krishna babu
-
‘అందుకే జీబీఎస్ ఆందోళన ఎక్కువ అయ్యింది’
అమరావతి: మహారాష్ట్రలో ఎక్కువగా జీబీఎస్ (గులియన్ బారే సిండ్రోమ్) కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న కారణంగా ఇక్కడ కూడా ఆందోళన బాగా ఎక్కువగా ఉందన్నారు ఏపీ హెల్త్ సెక్రటరీ కృష్ణబాబు. పుణే మున్సిపల్ కార్పొరేషన్లో నీటి సరఫరా సరిగ్గా లేని కారణంగా డయేరియా మొదలై జీబీఎస్ సోకిందన్నారు.దీంతో జీబీఎస్ పై భయం పెరిగిందన్నారు. అన్ని ఏరియాల నుంచి జీబీఎస్ వస్తోందని, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకూ ఒకే చోట ఎక్కువ కేసులు నమోదు కాలేదని, న్యూరో ఫిజిషయన్లు ఎక్కువగా ఉన్న చోట ట్రీట్ మెంట్ బాగా జరుగుతుందన్నారు.‘వెంటిలేటర్లు ఇతర ఐసీయూ సౌకర్యాలు అందుబాటులో ఉంచుతున్నాం.ఏ ఇన్ఫెక్షన్ వచ్చిన వారికైనా జీబీఎస్ వచ్చే అవకాశం ఉంది.. సాధారణ జాగ్రత్తలు అంటే చేతులు కడుక్కోవడం.. శుభ్రంగా ఉండడం. పాటించాలి. కాళ్ళు తిమ్మిర్లు..చచ్చు బడినట్టు ఉండడం....లక్షణాలు. తినలేకపోవడం..మింగ లేకపోవడం.. శ్వాస అడకపోవడం. కూడా వ్యాధి లక్షణాలు. ప్రజలు ఈ అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి.జీబీఎస్ వచ్చిన 85 శాతం కేసులు ఒక్క రోజులోనే. సెట్ అవుతాయి..వెంటిలేషన్ అవసరం అయితే రికవరీ కష్టం అవుతుంది. మొదట చనిపోయిన చిన్న పిల్లవాడి కేస్ లో ఆసుపత్రి మార్చారు...మొదట శ్రీకాకుళం. తర్వాత విశాఖ కేజీహెచ్. దీంతో ఇబ్బంది వచ్చింది. ఎన్టీఆర్ వైద్య సేవలో చికిత్స అందుబాటులో ఉంది’ అని కృష్ణబాబు తెలిపారు. -
సీనియర్ ఐఏఎస్ కృష్ణబాబుని టార్గెట్ చేసిన చింతకాయల విజయ్
-
ఐఏఎస్ కృష్ణబాబును టార్గెట్ చేసిన అయ్యన్నపాత్రుడు కుమారుడు
సాక్షి, అమరావతి: సీనియర్ ఐఏఎస్ కృష్ణబాబును స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ టార్గెట్ చేశారు. కృష్ణబాబుపై సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్ట్ పెట్టిన విజయ్.. పులివెందుల కాంట్రాక్టర్ల బిల్లులు క్లియర్ చేశారంటూ ఆరోపించారు. గత ప్రభుత్వంలో కీలక పోస్టుల్లో కృష్ణబాబు పని చేశారంటూ పోస్ట్ పెట్టారు. విజయ్ బహిరంగ ఆరోపణలతో ఐఏఎస్ అధికారి కృష్ణబాబు మనస్తాపం చెందారు. ఎన్నికల తర్వాత బిల్లులు చెల్లించలేదంటున్న కృష్ణబాబు.. ఫేజ్-2 మెడికల్ కాలేజీలకు ఫలితాల ముందు రూ. 125 కోట్లు చెల్లించామని.. అందులో పులివెందుల కాలేజీకి రూ.25 కోట్లు చెల్లించామని కృష్ణబాబు స్పష్టం చేశారు. విజయ్ తప్పుడు ఆరోపణలపై కృష్ణబాబు సీఎంకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. -
మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు కన్నుమూత
కొవ్వూరు: వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు (71) మంగళవారం ఉదయం హైదరాబాద్లో కన్నుమూశారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983లో ఎన్టీ రామారావుపై అభిమానంతో రాజకీయాల్లోకి వచ్చారు. వరుసగా 1983, 1985 (మధ్యంతర ఎన్నికలు), 1989, 1994, 2004లో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్టీలు వేరైనప్పటికీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో కృష్ణబాబుకు అత్యంత సాన్నిహిత్యం ఉండేది. దీంతో ఆయన మరణానంతరం 2012లో వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థాపించిన వైఎస్సార్సీపీలో చేరారు. జిల్లా రాజకీయాల్లోనూ, గోపాలపురం, పోలవరం నియోజకవర్గాల్లో పునర్విభజన అనంతరం కొవ్వూరులోనూ కృష్ణబాబు రాజకీయంగా తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన భార్య నాగమణి గతంలోనే మరణించారు. కృష్ణబాబుకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ సలహాదారు, పార్టీ కొవ్వూరు నియోజకవర్గ పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న ఎస్.రాజీవ్కృష్ణ ఆయన అల్లుడు. కృష్ణబాబు మృతి పట్ల రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, కొవ్వూరు మునిసిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారితోపాటు పలువురు రాష్ట్ర, జిల్లాస్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన స్వగ్రామమైన దొమ్మేరులో బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
పేదవాడికి ఆరోగ్యశ్రీ చేరువ చేయడమే లక్ష్యం: సీఎం జగన్
-
ప్రతి ఇంటిలోనూ బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహిస్తాం: సీఎం జగన్
-
కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలు ఏర్పాటుతో వైద్య విద్యలో నూతన శకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాంది పలికారు. ఉమ్మడి రాష్ట్రానికి ముందు, తర్వాత చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ వైద్య కళాశాలలను ప్రైవేటు కాలేజీలకు దీటుగా నిర్వహించడంలో భాగంగా ప్రభుత్వం సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు బుధవారం జారీ చేశారు. ఈ వైద్య కళాశాలల్లో మొత్తం సీట్లలో 15 శాతం ఆల్ ఇండియా కోటాకు కేటాయిస్తారు. మిగిలిన వాటిని మూడు విభాగాలుగా చేశారు వాటిలో 50 శాతం జనరల్ విభాగం, 35 శాతం సెల్ఫ్ ఫైనాన్స్, 15 శాతం ఎన్ఆర్ఐ కోటా కింద భర్తీ చేయనున్నారు. జనరల్ విభాగంలో ఏడాదికి రూ.15 వేలు, సెల్ఫ్ ఫైనాన్స్లో రూ.12 లక్షలు, ఎన్ఆర్ఐ విభాగంలో రూ. 20 లక్షలు చొప్పున ఫీజులు నిర్ణయించారు. సెల్ఫ్ ఫైనాన్స్, ఎన్ఆర్ఐ సీట్ల ద్వారా వచ్చే ఫీజులను ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ కార్పొరేషన్ (ఏపీ మెర్క్)లో డిపాజిట్ చేస్తారు. ఈ నిధులతో ప్రభుత్వ వైద్య కళాశాలల అభివృద్ధి చేపడతారు. రూ.12,300 కోట్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూ.16 వేల కోట్లతో నాడు–నేడు కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వ వైద్య విద్యా రంగం రూపురేఖలు మారుస్తున్నారు. ఇందులో భాగంగా రూ.8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న వైద్య కళాశాలల బలోపేతానికి రూ.3,820 కోట్లు వెచ్చిస్తున్నారు. ఇలా మొత్తం రూ.12.300 కోట్లు ప్రభుత్వ వైద్య కళాశాలలకు వెచ్చిస్తున్నారు. విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాలలో నిర్మించిన నూతన కళాశాలలను ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో మార్కాపురం, పులివెందుల, ఆదోని, మదనపల్లె, పాడేరు కళాశాలలు ప్రారంభించడానికి చర్యలు చేపట్టారు. ఈ వైద్య కళాశాలలన్నింటికీ కొత్తగా పోస్టులు మంజూరు చేశారు. మిగిలిన 7 వైద్య కళాశాలలు 2025–26లో ప్రారంభించాలని నిర్ణయించారు. -
వైద్యశాఖలో 2,118 పోస్టుల మంజూరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో మూడు వైద్య కళాశాలలను కొత్తగా ప్రారంభించేందుకు వీలుగా కీలక ముందడుగు పడింది. ఇందులో భాగంగా ప్రభుత్వం 2,118 పోస్టులను కొత్తగా మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయడం కోసం ప్రభుత్వం 17 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడేళ్ల వ్యవధిలో ఈ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ అడ్మిషన్లు చేపట్టి కార్యకలాపాలు ప్రారంభించేలా ప్రణాళికలు రచించారు. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే మచిలీపట్నం, నంద్యాల, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం వైద్య కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఒక్కోచోట 150 సీట్ల చొప్పున 750 ఎంబీబీఎస్ అడ్మిషన్లు చేపట్టనున్నారు. ఇదిలావుండగా వచ్చే విద్యా సంవత్సరంలో ఏఎస్ఆర్ జిల్లా పాడేరు, వైఎస్సార్ జిల్లా పులివెందుల, కర్నూలు జిల్లా ఆదోని వైద్య కళాశాలల కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఒక్కో చోట వైద్య కళాశాలకు 222, బోధనాస్పత్రికి 484 చొప్పున 2,118 పోస్టులను కొత్తగా సృష్టించారు. ఇప్పటికే ఈ మూడు చోట్ల ఉన్న ప్రభుత్వాస్పత్రులను ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా 330 పడకల స్థాయికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ క్రమంలో 16 యూనిట్లతో ఆయా ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేయడానికి వీలుగా అడిషనల్ డీఎంఈ హోదాలో సూపరింటెండెంట్, వివిధ పోస్టులను సృష్టించారు. అదేవిధంగా వైద్య కళాశాలకు సంబంధించి అడిషనల్ డీఎంఈ హోదాలో ప్రిన్సిపాల్, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రో బయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, సైకియాట్రీ, జనరల్ సర్జరీ వంటి వివిధ విభాగాలు ఏర్పాటు, పరిపాలన విభాగాలకు సంబంధించిన పోస్టులను మంజూరు చేశారు. ఇదిలావుండగా అన్నమయ్య జిల్లా మదనపల్లి, ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఏర్పాటు చేస్తున్న కొత్త వైద్య కళాశాలల్లో కూడా వచ్చే ఏడాది నుంచి అకడమిక్ కార్యకలాపాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని డీఎంఈ డాక్టర్ నరసింహం ‘సాక్షి’తో చెప్పారు. కళాశాల, బోధనాస్పత్రి నిర్మాణ పనులు ఈ రెండుచోట్ల వేగంగా పూర్తవుతున్న నేపథ్యంలో 2025–26కు బదులు 2024–25లో వీటిని అందుబాటులోకి తేవాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ రెండు చోట్ల పోస్టుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నామన్నారు. -
వైద్య ఆరోగ్య రంగంలో అగ్రగామి ఏపీ
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య రంగంలో మన రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ప్రసూతి మరణాల రేటు (ఎంఎంఆర్), శిశు మరణాల రేటు (ఐఎంఆర్)లో జాతీయ స్థాయితో పోలిస్తే రాష్ట్రం మెరుగైన స్థానంలో ఉందన్నారు. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణ కోసం నూరా హెల్త్ సంస్థ, యూనిసెఫ్ల సహకారంతో వైద్య శాఖ కేర్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ కార్యక్రమంపై ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేసే వైద్య సిబ్బందికి విజయవాడలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో బుధవారం ఆయన మాట్లాడారు. ప్రతి లక్ష ప్రసవాలకు దేశంలో ఎంఎంఆర్ 97గా ఉంటే ఏపీలో 45గా ఉందని, ఐఎంఆర్ దేశంలో 28గా ఉంటే రాష్ట్రంలో 24కు తగ్గిందని చెప్పారు. ఎంఎంఆర్, ఐఎంఆర్ను సింగిల్ డిజిట్కు తగ్గించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ఈ కేర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాతా శిశు సంరక్షణ, రక్తహీనత సమస్య నివారణ.. ఇలా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో దేశంలోనే ఒకటి, రెండోస్థానాల్లో రాష్ట్రం ఉండాలన్న సీఎం జగన్ లక్ష్యానికి అనుగుణంగా కార్యాచరణతో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ నివాస్, నూరా హెల్త్ డైరెక్టర్ డాక్టర్ సీమామూర్తి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ అదనపు డైరెక్టర్ డాక్టర్ కె.వి.ఎన్.ఎస్.అనిల్కుమార్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కె.అర్జున్రావు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు ఆగవు రాష్ట్రంలో మే ఒకటో తేదీ నుంచి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు సేవలను నిలిపేస్తున్నాయని జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కృష్ణబాబు కోరారు. ఆరోగ్యశ్రీ పథకానికి అత్యంత ప్రా«దాన్యం ఇస్తున్న సీఎం జగన్ బిల్లుల చెల్లింపు విషయంలోను తీవ్రజాప్యం లేకుండా చూస్తున్నారని చెప్పారు. ఇటీవల బిల్లు చెల్లింపుల్లో కొంత ఆలస్యం అయిన మాట వాస్తవమేనని, పెండింగ్ బిల్లుల్లో కొంత భాగాన్ని త్వరలోనే చెల్లిస్తామని తెలిపారు. రూ.రెండువేల కోట్ల మేర బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నది వాస్తవం కాదని, రూ.800 కోట్ల మేర మాత్రమే పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. గతంలో ఆరోగ్యశ్రీ, అనుబంధ సేవలకు ఏడాదికి రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తుంటే.. ప్రస్తుతం రూ.మూడువేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. దీన్నిబట్టి ఈ పథకంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థం అవుతోందని చెప్పారు. -
ఏపీలో కరోనా మరణాలు లేవు: కృష్ణ బాబు
-
ఆంధ్రప్రదేశ్లో కరోనా మరణాలు లేవు: ఎంటీ కృష్ణబాబు
సాక్షి, విజయవాడ: దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 12591 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 5.32 శాతంగా నమోదైంది. ఈక్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. అయితే, ఏపీలో మూడు కోవిడ్ మరణాలు సంభవించాయని వస్తున్న వార్తలపై వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణబాబు స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాకినాడ, విశాఖపట్నంలో నమోదైన మూడు మరణాలకి కరోనా కారణం కాదని స్పష్టం చేశారు. మరణించిన వారిలో ఇద్దరు వైరల్ న్యూమోనియా, ఒకరు ప్యాంక్రియాలైటిస్ కారణంగా మరణించినట్లు వైద్యులు ధృవీకరించినట్లు తెలిపారు. ఏపీలో కరోనా మరణాలు లేవని, కరోనా పరీక్షల సంఖ్యని 5 వేలకి పెంచామని ఈ సందర్భంగా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వేలో గుర్తించిన 17 వేల మంది జ్వర బాధితులకి పరీక్షలు నిర్వహించి, కరోనాపై అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ఏపీలో గత వారంలో పాజిటివిటీ రేటు కేవలం 2.12 శాతం మాత్రమే ఉందని, కరోనా పూర్తిగా అదుపులో ఉందని తెలిపారు. కరోనా ప్రస్తుత వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, రెండు రోజుల పాటు నిర్వహించిన కోవిడ్ మాక్ డ్రిల్ లో గుర్తించిన విషయాలని సమీక్షించినట్లు ఆయన వెల్లడించారు. కొత్త వేరియంట్పై ప్రజలు అనవసర భయాందోళనలకి గురి కావద్దని తెలిపారు. దీర్ఘకాలిక రోగాలున్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చదవండి: టీడీపీ నేత బండారం బట్టబయలు.. సింగర్తో సహజీవనం చేసి.. -
‘వైద్య ఆరోగ్య రంగంలో దేశంలోనే ఏపీ రోల్ మోడల్’
విజయవాడ: ఎకో ఇండియా సంస్థతో ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ఒప్పందం చేసుకుందని..ఎకో ప్రాజెక్ట్ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ.ఎం.టి.కృష్ణబాబు అన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య వ్యవస్థ బలోపేతం, సిబ్బంది సామర్థ్యం పెంచేలా ఎకో ఇండియా ఆధ్వర్యంలో ఎకో ప్రాజెక్టుపై నిర్వహించే రెండు రోజుల సదస్సును ఆయన విజయవాడ లెమన్ ట్రీ హోటల్ లో మంగళవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎం.టి.కృష్ణబాబు మాట్లాడుతూ..ఎకో ఇండియాతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా పలు వైద్య కార్యక్రమాలపై వైద్య సిబ్బందికి పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, బీపీ, షుగర్, క్యాన్సర్ బాధితులకు నాణ్యమైన వైద్యసేవలు అందించేలా శిక్షణ ఉంటుందన్నారు. వార్డు బాయ్ నుంచి అత్యున్నత స్థాయి వైద్యాధికారి వరకు ఎకో ప్రాజెక్టుపై ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని..హెల్త్ కేర్ రంగంలో ఇలాంటి శిక్షణ చాలా ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్ విధానంపై కూడా వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తామని, ప్రతీ ఆరు నెలలకి ఒకసారి శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం ప్రారంభించిన తర్వాత ప్రతి వ్యక్తి యొక్క ఆరోగ్య డేటా డిజిటలైజ్ చేస్తున్నామన్నారు. రోగులతో వైద్య సిబ్బంది మసులుకునే విధానం వల్ల కూడా వారి పరిస్థితుల్లో మార్పు తీసుకురావొచ్చని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఎమర్జెన్సీ కేసుల్లో చాలామంది స్థానిక ఆస్పత్రులపైనే ఆధారపడతారని..అందుకే గ్రామీణ స్థాయిలో మెరుగైన వైద్యం అందించేలా వైద్య సిబ్బందికి శిక్షణ ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎకో ఇండియా సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలను ప్రభావశీలంగా నిర్వహించటానికి దోహదపడుతుందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేసే వైద్యులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. ఆశాకార్యకర్తలు, ఏఎన్ఎం, ఎంఎల్ఎచ్పీ తదితర సిబ్బందికి వివిధ విధానాల్లో శిక్షణ ఇస్తారన్నారు. ఏపీలో మెరుగైన వైద్య సదుపాయాల ద్వారా ముందస్తు రోగ నివారణ జరుగుతోందని..గ్రామస్థాయిలోనే దాదాపు 80 శాతం రోగాలకి చికిత్స అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. తలసేమియా, సికిల్ సెల్ అనీమియా, హీమోఫిలియా వంటి దీర్ఘకాల సమస్యలతో బాధపడే వారి ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. గత రెండేళ్లలో రాష్ట్రంలో 48వేలకు పైగా వైద్య సిబ్బందిని నియమించామని..వారందరికీ ఎకో ప్రాజెక్టు ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మరింత పెంచామన్నారు. పలుచోట్ల ప్రజల్లో ఆరోగ్య సమస్యలపై కొన్ని అపోహలు ఉన్నాయని వాటిని తెలుసుకోవడంలో ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయని గుర్తించాలన్నారు. వైద్య రంగంలో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని..కాలంతో పాటు ప్రజల జీవనశైలిలో మార్పు రావాలన్నారు. టెలీ మెడిసిన్, టెలీ కమ్యూనికేషన్, టెలీ లెర్నింగ్ వంటి అంశాలపై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. ఈ ఏడాది అయిదు మెడికల్ కళాశాలలు ప్రారంభించబోతున్నామని.. ఇప్పటికే విజయనగరం మెడికల్ కాలేజీకి అనుమతులు వచ్చాయన్నారు. ఎకో ఇండియా సంస్ధతో ఎంవోయూ ద్వారా ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థికభారం పడలేదని..వారే ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చారన్నారు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు కూడా ప్రజలు ఆస్పత్రులకు వచ్చే పరిస్థితులు తగ్గించాలనేది ప్రభుత్వ భావనన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి కోవిడ్ మరణాలు సంభవించలేదన్నారు. రాష్ట్రానికి 20 లక్షల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ కావాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామని..జాతీయ రహదారుల పక్కనే 13 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేశామని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ.ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ శ్రీ.జె.నివాస్ మాట్లాడుతూ..రాష్ట్రంలో వైద్య ఆరోగ్య విభాగాన్ని బలోపేతం చేయడంలో భాగమే ప్రాజెక్ట్ ఎకో అన్నారు. ఎకో ఇండియా సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య సిబ్బందికి ఎకో ప్రాజెక్ట్ ద్వారా శిక్షణ ఇస్తామన్నారు. మాతా శిశు సంరక్షణ, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ, గ్రామీణ ప్రాంతాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మౌలిక సదుపాయాలు పెంచడం, వైద్యులు, సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వడం ఎకో ప్రాజెక్టులో భాగంగా జరుగుతుందన్నారు. ఈ ఎకో ప్రాజెక్ట్ ద్వారా రోగులకి మరింత మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్లు, అడిషనల్ డైరెక్టర్లు, అధికారులు, తదితర సిబ్బంది ఉపయోగించుకోవాలని నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ జె.నివాస్ సూచించారు. ఎకో ప్రాజెక్ట్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ డా.సందీప్ భల్లా మాట్లాడుతూ.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కార్యక్రమాల అమలుకు, వాటిని బలోపేతం చేసేందుకు ఎకో ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందన్నారు. 180 దేశాల్లో ఎకో ప్రాజెక్టు సేవలు అందిస్తోందని..2008లో భారత్ లో ప్రారంభించడం జరిగిందన్నారు. దేశంలో 20 రాష్ట్రాలతో ఎకో ఇండియా సంస్థ ఎంవోయూ చేసుకుని ఎకో ప్రాజెక్ట్ ద్వారా శిక్షణ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఎకో ప్రాజెక్టు ద్వారా డాక్టర్లు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, నర్సులు, డెంటిస్టులు, ఆశా, ఏఎన్ఎం, వైద్య సంబంధింత స్పెషలిస్టులు ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడంతో పాటు పరికరాలను ఉపయోగించడంలో నాణ్యమైన శిక్షణ ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ ఎల్.బి.ఎస్.హెచ్.దేవి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రామిరెడ్డి, అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ అర్జున్ రావు, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ యాస్మిన్, నోడల్ ఆఫీసర్ ఫ్యామిలీ ఫిజీషియన్ డాక్టర్ రమేష్, స్టేట్ నోడల్ ఆఫీసర్ విజయలక్ష్మీ, నేషనల్ హెల్త్ మిషన్ ఎస్పీఎమ్ డాక్టర్ వెంకట కిశోర్, సీఏవో గణపతిరావు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు, కన్సల్టెంట్స్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే.. -
కాకినాడ జీజీహెచ్లో ఎంసీహెచ్ భవనం
సాక్షి, అమరావతి: కాకినాడ జీజీహెచ్లో రూ.42 కోట్లతో మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ (ఎంసీహెచ్) బ్లాక్ నిర్మించడంతో పాటు వైద్యపరికరాల్ని ఏర్పాటు చేసేందుకు రంగరాయ వైద్యకళాశాల అల్యుమ్ని ఆఫ్ నార్త్ అమెరికా (ఆర్–ఎమ్కానా) ప్రతినిధులు ముందుకొచ్చారు. మంగళగిరిలోని వైద్యశాఖ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆ శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు సమక్షంలో డీఎంఈ డాక్టర్ వినోద్కుమార్, ఆర్–ఎమ్కానా ప్రతినిధులు ఒప్పందపత్రాలపై సంతకాలు చేశారు. నాడు–నేడు కార్యక్రమం ద్వారా వైద్యరంగంలో సీఎం జగన్ ఆస్పత్రుల బలోపేతం, కొత్త వైద్యకళాశాలలు నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న తీరుకు స్ఫూర్తిగా తాము ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణానికి ముందుకొచ్చామని ఆర్–ఎంకానా ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే రూ.20 కోట్లతో కాకినాడ జీజీహెచ్లో ఎంసీహెచ్ భవనం గ్రౌండ్, మొదటి ఫ్లోర్లను నిర్మించామని, మిగిలిన భవన నిర్మాణం పూర్తిచేయడంతో పాటు అన్ని వసతులతో 18 నెలల్లో ఎంసీహెచ్ బ్లాక్ను ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. అధునాతన సౌకర్యాలతో కూడిన మాతాశిశు సంరక్షణ సేవలు, నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఈ బ్లాక్లో అందుబాటులోకి వస్తాయన్నారు. గ్రౌండ్ఫ్లోర్లో 12 లేబర్ టేబుళ్లు , 40 పడకల యాంటీనేటల్ వార్డు, రెండు ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లు, మొదటి ఫ్లోర్లో 75 పడకల పోస్ట్నేటల్ వార్డు, రెండో ఫ్లోర్లో రెండు అధునాతన ఎలక్టివ్ ఆపరేషన్ థియేటర్లు, మూడు, నాలుగు ఫ్లోర్లలో నియోనేటల్ వార్డు, వెంటిలేటర్, ఫొటోథెరపీ వంటి సౌకర్యాలు సమకూరతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్–ఎంకానా వ్యవస్థాపకులు, రంగరాయ వైద్యకళాశాల రెండోబ్యాచ్కు చెందిన డాక్టర్ నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, డాక్టర్ పాలడుగు రాంబాబు, డాక్టర్ ఎస్.వి.లక్ష్మీనారాయణ, కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ హేమలత పాల్గొన్నారు. ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణానికి ముందుకొచ్చిన ఆర్–ఎంకానా ప్రతినిధులకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, కృష్ణ బాబు కృతజ్ఞతలు తెలిపారు. -
కరోనాపై కంగారొద్దు.. అప్రమత్తమైన రాష్ట్ర వైద్యశాఖ
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర వైద్యశాఖ ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అయితే తొలి నుంచి కరోనా వైరస్ నియంత్రణ పట్ల పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిరంతర అప్రమత్తతతో వ్యవహరిస్తోంది. ఒకవేళ మన వద్ద కేసుల నమోదు పెరిగినా వైఎస్సార్ విలేజ్ క్లినిక్ల ద్వారా గ్రామస్థాయిలోనే అనుమానిత లక్షణాలున్న వారికి పరీక్షలతో పాటు, పాజిటివ్ రోగులకు వైద్యసేవలను అందుబాటులో ఉంచుతోంది. విలేజ్ క్లినిక్స్లో ర్యాపిడ్ కిట్లు గ్రామాల్లో ప్రజలకు వైద్యసేవలను చేరువ చేయడానికి 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిల్లో కరోనా పరీక్షతో పాటు 14 రకాల రోగ నిర్ధారణకు ర్యాపిడ్ కిట్లతో పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి విలేజ్ క్లినిక్లో కనీసం 10 కరోనా పరీక్షల ర్యాపిడ్ కిట్లను వైద్యశాఖ నిరంతరం అందుబాటులో ఉంచుతోంది. ర్యాపిడ్ టెస్టుల్లో పాజిటివ్గా తేలినవారి నమూనాలను ఆర్టీపీసీఆర్ ల్యాబ్లకు పంపి పరీక్షించనున్నారు. రాష్ట్రంలో 13 ఆర్టీపీసీఆర్ ల్యాబ్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్బీబీ.1.16 వేరియంట్ కేసులు అధికం కొత్త వేరియంట్ కేసుల నమోదుపైనా వైద్యశాఖ నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. పాజిటివ్ రోగుల నమూనాలను విజయవాడలోని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్కు పంపి పరీక్షిస్తున్నారు. రాష్ట్రంలో ఇటీవల ఎక్స్బీబీ.1.16 వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టు తేలింది. గత నెల ఒకటో తేదీ నుంచి ఈ నెల 5వ తేదీ మధ్య పాజిటివ్ రోగుల 167 నమూనాలను సీక్వెన్సింగ్ చేశారు. వీటిలో అత్యధికంగా 84 కేసులు ఎక్స్బీబీ.1.16 రకం ఉన్నాయి. ఎక్స్బీబీ.1 రకం కేసులు 13, ఎక్స్బీబీ.2.3. వేరియంట్ కేసులు 17, మిగిలినవి ఇతర వేరియంట్లుగా తేలింది. ఎనీటైమ్ అందుబాటులో పడకలు, మందులు కరోనా తొలి వేవ్ నుంచి వైరస్ వ్యాప్తి తగ్గినప్పటికీ.. ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్ నిల్వలు, ఇతర చికిత్స వనరులను ప్రభుత్వం నిరంతరం అందుబాటులో ఉంచుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఆరోగ్యశ్రీ ప్రైవేట్ ఆస్పత్రుల్లో 12,292 సాధారణ, 34,763 ఆక్సిజన్, 8,594 ఐసీయూ, 1,092 పీడియాట్రిక్ ఐసీయూ పడకలు అందుబాటులో ఉన్నాయి. 5,813 వెంటిలేటర్లు, 5,610 పీడియాట్రిక్ వెంటిలేటర్లు, 297 నియోనాటల్ వెంటిలేటర్లు, 3,902 డీటైప్ సిలిండర్లు, 15,565 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 170 పీఎస్ఏ ప్లాంట్లు ఉన్నాయి. వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయడానికి 2,64,109 ర్యాపిడ్ కిట్లు, 4,88,962 వీటీఎం–ఆర్టీపీసీఆర్ కిట్లు ఉన్నాయి. చికిత్సలో వాడే రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు 1.39 లక్షలు, ఇతర మందుల నిల్వలు సరిపడా ఉన్నాయి. వందశాతం రెండుడోసుల వ్యాక్సినేషన్ రాష్ట్రంలో 18 ఏళ్లుపైబడిన 3.95 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ వేయాల్సిందిగా లక్ష్యం ఉంది. ఈ క్రమంలో లక్ష్యానికి మించి 4.35 కోట్ల మందికి ఇప్పటికే రెండుడోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. 12 నుంచి 17 ఏళ్ల పిల్లలందరికీ రెండుడోసుల వ్యాక్సిన్ వేశారు. 18–59 మధ్య వయసుగల 2.30 కోట్ల మందికి ప్రికాషన్ డోసు టీకాను వైద్యశాఖ వేసింది. ఆందోళనకర పరిస్థితి లేదు రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తి నియంత్రణలో ఉంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ కేసులు పెరిగినా సమర్థంగా నియంత్రించడానికి అన్ని వనరులు సిద్ధంగా ఉన్నాయి. ఫీవర్ సర్వేను నిరంతరాయంగా కొనసాగిస్తున్నాం. ప్రస్తుతం 49వ రౌండ్ ఫీవర్ సర్వే చేపడుతున్నాం. అనుమానిత లక్షణాలున్న వారిని గుర్తించి అవసరం మేరకు వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం. వృద్ధులు, ధీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వైరస్ బారినపడకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. సాధారణ ప్రజలు సైతం సమూహాల్లో ఉన్నప్పుడు మాస్క్ ధరించాలి. – ఎం.టి.కృష్ణబాబు, ముఖ్యకార్యదర్శి వైద్య, ఆరోగ్యశాఖ -
శారీరక శ్రమతోనే ఎన్సీడీ సమస్యలకు చెక్
సాక్షి, అమరావతి: బీపీ, షుగర్, ఇతర నాన్కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) నుంచి బయటపడడానికి నడక, వ్యాయామం వంటి శారీరకశ్రమే శరణ్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు చెప్పారు. ఆయన సోమవారం మంగళగిరిలోని తన కార్యాలయం నుంచి రాష్ట్రంలోని ప్రైవేట్, ఎయిడెడ్, సాంకేతిక విద్యాసంస్థల యజమానులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్సీడీ సమస్యల బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సీఎం జగన్ ఆదేశించినట్టు చెప్పారు. ఇందులో భాగంగా అవగాహన కార్యక్రమాలను డ్రైవ్లా చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. దీనికి ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు సహకరించాలని కోరారు. రోజూ ఉదయం ఐదు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు నడక, వ్యాయామాలు చేసుకోవడానికి వీలుగా స్థలాలు, క్రీడామైదానాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. దీనిపై విద్యాసంస్థల యాజమాన్యాలు రెండు, మూడురోజుల్లో తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా తెలపాలని కోరారు. రాష్ట్రంలో 1990లో 30 శాతం ఉన్న ఎన్సీడీ ప్రభావం ప్రస్తుతం 63 శాతానికి పెరిగిందని చెప్పారు. రాష్ట్రంలో 68 శాతం మరణాలకు ఎన్సీడీ సమస్యలే ప్రధాన కారణమన్నారు. ఈ క్రమంలో ఎన్సీడీ సమస్యల కట్టడిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. 30 ఏళ్లు పైబడిన వారికి వైద్యశాఖ స్క్రీనింగ్ చేసి ఆరోగ్య సమస్యలు గుర్తిస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి ఐదుగురిలో ఒకరు బీపీ/షుగర్తో ఉన్నట్టు తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కాన్ఫరెన్స్లో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్, ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు, కమిషనర్ సురేష్బాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ నివాస్, ఉన్నత విద్యామండలి చైర్మన్ డాక్టర్ హేమచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సీఎం జగన్ అభినందనలు
తాడేపల్లి : వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఇటీవల జాతీయస్థాయిలో నిర్వహించిన సదస్సులో పేపర్ రహిత వైద్య సేవలు(డిజిటల్ హెల్త్ సర్వీసెస్) అంశంలో ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ విభాగం ఐదు అవార్డులను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సచివాలయంలో సీఎం జగన్ను మంత్రి విడదల రజని, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు కలిసి రాష్ట్రానికి వచ్చిన అవార్డులను చూపించారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అవార్డులు గెలుచుకోవడంపై సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వైద్య ఆరోగ్యశాఖ అధికారులను సీఎం జగన్ అభినందించారు. -
మార్చికల్లా పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్
సాక్షి, విశాఖపట్నం: వచ్చే మార్చి నాటికి శ్రీకాకుళం జిల్లా పలాసలోని కిడ్నీ రీసెర్చి సెంటర్ అందుబాటులోకి తెస్తున్నామని.. ఇక్కడి ఉద్దానంతో పాటు ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరుల్లోని కిడ్నీ తీవ్రతను తగ్గించే చర్యలు కూడా ఇప్పటికే చేపట్టామని.. వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు వెల్లడించారు. అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఆపీ), ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖలు కూడా పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించామన్నారు. విశాఖలో మూడ్రోజులుగా జరుగుతున్న గ్లోబల్ హెల్త్ సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ ఒప్పందం జరిగితే ప్రవాస భారతీయ వైద్య ప్రముఖుల సేవలను రాష్ట్ర ప్రభుత్వ వైద్యశాలలు, వైద్య విద్యాలయాలు వినియోగించుకునే అవకాశం కలుగుతుందన్నారు. ఈ సమ్మిట్ ద్వారా వైద్య రంగ నిపుణుల సూచనలు, సలహాలను ప్రభుత్వం తీసుకుని వాటి ఆచరణకు కృషిచేస్తుందని చెప్పారు. విదేశీ వైద్య ప్రముఖులు రాష్ట్రానికి వచ్చిన సమయంలో ప్రధాన వైద్యశాలల్లో అత్యవసర చికిత్సలతో పాటు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని కోరినట్లు తెలిపారు. విదేశాల్లో స్థిరపడిన మన వైద్యులు వారి అనుభవాలను మన రాష్ట్ర వైద్య విధానంలో మార్పుల కోసం సహకరించాలని కోరారు. అంకాలజీ విభాగాల బలోపేతం అలాగే, రాష్ట్రంలోని ఏడు పురాతన వైద్య కళాశాలల్లో అడ్వాన్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్ సదుపాయాలతో పాటు రేడియోథెరపీ, సర్జికల్, మెడికల్ అంకాలజీ విభాగాలను బలోపేతం చేసే అంశం ప్రభుత్వ ప్రతిపాదనలో ఉందని కృష్ణబాబు వెల్లడించారు. ఈ సదస్సులో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి జీఎస్ నవీన్కుమార్, ‘ఆపీ’ ఇండియా ప్రతినిధులు డాక్టర్ టి.రవిరాజు, రవి కొల్లి, ‘ఆపీ’ అమెరికా కోఆర్డినేటర్ ప్రసాద్ చలసాని, భారత సంతతి అమెరికా వైద్యులు, దేశంలోని పలువురు ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు. అంతకుముందు.. డాక్టర్ రవిరాజు ఎక్స్లెన్స్ అవార్డును ప్రసాద్ చలసానికి ప్రదానం చేశారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తోందని కృష్ణబాబు చెప్పారు. ఇందుకోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో ఆరోగ్య పథకాలు, సేవలను అమలుచేస్తున్నారన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆరోగ్య రంగంలో నాడు–నేడు కార్యక్రమం ద్వారా రూ.16 వేల కోట్లు వెచ్చించినట్టు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 17 వైద్య కళాశాలలు, ప్రతి జిల్లాలో ఒక క్యాథ్ల్యాబ్ను గిరిజన ప్రాంతాల్లో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటుచేస్తున్నామన్నారు. దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ ఫిజిషియన్ విధానాన్నీ ఆంధ్రప్రదేశ్లో అమలుచేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇక ఆరోగ్యశ్రీలో ఎంప్యానెల్ చేసిన 2,225 ఆస్పత్రుల ద్వారా 3,255 రకాల వ్యాధులకు చికిత్స అందుబాటులో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క క్యాన్సర్కే ఏటా రూ.400 కోట్లు వెచ్చిస్తోందన్నారు. -
‘డైట్ కాంట్రాక్టర్లకు అధికశాతం బిల్లులు చెల్లించేశాం’
సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో డైట్ కాంట్రాక్టర్లకు గత నెలలోనే అత్యధిక శాతం బిల్లులు చెల్లించామని, ఈ విషయం తెలుసుకోకుండా రూ.లక్షల్లో బిల్లులు పెండింగ్లో ఉన్నాయంటూ ఈనాడు తప్పుడు కథనాలు రాసిందని వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు మండిపడ్డారు. ఆయన సోమవారం విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని తెలిపారు. అసత్య ప్రచారాలతో ప్రజల్లో ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం సన్నగిల్లి ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి, ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. డీఎంఈ, ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో షెడ్యూల్ ప్రకారం గతనెల 26నే రూ.6 కోట్ల మేర డైట్బిల్లులు చెల్లించామన్నారు. ఇంకా రూ.94 లక్షలు మాత్రమే చెల్లించాల్సి ఉందని, త్వరలోనే చెల్లిస్తామని అన్నారు. జనని సురక్ష యోజన కింద రూ.13.69 కోట్లు గత నెల 22నే కలెక్టర్లకు మంజూరు చేశామన్నారు. సాలూరు ఆస్పత్రిలో పెండింగులో ఉన్నది రూ.1.40 లక్షలు కాగా, రూ.12 లక్షలు పెండింగ్ ఉన్నాయంటూ రాశారన్నారు. పార్వతీపురం మన్యంలో రూ.12 లక్షలకు గాను రూ.9.70 లక్షలు డిసెంబర్ 26న చెల్లించామన్నారు. బాడంగి ఆస్పత్రిలో రూ.4.80 లక్షలు పెండింగ్లో ఉందన్నారు. ఇవన్నీ తెలుసుకోకుండా తప్పుడువార్తలు రాయడంవెనుక ఉద్దేశం ప్రజలను తప్పుదోవ పట్టించడం, ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడమేనన్నారు. గ్రీన్ చానల్ ఏర్పాటుచేసి మరీ డైట్ బిల్లులను ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డైట్ చార్జీలను రోగికి రూ.40 నుంచి రూ.80కు పెంచామన్నారు. పెంచిన చార్జీలకు అనుగుణంగా కొత్త కాంట్రాక్టర్ల ఎంపిక జరుగుతోందని చెప్పారు. వివిధ రాష్ట్రాల్లో బడ్జెట్లో 3.4 శాతం నుంచి 4 శాతం మేర మాత్రమే వైద్య రంగానికి ఖర్చు చేస్తుండగా, మన రాష్ట్రంలో 7.3 శాతం ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. 2018–19లో ఏపీవీవీపీలో రూ.కోటి మేర నెలకు ఆరోగ్యశ్రీ కింద బిల్లు చెల్లింపులు ఉండేవని, ప్రస్తుతం నెలకు రూ.12 కోట్లు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లిస్తున్నామని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడం కోసం ప్రభుత్వం రూ.16 వేల కోట్లకు పైగా నిధులతో నాడు–నేడు చేపట్టిందని, 47 వేలకుపైగా పోస్టుల భర్తీ చేపట్టిందని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మార్పును తెలుసుకోవడానికి జనవరి 26 నుంచి ప్రజాప్రతినిధుల ద్వారా ఆస్పత్రుల్లో తనిఖీలు చేపట్టి ఆడిట్ చేయాలని ముఖ్యమంత్రి‡ వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారన్నారు. -
యాంటి బయోటిక్స్ అనధికార విక్రయాలకు కళ్లెం
సాక్షి, అమరావతి: యాంటి బయోటిక్స్ విచ్చలవిడిగా వినియోగించడం ప్రాణాంతకంగా మారుతోందని వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి. కృష్ణబాబు అన్నారు. ప్రపంచ దేశాలకు పెనుముప్పుగా మారుతున్న యాంటీ మైక్రోబియాల్ రెసిస్టెన్స్(ఏఎంఆర్)ను నియంత్రించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు విజయవాడలో రెండు రోజులుగా జరుగుతున్న వర్క్షాప్ శనివారం ముగిసింది. ‘యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ కాల్ ఫర్ యాక్షన్’ను ఆవిష్కరించిన కృష్ణబాబు ఏఎంఆర్ యాక్షన్ ప్లాన్ల బలోపేతానికి ‘విజయవాడ డిక్లరేషన్’ను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావితరాలను రక్షించుకునేందుకు యాంటీ బయోటిక్స్ వినియోగం వల్ల పెరుగుతున్న ఏఎంఆర్ను కట్టడి చేయాలన్నారు. ఇందుకోసం యాంటి బయోటిక్స్ వినియోగాన్ని తగ్గించడంతోపాటు అనధికారిక విక్రయాలకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏఎంఆర్ కట్టడి కోసం గ్రామ స్థాయిలో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఏఎంఆర్ కట్టడి కార్యాచరణ ప్రణాళికను ప్రయోగాత్మకంగా అమలుచేసేందుకు రాష్ట్రంలోని కృష్ణా జిల్లాను కేంద్రం ఎంపిక చేసిందని తెలిపారు. గత నాలుగేళ్లుగా అమలవుతున్న ఈ ప్రణాళిక ఫలితాలను సమీక్షించి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఆసియన్ బయోటెక్ అసోసియేషన్స్ (ఫాబా), ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఆఫ్ ఇండియా (ఇఫ్కాయ్), వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్ (డబ్ల్యూఏపీ) వంటి అంతర్జాతీయ సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయనున్నాయని చెప్పారు. వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్, ఏఎంఆర్ నోడల్ అధికారి జె.నివాస్, వైద్య విద్యా శాఖ డైరెక్టర్ డాక్టర్ వినోద్కుమార్, డ్రగ్ కంట్రోల్ డీజీ రవిశంకర్ నారా>యణ్, ఫాబా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ పి.రెడ్డన్న, సెక్రటరీ జనరల్ డాక్టర్ రత్నాకర్, ఇఫ్కాయ్ అధ్యక్షుడు డాక్టర్ రంగారెడ్డి పాల్గొన్నారు. -
గ్రామాలకు స్పెషలిస్ట్ వైద్యులు
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రజలకు స్పెషలిస్ట్ వైద్యుల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీహెచ్సీ, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు పూర్తి చేసిన వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మెడికల్ పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు రూరల్/ప్రభుత్వ సేవలను తప్పనిసరి చేసింది. ప్రభుత్వ కళాశాలల్లో రాష్ట్ర కోటా, ప్రైవేట్ కళాశాలల్లో ఏ–కేటగిరీ సీట్లలో అడ్మిషన్లు పొంది కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఒక సంవత్సరం తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో ప్రభుత్వం గౌరవ వేతనం చెల్లిస్తుంది. ఈ మేరకు వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. 2022–23వ విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు పొందే విద్యార్థులకు ఈ నిబంధన వర్తిస్తుంది. కోర్సులు పూర్తి చేసుకున్న స్పెషలిస్ట్ వైద్యులను తొలి ప్రాధాన్యత కింద ఏపీ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో నియమిస్తారు. ఆ తర్వాత మిగిలిన వారి సేవలను డీఎంఈ పరిధిలో వినియోగించుకుంటారు. ముందుగానే ఒప్పందం నాన్ సర్వీస్ అభ్యర్థులు కోర్సు అనంతరం సంవత్సరం పాటు రూరల్/ప్రభుత్వ సేవలు అందించేలా ముందుగానే ఒప్పంద పత్రం తీసుకుంటారు. ఒప్పందాన్ని ఉల్లంఘించి కోర్సు పూర్తయిన 18నెలల వ్యవధిలో ప్రభుత్వ సేవల్లో చేరకపోతే పీజీ చేసినవారికి రూ.40 లక్షలు, సూపర్ స్పెషాలిటీ కోర్సులు చేసిన వారికి రూ.50లక్షల జరిమానా విధిస్తారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో రాష్ట్ర కోటా సీట్లలో 707 మంది, ప్రైవేట్ కళాశాలల్లో ఏ–కేటగిరీ సీట్లలో 1,142 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందుతారు. వీరందరూ ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లో తప్పనిసరిగా సేవలు అందించాల్సి ఉంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు పొందనున్న వీరందరూ 2025–26లో కోర్సులు పూర్తి చేసుకుంటారు. అనంతరం గ్రామీణ సేవల్లో చేరాల్సి ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లో స్పెషలిస్టు వైద్యుల కొరత తీరనుంది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. అన్ని కళాశాలలకు ఆదేశాలు మెడికల్ పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు అందించేలా ముందుగానే ఒప్పంద పత్రాలు తీసుకోవాలని అన్ని కాలేజీలకు డీఎంఈ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నాన్–సర్వీస్ అభ్యర్థులకు రాష్ట్ర కోటా, ఏ–కేటగిరీ సీట్లలో అడ్మిషన్లు ఇచ్చేటప్పుడు కచ్చితంగా బాండ్ తీసుకోవాలని తెలిపారు. అన్ని కాలేజీలకు ఆదేశాలు ► మెడికల్ పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు అందించేలా ముందుగానే ఒప్పంద పత్రాలు తీసుకోవాలని అన్ని కాలేజీలకు డీఎంఈ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నాన్–సర్వీస్ అభ్యర్థులకు రాష్ట్ర కోటా, ఏ–కేటగిరీ సీట్లలో అడ్మిషన్లు ఇచ్చేటప్పుడు కచ్చితంగా బాండ్ తీసుకోవాలని తెలిపారు. -
మరింత మెరుగ్గా 108, 104 సేవలు
సాక్షి, అమరావతి: 108 అంబులెన్సులు, 104 మొబైల్ మెడికల్ యూనిట్(ఎంఎంయూ)ల సేవలను ప్రజలకు మరింత మెరుగ్గా అందించాలని అధికారులను వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఆదేశించారు. బుధవారం మంగళగిరిలోని వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో 108, 104ల పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు. టెండర్ అగ్రిమెంట్ ప్రకారం సేవలందించడం లేదంటూ ఐటీ విభాగంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. 108 అంబులెన్సులలో జీపీఎస్ సౌకర్యంపై ఆరా తీశారు. వాహనాల మరమ్మతుల విషయంలో జాప్యం చేయొద్దని స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో వాహనాల బఫర్ స్టాక్ తప్పనిసరిగా ఉంచాలన్నారు. రెండు వారాల్లో సేవలు మెరుగుపడకపోతే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
గర్భిణీల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాం: కృష్ణబాబు
-
వైద్యులకు ఇదో మంచి పేరు తెచ్చుకునే అవకాశం: వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
-
క్యాన్సర్ చికిత్సపై సీఎం జగన్ ఆ విధంగా ఆలోచన చేస్తున్నారు: కృష్ణబాబు
సాక్షి, అమరావతి: హోమీబాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. విశాఖ కింగ్ జార్జి ఆసుపత్రి, తిరుపతి స్విమ్స్, విజయవాడ చినకాకాని ఆసుపత్రిలో క్యాన్సర్ ట్రీట్మెంట్పై ఒప్పందం జరిగినట్లు వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు తెలిపారు. ఈ మేరకు కృష్ణబాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఏపీలో క్యాన్సర్ చికిత్సకు నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చిస్తోంది. గత ఏడాది లక్షా 30 వేల మందికి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రతి 50 కిలోమీటర్లకు క్యాన్సర్ వైద్యం అందే స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలిదశలోనే క్యాన్సర్ను గుర్తించి వైద్యం అందించాలనే ఆలోచన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. గ్రామ సచివాలయాలు క్యాన్సర్కి సంబంధించి టెలి కన్సల్టెన్సీ సర్వీస్ ఏర్పాటు చేశామని వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు తెలిపారు. ఇదిలా ఉంటే, రాష్ట్రంలో ప్రతి లక్ష మంది జనాభాలో సుమారు 120 మంది క్యాన్సర్తో బాధపడుతున్నట్టు ఓ అంచనా. ఈ సంఖ్య భవిష్యత్లో మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధునాతన వైద్య విధానాలతో రాష్ట్రంలో క్యాన్సర్ చికిత్స వనరులను సమకూర్చేందుకు ప్రణాళికలు రచించారు. ఈ క్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ విశాఖపట్నం హోమీ బాబా ఆస్పత్రి నుంచి సాంకేతిక సహకారం పొందనుంది. వ్యాధి గుర్తింపునకు స్క్రీనింగ్, పలు రకాల క్యాన్సర్ ప్రమాదాల గుర్తింపు, జిల్లాల్లో ప్రివెంటివ్ అంకాలజీ, క్యాన్సర్ డే కేర్ సేవలు అందుబాటులోకి తేవడం, రిజిస్ట్రీ, ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బందికి నైపుణ్యాల పెంపునకు శిక్షణ అందించడం వంటివి హోమీ బాబా ఆస్పత్రి అందించనుంది. ప్రభుత్వాస్ప త్రుల్లో పొగాకు విరమణ కేంద్రాల ఏర్పాటు, స్క్రీనింగ్లో నిర్ధారించిన క్యాన్సర్ రోగులు, హైరిస్క్ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు రెఫరల్ విధానం రూపకల్పనకు సంబంధించి హోమీ బాబా ఆస్పత్రి సహకారం అందించనుంది. విభజన అనంతరం క్యాన్సర్ చికిత్స వనరులను ఏపీ కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో క్యాన్సర్ వ్యాధి కట్టడి, ప్రభుత్వ రంగంలో చికిత్స వనరులను మెరుగుపరచడంపై సీఎం వైఎస్ జగన్ సర్కార్ దృష్టి సారించింది. భవిష్యత్లో క్యాన్సర్ చికిత్స కోసం ఇతర రాష్ట్రాలకు ప్రజలు వెళ్లకుండా రాష్ట్రంలోనే చికిత్స వనరులను మెరుగుపరచనున్నారు. చదవండి: (టీడీపీ ఆరిపోయే దీపం: మంత్రి జోగి రమేష్) -
AP: క్యాన్సర్కు రాష్ట్రంలోనే కార్పొరేట్ వైద్యం
సాక్షి, అమరావతి: క్యాన్సర్ బాధితులకు రాష్ట్రంలోనే కార్పొరేట్ వైద్యం అందిచాలన్నదే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు అన్నారు. కాంప్రెహెన్సివ్ క్యాన్సర్ కేర్ రోడ్ మ్యాప్పై అధికారులతో సోమవారం ఆయన మంగళగిరి ఏపీఐఐసీ భవనంలోని వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రత్యేక కార్యదర్శి నవీన్కుమార్ రోడ్ మ్యాప్ను వివరించారు. కృష్ణబాబు మాట్లాడుతూ.. అధునాతన క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తెచ్చేందుకు విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న 11 ప్రభుత్వ బోధనాస్పత్రులలో క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఇందులో భాగంగా 7 బోధనాస్పత్రుల్లో రేడియోథెరపీ, మెడికల్, సర్జికల్ అంకాలజీ విభాగాలను అభివృద్ధి చేయాలన్నారు. మిగతా నాలుగుచోట్ల సేవలు విస్తరింపజేయాలన్నారు. క్యాన్సర్ చికిత్స కోసం సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు. ఇక విశాఖలోని హోమీ బాబా క్యాన్సర్ ఆçస్పత్రికి సాంకేతిక బృందాన్ని పంపి శిక్షణాంశాలపై నివేదిక రూపొందించాలన్నారు. గ్రామస్థాయి వరకూ క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తెచ్చేందుకు సమగ్ర కార్యాచరణ సిద్ధంచేయాలని కోరారు. కొత్తగా నిర్మించే 16 వైద్య కళాశాలల్లోను క్యాన్సర్ చికిత్స పరికరాల కోసం బంకర్ల నిర్మాణం చేపట్టాలన్నారు. రేడియో అంకాలజీ కోసం లీనియర్ యాక్సిలేటర్, కొబాల్ట్, బ్రాఖీ థెరపీ, సి.టి స్టిమ్యులేటర్ పరికరాలపై ఆయన ఆరా తీశారు. క్యాన్సర్ కేర్ సెంటర్లుగా ఆ మూడు.. విశాఖ ఏఎంసీ, గుంటూరు జిల్లా చినకాకాని, తిరుపతిలోని బాలాజీ అంకాలజీ ఇన్స్టిట్యూట్ కాంప్రెహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్లుగా అభివృద్ధి చేస్తామని కృష్ణబాబు చెప్పారు. టీచింగ్ ఆస్పత్రుల్లో రేడియోథెరపీని అందుబాటులోకి తేవాలన్నారు. సమావేశంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె. నివాస్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్ వినోద్ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఎంఈ రాఘవేంద్రరావు, డీహెచ్ హైమావతి పాల్గొన్నారు. -
ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి
సాక్షి, అమరావతి: ఆస్పత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, భద్రతా సిబ్బంది పనితీరును తరుచూ పర్యవేక్షించాలని కలెక్టర్లను వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఆదేశించారు. ఆకస్మిక తనిఖీలతోనే ఆస్పత్రుల్లో వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని సూచించారు. గురువారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాస్పత్రుల్లోని వైద్య సేవలపై మీడియాలో వచ్చే వ్యతిరేక వార్తలపై ఎప్పటికప్పుడు కలెక్టర్లు స్పందించాలని సూచించారు. అధునాతన పరికరాల కొనుగోలు, వాటి నిర్వహణను ఏపీఎంఎస్ఐడీసీ పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. పీహెచ్సీల నుంచి టీచింగ్ ఆస్పత్రుల వరకు అన్ని బయోమెడికల్ పరికరాల నిర్వహణను కాంట్రాక్ట్ పద్ధతిలో చేపడుతున్నట్లు చెప్పారు. అదనంగా కావాల్సిన మహాప్రస్థానం వాహనాల విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఆర్డీవో, డీఎస్పీలతో కూడిన కమిటీలు ప్రైవేట్ వాహనాల మాఫియాను అడ్డుకోవడంతోపాటు స్థానిక ఆపరేటర్లతో చర్చించి వాహనాల రేట్లను అందరికీ తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయించాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో మందులు, మహాప్రస్థానం వాహనాలు, శానిటేషన్, సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్, వ్యాక్సినేషన్, బయోమెట్రిక్ హాజరు, సిబ్బంది నియామకం తదితర అంశాలపై ఆరా తీశారు. -
ఏపీలో ఇద్దరు ఐఏఎస్ అధికారుల బదిలీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా అనిల్కుమార్ సింఘాల్, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎం.టి కృష్ణబాబు బదిలీ అయ్యారు. కృష్ణబాబుకు రవాణాశాఖ అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. చదవండి: మండేకాలం.. జాగ్రత్త సుమా..! -
రెండ్రోజుల్లో అందరినీ తీసుకొస్తాం
సాక్షి, అమరావతి: ఉక్రెయిన్లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులందరినీ రెండ్రోజుల్లో రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధంచేసుకుంది. ఈ విషయమై ఏర్పాటైన టాస్క్ఫోర్స్ కమిటీ ఉక్రెయిన్లో ఉన్న తెలుగు విద్యార్థుల వివరాలను సేకరించింది. కంట్రోల్ రూమ్, హెల్ప్లైన్, కన్సల్టెన్సీల ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం.. ఉక్రెయిన్లో రాష్ట్రానికి చెందిన 615 మంది విద్యార్థులు ఉన్నట్లు లెక్కతేలిందని టాస్క్ఫోర్స్ కమిటీ చైర్మన్ ఎంటీ కృష్ణబాబు వెల్లడించారు. వీరితోపాటు వారి తల్లిదండ్రులతోనూ మాట్లాడామని.. కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగ’ పేరుతో ఏర్పాటుచేస్తున్న ప్రత్యేక విమానాల్లో వీరందరినీ స్వదేశానికి తీసుకువస్తున్నట్లు సోమవారం ఆయన ప్రకటనలో తెలిపారు. వీరిని ఢిల్లీ, ముంబై ఎయిర్పోర్టుల నుంచి ప్రత్యేక అధికారుల నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులతో ఏపీకి తీసుకొస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు ఐదు ప్రత్యేక విమానాల ద్వారా రాష్ట్రానికి చెందిన 32 మంది విద్యార్థులను తీసుకొచ్చామని, మిగిలిన వారిని కూడా మార్చి రెండులోగా తీసుకురానున్నట్లు కృష్ణబాబు వెల్లడించారు. ఇక ఉక్రెయిన్లో ఉన్న విద్యార్థులను పోలండ్, మాల్డోవా, రొమేనియా, హంగేరి, స్లొవేకియా దేశాలకు తరలించి అక్కడి నుంచి స్వదేశానికి తీసుకొస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏపీ ఎన్ఆర్టీఎస్ సహకారంతో ఆయా దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రుల సహకారంతో విద్యార్థులకు అవసరమైన వసతి, భోజనం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 5 వర్సిటీల్లోనే అధికంగా విద్యార్థులు రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఉక్రెయిన్లోని 14 విశ్వవిద్యాలయాల్లో చేరారని.. ఇందులో అత్యధికంగా ఐదు విశ్వవిద్యాలయాల్లోనే ఉన్నారని కృష్ణబాబు పేర్కొన్నారు. మరోవైపు.. దక్షిణ ఉక్రెయిన్ ప్రాంతంలో ఉన్న జఫోరియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ చుట్టపక్కలే స్వల్పంగా బాంబుదాడులు జరిగినట్లు తేలిందని కృష్ణబాబు తెలిపారు. అలాగే, కైవ్ మెడికల్ యూనివర్సిటీ ఆఫ్ యూఏఎఫ్ఎం, ఓడెస్సా నేషనల్ మెడికల్ యూనివర్సిటీ, ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ, విన్టెసా ఓఓ బోగోమోలెట్స్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీల్లో రాష్ట్ర విద్యార్థులు అధికంగా ఉన్నారన్నారు. ఇక విశాఖపట్నం నుంచి 95 మంది, కృష్ణా జిల్లా నుంచి 89 మంది, తూర్పు గోదావరి నుంచి 70 మంది విద్యార్థులు వెళ్లగా, అత్యల్పంగా విజయనగరం నుంచి 11 మంది, శ్రీకాకుళం నుంచి 12, కర్నూలు నుంచి 20 మంది వెళ్లారు. -
క్షేమంగా చేరుస్తాం..
సాక్షి, అమరావతి : ఉక్రెయిన్లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులను ఖర్చుకు వెనకాడకుండా సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని, ఈ అంశంపై ఏర్పాటైన రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ ఎంటీ కృష్ణబాబు తెలిపారు. ఉక్రెయిన్ పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారని చెప్పారు. ఆ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. శనివారం ఆయన సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర విద్యార్థులను ప్రభుత్వ ఖర్చుతో స్వస్థలాలకు చేర్చాలని సీఎం ఆదేశించారని, ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఉక్రెయిన్ నుంచి ఇండియాకు భారత ప్రభుత్వం ఉచితంగా విమానాల్లో తీసుకు వస్తుండగా, అక్కడి నుంచి వారి స్వగ్రామాలకు వెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఇందుకోసం ముంబై, ఢిల్లీ ఎయిర్పోర్టుల్లో రాష్ట్రం తరఫున రెండు రిసెప్షన్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ముంబై రిసెప్షన్ కేంద్ర బాధ్యతలను రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ ఐజీ రామకృష్ణ, ఢిల్లీ బాధ్యతలను రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్, డిప్యూటీ రెసిడెంట్ కమిషనర్ హిమాన్షుకు అప్పజెప్పామని తెలిపారు. ఉక్రెయిన్ నుంచి వచ్చే వారు ఈ రిసెప్షన్ కేంద్రాలను సంప్రదిస్తే.. వారి స్వస్థలాలకు వెళ్లే వరకు ఉచిత భోజన, ప్రయాణ వసతులను రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుందన్నారు. శనివారం వచ్చే రెండు ప్రత్యేక విమానాల్లో రాష్ట్రానికి చెందిన 22 మంది ఉన్నారని విదేశాంగ శాఖ తెలిపిందనీ, అయితే వారిని సంప్రదిస్తే అందులో చాలా మంది ఇతర రాష్ట్రాలవారున్నారు. ఆర్టీజీఎస్ కేంద్రంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, 24 గంటలు సేవలు అందించడానికి అధికారులు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఎక్కడి వారు అక్కడే ఉండండి.. ఉక్రెయిన్లో ఉన్న మన వాళ్లందరూ కేంద్ర విదేశాంగ శాఖ ఇచ్చే సూచనలను తూ.చ. తప్పకుండా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. తొలుత సరిహద్దు దేశాల వద్దకు చేరితే, అక్కడి నుంచి తరలిస్తామని భారత ప్రభుత్వం చెప్పిందని, అయితే ఇప్పుడు ఎక్కడి వారు అక్కడే ఉండాలని ఆదేశాలు జారీ చేయడంతో అందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కృష్ణబాబు సూచించారు. విద్యార్థులు ఎటువంటి సాహస కార్యక్రమాలు చేయకుండా ఎక్కడ ఉన్న వారు అక్కడే ఉండాలన్నారు. ఏ విధంగా ఎక్కడికి రావాలో భారత ఎంబసీ చేసే సూచనలు పాటించాలన్నారు. ఎప్పటికప్పుడు సమాచారం, సూచనలు, సలహాలు చేరవేయడం కోసంఉక్రెయిన్లో ఉన్న తెలుగు వారి కోసం ప్రత్యేకంగా వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ గ్రూపులో 300 మంది సభ్యులుగా చేరినప్పటికీ, వాస్తవంగా ఇప్పటి వరకు 212 మంది రాష్ట్ర విద్యార్థులు ఉన్నారని తెలిపారు. ఖర్చుకు వెనకాడకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులందరినీ వెనక్కి తీసుకువస్తుందని.. విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ ధైర్యంగా ఉండాలన్నారు. -
ఆ విద్యార్థులకు విమాన టికెట్లు ఏర్పాటు చేయండి: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: ఉక్రెయిన్ నుండి రాష్ట్రానికి వచ్చే విద్యార్థులకు విమాన టికెట్లు ప్రభుత్వమే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫ్లైట్ టికెట్లు తీసుకోలేని విద్యార్థులకు ప్రభుత్వమే భరించాలని నిర్ణయం తీసుకుంది. ఢిల్లీకి చేరుకునే విద్యార్థులకు అక్కడి నుంచి సొంత ప్రాంతాలకు చేర్పించేలా ఏర్పాట్లు చేయాలని సీంఎ జగన్ అధికారులను ఆదేశించారు. అందుకు తగినట్లు ఏపీ భవన్ నుంచి విద్యార్థులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. కృష్ణబాబు నేతృత్వంలో టాస్క్ఫోర్స్.. ఉక్రెయిన్లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ సమన్వయంతో అధికారులు నిరంతరం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సీనియర్ ఐఏఎస్ కృష్ణబాబు నేతృత్వంలో టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేశారు. ఆర్టీజీఎస్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, నిత్యం పరిస్థితిని పర్యవేక్షిస్తూ.. విద్యార్థులను ప్రభుత్వం సంప్రదిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో ఫోన్లో చర్చించారు. కేంద్రం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా జయశంకర్ సీఎం వైఎస్ జగన్కు వివరించారు. ఉక్రెయిన్ పక్కనున్న దేశాలకు వారిని తరలించి, అక్కడి నుంచి ప్రత్యేక విమానాల ద్వారా భారత్కు తీసుకు వచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఎలాంటి ముప్పు లేకుండా వారిని భద్రంగా తీసుకురావాలని సీఎం జగన్ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. చదవండి: (ఎయిర్పోర్ట్ల వృద్ధి కోసం కేంద్రానికి సీఎం జగన్ లేఖలు) -
ఉన్నత స్థానాలు చేరుకునేందుకే నైపుణ్య శిక్షణ
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలు ఉన్నత స్థానాలు చేరుకునేందుకు నైపుణ్య శిక్షణ, మార్గదర్శకత్వం అందిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు. సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ (సీహెచ్ఎస్ఎస్) సౌజన్యంతో ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం నిర్వహించిన ఉచిత ఇంటెర్న్షిప్ కార్యక్రమం ముగింపు వేడుకను విజయవాడ ఆర్టీసీ హౌస్లో సోమవారం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలు ఇటువంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని తమ రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ ఉద్యోగుల పిల్లల కెరీర్ గైడెన్స్ కోసం ఈ శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. ఆన్లైన్లో నిర్వహించిన ఈ శిక్షణకు 700 మంది హాజరయ్యారన్నారు. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. -
రూ.2,205 కోట్లతో రోడ్లకు మరమ్మతులు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రూ.2,205 కోట్లతో 8,970 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్వహణ, మరమ్మతులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనుమతులు మంజూరు చేసినట్లు రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు వెల్లడించారు. విజయవాడలోని ఆర్ అండ్ బీ భవనంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రోడ్ల నిర్వహణ నిమిత్తం మొత్తం 1,140 పనులకు గానూ ఇప్పటికే 403 పనులకు టెండర్లు పూర్తయ్యాయన్నారు. వర్షాకాలం కావడంతో పనులు ఆలస్యమయ్యాయని, ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి మొత్తం పనులను పూర్తిచేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. దీనికితోడు పనులను వేగవంతం చేసేందుకు, కాంట్రాక్టర్లలో ఉత్సాహాన్ని నింపేందుకు బ్యాంకుల నుంచి నేరుగా వారి ఖాతాల్లోకే బిల్లులను జమచేసేలా సీఎం ఆదేశించారని ఆయన చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. రాజకీయ లబ్ధికే విపక్షాల నిరసన వర్షాకాలం తర్వాత ఎటూ రోడ్లన్నీ మరమ్మతులు చేసి బాగుచేస్తారని అందరికీ తెలిసిందే. కానీ.. ప్రతిపక్షాలు ఏదో రకంగా రాజకీయ లబ్ధిపొందడానికి రోడ్ల మరమ్మతుల మీద నిరసనలు చేస్తున్నాయి. మరమ్మతులు చేసిన తర్వాత.. తమ నిరసనలవల్లే ప్రభుత్వం చేసిందని చెప్పుకోవడానికి అవి ఆరాటపడుతున్నాయి. రోడ్ల నిర్వహణ ఫండ్ నుంచి నిధులిచ్చి దెబ్బతిన్న రోడ్లన్నిటికీ మరమ్మతులు చేస్తాం. గత ప్రభుత్వం రోడ్ల నిర్వహణకు తగిన నిధులు కేటాయించకపోవడంవల్లే ప్రస్తుత పరిస్థితి నెలకొంది. అలాగే.. – గతేడాది రాష్ట్ర బడ్జెట్లో రూ.220 కోట్లు కేటాయించినప్పటికీ.. వర్షాల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న రోడ్లకు అత్యవసర మరమ్మతుల కోసం రూ.932 కోట్లతో పనులు చేపట్టాం. ఇందులో రూ.417 కోట్లతో స్టేట్ హైవేస్, రూ.515 కోట్లతో మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ల అభివృద్ధి జరిగింది. ఇందుకు సంబంధించి రూ.600 కోట్ల బిల్లులకు గానూ రూ.380 కోట్లు చెల్లించాం. జనవరిలో చేసిన పనుల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఇవి కూడా రెండు మూడు వారాల్లో విడతల వారీగా విడుదలకు చర్యలు తీసుకుంటున్నాం. నిధులు విడుదల చేయాలని ఆర్థికశాఖను కూడా కోరాం. – రాష్ట్రానికి పెట్రోల్, డీజిల్ ద్వారా వచ్చే సెస్ను ఏపీ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్కు మళ్లించి వాటిని రోడ్ల అభివృద్ధికి వినియోగిస్తాం. రుణాల కోసం ఐదు జాతీయ బ్యాంకులతో సంప్రదింపులు జరిపాం. మూడు బ్యాంకుల్లో లోన్ ప్రాసెసింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెలాఖరుకు రుణం మంజూరవుతుందని ఆశిస్తున్నాం. – 2021–22 బడ్జెట్లో రోడ్ల నిర్వహణకు రూ.410 కోట్లు కేటాయించగా ఇప్పటికే రూ.160 కోట్లతో చేపట్టిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రస్తుత రోడ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు, ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి చేసేందుకు ప్రతి రెండు జిల్లాలకు ఒక చీఫ్ ఇంజినీర్ను నోడల్ అధికారిగా నియమించాం. – ప్రస్తుతం రూ.155 కోట్ల ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్ల నిధులతో రోడ్ల మరమ్మతులు జరుగుతున్నాయి. – రూ.1,158.53 కోట్ల నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అథారిటీ నిధులతో 99 రాష్ట్ర రహదారులు, 134 మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ల విస్తరణ చేపట్టాం. ఇందులో మొదటి విడతగా రూ.408 కోట్లు విడుదల చేయగా రూ.399.68 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించాం. మిగిలిన పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేస్తాం. – ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మేజర్ ప్రాజెక్టుగా అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలను కలుపుతూ రెండు లైన్ల రహదారుల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. రూ.6,400 కోట్ల పనుల్లో భాగంగా ఫేజ్–1 కింద రూ.2,970 కోట్ల పనులను కాంట్రాక్టర్లకు అప్పగించాం. నెలరోజుల్లో పనులు ప్రారంభమవుతాయి. రెండేళ్లలో అన్ని పనుల పూర్తికి సన్నాహాలు చేస్తున్నాం. -
ఏపీ: రూ.6,400 కోట్ల వ్యయంతో రోడ్లు అభివృద్ధి
సాక్షి, విజయవాడ: రూ.6,400 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో రోడ్లు అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీ రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రెండేళ్లలో పనులు పూర్తయ్యే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కాంట్రాక్టర్లకు నమ్మకం ఉండేలా ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ తెరుస్తామని పేర్కొన్నారు. మూడు బ్యాంకులు లోన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మరమ్మత్తులు చేసిన బిల్లులు దాదాపు చెల్లించడం జరిగిందన్నారు. గత ఏడాది రూ.600 కోట్లు బిల్లులు చెల్లించామన్నారు. వారం, పది రోజుల్లో బీఆర్ఓ తాలూక సొమ్ము విడుదలవుతుందన్నారు. నెలవారీగా బిల్లులు ఇవ్వడానికి సీఎం ఆదేశించారన్నారు. ఈ ఏడాది రోడ్ల మరమ్మత్తులకు రూ. 410 కోట్లు బడ్జెట్లో ఏర్పాటు చేశారని కృష్ణబాబు పేర్కొన్నారు. -
రూ 6400 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి : కృష్ణబాబు
-
అదనంగా 400 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్
-
ఆక్సిజన్ సేకరణ, పంపిణీలో ఏపీ పురోగతి
సాక్షి, అమరావతి: కోవిడ్–19 ఉధృతి నేపథ్యంలో ఒకేసారి పెరిగిన డిమాండ్కు తగినంతగా ఆక్సిజన్ సేకరణ, పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం గణనీయ పురోగతి సాధించిందని ఆక్సిజన్ సేకరణ, సరఫరాను పర్యవేక్షణ చేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి టి.కృష్ణబాబు తెలిపారు. ఆక్సిజన్పై ప్రధానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాసిన లేఖతో సానుకూల పరిస్థితి వచ్చిందన్నారు. కేంద్రం.. రాష్ట్రానికి కొత్తగా మరో మూడు ఐఎస్వో ట్యాంకులను ఇవ్వనుందని తెలిపారు. ఈ ట్యాంకులను శనివారం మధ్యాహ్నం దుర్గాపూర్లో అప్పగించనుందన్నారు. ఆదివారం నాటికి కృష్ణపట్నంకు 60 టన్నుల ఆక్సిజన్తో ప్రత్యేక రైలు చేరుకోనుందని పేర్కొన్నారు. ఇప్పటికే దుర్గాపూర్ స్టీల్ ఫ్యాక్టరీలో 2 కొత్త ట్యాంకుల్లో ఆక్సిజన్ను అధికారులు నింపారని, ఒక్కో ట్యాంకులో 20 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్, మొత్తంగా 40 మెట్రిక్ టన్నులు వస్తుందన్నారు. ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ద్వారా శనివారం నెల్లూరులోని కృష్ణపట్నంకు ఆక్సిజన్ ట్యాంకులు చేరుకుంటాయని, మొత్తంగా రాష్ట్రానికి 6 ఐఎస్ఓ ట్యాంకుల ద్వారా ఆక్సిజన్ రానుందని ఆయన తెలిపారు. ఒక్కో ప్రత్యేక రైలు ద్వారా మూడు ట్యాంకుల చొప్పున నిరంతర ఆక్సిజన్ సరఫరాకు ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. ఒక్కో ట్రిప్పులో 60 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను ప్రత్యేక రైలు తీసుకురానుందని తెలిపారు. ఒడిశాలో వివిధ కర్మాగారాల నుంచి ఈ ఆక్సిజన్ను సేకరించనున్నట్లు ఆయన వెల్లడించారు. తద్వారా నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లోని ప్రభుత్వాసుపత్రులకు రిజర్వ్లో ఆక్సిజన్ నిల్వలు ఉంచగలగుతామన్నారు. మరోవైపు గుజరాత్లోని జామ్నగర్ రిలయన్స్ ఫ్యాక్టరీ నుంచి మరో 110 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ శనివారం రైలు ద్వారా గుంటూరు చేరుకోనుందని తెలిపారు. -
ఆక్సిజన్ కొరత లేకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం
-
ఏపీలో ఆక్సిజన్ కొరత లేకుండా ఏర్పాట్లు: కృష్ణబాబు
-
ఏపీ: అందుబాటులో 33 వేల బెడ్స్: కృష్ణబాబు
సాక్షి, విజయవాడ: గూడవల్లి కోవిడ్ కేర్ సెంటర్ను స్పెషల్ ఆఫీసర్ కృష్ణబాబు ఆకస్మిక తనిఖీ చేశారు. కోవిడ్ బాధితులకు అందుతున్న వైద్యంపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 33 వేల బెడ్స్ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. మైల్డ్ సింటమ్స్ ఉన్న వారిని మాత్రమే కోవిడ్ కేర్ సెంటర్కు తరలిస్తున్నామన్నారు. 5 శాతం మందికి మాత్రమే ఆస్పత్రి అవసరం ఉంటుందని పేర్కొన్నారు. 15 వేల మంది ఆస్పత్రుల్లో, 5 వేల మంది కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారని ఆయన వెల్లడించారు. ఫుడ్, శానిటేషన్పై ప్రత్యేక దృష్టి పెట్టామని కృష్ణబాబు తెలిపారు. చదవండి: ఆక్సిజన్ అందక ఎవరూ చనిపోలేదు: విజయనగరం కలెక్టర్ కొడుకు ప్రాణం పోయింది.. తండ్రి గుండె ఆగింది.. -
సంక్రాంతికి 1,500 ఆర్టీసీ బస్సులు!
సాక్షి, అమరావతి: ఈ సంక్రాంతి పండక్కి ఆర్టీసీ 1,500 ప్రత్యేక సర్వీసులు తిప్పేందుకు ప్రణాళికలు రూపొందించింది. గత రెండేళ్ల నుంచి 2,200 సర్వీసుల వరకు తిప్పిన ఆర్టీసీ ఈ దఫా కరోనా కారణంగా బస్సులను తగ్గించనుంది. ప్రయాణికుల డిమాండ్ను బట్టి సర్వీసులను నడపాలని ప్రాథమికంగా నిర్ణయించారు. బుధవారం అన్ని జిల్లాల ఆర్టీసీ అధికారులతో ఎండీ కృష్ణబాబు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా సంక్రాంతి పండక్కి ఎన్ని సర్వీసులు నడపాలనే అంశంపైనే చర్చ జరిగింది. కరోనా నేపథ్యంలో ప్రత్యేక బస్సులపై ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోనున్నారు. అత్యధిక సర్వీసులు హైదరాబాద్కు తిప్పేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు రిజర్వేషన్లు ఫుల్ అయ్యాయి. ఈ జిల్లాలకు వెళ్లేందుకు ప్రతి ఏటా డిమాండ్ అధికంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉభయగోదావరి జిల్లాలకు ప్రత్యేక బస్సులు అధిక సంఖ్యలో నడపనున్నారు. పండగ తిరుగు ప్రయాణంలోనూ ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా బస్సులు నడపనున్నారు. హైదరాబాద్లో ఏర్పాట్లు ఇలా.. ► హైదరాబాద్లోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్)లో రద్దీ తగ్గించేందుకు, బస్సుల పార్కింగ్కు ఇబ్బందులు లేకుండా ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. ► బీహెచ్ఈఎల్లో బస్సుల పార్కింగ్కు గతంలో ఆర్టీసీ స్థలం కొనుగోలు చేయడంతో ఇబ్బందుల్లేవని అధికారులు పేర్కొంటున్నారు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, మాచర్ల వైపు వెళ్లే రెగ్యులర్, పండుగ స్పెషల్ బస్సులన్నీ ఎంజీబీఎస్ వెలుపల ఉన్న గౌలిగూడ సీబీఎస్ హాంగర్ (సిటీ బస్ టెర్మినల్) నుంచి బయల్దేరేలా ఏర్పాట్లు చేయాలని ఆలోచన చేస్తున్నారు. ► విజయవాడ, గుంటూరు, ఉభయ గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లే అన్ని పండుగ స్పెషల్ బస్సులు హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి (ఈసీఐఎల్, బీహెచ్ఈఎల్, కేపీహెచ్బీ, ఎల్బీ నగర్) నడపనున్నారు. ఈ ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఎంజీబీఎస్లోకి రాకుండా నేరుగా వెళ్లేలా ఏర్పాట్లు చేయనున్నారు. ► గతేడాది పండక్కి ఆర్టీసీ రూ.67 కోట్ల మేర ఆదాయాన్ని రాబట్టింది. ప్రయాణికులపై భారం మోపకుండా 40% రాయితీతో ప్రత్యేక సర్వీసుల్ని ఆర్టీసీ నడిపింది. ఈ దఫా పండక్కి సొంతూళ్లకు వెళ్లే వారికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. చెన్నై, బెంగళూరులకూ ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు. -
14న ఎన్డీబీ రీ టెండర్లకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) సాయంతో రాష్ట్రంలో రహదారులు, వంతెనల పునర్నిర్మాణ పనులకు సంబంధించి రీ టెండర్లకు రహదారులు, భవనాలశాఖ ఈ నెల 14న నోటిఫికేషన్ జారీ చేయనుంది. నాలుగు జిల్లాలకు మాత్రమే టెండరు నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ టెండర్లలో రెండు నిబంధనలకు సవరణ చేస్తూ శనివారం రవాణా, ఆర్అండ్బీ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులిచ్చారు. మొత్తం రూ.6,400 కోట్లతో చేపట్టనున్న ఈ పనులకు సంబంధించి.. తొలిదశలో రూ.1,860 కోట్లతో 13 ప్యాకేజీలకు ఈ–టెండర్లు పిలవగా 14 సంస్థల నుంచి 25 బిడ్లు మాత్రమే వచ్చాయి. సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆర్అండ్బీ ముఖ్య అధికారులతో సమీక్షించి కాంట్రాక్టర్లలో పోటీతత్వం పెంచేందుకు టెండర్లను రద్దుచేసి మళ్లీ పిలవాలని ఆదేశించడంతో ఎన్డీబీ టెండర్లు రద్దయిన సంగతి తెలిసిందే. తొలి దశగా ఇప్పుడు నాలుగు జిల్లాల్లో రూ.682.16 కోట్ల పనులకు సంబంధించి మళ్లీ టెండర్లు పిలవనున్నారు. నిబంధనల్లో రెండింటిని సవరించారు. ఇందుకు న్యూ డెవలప్మెంట్ బ్యాంకు అనుమతి తీసుకున్నారు. జ్యుడిషియల్ ప్రివ్యూ అనుమతి తీసుకుని జీవో జారీ చేశారు. సవరించిన నిబంధనలివే.. ► టెండరు నిబంధనల్లో గతంలో బ్యాంకు గ్యారెంటీలు జాతీయ బ్యాంకుల నుంచే స్వీకరిస్తామన్నారు. ఈ దఫా రూరల్ బ్యాంకులు/కో–ఆపరేటివ్ బ్యాంకులు మినహా మిగిలిన షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల నుంచి స్వీకరిస్తారు. ► హార్డ్ కాపీని బిడ్ల దాఖలుకు ముందే ఇవ్వాలన్న నిబంధనను.. బ్యాంకు ఆథరైజేషన్తో రివర్స్ టెండర్లు నిర్వహించేలోగా ఇవ్వవచ్చని పేర్కొన్నారు. -
ఎన్డీబీ టెండర్లు రద్దు
సాక్షి, అమరావతి: టెండర్లలో పోటీతత్వం పెంపొందించేందుకే న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) సహకారంతో రాష్ట్రంలో చేపట్టిన మూడు వేల కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి సంబంధించిన టెండర్లను రద్దుచేశామని రవాణా, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎం.టి కృష్ణబాబు స్పష్టంచేశారు. రీ టెండర్లలో వాస్తవాలు తెలుస్తాయని, పచ్చ పత్రికలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని, వారికి నమ్మకం కలిగించేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు టెండర్లను రద్దుచేసినట్లు ఆయన తెలిపారు. విజయవాడలో శనివారం ఆయన ఆర్ అండ్ బీ ఈఎన్సీ వేణుగోపాల్రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రోడ్ ప్రాజెక్టు ఫేజ్–1లో టెండర్లు పిలిచామని.. 26 పనులు, 13 ప్యాకేజీలకు 25 టెండర్ బిడ్లు మాత్రమే వచ్చాయన్నారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా టెండర్లు చేసిన విషయం రీ టెండర్లలో బహిర్గతం అవుతుందన్నారు. పారదర్శకంగా పనిచేయడమే కాదు.. పారదర్శకత ప్రతిబింబించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారని.. టెండర్ల స్పందనపై ఆయన సమగ్రంగా సమీక్ష చేశారని కృష్ణబాబు వివరించారు. అధిక మొత్తం విలువగల టెండర్లలో తక్కువ మంది పాల్గొనడం సహజమేనని ఎన్డీబీ పేర్కొన్నా.. పారదర్శకత, నిష్పాక్షికతకు పెద్దపీట వేసేందుకే ప్రస్తుత టెండర్లను రద్దుచేసి మళ్లీ టెండర్లకు వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. ఈ నెలాఖరుకల్లా టెండర్లను పూర్తిచేయాలని ఎన్డీబీ కోరిందని, అయితే.. తాను కేంద్రంతో మాట్లాడి గడువు కోరతానని ముఖ్యమంత్రి చెప్పారన్నారు. కృష్ణబాబు ఇంకా ఏమన్నారంటే.. – అర్హత విషయంలో చాలా కంపెనీలున్నా, 14 కంపెనీలే టెండరు వేయడానికి గల కారణాలు తెలుసుకుంటాం. – ఏపీ ప్రభుత్వం, ఎన్డీబీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ ఎఫైర్స్ ట్రైపార్టీ అగ్రిమెంట్కు లోబడి ప్రపంచ బ్యాంకు నిబంధనల ప్రకారం పనులను నిర్వహిస్తాం. – ఎక్కువమంది టెండరులో పాల్గొనేలా చేస్తే, రాష్ట్రంలో మరింత ఎక్కువ కిలోమీటర్లు అభివృద్ధి చేసే అవకాశముంది. – జ్యుడీషియల్ ప్రివ్యూ కమిషన్, రివర్స్ బిడ్డింగ్ కూడా పారదర్శకత కోసమే. – కాంట్రాక్టర్లకు బ్యాంకులలో లిక్విడిటీ, కోవిడ్ కారణంగా లేబర్ అందుబాటు ఇబ్బందులు ఉండచ్చు. విదేశీ రుణ సాయంతో చేపట్టే ప్రాజెక్టులకు నిధుల కొరత ఉండదు. ముందుగా 15 శాతం అడ్వాన్స్లు విడుదల చేస్తారు. – ప్రపంచ బ్యాంకు నిబంధనల ప్రకారం టెండరు విలువ ఎంత ఉంటుందో.. కాంట్రాక్టు కంపెనీ టర్నోవర్ అంత ఉండాలి. – రాష్ట్రంలో అర్హత కలిగిన కాంట్రాక్టర్లతో సంప్రదించమని ఇంజనీర్లకు ఆదేశాలు జారీచేశాం. కాంట్రాక్టర్లు బ్యాంకు గ్యారంటీ, జీపీఏ మాత్రమే హార్డ్ కాపీలు ఇవ్వాల్సి ఉంటుంది. – ఏ రకమైన సమస్య ఉన్నా కాంట్రాక్టు ఏజెన్సీలు నేరుగా సూపరింటెండెంట్/చీఫ్ ఇంజనీర్లను సంప్రదించవచ్చు. – జరిగిన టెండర్లపై ఒక్క ఫిర్యాదు లేదా అభ్యంతరం రాలేదు. – టెండరు విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా ప్రభుత్వం నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. – ప్రాజెక్టు టెండర్లను భౌతికంగా అడ్డుకుంటే చర్యలు తీసుకుంటాం. – టెండర్ల పూర్తికి 45 రోజుల గడువు ఇస్తామని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ ఎఫైర్స్ అదనపు కార్యదర్శి చెప్పారు. – మరో వారం రోజుల్లో టెండర్లు పిలుస్తాం. – కొన్ని వార్తాపత్రికలు, పనికట్టుకుని నిరాధారమైన వార్తలు ప్రచురించడం, ప్రజల్లో లేనిపోని అనుమానాలకు తావిచ్చేలా దురుద్దేశ్యపూర్వక రాతలు రాశాయి. వాటిని నివృత్తి చేస్తూ టెండరుదారుల్లో ఎలాంటి అనుమానాలు, అపోహలు కలగకుండా ఈ టెండర్లు రద్దుచేశాం. – ఎక్కువ మంది టెండర్లలో పాల్గొంటే ఖర్చు తగ్గడంతో పాటు నాణ్యత పెరుగుతుంది. – నిధులు మిగలడంవల్ల మరిన్ని పనులు చేపట్టే వీలు కలుగుతుందన్న అభిప్రాయాన్ని సీఎం వైఎస్ జగన్ వ్యక్తంచేశారు. -
రహదారుల నిర్మాణానికి మరోసారి టెండర్లు
సాక్షి, విజయవాడ : న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) ఆర్థిక సహకారంలో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలలో తలపెట్టిన 3 వేల కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి మరోసారి టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు దాఖలైన బిడ్లు, ఈ టెండర్ల ప్రక్రియపై ఒక వర్గం మీడియాలో చాలా కథనాలు వచ్చాయని, వాటిలో ఏ మాత్రం వాస్తవం లేదని రహదారులు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణబాబు స్పష్టంచేశారు. మొత్తం రూ.6400 కోట్ల వ్యయంతో రహదారులు నిర్మాణానికి సంబంధించి... ఒకేసారి 13 ప్యాకేజీలకుగాను ఈ–టెండర్లు పిలవగా 14 సంస్థల నుంచి 25 బిడ్లు మాత్రమే వచ్చాయి. అయితే ఇది నామమాత్ర స్పందన కావడంతో ఈ టెండర్లు రద్దు చేసి, మరోసారి టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వం ఇంత పారదర్శకంగా టెండర్లను నిర్వహిస్తున్నా.. తక్కువ బిడ్లు రావడం, కేవలం 14 సంస్థలు మాత్రమే టెండర్లలో పాల్గొనడం, కొన్ని మీడియాల్లో అసత్య కథనాలు రావడంతో టెండర్లను రద్దు చేసి, మళ్లీ పిలవాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండాలని, ఎక్కడా వివక్ష లేకుండా, అందరికీ అవకాశం ఇవ్వాలని సీఎం గారు ఆదేశించినట్టు ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు చెప్పారు. ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఇంకా ఏమన్నారంటే...: ఒకేసారి 13 జిల్లాలలో 13 ప్యాకేజీలకు టెండర్లు పిలిస్తే 25 బిడ్లు వచ్చాయి. అందరూ సమయానికి దాఖలు చేశారు.అర్హులైన కాంట్రాక్టర్లు ఎక్కడెక్కడ ఉన్నారన్నది చూస్తున్నాము. జాతీయ రహదారుల పనులు చేసే వారు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా చూస్తున్నాము. ఇప్పుడు కేవలం 14 కంపెనీలే ముందుకు రావడంపై కూడా సమీక్ష చేశాము. పారదర్శకంగా ప్రక్రియ: ఇప్పుడు ఈ–టెండర్ విధానం అమలు చేశాము. అన్ని నియమాలు పూర్తిగా పాటించాము. పూర్తి పారదర్శకంగా వ్యవహరించాము. ఇక ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది టెండర్లలో పాల్గొనే విధంగా చర్యలు చేపడుతున్నాము. విదేశీ బ్యాంక్ (ఎక్స్టర్నల్) రుణం కాబట్టి, ఎక్కడా రాజీ పడకుండా పక్కాగా నియమావళి రూపొందించాము. ఎందుకంటే పని తీసుకోవడమే కాదు, పూర్తి చేయడంలో కూడా ఆ కంపెనీ ఆసక్తి చూపాలి. అదే విధంగా ఒక బిల్లు వస్తే తప్ప, రెండో పని చేసే విధంగా ఉండకూడదు. అదే విధంగా క్వాలిటీతో, వేగంగా పని చేయాలి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని నియమావళి రూపొందించాము. కాంట్రాక్టర్లలో పోటీ పెరిగేలా..: కాంట్రాక్టర్లు పోటీ పడి వస్తే అవే నిధులతో ఇంకా ఎక్కువ రోడ్ల నిర్మాణం చేపట్టవచ్చు. రూ.6400 కోట్ల నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల కి.మీ రహదారుల నిర్మాణం చేయబోతున్నాం. టెండర్లలో ఎక్కువ సంస్థలు పాల్గొని ఇంకా బిడ్లు వస్తే, ఆ మొత్తంతోనే ఇంకొన్ని రహదారులు కూడా నిర్మించవచ్చు. ప్రజల్లో ఎక్కడా అనుమానాలకు తావునివ్వొద్దని సీఎం గారు చెప్పారు. జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ కూడా అదే ప్రక్రియలో అమలు చేస్తున్నాం. అందుకే ఇప్పుడు టెండర్లు రద్దు చేసి రీటెండర్కు వెళ్లాలని సీఎం గారు ఆదేశించారు. అర్హత ఉన్న కాంట్రాక్టర్లతో కూడా మాట్లాడబోతున్నాము. ఎలాంటి సందేహాలు వద్దు: సకాలంలో బిల్లులు ఇస్తారా? అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎక్స్టర్నల్ ఫండింగ్తో జరుగుతోంది కాబట్టి, బిల్లుల చెల్లింపులో జాప్యం ఉండబోదని సీఎం గారు చెప్పారు. అందుకే అర్హులైన కాంట్రాక్టర్లు, ఆ సంస్థలతో మాట్లాడమని ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేశాము. పక్కాగా జరిగిన టెండర్ల ప్రక్రియ: ఇప్పుడు రద్దు చేసిన టెండర్ల ప్రక్రియ పక్కాగా జరిగింది. ఎక్కడా ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోలేదు. ఈ–టెండర్లు కాబట్టి, ఎన్ఐసీ ప్లాట్ఫామ్లో 25 మంది తమ బిడ్ అప్లోడ్ చేశారు. బ్యాంక్ గ్యారెంటీ కోసం హార్డ్ కాపీ ఇవ్వాలి. ఇక్కడ ఆ 25 మంది హార్డ్ కాపీలు ఇచ్చారు కాబట్టి, మాకు ఎక్కడా సందేహాలు లేవు. అయితే అంత తక్కువ మంది ఎందుకు పార్టిసిపేట్ చేశారన్నదే ఇక్కడ ప్రశ్న. ఎవరైనా, ఎక్కడైనా బెదిరించారా? అంటే అది కూడా లేదు. నిజానికి అలాంటి ఘటనలు ఎక్కడా చోటు చేసుకోలేదు. నిజానికి రద్దు చేయాల్సిన అవసరం లేదు: ఇప్పుడు దాఖలైన బిడ్లతో ముందుకు వెళ్లొచ్చు. రద్దు చేయవలసిన అవసరం లేదు. నిజానికి ఎన్డీబీ కూడా ఇప్పటి బిడ్లపై సంతృప్తి వ్యక్తం చేసింది. ఒకేసారి 13 ప్యాకేజీలు ఇచ్చినప్పటికీ 14 సంస్థలు ముందుకు వచ్చాయి. గతంలో కూడా ఎక్కువ విలువ ఉన్న పనుల్లో కొన్ని సంస్థలే పాల్గొన్నాయి. విజయవాడ బైపాస్ రోడ్డు పనుల్లో కూడా ఒకటి, రెండు సంస్థేల పాల్గొన్నాయి. అయినా ఇప్పుడు మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయించాము. ఈసారి ఎక్కువ సంస్థలు బిడ్లు వేస్తే, పోటీ పెరిగి ఇంకా తక్కువకే పనులు చేపట్టే వీలుంది. ఆ విధంగా మిగిలే నిధులతో ఇంకా ఎక్కువ రహదారులు నిర్మించవచ్చు. అందుకే తొలి టెండర్లు రద్దు చేసి, మళ్లీ టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
అందుకే ఫ్లైఓవర్ ఓపెనింగ్ ఆగింది
సాక్షి, విజయవాడ: న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) అందించే రుణ సాయంతో రాష్ట్రంలో త్వరలోనే రహదారుల నిర్మాణ పనులు మొదలు పెడతామని రహదారులు, భవనాల ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు అన్నారు. టెండర్లను పారదర్శకంగా నిర్వహించేందుకు జ్యుడీషియల్ ప్రివ్యూకి పంపి త్వరలోనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పనులు మొదలు పెట్టకపోతే నిధులు సరెండర్ చేయాలని కేంద్రం నిబంధన పెట్టిందన్న కృష్ణబాబు... ఎన్ఐసి ప్లాట్ఫామ్ ద్వారా, గ్లోబల్ బిడ్డింగ్ ద్వారా టెండర్లు నిర్వహిస్తామని వెల్లడించారు. అయితే కొంతమంది కావాలనే దీని గురించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇ-టెండర్ తో పాటు 25 బిడ్స్ వచ్చాయని, ఇందుకు సంబంధించిన హార్డ్ కాపీలు కూడా అందాయని తెలిపారు. (చదవండి: రూ.2,978 కోట్లతో రోడ్లు) అదే విధంగా బిడ్డింగ్ దశలో కూడా ఎన్డీబీ అభిప్రాయం తీసుకున్నామన్న కృష్ణబాబు, ప్రపంచ బ్యాంకు సూచించిన నిబంధనల మేరకే అర్హత ప్రమాణాలను నిర్దేశించినట్లు తెలిపారు. కేవలం జాతీయ బ్యాంకుల ద్వారా సదరు సంస్థలు లావాదేవీలు చేయాలన్న నిబంధన మాత్రమే జ్యుడీషియల్ ప్రివ్యూ లో సూచించారని, టెండర్ల విషయంలో ఎలాంటి సందేహాస్పద లావాదేవీలు జరగలేదని స్పష్టం చేశారు. బిడ్ల నుంచి రివర్స్ టెండర్ల వరకు సంబంధించిన ప్రక్రియ అంతా కూడా ఏపీ ప్రభుత్వంతో పాటు ఎన్డీబీ పర్యవేక్షణలో సాగిందన్నారు. అయితే బిడ్లు ఇంత తక్కువగా ఎందుకు దాఖలు అయ్యాయన్న విషయాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. అప్పుడే మళ్లీ రాయితీ వర్తింపజేస్తాం విజయవాడ, వైజాగులో సిటీ బస్సులు రన్ చేస్తామని కృష్ణబాబు తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సీటీ బస్సులను తిప్పుతున్నామన్నారు. 50 శాతం ఆక్యుపెన్సీతోనే బస్సులను నడుపుతామని, అయితే భారీగా నష్టం చేకూర్చే అంశంగా ఉంటుందన్నారు. అలాగే బస్సుల్లో స్టాడింగుకు అనుమతించడం లేదని, అందుకే వృద్ధులు బస్సు ప్రయాణాలు చేయొద్దని సూచిస్తున్నామన్నారు. కానీ కొందరు అత్యవసర పరిస్థితులంటూ కొందరు వృద్ధులు వస్తున్నారని, వారి బస్ ప్రయాణాలను నిరుత్సాహాపరిచేందుకే బస్సుల్లో సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపారు. అయితే సాధారణ పరిస్థితులు రాగానే సీనియర్ సిటీజన్లకు రాయితీని వర్తింపజేస్తామని కృష్ణబాబు పేర్కొన్నారు.(చదవండి: ఆర్టీసీ ఉన్నతాధికారుల సమావేశం) అందుకే ఫ్లైఓవర్ ఓపెనింగ్ ఆగింది కేంద్ర మంత్రి గడ్కరీకి కరోనా కారణంగా ఫ్లైఓవర్ ఓపెనింగ్ ఆగిందని కృష్ణబాబు వెల్లడించారు. గడ్కరీ ప్రారంభించాకే ఫ్లైఓవర్ పై రాకపోకలకు అనుమతిస్తామని తెలిపారు. ఇక అంతర్రాష్ట్ర సర్వీసుల గురించి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం బస్ సర్వీసులను పెంచడానికి ఇష్టపడడం లేదని, ఏపీని తగ్గించుకోమని సూచిస్తోందన్నారు. తెలంగాణ సూచనల మేరకు సర్వీసులను తగ్గించుకోవవడానికి సిద్దంగా ఉన్నా, ఏపీ తగ్గించుకునే 1.10 లక్షల కిలోమీటర్ల మేర రవాణను ప్రైవేట్ ఆపరేటర్లకు అవకాశం లభిస్తుందన్నారు. ‘‘ఏపీ తిప్పే సర్వీసుల కంటే డబుల్ సర్వీసులు తిప్పుతామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. అయితే బెజవాడ-హైదరాబాద్ రూట్లో మాత్రమే డబుల్ సర్వీసులు తిప్పుతానంటోన్న తెలంగాణ.. మిగిలిన రూట్ల గురించి ప్రస్తావించడం లేదు’’ అని కృష్ణబాబు తెలిపారు. -
ఆర్ అండ్ బీ టెండర్లపై అపోహలొద్దు
సాక్షి, అమరావతి: రహదారులు, భవనాల శాఖ టెండర్లను సాంకేతిక మదింపు కమిటీ అనుమతించి, ఫైనాన్స్ బిడ్లు తెరిచాక ఏ ఫిర్యాదులొచ్చినా, అనుమానాలున్నా చర్యలు తీసుకుంటామని ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు స్పష్టం చేశారు. విజయవాడలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) సహకారంతో రాష్ట్రంలో చేపడుతున్న రహదారులు, వంతెనల అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్ డాక్యుమెంట్లను జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదించాక ఆధారాల్లేకుండా వార్తలు ప్రచురిస్తే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. కొన్ని పత్రికలు దురుద్దేశంతో అసత్య కథనాలు ప్రచురిస్తున్నాయని, ప్రభుత్వంపై అపోహలు కలిగేలా వార్తలు రాస్తున్నాయన్నారు. ఇంకా ఏమన్నారంటే.. ► ఆర్అండ్బీ టెండర్లను డివిజన్ల వారీగా చేపట్టేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ అఫైర్స్కు, రుణం అందిస్తున్న ఎన్డీబీకి ప్రతిపాదనలు పంపాం. ఇందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ అఫైర్స్, ఎన్డీబీ అంగీకరించలేదు. జిల్లాల వారీగా ప్యాకేజీలుగా అనుమతిస్తే సులభంగా ఉంటుందని భావించాయి. ► ఏపీ, తెలంగాణ రవాణా ముఖ్య కార్యదర్శులు మంగళవారం హైదరాబాద్లో భేటీ అయ్యి అంతర్రాష్ట్ర ఒప్పందంపై చర్చిస్తారు. ఒప్పందం ఆలస్యమవుతున్నందున 72 వేల కి.మీ బస్సులు తిప్పేందుకు ప్రతిపాదించాం. -
ఏపీఆర్టీసీ కార్మికులకు శుభవార్త
సాక్షి, అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకు శుభవార్త. అర్టీసీ కార్మికులకు కరోనా బీమా వర్తింపజేయాలని యాజమాన్యం బుధవారం నిర్ణయం తీసుకుంది. కార్మిక పరిషత్ నేతలు నిన్న(మంగళవారం) ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబును కలిసి బీమా కల్పించాలంటూ కార్మికులు వినతి పత్రం అందజేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు 50 లక్షల రూపాయల కోవిడ్ బీమా వర్తింపచేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. (మోడల్ హౌస్ను పరిశీలించిన సీఎం జగన్) అలాగే ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీని ఆర్టీసీ కార్మికులకు కూడా వర్తింపజేస్తూ ఎండీ ఆదేశాలు జారీ చేయడంతో కార్మికులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా కరోనాతో ఇప్పటివరకు మరణించిన 36 మంది ఆర్టీసీ కార్మికులకు కూడా ఈ బీమా వర్తింప చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం మృతుల వివరాలతో సహా ధ్రువపత్రాలను ఈ నెల 28లోపు ఆర్టీసీ ప్రధాన కార్యాలయానికి పంపాలని ఏండీ కృష్ణబాబు జిల్లాల ఆర్ఎంలను ఆదేశించారు. దీంతో కార్మిక పరిషత్ సహా ఇతర సంఘాల కార్మికులు ఎండీకి ధన్యవాదాలు తెలిపారు. (ఆ పరీక్షలను సవాల్గా తీసుకోండి: పెద్దిరెడ్డి) -
ఏపీఆర్టీసీ కార్మికులకు శుభవార్త
-
ఏపీకి వచ్చే వారికి ఆటోమేటిక్ ఈ–పాస్
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా అన్లాక్ 3.0 ప్రారంభమైంది. దీంతో ఏపీ సరిహద్దు చెక్పోస్టుల వద్ద నిబంధనలు సడలించారు. అన్లాక్ 3.0 నిబంధనల ప్రకారం ఏపీ సరిహద్దు చెక్ పోస్టుల్లో ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి ఆంక్షలు సడలించారు. ఈ సందర్భంగా కోవిడ్–19 టాస్క్ఫోర్సు కమిటీ చైర్మన్ ఎంటీ కృష్ణబాబు మాట్లాడుతూ.. పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి రావాలంటే ‘స్పందన’ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆయన ఇంకా ఏం తెలిపారంటే.. ► దరఖాస్తు చేసుకున్న వెంటనే ఆటోమేటిక్గా ఈ–పాస్ మొబైల్, ఈ మెయిల్కి వస్తుంది. ► అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద సిబ్బందికి ఈ–పాస్తో పాటు గుర్తింపు కార్డును చూపిస్తే రాష్ట్రంలోకి అనుమతిస్తారు. ► ఈ–పాస్ వివరాల్ని చెక్ పోస్టులో నమోదు చేయించుకుని ఏపీలోకి రావచ్చు. ► ఈ నమోదు, వచ్చేవారి సంఖ్యను గుర్తించేందుకు మాత్రమే. ఈ సమాచారాన్ని ఆరోగ్య కార్యకర్తలకు పంపుతారు. ► ఆరోగ్య కార్యకర్తలు ఏపీకి వచ్చే వారి ఆరోగ్యంపై దృష్టి సారిస్తారు. నేటి (ఆదివారం) నుంచి ఈ విధానం అమలులోకి వస్తుంది. ► సరిహద్దు చెక్పోస్టుల్లో ఈ–పాస్ చూపించకపోతే పోలీసులు వెనక్కు తిప్పి పంపుతారు. ► ఈ–పాస్ దరఖాస్తు www.spandana.ap. gov.in వెబ్సైట్లో ఉంటుంది. -
మరో 46,198 బెడ్లు సిద్ధం
సాక్షి, అమరావతి: పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా మరో 46,198 పడకలు సిద్ధం చేసినట్టు కోవిడ్ టాస్క్ఫోర్స్ చైర్మన్ ఎంటీ కృష్ణబాబు వెల్లడించారు. ప్రతి జిల్లాలో 5 వేల బెడ్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే పశ్చిమ, తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాల్లో అదనపు బెడ్లను ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. శుక్రవారం విజయవాడలోని ఆర్ అండ్ బీ భవనంలో మీడియా సమావేశంలో కృష్ణబాబు మాట్లాడుతూ ఏమన్నారంటే.. ► ఇతర దేశాల నుంచి వచ్చే వారికి వారం రోజుల ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ తప్పనిసరి. ► కోవిడ్ జిల్లా, రాష్ట్ర ఆస్పత్రులు, క్వారంటైన్ కేంద్రాలు, కోవిడ్ కేర్ సెంటర్లలో అందుతున్న సదుపాయాలపై ఫీడ్ బ్యాక్ కోసండెడికేటెడ్ కాల్ సెంటర్ 1902 నంబర్తో ఏర్పాటు చేశాం. ఇది 24 గంటలూ పని చేస్తుంది. ► మెడికల్, నాన్ మెడికల్ సదుపాయాల గురించి ఫిర్యాదు చేయవచ్చు. ► కోవిడ్ సెంటర్లలో పెట్టే భోజనం, శానిటేషన్, మందులు, మరుగుదొడ్లు, పరిశుభ్రత వంటి 9 అంశాలపై ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ► కోవిడ్ ఆస్పత్రుల్లో మరిన్ని సౌకర్యాలు పెంచే దిశగా ప్రభుత్వం ఐఏఎస్ అధికారి రాజమౌళిని నియమించింది. ఆయనతో పాటు కంట్రోల్ రూం నోడల్ అధికారిగా నేను, అర్జా శ్రీకాంత్, ప్రకృతి వైపరీత్యాల కమిషనర్ కన్నబాబు కలిసి పని చేస్తాం. ► పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులు తెలుసుకొనేందుకు వీలుగా హెల్ప్ డెస్క్ పెట్టాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ► మెరుగైన సదుపాయాల కల్పన దిశగా అదనంగా మరో 17 వేల మంది వైద్య సిబ్బందిని సిద్ధం చేశాం. ► ఐఎంఏ సూచించిన వారికి రూ.1.50 లక్షల గౌరవ వేతనం ఇచ్చి అందుబాటులో ఉంచుతున్నాం. స్టాఫ్ నర్సులు కూడా అందుబాటులో ఉన్నారు. ► కోవిడ్ వల్ల చనిపోయిన వారి అంత్యక్రియల కోసం రూ.15 వేలు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. -
కోవిడ్ కేర్ఫుల్ సెంటర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 76 కోవిడ్ కేర్ సెంటర్లలో 45,240 బెడ్లను సిద్ధంగా ఉంచినట్లు కోవిడ్ టాస్క్ఫోర్స్ చైర్మన్ కృష్ణబాబు తెలిపారు. ప్రతి జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్లలో కనీసం మూడు వేల బెడ్లను అందుబాటులో ఉంచామని, త్వరలోనే వీటిని 5 వేల పడకలకు పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకోసం ప్రతి జిల్లాకు ప్రభుత్వం రూ.కోటి చొప్పున ప్రత్యేకంగా నిధులు కేటాయించిందని వివరించారు. కోవిడ్ ఆసుప్రతికి కనీసం 15 నిమిషాల ప్రయాణ దూరంలోనే కోవిడ్ కేర్ సెంటర్లు, క్వారంటైన్ సెంటర్లు అందుబాటులో ఉంటాయన్నారు. శుక్రవారం ఆయన జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ ప్రభావాన్ని పూర్తిస్థాయిలో నియంత్రించడం, పాజిటివ్ పేషెంట్లు, అనుమానిత లక్షణాలున్న వారికి మెరుగైన సేవలను అందించడంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఆహారం ప్యాకింగ్కు ఐఆర్సీటీసీ సాయం.. ► క్వారంటైన్, కోవిడ్ కేర్ సెంటర్ల పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా జాయింట్ కలెక్టర్(డెవలప్మెంట్)కు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి కోవిడ్ కేర్ సెంటర్కు మొబైల్ ఎక్స్రే, ఈసీజీ, ల్యాబ్ సదుపాయాలను కల్పిస్తున్నాం. ఇప్పటివరకు 23 యాక్టివ్ సెంటర్లలో 2,280 మంది అడ్మిట్ అయ్యారు. శుక్రవారం 230 మంది చేరారు. ► రాష్ట్రంలోని కోవిడ్ ఆస్పత్రుల్లో 5,874 మంది చికిత్స పొందుతున్నారు. 9,421 మంది అనుమానితులు 116 క్వారంటైన్ సెంటర్లలో ఉన్నారు. క్వారంటైన్, కోవిడ్ కేర్ సెంటర్లలో మంచినీరు, ఆహారం, శానిటేషన్, వైద్య బృందాల సేవలు, అంబులెన్స్లు తదితరాల విషయంలో ఎలాంటి ఉదాసీనత ప్రదర్శించినా సహించేది లేదు. ఆహారం ప్యాకింగ్ కోసం ఐఆర్సీటీసీ సహాయం తీసుకుంటాం. రోజూ 13 వేల మందికిపైగా ఏపీలోకి.. ► రోజూ రోడ్డు మార్గంలో 4,600 మంది వరకు రాష్ట్రంలోకి వస్తున్నారు. 22 రైళ్ల ద్వారా సుమారు ఏడు వేల మంది వరకు ఏపీకి చేరుకుంటున్నారు. విమానాల ద్వారా సుమారు 1,500 మంది వరకు వస్తున్నారు. సగటున రోజుకు 13 నుంచి 15 వేల మంది వరకు ఏపీకి వస్తున్నారు. నాలుగు చార్టెడ్ విమానాల ద్వారా రోజుకు సుమారు 600 మంది రాష్ట్రంలోకి చేరుకుంటున్నారు. ఫిర్యాదులపై థర్డ్ పార్టీతో సర్వే ► క్వారంటైన్, కోవిడ్ కేర్ సెంటర్లు, కోవిడ్ ఆసుపత్రులపై ఇటీవల వచ్చిన ఫిర్యాదులపై రాష్ట్ర ప్రభుత్వం థర్డ్ పార్టీతో సర్వే నిర్వహించింది. కొన్ని సెంటర్లలో సదుపాయాల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించడంతో జిల్లా జాయింట్ కలెక్టర్లు (డెవలప్మెంట్) వీటిని పర్యవేక్షించాలని నిర్ణయించాం. ఎక్కడైనా సమస్యలు ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కొందరికి మెమోలు కూడా ఇస్తున్నాం. మరోసారి సర్వే చేస్తాం.. ► మరోసారి థర్డ్ పార్టీతో రెండో విడత సర్వే నిర్వహించి నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం. కోవిడ్, క్వారంటైన్ సెంటర్లలో సదుపాయాలపై పాజిటివ్ వ్యక్తులు, అనునిత లక్షణాలు ఉన్న వారి నుంచి రాష్ట్ర కోవిడ్ కంట్రోల్ రూం ద్వారా అభిప్రాయాలను సేకరిస్తాం. ఐవీఆర్ఎస్తో కూడా సమాచారం తీసుకుని ఫీడ్ బ్యాక్ ఆధారంగా చర్యలు చేపడతాం. -
‘నా 20 ఏళ్ల సర్వీసులో ఇలాంటి వ్యక్తిని చూడలేదు’
సాక్షి, విజయవాడ : తక్కువ స్థాయిలో కరోనా లక్షణాలు ఉన్నవారిని కోవిడ్ కేర్ సెంటర్లకు తరలిస్తామని కోవిడ్ 19 టాస్క్ఫోర్స్ కమిటీ చైర్మన్ కృష్ణబాబు వెల్లడించారు. , ఇప్పటివరకు 76 కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో మూడు వేల కోవిడ్ కేర్స్ ఏర్పాటు చేస్తున్నామని, తర్వాత దశలో ప్రతి జిల్లాలో అయిదు వేలకు పెంచుతామని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాకు కోటి రూపాయలతో కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. కోవిడ్ కేర్ సెంటర్లలో ఎక్స్రే, అంబులెన్స్, టాయిలెట్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 74 కోవిడ్ ఆస్పత్రుల్లో 5874 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. (అందరికీ పథకాల ఫలాలు దక్కాలి: వైఎస్ జగన్) అయితే కొన్ని కోవిడ్ సెంటర్లలో ఆహారం బాలేదన్న ఫిర్యాదులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి వచ్చాయన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లలో ఫుడ్ సరఫరాలో ఐఆర్టీసీ వాళ్ళ సలహా తీసుకుని పంపిణీకి రెడీ అవుతున్నామని పేర్కొన్నారు. ఫుడ్ విషయంలో వారి అభిప్రాయాలను సేకరిస్తున్నామని, మొత్తం ఆరు అంశాలపై వారి అభిప్రాయాలను సేకరిస్తున్నామన్నారు. డెవలప్మెంట్కు సంబంధించి జాయింట్ కలెక్టర్కు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించామమన్నారు. కొన్నిచోట్లా పెండింగ్లో ఉన్న బిల్లులను ఈనెల 15 లోపు పంపిచాలని, జూన్ 30 వరకు సంబంధించిన బిల్స్ అన్ని క్లియర్ చేస్తామని తెలిపారు. (ఈ నెల 15న ఏపీ కేబినెట్ భేటీ) ‘రోజుకు అయిదు వందలు రూపాయలు పేషెంట్కు ఖర్చు చూస్తున్న సీఎం జగన్ చాలా గ్రేట్. నా 20 ఏళ్ల సర్వీసులో ఇలాంటి వ్యక్తిని చూడలేదు. ఇక ఇతర రాష్ట్రాలు నుంచి, బయట నుంచి వచ్చే వారిని 10శాతం మాత్రమే పరీక్షలు చేస్తున్నాం. గ్రామ సెక్రటేరియట్, వార్డు సెక్రటేరియట్ పరిధిలో పర్యవేక్షణ చేసే విధంగా మార్పులు తీసుకువస్తున్నాం. 13 నుంచి 15 వేల మంది పైగా ఇతర రాష్ట్రాలు నుంచి వస్తున్నారు. 13 వేల మంది ఇతర దేశాలు నుంచి రోజుకు నాలుగు చార్టెడ్ ఫ్లైట్స్ ద్వారా అవకాశం ఇచ్చాము. విశాఖలో రెండు, విజయవాడలో రెండు విమానాలకు అవకాశం ఇచ్చాము. గల్ఫ్ దేశాలు నుంచి ఎక్కువగా వచ్చేవారిలో రాయలసీమ ప్రాంతం వాళ్ళు ఉన్నారు. వీరు తిరుపతి విమానాశ్రయంలో దిగేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం’ అని కోవిడ్-19 టాస్క్ఫోర్స్ కమిటీ చైర్మన్ కృష్ణబాబు తెలిపారు. (ఈఎస్ఐ స్కాంలో మరొకరి అరెస్ట్) -
చెక్పోస్ట్లు ఎత్తివేత వార్తలు అవాస్తవం
-
ఆ వార్తలు అవాస్తవం: కృష్ణబాబు
సాక్షి, అమరావతి: రాష్ట్ర సరిహద్దుల్లో చెక్పాయింట్లను రేపటి నుంచి ఎత్తివేస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి, కోవిడ్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ కృష్ణబాబు స్పష్టం చేశారు. కోవిడ్ 19 మార్గదర్శకాల ప్రకారం సరిహద్దు చెక్పాయింట్లలన్నీ లాక్డౌన్ ముగిసేవరకూ కొనసాగుతాయన్నారు. పలు టీవీ చానల్స్లో చెక్పాయింట్లు ఎత్తివేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. ఆంధ్రప్రదేశ్కు వచ్చేవారంతా కచ్చితంగా ‘స్పందన’ వెబ్సైట్లో నమోదు చేసుకోవాల్సిందేనని తెలిపారు. ఇందుకు తగ్గట్టుగా ప్రయాణాలు నిర్వహించుకోవాలని కృష్ణబాబు సూచించారు. ఇక కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ఆరు రాష్ట్రాల (మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ) నుంచి వచ్చే వ్యక్తులు తప్పనిసరిగా ఏడు రోజులపాటు ప్రభుత్వ క్వారంటైన్లో ఉండాలని కృష్ణబాబు పేర్కొన్నారు. అలాగే తెలంగాణకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాక బస్సులు నడుపుతామని తెలిపారు. (16 రోజులు.. రూ. 29.44 కోట్లు ) కాగా లాక్డౌన్ నిబంధనల సడలింపు నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ (సోమవారం) నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు తిప్పడానికి ఏపీఎస్ ఆర్టీసీ సిద్ధమవుతోంది. బస్సులు తిప్పడానికి అనుమతించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలను కోరింది. ఈ విషయంలో తమిళనాడు మినహా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖ రాశారు. (వైద్య బలగాలు సంసిద్ధం!) -
‘పరిమితం’గా రవాణా వాహనాలకు అనుమతి
సాక్షి, విజయవాడ: నడిచి వెళ్లే వలస కూలీల తరలింపుపై సుప్రీంకోర్టు ఆదేశాలు అందాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోవిడ్ టాస్క్ఫోర్స్ అధికారి కృష్ణబాబు అన్నారు. నడిచి వెళ్లే వలస కూలీలను ఆపి.. షెల్టర్లకు పంపిస్తున్నామని చెప్పారు. వారికి కౌన్సిలింగ్ చేసి బస్సుల్లో, రైళ్లల్లో స్వస్థలాకు తరలిస్తున్నామన్నారు. ఆయన మీడియాతో శుక్రవారం మాట్లాడుతూ.. ‘ఇతర రాష్ట్రాలకు చెందిన 17,273 మందిని ఆయా ప్రాంతాలకు చేరవేశాం. వలస కూలీల కోసం 75 రైళ్లను వివిధ రాష్ట్రాలకు నడిపాం. మొత్తంగా 86 వేల 883 మంది వలస కూలీలను స్వస్థలాలకు పంపించాం. ఈరోజు మూడు రైళ్లు వెళ్తాయి. రాబోయే రోజుల్లో రెండు లేదా 3 రైళ్లు నడుపుతాం. వలస కూలీలందరినీ స్వస్థలాలకు పంపిస్తాం. ఇప్పటి వరకు 10 విమానాల ద్వారా 1535 మంది విదేశాలు, పక్క రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చారు. జూన్ 1 తర్వాత కేంద్రం మార్గదర్శకాలను బట్టి మరిన్ని చర్యలు తీసుకుంటాం. వచ్చే నెల 1 తర్వాత 28 రైళ్లు రాష్ట్రం మీదుగా వస్తున్నాయి. ఆటోలు 1+2, కార్లు 1+3, మినీ వ్యాన్లు 50 శాతం ప్రయాణికులను చేరవేసేందుకు అనుమతి ఇస్తున్నాం. హైదరాబాద్ నుంచి వచ్చే వారిని తీసుకువచ్చేందుకు తెలంగాణ నుంచి అనుమతి లేదు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాల నుంచి అనుమతి రాగానే బస్సులు నడుపుతాం. రాష్ట్రంలో 25 శాతం ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. బస్సు ప్రయాణానికి రెస్పాన్స్ అంతగా లేదు. ఆర్టీసీ బస్సుల్లో 45 శాతం ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) వస్తోంది. -
నడిచి వెళ్లేవారి సంఖ్య తగ్గింది
సాక్షి, అమరావతి: మూడ్రోజులుగా రాష్ట్రం మీదుగా నడిచి వెళ్లే వలస కూలీల సంఖ్య తగ్గిపోయిందని కోవిడ్ టాస్క్ఫోర్సు చైర్మన్ కృష్ణబాబు తెలిపారు. మొత్తం నడిచి వెళ్లే 4,661 మంది వలస కూలీలను చెక్పోస్టుల వద్ద ఆపి వారికి కౌన్సెలింగ్ చేసి 62 రిలీఫ్ సెంటర్లకు ఆర్టీసీ బస్సుల్లో పంపించామన్నారు. వీరిలో మన రాష్ట్రానికి సంబంధించి వివిధ జిల్లాలకు చెందిన వారు కేవలం 485 మంది మాత్రమే ఉన్నారని.. మిగిలిన 4,176 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారన్నారు. ఒడిశా సీఎస్తో మాట్లాడి ఆ రాష్ట్రానికి చెందిన వారిని గంజాం జిల్లాలో వదిలేందుకు ఏర్పాట్లుచేసినట్లు కృష్ణబాబు తెలిపారు. ఆదివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ► శ్రామిక్ రైళ్లలో వలస కూలీలకు రెండు లేదా మూడు బోగీలు కేటాయిస్తున్నాం. ► ప్రకాశం, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల నుంచి బస్సుల్లో 902 మందిని ఒడిశాలోని గంజాంకు చేర్చాం. మరో వెయ్యి మందికి పైగా శ్రామిక్ రైళ్లలో వివిధ రాష్ట్రాలకు పంపుతున్నాం. ► జార్ఖండ్కు ఐదు, పశ్చిమ బెంగాల్, యూపీ వెళ్లేందుకు ఆరు, ఒడిశా, రాజస్థాన్లకు రెండు, బీహార్కు మూడు శ్రామిక్ రైళ్లను నడపాలని నిర్ణయించాం. ► సోమవారం కూడా ఐదు రైళ్లు పంపించేందుకు నిర్ణయించాం. ► ఇప్పటివరకు 31 రైళ్లలో మొత్తం 36,823 మందిని వారివారి రాష్ట్రాలకు పంపించాం. వారికయ్యే ఖర్చు మన రాష్ట్రమే భరిస్తుంది. ► అలాగే, ఏపీకి చెందిన 1,09,742 మంది వలస కూలీలను వారి వారి జిల్లాలకు పంపించాం. ► ఇక కువైట్లో చిక్కుకుపోయిన 2,500 మంది ని రప్పించేందుకు సీఎం విదేశాంగ శాఖకు లేఖ రాయడంతో అక్కడ నుంచి విమానాలు వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. వీరికి ఫ్రీ క్వారంటైన్ సదుపాయం కల్పిస్తాం. -
వలస కార్మికులకు ప్రత్యేక సర్క్యులర్ జారీ చేశాం
సాక్షి, విజయవాడ : లాక్డౌన్ సమయంలో వలస కార్మికులకు సంబంధించి ప్రభుత్వం తరపున ఒక సర్కులర్ జారీ చేసినట్లు కోవిడ్ స్టేట్ కో-ఆర్డినేటర్ కృష్ణ బాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో లాక్డౌన్ ఉన్నా వలస కూలీలు వేల కిలోమీటర్లు నడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నారంటే పరిస్థితి ఏంటో అర్థమవుతుందన్నారు. మన రాష్ట్రానికి సంబంధం లేకున్నా మానవతా దృక్పథంతో వారిని ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ట్రైన్లు, బస్సుల్లో వారిని స్వంత రాష్ట్రాలకు పంపుతున్నట్లు చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో సర్కులర్ కూడా జారీ చేశామన్నారు. గత 3 రోజులుగా నడిచి వెళ్ళే 4661 మందిని రిలీఫ్ సెంటర్స్కి పంపామన్నారు. ప్రతి చెక్ పోస్ట్ వద్ద ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేశామని, ఒడిశాకు సంబంధించిన వారిని బస్సుల ద్వారా గంజాం జిల్లాకు తరలిస్తున్నామని వెల్లడించారు. కాగా ప్రతీ రైలులో వలస కూలీలకు మూడు బోగీలు వీరికి ప్రత్యేకంగా కేటాయిస్తున్నట్లు తెలిపారు. తమిళనాడు డీజీ తో చర్చించాక అక్కడ నుండి నడిచి వచ్చే వారి సంఖ్య చాలా వరకు తగ్గింపోయిందన్నారు. తెలంగాణ నుంచి వలస కార్మికులు నడిచి వస్తూనే ఉన్నారన్నారు. ఈ రోజు ఒడిశాకు చెందిన మరో వెయ్యి మందిని వారి స్వస్థలలాకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం ఏపీ నుంచి ఐదు శ్రామిక్ రైళ్లు వివిధ రాష్ట్రాలకు బయలుదేరుతున్నాయి. నాలుగు, ఐదు రోజుల్లో నడిచి వెళ్ళే వారిని ఈ శ్రామిక్ రైళ్లలో తరలిస్తామన్నారు. వలస కార్మికులపై దౌర్జన్యం, లాఠీ ఛార్జ్ లాంటివి చేయొద్దని సీఎం ఆదేశించారని కృష్ణబాబు వెల్లడించారు. -
24 శ్రామిక్ రైళ్లలో 27,458 మంది తరలింపు
సాక్షి, అమరావతి: వలస కూలీలు, కార్మికులు ఆందోళన చెందవద్దని, శ్రామిక్ రైళ్లకు ఆయా రాష్ట్రాల నుంచి అనుమతులు రాగానే వారిని పంపిస్తున్నట్లు కోవిడ్ టాస్క్ఫోర్సు చైర్మన్ ఎంటీ కృష్ణబాబు తెలిపారు. వారిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చే బాధ్యతను ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక రిలీఫ్ క్యాంపు ఏర్పాటు చేశామన్నారు. వలస కూలీలకు కల్పిస్తున్న వసతులు, ప్రయాణ ఏర్పాట్లపై కృష్ణబాబు ‘సాక్షి’కి వివరాలు వెల్లడించారు. సరిహద్దుల్లో ఇతర భాషల్లో బ్యానర్లు.. ► గత 15 రోజులుగా రాష్ట్రంలోని జాతీయ రహదారులపై వారి రాష్ట్రాలకు వెళుతున్న 6 వేల మంది వలస కార్మికులను గుర్తించాం. సీఎం జగన్ సూచనల మేరకు అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ఒడిశా, బెంగాలీ, హిందీ భాషల్లో ‘మిమ్మల్ని మీ రాష్ట్రాలకు చేరుస్తాం’ అని బ్యానర్లు పెడుతున్నాం. ► ఇప్పటివరకు 24 శ్రామిక్ రైళ్ల ద్వారా 27,458 మంది వలస కూలీలను బిహార్, యూపీ, జార్ఘండ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్లకు పంపించాం. 2 రోజుల్లో మరో 30,392 మందిని తరలిస్తాం. దారి ఖర్చుల కింద రూ.500 ► ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి, ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే కూలీలకు అన్ని సదుపాయాలు కల్పించి రూ.500 దారి ఖర్చుల కింద అందించాలని సీఎం వైఎస్ జగన్ సూచించిన నేపథ్యంలో ఆ మేరకు ఏర్పాట్లు చేశాం. వలస కూలీలకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. ► రాష్ట్రంలో ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు 80,669 మంది వలస కూలీలను 2,748 ఆర్టీసీ బస్సుల్లో తరలించాం. గుంటూరు జిల్లా నుంచి అత్యధికంగా 42,135 మందిని ఇతర జిల్లాలకు తరలించాం. కర్నూలు నుంచి 13,143 మందిని ఇతర జిల్లాలకు పంపించాం. -
ఏపీకి వచ్చేందుకు 30 వేల మంది రిజిస్ట్రేషన్
సాక్షి, అమరావతి: ఇతర దేశాల నుంచి ఏపీకి వచ్చేందుకు 30 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వీరిలో టిక్కెట్లు రద్దు చేసుకున్న వారు పోగా, 15 నుంచి వేల 20 వేల మంది వస్తారని అంచనా వేస్తున్నట్లు కోవిడ్–19 టాస్క్ఫోర్స్ కమిటీ చైర్మన్ ఎంటీ కృష్ణబాబు పేర్కొన్నారు. ఇందులో 65 శాతం మంది గల్ఫ్ దేశాల నుంచి వచ్చేవారు ఉన్నారన్నారు. శనివారం విజయవాడలోని ఆర్అండ్బీ కార్యాలయంలో నోడల్ అధికారి ఆర్జా శ్రీకాంత్తో కలిసి కృష్ణబాబు మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలకు విశాఖపట్నం, పశ్చిమ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు విజయవాడ విమానాశ్రయం, నెల్లూరు, రాయలసీమ నాలుగు జిల్లాలకు తిరుపతి ఎయిర్పోర్టులు కేటాయిస్తున్నామన్నారు. నార్త్, సౌత్ అమెరికా నుంచి వచ్చే విమానాలు చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్కు చేరితే అక్కడి నుంచి విమానాల్లో తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. దేశంలో ఏపీ, కేరళ రాష్ట్రాలు మాత్రమే ఉచిత క్వారంటైన్ సదుపాయం కల్పిస్తున్నాయని, మిగిలిన రాష్ట్రాల్లో పెయిడ్ క్వారంటైన్ అందిస్తున్నారన్నారు. ఈనెల 11న అమెరికా నుంచి మొదటి విమానం హైదరాబాద్కు చేరుకుంటుందని, ఇతర దేశాల నుంచి రాగానే, రిసెప్షన్ టీం ఉంటుందని, అక్కడే ఆర్టీపీసీఆర్, ట్రూనాట్ పరీక్షలు చేస్తామన్నారు. అంతర్రాష్ట్ర రవాణాకు మరింత వెసులుబాటు కల్పించేందుకు డాక్యుమెంట్లతో కూడిన పత్రాలను టp్చnఛ్చీn్చ. జౌఠి. జీnకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. నేరుగా ఈ–పాస్లు దరఖాస్తు చేసుకున్న వారి మొబైల్స్కు వస్తాయి. సహేతుక కారణాలు, సంబంధిత డాక్యుమెంట్లను పొందుపరచాలి. -
రిసెప్షన్ వేడుకకు హాజరైన వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ : రాష్ట్ర రవాణ శాఖ, ఆర్ అండ్ బి ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు కుమారుడి రిసెప్షన్ వేడుక విజయవాడలోని ఎస్.ఎస్.కన్వెన్షన్ హాల్లో గురువారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రిసెప్షన్ వేడుకకు హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నూతన వధూ వరులు స్వరూప్, సోనాలి జంటను ఆశీర్వదించారు. కాగా వైఎస్ జగన్ వెంట మంత్రులు కొడాలి నాని, ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణ రెడ్డి, జోగి రమేశ్, భూమన కరుణాకర్రెడ్డి, పార్థసారధి, పలువురు అధికారులు ఉన్నారు. -
ఆర్టీసీ విలీనానికి ఓకే!
సాక్షి, అమరావతి : ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి ఆమోదముద్ర పడింది. సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణబాబు అధ్యక్షతన శుక్రవారం విజయవాడలోని ఆర్టీసీ హౌస్లో జరిగిన పాలక మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎజెండాలో ప్రాధాన్యాంశంగా ఆర్టీసీ విలీన ప్రక్రియను చేర్చి దానిని ఆమోదిస్తూ పాలక మండలి తీర్మానం చేసింది. విలీనానికి ముందు పబ్లిక్ ట్రాన్స్పోర్టు డిపార్ట్మెంట్ (పీటీడీ) ఏర్పాటుకు సంబంధించి విధి విధానాలు, కమిటీ నియామకాలకూ ఆమోదం తెలిపింది. అలాగే, తొలి విడతగా 350 విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు అనుమతిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్స్టేషన్లలో రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల నిర్వహణకు సంబంధించి లైసెన్సుల పొడిగింపునూ ఆమోదించారు. సమావేశంలో తీసుకున్న ఇతర నిర్ణయాలు.. - బ్రెడ్ విన్నర్ స్కీం కింద (ఆర్టీసీలో ఉద్యోగం చేస్తూ చనిపోయిన కుటుంబాల వారసులకు ఉద్యోగం ఇచ్చే విధానం) దరఖాస్తుల గడువును తగ్గించేందుకు ప్రతిపాదనలను ఆమోదించారు. - ఆర్టీసీని కంప్యూటరీకరణ చేస్తున్నందున జూనియర్ అసిస్టెంట్ (స్టాటిస్టిక్స్) పోస్టుల్ని రద్దుచేశారు. - విశాఖలోని ఎంవీపీ బస్స్టేషన్లో ఈస్ట్కోస్ట్ రైల్వేస్ నిర్వహిస్తున్న రిజర్వేషన్ కౌంటర్ లైసెన్సును మూడేళ్లు, అనంతపురం జిల్లా పుట్టపర్తి బస్స్టేషన్లో సౌత్ వెస్ట్రన్ రైల్వేస్ రిజర్వేషన్ కౌంటర్ లైసెన్సును పదేళ్లు, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి బస్స్టేషన్లో సివిల్ కోర్టు నడిపేందుకు లైసెన్సును మరో ఐదేళ్లపాటు పొడిగిస్తూ బోర్డు నిర్ణయించింది. - విజయవాడ పాత బస్టాండ్ వద్ద 2,836 చదరపు మీటర్ల ఆర్టీసీ స్థలాన్ని బీఓటీ పద్ధతిలో అభివృద్ధికి ఉద్దేశించిన లీజు అగ్రిమెంట్ రద్దుకు బోర్డు ఆమోదించింది. -
వర్ల రామయ్యకు నెల గడువిచ్చిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి: ప్రభుత్వం మారినా టీడీపీ సీనియర్ నేత, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య మాత్రం ఆ పదవిని పట్టుకుని వేళ్లాడుతూనే ఉన్నారు. దీంతో ఆ పదవి నుంచి వైదొలగడానికి రాష్ట్ర ప్రభుత్వం నెల రోజులు గడువు ఇస్తూ నోటీసులు జారీ చేసింది. ఆర్టీసీ నిబంధనల ప్రకారం చైర్మన్ పదవీ కాలం కేవలం ఏడాది మాత్రమే ఉంటుంది. కానీ, వర్ల రామయ్య పదవీ కాలం ఏప్రిల్ 24, 2019లో ముగిసినా ఆయన మాత్రం పదవి నుంచి వైదొలగలేదు. దీంతో ఏపీఎస్ ఆర్టీసీ 1950 చట్టం సెక్షన్-8లోని ఉప నిబంధన-2 ప్రకారం నెల రోజుల గడువిస్తూ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు నిన్న నోటీసు జారీ చేశారు. అదే విధంగా విజయవాడ జోనల్ చైర్మన్ పార్థసారధికి కూడా ఒక నెల గడువిస్తూ ఆర్టీసీ నోటీసులు ఇచ్చింది. ఇదే సమయంలో కడప జోనల్ చైర్మన్ రెడ్యం వెంకట సుబ్బారెడ్డి రాజీనామాను ఆమోదించింది. -
ఆర్టీసీని మంచి సంస్థగా తీర్చిదిద్దాలనే: కృష్ణబాబు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు ఇన్చార్జి ఎండీగా బాధ్యత తీసుకున్నందుకు సంతోషంగా ఉందని రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టీ కృష్ణబాబు తెలిపారు. ఆయన గురువారం విజయవాడలోని ఆర్టీసీ భవన్లో ఎండీగా బాధ్యతలు స్వీకరిచారు. ఈ క్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు ఎండీ కృష్ణబాబును మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీని మంచి సంస్థగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనకు అనుగుణంగా నడుచుకుంటానని తెలిపారు. వచ్చే జనవరి ఒకటిని లక్ష్యంగా పెట్టుకుని విలీనంపై ముందుకు వెళుతున్నామని పేర్కొన్నారు. ఆర్టీసీ సంస్థ అలాగే ఉంటుందని సిబ్బంది మాత్రమే రవాణాశాఖ పరిధిలోకి వస్తారని తెలిపారు. సిబ్బంది వేతనాలను ప్రభుత్వం చెల్లిస్తే ఆర్టీసీని కాపాడుకోవచ్చన్నారు. డీజిల్ ధర రూపాయి పెరిగితే ఏడాదికి రూ. 30 కోట్ల నష్టం వస్తోందని వెల్లడించారు. దసరా పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అంచనాతో సుమారు 1800 ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నామని తెలిపారు. డీజిల్ బస్ల స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు రాయితీతో కూడిన ఎలక్ట్రికల్ బస్సులను అందిస్తోందని తెలిపారు. ఒకొక్క బస్ మీద రూ.55 లక్షలు సబ్సిడీని కేంద్రం ఇస్తోందన్నారు. ఇందులో భాగంగా 6,350 ఎలక్ట్రికల్ బస్సులకు కేంద్రం అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. ఎటువంటి వివాదాలకు తావులేకుండా ఈ-టెండర్ విధానంలో టెండర్లు స్వీకరిస్తుమన్నారు. లీజ్కు తీసుకోవడంలో ఎవరు ముందుకు రాకపోతే అప్పుడు ఏం చేయాలో ప్రభుత్వంతో మాట్లాడతామని తెలిపారు. విజయవాడ, వైజాగ్, తిరుపతి, అమరావతి ప్రాంతాల్లో ఈ ఎలక్ట్రికల్ బస్లను నడిపేందుకు కేంద్రం ఆసక్తి చూపుతోందన్నారు. ప్రతి ఏడాది సుమారు 1000 ఎలక్ట్రికల్ బస్లను తీసుకోవాలని ఆర్టీసీ భావిస్తోందన్నారు. ప్రస్తుతానికి 650 బస్సులకు టెండర్లు పిలిచామని కృష్ణబాబు తెలిపారు. -
ఆర్టీసీ ఎండీ సురేంద్ర బాబు బదిలీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) ఎండీ సురేంద్రబాబు బదిలీ అయ్యారు. ఆయన డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు అందాయి. కాగా రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబుకు ఆర్టీసీ ఎండీగా రాష్ట్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్తులు జారీ చేసింది. చేనేత జౌళి శాఖ కార్యదర్శి శ్రీనివాస శ్రీనరేష్ బదిలీ అలాగే చేనేత, జౌళి శాఖ కార్యదర్శి శ్రీనివాస శ్రీనరేష్ కూడా బదిలీ అయ్యారు. ఆయన సాధారణ పరిపాలన శాఖు రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి జె.మురళికీ చేనేత, జౌళి శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. -
తీరంలో కోత నివారణకు చర్యలు
విశాఖ తీరం కోతకు గురి కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు విశాఖ పోర్టు చైర్మన్ కృష్ణబాబు తెలిపారు. గురువారం ఆయన విశాఖలో విలేకరులతో మాట్లాడారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అభిప్రాయాన్ని అనుసరిస్తూ కోతను అరికట్టేందుకు బీచ్ నరిష్మెంట్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. దీనిపై నెదర్లాండ్స్లోని డెల్టాఫోర్స్ విశ్వవిద్యాలయం సహకారం కూడా తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తీరంలో శాశ్వత కట్టడాల నిర్మాణంతో నష్టమే తప్ప లాభం లేదని వారు సూచన ఇచ్చినట్లు తెలిపారు. అందుకే తీరంలో రూ.13 కోట్లతో ఇప్పటి వరకు లక్ష క్యూబిక్ మీటర్ల ఇసుకనునరిష్మెంట్ కోసం వినియోగించినట్లు వెల్లడించారు. కురుసువ జలాంతర్గామి ప్రాంతంలో ఈ మేరకు ఇసుకను నేరుగా నింపినట్లు తెలిపారు. ఈ ఏడాది నుంచి నేరుగా కాకుండా గొట్టాల ద్వారా 1.50 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తీరంలో డంప్ చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వచ్చే ఫిబ్రవరిలో జరిగే ఇండియన్ ఫ్లీట్ రివ్యూ కోసం రూ.45 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చైర్మన్ కృష్ణబాబు తెలిపారు. -
'అవగాహన లేకుండా మాట్లాడొద్దు'
విశాఖపట్నం: సముద్రతీరం కోతకు పోర్ట్ కారణమనడం సరికాదు విశాఖపట్నం పోర్టు చైర్మన్ ఎంటి కృష్ణబాబు అన్నారు. అవగాహన లేకుండా మాట్లాడితే ప్రజల్లో భయాందోళన రేగుతుందన్నారు. సంక్రాంతి సంబరాలకు రూ. 300 కోట్లు ఖర్చు పెడతామంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సముద్రం కోత నివారణ చర్యలకు డబ్బులు లేవనడం సరికాదన్నారు. డబ్బుల సమస్య లేదని ముఖ్యమంత్రి స్పష్టం చెప్పారని తెలిపారు. -
వైసీపీ కార్యవర్గంలో ఐదుగురికి చోటు
సాక్షి, ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మరోసారి అగ్ర తాంబూలం దక్కింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే తానేటి వనితను నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. అదే విధంగా పార్టీ కేంద్ర పాలక మండలిలోనూ జిల్లాకు ప్రాధాన్యత దక్కింది. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యేలు పెండ్యాల వెంకట కృష్ణారావు(కృష్ణబాబు), జీఎస్ రావులతో పాటు ఇటీవల ఏలూరు, నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన తోట చంద్రశేఖర్, వంక రవీంద్రలను కేంద్ర పాలక మండలి సభ్యులుగా ప్రకటించారు. మహిళకు దక్కిన గౌరవం తానేటి వనిత తండ్రి జొన్నకూటి బాబాజీరావు గోపాలపురం ఎమ్మెల్యేగా 1994, 99లో రెండు పర్యాయాలు పనిచేశారు. తండ్రి వారసత్వంతో 2009లో వనిత రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆ ఏడాది గోపాలపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012లో టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచీ పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహించారు. 2014 ఎన్నికల్లో కొవ్వూరు నుంచి శాసనసభకు పోటీ చేశారు. ఎమ్మెస్సీ, ఎంఈడీ చదువుకున్న వనిత కొంత కాలం నల్లజర్లలోని సహకార జూనియర్ కళాశాలలో అధ్యాపకురాలిగా సేవలందించారు. ఆమె భర్త శ్రీనివాసరావు తాడేపల్లిగూడెంలో ప్రముఖ వైద్యులుగా ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మీద ఉన్న నమ్మకంతో బాధ్యత అప్పగించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, కేడర్లో నూతనోత్సాహం నింపి పార్టీ చేపట్టే అన్ని కార్యక్రమాలను విజయవంతం చేస్తానని ఈ సందర్భంగా వనిత పేర్కొన్నారు. సీనియర్లకు అగ్రస్థానం కృష్ణబాబు కొవ్వూరు ఎమ్మెల్యేగా ఐదు పర్యాయాలు పనిచేశారు. మెట్ట ప్రాంతంలో ముఖ్యనాయకుడిగా ఉంటూ జిల్లా రాజకీయాలను నడిపించారు. పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. జీఎస్ రావు 1999లో కొవ్వూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. నిడదవోలు, కొవ్వూరు నియోజకవర్గాల్లో పట్టున్న నేతగా ఎదిగారు. పీసీసీ అధ్యక్షుడిగా ఆరు నెలలు పనిచేసిన అనుభవజ్ఞులు. తోట చంద్రశేఖర్ ఐఏఎస్ అధికారిగా దేశంలో పలు ప్రాంతాల్లో పనిచేసి, అనేక సేవా కార్యక్రమాలు చేశారు. రవీంద్ర పారిశ్రామిక వేత్తగా ఉంటూ పార్టీకి సేవలందిస్తున్నారు. -
పెట్టుబడుల గమ్యస్థానం విశాఖ
సాక్షి,విశాఖపట్నం: కేంద్రప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా,ఉత్తరాంధ్రకు స్పెషల్ ప్యాకేజీ లభిస్తే రాష్ట్రంతోపాటు విశాఖకు భారీస్థాయిలో పెట్టుబడులు రానున్నాయని కెనడా పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి వైజాగ్ పోర్టు ట్రస్ట్ చైర్మన్ కష్ణబాబు పేర్కొన్నారు. విశాఖలో మంగళవారం సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఏపీ-కెనడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాన్క్లేవ్’ సదస్సులో పాల్గొన్న ఆయన కెనడా ప్రతినిధులకు రాష్ట్ర పారిశ్రామికరంగం అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం తీసుకుంటోన్న చర్యల గురించి వివరించారు. విభజన తర్వాత ఏపీలో సుదీర్ఘతీరప్రాంతం ఆధారంగా ప్రభుత్వం భారీస్థాయి అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తోందన్నారు. ఓడరేవు అధారిత పారిశ్రామికరంగానికి ప్రోత్సాహం కల్పించడం ద్వారా మరింత ప్రగతి సాధించడానికి వీలుంటుందని చెప్పారు. భావనపాడుతోపాటు కాకినాడలోనూ కొత్త పోర్టులు వస్తున్నాయని, ఎల్ఎన్జీ టెర్మినల్లు కాకినాడ,విశాఖలోని గంగవరం పోర్టులోను రావడం ద్వారా పరిశ్రమలకు కావలసినంత ఇంధనం భవిష్యత్తులో నిరంతరం అందేఅవకాశం ఏర్పడుతుందన్నారు. కేంద్రప్రభుత్వం నుంచి ప్రత్యేక హోదా,స్పెషల్ ప్యాకేజీ అమలైతే ఉత్తరాంధ్రలో ఎన్నడూ ఊహించని పారిశ్రామికపెట్టుబడులు తరలిరానున్నట్లు విశ్లేషించారు. పైగా ఉత్తరాంధ్రలో నాణ్యత కలిగిన మావనవనరులు పుష్కలంగా ఉన్నాయని, ఇది కంపెనీలకు చాలా లాభదాయకంగా ఉంటుందని చెప్పారు. కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు గ్యాస్పైపులైన్ నిర్మాణానికి ఆమోదం లభించడం తో మరిన్ని కొత్త పెట్టుబడులు వస్తాయన్నారు. పారిశ్రామికరంగానికి అనువైన వాతావరణంపై కెనడా ప్రతినిధులకు కూలంకుషంగా పలు అంశాలను వివరించారు. వైజాగ్ నుంచి చెన్నైకు ప్రతిపాదిత పారిశ్రామిక కారిడార్ నిర్మాణానికి సంబందించి ప్రస్తుతం చురుగ్గా ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు అధ్యయనం చేస్తోందని, రానున్న ఏడాదిలోగా పూర్తిస్థాయిలో మాస్టర్ప్లాన్ సిద్ధమవుతుందని తెలిపారు. జలరవాణాతోపాటు రైలురవాణాకు సంబంధించి విశాఖ,ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో అద్భుతమైన ప్రగతికి,పెట్టుబడులకు అవకాశం ఉందన్నారు. అరూప్దత్తా ఆర్కిటెక్ట్ లిమిటెడ్ కంపెనీ స్మార్ట్సిటీల నిర్మాణంలో తమకున్న అనుభవాలను వివరించగా, బాంబేర్ డైర్,వోర్లీ పేర్సన్స్,క్లియర్ఫోర్డ్ ఇండస్ట్రీస్,లీ ఇంటర్నేషనల్ లిమిటెడ్,ఐబీఐ తదితర కెనడా కంపెనీల ప్రతినిధులు భారత్లో తమ వ్యాపార కార్యకలాపాల గురించి వివరించారు. -
విశాఖ పోర్టు ట్రస్టు చైర్మన్ పదవికి కృష్ణబాబు పేరొక్కటే!
సాక్షి, హైదరాబాద్: విశాఖపట్టణం పోర్టు ట్రస్టు (వీపీటీ) చైర్మన్ పదవికి కేంద్ర ఓడరేవుల మంత్రిత్వ శాఖ ఐఏఎస్ అధికారి కృష్ణబాబు పేరును ప్రతిపాదించింది. ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్యకార్యదర్శిగా అజయ్ కల్లం బదిలీతో ఖాళీ అయినా ఈ పదవి కోసం రాష్ర్ట కేడర్కు చెందిన సీనియర్ ఐఏఎస్లతో పాటు ఇతర రాష్ట్రాల అధికారులు మొత్తం 36 మంది దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి రాష్ట్ర సర్వీసులోని ఒక అధికారి పేరును ప్రతిపాదిస్తూ ఓడరేవుల మంత్రికి లేఖ రాసినా 10 జన్పథ్ కృష్ణబాబు పేరును సూచించినట్లు సమాచారం. దీంతో సీనియారిటీ, సీఎం విజ్ఞప్తి బేఖాతరయ్యాయి. సాధారణంగా సీనియారిటీ ఆధారంగా ముగ్గురు అధికారుల పేర్లను ప్రతిపాదించాలి. కృష్ణబాబుకు అనుకూలంగా రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు, రాజ్యసభ సభ్యుడు పైరవీ చేసినట్లు ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. -
హెలెన్ వెళ్లినా..
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్లైన్ : హెలెన్ తుఫాన్ హడలెత్తిస్తోంది. గంటల వ్యవధిలో రకరకాల మలుపులు తిరుగుతూ జిల్లా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఒంగోలులో తీరం దాటుతుందన్న హెచ్చరికలు రావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఆ తరువాత దిశ మార్చుకుని గురువారం రాత్రికి మచిలీపట్నం వద్ద కేంద్రీకృతమైంది. శుక్రవారం ఉదయానికి అక్కడ తీరం దాటుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. నెల్లూరులో హెలికాప్టర్ను ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది. అత్యవసర పరిస్థితుల్లో దాన్ని ఉపయోగించుకునే వీలుంది. జాతీయ విపత్తుల నివారణ సంస్థ 80 మంది ప్రత్యేక సిబ్బందిని జిల్లాకు పంపించింది. ఒంగోలులో 40 మంది, సింగరాయకొండలో 40 మంది సిద్ధంగా ఉన్నారు. జిల్లాకు నియమితులైన స్పెషల్ ఆఫీసర్ ఎంటీ కృష్ణబాబు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కలెక్టర్ విజయకుమార్, జాయింట్ కలెక్టర్ యాకూబ్ నాయక్తో సమావేశమై ఏర్పాట్లను పరిశీలించారు. రెండు రోజుల నుంచి హెలెన్ హెచ్చరికలు తీవ్రంగా ఉండటంతో ఏ క్షణంలో ఎటు నుంచి ముంచు కొస్తుందోనని ప్రజలతో పాటు అధికారులు ఆందోళన చెందుతున్నారు. పై-లీన్ తుఫాన్ ముప్పు తప్పినప్పటికీ ఆ తరువాత వచ్చిన భారీ వర్షాలు జిల్లాను అతలాకుతలం చేశాయి. తొమ్మిది మంది ప్రాణాలు నీటిలో కలిసిపోగా వందల కోట్ల రూపాయల మేర నష్టం సంభవించింది. భారీ వర్షాల నుంచి తేరుకోకముందే హెలెన్ హెచ్చరికలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ముఖ్యంగా జిల్లాలో తీర ప్రాంత మండలాల్లో నివసించేవారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తుఫాన్ తీరం దాటే సమయంలో అతి భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా చెట్లు నేలకొరగడం, ఇంటి పైకప్పులు ఎగిరిపోయే ప్రమాదం ఉందని హెచ్చరికలు రావడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. ఒంగోలు, నాగులుప్పలపాడు, చినగంజాం, వేటపాలెం, చీరాల, కొత్తపట్నం, టంగుటూరు, సింగరాయకొండ, ఉలవపాడు, జరుగుమల్లి, గుడ్లూరు మండలాల్లో జిల్లా స్థాయి అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు. వారు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారిని ఏ సమయంలోనైనా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా లారీలను సిద్ధం చేశారు. తీర ప్రాంతాల్లోని మండలాల్లో 28 గ్రామాలపై తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆ గ్రామాల్లో నివసిస్తున్న దాదాపు 46 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు 58 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో బియ్యం, కందిపప్పు, కిరోసిన్ సిద్ధంగా ఉంచారు. సెలవులు రద్దు హెలెన్ తుఫాన్ హెచ్చరికలు రావడంతో జిల్లాలోని అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేస్తూ కలెక్టర్ విజయకుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో ఊహించలేక పోవడంతో అధికారులు, సిబ్బంది సేవలను వినియోగించుకునేందుకు వీలుగా సెలవులను రద్దు చేశారు. గ్రామ, మండల స్థాయిలో అధికారలు, సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తుఫాన్ ముప్పు తప్పే వరకూ కేటాయించిన ప్రాంతాల్లో బృందాలు సంచరిస్తూ ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మత్స్యకారులపై ప్రత్యేక దృష్టి మత్స్యకారులపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది. వేటకు వెళ్లిన వారిని తిరిగి రావాలంటూ ఇప్పటికే సూచించడంతో దాదాపుగా మత్స్యకారులంతా ఒడ్డుకు చేరుకున్నారు. పడవలు, వలలు దెబ్బతినకుండా ఉండేందుకు వాటిని జాగ్రత్త చేసుకున్నారు. -
ముంచుకొస్తున్న ‘హెలెన్’
ఒంగోలు సెంట్రల్, న్యూస్లైన్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తుపానుగా మారి మరింత బలపడనుంది. ఈ తుపానుకు హెలెన్గా నామకరణం చేశారు. హెలెన్ ప్రభావంతో 21, 22, 23 తేదీల్లో జిల్లాలోని కోస్తా తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అంటే 25 సెంటీమీటర్లకు పైగా కుండపోత వర్షం పడే అవకాశం ఉన్నట్లు తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ప్రకాశం, విశాఖ జిల్లాల మధ్య తుపాను తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అదే విధంగా బుధవారం అర్ధరాత్రి నుంచి గంటకు 55-75 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 100-120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయి. అదే విధంగా సముద్రంలో అలలు 1 నుంచి 1.5 మీటర్ల ఎత్తుతో ఎగిసిపడొచ్చు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఈ మూడు రోజులూ జాలర్లు సముద్రంపై వేటకు వెళ్లడాన్ని అధికార యంత్రాంగం పూర్తిగా నిషేధించింది. తుపాను సహాయక చర్యలకు టోల్ ఫ్రీ 1077 నంబరును ఏర్పాటు చేశారు. స్పెషలాఫీసర్లతో కలెక్టర్ సమావేశం.. తుపాను ప్రభావం జిల్లాలోని కోస్తా తీర ప్రాంతాలపై అధికంగా ఉండనుండటంతో 11 తీర ప్రాంత మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. ఈ మండలాల పరిధిలోని 28 గ్రామాల ప్రజలను 21వ తేదీ మధ్యాహ్నం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. స్థానిక సీపీఓ కాన్ఫరెన్సు హాలులో బుధవారం సాయంత్రం తీర ప్రాంత ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ గురువారం మధ్యాహ్నం నుంచే తీరప్రాంత ప్రజలను, అదే విధంగా ముంపునకు గురయ్యే అవకాశాలున్న కాలనీలను ఖాళీ చేసి తక్షణమే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు. వీటితో పాటు పునరావాస కేంద్రాలను వీలైనంత ఎక్కువగా ఏర్పాటు చేయాలన్నారు. అక్కడ ప్రజల అవసరాాల మేరకు ఆహారాన్ని, మంచినీటిని, కొన్ని మందులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. పునరావాస కేంద్రాల్లో మంచినీరు, ఆహారాన్ని ప్రభుత్వ వైద్యాధికారులు పరీక్షించిన తర్వాత మాత్రమే ప్రజలకు పంపిణీ చేయాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాను సమీక్షించాలని ట్రాన్స్కో ఎస్ఈని ఆదేశించారు. 100 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీస్తే విద్యుత్ సరఫరా నిలిపి వేయాలన్నారు. ఒక వేళ విద్యుత్ లైన్లు దెబ్బతిన్న చోట యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టాలని సూచించారు. రంగంలోకి జాతీయ విపత్తుల నివారణ సంస్థ.. జాతీయ విపత్తుల నివారణ సంస్థ అసిస్టెంట్ కమాండెంట్ కిషన్ కుమార్ ఆధ్వర్యంలోని బృందం కోస్తా తీర ప్రాంతంలో ప్రజలు, అధికారులకు అందుబాటులో ఉంటారు. ఇతర సమాచారం కోసం సెల్ నం: 94409 98620లో సంప్రదించవచ్చు. ప్రత్యేకాధికారిగా కృష్ణబాబు తుపానుకు సంబంధించిన జిల్లా ప్రత్యేకాధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఎంటీ కృష్ణబాబును ప్రభుత్వం నియమించింది. ఆయన గురువారం మధ్యాహ్నంకల్లా ఒంగోలు నగరానికి రానున్నారు. -
సీనియర్ ఐఏఎస్ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) కమిషనర్ కృష్ణబాబు సహా పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ సోమేశ్ కుమార్ను జీహెచ్ఎంసీ కొత్త కమిషనర్గా నియమించింది. కృష్ణబాబుకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి ఎఆర్.సుకుమార్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అదర్సిన్హా, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ ప్రియదర్శినిలు కూడా బదిలీ అయ్యారు. అయితే వారికీ ఎక్కడా పోస్టింగ్లు ఇవ్వలేదు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న రేమండ్ పీటర్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమితులయ్యారు. అధికారులు బదిలీ వివరాలు.. -
రోడ్లన్నీ సైకిళ్లతో నిండిపోవాలి: నరసింహన్
హైదరాబాద్: వచ్చే పదేళ్లలో హైదరాబాద్ రోడ్లు సైకిళ్లతో నిండిపోవాలని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆకాంక్షించారు. జీహెచ్ఎంసీ గచ్చిబౌలిలో నిర్మించిన బైక్ స్టేషన్ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సంర్భంగా మాట్లాడుతూ... ‘నగరంలో వాహన కాలుష్యం ప్రమాదకర స్థాయిలో పెరిగింది. దీన్ని నివారించాల్సిన బాధ్యత నగరావాసులందరిపై ఉంది. ప్రస్తుతం ప్రారంభమైన బైక్ టు వర్క్ (పనికి సైకిల్పై పోదాం) ప్రయత్నం నగరం అంతా విస్తరించాలి. మెట్రో రైల్ సైకిల్ స్టేషన్లతో అనుసంధానం చేస్తే ఎక్కువ మంది సైకిళ్లపై ఆఫీసులకు వెళ్లే అవకాశం ఉంది. వచ్చే పదేళ్లలో నగరమంతా సైకిల్ ట్రాక్ లు విస్తరించేలా జీహెచ్ఎంసీ ప్రణాళికలు సిద్ధం చేయాలి’ అన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబు మాట్లాడుతూ... నగరమంతా ప్రత్యేక సైకిల్ ట్రాక్లను విస్తరించేలా ప్రణాలికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. అనంతరం నిర్వహించిన ‘బైసైక్లోన్ -2013’లో వెయ్యికి పైగా సైక్లిస్టులు పాల్గొన్నారు. మంత్రులు దానం నాగేందర్, ప్రసాద్కుమార్, మేయర్ మాజిద్ హుస్సేన్, ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ , డిప్యూటీ మేయర్ రాజ్కుమార్, మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్, ఏపీఐఐసీ ఎండీ జయేష్ రంజన్, హైరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ చైర్మన్ డీవీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
అయోమయం..ఆందోళన
సాక్షి, సిటీబ్యూరో: ఒక్క హడావుడి నిర్ణయం.. అయోమయానికి, ఆందోళనకు దారి తీసింది. ప్రజల మనోభీష్టానికి వ్యతిరేకంగా హడావుడిగా జీహెచ్ఎంసీలో విలీనం.. ‘అభివృద్ధి’తో ఆకట్టుకోవాలనుకున్న అధికారుల ఆత్రుతకు మేయర్ కళ్లెం.. విలీనమైన 35 పంచాయతీల్లో కొన్ని గ్రామాల విలీనాన్ని రద్దు చేస్తూ తాజాగా కోర్టు స్టే.. వరుస పరిణామాల నేపథ్యంలో ఇటీవల గ్రేటర్లో విలీనమైన గ్రామాల ప్రజల్లో అయోమయం నెలకొంది. ఆయా గ్రామాల్లో ఎలాంటి పనులు జరుగక జనం ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల అభిప్రాయాల్ని, జీహెచ్ఎంసీ పాలక మండలి తీర్మానాన్ని తోసిరాజని శివార్లలోని 35 గ్రామపంచాయతీలను ప్రభుత్వం ఇటీవల జీహెచ్ఎంసీలో విలీనం చేయడం తెలిసిందే. విలీన జీవోలు వెలువడ్డాయో లేదో.. అధికార యంత్రాంగం ఆయా గ్రామాలపై పడి, ప్రజల ఆందోళనలను పట్టించుకోకుండా రికార్డుల్ని స్వాధీనం చేసుకుంది. వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి, ప్రజా వ్యతిరేకతను పారదోలాలని భావించినా.. చివరకు చుక్కెదురైంది. నిధుల విడుదలకు బ్రేక్.. కౌన్సిల్ తీర్మానాన్ని సైతం తుంగలో తొక్కి ప్రభుత్వం విలీన ప్రక్రియను పూర్తి చేయడాన్ని జీర్ణించుకోలేని పాలకమండలి.. తమ ఆమోదం లేని గ్రామాల్లో తమ నిధులతో అభివృద్ధి పనులు చేయరాదని నిర్ణయించింది. జీహెచ్ఎంసీ నిధులతో విలీన గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేయరాదని ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో మేయర్ మాజిద్ కమిషనర్ కృష్ణబాబుకు సూచించారు. తనకున్న అధికారంతో మేయర్ నిధుల విడుదలకు బ్రేక్ వేశారు. దీంతో ఏం చేయాలో అధికారులకు పాలుపోని పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో ఇబ్బందులు.. తాజా పరిణామాల నేపథ్యంలో విలీన గ్రామాల్లో పనులు నిలిచిపోయాయి. దాంతో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్టవేశాయి. జీహెచ్ఎంసీలో విలీనమైనప్పటికీ, పంచాయతీ సిబ్బందిని అక్కడే ఉంచారు. పంచాయతీల్లో ప్రస్తుతమున్న సామాగ్రి, సిబ్బందితోనే పనులు చేయాలని అధికారులు సూచించారు. సిబ్బంది ఉన్నా.. విద్యుద్దీపాలు, పారిశుద్ధ్యం, తదితర పనుల నిర్వహణకు అవసరమైన నిధుల్లేవు. అత్యవసర నిధుల కింద ఒక్కో గ్రామానికి రూ.5 లక్షల వంతున మంజూరు చేయనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించినా విడుదల కాలేదు. ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఎవరివ్వాలో తెలియక అవి ఆగిపోయాయి. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలదీ అదే పరిస్థితి. పంచాయతీల్లో పని చేస్తున్న సిబ్బందికి పంచాయతీరాజ్ శాఖ జీతాలు నిలిపివేసింది. దాంతో, గత నెల జీతాలందలేదు. ఈ నెల సైతం వస్తాయో, రాదో తెలియని పరిస్థితి నెలకొంది. -
సాంస్కృతిక చిరంజీవి
సాక్షి, కల్చరల్ కరస్పాండెంట్: కమలాకర కామేశ్వరరావు... పౌరాణిక చిత్రాలు తీయడంలో ఆయనకు ఆయనే సాటి. అందుకే ఆయన్ను తెలుగు చిత్రసీమ పౌరాణిక బ్రహ్మ అని కీర్తిస్తుంది. భారతీయ-తెలుగు సినిమా శత వసంతోత్సవాల నేపథ్యంలో త్రిపురనేని సాయిచంద్ రూపొందించిన డాక్యుమెంటరీలు నగ రంలో ప్రదర్శిస్తున్నారు. ఇందులో భా గంగా ఆదివారం సాయంత్రం 7 గం టలకు లామకాన్లో కమలాకర కామేశ్వరరావుపై డాక్యుమెంటరీ ప్రదర్శిస్తారు. ఈ సందర్భంగా కమలాకర జ్ఞాపకాలను నెమరేసుకున్నారు ఆయన తనయలు పానుగంటి లక్ష్మి, శాంతలు. 3 నెలల మనవడికి ఉత్తరాలు!: లక్ష్మి పౌరాణిక బ్రహ్మగా విఖ్యాతుడైన నాన్నగారిని ‘కల్చరల్ కంటిన్యుటీ’ (సాంస్కృతిక చిరంజీవి)గా ఒక అమెరికా అ మ్మాయి అభివర్ణించింది. ఆయన దర్శకత్వం వహించిన (చంద్రహారం, మహా కవి కాళిదాసు, పాండురంగ మహత్యం, మహామంత్రి తిమ్మరుసు, గుండమ్మకథ, నర్తనశాల, పాండవ వనవాసం, శ్రీకృష్ణ తులాభారం, కృష్ణావతారం, కురుక్షేత్రం) ఏదో ఒక సినిమానో, పాటో టీవీల్లోనో, యూట్యూబులోనో రోజూ లక్షలాది తెలుగువారు ఆస్వాదిస్తుం టారు. వారిలో కొందరు మా గురించీ తెలుసుకుని ఫోన్ చేస్తుంటారు. నాన్న మమ్మల్ని షూటింగులకు తీసుకెళ్లేవారు కాదు. కాలేజీ ఫ్రెండ్స్ గొడవ చేస్తే ఒకసారి గుండమ్మకథ, మహామంత్రి తిమ్మరుసు షూటింగులకు తీసుకెళ్లారు. బందరులో మొగలాయిల కొలువులో మా తాత పెద్ద ఉద్యోగి. గుర్రపు బగ్గీ ఇంటికి వచ్చేదట. నాన్న పది నెలల వయసపుడే మా తాత పోయారు. పెదనాన్న... నాన్న ఆలనా పాలనా చూశారు. ఆయన సినిమాల్లో నిలదొక్కుకున్నాక బంధువుల కుటుంబాలన్నిటికీ ఆధారంగా నిలి చారు. నాన్న ఎక్కువగా మాట్లేడేవారు కాదు. ఇంట్లో పెద్ద గ్రంథాలయం ఉండేది. ఉదయం 7 గంటలకు స్టుడియోకు వెళ్తే రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చేవారు. ఎప్పుడూ బిజీగా ఉండే నాన్న... నా పెళ్లి అయ్యాక, ము ఖ్యంగా నవీన్ పుట్టాక తనివితీరా మాట్లాడేవారు. మూడు నెలల వయసులో ఉన్న నవీన్కు ఉత్తరాలు రాసి, ‘ఒరే ఇవి నీవు పెద్దయ్యాక చదువుకోరా’ అనేవారు. లాండ్స్కేప్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న నవీన్ తాత పేరును ఇండస్ట్రీలో మళ్లీ గుర్తుచేస్తున్నాడు. రామానాయుడు వంటి ప్రముఖుల స్టుడియోలు, నివాసాలకు ‘లాండ్స్కేప్’ డిజైనింగ్ చేస్తున్నాడు. ఆడపిల్లలంటే గారాబం: శాంత మేం ఐదుగురు సంతానం. రామకృష్ణ ఒక్కడే మగ సంతానం. ఆడపిల్లలమైనా (లక్ష్మీ, శాంత, ఉష, ఉమ) నాన్న మమ్మల్ని ఎంతో ప్రేమగా పెంచారు. ఘంటసాల, గోఖలే, మాధవపెద్ది తదితరులు కుటుంబాలతో తరచూ ఇంటికి వచ్చేవారు. మీ ఇంటికి వస్తే పండుగలా ఉంటుంది అనే వారు మా ఫ్రెండ్స్. మన మైథాలజీని తెలుగువారు గుర్తుంచుకున్నంత కాలం నాన్న జీవించే ఉంటారు. ఆర్ట్ ఈజ్ లాంగ్ కదా. -
సిటీ రోడ్లపై సీఎం సీరియస్
సాక్షి, సిటీబ్యూరో: ‘ఢిల్లీలో రోడ్లు మెరుగ్గా ఉన్నాయి. ఇక్కడెందుకింత అధ్వానంగా దెబ్బతింటున్నాయి? ఒక్క వానకే ఛిద్రమవుతున్నాయెందుకు? సమస్య పరిష్కారానికి మీరేం చేస్తున్నారు?’ అంటూ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి అధికారుల తీరు పై మండిపడ్డారు. నగరంలో ర హదారులు దారుణంగా దెబ్బతిన్న నేపథ్యంలో ఆయన శుక్రవారం సచివాలయంలో జీహెచ్ఎంసీ, ఆర్అండ్బీ తదితర విభాగాల అధికారులతో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. యంత్రాంగం పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘నిధుల సమస్య లేదు. ఎన్ని కావాలో చెప్పండి. రోడ్లు మాత్రం బాగుండాలి. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు, నిర్వహణ పనులు జరగాలి’ అన్నారు. సమస్య పరిష్కారానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో వారంలో తనకు నివేదికనివ్వాలని ఆదేశించారు. వచ్చేవారం మరోమారు సమీక్షిస్తానన్నారు. ఆర్అండ్బీ, జలమండలి తదితర విభాగాల సమన్వయంతో తగిన ప్రణాళికతో జీహెచ్ఎంసీ ముందుకు రావాలన్నారు. ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా, నగర జనాభాకు తగిన విధంగా, అన్ని కాలాల్లో మన్నికగా ఉండేలా పనులు చేపట్టాల న్నారు. ఇకపై ఇలాంటి పరిస్థితి సహించేది లేదన్నారు. వర్షపునీరు సాఫీగా వెళ్లేందుకు తగిన కేంబర్తో, నాణ్యమైన సామగ్రితో రహదారుల పనులు చేయాలని సూచిం చారు. సమావేశంలో మంత్రులు గీతారెడ్డి, ముఖేశ్గౌడ్, డి.నాగేందర్, చీఫ్ సెక్రటరీ మహంతి, మున్సిపల్ పరిపాలన, పట్టాణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జోషి, జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబు, జలమండలి ఎండీ శ్యామలరావు, ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రేంచంద్రారెడ్డి, ఆయా విభాగాల ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రణాళిక, పర్యవేక్షణ లోపాలు.. నగర రోడ్ల ప్రస్తుత దుస్థితికి తగిన ప్రణాళిక లేకపోవడం, పర్యవేక్షణ కొరవడటం, నిబద్ధతలేమి కారణాలని సీఎం అభిప్రాయపడ్డారు. వచ్చేవారానికల్లా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని, దీనికి సంబంధించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని జోషికి సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఈ సీజన్లో నిరంతరాయంగా.. ఎక్కువ వర్షాలు కురియడం వ ల్ల రోడ్లు దెబ్బతిన్నాయని అధికారులు సీఎంకు చెప్పారు. మున్నెన్నడూ లేని విధంగా ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు భారీ వర్షాలు కురిశాయని కృష్ణబాబు తెలిపారు. దీంతో నీటి నిల్వలతో రోడ్లు బాగా దెబ్బతిన్నాయన్నారు. జూన్ నుంచి ఇప్పటి వరకు 512 మి.మీ.ల వర్షపాతం నమోదైందని, సాధారణం కంటే ఇది 26.1 శాతం ఎక్కువన్నారు. జీహెచ్ఎంసీలో సాధారణ వర్షపాతం 406 మి.మీలని తెలిపారు. నీటినిల్వ ప్రాంతాల్లో అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. కేంబర్ ఏర్పాటు, అవసరమైన ప్రాంతాల్లో మిల్లింగ్లతోపాటు బీటీ రోడ్లకు రీకార్పెటింగ్ పనులు చేస్తామని చెప్పారు. నీటి లీకేజీలు, మురుగునీటి ప్రవాహం, వివిధ విభాగాల అవసరార్థం రోడ్డు కటింగ్ల వల్ల కూడా రోడ్లు తరచూ దెబ్బతింటున్నాయన్నారు. ప్రస్తుతం మరమ్మతు పనుల్ని కొనసాగిస్తామని, శాశ్వత రీకార్పెటింగ్ పనుల్ని మాత్రం వర్షాకాలం ముగిసిన వెంటనే చేపడతామన్నారు. ఈ సీజన్లో 2739 ప్రాంతాల్లో 61.35 కి.మీ.ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని, 39.54 కి.మీ.ల మేర మరమ్మతులు చేశామని, 15310 గుంతలకు 13501 పూడ్చామని ఆయన వివరించారు.