Kuna Ravi Kumar
-
చంద్రబాబు పాలనపై ‘కూన రవికుమార్’కు ఫోన్
శ్రీకాకుళం: ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్కు(Kuna Ravikumar) మంగళవారం ఓ వింత అనుభవం ఎదురైంది. ఆయన పార్టీ క్యాడర్తో మాట్లాడుతుండగా.. ఓ ఫోన్కాల్(Phone call) వచ్చింది. లిఫ్ట్ చేసి చూస్తే అవతలి వారు ‘ఏపీలో చంద్రబాబు(Chandrababu) పాలన ఎలా ఉంది.. ఆమదాలవలస ఎమ్మెల్యే పాలన ఎలా ఉంది..?’ అని ప్రశ్నలు అడిగారు. దీంతో ఆయన అందరి ముందు స్పీకర్లో మాట్లాడారు. ‘ఆమదాలవలస ఎమ్మెల్యే మంచివారేనా’ అని అడిగిన ప్రశ్నకు ఆయన మంచివారు కాదని సమాధానం చెప్పారు. ‘మీకు పెళ్లయ్యిందా..? వయసు ఎంత..?’ అని అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెప్పి ఆటపట్టించారు. ఈ తంతును అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. టీడీపీ పాలన ఎలా ఉంది అని ఎమ్మెల్యేనే ప్రశ్నించడం అందరికీ విచిత్రంగా అనిపించింది. -
మా ప్రాణాలు తీసే అభివృద్ధి మాకెందుకు బాబు, కూన రవికుమార్కి గిరిజనులు వార్నింగ్
-
అసెంబ్లీలో మళ్లీ కూన వర్సెస్ అచ్చెన్న!
అమరావతి, సాక్షి: ఉమ్మడి శ్రీకాకుళం ముఖ్య నేతల విబేధాలు.. అసెంబ్లీ సాక్షిగా మరోసారి బయటపడ్డాయి. ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఈసారి సొంత ప్రభుత్వంపైనే ఆరోపణలు చేయగా, మంత్రి అచ్చెన్నాయుడు కాస్త గట్టిగానే స్పందించారు.ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్ ల కొనుగోలు లో అక్రమాలు జరిగాయంటూ కూన రవికుమార్ ఇవాళ అసెంబ్లీలో ఆరోపణలు గుప్పించారు. ‘‘లక్షా 30 వేలకు పక్క స్టేట్లో కొంటే.. మన రాష్ట్రం లో 2 లక్షల 4 వేలకు ఎందుకు కొనుగోలు చేశారు?. గోద్రెజ్ లాంటి కంపెనీలను పక్కన పెట్టి కోల్డ్ చైన్ లాంటి కంపెనీలకు ఎందుకు అనుమతి ఇచ్చారు?’’ అని కూన ప్రశ్నించారు.దీనికి మంత్రి అచ్చెన్నాయుడు బదులిస్తూ.. ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్ లు హారిజాంటల్, వర్టికల్ అని రెండు మోడల్స్ ఉంటాయ్. హారిజాంటల్ ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్ లను మాత్రమే కొనుగోలు చేయాలని కేంద్రం కోరింది. ఫార్చ్యూన్ అనే కంపెనీ L1 కోట్ చేయడం తో వారికి టెండర్ వచ్చింది. మహారాష్ట్ర లో లక్షా 84 వేలు, కర్నాటక లో 2.27 లక్షలకు కొన్నారు... గోద్రెజ్ కంపెనీ వాళ్లకు టెండర్ రాలేదని రాద్ధాంతం చేసారు. విశాఖ లో ఒక గోద్రెజ్ డీలర్ దీన్ని వివాదం చేసినట్టు మా దృష్టికి వచ్చింది. దీనిపై మేము గోద్రెజ్ కంపెనీ కి లెటర్ రాసాం, మాకేం సంబంధం లేదని చెప్పారు. అయినా సభ్యులకు అనుమానాలు ఉన్నాయ్ కాబట్టి మరోసారి విచారణ చేయిస్తాం ’’ అని మంత్రి అచ్చెన్న అన్నారు. ఇక..ఈ సమావేశాల్లో మొన్నీమధ్యే ఇద్దరి మధ్య ఆసక్తికర సంవాదం చోటు చేసుకుంది. జీరో అవర్లో మంత్రుల తీరుపై టీడీపీ ఎమ్మెల్యే కూన రవి విమర్శలకు దిగారు. ‘అసెంబ్లీలో జీరో అవర్ డ్రైవర్ లేని కారులా ఉంది’ అని అన్నారాయన. దీనికి మంత్రి అచ్చెన్నాయుడు.. ‘‘‘‘మంత్రులం ఎవ్వరం పట్టించుకోవడం లేదనుకోకండి. ప్రతి ప్రశ్నను సంబంధించిన మంత్రికి పంపమని చెప్పారు. దాని ప్రకారం మంత్రులు చర్యలు తీసుకుంటారు’’ అని బదులిచ్చారు. అయితే ఇద్దరి మధ్య మాటలయుద్ధ తీవ్రతను తగ్గించేందుకు.. మధ్యలో స్పీకర్ అయ్యన్న జోక్యం చేసుకుని ఏదో జోక్ వేసే ప్రయత్నం చేశారు. -
ఏపీ శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ మంత్రి.. మధ్యలో స్పీకర్
అమరావతి, సాక్షి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. శాసనసభను వైఎస్సార్సీపీ బహిష్కరించినప్పటికీ.. ‘ప్రతిపక్షం లేదే!’ అనే లోటును కూటమి నేతలే భర్తీ చేస్తున్నారు. గత ఐదు రోజులుగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం.తాజాగా.. శాసనమండలి వాయిదాతో శనివారం ఐదో రోజు శాసనసభ మాత్రమే నడుస్తోంది. అయితే జీరో అవర్లో మంత్రుల తీరుపై టీడీపీ ఎమ్మెల్యే కూన రవి విమర్శలకు దిగారు. ‘అసెంబ్లీలో జీరో అవర్ డ్రైవర్ లేని కారులా ఉంది’ అని అన్నారాయన.‘‘ఎమ్మెల్యేలు జీరో అవర్ లో ప్రశ్నలు వేస్తున్నారు. కానీ మంత్రులు ఎవ్వరు లేచి నోట్ చేసుకున్నాం అని చెప్పడం లేదు. మరి ఎమ్మెల్యేలు సమస్యలు చెప్పి ఏం లాభం?. జీరో అవర్ లో చెప్పిన సమస్య పై వచ్చే సభ లోగా మంత్రులు సభ్యులకు పురోగతి పై స్పష్టత ఇవ్వాలి’’ అని కాస్త ఆవేశపూరితంగానే అన్నారు. అయితే.. ఈ వ్యాఖ్యలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పందించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు ఖచ్చితంగా రాసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో.. కూన రవి వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు.‘‘మంత్రులం ఎవ్వరం పట్టించుకోవడం లేదనుకోకండి. ప్రతి ప్రశ్నను సంబంధించిన మంత్రికి పంపమని చెప్పారు. దాని ప్రకారం మంత్రులు చర్యలు తీసుకుంటారు’’ అంటూ గట్టిగానే బదులిచ్చారు. అయితే అచ్చెన్న మాట్లాడుతున్నంత సేపు.. కూన మాత్రం సీరియస్గా ముఖం పెట్టుకుని కనిపించారు.అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైననాటి నుంచే.. సభలో మునుపెన్నడూ చోటు చేసుకోని పరిణామాలు కనిపిస్తున్నాయి. స్పీకర్ అయ్యన్నపాత్రుడు బహిరంగంగానే కూటమి నేతలపై, మంత్రులపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే.. నిన్నటి బడ్జెట్ చర్చలో టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. కొత్తగా డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన రఘురామ కృష్ణంరాజుపై అసహనం వ్యక్తం చేశారు. తన ప్రసంగాన్ని అడ్డుకోవడంతో.. తానేమీ ప్రతిపక్షం కాదని, మాట్లాడకుండా కూర్చోమంటే అదే పని చేస్తానని, అసెంబ్లీకి రావద్దంటే రానంటూ జ్యోతుల నెహ్రూ ఎమోషనల్ అయ్యారు.ఇదీ చదవండి: ఇసుక పాలసీ బాలేదన్న జ్యోతుల.. మైక్ కట్ చేసిన రఘురామ!ఇదీ చదవండి: బాబుగారి మాటలకు అర్థాలే వేరులే..! -
బరితెగించిన పచ్చ గూండాలు
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: కాశీబుగ్గలో టీడీపీ కార్యకర్తలు బరితెగించారు. పోలీస్స్టేషన్లోనే వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. పోలీసులు వద్దని వారించినా వినకుండా టీడీపీ నేతలు చితకబాదారు. టీడీపీ నేతలు దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు.టీడీపీ నేతల కక్ష సాధిపుమరోవైపు, సనపల సురేష్పై టీడీపీ నేతలు కక్ష సాధిపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నాడని గతంలో సురేష్పై ఇసుక మాఫియా దాడి చేసింది. ఇసుక మాఫియాతో ఎమ్మెల్యే కూన రవికుమార్ దాడి చేయించాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా పోలీసులు తనను వేధిస్తున్నారని సురేష్ అంటున్నారు.విచారణకంటూ పిలిచి సురేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే కూన రవికుమార్ ఒత్తిడితోనే తనపై పోలీసులు కేసు నమోదు చేశారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. బాధితుడు సురేష్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. -
ఇసుక దందాను అడ్డుకుంటే అంతే..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్రంలో ఇసుక మాఫియా ఆగడాలకు అంతులేకుండా పోతోంది. అడ్డొస్తే ఎంతకైనా తెగిస్తున్నారనడానికి శ్రీకాకుళంలో తాజాగా చోటుచేసుకున్న ఘటనే ఉదాహరణ. నగరం నడిబొడ్డున ఈనెల 16న టీడీపీ నాయకుల దాడిలో ఆమదాలవలస నియోజకవర్గానికి చెందిన సనపల సురేష్ తీవ్రంగా గాయపడ్డారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయలేదుగానీ సురేష్ను మాత్రం అరెస్టు మీద అరెస్టు చేస్తున్నారు. దాడికి తెగబడడమే కాక.. టీడీపీ అతనిపై ఎదురు కేసు పెట్టి శనివారం అరెస్టు చేయించింది. అలాగే, వారం రోజుల క్రితం ఓ పాత కేసులోనూ అరెస్టుచేశారు. దీంతో ఆ పార్టీ నేతల వేధింపులు భరించలేక సురేష్ టీడీపీ సభ్యత్వం తీసుకున్నా పచ్చమూకలు వదిలిపెట్టలేదు. పైగా.. ఇసుక దోపిడీకి అడ్డుతగిలితే ఎవరికైనా ఇదేగతి అని ఆ పార్టీ సంకేతాలిచ్చింది. అసలేం జరిగిందంటే.. జిల్లాలోని ఆమదాలవలస మండలం దూసి గ్రామం ఎస్సీ కాలనీ సమీపంలోని నాగావళి నదిలో ఇసుక అక్రమార్కులు ఇసుక తవ్వి బావాజీపేట రబ్బర్ తయారీ ఇండస్ట్రియల్ యార్డులో నిల్వచేసి ఉంచారు. ఇది చూసి బూర్జ మండలం గుత్తావెల్లికి చెందిన సనపల సురేష్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవి అనుచరుడైన తొగరాం వాసి రవికాంత్ నేతృత్వంలోనే ఈ తంతు జరుగుతున్నట్లు శ్రీకాకుళం తహసీల్దారు గణపతి కూడా తేల్చారు. ఈ నేపథ్యంలో.. ఈనెల 16న ఇసుక నిల్వలను మీడియాకు చూపించడానికి సురేష్ వెళ్తుండగా ఆయనపై కొందరు దాడికి యత్నించారు. అక్కడి నుంచి సురేష్ తప్పించుకుని వస్తుంటే.. శ్రీకాకుళంలోని బలగ మెట్టు కూడలి వద్ద మళ్లీ అటకాయించి ఆయనను కారు నుంచి బయటకు లాగి మరీ దాడిచేశారు. సురేష్తో పాటు వచ్చిన చంద్రరావు అనే వ్యక్తిపైనా దాడిచేశారు. అంతకుముందు.. సెప్టెంబరు 27న కూడా కాఖండ్యాం ఇసుక ర్యాంపులో అక్రమాలను అడ్డుకున్నారని నారాయణపురం వద్ద సురేష్ కారును అడ్డగించి దాడిచేశారు. డీఎస్పీ వద్ద విచారణకని పిలిచి అరెస్టు..ఇసుక మాఫియాకు కొరకరాని కొయ్యగా తయారైన సురేష్ను శ్రీకాకుళంలో తనపై దాడి ఘటనకు సంబంధించి విచారణకని పోలీసులు పిలిచారు. టూటౌన్ పోలీసుస్టేషన్కు సురేష్ వచ్చారు. విచారణ పూర్తయ్యాక స్టేషన్ నుంచి బయటికి రాగానే రూరల్ పోలీసులొచ్చి అరెస్టుచేశారు. ఈనెల 16న జరిగిన ఘటనలో కారుతో గుద్దేసి ఇద్దరి ప్రమాదానికి కారణమయ్యాడనే కేసు కింద అరెస్టుచేసినట్లు ఎస్ఐ కె. రాము తెలిపారు.కక్షపూరితంగా అరెస్టు చేశారు..పోలీసులు నా భర్తను కక్షపూరితంగా అరెస్టుచేశారు. విచారణకని పిలిచి అరెస్టుచేశారు. ఈనెల 25వ తేదీ సాయంత్రం రెండో పట్టణ పోలీసులు ఫోన్ చేశారు. 26న డీఎస్పీ విచారణ ఉందని రమ్మన్నారు. దీంతో శనివారం మధ్యాహ్నం 12.30కు రెండో పట్టణ పోలీస్స్టేషన్కు సురేష్తో కలిసి వెళ్లాం. అక్కడ స్టేట్మెంట్ రాసుకుంటామని చెప్పి సాకు‡్ష్యలు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. అక్కడే వందలాది మంది చూశారని చెప్పాం. సరే.. మీరు వెళ్లిపోండని సీఐ అనగానే బయటకు వచ్చేశాం. ఇంతలో రూరల్ ఎస్ఐ కె. రాము తమ సిబ్బందితో కలిసి నా భర్తను జీపులో ఎక్కించుకుని తీసుకుపోయారు. – మౌనిక , సనపల సురేష్ భార్య కక్షపూరితంగానే అరెస్టు.. పోలీసులు నా భర్తను కక్షపూరితంగా అరెస్టు చేశారు. విచారణకని పిలిచి అరెస్టుచేశారు. ఈనెల 25వ తేదీ సాయంత్రం రెండో పట్టణ పోలీసులు ఫోన్ చేశారు. 26న డీఎస్పీ విచారణ ఉందని రమ్మన్నారు. దీంతో శనివారం మ«ధ్యాహ్నం 12.30కు రెండో పట్టణ పోలీస్స్టేషన్కు సురేష్తో కలిసి వెళ్లాం. అక్కడ స్టేట్మెంట్ రాసుకుంటామని చెప్పి సాక్షులు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. అక్కడే వందలాది మంది చూశారని చెప్పాం. సరే.. మీరు వెళ్లిపోండని సీఐ అనగానే బయటకు వచ్చేశాం. ఇంతలో రూరల్ ఎస్ఐ కె. రాము తమ సిబ్బందితో కలిసి నా భర్తను జీపులో ఎక్కించుకుని తీసుకుపోయారు. – మౌనిక, సనపల సురేష్ భార్య -
నన్ను చంపేందుకు.. పోలీసులతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే స్కెచ్
-
మంత్రి అచ్చెన్నాయుడు - ఎమ్మెల్యే కూన రవికుమార్ మధ్య వార్
-
కూన ఎక్కడ..?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి జిల్లాకు వచ్చిన కింజరాపు రామ్మోహన్నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటనలో మాజీ విప్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కనిపించలేదు. ఉద్దేశపూర్వకంగా గైర్హాజరయ్యారా? మరేదైనా కారణం ఉందా అన్నది తెలీదు గానీ టీడీపీలో మాత్రం ఇది తీవ్ర చర్చకు దారితీసింది. మంత్రి పదవి ఆశించి భంగపడిన కూన రవికుమార్ గుర్రుగా ఉండటం వల్లనే రాకపోయి ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది.మంత్రి పదవిపై ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాళింగ సామాజిక వర్గం నుంచి తప్పనిసరిగా కేబినెట్లో బెర్త్ ఖాయమని భావించారు. కానీ అంచనాలు తలకిందలయ్యాయి. కింజరాపు ఫ్యామిలీకి ఇచ్చేందుకే మొగ్గు చూపారే తప్ప కూన రవికుమార్ను పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో కాళింగ సామాజిక వర్గమంతా గుర్రుగా ఉంది. ప్రెస్మీట్లు, సమావేశాలు పెట్టి నిరసన కూడా తెలియజేశారు. చంద్రబాబు తీరుపై అసంతృప్తి వ్యక్తంచేయడమే కాకుండా సమయం వచ్చి నప్పుడు తామేంటో చూపిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాళింగులు ఎన్ని చేసినా ఫలి తం కనిపించడంలేదు. చంద్రబాబు నుంచి సాను కూలత రావడం లేదు. చిన్నా చితకా పదవి ఇచ్చి సరిపుచ్చుకునేలా ఉన్నారు. ఈ క్రమంలో భారీ ఆశలు పెట్టుకున్న కూన రవికుమార్ కూడా ఆవేదన చెందుతున్నట్టు సమాచారం. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిస్తే తమకిచ్చే గౌరవమిదా అని ఆయన వర్గీయులు బాధపడుతున్నారు.కూన రవికుమార్తో పాటు కాళింగ సామాజిక వర్గమంతా అసంతృప్తితో ఉన్న వేళ.. జిల్లాలోకి అడుగు పెట్టిన కింజరాపు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడుకు స్వాగతం పలికేందుకు ఒక వర్గం హాజరు కాలేదు. సోమవారం రాత్రి జరిగిన ఆత్మీయ సభలోనూ పాల్గొనలేదు. మంగళవారం జిల్లా అధికారులతో జరిగిన తొలి సమావేశం ప్రాంగణానికి కూడా రాలేదు. ఏడు రోడ్ల కూడలి వద్ద మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన కార్యకర్తల ఆత్మీయ సభకు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీ హాజరయ్యారు. కానీ, కూన రవికుమార్, బెందాళం అశోక్ ఎక్కడా కనిపించలేదు. మంగళవారం జెడ్పీలో జరిగిన అధికారుల సమావేశంలో కూడా వీరిద్దరూ పాల్గొనలేదు. కాళింగ సామాజిక వర్గానికి మొండి చేయి చూపారన్న అసంతృప్తితో ఉద్దేశకపూర్వకంగా గైర్హాజరయ్యారా? లేదంటే మరే కారణం చేతో రాలేదా? అన్నది తెలియదు గాని పార్టీ శ్రేణులు మాత్రం కాళింగులకు జరిగిన అవమానం వలనే దూరంగా ఉండి ఉండవచ్చని అని చర్చించుకుంటున్నాయి. -
బూతు ‘కూన’ల బరితెగింపు.. విద్యుత్తు శాఖ ఏఈకి బెదిరింపులు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అధికారంలో లేకున్నా వారి ఆగడాలకు అంతులేదు. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించడం, దూషించడం ‘బూతుల బ్రదర్స్’కు నిత్యకృత్యంగా మారింది. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. గతంలో పలువురు ప్రభుత్వ అధికారులను దుర్భాషలాడిన రవికుమార్ తాజాగా పొందూరు విద్యుత్తు శాఖ ఏఈని ఫోన్లో బెదిరించిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం చేయాలని లేదా..? ‘కాస్త మర్యాదగా ఉద్యోగాలు చేయడం నేర్చుకో..! నీకు సర్విసు లేదా? ఉద్యోగం చేయవా నువ్వు...? (రాయలేని భాషలో తిడుతూ) నాకు రూల్స్ చెబుతావా? తమాషాలు దొబ్బుతున్నావా? విద్యుత్ మీటర్ విషయంలో నా మనిషికే నోటీసు ఇస్తావా? డిస్ కనెక్ట్ చెయ్.. జీవితంలో ఇంత పెద్ద తప్పు చేశానా అని బాధపడే రోజు వస్తుంది చూడు నీకు... గుర్తు పెట్టుకో.. నువ్వు ముందు నోటీసు విత్డ్రా చేసుకో. ఎవడా డీఈ...? నా కొడుకు.. ఆడికి చెప్పు.. మళ్లీ నీకు చెబుతున్నా వెధవ వేషాలు వేశావా.. మళ్లీ జీవితంలో కోలుకోలేవు..’ అంటూ పొందూరు ఎలక్ట్రికల్ ఏఈ పైడి దుర్గా ప్రసాద్ను కూన రవికుమార్ బెదిరించాడు. ఈ ఘటన మూడు నెలల క్రితం జరగ్గా ఆ సంభాషణ ఆలస్యంగా వెలుగు చూసింది. ఇలాంటి వ్యక్తులు పొరపాటున ఎన్నికైతే ప్రజలను, ఉద్యోగులను బతకనిస్తారా? అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. తాజా బాగోతమిది పొందూరులో ‘గరుడ’ పేరుతో రెస్టారెంట్ను ఏర్పాటు చేసిన టీడీపీ ఎంపీటీసీ బాడాన గిరి అనుమతి లేకుండా విద్యుత్ మీటర్ను అమర్చారు. పంచాయతీ అనుమతి లేదని లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందడంతో వివరణ ఇవ్వాలని ఎలక్ట్రికల్ ఏఈ పైడి దుర్గా ప్రసాద్ నోటీసు ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన కూన రవికుమార్ ఫోన్ చేసి అసభ్యంగా దూషించారు. ఈ అవమానాన్ని భరించలేక విద్యుత్ శాఖ అధికారి కుమిలిపోయారు. కూన బ్రదర్స్కు ఆనవాయితీనే.. ♦ శ్రీకాకుళం సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన ఆర్ఈసీహెచ్ ప్రసాద్ను గతంలో కూన రవికుమార్ నోటికొచ్చినట్టు దూషించారు. నీకు ఉద్యోగం, యూనిఫాం లేకుండా చేస్తా... ఆఫ్టర్ టూ అండ్ ఆఫ్ ఇయర్స్ నీకు ఉద్యోగం ఉండదు.. గుర్తుపెట్టుకో అంటూ బెదిరించారు. ♦ కోవిడ్ సమయంలో మందీ మార్బలంతో పోలీసు స్టేషన్కు వచ్చిన రవికుమార్ శంకరగిరి మాన్యాలు పట్టిస్తానంటూ పోలీస్ అధికారులను బెదిరించారు. ‘మీ స్థాయి ఎంత..? మీరు ఎంత..?’ అంటూ నరసన్నపేట సీఐ, ఎస్లనుద్దేశించి నోరు పారేసుకున్నారు. ♦ పొందూరులో టీడీపీ కార్యాలయం నిర్వహిస్తున్న భవనాన్ని ఖాళీ చేయాలని కోరినందుకు ఆ ఇంటి యజమానికి ఫోన్లో వార్నింగ్ ఇచ్చారు. ♦ పింఛన్ల విషయంలో తన మాట వినలేదని మండల కార్యాలయంలోనే సరుబుజ్జిలి ఎంపీడీవో, ఈవోపీఆర్డీకి వార్నింగ్ ఇచ్చారు. ఆఫీసులోనే తలుపులు వేసి మరీ బాదేస్తా.. నన్ను ఎవరూ ఆపలేరు. చెట్టుకు కట్టి కాల్చేస్తా.. చెప్పింది చేయకపోతే నేనేంటో చూపిస్తానంటూ బెదిరించారు. ♦ పనుల విషయంలో తాను చెప్పినట్లు వినకుంటే కుర్చిలో కూర్చున్నా లాక్కుని వచ్చి తంతానంటూ పంచాయతీ కార్యదర్శులను కూన రవికుమార్ భయపెట్టారు. ♦ ఒక బిల్లు విషయంలో సరుబుజ్జిలి ఇన్చార్జి ఈవోపీఆర్డీపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ♦ మట్టి అక్రమంగా తరలించిన వాహనాలను విడిచిపెట్టలేదని పొందూరు తహసీల్దార్పై బెదిరింపులకు పాల్పడ్డారు. ‘పట్టుకున్న వాహనాలను విడిచి పెట్టకపోతే లంచం డిమాండ్ చేశావని నీమీద కంప్లైంట్ చేస్తా. చెప్పు ఎంత కావాలి...? పది వేలు కావాలా? లక్ష కావాలా? ఎంత కావాలి...? ప్రాసెస్ గురించి నాకు చెబుతున్నావా? అంటూ రాయలేని భాషలో ఏకంగా ఎమ్మార్వోను దూషించారు. ♦కూన రవికుమార్ తమ్ముడు కూన వెంకట సత్యనారాయణ ఇటీవల పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ కెసీహెచ్ మహంతిపై దాడి చేసే వరకు వెళ్లారు. తాను చేసిన పనులకు సంబంధించి ఏఈ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కార్యాలయంలోనే దౌర్జన్యం చేశారు. ‘ఎంత ధైర్యం రా...! నాకే నోటీసు ఇస్తావా..? ఏమనుకుంటున్నావ్.. నేను కూన రవికుమార్ బ్రదర్ని.. జాగ్రత్త... ఇక్కడే పాతేస్తా... ’ అంటూ సత్యనారాయణ రెచ్చిపోయాడు. -
నేను కూన రవికుమార్ బ్రదర్ని.. జాగ్రత్త.. ఇక్కడే పాతేస్తా..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘ఎంత ధైర్యం రా.. నాకే నోటీసు ఇస్తావా.. నువ్వు ఏమనుకుంటున్నావ్.. నేను కూన రవికుమార్ బ్రదర్ని.. జాగ్రత్త.. ఇక్కడే పాతేస్తా...’ అంటూ టీడీపీ నాయకుడు కూన రవి సోదరుడు, కాంట్రాక్టర్ కూన వెంకట సత్యనారాయణ ఓ పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ ఉద్యోగిపై రెచ్చిపోయారు. అంతటితో ఆగలేదు.. ఏకంగా కొట్టేసేంతలా చెయ్యి ఎత్తి బెదిరించారు. నోటికొచ్చినట్టు బూతులు తిట్టారు. రాయలేని భాషలో పరుష పదజాలంతో వీరంగం సృష్టించారు. తాను కాంట్రాక్ట్ తీసుకున్న రోడ్డు పనులను పర్యవేక్షిస్తున్న పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజినీర్ కేసీహెచ్ మహంతిపైనే దౌర్జన్యానికి దిగారు. ఈనెల 10న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ‘సాక్షి’ ఆరా తీయగా అసలు విషయాలు తెలిశాయి. అలవాటు ప్రకారమే.. టీడీపీ నేతల రౌడీయిజం ఆగలేదు. పదవులు పోయి మూడేళ్లయినా అధికార దర్పం దిగలేదు. సామాన్య ప్రజలను తిట్టినట్టు అధికారులపై విరుచుకుపడుతున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ ఇప్పటికే అనేక మార్లు అధికారులకు బెదిరింపులు, దాడులు చేసిన ఘటనలు ప్రజలకు తెలుసు. కేసులు నమోదై, అరెస్టుల వరకు వెళ్లాయి. అయినా వారి పంథా మారడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులపైన జులుం ప్రదర్శిస్తూనే ఉన్నారు. తాజాగా కూన రవికుమార్ మాదిరిగా ఆయన సోదరుడు కాంట్రాక్టర్ కూన వెంకట సత్యనారాయణ దౌర్జన్య కాండకు దిగారు. శ్రీకాకుళంలోని పంచాయతీరాజ్ డిప్యూటీ ఇంజినీర్ కార్యాలయంలో బరితెగించి వ్యవహరించారు. తాను వేస్తున్న రోడ్డు పనుల విషయంలో నిబంధనలు పాటించడం లేదని, నాణ్యతా లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేసుకోవాలని చెప్పినందుకు అసిస్టెంట్ ఇంజినీర్ మహంతిని కొట్టేంత పనిచేశారు. కార్యాలయంలో అందరి ఉద్యోగుల ముందే అసిస్టెంట్ ఇంజినీర్ మీదకొచ్చి దౌర్జన్యం చేయడమే కాకుండా చెయ్యి ఎత్తి తన అహంకారాన్ని ప్రదర్శించారు. దౌర్జన్యానికి మారుపేరైన కూన రవికుమార్.. సోదరుడు కావడంతో తోటి సిబ్బంది కూడా చోద్యం చూశారే తప్ప తప్పు అని చెప్పలేకపోయారు. దీంతో తనకు జరిగిన అవమానాన్ని బయటకు చెప్పుకోలేక, పై అధికారులు ముందుకు రాక అసిస్టెంట్ ఇంజినీర్ మహంతి కుంగిపోతున్నారు. యూనియన్ లీడరైన తనకే ఇలా జరిగితే.. మిగతా ఉద్యోగుల మాటేంటని బాధపడుతున్నారు. పనుల్లో నిర్లక్ష్యం.. శ్రీకాకుళం మండలం ఎన్హెచ్–16 (శాస్త్రుల పేట) నుంచి సానివాడ మీదుగా వప్పంగి వరకు రూ.2.69 కోట్ల పీఎంజీఎస్వై నిధులతో బీటీ రోడ్డు నిర్మాణానికి గత ఏడాది మే 24న అగ్రిమెంట్ కుదిరింది. ఈ ప్రకారం ఏడాదిలోగా పనులను పూర్తి చేయాల్సిందిగా కాంట్రాక్టర్ కూన వెంకట సత్యనారాయణతో పీఆర్ పీఐయూ విభాగం అగ్రిమెంట్ అయ్యింది. అయితే కాలపరిమితి పూర్తయినప్పటికీ ఏడాది కాలంలో ఒక్క రాయి కూడా వేయలేదు. తీరా ఇంజినీరింగ్ అధికారులు గట్టిగా అడిగితే.. కోవిడ్ కారణంగా రోడ్డు నిర్మాణం ప్రారంభించలేదంటూ చెప్పుకొచ్చారు. ఈ ఏడాది నవంబర్ నెలాఖరు వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్కు వెసలు బాటు కల్పించారు. దీంతో మే నెల నుంచి రోడ్డు పనులు ప్రారంభించినప్పటికీ.. నిబంధనలకు పూర్తిగా పాతరేశాడు. దీంతో ఏఈ మహంతి నిర్మాణ పనులపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ అలార్మింగ్ లెటర్(లోటుపాట్లు సరిచేసుకోండని చెప్పే పత్రం) ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండగా.. ఆ విషయం తెలుసుకున్న కూన సత్యనారాయణ ఈ నెల 10న పీఆర్ డివిజనల్ కార్యాలయానికి వచ్చి వీరంగం వేశారు. ఏఈ మహంతిపై దురుసుగా ప్రవర్తించాడు. తొలుత అసిస్టెంట్ ఇంజినీర్తో వాగ్వాదం చేసి.. ఆ తర్వాత పళ్లు బిగించి కళ్లు ఎర్రజేసి, కొట్టడానికి చెయ్యెత్తారు. నోటికి వచ్చినట్లు బూతులు తిట్టి, పాతేస్తానంటూ బెదిరించి దౌర్జన్యానికి దిగారు. అసిస్టెంట్ ఇంజినీర్ చేసేదేమి లేక ‘కొట్టేయండి సార్.. కొట్టేస్తే మీకు హ్యాపీగా ఉంటుంది కదా’ అని నిస్సహాయంగా స్పందించారు. అయినా కూన వెనక్కి తగ్గలేదు. ఆ సమయంలో పీఏ టు ఈఈ, మరో ముగ్గురు నా కేడర్ ఏఈలు, క్లరికల్ స్టాఫ్ అంతా ఉన్నారు. కానీ కూనకు భయపడి ఎవరూ ఏమీ అనలేకపోయారు. దీంతో ఆ అసిస్టెంట్ ఇంజినీర్ తనకు జరిగిన అవమానాన్ని దిగమింగుకుని కుమిలిపోతున్నారు. (క్లిక్ చేయండి: అక్రమ వ్యాపారాలకు కేరాఫ్ అచ్చెన్న అనుచరుడు!) -
రవి కుమార్ నుంచి వివరణ తీసుకున్నాం: కాకాణి
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ స్పీకర్పై ఆరోపణలు చేసిన కూన రవికుమార్పై విచారణ జరిపినట్లు ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్రెడ్డి తెలిపారు. గురువారం ప్రివిలేజ్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో వ్యక్తిగతంగా హాజరు కావాలని కూన రవి కూమార్కు సూచించామని తెలిపారు. అయితే ఆయన అప్పుడు రాలేదని చెప్పారు. కున రవికుమార్ ఈరోజు(గురువారం) వ్యక్తిగతంగా వచ్చి హాజరయ్యారని తెలిపారు. కునరవికుమార్ చేసిన ఆరోపణలను చాలా సీరియస్గా తీసుకున్నామని కాకాని గోవర్ధన్రెడ్డి అన్నారు. దానిపై ఆయన నుంచి వివరణ కూడా తీసుకున్నామని చెప్పారు. పెండింగ్లో ఉన్న అంశాలపై చర్చిస్తున్నామని, రవికుమార్ ఇచ్చిన వివరణను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రివిలేజ్ కమిటీ ఎదుట ఉన్న పిటిషన్లు పరిష్కరిస్తున్నామని తెలిపారు. -
కాళ్లు విరగకొడతా.. ఉద్యోగం ఊడగొడతా.. సీఐపై శివాలెత్తిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన
సాక్షి, శ్రీకాకుళం: టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మళ్లీ తన నోటి దురుసును ప్రదర్శించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత టీడీపీ నేతలు చంద్రబాబుకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళంలో వంద మందితో కూన రవికుమార్ నిరసనకు దిగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో శ్రీకాకుళం టూటౌన్ సీఐ ఆర్ఈసీహెచ్ ప్రసాద్ శనివారం కూన ఇంటి వద్దకు వెళ్లారు. శాంతిభద్రతల సమస్య దృష్ట్యా ఇంటిలోనే ఉండాలని కూనకు సూచించగా.. ఆయన సీఐపై నోరుపారేసుకున్నారు. ‘డ్యూటీయా? నా ఇంటి లోపలకు నువ్వు పోలీసులను పంపిస్తే నీ కాళ్లు ఇరగగొడతా.. ఏదైనా ఉంటే రోడ్డుపై చేస్కో.. రేప్పొద్దున కోర్టుకు రారా.. నిన్ను, నీ ఉద్యోగం, నీ యూనిఫాం లేకుండా చేస్తా.. రెండున్నరేళ్ల తర్వాత నీకు ఉద్యోగం ఉండదు గుర్తుపెట్టుకో.. నేను దృష్టి పెడితే అప్పటి వరకు కూడా అక్కర్లేదు.. నీ భుజం మీద యూనిఫాం ఎలా ఉంటుందో చూస్తా.. నీ అంతు చూస్తాను ఏమనుకుంటున్నావో’ అంటూ సీఐ ప్రసాద్ను నెట్టేశారు. ‘ఎవడైనా పోలీసు లోపలికి వస్తే మర్యాద ఉండదు’ అంటూ హూంకరించారు. (చదవండి: AP: గాల్లోని ‘ఆక్సిజన్’ను ఒడిసి పట్టారు!) ‘మీ ఇంటిలోకి ఎక్కడొచ్చాం. రోడ్డుపైనే ఉన్నాం. మీ ఇంటిలోకి రావాల్సిన పని మాకేంటి? మాకున్న సమాచారం మేరకు శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని మీరు బయటికి రాగానే అభ్యంతరం చెప్పాం.. అంతకుమించి ఏం జరగలేదు కదా?’ అని సీఐ సున్నితంగా చెబుతున్నా వినకుండా కూన రెచ్చిపోయారు. దీంతో సీఐ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. శనివారం అర్ధరాత్రి శ్రీకాకుళం శాంతినగర్లోని బం«ధువు ఇంటిలో ఉన్న కూన రవికుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఈలోపు టూటౌన్ పోలీసుస్టేషన్ వద్ద టీడీపీ నేతలు పెద్ద ఎత్తున గలాటాకు దిగి నానా రభస సృష్టించారు. (చదవండి: కొలువుల చదువులు.. డిగ్రీ పూర్తయిన వెంటనే ఉద్యోగం పొందేలా) -
నేడు ప్రివిలేజ్ కమిటీ విచారణ: కాకాణి
నెల్లూరు (సెంట్రల్): కొద్ది రోజుల క్రితం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై మంగళవారం విచారణ జరుపుతున్నట్టు ప్రివిలేజ్ కమిటీ చైర్మన్, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి తెలిపారు. నెల్లూరులోని ఆయన నివాసంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్కు నోటీసులిచ్చినా విచారణకు హాజరు కాలేదన్నారు. ఆయన అందుబాటులో ఉండి కూడా హాజరు కాలేదని తెలుస్తోందని తెలిపారు. దీన్ని ధిక్కారం కింద నమోదు చేశామని, దీనిపై చర్చిస్తామన్నారు. గత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ తనపై వచ్చిన ఆరోపణలను విడిచి పెట్టాలంటూ లేఖ రాశారని, దానిపైనా చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు గతంలో చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారని, వీటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. -
కూన అండ్ కో.. దొరికింది దోచుకో!
సాక్షి, శ్రీకాకుళం : అధికారం దక్కింది అక్రమాల కోసమే అన్నట్టు ఐదేళ్ల పాటు టీడీపీ నాయకులు సాగించిన అవినీతి యజ్ఞం ప్రజల పాలిట శాపంగా మారింది. వారి హయాంలో జరిగిన పనుల వల్ల ఇప్పటికీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అమదాలవలస నియోజకవర్గంలో కూన రవికుమార్ ఫ్యామిలీ దందా ఏ స్థాయిలో జరిగిందో అక్కడి పనులే చెబుతున్నాయి. నాసిరకం పనులతో రూ.కోట్లు వెనకేసుకుని ఇప్పుడు అధికార పక్షంపై విమర్శలకు దిగుతున్నారు. పనుల్లో కొన్ని.. విపత్తు నివారణ పథకం కింద బొడ్డేపల్లి జెడ్పీ రోడ్డు నుంచి సింగూరు మీదుగా ఎన్హెచ్–5 రోడ్డు వరకు రూ. 2.73కోట్ల నిధులుతో తారు రోడ్డు వేశారు. ఈ రోడ్డు సింగూరు వద్ద రెల్లుగెడ్డ గట్టుమీదుగా వెళ్తుంది. నాసిరకంగా పనులు చేపట్టడంతో రోడ్డు ఒక భాగం ఏకంగా కూలిపోయింది. కూన రవికుమార్ సోదరుడు విజయలక్ష్మి కన్స్ట్రక్షన్స్ అధినేత కూన వెంకట సత్యనారాయణ ఈ పనులు చేపట్టారు. చదవండి: వామ్మో.. ఒకేచోట 100కుపైగా పాములు కింతలి నుంచి సీపన్నాయుడు పేట వరకు రూ.4 కోట్లు నాబార్డ్ నిధులతో రోడ్డు పనులు చేశారు. ఈ పనుల కాంట్రాక్ట్ను కూన రవికుమార్ సోదరుడు వెంకట సత్యనారాయణ దక్కించుకున్నాడు. నాసిరకం పనులు చేయడంతో రోడ్డు పరిస్థితి అధ్వానంగా తయారైంది. పొందూరు గ్రామంలో జమాల్ మిల్లు నుంచి కళాశాల రోడ్డులోని అమ్మాజమ్మ టిఫిన్ దుకాణం వరకు కుడి వైపు రూ.45 లక్షలతో సుమారు వెయ్యి మీటర్లు పొడవున కాలువలను నిర్మించారు. దీని కాంట్రాక్ట్ను కూన సోదరుడే దక్కించుకున్నాడు. ఈ కాలువలపై పలకలను వేయలేదు. సరిగా నిర్మాణం జరగకపోవడంతో నీరు ఎక్కడ పడితే అక్కడే నిలిచిపోయి బురదగా మారిపోతోంది. రాపాక నుంచి దళ్లవలస మీదుగా కింతలి వరకు రూ.7కోట్ల ఆర్ఐడీఎఫ్ నిధులతో రోడ్డు నిర్మించారు. కూన రవి కుమార్ సోదరుడు వెంకట సత్యనారాయణ ఈ రోడ్డు కాంట్రాక్ట్ను తీసుకున్నారు. నాసిరకం పనులు చేపట్టడంతో ఎక్కడ పడితే అక్కడ రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. రోడ్డు శిథిలమైపోవడంతో ఇటీవలే ప్యాచ్వర్కులు చేశారు. కొత్తగా మరికొన్ని చోట్ల గోతులు ఏర్పడ్డాయి. చదవండి: వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం ఉండకూడదు: సీఎం జగన్ వాండ్రంగి కూడలి నుంచి జోగన్నపేట వరకు రోడ్డు, కాలువల నిర్మాణానికి రూ.4 కోట్లు నిధులు మంజూరయ్యాయి. దీని కాంట్రాక్ట్ను కూన రవికుమార్ సోదరుడే దక్కించుకున్నాడు. 2018–19లో అర్ధంతరంగా పనులు నిలుపుదల చేసారు. ఇంకా 200 మీటర్లు మేరకు రోడ్డును జోగన్నపేట వద్ద వేయాల్సి ఉంది. కాలువలను పూర్తి చేయలేదు. కొన్ని చోట్ల కాలువలు పూడుకుపోయాయి. అరకొరగా నిర్మించిన కాలువలపై పలకలను వేయలేదు. జరిగిన పనులు కూడా బాగాలేవు. కొంతమేర బిల్లు చెల్లించాల్సి ఉన్నప్పటికీ చేసినవి కూడా నాసిరకం పనులే. ఇలా చేసిన ప్రతి పనిలోనూ అక్రమాలు కనిపిస్తూనే ఉన్నాయి. నియోజకవర్గంలో వేసిన ప్రతి రోడ్డు వాళ్లే వేశారు. ఏ కాంట్రాక్ట్నైనా వాళ్లే చేయాలి. వారికే దక్కాలి. ఇతరులకు కాంట్రాక్ట్లు దక్కిన సందర్భాలు తక్కువే. అంతా వారి కనుసన్నల్లోనే జరిగింది. టెండర్ల ప్రక్రియ నామమాత్రమే. అంతా వారి చెప్పినట్టే జరిగేవి. అధికార వర్గాలు సైతం వంతపాడాయి. సాధారణంగా టెండర్లలో అన్నీ వర్గాలు పాల్గొనాలి. ఎవరు తక్కువ కోట్ చేస్తే వారికి దక్కాలి. కానీ ఇక్కడ టెండర్ల వేయడమే అధికారుల వంతు. ఎవరికి దక్కాలో నిర్ణయించేదంతా టీడీపీ పెద్దలదే. ఎవరెక్కడ టెండర్ వేయాలో నిర్ణయించేది వీళ్లే. అంతా ఒక సిండికేట్గా తయారై గూడు పుఠాణి నడిపారు. మొత్తానికి మంజూరైన పనులన్నీ వారే దక్కించుకుని ఆ పనుల్లో కోట్లు కొల్లగొట్టారు. నాసిరకం పనులు చేసి ప్రజాధనాన్ని దోచేశారు. ఇప్పుడా పనులతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అధికార పక్షంపై విమర్శలకు దిగుతున్నారు. -
కూన రవిపై ప్రివిలేజ్ కమిటీ ఆగ్రహం
సాక్షి, అమరావతి: ప్రివిలేజ్ కమిటీ సమావేశం ముగిసింది. తదుపరి సమావేశానికి వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు అచ్చెన్నాయుడుకు అవకాశం ఇచ్చింది. అనంతరం కూన రవిపై ప్రివిలేజ్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాని గోవర్దన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం సమావేశం జరిగింది. వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేనని అచ్చెన్నాయుడు సమాచారం అందించారు. వచ్చే నెల 14వ తేదీన హాజరు కావాల్సిందిగా అచ్చెన్నాయుడుకు నోటీసులిస్తున్నట్లు చైర్మన్ కాకాని గోవర్దన్ రెడ్డి తెలిపారు. కూన రవిని వ్యక్తిగతంగా హాజరు కాకపోవడాన్ని ప్రివిలేజ్ కమిటీ తీవ్రంగా పరిగణించింది. కూన రవిది ధిక్కారంగా భావిస్తున్నట్లు పేర్కొంది. ప్రివిలేజ్ కమిటీ ఆదేశాలను పాటించకుండా కూన రవి తీవ్ర నిర్లక్ష్యానికి పాల్పడ్డారని మండిపడింది. కూన రవిపై చర్యలు తీసుకునే అంశాన్ని ప్రివిలేజ్ కమిటీలో నిర్ణయం తీసుకోనాలని సభ ముందు ఉంచుతామని తెలిపింది. -
పరారీలో టీడీపీ నేత కూన రవికుమార్
సాక్షి, శ్రీకాకుళం: టీడీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ మరోసారి పరారయ్యారు. పరిషత్ ఎన్నికల పోలింగ్ రోజున పొందూరు మండలం పెనుబర్తి వైఎస్సార్సీపీ ఎంపీటీసీ, ఆ గ్రామ సర్పంచ్ భర్త మురళీకృష్ణపై కూన రవికుమార్ వర్గీయులు మారణాయుధాలతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇదంతా కూన అక్కడ ఉండగానే జరిగింది. అంతేకాకుండా పోలీసుల విధులకు కూడా ఆయన ఆటంకం కలిగించారు. దీనిపై మురళీకృష్ణ పొందూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు తనను అరెస్టు చేస్తారనే భయంతో కూన ముందుగానే పారిపోయారు. శనివారం పోలీసులు ఆయన ఇంటికెళ్లి చూడగా.. అప్పటికే ఆయన పరారయ్యారు. (చదవండి: శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి షాక్..) -
శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్..
-
శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి షాక్..
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని ఆముదాల వలసలో టీడీపీకి షాక్ తగిలింది. టీడీపీ నేత కూన రవికుమార్ ప్రధాన అనుచరుడు కిల్లి రామ్మోహన్రావు టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అనుచరులతో చర్చించాక ఏ పార్టీలో చేరేది వెల్లడిస్తానని తెలిపారు. చంద్రబాబు వల్లే టీడీపీకి మనుగడ లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. చంద్రబాబును చూసి టీడీపీకి ఓట్లు వేసే పరిస్థితి లేదన్నారు. రిగ్గింగ్తోనే ఎమ్మెల్యేగా అచ్చెన్నాయుడు, ఎంపీగా రామ్మోహన్ నాయుడు గెలిచారని ఆయన ఆరోపించారు. చదవండి: ‘రాజకీయ బతుకుదెరువు కోసమే టీడీపీ కుట్రలు’ నేను ఆరోగ్యంగా ఉన్నా: విజయసాయిరెడ్డి -
రాజీనామాకు సిద్ధం.. నాపై పోటీ చేసి గెలవగలరా..?
సాక్షి, శ్రీకాకుళం (పీఎన్కాలనీ): విశాఖ రాజధాని కోసం రాజీనామా చేయడానికి సిద్ధమని, తనపై పోటీ చేసి గెలవగలరా అని మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు టీడీపీ నాయకులకు సవాల్ విసిరారు. మంచికి బ్రాండ్ అంబాసిడర్ అయిన ధర్మాన కృష్ణదాస్ మాటలను వక్రీకరించడం సరికాదని హితవు పలికారు. శ్రీకాకుళంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. దాసన్న తన సొంత నియోజకవర్గంలో తన మనుషులతో మాట్లాడిన సంభాషణను ఎల్లో మీడియా వక్రీకరించి బూతులు మాట్లాడినట్లు చిత్రీకరించడం సరికాదన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నప్పుడు టెక్కలి నియోజకవర్గంలో ఓ మహిళతో ‘మా ప్రభుత్వం ఇచ్చిన పదివేలు తీసుకుని ఓటేయ్యవా.. అని అది నీ అమ్మ మొగుడు సొమ్మా’ అని అసభ్యకర పదజాలంతో మాట్లాడిన సంగతి అందరికీ గుర్తుందని అన్నారు. అదే పార్టీ కి చెందిన కూన రవికుమార్ ఫోన్ సంభాషణలు అందరికీ తెలుసని చురకలు అంటించారు. ఎవరైతే బాగా బూతులు మాట్లాడగలరో, వీధి రౌడీల్లా ప్రవర్తించగలరో అలాంటి వారిని చంద్రబాబు గుర్తించి అధ్యక్ష పదవులు కట్టబెడుతున్నారంటే ఆ పార్టీ తీరు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. దాసన్న రాజకీయ చరిత్రలో ఎక్కడా కాంట్రవర్సీ లేదన్నారు. ఏడాదిన్నర కాలంలోనే డిప్యూటీ సీఎంగా, మంత్రిగా ఆయన తన మార్క్ చూపించారని తెలిపారు. భావనపాడు పోర్టు, ఉద్దానం ప్రజలకు రూ.700 కోట్లతో మంచినీటి ప్రాజెక్టు, కిడ్నీ బాధితులకు ఆస్పత్రి, నేరడి బ్యారేజీ నిర్మాణం వంటి అనేక కార్యక్రమాలతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. అమరావతిలో రియల్ వ్యాపారులు పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామాలు చేయిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. కరోనా కాలంలో కనిపించని ఎంపీ రామ్మోహన్నాయుడు స్టేషన్ వద్దకు దౌర్జన్యం చేసేందుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. దాసన్న అందరి కుటుంబ సభ్యుడు.. అనంతరం ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్ మాట్లాడారు. రాజధాని విషయంలో డిబేట్ జరిగినప్పుడు విశాఖలో రాజధాని కావాలనుకుంటున్నారా లేదా అని టీడీపీ నేతలను ప్రశ్నిస్తే కిక్కుమని సౌండ్ లేదన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ వద్ద క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించడం వారి రౌడీయిజానికి నిదర్శనమన్నా రు. దాసన్న అందరికీ ఓ కుటుంబ సభ్యుడితో సమానమని, ఆయన నీతి నిజాయితీలను గుర్తించే సీఎం ఆయనకు డిప్యూటీ సీఎం, మంత్రి వంటి ఉన్నత పదవులు కట్టబెట్టారన్నారు. (క్షమాపణ చెప్పిన కబ్జా సబ్బం) అభివృద్ధి ఓర్వలేకే.. రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ నిబద్ధత, క్రమశిక్షణ గల వ్యక్తి అని ఆయన నోట ఎప్పుడూ తప్పుడు మాటలు రావని అన్నా రు. కూన రవి, అచ్చెన్నాయుడుల అవినీతి అక్రమాలు గుట్టలుగుట్టలుగా ఉన్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీలకు హోం శాఖ, డిప్యూటీ సీఎం, విప్ వంటి పదవులు ఇచ్చింది సీఎం జగన్మోహన్రెడ్డి ఒక్కరేనన్నారు. అనంతరం ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్పై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని హిత వు పలికారు. జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని తనంతో అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. మీడియా సమావేశంలో పాల్గొన్న మంత్రి సీదిరి, ఎమ్మెల్యేలు గొర్లె కిరణ్కుమార్, కంబాల జోగులు, విశ్వాసరాయి కళావతి పార్టీ నేతలు పిరియా సాయిరాజ్, విక్రాంత్, దువ్వాడ శ్రీనివాస్, అంధవరపు సూరిబాబు తదితరులు వారికి ఆ స్థాయి లేదు.. వైఎస్సార్ సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ మునిగిపోయిన నావకు డ్రైవర్ పదవి ఇచ్చినట్లు కాలం చెల్లిన పారీ్టలో అచ్చెన్నాయుడు, కూన రవికుమార్లు అధ్యక్షులుగా ఎంపికయ్యారని చమత్కరించా రు. డిప్యూటీ సీఎం దాసన్నపై విమర్శలు చేసే స్థాయి వారికి లేదన్నారు. ఈఎస్ఐ స్కామ్లో అడ్డంగా దొరికి జైలుకు వెళ్లి వచ్చిన అచ్చెన్నాయడు, ఇసుక దందా చేసుకుని, వీధి రౌడీ లా వ్యవహరించే కూన రవికుమార్లు దాసన్నపై ఫిర్యాదు చేయడం హాస్యాస్పదమన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ పిరియా సాయిరాజ్, డీసీసీబీ చైర్మ న్ పాలవలస విక్రాంత్లు మాట్లాడుతూ దాసన్న పార్టీలో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు మచ్చలేని నాయకుడిగా పేరు సంపాదించారని అన్నారు. అలాంటి వ్యక్తిపై దు్రష్పచారం చేయడం తగదన్నారు. (విశోక సంద్రం.. నగరం మదిలో ద్రోణం'రాజే') విశాఖలో రాజధాని వద్దంటూ కృష్ణదాస్పై చంద్రబాబు పోటీ చేసి గెలవగలరా అని సవాల్ విసిరారు. పార్టీ నేత అంధవరపు సూరిబాబు మా ట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ ఆదర్శవంతమైన పాలన కొనసాగిస్తున్నారని, ఆయన ఆశయాలను డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. అలాంటి నేతపై అభాండాలు వేయడం తగదన్నారు. స మావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మామిడి శ్రీకాంత్, ఎంవీ స్వరూప్, ఎన్ని ధనుంజయరావు, పొన్నాడ రుషి, హనుమంతు కిరణ్కుమార్, చింతాడ రవికుమార్, తంగుడు నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
అలా మొక్కారు.. ఇలా తొక్కారు!
పై ఫొటో చూశారా? టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిని కాబోతున్నానన్న ఆలోచనతో కింజరాపు అచ్చెన్నాయుడు.. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మె ల్యే గౌతు శ్యామ సుందర శివాజీకి పాద నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకున్న దృశ్యమిది. ఈ చిత్రం చూస్తే ఆయనపై అచ్చెన్నాయుడుకు ఎంతో వినయ విధేయతలు ఉన్నాయనుకుంటారు. కానీ గౌతు శ్యామసుందర్ శివాజీ ఆశీస్సులు తీసుకున్న వారం రోజుల లోపలే ఆయన కుమార్తె శిరీషను పార్టీ జిల్లా అధ్యక్ష పదవి నుంచి ఊడగొట్టారు. కూన రవికుమార్ను పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడి పేరుతో నియమించారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : టీడీపీ అధినేత చంద్రబాబు మార్కు రాజకీయం మరోసారి బయటపడింది. ఎవరికైతే నోరు ఉంటుందో వారిదే ఊరు అన్నట్లు పట్టం కడతారని, అవినీతి అక్రమాలు, ఇతరత్రా వ్యవహారాల్లో దూకుడుగా ఉండి కేసులు ఎదుర్కొంటున్న వాళ్లకే పార్టీలో పెద్దపీట వేస్తారని చంద్రబాబు మరోసారి నిరూపించారని ఆ పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. అచ్చెన్నాయుడి అభిప్రాయం తీసుకోకుండా జిల్లా అధ్యక్ష పదవిని మార్చుతారనుకుంటే పొరపాటే. రాష్ట్ర అధ్యక్షుడినే చేస్తానని పరోక్ష సంకేతాలు ఇచ్చిన చంద్రబాబు.. అచ్చెన్నకు తెలియకుండా జిల్లా అధ్యక్ష పదవిని మార్చుతారని ఏ ఒక్కరూ భావించరు. అంతా అచ్చెన్నాయుడికి తెలిసే జరిగిందనేది పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ముందు పొగిడి.. గౌతు శ్యామ సుందర శివాజీ కుటుంబం అంతా.. ఇంతా అంటూ పలు వేదికలపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన చంద్రబాబు, అచ్చెన్నాయుడు అండ్ కో కనీసం మాట మాత్రం చెప్పకుండా గౌతు శిరీషను అధ్యక్ష పదవి నుంచి తొలగించారని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. దీన్ని బట్టి గౌతు కుటుంబంపై చంద్రబాబుకు ఏమాత్రం అభిమానం ఉందో తెలిసిపోతుంది. పదవి పోయిన శిరీష కూడా అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. మార్చాలనుకుంటే ఒక మాట చెప్పి చేస్తే బాగుండేదని తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. మొత్తానికి గౌతు శ్యామ సుందర శివాజీ కాళ్లకు అచ్చెన్నాయుడు మొక్కిన కొన్ని రోజులకే ఆమె కుమార్తె పదవి పోవడం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. (అచ్చెన్నపై యూటర్న్) టీడీపీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కూన శ్రీకాకుళం అర్బన్: తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కూన రవికుమార్ను ఎంపిక చేశారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆదివారం ఉత్తర్వులు విడుదల చేశారు. కూన రవికుమార్ గతంలో ఆమదాలవలస శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. అప్పటి ప్రభుత్వంలో విప్గా పనిచేశారు. ఆయన ఎంపిక పట్ల జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. -
అంతే వీరు.. మారదు తీరు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ కాంట్రాక్టర్ల తీరు మారలేదు. కూన రవికుమార్ సోదరుడిలో కనీసం మార్పు రాలేదు. కోట్లాది రూపాయలతో ఆయన వేసిన రోడ్లు మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతున్నాయి. కొత్త రోడ్డు కొన్నాళ్లకే పా డైపోతే కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ప్రకారం పూర్తి స్థాయి నాణ్య తా ప్రమాణాలతో మళ్లీ వేయాల్సి ఉంటుంది. కానీ వారి అవినీతి బుద్ధి ఎక్కడికీ పోలేదన్నట్టుగా మరమ్మతుల్లో కూ డా నాసిరకం పనులే చేపట్టారు. వీరి పనితనం వల్ల రూ. 2.86 కోట్లతో వేసిన రోడ్డు జనాలను వెక్కిరించేదిగా తయారైంది. విపత్తు నివారణ పథకం కింద పొందూరు మండలం కింతలి–బొడ్డేపల్లి జెడ్పీ రోడ్డు నుంచి సింగూరు మీదుగా ఎన్హెచ్–5 వరకు 4.75 కిలోమీటర్ల తారు రోడ్డు వేసే కాంట్రాక్ట్ను టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ సోద రుడు, విజయలక్ష్మి కన్స్ట్రక్షన్ అధినేత కేవీ సత్యనారాయణ దక్కించుకున్నారు. రూ. 2.86 కోట్లతో వేసిన రోడ్డు కొన్నాళ్లకే శిథిలమైపోయింది. గునపాలతో పెకిలించినట్టుగా ధ్వంసమైపోయింది. ఇదే విషయమై ఆగస్టు 31వ తేదీన ‘సాక్షి’ దినపత్రికలో ‘రోడ్డు శిథిలం–అవినీతి పదిలం’ శీర్షికన వార్త ప్రచురితమైంది. మరమ్మతు పనుల్లోనూ.. ‘సాక్షి’లో కథనం వచ్చాక హుటాహుటిన కాంట్రాక్టర్ కూన వెంకట సత్యనారాయణ ఆ రోడ్డు వద్దకు చేరుకుని, శిథిలమైన రోడ్డును పరిశీలించి, మరమ్మతులు చేపట్టేందుకు చర్య లు తీసుకున్నారు. దీంతో ఆ రోడ్డుకు మంచి రోజులొస్తాయని, తమ కష్టాలు తీరుతాయని స్థానికులు ఆశపడ్డారు. కానీ కాంట్రాక్టర్ అవినీతి బుద్ధి ఎక్కడికీ పోలేదు. ఎక్కడైతే రోడ్డు శిథిలమై కుంగిపోయిందో అక్కడే మట్టితో కప్పి మసిపూసి మారేడు కాయ చేశారు. వాస్తవంగా రోడ్డు కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ప్రకారం వేసిన రోడ్డు పాడైతే దాన్ని పూర్తిస్థాయిలో నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాల్సి ఉంది. కానీ ఇక్కడ మట్టితో మమ అనిపించేశారు. ఇంకేముంది ఇటీవల కురిసిన వర్షాలకు మళ్లీ రోడ్డు కుంగిపోయింది. వేసిన మట్టి కొట్టుకుపోతోంది. చేసిన ప్యా చ్ వర్క్ కూడా పనికి రాకుండా పోయింది. మరమ్మతుల్లో కూడా నాసిరకం పనులే చేశారు. ఫలితంగా ఆ రోడ్డు అక్క రకు రాకుండా పోతోంది. చెప్పేందుకే నీతులు చేసేవన్నీ అవినీతి పనులే అని మరోసారి నిరూపించుకున్నారు. టీడీ పీ హయాంలో జరిగిన నీరు చెట్టు పనులు మాదిరిగానే రోడ్డు పనులు చేపట్టి కోట్లాది రూపాయలకు కన్నం పెట్టేసిన ఘనుడిగా మరోసారి నిలిచిపోయారు. వెక్కిరిస్తున్న ‘కూన’ వేసిన రోడ్డు కూన రవికుమార్ సోదరుడు కె.వి.సత్యనారాయణ వేసిన రోడ్డు ఇప్పుడందర్ని వెక్కిరించేలా ఉంది. అటుగా వెళ్లిన వారంతా ఆ రోడ్డును చూసి ఆశ్చర్యపోతున్నారు. కోట్లాది రూపాయలతో వేసిన రోడ్డుకు ఈ పరిస్థితేంటని అవాక్కవుతున్నారు. అధికారంలో ఉన్నంతవరకు అడిగే వారు లేక ఇష్టారాజ్యమైపోయిందని, ఇప్పుడైనా నాణ్యమైన పనులు చేపట్టి, కోట్లాది రూపాయలకు ఫలితం వచ్చేలా చూడాల్సింది పోయి అదే అడ్డదార్లు తొక్కడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని స్థానికులు వాపోతున్నారు. ఇంజనీరింగ్ అధికారులు సైతం నాసిరకం మరమ్మతు పనులపై అభ్యంతరం తెలపకపోవడం అందరికీ విస్మయం కలిగిస్తోంది. -
మాజీ విప్ ‘కూన’పై కేసు నమోదు
పొందూరు/సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం గోరింట గ్రామంలో రామసాగరం చెరువులోని మట్టిని లోడ్ చేస్తున్న వాహనాలను సీజ్ చేసినందుకు తహసీల్దార్ తామరాపల్లి రామకృష్ణపై దురుసుగా ప్రవర్తించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్, అతని సోదరులు, అనుచరులపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. వాహనాలను విడిచిపెట్టాలని.. లేకుంటే లంచం డిమాండ్ చేసినట్టు ఫిర్యాదు చేస్తానని టీడీపీ నేత కూన రవికుమార్ తహసీల్దార్ను బెదిరించినప్పటి ఆడియో క్లిప్పింగ్ ఆదివారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనను రెవెన్యూ ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు తీవ్ర స్థాయిలో విమర్శించాయి. స్పందించిన పోలీసులు రవికుమార్ కోసం ఆమదాలవలస, పొందూరు, శ్రీకాకుళంలలో సోమవారం వెదుకులాట ప్రారంభించారు. ఆయన ఆచూకీ లభ్యం కాకపోవడంతో కూన రవికుమార్తోపాటు అతని సోదరుడు కూన వెంకటసత్యారావు, అచ్చిపోలవలస మాజీ సర్పంచ్ గురుగుబెల్లి జగన్నాథం, కాంట్రాక్టర్ చంద్రారెడ్డి, కాంట్రాక్టర్ అసిస్టెంట్ల మీద ఐపీసీ సెక్షన్ 353, 506 కింద కేసు నమోదు చేసినట్టు జె.ఆర్.పురం సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. తక్షణం అరెస్టు చేయాలి: ఉద్యోగ సంఘాలు విధి నిర్వహణలో ఉన్న తహసీల్దారు రామకృష్ణను బెదిరించిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కూన రవికుమార్ను తక్షణం అరెస్టు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. సీజ్ చేసిన పొక్లెయిన్లు, టిప్పర్లను తక్షణమే వదిలేయాలంటూ మాజీ విప్ కూడా అయిన రవికుమార్ బెదిరించడం దారుణమన్నారు. ‘కూన రవికుమార్ ఇలా బెదిరింపులకు దిగడం, అధికారులను దుర్భాషలాడటం కొత్తకాదు. ఆయన వ్యవహార శైలి అధికారులను భయాందోళనలకు గురిచేస్తోంది. అందువల్ల ఆయన గత చరిత్రను పరిగణనలోకి తీసుకుని పీడీ చట్టం కింద చర్యలు తీసుకుని అరెస్టు చేయాలి’ అని ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర ఉద్యోగ, పెన్షనర్ల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగులపై బెదిరింపులకు, దాడులకు పాల్పడకుండా కూన రవికుమార్పై పీడీ చట్టం ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, చేబ్రోలు కృష్ణమూర్తి, వి.గిరికుమార్రెడ్డి డిమాండ్ చేశారు. -
కూన రవికుమార్పై కేసు నమోదు
-
పరారీలో టీడీపీ నేత కూన రవికుమార్
సాక్షి, శ్రీకాకుళం: పొందూరు తహసీల్దార్ తామరాపల్లి రామకృష్ణను అసభ్య పదజాలంతో దూషించిన టీడీపీ నేత కూన రవికుమార్పై కేసు నమోదయ్యింది. ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. సోమవారం ఉదయం అరెస్ట్ చేసేందుకు రవికుమార్ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. అర్ధరాత్రే ఇంటి నుంచి వెళ్ళిపోయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం బదిలీపై వెళ్లిన శ్రీకాకుళం జిల్లా పొందూరు తహసీల్దార్ రామకృష్ణను టీడీపీ నేత, ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ బెదిరించారు. ఈ నెల 16న గోరింట గ్రామంలోని రామసాగరం చెరువులో రవికుమార్ సోదరుడికి చెందిన రెండు జేసీబీలు, నాలుగు టిప్పర్లతో మట్టిని అక్రమంగా తవ్వుతుండగా వీఆర్ఓ నుంచి ఫిర్యాదు రావడంతో తహసీల్దార్ అక్కడకు చేరుకుని వాహనాలను సీజ్ చేశారు. దీంతో రవికుమార్ తహసీల్దార్కు ఫోన్చేసి బెదిరించారు. ఆ ఆడియో ఆలస్యంగా ఇప్పుడు వెలుగుచూసింది. ‘వాహనాలు విడిచిపెట్టు.. లేకపోతే లంచం డిమాండ్ చేశావని నీ మీద కంప్లైంట్ చేస్తాను’ అని ‘కూన’ బెదిరించారు. ‘నా చేతిలో ఏం లేదు. సీజ్ చేసి అప్పగించేశాను’ అని తహసీల్దార్ చెప్పడంతో.. ‘కూన’ దుర్భాషలాడుతూ.. ‘నువ్వు సీజ్ చేశావుగానీ కంప్లైంట్ చేయలేదని నాకు తెలుసు. చెప్పు ఎంత కావాలి.. పది వేలు కావాలా, లక్ష కావాలా ఎంత కావాలి’ అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. కూన రవికుమార్పై రౌడీషీట్ ఓపెన్ చేయాలి కూన రవికుమార్ది రాక్షసతత్వం అని పొందూరు తహసీల్ధార్ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు ప్రభుత్వ అధికారులంటే చులకన అని,ప్రభుత్వ అధికారులను దూషించడం ఆయనకు అలవాటు అని మండిపడ్డారు. గతంలో కూడా ఆయన చాలాసార్లు నన్ను దుర్భాషలాడారని పేర్కొన్నారు. పాతేస్తానని రవికుమార్ తనను బెదిరించారని తెలిపారు. ఆఫీసులోకి చొరబడి దాడి చేయడానికి ప్రయత్నించారన్నారు. ఆయన అనుచరులు తన కారును వెంబడించి బెదిరింపులకు దిగారని రామకృష్ణ తెలిపారు. టీడీపీ నేత కూన రవికుమార్పై ఉద్యోగ సంఘాల ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయనపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశాయి -
తహసీల్దార్కు ‘కూన’ బెదిరింపులు
పొందూరు: రెండు రోజుల క్రితం బదిలీపై వెళ్లిన శ్రీకాకుళం జిల్లా పొందూరు తహసీల్దార్ తామరాపల్లి రామకృష్ణను టీడీపీ నేత, ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ బెదిరించారు. ఈ నెల 16న గోరింట గ్రామంలోని రామసాగరం చెరువులో రవికుమార్ సోదరుడికి చెందిన రెండు జేసీబీలు, నాలుగు టిప్పర్లతో మట్టిని అక్రమంగా తవ్వుతుండగా వీఆర్ఓ నుంచి ఫిర్యాదు రావడంతో తహసీల్దార్ అక్కడకు చేరుకుని వాహనాలను సీజ్ చేశారు. దీంతో రవికుమార్ తహసీల్దార్కు ఫోన్చేసి బెదిరించారు. ఆ ఆడియో ఆలస్యంగా ఇప్పుడు వెలుగుచూసింది. ‘వాహనాలు విడిచిపెట్టు.. లేకపోతే లంచం డిమాండ్ చేశావని నీ మీద కంప్లైంట్ చేస్తాను’ అని ‘కూన’ బెదిరించారు. ‘నా చేతిలో ఏం లేదు. సీజ్ చేసి అప్పగించేశాను’ అని తహసీల్దార్ చెప్పడంతో.. ‘కూన’ దుర్భాషలాడుతూ.. ‘నువ్వు సీజ్ చేశావుగానీ కంప్లైంట్ చేయలేదని నాకు తెలుసు. చెప్పు ఎంత కావాలి.. పది వేలు కావాలా, లక్ష కావాలా ఎంత కావాలి’ అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. ‘నిబంధనల ప్రకారం వాహనాలను పోలీస్స్టేషన్కు అప్పగించాను. తర్వాత మీరు రిలీజ్ చేసుకోండి సార్’ అని తహసీల్దార్ చెప్పడంతో.. ‘ప్రాసెస్ గురించి నాకు చెబుతున్నావా..’ అంటూ రాయలేని రీతిలో ‘కూన’ అసభ్యంగా దూషించారు. దీంతో.. క్వారెంటైన్లో ఉన్న 13 మంది టీడీపీ వర్గీయులతో తనపై ఫిర్యాదులు చేయించారని తహసీల్దార్ రామకృష్ణ చెప్పారు. కాగా, కూన రవికుమార్ గతంలో కూడా ఇలాగే సరుబుజ్జిలి ఎంపీడీఓను.. అదే మండలానికి చెందిన పంచాయతీ విస్తరణాధికారిని బెదిరించారు. ఈ రెండు ఘటనల్లోనూ ఆయన అరెస్టయి బెయిల్పై బయటకు వచ్చారు. -
టీడీపీ నేత కూన రవికుమార్ అరెస్ట్
-
ప్రభుత్వ ఉద్యోగిని దూషించిన కేసులో కూన అరెస్ట్
-
టీడీపీ నేత కూన రవికుమార్ అరెస్ట్
సాక్షి, శ్రీకాకుళం: ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగిని అసభ్య పదజాలంతో దూషించిన ఆయనపై కేసు నమోదు అయింది. కూన రవికుమార్పై 353, 306, రెడ్ విత్ 109 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కూనతో పాటు మాజీ ఎంపీటీసీ బొంగు వెంకటరత్నంపై కూడా ఆమదాలవలస పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మరికాసేపట్లో వారిని ఆమదాలవలస కోర్టులో హాజరు పరచనున్నారు. కాగా శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి ఇన్ఛార్జ్ ఈఓపీఆర్డీ గూపపు అప్పలనాయుడును ఫోన్ చేసి బూతులు తిట్టిన వైనం ప్రస్తుతం వైరల్ అవుతోంది. (మరోసారి కూన రవికుమార్ రౌడీయిజం..) -
కూన రవికుమార్ బెదిరింపులు
-
స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు
సాక్షి, ఆమదాలవలస (శ్రీకాకుళం): ప్రభుత్వ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించి కేసుల పాలయ్యారు.. ముఖం చూపించే ధైర్యం లేక దాదాపు నెల రోజులు అజ్ఞాతంలో గడిపారు.. ఎట్టకేలకు ముందస్తు బెయిల్ సంపాదించి మాజీ విప్ కూన రవికుమార్ స్వస్థలానికి వచ్చారు.. ఏదో ఘన కార్యం సాధించినట్టు అతని అనుయాయులు స్వాగత సన్నాహాలు చేశారు. స్థానిక ఎస్ఎస్ఎన్ కళ్యాణమండపంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కూన సమక్షంలోనే ఓ మాజీ ఎంపీటీసీ సభ్యుడు శాసన సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది మళ్లీ మరో వివాదానికి దారి తీసే పరిస్థితి కనిపిస్తోంది. కూన రవికుమార్ తొలుత ర్యాలీగా పట్టణంలోకి రావాలని భావించారు. దీనికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో వాహనాలతో స్థానిక ఎస్ఎస్ఎన్ కళ్యాణమండపానికి చేరుకున్నారు. అక్కడ సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తలను రెచ్చగొడుతూ కొంతమంది మాట్లాడారు. ఆమదాలవలస మండలంలోని కనుగులవలస గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు నూక సూరప్పల నాయుడు అలియాస్ రాజు స్పీకర్ తమ్మినేని సీతారాంను, ఆయన హోదాను కించపరిచే విధంగా కార్యకర్తల ముందు మైక్లో రెచ్చిపోయారు. స్పీకర్ తనయుడు తమ్మినేని చిరంజీవి నాగ్ సర్టిఫికేట్లు కొనుగోలు చేసి చదువుకున్నట్లు బిల్డప్ ఇస్తున్నారని విమర్శించి, పత్రికలో రాయలేని విధంగా స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎంపీటీసీ సభ్యుడి మాటలు రికార్డ్ అయి ఉన్నాయని, ఆయనపై క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
నోరు పారేసుకుంటున్న టీడీపీ నేతలు
‘ఆఫీసులో తలుపులు వేసి మరీ బాదేస్తాను. చెట్టుకు కట్టి కాల్చేస్తాను. నన్ము ఎవరూ ఆపలేరు. చెప్పింది చేయకపోతే నేనేంటో చూపిస్తా’- సరుబుజ్జిలి ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శికి మాజీ విప్ కూన రవికుమార్ బెదిరింపులివి.. ‘‘ఏయ్.. ఎగస్ట్రా చేయొద్దు. నీకు ట్రైనింగ్ ఎవరిచ్చారు. నన్ను ఆపడానికి నీకు ఎవడిచ్చాడు హక్కు. యూజ్లెస్ ఫెలో’’ - తాజాగా రాజధానిలో పోలీసు ఉన్నతాధికారులకు చేయి చూపిస్తూ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు వేసిన చిందులివి.. ఎంపీడీఓను బెదిరించిన కేసులో కూన రవికుమార్ ఇంకా అరెస్టు కాలేదు. గత నెల 27వ తేదీ నుంచి అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన మరవకముందే సాక్షాత్తు ఎస్పీ విక్రాంత్ పటేల్పై ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు నోరు పారేసుకున్నారు. నోటికొచ్చినట్టు దుర్భాషలాడారు. చేయి చూపిస్తూ తన సహజ ధోరణిలో బెదిరించారు. ఈ ఘటన చూసిన సిక్కోలు ప్రజలు నివ్వెరపోయారు. ఆయనకెందుకంత నోటి దురుసు అంటూ అసహ్యించుకుంటున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ ప్రభుత్వం దిగిపోయినా... ఇంకా అధికారంలో ఉన్నామనే మదం చూపిస్తున్నారు. ఒక్క అచ్చెన్నాయుడు, కూన రవికుమారే కాదు టీడీపీ నేతలు చాలావరకు నోటిని అదుపులో పెట్టకుండా ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో ప్రజలు ఛీకొట్టినా ఇప్పటికీ అధికారులు తమ చెప్పుచేతల్లో ఉండాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వీరి తీరుతో జిల్లాకు చెడ్డపేరు వస్తోంది. శాంతి కాముకులన్న పేరు గల జిల్లాకు చెందిన నేతలు ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారేంటని బాధపడాల్సిన పరిస్థితి నెలకుంది. సాధారణంగా దేశం నలుమూలల సిక్కోలు ప్రజలుంటారు. ఉపాధి కోసం వలస వెళ్లి బతుకుతారు. జిల్లావాసులు దేశంలో ఎక్కడైనా బతకగలరు. దానికి కారణం ప్రవర్తనే. అందరితో మంచిగా ఉంటూ, కలివిడిగా నడుస్తూ జీవిత ప్రయాణం చేస్తుంటారు. అందుకనే శ్రీకాకుళం జిల్లా వాసులంటే ఇతర ప్రాంతాల వారికి ఒక నమ్మకం. కానీ అచ్చెన్నాయుడు, రవికుమార్ లాంటి నేతలు ఓవర్ యాక్షన్ చేయడంతో శ్రీకాకుళం జిల్లా నేతలు ఇలాంటి వాళ్లా? అని పెదవి విరిచే పరిస్థితి ఏర్పడింది. అధికారంలో ఉన్నంతకాలం అచ్చెన్నాయుడు బెదిరింపులతోనే పబ్బం గడిపారు. భయపెట్టి, అధికారులను గుప్పెట్లో పెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరించారు. దర్జాగా దోపిడీకి పాల్పడ్డారు. మంత్రి హోదాలో జిల్లాలో చాలామంది ఉన్నతాధికారులపై సైతం ఏకవచన ప్రయోగం, పరుష పదజాలంతో మండిపడటం, బెదిరించడం తెలిసిందే. టెక్కలి డివిజన్కు చెందిన ఓ ఆర్అండ్బి ఉద్యోగిపై దాడికి పాల్పడటం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమయ్యింది. రిమ్స్ డైరెక్టర్లుగా పనిచేసిన ఉన్నత వైద్యాధికారులపై ఏకవచన ప్రయోగం చేశారు. గతంలో జెడ్పీటీసీ ఎన్నికల్లో విధి నిర్వహణలో ఉన్న మహిళా కానిస్టేబుల్పై అనుచితంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో నిమ్మాడలో తమకు వ్యతిరేకంగా పనిచేశారని ప్రత్యర్ధిపై అమర్యాదగా వ్యవహరించారు. పోలింగ్ అధికారులను బెదిరించారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇక, ఎన్నికల ముందైతే ఓటర్లనే నేరుగా బెదిరించారు. గత నెల 24న కోటబొమ్మాళి మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేకాధికారి కార్యాలయంలో ఎంపీడీవో రాజేశ్వరమ్మపై తీవ్రంగా మండిపడ్డారు. తనకు తెలియకుండా వాలంటీర్లు నియమించారని, సమాచారం ఇవ్వలేదని, అలాగే పింఛన్లు ఎలా తొలిగిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. తాజాగా మరోసారి రెచ్చిపోయారు. ఈసారి ఏకంగా పోలీసు ఉన్నతాధికారిపై నోరు పారేసుకున్నారు. పల్నాడులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 144 సెక్షన్ అమల్లో ఉండగా రాజధానిలో అచ్చెన్న వీరంగం సృష్టించారు. ‘ఏయ్ ఎగస్ట్రా చేయొద్దు. నన్ను ఆపడానికి నీకు ఎవడిచ్చాడు హక్కు’ అంటూ పోలీసులపై ఒంటికాలితో లేచారు. అంతటితో ఆగకుండా ఎస్పీ విక్రాంత్ పటేల్ను ‘యూజ్లెస్ ఫెలో’ అని దుర్భాషలాడారు. ఇదంతా చూస్తుంటే అచ్చెన్నాయుడు తదితర నేతల్లో అసహనం తీవ్ర స్థాయిలో ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. ఒక్కొక్కరిగా టీడీపీ కీలక నేతలు తమ స్వరూపాన్ని నేరుగా బయటపెట్టుకుంటున్నారు. ఏకవచన ప్రయోగాలతోపాటు అవమానకర ప్రవర్తన చేస్తూనే.. నేరుగా బెదిరింపులకు దిగుతున్నారు. అచ్చెన్న వ్యవహారం రాష్ట్రంలోనే కాదు జిల్లాలోనూ చర్చనీయాంశంగా మారింది. అధికారంలో ఉన్నంతసేపూ అసెంబ్లీలో ఏ రకంగా మాట్లాడి... తనకంటూ ఒక చెడ్డ పేరును మూటగట్టుకున్నారో ఇప్పుడు కూడా ఆ పేరును నిలబెట్టుకునేలా దౌర్జన్యాలకు దిగుతున్నారు. (చదవండి: చంద్రబాబు డైరెక్షన్.. బయట నేతల ఓవరాక్షన్) -
ఇంకా అజ్ఞాతంలోనే కూన రవికుమార్
-
ఆడియో, వీడియో సాక్ష్యాలున్నాయి: తమ్మినేని
సాక్షి, శ్రీకాకుళం: ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించిన కూన రవికుమార్ కేసులో తన, తన కుటుంబ సభ్యుల ప్రమేయం లేదని శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేవిధంగా కూన రవికుమార్ ప్రవర్తించడం.. ఇందుకు సంబంధించి ఆడియో, వీడియో సాక్ష్యాలతో సహా ఆధారాలు దొరికాయన్నారు. ఈ క్రమంలో ఉద్యోగులు ఆయనపై కేసు పెట్టారని..ప్రస్తుతం చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఈ వ్యవహారాన్ని టీడీపీ రాజకీయం తగదని సూచించారు. అధికార్లను బెదిరించిన చరిత్ర ఆ పార్టీ నాయకులు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్కు ఉందని విమర్శించారు. అటువంటి వాళ్లు ఇప్పుడు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కాగా టీడీపీ నాయకుడు కూన రవికుమార్ ఎంపీడీఓ కార్యాలయంలోకి జొరబడి ప్రభుత్వ అధికారులపై దుర్భాషలాడినందుకు గానూ ఆయనతోతో పాటు 11 మందిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం అఙ్ఞాతంలో ఉన్న కూన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషిన్ పెట్టినట్లు సమాచారం. ముందస్తు బెయిల్ మంజూరు అయితేనే ఆయన బయటకు వస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఆయన గృహానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పలువురు అగ్రనేతలు పరామర్శలకు వచ్చి వెళ్తున్నారు. కూన రవికుమార్తోపాటు మరో ముద్దాయి అంబళ్ల రాంబాబు కూడా పరారీలో ఉన్నట్లు తెలిసింది. -
టీడీపీ నేతల వితండవాదం...
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పాలకొండ, రాజాం నియోజకవర్గాలకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలుండగా వారిని పక్కన పెట్టి తమ పార్టీకి చెందిన నిమ్మక జయకృష్ణ, కావలి ప్రతిభాభారతి పేరుతో ప్రత్యేక జీవోలిచ్చి నిధులు విడుదల చేసిన విషయం ఇంకా ప్రజలకు గుర్తుంది. ఎమ్మెల్యేలకు విధిగా నిధులు ఇవ్వాల్సిందిపోయి వారి చేతిలో ఓడిపోయిన నేతల పేరుతో అధికారిక జీవోలు ఇచ్చిన ఘనత మీదేనని విమర్శలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్సీపీ నేతలు మండల పరిషత్ కార్యాలయాలకు వస్తున్నారని, కార్యాలయంలో కూర్చొంటున్నారని టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తుంటే... మండల కార్యాలయాల్లోకి తాము తప్ప మరెవ్వరూ రాకూడదన్నట్టుగా ఇంకా అధికార దర్పం ప్రదర్శిస్తుంటే.. ఇంకా మీరే అధికారంలో ఉన్నట్టు కలలు కంటున్నారా అని జనం హేళన చేస్తున్నారు. నోరు పారేసుకుని.. ఆపైన ఎదురుదాడి.. ప్రభుత్వ ఉద్యోగులపై నోరు పారేసుకొని ఆడియో, వీడియో క్లిప్పింగ్లతో అడ్డంగా దొరికిపోయినప్పటికీ టీడీపీ నేతలు బుకాయిస్తున్నారు. తప్పులు సరిదిద్దుకోకపోగా ఎదురుదాడికి దిగుతున్నారు. అధికారులపై అనుచితంగా ప్రవర్తించి తప్పు చేయలేదని మొండి వైఖరి అవలంబిస్తున్నారు. వీరి వ్యవహార శైలిని, నోటి దురుసును లోకమంతా చూసి నివ్వెరపోతున్నా... వీరికి మాత్రం సిగ్గు రావడం లేదు. తప్పులు చేసి ఎదుట వారిపై నిందారోపణలు వేస్తున్నారు. ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, మాజీ విప్ కూన రవికుమార్ల తీరును సర్వత్రా తప్పు పడుతున్నా టీడీపీ నేతలు మాత్రం సమర్ధించుకునేలా మాట్లాడుతున్నారు. అసలు మండల అధికారులపై అంతా చూస్తుండగానే విరుచుకుపడ్డారు. కూన రవికుమారైతే ఏమాత్రం తగ్గకుండా స్పందన కార్యక్రమంలో ఇష్టారీతిన మాట్లాడారు. దాడి చేసినంతగా పరుష పదజాలంతో మాట్లాడారు. ‘నాకు రెస్పాండ్ అవ్వకపోతే రేపటి నుంచి మీ సీట్లో కూర్చొంటా... ఎవ్వరూ నన్ను ఆపలేరు. ఆఫీసులోనే తలుపులు వేసి మరీ బాదేస్తా’నంటూ సరుబుజ్జిలి ఎంపీడీఓ దామోదరావుపై కూన రవికుమార్ నోటికొచ్చినట్టు మాట్లాడారు. అంతకుముందు ఓ మహిళా ఉద్యోగికి ఫోన్ చేసి మరీ బెదిరింపులకు దిగారు. ఇదంతా రికార్డయింది. బాధిత ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆడియో, వీడియో క్లిప్పింగ్లు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంటే... కూన రవికుమార్ పరారీ అయ్యారు. ఒక కేసు నమోదైన తర్వాత తప్పనిసరిగా ఆ వ్యక్తి కోసం గాలిస్తారు. అందులో భాగంగా కూన రవికుమార్ ఇళ్లల్లో కూడా తనిఖీలు చేశారు. ఇదంతా పోలీసు విధి నిర్వహణలో భాగమని అందరికీ తెలిసిందే. కానీ టీడీపీ నేతలకు మాత్రం కక్షసాధింపుగా కన్పించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కక్ష కట్టినట్టు ఎదురుదాడికి దిగుతున్నారు. రవికుమార్ది తప్పు కాదా? అసలు కూన రవికుమార్ చేసినది తప్పా? ఒప్పా? అన్నది ఆత్మ పరిశీలన చేసుకోకుండా రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారు. అసలు కక్ష సాధింపేంటో గత ఐదేళ్ల కాలంలో టీడీపీ వైఖరిని చూస్తే తెలుస్తుంది. తప్పుడు ఫిర్యాదులతో అక్రమ అరెస్టులకు దిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు దువ్వాడ శ్రీనివాస్పై అనుసరించిన వైఖరినే తీసుకోవచ్చు. క్వారీ, పవర్ ప్లాంట్ వ్యవహారాల్లో తప్పుడు ఫిర్యాదును ఆధారంగా చేసుకుని దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోకి వెళ్లి అరెస్టు చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇవన్నీ నాడు మంత్రిగా వెలగబెట్టిన అచ్చెన్నాయుడు కనుసన్నల్లోనే జరిగింది. చెప్పాలంటే దువ్వాడ శ్రీనివాస్ను టార్గెట్గా చేసి, కక్ష సాధింపునకు దిగి, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఇదొక్క ఉదాహరణ మాత్రమే. జిల్లాలో అనేక మంది వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులకు తెగబడ్డ సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ గుర్తు చేసుకోకుండా కేవలం వైఎస్సార్సీపీ నేతలు మండల పరిషత్ కార్యాలయాల్లోకి వెళ్తున్నారని, అక్కడ కూర్చొంటున్నారని, సంక్షేమ పథకాల్లో అనర్హులను ఏరివేస్తున్నారని చెప్పి అధికారులపై నోరు పారేసుకుని, అపై అడ్డంగా దొరికిపోయి, ఉద్యోగులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటే... దాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వ కక్ష సాధింపని రాజకీయ లబ్ధి కోసం ఎదురుదాడికి దిగుతున్నారు. తమ అధినేత చంద్రబాబునాయుడు పంథాలోనే జిల్లా టీడీపీ నేతలు నడుస్తున్నారు. జరిగింది తప్పు... పొరపాటున మాట్లాడాను... క్షమాపణ చెబుతున్నా... అని ఉంటే కాస్త హుందాగా ఉండేది. అందుకు భిన్నంగా, చేసిన తప్పును కప్పిపుచ్చుకుని వైఎస్సార్సీపీ ప్రభుత్వంపైనా, ఆ పార్టీ నేతలపైనా విమర్శలు చేయడం చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. పదిమంది నిందితులకు బెయిల్ మంజూరు.. ఆమదాలవలస: సరుబుజ్జలి ఎంపీడీఓను బెదిరించి, అనుచితంగా మాట్లాడిన, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన కేసులో అరెస్టయిన పదిమంది నిందితులకు గురువారం బెయిల మంజూరైంది. వీరిని బుధవారం అరెస్ట్ చేసి కోర్టు నుంచి శ్రీకాకుళం సబ్జైల్కు రిమాండ్కు పంపించిన సంగతి తెలిసిందే. ఆ పదిమందికి ఆమదాలవలస జూనియర్ సివిల్ జడ్జి గురువారం పూచీకత్తులపై బెయిలు మంజూరు చేసినట్లు సీఐ ప్రసాద్రావు తెలిపారు. ఒక్కో ముద్దాయికి ఇద్దరు పూచీకర్తులతో రూ.10 వేలు జామీను అమౌంట్తో బెయిల్ మంజూరు చేసినట్లు వారు తెలిపారు. -
ఇంకా పరారీలోనే కూన రవికుమార్..
సాక్షి, ఆమదాలవలస: మాజీ విప్ కూన రవికుమార్ ఇంకా పరారీలోనే ఉన్నారు. ఎక్కడ ఉన్నారన్న సమాచారం మాత్రం తెలియడంలేదు. అజ్ఞాతంలోనే ఉన్నట్లు అందరూ చర్చించుకుంటున్నారు. పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నామని చెబుతున్నారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషిన్ పెట్టినట్లు తెలిసింది. ముందస్తు బెయిల్ మంజూరు అయితేనే ఆయన బయటకు వస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. శ్రీకాకుళంలో గల కూన రవికుమార్ ఇంటి వద్ద మాత్రం పోలీసులు మొహరించి ఉన్నారు. ఆయన గృహానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పలువురు అగ్రనేతలు పరామర్శలకు వచ్చి వెళ్తున్నారు. కూన రవికుమార్తోపాటు మరో ముద్దాయి అంబళ్ల రాంబాబు కూడా పరారీలో ఉన్నారు. -
పరారీలో కూన రవికుమార్
-
అవినీతి సామ్రాట్లు
-
అజ్ఞాతంలోనే మాజీ విప్ కూన
సాక్షి, ఆమదాలవలస, (శ్రీకాకుళం) : మాజీ విప్ కూన రవికుమార్ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. రెండు రోజులుగా పోలీసులు గాలిస్తున్నా ఆయన ఆచూకీ దొరకడం లేదు. అయితే ఆయనతో పాటు కేసులో ఉన్న పదకొండు మందిలో పది మంది పోలీసులకు లొంగిపోయారు. మరో వ్యక్తి మాత్రం కూనతోపాటే అజ్ఞాతంలో ఉన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలోకి జొరబడి ప్రభుత్వ అధికారులపై దుర్భాషలాడినందుకు కూనతో పాటు 11 మందిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిపై రెండు రోజు లుగా విచారణ నిర్వహిస్తున్నారు. నిందితుల స్వగ్రామాలు కూనజమ్మన్నపేట, తెలికిపెంట, వ్యాసులపేట, పెద్దసవలాపురం, రొట్టవలస, సింధువాడ, సరుబుజ్జిలి, చిగురువలస గ్రామాల్లో సోదాలు కూడా నిర్వహించారు. నిందితుల కుటుంబ సభ్యులను కూడా పూర్తిస్థాయిలో విచారణ చేశారు. ఎట్టకేలకు బుధవారం మధ్యాహ్నం టీడీపీ నాయకులు కళా వెంకటరావు, చౌదరి బాబ్జీరావులు ఆమదాలవలస పోలీస్ సర్కిర్ కార్యాలయంలో డీఎస్పీ చక్రధరరావు ఎదుట పది మంది నిందితులను హాజరుపరిచారు. కూన అమ్మినాయుడు, కూన సంజీవరావు, నందివాడ గోవిందరావు, పల్లి సురేష్, గండెం రవి, తాడేల రమణ, యండ రామారావు, గుర్రాల చినబాబు, ఊడవల్లి రామకృష్ణ, బాన్న గురువులు హాజరయ్యారు. ఈ కేసులో అంబళ్ల రాంబాబు, కూన రవికుమార్లు పరా రీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన వారిని ఆమదాలవలసలోగల సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. జూనియర్ సివిల్ జడ్జి బి.జోత్సత్న తీర్పునిస్తూ వీరికి 14 రోజులు రిమాండ్కు పంపించారు. నిందితులను సీఐ ప్రసాదరావు ఆధ్వర్యంలో శ్రీకాకుళం సబ్జైల్కు తరలించారు. టీడీపీ కార్యకర్తల హడావుడి నిందితులను పోలీస్స్టేషన్, కోర్టుకు తరలిస్తున్నప్పుడు టీడీపీ కార్యకర్తలు హడావుడి చేశారు. వీరికి బెయిల్ వస్తుందని ఆశించినా అలా జరక్కపోవడంతో అవాక్కయ్యారు. రిమాండ్కు తరలించడంతో ఇక నుంచి గొడలకు దూరంగా ఉండాలని, ఇలా సమావేశాలకు వెళ్లి తమ భవిష్యత్లు పాడు చేసుకోకూడదని పలువురు చర్చించుకున్నారు. తమ నాయకుడు కూన రవికుమార్ వారితో కోర్టుకు హాజరు కాకపోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో కూడా నాయకుడి అండదండలు కార్యకర్తలకు లభించలేదని వారంతా చర్చించుకున్నారు. విశాఖలో ఉన్నారా..? ఎంపీడీఓపై దురుసుగా ప్రవర్తించి కేసు ఎదుర్కొంటున్న మాజీ విప్ కూన రవికుమార్ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. బుధవారం ఆయన అనుచరులు పది మంది స్వచ్ఛందంగా లొంగి పోయారు. కానీ మాజీ విప్ మాత్రం జైలుకు వెళ్లాల్సి వస్తుందేమోనని పరారీలోనే ఉండిపోయినట్లు సమాచారం. పోలీసులు ఆమదాలవలస, పొందూరు, శ్రీకాకుళం తదితర ప్రాంతా ల్లో నిఘా వేసి ఉంచారు. వాహనాలు కూడా తనిఖీ చేస్తున్నారు. దీనికి బెదిరిపోయిన కూన విశాఖపట్టణంలోని గాజువాక, పెందుర్తి ఏరి యాల్లో మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, పల్లా సత్యనారాయణ ఇళ్లలో తలదాచుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నిఘా వర్గాలు, ప్రత్యేక బలగాల సాయంతో పోలీసులు వేట ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయవాడతోపాటు పలు ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. స్థానికంగా చేసిన బెయిల్ ప్రయత్నాలు విఫలం కావడంతో అమరావతి స్థాయిలో ఉన్న న్యాయవాదుల ద్వారా టీడీపీ సీనియర్ నేతలు పావులు కదుపుతున్నట్లు సమాచారం. కూన ఇంటి వద్ద ఉద్రిక్తత శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న మాజీ విప్ కూన రవికుమార్ ఇంటి వద్ద బుధవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. డీఎస్పీ చక్రవర్తి ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, పది మంది పోలీసులు ఆ ఇంటిని తనిఖీ చేసేందుకు వచ్చారు. రవికుమార్ భార్య ప్రమీలతోపాటు ఆయన బంధువులు, అనుచరులు పోలీసులను అడ్డుకున్నా రు. సెర్చ్ వారెంట్ చూపించాలని డిమాండ్ చేశారు. కొద్దిసేపు వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో లోపలికి వెళ్లి పరిశీలించారు. అయితే పూర్తి స్థాయిలో తనిఖీ చేయనివ్వకపోవడంతో ఒకటి రెం డు గదులను మాత్రమే తనిఖీ చేశారు. అక్కడ రవికుమార్ లేకపోవడంతో వెళ్లిపోయారు. అనంతరం రవికుమార్ భార్య కూన ప్రమీల మాట్లాడుతూ పోలీసులు సెర్చ్ వారెంట్ లేకుండా తనిఖీలు చేయడాన్ని తప్పుబట్టా రు. ఇది సరైన విధానం కాదన్నారు. తమ ప్రత్యర్థులే కక్ష గట్టి ఇలా చేయిస్తున్నారని ఆరోపించారు. తాము కూడా రాజకీయాల్లో ఉన్నామని, తన భర్త ఉన్నత పదవిలో కూడా పనిచేశారని, అలాంటి వ్యక్తిని వేధించాలని చూడడం సరి కాదన్నారు. పోలీస్స్టేషన్ వద్ద నిందితులను తీసుకువస్తున్న పోలీసులు, అక్కడికి చేరుకున్న టీడీపీ కార్యకర్తలుకూన వ్యవహారంపై డీజీపీ ఆరా రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ వ్యవహారంపై ఆరా తీశారు. బుధవారం ఆయన ఎస్పీ అమ్మిరెడ్డితో మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంపై వ్యవహరించాల్సిన తీరుతెన్నులపై ఎస్పీకి సూచనలు ఇచ్చారు. త్వరితగతిన ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేలా చూడాలని ఆదేశించారు. -
'కూన'కు ప్రభుత్వ ఉద్యోగుల వార్నింగ్!
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో తాను చెప్పిన పనులు చేయకపోతే చెట్టుకు కట్టేసి కాల్చి చంపుతానంటూ అధికారులను, సిబ్బందిని కూన రవికుమార్ తన అనుచరులతో కలిసి బెదిరించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై మంగళవారం వివిధ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. బెదిరింపులకు పాల్పడిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన పలుమార్లు బెదిరింపులకు పాల్పడ్డారని, అధికారం పోయినా.. ఆయన వ్యవహారశైలిలో ఎలాంటి మార్పు లేదని ధ్వజమెత్తుతున్నాయి. చదవండి: పరారీలో మాజీ విప్ కూన రవికుమార్ ఈ మేరకు ఏపీ పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్ ప్రతినిధుల బృందం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసి కూనపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేసింది. పంచాయతీ కార్యదర్శుల నుంచి మండల అభివృద్ధి అధికారుల వరకు తాను చెప్పినట్టే నడుచుకోవాలని, లేకుంటే ఇబ్బంది పడతారని కూన రవికుమార్ బెదిరించడం ఉద్యోగులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోందని మంత్రి దృష్టికి తెచ్చారు. మంత్రిని కలిసినవారిలో అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ బుచ్చిరాజు, సలహాదారు ఎం.ప్రసాద్, జోనల్ సెక్రటరీ కె.లోవరాజు ఉన్నారు. అధికారులు, సిబ్బందిపై దౌర్జన్యం చేసిన కూనను వెంటనే అరెస్టు చేయాలని ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ అధికారుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్రెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరులోని ఎన్జీవో హోమ్లో మంగళవారం విలేకరుల సమావేశంలో చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ కూన రవికుమార్ టీడీపీ కార్యకర్తలతో ఎంపీడీవో ఆఫీస్లోకి దూసుకెళ్లి, దౌర్జన్యంగా తలుపులు పగులకొట్టి అధికారులను, సిబ్బందిని చెట్టుకు కట్టేసి కాలుస్తానని హెచ్చరించడాన్ని తీవ్రంగా ఖండించారు. భవిష్యత్తులో ఎవరూ ఈ తరహా బెదిరింపులకు పాల్పడకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కూన తక్షణమే ఎంపీడీవో దామోదర్కు, అక్కడి ఉద్యోగులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు న్యాయం జరగకపోతే కూన ఇల్లు ముట్టడించడంతోపాటు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ర ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు, సహాధ్యక్షుడు పురుషోత్తమ నాయుడు, రాష్ట్ర కార్యదర్శి కె.జగదీశ్వరరావు, తూర్పు కృష్ణా అధ్యక్షుడు ఉల్లి కృష్ణ, జిల్లా అధ్యక్షుడు బాజిత్ తదితరులు పాల్గొన్నారు. -
అరుస్తున్న అచ్చెన్న..రెచ్చిపోతున్న ‘రవి’
‘చెప్పింది చెయ్యరా.. పనిచెయ్యడం ఇష్టం లేకపోతే సెలవులు పెట్టి వెళ్లిపోండి. నియోజకవర్గంలో నాకు తెలీకుండా ఏ పనీ జరగకూడదు. జాగ్రత్త. పద్ధతులు మార్చుకోండి’ – ఈ నెల 24న కోటబొమ్మాళి మండల ప్రత్యేకాధికారి కార్యాలయ గదులు మూసి వేసి మరీ టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఎంపీడీఓ రాజేశ్వరమ్మకు ఇచ్చిన వార్నింగ్ ఇది. ‘నాకు రెస్పాండ్ అవ్వకపోతే రేపటి నుంచి మీ సీట్లో కూర్చుంటా. ఎవ్వరూ నన్ను ఆపలేరు. ఆఫీస్లోనే తలుపులు వేసి మరీ బాదేస్తా.’ అం టూ సరుబుజ్జిలి ఎంపీడీఓ దామోదరరావుపై. . ‘నువ్వు రాజకీయాలు చెయ్యకు. నీకు తెలిసింది రూల్ కాదు. నేను చెప్పిందే రూల్. నేను చెప్పింది చెయ్యకపోతే. వాట్ ఐ యామ్ అనేది చూపిస్తా’ అంటూ ఓ మహిళా పంచాయతీ కార్యదర్శిపై.. – ఈ నెల 26న ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ దాదాగిరీ చెలాయించిన తీరు ఇది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పై రెండు ఘటనలు చూస్తుంటే అర్థమవుతుంది కదా టీడీపీ అగ్ర నేతల అసలు స్వరూపం. విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులపై పరుషంగా మాట్లాడమే కాకుండా ఏకంగా ఈ ఇద్దరు టీడీపీ అగ్రనేతలు ప్రభుత్వ కార్యాలయాల తలుపులు వేసి మరీ ప్రత్యక్ష బెదిరింపులకు దిగడం చూస్తుంటే ఇంకా వీరి తీరు మారలేదని జిల్లా ప్రజలు భావిస్తున్నారు. చింత చచ్చినా.. పులుపు చావలేదన్నట్లుగా వీరి వ్యవహారం తయారైంది. ఐదేళ్ల పాటు కీలక పదవుల్లో అధికారం చెలాయించిన వీరిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులపై, మహిళలపై కూడా అప్పట్లో తమదైన శైలిలో రౌడీయిజాన్ని ప్రదర్శించిన సంగతి జిల్లా వాసులకు తెలిసిందే. అయితే ఇలాంటి దుర్మార్గ పాలన రాష్ట్రమంతా ఉండడంతో పాటు అక్రమాలు, అవినీతి పాలన అందించడంతో ప్రజలు గట్టిగా గుణపాఠం చెప్పారు. అయినా వీరి తీరులో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. ఏకవచన ప్రయోగాలతో పాటు అవమానకర ప్రవర్తన చేస్తూనే మానసికంగా కుంగదీసేలా పరుష పదజాలంతో తిట్టడం వంటి ఘటనలతో ఉ ద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నేతలతో పాటు జిల్లా వాసులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విధుల్లో ఉన్న తనపై ప్రత్యక్షంగా బెదిరించడంపై బాధిత ఎంపీడీఓ దా మోదరరావు సరుబుజ్జిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదైంది. ఇదే క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులపై బెదిరింపులకు దిగడం మంచి విధానం కాదని, వెంటనే బాధిత ఉద్యోగులకు మాజీ విప్ రవికుమార్ క్షమాపణలు చెప్పాలంటూ ఏపీ ఎన్జీవో సంఘ జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం డిమాండ్ చేశారు. దీంతో ఈ వ్యవహరంపై జిల్లా ఉన్నతాధికారుల సమాచారం మేరకు రాష్ట్ర ఉన్నతాధికారులు కూడా తీవ్రంగా పరిగణించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అరుస్తున్న అచ్చెన్న.. టెక్కలి నియోజకవర్గంలోని కోటబొమ్మాళి మండలంలో అధికారులపై తీవ్రంగా వ్యవహరించిన టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. గత ఐదేళ్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ఈయనకు మండల స్థాయి అధికారులతో ఎలా మాట్లాడోలా తెలీకపోవడం దారుణమని ఉద్యోగుల సంఘం విమర్శిస్తోంది. ఈనెల 24న కోట బొమ్మాళి మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేకాధికారి కార్యాలయంలో తలుపులు వేయించి మరీ అచ్చెన్నాయుడు ఎంపీడీఓ రాజేశ్వరమ్మపై తీవ్రంగా మండిపడ్డారు. తనకు తెలీకుండా వలంటీర్లను నియమించారని, సమాచారం ఇవ్వలేదని, అలాగే పింఛన్లు ఎలా తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకాధికారిపైన, జలవనరుల శాఖ అధికా రులపైనా ఇలాగే విరుచుకు పడుతూ తన మాట వినకపోతే సెలవులు పెట్టి వెళ్లిపోండని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని కార్యాలయ తలుపులు వేసి బెదిరింపులకు దిగారు. గతంలో కూడా మంత్రి హోదాలో జిల్లాలో చాలా మంది అధికారులపై, ఉన్నతాధికారులను సైతం ఏకవచన ప్రయోగం, పరుష పదజాలంతో మండిపడటం, బెదిరిం చడం తెలిసిందే. టెక్కలి డివిజన్కు చెందిన ఓ ఆర్అండ్బీ ఉద్యోగినిపై కూడా చెయ్యిచేసుకోవడం కూడా అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అయితే నాటి తీరునే ఇప్పటికీ ప్రదర్శించడంపై ఉద్యోగుల సంఘ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కోటబొమ్మాళి మండలంలోనే పలు బూత్లను రిగ్గింగ్ చేయించి మరీ ఎమ్మెల్యేగా గెలిచారనే ఆరోపణలు అచ్చెన్నపై ఉన్న సంగతి తెలిసిందే. రెచ్చిపోతున్న ‘రవి’ ప్రభుత్వ విప్గా గత ఐదేళ్లుగా ఓ రేంజ్లో ఇసుక, భూ అక్రమాలకు పాల్పడిన కూన రవి కుమార్ తాజా ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఏమాత్రం తీరు మార్చుకోలేదు. ఇసుక రీచ్ల్లో అక్రమాలకు పాల్పడి వరదల పుణ్యమా అని అడ్డంగా బుక్కైన కూన రవి ఇప్పుడు కూడా అదే తీరులో దాదాగిరీ చేస్తున్నారు. అధికారులపై ఏకంగా తిట్ల దండకం పాడుతున్నారు. గత ఐదేళ్లలో ఇలాంటి ఘటనలు కోకొల్లలు. తాజాగా ఈనెల 26న సరుబుజ్జిలి మండల పరిషత్ కార్యాలయంలో ‘స్పందన’ కార్యక్రమంలో విధుల్లో ఉన్న ఎంపీడీఓ దామోదరరావును, అక్కడే ఉన్న ప్రత్యేకాధికారి, ప్రాజెక్టు అధికారిపైన అధికార దర్పాన్ని ప్రదర్శించారు. ‘తలుపులు వేసి బాదేస్తా.. చెట్టుకు కట్టి కాల్చేస్తా’ అంటూ రెచ్చిపోయారు. ‘వాట్ ఐ యామ్...అనేది తెలిసే మాట్లాడుతున్నావా’ అంటూ ఓ గ్రామ కార్యదర్శిని ఫోన్లో బెది రించడం కూడా తీవ్ర సంచలనంగా మారింది. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ఇంకా తానే నియోజకవర్గానికి ఎమ్మెల్యే అన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరును అంతా ఖండిస్తున్నారు. ‘నీకు తెలిసింది రూల్ కాదు...నేను చెప్పిందే రూల్..’ అంటూ అధికారులపై జులుం చెలాయించడంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నారు. ఫలితంగా బాధితులు పోలీసులను ఆశ్రయించారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఎందరో టీడీపీ నేతలు ఇలాగే అధికారులపైన, సమస్యల పరిష్కారం కోసం అడిగిన బాధితులపైన కూడా విరుచుకుపడటం తెలిసిందే. ఈ ప్రభావంతోనే ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలైనా ఆ నేతల తీరు మారకపోవడం గమనార్హం. తీరు మార్చుకోకపోతే చట్టరీత్యా తీవ్ర పరిణామాలు ఎదురుకాక తప్పదు. -
కూన రవికుమార్ అరెస్ట్కు రంగం సిద్ధం
-
పరారీలో మాజీ విప్ కూన రవికుమార్
సాక్షి, ఆమదాలవలస: ఆమదాలవలస నియోజకవర్గంలోని సరుబుజ్జిలి మండల కేంద్రంలో ఎంపీడీఓ, అధికారులను దుర్భాషలాడినందుకు గాను ఎంపీడీఓ మాజీ విప్ కూన రవికుమార్పై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం మాజీ విప్ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశామని ఆమదాలవలస సీఐ ప్రసాద్రావు మీడియాకు వెల్లడించారు. కూన రవికుమార్తోపాటు మరో 11 మంది వ్యక్తులపై సెక్షన్ 353, 427, 506, 143, ఆర్డబ్ల్యూ 149, సెక్షన్ (3) పీడీపీపీ యాక్ట్ 1984 లతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ప్రత్యేక పోలీసు దళాలతోపాటు డీఎస్పీ ఆమదాలవలస పోలీస్ స్టేషన్కు చేరుకొని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా మిగిలిన 11 మం ది వ్యక్తులతోపాటు కూన రవికుమార్ కూడా పరారైనట్లు పోలీసులు తెలిపారు. రవికుమా ర్ ముందస్తు బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కేసులలో ఉన్న వ్యక్తుల ఆచూకీ లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులను అయినా తీసుకువచ్చి నిందితులు ఆచూకీ తెలుసుకునేందుకు పోలీ సులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆఫీస్లోనే నన్ను బెదిరించారు.. స్పందన కార్యక్రమంలో విధుల్లో ఉన్నాను. అర్జీదారులతో మాట్లాడుతుంటే మాజీ విప్ రవికుమార్ కొంతమందితో వచ్చి మాపై దురుసుగా ప్రవర్తించారు. చెట్టుకు కట్టేసి కా ల్చేస్తా, తలుపులు వేసి బాదేస్తానని హెచ్చరించారు. దీని పై మా సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే సరుబుజ్జిలి పోలీసులకు ఫిర్యాదు చేశాను. – ఎ.దామోదరరావు, ఎంపీడీఓ, సరుబుజ్జిలి. ఇలా అయితే ఉద్యోగాలు చేయలేం.. పింఛన్ల మంజూరు విషయంలో మాజీ విప్ రవి మాపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. టీడీపీ నేతలు చెప్పిన వారి దరఖాస్తులను విచారణ చేయకుండానే ఆన్లైన్ చేయాలని చెబుతున్నారు. లేదం టే ఉద్యోగాలు చెయ్యలేవని బెది రిస్తున్నారు. పరుష పదజాలంతో తిడుతున్నారు. ఇలా అయితే మేం ఉద్యోగాలు చెయ్యలేం. – పి.రాము, తెలికిపెంట పంచాయతీ కార్యదర్శి క్షమాపణలు చెప్పాల్సిందే.. ప్రభుత్వానికి ప్రజలకు వారుధుల్లా పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులపై రాజ కీయ నేతల దాడులు, బెదిరింపులు కరెక్ట్ కాదు. ఏ ప్రభుత్వం వచ్చినా అందుకు తగ్టట్టుగా మేం పనిచేయాల్సిందే. అలాంటప్పుడు ఇలాంటి బెదిరింపులు చేస్తే సహించేది లేదు. సరుబుజ్జిలి ఎంపీడీఓ దామోదరావు, ఇతర సిబ్బందిని కూన రవి దారుణంగా బెదిరించారు. వెంటనే క్షమాపణ చెప్పాలి. దీనిపై రాష్ట్ర ఉద్యోగుల సంఘ నేతలకు కూడా సమాచారం ఇచ్చాం. బాధిత ఉద్యోగులకు న్యాయం జరగకపోతే భవిష్యత్ పరి ణామాలు తీవ్రంగా ఉంటాయి. – హనుమంతు సాయిరాం, ఏపీ ఎన్జీవో సంఘ జిల్లా అధ్యక్షుడు -
కూన రవి అరెస్టుకు రంగం సిద్ధం
సాక్షి, శ్రీకాకుళం/విజయవాడ : ప్రభుత్వ ఉద్యోగిపై బెదిరింపులకు దిగిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అరెస్టుకు శ్రీకాకుళం జిల్లా పోలీసులు రంగం సిద్ధం చేశారు. మండల అభివృద్ధి అధికారి అల్తాడు దామోదరరావు ఫిర్యాదు మేరకు రవికుమార్పై సరుబుజ్జిలి పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 353, 427, 506 ప్రకారం మంగళవారం కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కూన అమ్మినాయుడు, కూన సంజీవరావు, నందివాడ గోవిందరావు, పల్లి సురేశ్, గండెం రవి, తాడేల రమణ, యండ రామారావు, గుర్రాల చినబాబు, ఊడవల్లి రామకృష్ణ, అంబళ్ల రాంబాబు, బాన్న గురువులుపై కేసు పెట్టారు. కాగా, పోలీసులు అరెస్ట్ చేస్తారన్న సమాచారంతో కూన రవికుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. కూన రవికుమార్ అరెస్ట్ చేయాలి: ఏపీఎన్జీవో కూన రవికుమార్ ప్రభుత్వ ఉద్యోగిపై చేసిన వ్యాఖ్యలను ఏపీఎన్జీవో నేతలు ఖండించారు. టీడీపీ నేతలు గుండాల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీకి ఓటు వేశారని ఉద్యోగుల మీద దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఏకంగా ఓ ప్రభుత్వ ఉద్యోగిని చెట్టుకు కట్టేసి కొడతాననడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. కూన రవి వెంటనే ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలని, లేకుంటే కూన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. (చదవండి: చెట్టుకు కట్టి కాల్చేస్తా; టీడీపీ నేత బెదిరింపులు) -
‘కూన రవికుమార్ క్షమాపణలు చెప్పాలి’
సాక్షి, శ్రీకాకుళం: మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఉద్యోగులను అవమానించిన వ్యాఖ్యలపై ఏపీ ఎన్జీఓ సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించిన కూన రవికుమార్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. గతంలో ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇటువంటివి పునరావృతం అవుతున్నాయని మండిపడింది. కూనరవికుమార్పై కేసు నమోదు చేయాలని కోరింది. అతను బెదిరింపులకు పాల్పడ్డ ఆడియో వీడియో సాక్ష్యాలు కూడా తమ దగ్గర ఉన్నాయని ఏపీ ఎన్జీఓ పేర్కొంది. ఈ సందర్భంగా జిల్లా ఎంపీడీఓ సంఘం అధ్యక్షుడు కిరణ్కుమార్ మాట్లాడుతూ ఉద్యోగులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులు అని.. అలాంటి ఉద్యోగులను అవమానపరచడాన్ని, వారిపై బెదిరింపులకు దిగటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రవికుమార్పై చర్యలు తీసుకోకపోతే ఉద్యోగులమంతా మూకుమ్మడి సెలవులకు ఉపక్రమిస్తామని హెచ్చరించారు. చదవండి: చెట్టుకు కట్టి కాల్చేస్తా; టీడీపీ నేత బెదిరింపులు -
‘మరో చింతమనేనిలా మారాడు’
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ నేత కూన రవికుమార్ చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూన రవికుమార్ మరో చింతమనేని ప్రభాకర్లా మారాడని.. ఉద్యోగులను భయబ్రాంతులను గురిచేసిన రవికుమార్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రవికుమార్ వెంటనే ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కూన రవికుమార్ను టీడీపీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసినప్పుడే చింతమనేనిపై చంద్రబాబు చర్యలు తీసుకుని ఉంటే ఉద్యోగులపై టీడీపీ నేతల దాడులు జరిగేవి కావన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఉద్యోగులంతా పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నామన్నారు. పార్టీలకు అతీతంగా విధులు నిర్వహిస్తే ఉద్యోగులపై దాడులు చేస్తారా అంటూ టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలి: రాష్ట్ర్ర గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ప్రభుత్వ అధికారులపై బెదిరింపులకు పాల్పడిన టీడీపీ నేత కూన రవికుమార్పై రాష్ట్ర్ర గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. రవికుమార్పై ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలని రాష్ట్ర్ర గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య కోరారు. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. -
చెట్టుకు కట్టి కాల్చేస్తా; టీడీపీ నేత బెదిరింపులు
సాక్షి, సరుబుజ్జిలి: ప్రభుత్వ ఉద్యోగులు ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని మాజీ విప్ కూన రవికుమార్ హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తలు తెచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోకుండా నాటకాలు చేస్తే అధికారులను చెట్టుకు కట్టి కాల్చేస్తామని ఎంపీడీఓ దామోదరరావుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. తమ కార్యకర్తలు చెప్పిన పనులు చేయకపోతే ఇబ్బందులు తప్పవని మండల ప్రత్యేకాధికారి నంబాళ్ల దామోదరరావు సమక్షంలో మండల పరిషత్ ఉద్యోగులను హెచ్చరించారు. మండల కేంద్రంలో టీడీపీ కార్యకర్తల సమావేశం అనంతరం మండల పరిషత్, తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు, సిబ్బందిపై ఆయన సోమవారం శివాలెత్తారు. ముందుగా మండలపరిషత్ కార్యాలయంలోకి పార్టీ కార్యకర్తలతోపాటు ప్రవేశించారు. మండలపరిషత్ కార్యాలయంలో ఎంపీపీకు కేటాయించిన చాంబర్లోకి కార్యకర్తలతో సహా తలుపులు తోసుకొని ప్రవేశించారు. దీంతో చాంబర్కు గల డోర్ బీడింగ్ కొంతమేర పాడయింది. ఎంపీపీ చాంబర్లోకి వెళ్లిన రవికుమార్ సిబ్బందిని వరుసగా పిలిపించుకొని వ్యక్తిగత దూషణలకు తెగబడ్డారు. పదవులు లేకపోయినా చాంబర్ను ప్రజాప్రతినిధులకు ఎలా ఇస్తున్నారని, వెంటనే తాళాలు వేసి మీ చేతుల్లోకి ఎందుకు తీసుకోరని ప్రశ్నించారు. గ్రామ వలంటీర్ల విషయంలో నిబంధనలు పాటించకుండా ఏవిధంగా మంజూరు చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ రాజకీయాలు చేయాలని చూస్తే మీ భరతం పడతానని మండల పరిషత్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ జి.వి.అప్పలనాయుడు, జూనియర్ అసిస్టెంట్ నవీన్కుమార్పై ఉవ్వెత్తున లేచారు. మార్పు రాకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. భయాందోళనలో అధికారులు.. మాజీ విప్ అధికారులను ఇష్టారాజ్యంగా దూ షించడంతో సిబ్బంది భయాందోళనకు లోనయ్యారు. పత్రికల్లో రాయలేని భాషను మాజీ విప్ వినియోగించడంతో సిబ్బంది తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారు. ఏం చేయాలో తె లియక తమ గదుల్లో మౌనంగా ఉండిపోయా రు. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయాలని టీడీపీ నాయకులు తీవ్ర ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని, ఈ వ్యవహార సరళి మారకపోతే ఉద్యోగాలు చేయలేమ ని సిబ్బంది వాపోయారు. అర్హత లేకపోయినా విచారణ చేయకుండా పింఛన్ దరఖాస్తులు ఆన్లైన్ చేయమని ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. గ్రామ వలంటీర్ల నియామకాన్ని పారదర్శకంగా చేసినప్పటికీ తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. సీఐ విచారణ.. ఈ ఘటన గురించి సమాచారం అందడంతో ఆమదాలవలస సీఐ బి.ప్రసాదరావు మండలపరిషత్ కార్యాలయానికి వచ్చారు. ఎంపీపీ చాంబర్ను పరిశీలించారు. ఎంపీడీఓ, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్లను విచారించారు. జరిగిన యదార్థ విషయాలను తెలుసుకున్నా రు. అక్కడే ఉన్న వైఎస్సార్సీపీ నేతలు సురవరపు నాగేశ్వరావు, పున్నపురెడ్డి తవిటినాయుడు, బెవర మల్లేశ్వరావులను అక్కడ జరిగిన విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. రాత్రి ఎంపీడీవో దామోదరరావు సీఐకు ఫిర్యాదు చేశారు. -
అరాచకం 2.0
సాక్షి, పొందూరు (శ్రీకాకుళం): గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూన రవికుమార్, అతని అనుచరుల దందా మూడు పువ్వులు ఆరు కాయలు మాదిరిగా సాగింది. చేతిలో అధికారం ఉండడంతో అందిన కాడికి అందినంత దోచుకున్నారు. నచ్చిన వారి అభివృద్ధికి పెద్దపీట వేసి, నచ్చని వారిని అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. చేసే ప్రతి పనిలోనూ కమీషన్లు దండుకొని కోట్లకు పడగలెత్తారు. వంశధార గర్భశోకం మండలంలోని సింగూరు, బొడ్డేపల్లి, బెలమాం సమీపంలోని మూడు ఇసుక ర్యాంపులు ప్రభుత్వ విప్ కూన రవికుమార్కు కోట్ల రూపాయల కాసులు కురిపించాయి. జన్మభూమి కమిటీల సమక్షంలో నాగావళి నది తీరాన రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుకను జేసీబీలతో తవ్వి, రవికుమార్ అనుచరులు జగన్నాథం, సత్యం, గణపతి తదితరుల సహాయంతో ఇసుక దందా నడిపించారు. ఈ విషయమై పలుమార్లు అధికారులు హెచ్చరించినా వారిని కూడా భయపెట్టిన సంఘటనలు ఉన్నాయి. నిబంధనలు మేరకు ఉచితంగా ఇవ్వాల్సిన ఇసుకను ట్రాక్టర్కు రూ.3,500ల వరకు విక్రయించారు. రియల్ దందా ఎమ్మెల్యే కూన రవికుమార్ అండదండలతో పొందూరులో రియల్ ఎస్టేట్ దందా యథేచ్ఛగా సాగింది. ఉడా అనుమతులు లేకుండా భూములను ఇళ్ల స్థలాలుగా మార్చి అమ్మేశారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చకుండానే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రూ.కోట్లు కూడబెట్టారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఏమీ చేయాలేని పరిస్థితి కల్పించారు. జాగా కనిపిస్తే పాగా ఐదేళ్ల పాలనలో ఎక్కడ ఖాళీ భూమి కనిపించినా రవికుమార్, అతని అనుచరులు కబ్జా చేసేశారు. రాపాక కూడలికి సమీపంలో విలువైన స్థలాలను ఆక్రమించారు. పాన్పుల గెడ్డను కప్పేసి గృహాలు, దుకాణాలను నిర్మించేశారు. మిగిలిన కొద్దిపాటి గెడ్డను కూడా మరలా కప్పేసేందుకు ఇప్పటికీ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అలాగే విద్యుత్ పవర్ స్టేషన్ ఎదురుగా ఉన్న సుమారు రూ.10 కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అమ్మేందుకు సన్నాహాలు చేశారు. అయితే విషయం బయటకు తెలియడంతో అమ్మకాలు జరగకుండా అధికారులు నిలుపుదల చేశారు. కానీ ఈ స్థలం ఇంకా టీడీపీ నాయకుల ఆధీనంలోనే ఉంది. నీరు–చెట్టు కనికట్టు మండలంలోని 29 పంచాయతీల్లో నీరు–చెట్టు పనుల పేరుతో టీడీపీ నాయకులు తూతూమంత్రంగా పనులు జరిపి రూ.కోట్ల దోచుకున్నారు. చెరువులను అభివృద్ధి చేసే నెపంతో ప్రజల సొమ్మును అడ్డగోలుగా వెనకేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టకుండా, తీర్మానాలు చేయకుండానే పనులు జరిపారు. నిజానికి పనులను కూలీలతో చేయించాల్సి ఉన్నా మిషన్లుతో జరిపి కూలీలకు ఉపాధి లేకుండా చేశారు. నీరు–చెట్టు వలన రవికుమార్ అనుచరులకు తప్ప రైతులకు ఎటువంటి మేలు జరగలేదని ఆయా గ్రామాల ప్రజలు విమర్శిస్తున్నారు. కమీషన్లకే కొత్త పనులు మండలంలోని రెల్లుగెడ్డ ప్రాజెక్టును ఆధునికీరించేందుకు ప్రభుత్వం రూ.11 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీనిలో భాగంగా గెడ్డకు ఇరువైపులా గట్లను పటిష్టం చేయడం, సిమ్మెంట్ గోడలు నిర్మించడం, చెక్ డ్యాంలు నిర్మించడం వంటి పనులను చేయాలి. అయితే నిధులను దోచేయాలనే తాపత్రయంతో పనులను సగం కూడా జరిపించిన పాపాన పోలేదు. తాడివలస వద్ద చెక్డ్యాం, గేట్లు, సిమ్మెంట్ వాల్ను రూ.కోటి లతో నిర్మించగా నిర్మించిన నెల రోజులకే అది కూలిపోయింది. కూలిపోయి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పునరుద్ధరించలేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏడి ‘పింఛెన్’ గ్రామాల్లోని జన్మభూమి కమిటీల సభ్యులు పింఛన్లు విషయంలో ఏకపక్షంగా వ్యవహరించారు. టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నవారి పింఛన్లను తొలగించారు. దీంతో అనేక మంది లబ్ధి దారులకు పింఛన్లు అందక ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఈ విషయమై వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, ఎంపీపీ ప్రతినిధి సువ్వారి గాంధీ బాధిత పింఛన్దారుల తరుపున జన్మభూమి కమిటీలకు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లి పోరాడి 470 మంది పింఛన్లను బకాయిలతో సహ ఇప్పించేందుకు కృషి చేశారు. అయినప్పటికీ ఇంకా చాలా మంది అర్హులకు పింఛన్లు అందడం లేదు. అధికారులు హెచ్చరించినా ఆగలేదు సింగూరు, బొడ్డేపల్లి, బెలమాం సమీపంలోని ఇసుక ర్యాంపులను అధికారులు పలుమార్లు మూయించారు. కానీ మూసిన రెండు రోజుల్లోనే విప్ రవికుమార్ మరలా తెరిపించేవారు. నదీ గర్భాలను కొల్లగొట్టి అధిక ధరలకు ఇసుకను విక్రయించారు. ఇప్పటికీ ఇసుక దందా కొనసాగుతూనే ఉంది. – బొడ్డేపల్లి రమణ, బొడ్డేపల్లి గెడ్డలను ఆక్రమించేశారు రాపాక సెంటర్లో పాన్పుల గెడ్డను టీడీపీ నాయకులు ఆక్రమించి బిల్డింగులు కట్టేశారు. నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, కుమ్మరి, ముస్లింలు ఎంతో మంది భూమిలేని పేదలున్నారు. వారికి భూమి ఇచ్చేందుకు అధికారులకు నిబంధనలు గుర్తుకొస్తున్నాయి. టీడీపీ నాయకులు గెడ్డలను ఆక్రమించుకుంటుంటే మాత్రం నిబంధనలు కనిపించకపోవడం దారుణం. – కొంచాడ రమణమూర్తి, రాపాక -
దత్తత మాట గుర్తేలేదు
సాక్షి, శ్రీకాకుళం : మాట్లాడితే అక్కడ అభివృద్ధి చేశాం. ఇక్కడ అభివృద్ధి చేశామని బీరాలు పలికే ప్రభుత్వ విప్ కూన రవికుమార్ వారి సొంత గ్రామం, దత్తత గ్రామాలనే గాలికొదిలేశారు. దీంతో తల్లికి తిండి పెట్టనోడు పిన తల్లికి గాజులు పెడతాడా అంటూ ఆయా గ్రామాల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి సంగతి దేవుడెరుగు కనీసం మౌలిక వసతులు కల్పించండి మహా ప్రభో అంటూ వేడుకుంటున్నారు. ప్రభుత్వ విప్ కూన రవికుమార్ సొంత గ్రామం పెనుబర్తి. ఈ గ్రామాన్ని సందర్శించిన వారెవరైనా అయ్యోపాపం అనే అంటారు. ఎందుకంటే ఆ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. గ్రామంలో కనీస వసతులు కరువయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ గ్రామాన్ని కూన రవికుమార్ కుటుంబమే గత 15 ఏళ్లుగా పాలిస్తున్నారు. అయినప్పటికీ అభివృద్ధి మాత్రం ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. అన్నీ అవస్థలే పెనుబర్తి గ్రామాన్ని సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. గ్రామానికి కనీసం పంచాయతీ భవనం లేకపోవడం దారుణం. కొన్ని వీధుల్లో మురికి కాలువలు లేకపోవడంతో మురుగు రోడ్డు మీదనే నిలిచిపోతోంది. అంగన్వాడీ భవనాలు లేకపోవడంతో ఒకటో నంబర్ అంగన్వాడీ కేంద్రాన్ని పెనుబర్తి ప్రాథమిక పాఠశాలలో, రెండో నంబర్ అంగన్వాడీ కేంద్రాన్ని ఐఆర్పురం ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్నారు. ఇకపోతే గ్రామంలోకి ప్రవేశించే రహదారి పూర్తిగా రాళ్లు తేలి అధ్వానంగా ఉంది. అలాగే ఆరేళ్ల క్రితం నిర్మించిన ఆరోగ్య ఉపకేంద్రం ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు. పశువుల ఆస్పత్రి శిథిలావస్థకు చేరుకుంది. శ్మశాన వాటికకు వెళ్లేందుకు రహదారి లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల బిల్లులు అందలేదని స్థానికులు వాపోతున్నారు. బిల్లులు అందించడంలో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అర్హులకు పింఛన్లు అందడం లేదని, ఎరువులను ఎక్కువ ధరకే కొనాల్సి వస్తోందని వాపోతున్నారు. కబ్జాల్లో మాత్రం ముందంజ దత్తత గ్రామం అభివృద్ధికి నోచుకోపోయినా భూకబ్జాలకు నిలయంగా మారిందని ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చిట్టివలస గ్రామం సంగమేశ్వర కొండ ప్రాంతానికి దగ్గరగా ఉండటంతో వందల ఎకరాల్లో ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూముల్లో పట్టాలు మంజూరు చేయకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ అధికారుల ఒత్తిళ్లకు, మామూళ్లకు తలొగ్గిన రెవిన్యూ అధికారులు సుమారు 10 ఎకరాల కొండ భూమిలో టీడీపీ కార్యకర్తలకు పట్టాలు మంజూరు చేశారు. దీంతో భూమిని కబ్జా చేసుకుని దత్తత గ్రామాన్ని కబ్జా పర్వంలో ముందంజలో ఉంచారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటను అమ్ముకోలేక పోయాం ఈ ఏడాది వరి పంటను పండించినప్పటికీ అమ్ముకోలేకపోయాం. ధాన్యం కొనుగోలుకు కూడా ఎమ్మెల్యే ఎటువంటి సాయం చేయలేదు. సొసైటీలు ద్వారా యూరియా రూ.320లకు కొనుగోలు చేశాం కానీ అదే యూరియా బయట రూ.300లకే దొరికింది. విత్తనాలను కూడా అధిక ధరలకే అమ్మారు. గ్రామాన్ని, రైతులను ఆదుకోవడానకి ఆయన దృష్టి సారించలేదు. – కూన రాజ్కుమార్, రైతు, పెనుబర్తి -
విప్ దౌర్జన్యం నశించాలి
శ్రీకాకుళం, పొందూరు: ప్రభుత్వ విప్ కూన రవికుమార్ వైఎస్సార్ సీపీ కార్యకర్త గంగిరెడ్ల శివకుమార్పై ఫోన్లో బెదిరింపులకు పాల్పడటంతో పార్టీ శ్రేణులు అండగా నిలబడ్డాయి. వైఎస్సార్సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేనీ సీతారాం ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్ నుంచి బస్టాండ్, మార్కెట్, పోస్టాఫీసు, జూనియర్ కళాశాల మీదుగా పోలీసు స్టేషన్ వరకు సోమవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. విప్ కూన రవికుమార్ డౌన్ డౌన్.. దౌర్జన్యం నశించాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ఎస్ఐ బాలరాజు లేరని హెచ్సీ బాదుషా చెప్పడంతో అక్కడే బైఠాయించారు. ఎస్పీ, ఎస్ఐలతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం హెడ్ కానిస్టేబుల్కు ఫిర్యాదునిచ్చి రసీదును తీసుకున్నారు. ప్రభుత్వ విప్ కూన రవికుమార్తో ప్రాణభయం ఉందని, తనకు రక్షణ కల్పించాలని శివకుమార్ పోలీసులను కోరారు. అనంతరం మహారాజా మార్కెట్కు వెళ్లి బహిరంగ సమావేశం నిర్వహించారు. బహిరంగ చర్చకు సిద్ధమా.. ఈ సందర్భంగా తమ్మినేనీ సీతారాం మాట్లాడుతూ రవికుమార్ వ్యవహారం ఆరిపోయే ముందు వెలుగుతున్న దీపంలా ఉందని విమర్శించారు. ఓటమి భయంతోనే బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దొరికిపోయినట్లు.. ఇప్పుడు రవికుమార్ అడ్డంగా బుక్కయ్యారని పేర్కొన్నారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. అయినా బీసీ కార్పొరేషన్ రుణం ఇప్పించాననడం విప్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు హానితలపడితే సహించేది లేదన్నారు. ఎంపీపీ ప్రతినిధి సువ్వారి గాంధీ మాట్లాడుతూ రౌడీరాజకీయాలు చేసి లబ్ధిపొందాలంటే పొందూరు మండలంలో కుదరదని చెప్పారు. వైఎస్సార్సీపీ నాయకులు పప్పల వెంకటరమణమూర్తి మాట్లాడుతూ గొయ్యితీసి పాతేసే రాజకీయాలు తమ వద్ద చెల్లవన్నారు. చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు కోరుకొండ సాయికుమార్ మాట్లాడుతూ దిగుజారుడు రాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు. మాజీ సర్పంచ్ గంగిరెడ్ల ఉమాదేవి మాట్లాడుతూ పొందూరులో బాలకృష్ణ డైలాగులు చెబితే జడిసేవారు లేరన్నారు. బాదితుడు శివకుమార్ మాట్లాడుతూ తమ్మినేనీ సీతారాం, సువ్వారి గాంధీ అడుగుజాడల్లో నడుస్తున్నానని, తానెవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు గాడు నాగరాజు, నాయకులు లోలుగు కాంతారావు, బీఎల్ నాయుడు, యతిరాజుల జగన్నాథం, పెద్దింటి వెంకట రవిబాబు, పప్పల దాలినాయుడు, పప్పల అప్పలనాయుడు, కూన కిరణ్, తమ్మినేని మురళీకృష్ణ, బొనిగి రమణమూర్తి, అనకాపల్లి గోవిందరావు, పోతురాజు సూర్యారావు, కొంచాడ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
‘జనమే నిన్ను పాతాళానికి తొక్కేస్తారు’
-
‘జనమే నిన్ను పాతాళానికి తొక్కేస్తారు’
సాక్షి, శ్రీకాకుళం : టీడీపీ జెండా పట్టుకోకపోతే పాతాళానికి తొక్కేస్తా అంటూ వైఎస్సార్సీపీ కార్యకర్త గంగిరెడ్ల శివను.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ కూన రవి కుమార్ బెదిరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోన్ ఆడియో సోషల్ మీడియాలో విస్తృతంగా తిరుగుతోంది. రవి బెదిరింపుల పట్ల ఆమదాలవలస, పొందూరులలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కూన రవిపై కేసు నమోదు చేయాలని పొందూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించింది. అనంతరం వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు తమ్మినేని సీతారాం అధ్వర్యంలో పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీతారాం మీడియాతో మాట్లాడుతూ.. అధికార మదంతో ఇష్టానుసారం మాట్లాడితే తగిన బుద్ధి చెప్తామని రవిని హెచ్చరించారు. ప్రతి కార్యకర్తకు, అభిమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కూన రవి కుమార్ పద్దతి మార్చుకోకపోతే జనమే ఆయన్ని పాతాళానికి తొక్కేస్తారని హెచ్చరించారు. (టీడీపీ జెండా పట్టుకో లేదంటే.. వెంటాడి వేటాడుతా) -
ప్రభుత్వ విప్ కూన రవికుమార్ బూతు పురాణం
-
అసెంబ్లీ సాక్షిగా బీసీ సబ్ప్లాన్ బిల్లు డ్రామా బట్టబయలు
-
అసెంబ్లీ సాక్షిగా బీసీ సబ్ప్లాన్ బిల్లు డ్రామా బట్టబయలు
సాక్షి, అమరావతి : అసెంబ్లీ సాక్షిగా బీసీ సబ్ప్లాన్ బిల్లు డ్రామా బట్టబయలు అయింది. నిధులు ఎంతిస్తారో చెప్పకుండా బీసీ సబ్ప్లాన్ బిల్లును ప్రభుత్వం రూపొందించింది. బీసీ సబ్ప్లాన్పై అసెంబ్లీలో ప్రభుత్వ విప్ కూన రవి కుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం చెప్పలేకపోయారు. బీసీ సబ్ప్లాన్ బిల్లుపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ కూన రవికుమార్.. బీసీ సబ్ప్లాన్ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సబ్ప్లాన్లోని నిధులు జనాభా ప్రాతిపదికన ఇస్తారా?, రిజర్వేషన్ ప్రకారం ఇస్తారా? అని విప్ కూన ప్రశ్నించారు. దీనికి మంత్రి సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. మధ్యలో మంత్రి పితాని సత్యనారాయణ కలుగజేసుకొని.. బిల్లులో అంకెలు లేవని చెప్పబోయారు. దీన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ తప్పుబట్టారు. కాగా బీసీ సబ్ప్లాన్ బిల్లు గొడవపై ఉలిక్కిపడ్డ సీఎం చంద్రబాబు నాయుడు.. మంత్రులు, అధికారులను ఛాంబర్కు పిలిపించుకొని మాట్లాడారు. బిల్లులో లోపం ఉందని చంద్రబాబుకు అధికారులు తెలిపారు. దీంతో బీసీ వెల్ఫేర్, లాసెక్రటరీలను పిలిచి మాట్లాడారు. అనంతరం ఎంత శాతం నిధులు కేటాయిస్తారో చెప్పకుండానే బిల్లును ఆమోదింపజేశారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ప్రశ్నించిన కూన రవిపై చంద్రబాబు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. సీఎంతో మాట్లాడాక కూన రవి మెత్తపడ్డారు. ఏదో ఒక ప్రాతిపదికన నిధులు కేటాయించాలని రవి కోరారు. దీంతో మూడో వంతు బడ్జెట్ కేటాయింపుపై సవరణ చేస్తామని చెప్పి బిల్లును ఆమోదించారు. -
ప్రభుత్వ విప్ కూన రవికుమార్కు చేదు అనుభవం
ప్రభుత్వ విప్ కూన రవికుమార్కు చేదు అనుభవం ఎదురైంది. లోలుగు గ్రామంలో ఆదివారం నిర్వహించతలపెట్టిన పసుపు–కుంకుమ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆయన్ని తెలుగుదేశం పార్టీలోని ఓ వర్గం కార్యకర్తలే అడ్డుకున్నారు. తమ గ్రామానికి ఏం చేశారంటూ నిలదీశారు. కుర్చీలను, ఫైళ్లను గాల్లోకి విసిరారు. టెంట్లను కూల్చేశారు. రవికుమార్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఓ దశలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకే పార్టీలోని ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలు కొట్టుకున్నారు. దీంతో ప్రత్యేక పోలీసు బలగాలు గ్రామానికి హుటాహుటీన చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. భారీ బందోబస్తు మధ్య రవికుమార్ అక్కడ నుంచి వెళ్లిపోయారు. పసుపు–కుంకుమ కార్యక్రమాన్ని అధికారులు కూడా రద్దు చేసి వెళ్లిపోయారు. శ్రీకాకుళం, పొందూరు: లోలుగు గ్రామంలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార పార్టీకి చెందిన కార్యకర్తల మధ్య ఉన్న విభేదాలు భగ్గుమనడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. పసుపు–కుంకుమ కార్యక్రమం నిర్వహించేందుకు ప్రభుత్వ విప్ కూన రవికుమార్ టెంట్లోకి వచ్చి అందరికీ నమస్కారం అని చెప్పేసరికే ఒక్కసారిగా అక్కడ ఉన్న ఓ వర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. రవికుమార్ గో బ్యాక్, రవికుమార్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమాన్ని జరిపితే ఒప్పుకోమని హెచ్చరించారు. టెంట్లు పీకిపడేశారు. కుర్చీలను గాల్లోకి ఎగరేశారు. అధికారుల చేతిలో ఉన్న ఫైళ్లను లాక్కొని విసిరేశారు. రవికుమార్ను బండ బూతులు తిట్టారు. తమ నాయకుడు శ్రీరాములనాయుడ్ని, గ్రామాన్ని విస్మరించి ఇప్పుడేమో కార్యక్రమానికి వస్తావా అని నిలదీశారు. గ్రామాన్ని సర్వనాశనం చేశావు, భ్రష్టుపట్టించావని ఆవేశంతో ఊగిపోయారు. తోపులాటకు దిగారు. దీంతో టీడీపీలో ఒక వర్గానికి చెందిన వారి నుంచి రవికుమార్కు మరో వర్గం వారు రక్షణ కల్పించాల్సి వచ్చింది. మహిళలు, మగవాళ్లు తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేశారు. మాకొద్దీ కార్యక్రమం అంటూ నిరసన వ్యక్తం చేశారు. లోలుగు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, పొందూరు జెడ్పీటీసీ సభ్యుడు లోలుగు శ్రీరాములు నాయుడుకు విప్ ప్రాధాన్యత ఇవ్వకుండా అదే గ్రామానికి చెందిన కామరాజు వర్గానికి బాసటగా నిలుస్తున్నారనే ఆరోపణలతో ఒక వర్గాన్ని మరో వర్గం తిట్టుకుంటూ, తోసుకుంటూ గొడవను పెంచారు. ఒకానొక దశలో శ్రీరాములునాయుడు, కామరాజు వర్గాయులు కొట్టుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో అప్రమత్తమైన అక్కడ ఉన్న మండలాధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే ఎచ్చెర్ల నుంచి ప్రత్యేక పోలీసు బలగాలు లోలుగు గ్రామానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేసింది. అయితే జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరాములనాయుడు వర్గీయులు మాత్రం అసహనాన్ని, నిరసనను ఆపలేదు. దీంతో మరో టీడీపీ నాయకుడైన మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నెపు రాము, అధికారులు కలిసి ఇరువర్గీయులను శాంతింపజేశారు. మహిళలకు విప్ రవికుమార్తో సమస్యలు చెప్పుకొనేందుకు అవకాశం కల్పించారు. మహిళలంతా కూర్చొంటుండగా కొంతమంది కార్యకర్తలు అడ్డు చెప్పడంతో కొద్ది క్షణాల్లోనే మళ్లీ వివాదం రేగింది. మహిళలంతా తమ గ్రామానికి ఏం చేశావంటూ విప్ రవికుమార్ను నిలదీశారు. అధికారులు, పోలీసులు ఎంత చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. రవికుమార్ అక్కడ నుంచి వెళ్లిపోయే వరకూ నిరసన తెలియజేస్తూనే ఉన్నారు. దీంతో పోలీసులు రవికుమార్ను తన కాన్వాయ్లోని కారులో కూర్చోబెట్టి రోడ్డు దాటించేశారు. అయితే రోడ్డు దాటేంత వరకు రవికుమార్ డౌన్ డౌన్ అంటూ ఆయన వ్యతిరేకులు నినాదాలు చేస్తూనే ఉన్నారు. జేఆర్పురం సీఐ విశ్వేశ్వరరావు, లావేరు ఎస్సై చిరంజీవి, ఎచ్చెర్ల ప్రత్యేక బలగాలు శాంతి భద్రతలను కాపాడారు. గ్రామంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో మండల ప్రత్యేకాధికారి మెట్ట వెంకటేశ్వరరావు, ఎంపీడీవో చింతాడ లక్ష్మీభాయ్, ఏపీఎం మంగమ్మ, వెలుగు సీసీ శ్యామలరావు కూడా కార్యక్రమాన్ని నిర్వహించకుండానే వెళ్లిపోయారు. -
‘పసుపు–కుంకుమ’లో రికార్డింగ్ డ్యాన్స్
సాక్షి, అమరావతి/పొందూరు: రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం పసుపు– కుంకుమ కోసం ఏర్పాటు చేసిన వేదికలు పలుచోట్ల అపహాస్యం పాలయ్యాయి. డ్వాక్రా సంఘాల్లో మహిళలకు పసుపు– కుంకుమ కింద పోస్టు డేటెడ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి గ్రామానికి సగటున రూ. 25 వేలు చొప్పున గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ నిధులు మంజూరు చేసింది. మరోపక్క జాతీయ జీవనోపాధుల పథకం (ఎన్ఆర్ఎల్ఎం) అమలుకు రాష్ట్రానికి కేంద్రమిచ్చిన రూ. 31.60 కోట్లు ఈ కార్యక్రమానికి మళ్లించారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఈ డబ్బులతో గ్రామాల్లో ఏర్పాటుచేసిన వేదికలను కొన్నిచోట్ల స్థానిక టీడీపీ నేతలు, జన్మభూమి కమిటీ సభ్యులు రికార్డింగ్ డాన్స్లకు వేదికలుగా మార్చారు. పట్టపగలే మహిళల రికార్డింగ్ డాన్స్లు చేస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే, ప్రభుత్వ డబ్బులతో ఏర్పాటు చేసిన అధికారిక వేదికలపై టీడీపీ నేతలు రికార్డింగ్ డాన్స్లు వేయిస్తుంటే ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు అనుమతి తెలుపుతోందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ విప్ ‘కూన’కు చేదు అనుభవం ప్రభుత్వం విప్ కూన రవికుమార్కు సొంత పార్టీ కార్యకర్తల నుంచే చేదు అనుభవం ఎదురైంది. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలోని లోలుగు గ్రామంలో ఆదివారం నిర్వహించిన పసుపు–కుంకుమ కార్యక్రమం జరగకుండా అడ్డుకొన్నారు. రవికుమార్ టెంట్లోకి అడుగుపెడుతుండగానే తమ గ్రామాన్ని పట్టించుకోకపోవడంతో పాటు, టీడీపీ స్థానిక నేత లోలుగు శ్రీరాములనాయుడుకు ప్రాధాన్యత నివ్వకపోవడంపై ప్రశ్నించారు. అయితే రవికుమార్ ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన కొంతమంది కార్యకర్తలు టెంట్లు పీకేశారు. కుర్చీలు లాగేశారు. ఫైళ్లు విసిరేసారు. డౌన్ డౌన్ రవికుమార్ అంటూ నినాదాలు చేశారు. రవికుమార్ గోబ్యాక్ అంటూ నిరసన తెలియజేశారు. దీంతో పసుపు–కుంకుమ చెక్కుల పంపిణీ కార్యక్రమం పూర్తికాలేదు. దీంతో చేసేదిలేక పోలీసు బందోబస్తు మధ్య విప్ రవికుమార్ వెళ్లిపోయారు. -
తప్పుడు పని.. చేయక తప్పడం లేదు
ఆమదాలవలస: ‘ఇసుక అక్రమ రవాణా తప్పుడు పని.. అయినా చేయక తప్పడం లేదు’ అని ప్రభుత్వ విప్ కూన రవికుమార్ బహిరంగ వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని తన నియోజకవర్గం ఆమదాలవలసలో సుమారు 400 మంది ట్రాక్టర్ యజమానులు, వారి కుటుంబాలు కాళ్ల వేళ్ల పడుతుంటే ఇసుక అక్రమ రవాణాకు అడ్డుచెప్పలేదన్నారు. శుక్రవారం ఆమదాలవసలోని అశోక పబ్లిక్ స్కూల్ ఆవరణలో నిర్వహించిన టీడీపీ మినీ మహానాడు కార్యక్రమంలో కూన రవికుమార్ మాట్లాడారు. ట్రాక్టర్ యజమానుల కుటుంబాలు ఇసుక రవాణాతోనే బతుకుతున్నాయని.. అందుకే ర్యాంపుల్లోకి ఏ అధికారి వెళ్లి దాడులు నిర్వహించొద్దని హెచ్చరించినట్టు ఆయన అంగీకరించారు. అభివృద్ధిని చూడలేక కొన్ని పత్రికలు, కొంతమంది ప్రతిపక్ష నాయకులు తనపై బురద జల్లుతున్నారని చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యేల పేరిట టిప్పర్ల దూకుడు
బూర్జ : మండలంలోని కాఖండ్యాం ఇసుక ర్యాంపువద్ద ఎమ్మెల్యే కూన రవికుమార్ పేరు చెప్పి కొంత మంది టిప్పరు డ్రైవర్లు దూసుకు పోతున్నారని లారీ డ్రైవర్లు మంగళవారం సాయంత్రం ఉవ్వపేట వద్ద ఆందోళన చేశారు. అధికార పార్టీకి చెందిన రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పిన వారికే ఇక్కడ ఇసుక వెనువెంటనే లోడ్చేసి పంపిస్తున్నారని, రికమండేషన్ లేనివారికి 5 నుంచి వారం రోజులు వరకు వేచి ఉండా ల్సి వస్తోందని విశాఖ, విజయవాడ, పలాస, నరసన్నపేట వంటి దూరప్రాంతాల నుంచి వచ్చిన లారీ డ్రైవర్లు గగ్గోలు పెట్టారు. ఇసుక ర్యాంపుల వద్ద స్థానికుల హవా కొనసాగుతోందని, ఈ ర్యాంపులో వారి ఇష్టానుసారంగా జరుగుతోందని, ఏ ఒక్క టిప్పరునూ విడిచి పెట్టేదిలేదని ఆగ్రహిస్తూ రోడ్డుపై లారీలను అడ్డంగా పెట్టారు. ఇక్కడ తినటానికి కూడా ఏమీ దొరక్క తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని మమ్మ ల్ని పట్టించుకునే నాథుడే కరువయ్యారని వారు వాపోయారు. దీనిపై ఇసుక రీచ్ నిర్వహిస్తున్న గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు మామిడి కమల వద్ద ప్రస్తావించగా కొన్ని టిప్పర్లు ఎమ్మెల్యేల పేర్లు చెప్పి వస్తున్నాయని, ఏమీ అనలేక వారి టిప్పర్లు ముందుగా లోడ్చేసి పంపిస్తున్నమాట వాస్తవమేనని చెప్పారు. రెండు జేసీబీల వల్ల సకాలంలో ఇసుకను లోడ్ చేయలేకపోతున్నామని మరో జేసీబీ అవసరముంటుందని చెప్పారు. ఈ విషయమై సంబంధిత శాఖ అధికారులకు విన్నవించామని, బుధవారం నాటికి పంపిస్తామన్నారని ఆమె చెప్పారు. ఇక నుంచి జాప్యం జరగదని హామీ ఇవ్వటంతో లారీడ్రైవర్లు శాంతించారు. -
అచ్చెన్న+ కూన
టీడీపీలో అధికార కేంద్రాల మధ్య వర్గపోరు ఆరోగ్య మంత్రి ఎదుటే ఇరువురి సంవాదం గతంలో రిమ్స్ అభివృద్ధి కమిటీ భేటీలోనూ ఇదే సీన్ ఆమదాలవలసలో పెట్టాలని విప్ కూన రవి పట్టు ఎచ్చెర్ల లేదా అంపోలు ప్రాంతాలను సూచిస్తున్న మంత్రి అచ్చెన్న అంతా కలిసి నిర్ణయించండంటూ దాటవేసిన మంత్రి కామినేని రిమ్స్ క్యాంపస్: రెండు అధికార కేంద్రాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చాక జిల్లా నుంచి మంత్రిగా అచ్చెన్నాయుడుకు.. ప్రభుత్వ విప్గా కూన రవికుమార్ నియమితులయ్యారు. పోటాపోటీగా సమీక్షలు నిర్వహిస్తూ హవా చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న వీరద్దరి మధ్య నర్సింగ్ కళాశాల అంశం వివాదం రాజేస్తోంది. తాము చెప్పిన చోటే కళాశాలను ఏర్పాటు చేయాలని ఎవరికి వారు పట్టుపడుతున్నారు. చివరికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మంగళవారం రిమ్స్లో జరిపిన సమీక్ష సమావేశంలోనూ వీరి మధ్య నెలకొన్న వివాదంబయటపడింది. దీంతో ఇదే చర్చనీయాంశంగా మారింది. కళాశాల మంజూరైనప్పటి నుంచీ.. శ్రీకాకుళంలోని రిమ్స్కు అనుబంధంగా నర్సింగ్ కళాశాల మంజురైంది. తొలుత రిమ్స్ ఆవరణలోనే దీన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ అం దుకు అవసరమైన ఐదు ఎకరాల స్ధలం రిమ్స్లో లేకపోవటంతో అధికారు లు స్థలాన్వేషణలో పడ్డారు. తాత్కాలికంగా రిమ్స్లోని స్టాఫ్ నర్సుల క్వార్టర్లను హాస్టల్గా మార్చి, వైద్య కళాశాలలోనే నర్సింగ్ కళాశాలను కూడా నడుపుతున్నారు. ఈ క్రమంలో జిల్లా అధికారులు ఎచ్చెర్లలోని కొండపై స్థలాన్ని పరిశీలించారు. మరోవైపు ఆమదాలవలసలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వ విప్ కూన రవికుమార్ తెరపైకి తెచ్చారు. అక్కడితో ఆగకుండా ఆమదాలవలసలోనే నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామంటూ అక్కడ జరిగిన పలు సమావేశాల్లో ఆర్భాటంగా ప్రకటించేశారు కూడా. ఇటీవల జరిగిన రిమ్స్ అభివృద్ధి కమిటీ సమావేశంలో నూ ఈ విషయం ప్రస్తావించారు. ఎచ్చెర్లలో ఇప్పటికే యూనివర్సిటీ, గురుకులంతోపాటు ఎన్నో పరిశ్రమలు ఉన్నందున నర్సింగ్ కళాశాలను ఆమదాలవలసలో ఏర్పాటు చేయాలని కోరారు. శ్రీకాకుళం నుంచి ఆమదాలవలస, ఎచ్చెర్ల రెండూ సమాన దూరంలో ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆ సమావేశంలో ఉన్న మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే స్పందిస్తూ.. అక్కడెక్కడో ఆమదాలవలసలో ఎలా పెడతారని అంటూ.. ఎచ్చెర్లలోనే ఏర్పాటు చేస్తారని బదులిచ్చారు. ఎచ్చెర్లలోనే ఏర్పాటు చేయండంటూ అక్కడే కలెక్టర్కు సూచించారు. వీరిద్దరి సంవాదంతో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ నివ్వెరపోయారు. ఆరోగ్యశాఖ మంత్రి ముందూ అదే తీరు అభివృద్ధి కమిటీ సమావేశంలో మొదలైన వివాదం తిరిగి మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ముందుకొచ్చింది. రిమ్స్పై సమీక్షిస్తున్న సందర్భంగా నర్సింగ్ కళాశాలను త్వరగా ఏర్పాటు చేయాలని రిమ్స్ అధికారులు మంత్రిని కోరారు. వెంటనే కూన రవికుమార్ జోక్యం చేసుకొని ‘సార్ మంత్రిగారు.. నర్సింగ్ కళాశాలను ఆమదాలవలసలో ఏర్పాటు చేయం డి’ అని కోరారు. ఆ వెంటనే మంత్రి అచ్చెన్నాయుడు మైక్ ఆన్ చేసి ‘కళాశాల ఏర్పాటుకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అంపోలు దారిలో స్థలం చూశారని.. దాన్ని ఆర్డీవో పరిశీలించారని అంటూ.. వీలైతే అక్కడ ఏర్పాటు చేయండి.. అది కాకపోతే ఎచ్చెర్లలో ఏర్పాటు చేయాలి’ అని సూచించారు. ఈ సందర్భంగా అచ్చెన్న, రవికుమార్లు తమ ప్రతిపాదనకు మద్దతుగా పోటాపోటీగా వాదించడం మొదలుపెట్టారు. వ్యవహారం ముదురుతున్నట్లు గమనించిన మంత్రి కామినేని అందరి ముందు చర్చించటం సరికాదని, వేరేగా కూర్చొని మాట్లాడుకుందామంటూ అడ్డుకట్ట వేశారు. మీరంతా నిర్ణయించుకుని ఎక్కడ పెట్టాలో చెబితే.. అక్కడే పెడదామంటూ ఆ అంశాన్ని దాటవేశారు. ఈ వాగ్వాదాన్ని చూసి జిల్లా కలెక్టరుతో సహా రిమ్స్ అధికారులు విస్మయానికి గురయ్యారు. జిల్లాకు ప్రయోజనకారి అయిన నర్సింగ్ కళాశాల ఏర్పాటు విషయంలో ఈ వర్గపోరేంటంటూ పలువురు ముక్కున వేలేసుకున్నారు. -
మత పెద్దలతో మంతనాలు
శ్రీకాకుళం, న్యూస్లైన్:ఆమదాలవలస నియోజకవర్గంలో ఏమాత్రం పట్టు సాధించిలేకపోతున్న టీడీపీ పక్కదారులు వెతుకుతోంది. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. ఆ నియోజకవర్గ పరిధిలోని పొందూరు మండలంలో ఒక మతస్తులు గణనీయ సంఖ్యలో ఉండటంతో వారిని ఎలాగైనా మచ్చిక చేసుకునేందుకు పన్నాగం పన్నింది. అందులో భాగంగా టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ ఆ మత పెద్దలతో మంతనాలకు శ్రీకారం చుట్టారు. తన నియోజకవర్గ పరిధిలో అయితే అందరికీ తెలిసిపోతుందన్న ఉద్దేశంతో పక్కనే ఉన్న శ్రీకాకుళం పట్టణంలో వారితో భేటీ నిర్వహించారు. ఈ విషయం తెలుసుకొని సమాచార సేకరణకు వెళ్లిన ‘న్యూస్లైన్’ విలేకరిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడమే కాకుండా వెంట తరిమారు. శ్రీకాకుళం డీసీసీబీ కాలనీలో ఉన్న వికాస్ జూనియర్ కళాశాల పై అంతస్తులో మంగళవారం ఉదయం ఒక మతానికి చెందిన పెద్దలతో కూన రవికుమార్ సమావేశం నిర్వహించారు. సుమారు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. అనంతరం ఆల్పాహార విందు కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా కొంత డబ్బు కూడా ముట్టజెప్పినట్లు తెలిసింది. ప్రార్ధనల కోసం వచ్చే ఆ మతానికి చెందిన ఓటర్లను తమ పార్టీకే ఓటు వేసేలా మద్దతు కూడగట్టాలని టీడీపీ అభ్యర్థి వారిని కోరినట్టు సమాచారం. కాగా సమావేశం విషయం బయట ప్రపంచానికి తెలియకుండా, ఇతరులెవరూ ఆ లోనికి రాకుండా భవనం చుట్టూ కూన అనుచరులతో గట్టి కాపలా ఏర్పాటు చేశారు. వచ్చిన వారి వివరాలు ఆరా తీసి.. అన్ని నిర్దారించుకున్న తర్వాతే లోనికి అనుమతించారు. సమావేశం జరుగుతున్న విషయం తెలుసుకున్న ‘న్యూస్లైన్’ ప్రతినిధి అక్కడకు వెళ్లగా లోనికి అనుమతించలేదు. దాంతో సమీపంలో ఉన్న భవనం పై నుంచి ఫోటోలు తీస్తుండగా గమనించిన కొందరు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు. రైతుబజారు వరకు వెంబడించారు. ఈ సమావేశంలో ఆమదాలవలస టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్తో పాటు ఆ పార్టీ నాయకులు కిల్లి రామ్మోహన్రావు, తదితరులు పాల్గొన్నారు.