవసాయ బడ్జెట్పై ప్రసంగిస్తూ ఇప్పటివరకూ 1.63 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు. ఎవరిది నిజం? ఎవరిది అబద్దం? ప్రజలకు వివరిస్తారా? -
కేంద్ర నిధులు దిగమింగుతున్న టీడీపీ
పెదవాల్తేరు(విశాఖతూర్పు)/సాగర్నగర్ (విశాఖ తూర్పు): కేంద్రప్రభుత్వం పలు పథకాల కింద రాష్ట్రానికి ఇస్తున్న నిధులు జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ కార్యకర్తలు దిగమింగుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏపార్టీతోనూ పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగుతామన్నారు. రాష్ట్ర విభజన అనంతరం కేంద్రం రాష్ట్రానికి పలు కేంద్రీయ సంస్థలు, రైల్వే ప్రాజెక్టులు, సాగరమాల ప్రాజెక్టు పేరిట అన్ని రాష్ట్రాలకన్నా ఎక్కువ నిధులే ఇచ్చిందన్నారు. తెలుగుదేశం ఒక డ్రామా కంపెనీ అని, ఎప్పటికప్పుడు ఒక్కో పాత్ర కోసం ఒక్కో వ్యక్తిని చంద్రబాబు వాడుకుంటారని ఎద్దేవా చేశారు. ధర్మాబాద్ కోర్టు ఇచ్చిన అరెస్టు వారెంట్ విషయంలో బాబు కేంద్రంపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ వల్లే రాష్ట్ర విభజన జరిగిందని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్తో ఎలా పొత్తు పెట్టుకున్నారని ప్రశ్నించారు. సమావేశంలో బీజేపీ నగర అధ్యక్షుడు నాగేంద్ర, ఎంపీ హరిబాబు, ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు, ఎమ్మెల్సీ మాధవ్ పాల్గొన్నారు. టీడీపీ అవినీతిపై విస్తృత ప్రచారం టీడీపీ అవినీతిని పార్టీ శ్రేణులంతా ప్రజలకు తెలియజెప్పాలని కన్నా పిలుపునిచ్చారు. విశాఖ సాగరతీరం రుషికొండ సాయిప్రియ రిసార్ట్స్లో ఉత్తరాంధ్ర బూత్స్థాయి కన్వీనర్లు, పార్టీ శ్రేణులతో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిధులను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. -
అరెస్ట్ వారంట్తో బాబు కొత్త డ్రామాలు
-
చంద్రబాబు కొత్త డ్రామాలు: కన్నా
అమరావతి: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై అరెస్ట్ వారంట్ జారీ కావడంపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. చంద్రబాబుకు నోటీసులు రావడం వెనక ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారనేది అవాస్తవమని చెప్పారు. 2013 నుంచి కేసు నడుస్తోంది.. అప్పటి నుంచి వారికి నోటీసులు వస్తున్నాయని పేర్కొన్నారు. 2016 వరకు అప్పుడప్పుడు కోర్టుకు వెళ్తూ వచ్చారు.. చివరి 22 వాయిదాలకు వెళ్లకపోవడం వల్ల నాన్బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ చేశారని వెల్లడించారు. కేవలం ముద్దాయిలు 22 సార్లు కోర్టుకు వెళ్లకపోవడం వల్లనే వారెంట్ వచ్చిందని తెలిపారు. సాధారణంగా 3 సార్లు ముద్దాయిలు కోర్టుకు వెళ్లకపోతే నాన్బెయిలబుల్ వారెంట్ వస్తుందని వివరించారు. ఇప్పుడు కొత్తగా నోటీసుల వెనక మోదీ ఉన్నారని కొత్త డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు మీద కేసు కాంగ్రెస్ హయాంలో పెట్టిందని గుర్తు చేశారు. వాయిదాలకు వెళ్లకుండా చంద్రబాబు కోర్టులను అగౌరవపరిచేలా వ్యవహరించారని విమర్శించారు. -
సిగ్గులేకుండా కాంగ్రెస్తో పొత్తా: కన్నా
సాక్షి, గుంటూరు/సాక్షి, అమరావతి: దేశానికి పట్టిన శని కాంగ్రెస్ పార్టీ అంటూ గతంలో ఆ పార్టీని తిట్టిన చంద్రబాబు ఇప్పుడు సిగ్గు లేకుండా అదే పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. గుంటూరులోని తన నివాసంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సొంత మామ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి జెండాను లాక్కున్నారని, అన్నం పెట్టిన చేతిని నరకడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని మండిపడ్డారు. హోదా విషయంలో చంద్రబాబు ఎన్ని టర్నులు తీసుకున్నారో అందరికీ తెలుసన్నారు. ఎన్నికల ముందు లీటరు పెట్రోలుపై రూ.2 తగ్గిస్తున్నట్లు ప్రకటించి చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని, ఇప్పటివరకు పెట్రోల్పై రూ.4 క్యాపిటల్ ట్యాక్స్ ద్వారా ఎంత ఆదాయం వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తనపై ఆరోపణలు వచ్చినప్పుడు వై.ఎస్.రాజశేఖరరెడ్డి స్వయంగా తనపై సీబీఐ విచారణ వేసుకున్నారని, చంద్రబాబు అలా చేయగలరా అని కన్నా సవాల్ చేశారు. సీబీఐ విచారణలో చంద్రబాబు అవినీతి బయటపడకపోతే తాము జైలుకు వెళతామని చెప్పామని, ఇప్పటికైనా సవాల్ను స్వీకరించాలన్నారు. అప్పు చేసిన చంద్రబాబు భయపడాలి కానీ, ఓ డ్రామా కంపెనీని చూసి బీజేపీ భయపడదన్నారు. కామాంధ్రగా మార్చేశారు మహిళా ఉద్యోగులకు సెలవు కావాలన్నా.. బదిలీ కావాలన్నా.. ప్రమోషన్ కావాలన్నా లైంగిక వేధింపులు తప్పని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా చేస్తానని చెప్పి కామాంధ్రప్రదేశ్గా మార్చేశారని సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ప్రతి వారం ఐదు ప్రశ్నలతో గత 11 వారాలుగా ఆయన ముఖ్యమంత్రికి లేఖలు రాస్తున్న సంగతి విదితమే. బుధవారం మరో ఐదు ప్రశ్నలతో ఆయన సీఎంకు లేఖ రాశారు. కట్టుబట్టలతో బయటకు వచ్చామని కథలు చెబుతూ ముఖ్యమంత్రిగా మీరు మాత్రం ప్రజల డబ్బులను సొంత ఆర్భాటాలకు పప్పూ బెల్లాల్లా దుర్వినియోగం చేశారని దుయ్యబట్టారు. నరసరావుపేట జేఎన్టీయూలో రెండు గంటల కార్యక్రమానికి రూ.45 లక్షలు ఖర్చు పెట్టారని, అందులో ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకే రూ.35 లక్షలు చెల్లించారని పేర్కొన్నారు. ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలకు ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో ఎంత చెల్లించిందో వెల్లడించగలరా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఏపీఎన్ఆర్టీ సొసైటీకి భారత పౌరసత్వమే లేని వ్యక్తిని సీఈవోగా నియమించడం ఎంతవరకు సబబన్నారు. భూ కేటాయింపుల్లో అక్రమాలు.. భోగాపురం ఎయిర్పోర్ట్ టెండర్లు రద్దు కుంభకోణం.. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాల్లో అక్రమాలపై సీబీఐ విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. -
ఏపీని కామాంధ్రప్రదేశ్గా మార్చుతారా?
గుంటూరు: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరోసారి ప్రశ్నలు సంధించారు. ఆయన ఇప్పటివరకు 50 ప్రశ్నలు బాబుకి సంధించారు. ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాకపోయినా తన ప్రశ్నల పరంపరను కొనసాగిస్తున్నారు. ఈ మేరకు గుంటూరు కన్నావారి తోట నుంచి లేఖ విడుదలైంది. 11వ విడత కన్నా లక్ష్మీనారాయణ, చంద్రబాబుకి సంధించిన ఐదు ప్రశ్నలు ప్రశ్న నెంబర్ 51: భోగాపురం ఎయిర్పోర్టు టెండర్ల రద్దు కుంభకోణంపై సీబీఐ విచారణకు సిద్ధమా? మొదట టెండర్ని దక్కించుకున్న ప్రభుత్వ సంస్థ ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్ని కుంటి సాకులతో రద్దు చేసింది మీ ముడుపుల కోసమేగా అని సూటిగా ప్రశ్నించారు. మళ్లీ టెండరింగ్లో పాల్గొనకుండా ఆంక్షలను నిబంధనలను విధించింది కేవలం ప్రైవేటు సంస్థలకు కాంట్రాక్టును ధారాదత్తం చేసి ముడుపులు కమీషన్ల కోసమేనా..దీనికి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ప్రశ్న నెంబర్ 52: బీద రాష్ట్రమని, కట్టుబట్టలతో బయటికి వచ్చామని కథలు చెబుతూ, ప్రజల ధనాన్ని మీ ఆర్భాటాలకు పప్పు బెల్లాల్లా దుర్వినియోగం చేయడం లేదా? నరసరావుపేట జేఎన్టీయూలో రెండు గంటల కార్యక్రమానికి రూ.45 లక్షల ఖర్చా? ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ మాస్ డెకరేటర్సుకు రూ.35 లక్షలా? బ్రహ్మాండమైన ఆడిటోరియం నాగార్జున యూనివర్సిటీలో ఉంటే, దాన్ని కాదని యూనివర్సిటీకి కూతవేటు దూరంలో లక్షల రూపాయలు వెచ్చించి ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్లో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించడమా! ఇంత దుర్మార్గపు దుబారా ఎక్కడైనా ఉందా? ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలకు ఈ నాలుగేళ్లలో ఎంత చెల్లించారో వెల్లడించగలరా? ప్రశ్న నెంబర్ 53: దేశంలో ఎక్కడా లేనంతగా చదరపు అడుగు 11 వేల రూపాయలు వెచ్చించి , అమరావతిలో సచివాలయాన్ని అసెంబ్లీలను నిర్మిస్తే రెండు రోజుల వర్సాలకే లీకేజీలా? మంత్రుల కార్యాలయాలు, ప్రధాన కార్యదర్శి ఫర్నీచర్ వర్షం నీళ్ల లీకేజీకి మునిగిపోలేదా? ఈ నిర్మాణాల అవినీతిపై ఎందుకు విచారణ చేయించలేదు. ముడుపులు ముట్టడం వలనేగా?; ఇంత అవమానకరమైన విషయం మీకు సిగ్గుగా లేదా? రాష్ట్ర పరువు నాశనం కాలేదా? ఈ మొత్తం కుంభకోణంపై సీబీఐ విచారణకు సిద్ధమా? ప్రశ్న నెంబర్ 54 : మీ పరిపాలనలో మహిళా ఉద్యోగులపై జరుగుతున్న లైంగిక దాడులు గతంలో ఎప్పుడైనా జరిగాయా? స్వర్ణాంధ్రప్రదేశ్ను చేస్తానని కామాంధ్రప్రదేశ్గా మార్చేందుకు కంకణం కట్టుకున్నారా? వనజాక్షి లాంటి మహిళా అధికారులపై మీ ఎంఎల్ఏ దాడి చేసినపుడే మీరు తగినంత చర్యలు తీసుకుని ఉంటే, ఇప్పుడు మహిళా ఉద్యోగుల పరిస్థితి రాష్ట్రంలో ఇంత దుర్భర స్థితిలో ఉండేదా? సెలవులు కావాలన్నా, బదిలీ కావాలన్నా, ప్రమోషన్ కావాలన్నా లైంగిక వేధింపులు తప్పని పరిస్థితులను మహిళా ఉద్యోగులకు కలగడం మీ పాలనా వైఫల్యం కాదా? ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు క్షమాపణ చెప్పవలసిన అవసరం మీకు లేదా? ఇంత అసమర్థ ప్రభుత్వం ఒక్క నిమిషమైనా అధికారంలో ఉండే అర్హత ఉందా? ప్రశ్న నెంబర్ 55: రాష్ట్రానికి పెట్టుబడులను రాబట్టేందుకు ఏర్పరచబడ్డ ఎంతో కీలకమైన ఏపీఎన్ఆర్టీ సొసైటీ(ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ)కి భారత పౌరసత్వం లేని వ్యక్తిని సీఈవోగా నియమించవచ్చా? ఏపీఎన్ఆర్టీ సొసైటీకి ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా అమెరికా పౌరుడైన వేమూరి రవిని నియమించారు. ఈ సొసైటీలో జరిగే అవకతవకలకు ఒక విదేశీ పౌరుడిని శిక్షించగలరా? ఇప్పటికే అమరావతి, విశాఖపట్నంలలో భూములను సూట్కేసు కంపెనీలకు కట్టబెడుతూ ఉంది కదా? ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణకు సిద్ధమా? -
ముఖ్యమంత్రికి మరో ఐదు ప్రశ్నలు
సాక్షి, విజయవాడ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారయణ ఎనిమిదో సారి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఐదు ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు చంద్రబాబుకు కన్నా బహిరంగ లేఖను రాశారు. నాలుగేళ్ల పాలనలో వైఫల్యాలు, అవినీతిపై కన్నా ప్రతి వారం ఐదు ప్రశ్నలతో సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే. సీఎంకు ఆయన రాసిన ఎనిమిదో లేఖను విడుదల చేశారు. -ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను ఇతర పథకాలకు మళ్లించలేదా అని మొదటి ప్రశ్నను సంధించారు. ప్రచార పథకాలకు ఇష్టానుసారంగా నిధులు మళ్లించి అన్యాయం చేయడంలేదా అన్ని ప్రశ్నించారు. -రాష్ట్రంలోని ఖనిజ సంపద మొత్తాన్ని మీ పార్టీ నాయకులు దోచుకుంటున్న మాట వాస్తవం కాదా? ఇంత మైనింగ్ మాఫియా ఎప్పుడైనా చోటు చేసుకుందా? చివరకు హైకోర్టు చివాట్లు పెట్టే వరకూ స్పందించని మీ దైర్భాగ్య ప్రభుత్వం ఇంకా అధికారంలోకి కొనసాగే హక్కు ఉందా? -మీ పార్టీ కార్యకర్తలకు నామినేషన్ పద్దతితో ప్రభుత్వ పనులను ఇచ్చారు. దానిపై సీబీఐ విచారణకు సిద్ధమా? -సీడ్ క్యాపిటల్ ఏరియాను సింగపూర్ కంపెనీలకు అప్పజెప్పడం అంతరార్థం ఏమిటీ? అక్కడ అవినీతి జరగలేదా? - ఆర్థిక నిర్వహణలో కట్టుదిట్టనని చెప్పుకునే మీరు 10.32శాతం వడ్డీ బాండ్లను ఎందుకు జారీ చేయవలసి వచ్చిందో వివరించగలరా? అని సీఎంను నిలదీశారు. -
వెంటనే కరువు మండలాలను ప్రకటించాలి
-
‘ప్రచారం మీదున్న శ్రద్ద వ్యవసాయం మీద లేదు’
సాక్షి, విజయవాడ : టీడీపీ ప్రభుత్వానికి ప్రచారం మీదున్న శ్రద్ద వ్యవసాయం మీద లేదంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ విమర్శించారు. మీడియా సమావేశంలో కన్నా మాట్లాడుతూ.. ఈ ఏడాది సాధారణ వర్షపాతం కన్నా తక్కువగా నమోదైందని, దానికి అనుగుణంగా ప్రభుత్వం ఎందుకు ప్రణాళికలు సిద్ధం చేయలేదంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తోన్న ఇంతవరకు ఎందుకు సమీక్ష నిర్వహించలేదని ధ్వజమెత్తారు. కర్నూలు క్వారీలో జరిగిన ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
‘కేంద్ర నిధులు టీడీపీకి మళ్లింపు’
సాక్షి, కృష్ణా : రాజకీయ లబ్ధికోసమే చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో అడ్డమైన హామీలన్నీ ఇచ్చారని ఏపీ బీజేపీ రాష్ట్రా అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారని విమర్శించారు. దీక్షల పేరుతో కోట్ల రూపాయల దుబారాగా ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రం ఏపీకి ఇచ్చిన నిధులు మరే ఇతర రాష్ట్రానికి ఇవ్వలేదని, మోదీని దోషిగా చూపించడానికే చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర నిధులను మళ్లించి టీడీపీ నేతలు సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. -
రహస్య జీవోలు ఎందుకు చంద్రబాబూ?
సాక్షి, గుంటూరు: టీడీపీ ప్రభుత్వానికి బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరో మారు ఐదు ప్రశ్నలు సంధించారు. రాష్ట్ర సమస్యలు, ప్రభుత్వ అవినీతిపై ఇప్పటివరకు రెండు దఫాలుగా 10 ప్రశ్నలు సంధించారు. కన్నా ప్రశ్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నుంచి ఇప్పటి వరకూ ఎటువంటి సమాధానం రాలేదు. అయినప్పటికీ మరోసారి బుధవారం 5 ప్రశ్నలను విడుదల చేశారు. వీటిపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. కన్నా సంధించిన ఐదు ప్రశ్నలు మొదటి ప్రశ్న: అప్పుడెప్పుడో చక్రవర్తులు దేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి ధారాదత్తం చేసినట్లు, ఇప్పుడు మీరు రాష్ట్రాన్ని సింగపూర్కు దోచిపెట్టడం లేదా? రాజధాని భూకుంభకోణంపై సీబీఐ విచారణకు సిద్ధమా? మూడు పంటలు పండే సారవంతమైన భూములను రైతుల నుంచి తీసుకుని, అందులో 1691 ఎకరాల భూమిని స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో సింగపూర్ సంస్థలకు అప్పగించారు. ఇందులో మెజార్టీ వాటా 58 శాతం సింగపూర్ సంస్థలకు, 42 శాతం రాష్ట్రానికి వచ్చే విధంగా ఒప్పందం కుదిర్చారు. అందులో రోడ్లు, నీరు, కరెంటు వంటి మౌళిక వసతులు ప్రభుత్వమే కల్పించి ఇచ్చే విధంగా మీరు చేసుకున్న ఒప్పందం రాష్ట్రాన్ని సింగపూర్ సంస్థలకు దోచిపెట్టడం కాదా? ఇంత అన్యాయపు ఒప్పందం ఎక్కడైనా ఉంటుందా? రెండో ప్రశ్న: రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తానని రుణాంధ్రప్రదేశ్గా మార్చిన మీరు సీఎంగా కొనసాగేందుకు నైతిక అర్హత ఉందా? రాష్ట్ర విభజన సమయానికి రూ.లక్ష కోట్లు ఉన్నఅప్పుని, విభజన తర్వాత రూ.2.35 లక్షల కోట్లకి తీసుకెళ్లిన ఘనత మీది కాదా? మూడో ప్రశ్న: మీ ప్రచార పిచ్చితో రాష్ట్రంలో జరిగిన అమాయకుల మరణాలకు మీరు బాధ్యులు కారా? మూడు సంవత్సరాల క్రితం మీ ప్రచార పిచ్చితో గోదావరి పుష్కరాల సమయంలో 29 మంది అమాయకుల భక్తుల ప్రాణాలు పోవడానికి ఎందుకు కారణం అయ్యారు? మీ వనం-మనం కార్యక్రమానికి తగిన జాగ్రత్తలు తీసుకుని, విద్యార్థులను తరలించి ఉన్నట్లయితే ఐ.పోలవరం దగ్గర అమాయక విద్యార్థులు మరణించేవారు కాదు కదా? ఈ మరణాలన్నీ మీ వల్ల జరిగిన హత్యలుగా ఎందుకు పరిగణించకూడదు? నాలుగో ప్రశ్న: ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజలను మోసం చేసింది మీరు కాదా? ప్రత్యేక హోదా బదులు అవే సదుపాయాలతో ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి రాష్ట్ర అసెంబ్లీ చేత తీర్మానం చేయించి కేంద్రానికి పంపింది మీరు కాదా? రాజ్యాంగ పరమైన ఒక అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని పక్కన పెట్టి మరల ప్రత్యేక హోదా అడగటం కేంద్రాన్ని, ప్రజలను తప్పుదోవ పట్టించటం కాదా? ప్రత్యేక ప్యాకేజీని అంగీకరించి అసెంబ్లీలో తీర్మానం చేసిన మీరు, మరల అసెంబ్లీలో ‘ప్యాకేజీ వద్దు - హోదానే కావాలి’ అనే తీర్మానాన్ని ఎందుకు చేయించలేదు? ఐదో ప్రశ్న: వేలకు వేల రహస్య జీవోలను జారీ చేసిన ప్రభుత్వానికి పారదర్శకత ఎక్కడ ఉంది? పారదర్శక పరిపాలన అందిస్తున్నామని, రేయింబవళ్లు చెప్పే మీరు రహస్య జీవోలను ఇచ్చే విషయంలోనే రికార్డు సాధించలేదా? అసలు రహస్య జీవోలను జారీ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఇవన్నీ కేవలం అవినీతి, అశ్రిత పక్షపాతం కోసం కాదా? -
బీజేపీ ర్యాలీలో ఉద్రిక్తత
-
‘చంద్రబాబుకు మతి స్థిమితం బాగోలేదు’
సాక్షి, అమరావతి : ప్రజల్లో టీడీపీపై వస్తున్న వ్యతిరేకతను జీర్ణించుకోలేక చంద్రబాబు కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ విమర్శించారు. కడపలో ఆదివారం ఓ సమావేశంలో కన్నా మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా భారత్ను మోదీ తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ఏపీకి ఇచ్చినా మోదీపై బురద జల్లడం ఏంటని మండపడ్డారు. ఏపీ ప్రజలు విజ్ఞతతో వ్యవహరించాలని కోరారు. రాష్ట్ర అభివృద్దికి బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కడప ఉక్కు పరిశ్రమకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఉక్కు పరిశ్రమ కోసం దీక్ష చేసిన సీఎం రమేష్ మెకాన్ అడిగిన నివేదికను ఇప్పించాలని కోరారు. ఇతర రాష్ట్రాలు రాజకీయ విమర్శలు చేస్తుంటే ఏపీ మాత్రం కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించడం తగదని అన్నారు. తెలంగాణ, ఏపీలో ఉక్కు పరిశ్రమను నిర్మించి తీరుతామని తెలిపారు. స్ర్కాప్ విషయంలో చైనాతో ఒప్పందం చేసుకునందుకే కడప ఉక్కు ఫ్యాక్టరీను చంద్రబాబు అడ్డుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబుకి భూ దాహం, ధన దాహం పట్టుకుందని, అందుకే డాట్ భూములను తెరపైకి తీసుకువచ్చారని మండిపడ్డారు. చంద్రబాబు మతిస్థితి బాగోలేదని, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఎటు వెళ్తుందో కూడ బాబుకు అర్దం కావట్టేదని వ్యాఖ్యానించారు. బాధ్యత కలిగిన రాజ్యసభ సభ్యులు ఆలోచించకుండా దీక్ష ఎలా చేశారని ప్రశ్నించారు. -
కేంద్ర నిధులు..జన్మభూమి పేరుతో స్వాహా: కన్నా
వైఎస్సార్ జిల్లా: దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 14 పంటలకు మద్ధతు ధర పెంచిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని, కేంద్ర ప్రభుత్వం నిధులు పంపుతుంటే ఇక్కడ పేర్లు మార్చుకుని జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్వాహా చేస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా ధ్వజమెత్తారు. బీజీపీ సీనియర్ నాయకుడు కందుల రాజమోహన్ రెడ్డి ఎస్టేట్లో బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ఆడపడుచుల బంగారం బ్యాంకు అధికారులు వేలం వేస్తుంటే మీరు ఏం చేస్తున్నారని చంద్రబాబునుద్దేశించి ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కడప ఎయిర్పోర్టు నిర్మాణం చేస్తే, దానిని వినియోగంలోకి తెచ్చింది ప్రధాని నరేంద్ర మోదీనేనని చెప్పారు. స్టీల్ ప్లాంట్ అవకాశాన్ని చట్టంలో పరిశీలించమన్నారు..సెయిల్ మీటింగ్లో కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అవకాశం లేదని రాష్ట్ర ప్రభుత్వ అధికారులే చెప్పారని గుర్తు చేశారు. ఆ తర్వాత తాము సమాచారం ఇచ్చి మెకేన్ ఆధ్వర్యంలో కమిటీ వేశామని తెలిపారు. దానికి కావాల్సిన సమాచారం ఇవ్వకుండా చంద్రబాబు నాటకాలు వేశారని, తన వైఫల్యం బయటపడుతుందని దొంగదీక్షలకు దిగారని ఎద్దేవా చేశారు. 20వ తేదీన దీక్షకు కూర్చుని 22న సమాచారం ఇచ్చిన ఘనత చంద్రబాబుదని అన్నారు. కేంద్రం లక్షన్నర కోట్ల నిధులు ఇస్తే ఏమీ ఇవ్వలేదని అంటున్నారని, ఇచ్చిన ప్రతి రూపాయి పందికొక్కుల్లా మెక్కారని తీవ్రంగా విమర్శించారు. ఐదేళ్లు దోచుకున్నారు..మళ్లీ అధికారం కావాలని అడుగుతున్నారని టీడీపీ నాయకులపై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టండి..రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు. -
సీఎంకు బీజేపీ ఐదు ప్రశ్నలు
సాక్షి, అమరావతి: నాలుగేళ్ల పాలనలో వైఫల్యాలు, అవినీతిపై ప్రతి వారం ఐదు ప్రశ్నలతో సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖలు రాయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిర్ణయించారు. తొలిగా ఐదు ప్రశ్నలను సంధిస్తూ బుధవారం ఆయన సీఎంకు రాసిన లేఖను విడుదల చేశారు. - 2014 ఎన్నికల మేనిఫెస్టోను పార్టీ వెబ్సైట్ నుంచి ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెప్పాలంటూ మొదటి ప్రశ్నను సంధించారు. హామీలపై ప్రజలు నిలదీస్తారనే భయంతోనే అలా చేశారా అని ప్రశ్నించారు. - అధికారంలోకి వచ్చిన తొలిరోజు సంతకాలు చేసిన రైతు, డ్వాక్రా రుణమాఫీ, బెల్టుషాపుల మూత, ప్రతి ఇంటికీ శుభ్రమైన తాగునీరు పంపిణీ హామీల అమలు తీరేమిటి అని ప్రశ్నించారు. వీటిని అమలు చేయలేదనే విషయాన్ని మీ ధర్మపోరాట దీక్షలో ప్రజలకు వివరించి, వారికి క్షమాపణ చెప్పే ధైర్యం మీకు ఉందా? - ఓటుకు కోట్లు వ్యవహారంలో నిజాలను ప్రజలకు వివరించి, మీరూ, మీ పార్టీ ఏ నేరానికి పాల్పడలేదని ఒక బహిరంగ ప్రకటన చేయగలరా? ఫోను సంభాషణలో బయటపడ్డ ‘బ్రీఫ్డ్ మీ’ అన్న మాటలు మీవి కాదని ప్రజలకు చెప్పగలరా? - గ్రామ పంచాయతీ, మండల ఎన్నికల్లో టీడీపీ తరుఫున పోటీ చేసి ఓడిపోయిన నేతలతో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి.. ప్రతి పథకం వారి ద్వారా అమలు చేయిస్తూ కమీషన్లు, లంచాలు చెల్లిస్తే గానీ సంక్షేమ కార్యక్రమాలు అందని పరిస్థితి కల్పించింది నిజం కాదా? - విశాఖ భాగస్వామ్య సదస్సుల ద్వారా రూ.16 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. వాటన్నింటిపై వాస్తవాలను ప్రజలకు బహిర్గతం చేసే ధైర్యం ఉందా? అని సీఎంను నిలదీశారు. ‘కన్నా’ పై చెప్పు విసిరిన టీడీపీ కార్యకర్త కావలి: కావలిలో బీజేపీ బుధవారం ర్యాలీ నిర్వహించింది. ర్యాలీ ట్రంకురోడ్డులోని మహాత్మాగాంధీ విగ్రహం వద్దకు చేరుకోగానే ఓపెన్ టాప్ జీపులో ఉన్న కన్నా లక్ష్మీనారాయణపైకి ఓ టీడీపీ కార్యకర్త చెప్పు విసిరి దాడికి పాల్పడ్డాడు. అది తగలకపోవడంతో రెండో చెప్పును విసరగా అది కన్నా తలకు రాసుకొంటూపోయింది. దీంతో కంగుతిన్న బీజేపీ కార్యకర్తలు వెంటనే తేరుకుని అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అనంతరం బీజేపీ కార్యకర్తలు వన్ టౌన్ పోలీస్స్టేషన్కు చేరుకుని ధర్నా చేశారు. చెప్పు విసిరిన వ్యక్తిని ప్రకాశం జిల్లా ఎం.నిడమనూరుకు చెందిన గొర్రెపాటి మహేశ్వరచౌదరిగా గుర్తించారు. -
నాపై దాడికి చంద్రబాబే కారణం : కన్నా
సాక్షి, అమరావతి: తనపై దాడి జరగడానికి కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం అంతా చంద్రబాబు నాయకత్వంలోనే జరిగిందని ఏపీ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని దోచేస్తున్న టీడీపీ నేతల అవినీతిని ప్రజలకు తెలిజెప్పడం తప్పా అని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విటర్లో బుధవారం సాయంత్రం ఆయన పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న అప్రజాస్వామిక చర్యలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న బీజేపీపై టీడీపీ నాయకులు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రజల్లోకి వెళ్లి రాష్ట్రాభివృద్ధికి ఎవరెంత పనిచేస్తున్నారో తెలియజేస్తున్నందున భరించలేక ఇటువంటి భౌతిక దాడులు చేస్తున్నారని వాపోయారు. ఈ దాడులు అన్నింటికీ కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా కూడా చంద్రబాబు నాయకత్వం లోనే జరుగుతోంది. ఇవి అన్నీ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న హింస దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము, అందరూ కూడా ఖండించవలసిన అవసరం ఉంది. — Kanna Lakshmi Narayana (@klnbjp) July 4, 2018 -
టీడీపీ సంస్కారహీనుల పార్టీ : కన్నా
-
టీడీపీ సంస్కారహీనుల పార్టీ : కన్నా
సాక్షి, విజయవాడ : టీడీపీ అంటే తెలుగుదేశం సంస్కార హీనుల పార్టీ అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా విమర్శించారు. విజయవాడలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఈ రోజు తాము ధర్నా చేస్తే దానికి పోటీగా టీడీపీ నాయకులు ధర్నా చేశారని మండిపడ్డారు. ప్రతిపక్షం అంటే టీడీపీ నాయకులకు విలువే లేదని వ్యాఖ్యానించారు. కొత్త వాళ్లకు పార్టీలో చోటు కల్పిస్తామని, ఏ పార్టీ వారు వచ్చినా పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తామని చెప్పారు. ‘రాజకీయ పక్షాలంటే గౌరవం లేదు. రాష్ట్రాన్ని దోచుకుతిని టీడీపీ నాయకులకు కళ్లు కనబడటం లేదు. వైఎస్సార్ సీపీకి, జనసేనకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టేనని టీడీపీ ప్రచారం మొదలెట్టింది. 2019లో టీడీపీకి మ్యానిఫెస్టో లేదు. 2014లో అన్ని కులాలకు హామీలిచ్చి మోసం చేశారు. అందుకే ఎవరికి ఓటేసినా బీజేపీకే పడతాయని దుష్ప్రచారం చేస్తున్నారు. పోలవరానికి మొన్ననే కేంద్రం రూ.1400 కోట్లు విడుదల చేసింది. పోలవరానికి ఇప్పటివరకు జరిగిన పనులకు సంబంధించి పైసా కూడా బాకీ లేం’అని కన్నా స్పష్టం చేశారు. -
మిత్ర ధర్మం పాటించి ఇన్నాళ్లూ ఊరుకున్నాం
గుంటూరు : మిత్ర ధర్మాన్ని పాటించి ఏపీలో అక్రమాలు, అవినీతిపై ఇన్నాళ్లూ నోరు మూసుకుని ఉన్నామని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరులో విలేకరులతో మాట్లాడుతూ..ఇసుక మాఫియా, దందాపై ఎప్పటికప్పుడు లెక్కలు అడిగినందుకు టీడీపీ బయటికి వెళ్లిందని ఆరోపించారు. సెవెన్ స్టార్ హోటల్స్, ఈవెంట్ మేనేజ్మెంట్సకే డబ్బులు తగలేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో అడ్డమైన హామీలు ఇచ్చి, ఒక్కటీ నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. ఏపీలో అవినీతి, అసమర్థపాలన సాగిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం టీడీపీని నమ్మి మోసపోయిందని వ్యాఖ్యానించారు. టీడీపీ అసమర్థతతోనే ఏపీకి అన్యాయం జరిగిందని అన్నారు. జల్సాగా స్పెషల్ ఫ్లయిట్లో దేశ దేశాలు తిరిగి..చివరికి రాజధాని ప్లాన్ కోసం రాజమౌళి వద్దకు వచ్చారని విమర్శించారు. పోలీసులను టీడీపీ కార్యకర్తల్లా వాడుకుని ఏదైనా అడిగితే ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు తాత్కాలిక సీఎం అని..అందుకే తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సెక్రటేరియట్లను నిర్మించారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీని ఎన్టీఆర్ భవన్ అనుకుంటున్నారా ? అమిత్ షా లేఖ రాస్తే అసెంబ్లీలో ఎలా చదువుతారు ? అసెంబ్లీలో ఏనాడైనా ప్రజల సమస్యలపై చర్చించారా? అని చంద్రబాబునుద్దేశించి ప్రశ్నించారు. ఏపీని మోసం చేసింది సీఎం చంద్రబాబేనని, పార్లమెంటులో చర్చ జరిగితే చంద్రబాబు అవినీతి బయటకు వస్తుందని భయపడుతున్నారని విమర్శించారు. -
కాపులను భయభ్రాంతులకు గురిచేస్తున్న సీఎం: కన్నా
గుంటూరు వెస్ట్: తుని ఘటనపై కాపులకు సంబంధం లేదని ప్రకటించిన ముఖ్యమంత్రి, హోం మంత్రి.. మండలాలు, గ్రామాల వారీగా సభకు వెళ్లినవారి వివరాలు సేకరిస్తూ పోలీసుల ద్వారా భయభ్రాంతులకు గురిచేయడంతోపాటు కేసులు పెట్టడం దారుణమని మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. గుంటూరులో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తునిలో జరిగిన సభలో రెచ్చగొట్టే ప్రసంగాలు ఏమీ చేయకున్నా తనపై కేసు నమోదు చేయడాన్ని తప్పుపట్టారు. కేసులకు భయపడేది లేదని, జైళ్లకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కాపులపై కక్షసాధింపు చర్యలను విరమించుకోవాలని, లేకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
'కాపుల రిజర్వేషన్కు బీజేపీ పూర్తి మద్దతు'
విజయవాడ: కాపుల రిజర్వేషన్కు బీజేపీ పూర్తి మద్దతు ఉంటుందని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లా, తుని ఘటనపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. తుని ఘటనపై ఆయన మాట్లాడుతూ.. కాపు గర్జన కులానికి సంబంధించిందని పేర్కొన్నారు. శాంతియుతంగా కాపులు రిజర్వేషన్లు సాధించాలని చెప్పారు. -
అసమ్మతి డ్రామా!
సీఎం, మంత్రుల మధ్య వివాదాలు నిన్న కన్నా.. నేడు బాలరాజు విభజన నేపథ్యంలో కాంగ్రెస్ అంతర్నాటకమనే విమర్శలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ తీర్మానం అనంతరం ఆ పార్టీ నేతల మధ్య రోజుకో రకమైన వివాదం తెరపైకి వస్తోంది. నిన్న ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, మంత్రి కన్నా లక్ష్మీనారాయణల సంబంధిత వివాదం తెరమీదకు రాగా, తాజాగా గిరిజనశాఖ మంత్రి పి.బాలరాజు సీఎం తీరుపై అసమ్మతి జెండాఎత్తారు. విశాఖలో శుక్రవారం సీఎం రచ్చబండ కార్యక్రమానికి సమాచారం, ఆహ్వానం లేని కారణంగానే బాలరాజు గైర్హాజరయ్యారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గిరిజన వర్గానికి చెందినందునే మంత్రి పట్ల ఇలా చిన్నచూపు చూస్తున్నారని బాలరాజు వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు మాత్రం మంత్రికి ఆహ్వానం పంపామని చెబుతున్నాయి. ఈ వ్యవహారం కాంగ్రెస్ నేతల మధ్య వాదోపవాదాలకు దారితీసి వాతావరణాన్ని వేడెక్కించింది. ఇదే అదనుగా సీఎం వ్యతిరేకవర్గం ఆయనపై ధ్వజమెత్తింది. తెలంగాణ నేతలైతే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, ఎంపీ పొన్నం ప్రభాకర్లు సీఎం తీరును దుయ్యబట్టారు. మంత్రిని ఆహ్వానించకపోవడమంటే అవమానించడమేనని, సీఎంపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధకచట్టం కింద కేసు పెట్టాలని పొన్నం డిమాండ్ చేశారు. కిరణ్కుమార్రెడ్డి తన సత్తాను బడుగు బలహీనవర్గాలపై కాకుండా ఢిల్లీపై చూపించాలని షబ్బీర్ అలీ సూచించారు. మరోవైపు ఇదంతా కాంగ్రెస్ అంతర్నాటకంలో భాగమేనన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన పై కేంద్రం చురుగ్గా అడుగులు కదుపుతున్న సమయంలో సీమాంధ్రలో ప్రజల దృష్టిని మరల్చేలా కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే ఈ అంతర్నాటకానికి తెరతీస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విభజన ప్రక్రియలో కీలకమైన.. అసెంబ్లీకి తెలంగాణ బిల్లు రాక, దానిపై చర్చ, పార్లమెంటులో ఆ బిల్లుకు ఆమోదం వంటి ముఖ్య ఘట్టాలు ముందున్న నేపథ్యంలో సమైక్య ఉద్యమం మళ్లీ వేడెక్కుతోంది. ఈ సమయంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య వివాదాలు తెరపైకి తెస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.