Lakshmi Parvathi
-
చంద్రబాబుది రాజకీయం కాదు.. బ్రోకరిజం: లక్ష్మీపార్వతి
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు చేసేది రాజకీయం కాదని.. బ్రోకరిజం అంటూ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఆడపిల్లల కన్నీళ్లు ఈ ప్రభుత్వానికి కనపఢం లేదని దుయ్యబట్టారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబుని మనిషిగా కూడా తాను గుర్తించటం లేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు వలన ఎల్లో మీడియా.. ఎల్లో మీడియా వలన చంద్రబాబు బతుకుతున్నారు. వీరి వలన ప్రజలకు ఎలాంటి మేలు జరగదంటూ ఆమె వ్యాఖ్యానించారు.‘‘చంద్రబాబుకు తన పాలన మీద నమ్మకం ఉంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలి. జనం ఎవరికి ఓట్లు వేస్తారో తేలుతుంది. లక్షన్నర కోట్లు అప్పులు చేసి ఏం చేశారు?. మీ జేబుల్లోకి వెళ్లాయా?. ప్రజలను పూర్తిగా మద్యం మత్తులోకి నెట్టేశారు, జనాన్ని మత్తులో పెట్టి పరిపాలన చేస్తున్నారు. రేషన్ డిపోలను టీడీపీ ఆఫీసుల్లో నిర్వహించటం ఈ పాలనలోనే చూస్తున్నాం. చంద్రబాబు పాలనలో రేపిస్టులు, దొంగలు కాలర్ ఎగురవేసుకుని తిరుగుతున్నారు. తిరుపతి లక్ష్మికి ఒక న్యాయం, ముంబాయి నటి జత్వానీకి ఇంకో న్యాయమా?’’ అంటూ లక్ష్మీపార్వతి నిలదీశారు.‘‘పరిపాలన చేసే అర్హత చంద్రబాబుకు లేదు. తిరుపతి లక్ష్మీ విషయంలో ప్రత్యేక కమిటీతో విచారణ జరపాలి. ఏబీ వెంకటేశ్వరరావు వంటి వ్యక్తి చేతిలో పెట్టి పోలీసు వ్యవస్థను నడపటం దారుణం. కులాల గురించి భయంకరంగా మాట్లాడిన వ్యక్తి ఏబీ వెంకటేశ్వరరావు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేయటం ఏంటి?. పిచ్చోడి చేతిలో రాయిలాగ ప్రభుత్వ పనితీరు మారింది. ఎన్టీఆర్ మంచిపాలనే ఇప్పటికీ ప్రజల్లో ఆయన ఉండటానికి కారణం. మరి చెప్పుకోవడానికి చంద్రబాబు ఏం పాలన చేస్తున్నారు. జీవిత చరమాంకంలో ఉన్న చంద్రబాబు ఇకనైనా మారాలి’’ అని లక్ష్మీ పార్వతి హితవు పలికారు.ఇదీ చదవండి: ఈ చంద్రబాబు ఛీటర్ కాదా?: వైఎస్ జగన్అధికారం కోసం చంద్రబాబు చేయని నీచపు పనలు లేవు. అబద్దాల కోటలో బతుకుతున్నాడు. తిరుపతి లడ్డూ నుంచి ప్రతి విషయంలోనూ అబద్ధాలే. లోకేష్ అవినీతి, అరాచకాలు విపరీతంగా ఉన్నాయి. నారావారి సంప్రదాయంలో చెడు మాత్రమే మిగిలింది. కన్నతండ్రిగా చంద్రబాబు లోకేష్ని కట్టడి చేయాలి. సనాతన ధర్మం అనే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు?. మహిళలపై అరాచకాలు జరుగుతుంటే ఎందుకు ప్రశ్నించటంలేదు?. తిరుపతిలో లక్ష్మిని కరిణ్రాయల్ అనేవాడు మోసం చేశాడు. తప్పు చేసిన వాడు రోడ్డు మీద తిరుగుతున్నాడు. బాధితురాలు జైలు పాలైంది. మిర్చి రైతులు ధరల్లేక అల్లాడిపోతుండే చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రజలంటే చంద్రబాబుకు గౌరవం లేదు’’ అని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. -
ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా లక్ష్మి పార్వతి హాట్ కామెంట్స్
-
నాపై సోషల్ మీడియాలో వేధింపులు.. బాబుకు బాధ్యత లేదా?: లక్ష్మీపార్వతి
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న వేధింపులపై స్పందించాల్సిన బాధ్యత మీకు లేదా చంద్రబాబు అని ప్రశ్నించారు నందమూరి లక్ష్మీపార్వతి(Lakshmi Parvathi). మీరు అనుకున్నా.. అనుకోకున్నా మీ అత్తగారిని కదా చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. అలాగే, ఎన్టీఆర్ గౌరవం కాపాడేలా తాను బ్రతుకుతున్నట్టు తెలిపారు.నేడు దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు (NTR) వర్ధంతి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు నందమూరి లక్ష్మీపార్వతి. ఇదే సమయంలో ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడ లక్ష్మీపార్వతి మాట్లాడుతూ..‘29 ఏళ్లుగా ఎన్టీఆర్కు దూరమై మనోవేదనకు గురవుతున్నాను. నా ఫోన్ నెంబర్ను ఎవరో టీడీపీ వాళ్లు సోషల్ మీడియాలో పెట్టారు. నిన్నటి నుంచి వరుసగా వెయ్యికిపైగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.మీరు అనుకున్నా.. అనుకోకున్నా మీ అత్తగారిని కదా చంద్రబాబు. ఇలాంటి అవమానం నాకు జరుగుతుంటే మీరు చూస్తూ ఉంటారా?. ఇన్నేళ్లు డబ్బులు ఉన్నా లేకున్నా ఎవరినీ చేయిచాచి అడగలేదు. ఎన్టీఆర్ గౌరవం కాపాడేలా బ్రతుకుతున్నాను. నామీద ఎందుకు మీకు కక్ష.. నేనేం తప్పు చేశాను. ఎన్టీఆర్ పేరుతో మీరంతా లక్షల కోట్లు సంపాదించారు. అలాగే పెద్దాయన్న సాగనంపారు. నాపై జరుగుతున్న వేధింపులపై స్పందించాల్సిన బాధ్యత మీకు లేదా చంద్రబాబు’ అని ప్రశ్నించారు.ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా ఆయనకు కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), కల్యాణ్ రామ్ (Kalyan Ram) పుష్ఫగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. వారితో పాటు నందమూరి బాలకృష్ణ (Nandmuri Bala Krishna), రామకృష్ణ (Rama Krishna)లు కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి నటుడిగా, నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ (NTR) ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. చంద్రబాబు కూడా ఎన్టీఆర్కు నివాళులు అర్పించనున్నారు. -
అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక చంద్రబాబు..?
-
గుర్తుపెట్టుకో.. జగన్ ఎవడ్నివదలడు.. వడ్డీతో కలిపి ఇచ్చేస్తాం
-
కూటమి ప్రభుత్వంపై లక్ష్మీ పార్వతి మండిపడ్డారు.
-
నీచపు చంద్రబాబుకు కాలమే బుద్ధి చెప్తుంది: లక్ష్మీపార్వతి
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్లో నీచమైన సామాజిక వ్యవస్థను తయారు చేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ మహిళా నేత లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఆమె శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కూటమి సర్కార్ ప్రజాసమస్యలను గాలికి వదిలేసింది. హామీల అమలుపై ప్రశ్నిస్తే.. అక్రమకేసులు పెడుతున్నారు. అర్థరాత్రి సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు. జగన్ను ఎదుర్కొనే దమ్ములేక కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు. పాలన చేతకాక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. నీచమైన సామాజిక వ్యవస్థను తయారు చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఎల్లో మీడియా సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తూనే ఉంది. బాబు, రామోజీ ఎన్ని కుట్రలు చేశారో నాకు తెలుసు. ఈనాడు పేపర్ కాదు.. విష పత్రిక. మార్గదర్శి పేరుతో ప్రజల సొమ్ము కొల్లగొట్టారు. ఈనాడులో ఎన్టీఆర్పై ఎన్నో దారుణమైన కార్టూన్లు వేశారు. ఎన్టీఆర్ను పిచ్చోడిలా చిత్రీకరించి బొమ్మలు వేశారు. ఈ మేరకు.. గతంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ను అవమానిస్తూ.. కించపరుస్తూ వేసిన కార్టూన్లను ఆమె మీడియాకు ప్రదర్శించి చూపించారామె. అలాగే.. దోచుకోవడం, వ్యవస్థలను మేనేజ్ చేయడమే బాబుకు తెలుసు. ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కల్యాణ్.. పారిపోయాడు. నీచపు చంద్రబాబుకు కాలమే బుద్ధి చెప్తుంది’’ అని లక్ష్మీపార్వతి అన్నారు. -
తుమ్మితే జగన్... ఎక్కిళ్ళు వస్తే జగన్.. చంద్రబాబు పై లక్ష్మీ పార్వతి ఫైర్
-
చంద్రబాబుకు నిలువెల్లా విషమే: లక్ష్మీపార్వతి ఆగ్రహం
సాక్షి, తాడేపల్లి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు ఎంత నీచానికైనా వెనుకాడడు అంటూ తీవ్ర విమర్శలు చేశారు.లక్ష్మీపార్వతి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు ఇవాళ దేవుడితో ఆటలాడుతున్నాడు. లడ్డూ తయారీలో ఎలాంటి కల్తీ నెయ్యి వాడలేదు. ఇది వందల ఏళ్లుగా అనవాయితీగా వస్తోంది. చంద్రబాబు హయాంలో నెయ్యిలో కల్తీ జరిగితే వైఎస్ జగన్పై నింద వేస్తున్నారు. చంద్రబాబు వల్ల తిరుమల గోవిందుడికి కళంకం వచ్చింది. స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు ఎంత నీచానికి అయిన వెనుకాడడు. చంద్రబాబుకు నిలువెల్లా విషమే ఉంటుంది’ అంటూ విమర్శించారు. ఇది కూడా చదవండి: తిరుమల లడ్డూపై మరో మారు చంద్రబాబు అబద్ధాలు -
చంద్రబాబు దేవుడితో కూడా ఆటలు అడుతున్నాడు: లక్ష్మీపార్వతి
-
KSR Live Show: రాష్ట్రాన్ని పాలిస్తున్నది చంద్రబాబు కాదు.. వెనక ఉన్నది ఎవరో చెప్పిన లక్ష్మీ పార్వతి
-
మంచి పరిపాలన వైఎస్ జగన్ కే సాధ్యం
-
ఎన్టీఆర్ ఆశీస్సులతో సీఎం జగన్ ప్రమాణస్వీకారం
-
ఎన్టీఆర్ స్మరణలో కుటుంబ సభ్యులు.. 101 జయంతికి ఘాట్ వద్ద నివాళులు (ఫొటోలు)
-
హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు
-
జగన్కు ఎన్టీఆర్ ఆశీస్సులున్నాయి: లక్ష్మీపార్వతి
హైదరాబాద్, సాక్షి: టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి నేడు(మే 28). ఈ సందర్భంగా ఆయన సతీమణి, వైఎస్సార్సీపీ నేత లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్లో మరోసారి మంచి పరిపాలనే నడుస్తుందని ఈ సందర్భంగా ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘వైఎస్ జగన్కు ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయి. జూన్ 4 తర్వాత జగన్ సీఎంగా ప్రమాణం చేస్తారు. ఏపీలో మళ్లీ మంచి పరిపాలన వస్తుంది’’ అని అన్నారామె. అంతకు ముందు.. మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్లు ఎన్టీఆర్కు నివాళులర్పించారు. తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకుని తాతను స్మరించుకున్నారు.ఇదీ చదవండి: మహోన్నత వ్యక్తిత్వం... మేరునగ ధీరత్వం! -
మహోన్నత వ్యక్తిత్వం... మేరునగ ధీరత్వం!
‘న నిశ్చితాత్ విరమంతి ధీరాః’ అని భర్తృహరి చెప్పినట్లు... తలపెట్టిన కార్యాన్ని సాధించే వరకు ధీరులు తమ ప్రయత్నాలను ఎన్ని ఇబ్బందులెదురైనా నిలబడి సాధిస్తారు. వెనక్కు తగ్గరు. అందుకు ఉదాహరణ ఎన్టీఆర్. ఆశయం లేని అడుగులు బురద గుంటలో ప్రయాణం లాంటివనీ, గమ్యం చేరవనీ నమ్మి ఆచరించిన వ్యక్తుల్లో ఎన్టీఆర్ అగ్రస్థానంలో నిలుస్తారు. గొప్ప మనసున్న తండ్రి ఆయన. భార్యను ప్రేమించి గౌరవించే మహోన్నత సంస్కారం ఆయనది. పేద ప్రజల్ని కన్న బిడ్డల్లాగా పరిపాలించారు. అవినీతి రహితమైన సమాజాన్ని ఏర్పరచటానికి చిత్తశుద్ధితో పాటుపడ్డారు. అందుకే – మరణించిన తరువాత కూడా ఆ మహోన్నత వ్యక్తి నేటికీ జీవించే ఉన్నారు.తెలుగు రాష్ట్రంలో కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో 1923 మే 28న జన్మించిన మహానేత ఎన్టీఆర్ గారికి నేటికి 101 సంవత్సరాలు. అయినా ఇప్పటికీ ఆయన దివ్య తేజస్సు తగ్గలేదు. మరణించి 28 సంవత్సరాలు అయినా ఎన్టీఆర్ పేరు అభిమానుల గుండెల్లో మారుమ్రోగుతూనే వుంది. ఆ రూపం అలరిస్తూనే ఉంది. ఆయన సినిమాలు, రాజకీయ జీవితంలో మాదిరిగానే ఆయన వ్యక్తిత్వంలోనూ అనేకానేక విశేషాంశాలు ఇమిడి ఉన్నాయి. ఎన్టీఆర్ గారిలో మొదటి నుండి కూడా ఇచ్చిన మాటకు కట్టుబడటం, అనుకున్నది సాధించేవరకు వెనుకడుగు వేయకపోవటం అనేవి ప్రత్యేక గుణాలు. ఇవే ఆయనను సినీ, రాజకీయ రంగాల్లో విజయపథం వైపు నడిపించాయి. ‘న నిశ్చితాత్ విరమంతి ధీరాః’ అని భర్తృహరి చెప్పినట్లు... తలపెట్టిన కార్యాన్ని సాధించే వరకు ధీరులు తమ ప్రయత్నాలను ఎన్ని ఇబ్బందులెదురైనా నిలబడి సాధిస్తారు. వెనక్కు తగ్గరు. ఆ లక్షణం ఎన్టీఆర్ తర్వాత మళ్లీ ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డిలో చూశాను. ముక్కుసూటిగా పోయే ఇలాంటి నాయకులకు శత్రువులు కూడా ఎక్కువే అనడటానికి వీరిద్దరూ ఎదుర్కొన్న సంఘటనలే సాక్ష్యం. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా – ఆయన భార్యగా అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తిని కనుక ఆయన వ్యక్తిత్వాన్ని తెలియచేసే ప్రధానమైన రెండు మూడు సంఘటనలు వివరిస్తాను. ఒక్క మా పెళ్లి విషయంలోనే తీసుకుంటే పెళ్లికి ముందు– తర్వాత ఎన్టీఆర్ ఎన్నో రకాల సమస్యల్ని ఎదుర్కొన్నారు. తిరుపతిలో జరిగిన ‘మేజర్ చంద్రకాంత్’ సినిమా వేడుకల్లో ఎన్టీఆర్ మా వివాహ ప్రకటన చేయగానే చంద్రబాబు ఆ ప్రకటన ప్రజల్లోకి వెళ్లకూడదని మైకులాపించి, లైట్లు ఆర్పించారు. అయినా ఆయన మరుసటి రోజు ఇంట్లోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి మా పెళ్లిని ప్రకటించి మరీ వివాహం చేసుకున్నారు. అక్కడ నుండి నన్ను ప్రజల్లోకి తీసుకెళ్లకుండా చేయటానికి చంద్రబాబు, కుటుంబ సభ్యులు కలిసి ఎన్నో పన్నాగాలు పన్నారు. ఎన్టీఆర్ ధైర్యంగా నన్ను అందరి ముందుకు తీసుకెళ్లి నా స్థానం ఏమిటో సగర్వంగా ప్రకటించారు. ప్రతి అవమానంలో అండగా నిలబడి మాకు కీడు చేస్తున్న వారందరినీ ఎదిరించారు. చీకటి రాజకీయాలకు అలవాటు పడ్డ చంద్రబాబు లాంటి వ్యక్తికి ఆయనొక సవాలుగా నిలబడ్డారు. పెద్ద వయస్సులో ఒంటరితనంతో బాధపడుతున్న ఎంతోమందికి మా వివాహం ఒక మార్గం చూపించింది. దాని మీద కొన్ని ఆర్గనైజేషన్స్ ఏర్పడటం కూడా ఒక విశేషమే! మరో సంఘటన – 1994 ఎన్నికల ప్రచారంలో నన్ను ఇంట్లో ఉంచమని అనేకమంది ద్వారా చెప్పించారు. ఎన్.వి రమణ లాంటి అన్యాయవాదుల్ని ఇంటికి పంపి ఈ పెళ్లి చెల్లదని కూడా వాదించేటట్లు చేశారు. ఎన్టీఆర్ దేనికీ చలించలేదు. తన ఆలోచన మార్చుకోలేదు. నన్ను తీసుకునే ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. స్వయంగా 216 స్థానాలు, మిత్ర పక్షాలకు మరో 34 స్థానాలు సంపాదించి రాజకీయరంగంలో ఒక రికార్డు సాధించారు. మళ్లీ ఆ స్థాయి రికార్డును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తిరగరాశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవిని తమ అధికార దాహంతో లాగేయాలని కుట్రలు పన్నిన రామోజీ, చంద్రబాబు అందుకు నన్నే కారకురాలిగా చూపించారు. ఒక రాజ్యాంగేతర శక్తిగా నా ప్రాతను చిత్రీకరించి, నన్ను విడిచి పెడితేనే తిరిగి పదవి ఇస్తామని ప్రలోభపెట్టారు. ఇక్కడే ఎన్టీఆర్ గొప్ప వ్యక్తిత్వం మేరు పర్వతం లాగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి పదవిని వదులుకోవటానికి సిద్ధపడ్డారు కానీ భార్యను మాత్రం వదులుకోలేదు. పైగా వారికో సవాల్ విసిరారు. ‘‘నా పార్టీ, నేను సాధించుకున్న పదవి నాకు తిరిగి ఇవ్వటమేమిటి? ధర్మబద్ధంగా వివాహం చేసుకున్న స్త్రీని బయటకు పంపించటం ఏమిటి? మీ భార్యల్ని అలా వదిలేస్తారా? నా భార్య తప్పు చేసిందని నిరూపించండి. బహిరంగంగా ఆమెను శిక్షిస్తాను’’ అన్నారు. ఈ మాటలు ఆయన ఆత్మవిశ్వాసాన్ని, తనపై నమ్మకాన్ని నిలబెట్టాయి. ఎప్పటికప్పుడు వారి నిందల నుండి నన్ను గుండెల్లో పొదువుకొని కాపాడుకున్నారు ఆయన. ఒక సందర్భంలో ఎన్టీఆర్ విలేకర్లతో మాట్లాడుతూ– ‘‘రాజ్యం కోసం ఆ రాముడు తన భార్యను అడవులకు పంపేశాడు. కానీ ఈ రాముడు తన భార్య గౌరవం కోసం అధికారాన్నే వదులుకున్నాడు’’ అన్నారు. ఇలాంటి నిశ్చితాభిప్రాయాలు ఎంతమంది మగవాళ్లలో ఉంటాయి?! చాలా తక్కువ మంది మాత్రమే కనిపిస్తారు. ఎన్టీఆర్ గారి సదభిప్రాయాలను, ఆశయాలను అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకుని కుటుంబ సభ్యులు ఎంతో బాధించారు– వేధించారు– అవమానాల పాలు చేశారు. అయినా చివరి క్షణం వరకు ఆయన తన కుటుంబాన్ని ప్రేమిస్తూనే ఉన్నారు. ప్రతిరోజూ వాళ్ల ఇంటికి స్వీట్లూ, ఫ్రూట్లూ పంపిస్తూనే వచ్చారు. వాళ్లు అప్పుడప్పుడూ వచ్చి డబ్బు పట్టుకుని పోతూ ఉండేవారు. మళ్లీ బయట మాత్రం వాళ్లంతా చంద్రబాబుతో చేతులు కలపడం! ఏది ఏమయినా గొప్ప మనసున్న తండ్రి ఎన్టీఆర్. భార్యను ప్రేమించి గౌరవించే మహోన్నత సంస్కారం ఆయనది. పేద ప్రజల్ని కన్న బిడ్డల్లాగా పాలించినవారు. అవినీతి రహితమైన సమాజాన్ని ఏర్పరచటానికి ప్రయత్నించి భంగపడ్డ ధీరుడు.ఎన్ని రకాలుగా చంద్రబాబు, రామోజీలు కుట్రలు పన్ని అవమానించినా, పదవి లాగేసినా తల వంచకుండా తన చివరి క్షణం వరకు ఆయన తన పోరాటాన్ని కొనసాగించారే తప్ప ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ‘‘స్థిరత్వం, ధీరత్వం, ఉచితజ్ఞతా, ప్రియ వక్తృత్వం– చత్వారో సహజాగుణాః అభ్యాసే న లభ్యంతే’’ అని పెద్దలు చెప్పినట్లు ఈ లక్షణాలు ఆయన పుట్టుకతోనే వచ్చాయి. చివరి వరకు ఆ గుణాలు నిలబెట్టుకున్న ధీర గంభీరుడు ఎన్టీఆర్. నిబద్ధత లేని జీవితం ముళ్ల చెట్టు లాంటిది. ఎవరికీ ఉపయోగం ఉండదు. ఆశయం లేని అడుగులు బురద గుంటలో ప్రయాణం లాంటివి. గమ్యం చేరవు. ఇది నమ్మి ఆచరించిన వ్యక్తుల్లో ఎన్టీఆర్ అగ్రస్థానంలో నిలుస్తారు. అందుకే మరణించి కూడా నేటికీ మన మధ్య జీవించే ఉన్నారు. డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి వ్యాసకర్త ఎన్టీఆర్ సతీమణి -
వదినమ్మ బండారం బయటపెట్టిన లక్ష్మీపార్వతి
-
వదిన మరిది బండారం బయటపెట్టిన లక్ష్మీపార్వతి
-
చంద్రబాబుకి బయపడి గుళ్లలో తలా దాచుకుంటున్నారు..
-
ఆఖరికి మోదీ కూడా..దిగజారుడు మాటలు ఎందుకు..?
-
లోకేష్ ఎంట్రీతోనే హత్యా రాజకీయాలు: నందమూరి లక్ష్మీపార్వతి
సాక్షి, గుంటూరు: మంగళగిరిలో నారా లోకేష్ ఎంట్రీతోనే హత్యా రాజకీయాలు మొదలయ్యాయని అన్నారు వైఎస్సార్సీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి. అలాగే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో చంద్రబాబు.. బీజేపీని ఎందుకు ప్రశ్నించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, లక్ష్మీపార్వతి ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లోకేష్ ఎంట్రీతోనే మంగళగిరిలో హత్యా రాజకీయాలు మొదలయ్యాయి. దీనికి ఉదాహారణే వెంకటరెడ్డి హత్య. చంద్రబాబు, నారా లోకేష్ హింసా రాజకీయాలకు పాల్పడే వ్యక్తులు. రాజధాని భూముల కేసుల్లో ఇప్పటకే మాజీ మంత్రి నారాయణ, పుల్లారావులు ఉన్నారు.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కేంద్రం తీసుకువచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ప్రధాని మోదీ, బీజేపీని చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదు. అవినీతి, దుర్మార్గానికి మారుపేరే చంద్రబాబు. అటువంటి వ్యక్తి రాజకీయ లబ్ధి కోసమే వైఎస్సార్సీపీపై విష ప్రచారం చేస్తున్నాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులకు మేలు చేసే వ్యక్తి. భూములు లాక్కునే వ్యక్తి కాదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
పద్మవ్యూహంలో వీర అర్జునుడు
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది మరో మహాభారతం. వీరత్వంతో యుద్ధం చేస్తున్న బాలుడు అభిమన్యుడి మీద నాలుగు మూలల నుండి అస్త్ర పరంపరలు సంధించారు ఆనాడు. పేద ప్రజల సంక్షేమమే ఆశయంగా దుష్ట గ్రహాల్ని ఎదిరిస్తూ పాలన చేస్తున్న పిన్న వయస్కుడైన జగన్ మీద అన్ని వైపుల నుండి దాడి చేస్తున్నారు ఈనాడు. వీరి ప్రయత్నమంతా జగన్ను యుద్ధభూమి నుండి తప్పించాలని! అయితే జగన్ అభిమన్యుడు కాదు, అర్జునుడు. కనుకనే ‘ఏనుంగు మీది కెగయు సింహ కిశోరంబు రీతి’గా దుష్టుల పన్నాగాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ పద్మవ్యూహాన్ని ఛేదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. దుర్యోధన సైన్యంలా వారంతా రోజురోజుకు పెరిగిపోతుంటే ఇవతల జగన్ ప్రజాదరణ అంతకంతకు పెరిగిపోతూనే వుంది.మహాభారత రాజకీయం అన్ని కాలాలకు వర్తిస్తుందనటానికి ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలే నిదర్శనం. ధర్మరాజును ప్రాణాలతో బంధించటానికి ఆనాడు ద్రోణుడు పద్మవ్యూహం పన్నాడు. అది చాలా ప్రమాదకరమైనది. శత్రువు లోపల ప్రవేశించడమంటే అతని మరణాన్ని కొనితెచ్చుకోవటమే. దానినే చక్రవ్యూహం అని కూడా అంటారు. ఇక్కడ ఆంధ్రాలో కూడా జగన్మోహన్రెడ్డి గారి చుట్టూ పద్మ వ్యూహం అల్లబడింది. అతిరథ మహారథులందరూ ఒక్కడిని జయించడానికి లేదా మట్టుపెట్టడానికి అంచెలంచెలుగా వ్యూహాత్మకంగా కుట్రలు సాగిస్తున్నారు. అక్కడ తలపండిన ద్రోణుడు ఆ వ్యూహానికి కర్త అయితే, ఇక్కడ 87 ఏళ్ళ వృద్ధ రామోజీ ఇదంతా నడిపిస్తున్నాడు. వీళ్ళ ఎత్తుగడలో భాగం మీడియా ద్వారా జగన్నూ, ఆయన పాలనను రోజూ దుమ్మెత్తిపోయడం. సోషల్ మీడియా ద్వారా వ్యక్తిత్వ హననానికి పాల్పడటం. దానికి వైకాపా సోషల్ మీడియా ఎదురు దాడికి దిగటంతో ఆ ఆటలు సాగలేదు.ఇక ఎన్డీయేతో రామోజీతో పాటు వెంకయ్య కూడా కష్టపడి పొత్తును కుదిర్చారు. దానితో ఈ మూడో అంచె వ్యూహాన్ని జగన్ అస్సలు దాటలేడని వాళ్ళు భ్రమపడ్డారు. కానీ ఈ అవకాశ పొత్తులు ప్రజలకే నచ్చక ఛీ కొట్టడంతో అదికూడా ఫెయిలయ్యింది.దాంతో ‘చతుర్విధోపాయసాధ్యేతు రిపౌసాంత్వమప క్రియాన్’... అనగా సామ భేద దాన దండోపాయాల్లో, బలమైన శత్రువును ఎదుర్కోవా లంటే నాలుగవది అయిన దండోపాయమే సరయినదని ఈ కూటమి భావించి ఏకంగా ప్రాణాలు తియ్యటానికి తెగించింది. అందుకే విజ యవాడలో సూటిగా బాణం వేయగలిగిన సైంధవుడి లాంటి సతీష్ను బోండా ఉమ డైరక్షన్లో ప్రవేశపెట్టారు. జగన్మోహన్రెడ్డి అన్నట్టు, ఆ దైవమే ఆ సమయంలో కూడా ఆయనను కాపాడింది. ఏ కొంచెం స్థానం మారినా, పెను విషాదం చోటు చేసుకునేది.వీరత్వంతో నిజాయితీగా యుద్ధం చేస్తున్న ఒక్క బాలుడి (అభిమన్యుడు) మీద నాలుగు మూలల నుండి అస్త్ర పరంపరలుసంధించారు ఆనాడు. పేద ప్రజల సంక్షేమమే ఆశయంగా పెట్టుకుని దుష్ట గ్రహాల్ని ఎదిరిస్తూ నిర్భయంగా పాలన చేస్తున్న ఈ పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రి మీద అన్ని వైపుల నుండి దాడి చేస్తు న్నారు ఈనాడు. ఆయన చేస్తున్న సంక్షేమాన్ని ఆపుచేయటానికి మేధావుల ముసుగులో ఒక ఫోరమ్ బయటకు వచ్చింది. ఇప్పటి వరకు వృద్ధులకు, అంగ వికలురకు నిరంతరం సేవలందిస్తున్న వలంటీరు వ్యవస్థను ఈ కుహనా మేధావులు ఆపించి ఏదో గొప్ప కార్యం సాధించినట్లు భుజాలెగరేస్తున్నారు.ఈసారి ఈ దుష్టకూటమి ఎన్నారై వింగ్ను చివరి చక్రంలోకి ప్రవేశపెట్టింది. దానికి ప్రధాన నాయకుడు కోమటి జయరాం. 2020లో వైకాపా నుండి 23 మంది ఎమ్యెల్యేలను కొనటం దగ్గర నుండి మొన్న ఎమ్మెల్యే శ్రీదేవికి డబ్బు ఇచ్చి ఎమ్మెల్సీ ఓటు కొను క్కునే వరకు కథంతా నడిపించింది ఈ ఎన్నారై మేధావే. కోట్లాది రూపాయలతో ఓటరు ‘వెధవలను’ (వాళ్ళ భాషలో) కొనటానికి మరో అస్త్రం సిద్ధం చేశారు. అదృష్టవశాత్తూ అది కూడా బయటపడిపోయింది. కాలం సమీపించినపుడు పాపాత్ములు ఏ పని చేసినా అది వాళ్ళకు ఎదురీతగానే మారుతుందన్న సామెత నిజ మైంది. భారతం కూడా అదే చెబుతుంది. ‘పిరికితనము, నేరప్రవృత్తి, పదవి, ధనాశ లాంటి ప్రవృత్తి గలవానికి సిరి తనంతట తానే తొలగి పోతుంది’ అనే మాట చంద్రబాబు పట్ల ఋజువు కాబోతున్నది.ఇక జగన్ మీద తండ్రీకొడుకుల వాగ్బాణాలయితే చెప్పే పని లేదు. ఒక్కడిని చుట్టు ముట్టి బహిరంగ దూషణలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. వీరి ప్రయత్నమంతా జగన్ను యుద్ధభూమి నుండి తప్పించాలని! ఆయన చేసిన పాపం ఏమిటి? ఆనాడు భారత యుద్ధంలో కూడా కపటోపాయంతో తండ్రిని దూరంగా పంపి అభిమ న్యుడిని బలి చేశారు. ఈరోజు కూడా ఈ ఎన్నికల సమరంలో తండ్రి లేని జగన్ను ఇంతమందీ కలసి ముట్టడిస్తున్నారు. అయితే ఆయన అర్జునుడు కనుక ‘ఏనుంగు మీది కెగయు సింహ కిశోరంబు రీతి’గా ఈ దుష్టుల పన్నాగాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ పద్మవ్యూ హాన్ని ఛేదించుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. జగన్ అంటే ధైర్యం, జగన్ అంటే ధర్మం, జగన్ అంటే విశ్వసనీయత. అందుకే వీరి బరితెగింపు నీచరాజకీయాలను తన పదునయిన అస్త్రాలతో ఛిన్నా భిన్నం చేసుకుంటూ అశేష ప్రజల ఆశీస్సులందుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు.ఇక కూటమి దురవస్థ కూడా కౌరవుల మధ్య పొసగని అభిప్రా యాల్లాగానే ఉంది. ఒకరిపై ఒకరికి నమ్మకం లేదు. ఎవరు ఎవరిని వెన్నుపోటు పొడుస్తారో అని అస్తమానం అదే భయంతో బతుకు తున్నారు. ఎందుకంటే ఈ మూడు పార్టీలకు సిద్ధాంత బలం లేదు. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ పరోక్షంగా కలుస్తాయి. కమ్యూనిస్టులు బీజేపీ కూటమికి మద్దతిస్తారు. ఒక విచిత్రమైన రాజకీయ విన్యాసం ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతున్నది. కుల నాయకుడి కోసం ఐఏఎస్ పట్టాలను దాచిపెట్టి కుల రౌడీల్లా వీధుల్లోకొస్తారు కుహనా మేధా వులు. తండ్రికి మరో వెన్నుపోటుదారు పురందేశ్వరి. వైయస్సార్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ తిరుగుతున్న షర్మిల లాంటి వాళ్ళు కూడా ఈ విష కూటమితో కలిసి జగన్ను తిట్టి పోస్తారు. దుర్యోధన సైన్యంలా వీరంతా రోజురోజుకు పెరిగి పోతుంటే ఇవతల జగన్ ప్రజా దరణ అంతకంతకు పెరిగిపోతూనే వుంది. ఇంకా జగన్ను చంపడానికి ప్రయత్నించిన, హర్షవర్ధన చౌదరి, బోండా ఉమా లాంటి రౌడీలు కూడా ఈ వర్గంలో తక్కువేమీ కాదు. రాష్ట్రంలో ఈ అల్లరి మూకలు వైకాపా కార్యకర్తల మీద సాగిస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. నిన్న గాక మొన్న మంగళగిరిలో రాష్ట్రంలో రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తూ హింసావాదాన్ని రెచ్చగొడుతున్న లోకేష్ గూండాలు ఎదురుగా వెళ్ళి పార్టీ ప్రచారంలో ఉన్న వెంకటరెడ్డిని బైకులతో గుద్ది చంపేశారు. దానిని కూడా సమర్థించుకుంటూ వీరి ప్రచారం సాగిపోతూనే వుంది.ఈ ఆంధ్రా కురుక్షేత్రంలో మే 13న జరిగే ఎన్నికలు అన్నింటికీ సమాధానం చెబుతాయి. ప్రళయం వస్తే మొత్తం ఊడ్చేసినట్లు రేపు ఈ ఓటరు సునామీ ఈ కౌరవ సైన్యాన్నంతా ఓడించి దూరంగా విసిరేస్తుందనే మాట ఖాయం. దేశమంతా మెచ్చుకుంటున్న జగన్ పాలన మళ్ళీ రావటం ఖాయం. కొద్దిరోజులు ఓపిక పడదాం. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలంటే ప్రతి ఓటు జగన్కు వేసి వీళ్ళ పద్మవ్యూహాన్ని ధ్వంసం చెయ్యాలి. వీర అర్జునుడికి విజయం అందించాలి.- వ్యాసకర్త ఆంధ్రపదేశ్ తెలుగు–సంస్కృత అకాడమీ ఛైర్పర్సన్- డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి -
బాబు నీచ రాజకీయాలపై లక్ష్మీపార్వతి ఫైర్
-
ఎన్టీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టింది నువ్వే..
-
తండ్రిని చంపినవాళ్లకు ఇది ఒక లెక్కనా: లక్ష్మీపార్వతి
-
‘వై నాట్ 175?’ నినాదం స్ఫూర్తితో...
ఎట్టకేలకు ఎన్నికల నగార మోగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 4 ‘సిద్ధం’ సభల ద్వారా తమ సత్తా ఏంటో చాటుకుంది. అభ్య ర్థులను అన్ని పార్టీల కన్నా ముందే ప్రకటించి ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. మొత్తం 175 అసెంబ్లీ నియోజక వర్గాలు, 25 ఎంపీ స్థానాలకు సామాజిక న్యాయాన్ననుసరించి అభ్యర్థులను నిర్ణయించారు వైఎస్సార్సీపీ వారు. బీసీలకు అసెంబ్లీ, పార్లమెంటుకు కలిపి మొత్తం 59 టికెట్లు ఇచ్చారు. ఆశ్చర్యమేమిటంటే వీరిలో చాలామంది అతిపేదలు. ఇది రాజకీయానికి ఒక కొత్త నిర్వచనంగా చెప్పవచ్చు. మరోపక్క అప్పటికప్పుడు సూట్కేసులతో విమానాలు దిగిన పెద్దలకు మాత్రమే చంద్రబాబు సీట్లు కేటాయిస్తున్నారు. అందులోనూ స్వజాతి పక్షులే ఎక్కువ. సీనియర్లు దిక్కుతోచక దిక్కులు చూస్తున్నారు. ఇదిలావుంటే ‘గండస్యోపరిపిటకవత్’ అనే సామెత (గోడదెబ్బ – చెంపదెబ్బ)గా ఇష్టంలేని పొత్తుల వల్ల టీడీపీ – జనసేన కార్యకర్తలు బాహాబాహీ యుద్ధానికి దిగుతున్నారు. ఇక అసలు నాయకుడు ఎన్డీయే పొత్తుకోసం నాలుగు సంవత్సరాలుగా ఎదురు చూసి, చూసి రాయబారాలు పంపీ, పంపీ ఎట్టకేలకు వదినగారి దయతో చేరి పోయారు. తన జన్మధన్య మైందనుకుంటూ రాష్ట్రానికి తిరిగి వచ్చి సీట్ల పంపిణీ ప్రారంభిస్తే... అది పూర్తిగా బెడిసికొట్టి సిగపట్ల వ్యవ హారం సీరియస్గా సాగుతున్నది. పోనీ సభల ద్వారా వాటిని కవర్ చేసుకుందామంటే వెయ్యి రూపాయలు, క్వార్టర్ బాటిల్, బిర్యానీ ఇచ్చినా తినేసి పోతున్నారు కానీ సభదాకా రావడంలేదు. ‘రామేశ్వరం పోయినా శనేశ్వరం పోదనట్లు’ మోసాలు, అడ్డ దారులు తప్ప నిఖార్సయిన రాజకీయం తెలియని ఈ అబద్ధాల కోరును భరించలేమని జనాలు 2019లోనే అధికారం నుండి తోసేస్తే, అదేమీ గుర్తించకుండా తనకుతానే గొప్పనాయకుడిని అనుకుంటూ మతిలేని ఉపన్యాసాలు ఇస్తున్న ఇతనికి తోడు దత్తపుత్రుడొకరు. రాసిచ్చిన డైలాగులు ఆవేశంలో వూగిపోతూ చదవటం తప్ప సొంత ఆలోచన లేదు పవన్ కల్యాణ్కు. ఇక అసలు పుత్రుడిని చూద్దామంటే అతని పేరెత్తితేనే పార్టీ పారిపోతున్నది. ఇప్పుడు చంద్రబాబు కూడా అదేదారిలో ఉన్నాడు. అతడికి సర్టిఫికెట్స్ తప్ప ఏ భాషా రాదు. కొత్తగా వచ్చిన మరో తోడు వదినగారు. ప్రస్తుతం తన ఒక్కసీటు గెలిస్తే చాలు వచ్చే ఎన్డీయే ప్రభుత్వంలో ఎలాగయినా మంత్రిపదవి దక్కించుకోవాలని సొంత పార్టీనే తాకట్టు పెడుతున్నారు. ఈ నలుగురు ఇలా నడుస్తుంటే... వీళ్ళకేడరు మాత్రం నియోజక వర్గాల్లో తన్నుకోవడంలో యమ బిజీగా ఉన్నారు. సిద్ధాంత బలం లేక రాష్ట్ర ప్రయోజనాల గురించి ఒక్కమాట మాట్లాడలేక పోతున్నారు. కానీ జగన్ను తిట్టడానికి మాత్రం ఒకేదారిలో నడుస్తున్నారు. వాళ్ళకున్న సిద్ధాంతమల్లా జగన్ ఓడిపోవాలి. ఎందుకంటే సమా ధానం లేదు. వీళ్ళ ఎజెండాలో కులగర్జనలు, మతాల పూత్కా రాలు, ముఖ్యమంత్రి మీద విష ప్రచారాలు నిరంతరం వినిపిస్తూనే ఉన్నాయి. అదుపు తప్పిన కట్టుబాట్లతో, అబద్ధపు రాతలే తమ ధ్యేయ మన్నట్లు కులఅహంకారంతో పిచ్చిరాతలు రాస్తున్నాయి పచ్చ పత్రికలు. ఒక అవినీతిపరుడి కొమ్ముకాస్తూ అవి ఏనాడో విలువల్ని పోగొట్టు కున్నాయి. మరోవైపు మరో దత్తపుత్రిక వచ్చి చేరింది. కుటుంబ వ్యవస్థను నాశనం చేసే విద్యలో ఎన్నో డిగ్రీలు పొందిన చంద్రబాబు మరో కుటుంబ వినాశనానికి పూనుకున్నాడు. ఎన్టీఆర్ కుటుంబాన్ని చీల్చి ఇంటి పెద్దను నాశనం చేసిన ఇతడు, పచ్చగా, సమష్టిగా కష్టాలను సమైక్యంగా ఎదుర్కొని, ఎన్నో ఇబ్బందులను అధిగమించి అధికారాన్ని సాధించుకున్న వైఎస్సార్ కుటుంబం మీద తన వక్రదృష్టి సారించాడు. ఫలితంగా అదికూడా చీలిపోయింది. ఈ దురాశాపరులు అభివృద్ధిలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ భవిష్య త్తును నాశనం చెయ్యటానికి కంకణం కట్టుకున్నారు. సామాజిక సహ జీవనంతో సౌభ్రాతృత్వంగా వర్ధిల్లుతున్న ఆంధ్రుల ప్రశాంతతను చెరపటానికి ఈ కూటమి ప్రయత్నిస్తున్నది. కానీ ఆంధ్రులు అమా యకులు కాదు. స్వాతంత్య్ర పోరాటం నుండి ఇప్పటి వరకు ఎన్నో రాజకీయాలను, ఎందరో నాయకులను చూసిన అనుభవం వారిది. అందుకే ఈ దుష్టగ్రహ కూటమి సభలకు వెళ్ళకుండా తమ నిరసన తెలియజేస్తూనే ఉన్నారు. వారి ఏ సభ చూసినా, ఖాళీ కుర్చీలే. వీరి పతనం చివరిదశకు చేరిందనటానికి ఇవన్నీ సంకేతాలే. రాజనీతిజ్ఞుడు, అనుభవజ్ఞుడు అయిన మోదీ ఈ పొత్తుకు సుముఖంగా లేరనే విషయం వారి ప్రవర్తన, ప్రసంగధోరణి చెప్పకనే చెప్పాయి. జగన్ గురించి ఏమీ విమర్శించక పోవటం, వైరి గుండెల్లో గునపాలు గుచ్చినట్లే వుంది. పక్క రాష్ట్రాలయిన తెలంగాణ, కర్ణాటక, చెన్నై సభల్లో అక్కడి ముఖ్యమంత్రులను ఏకిపారేశారు మోదీ. ఆ ప్రసంగాలతో పోల్చి చూస్తే ఏపీ ముఖ్యమంత్రిని, ఆయన పాలనను ప్రధాని మెచ్చినట్లే కనిపించింది. ఇంకో విషయం కొంచెం లోతుగా ఆలోచిస్తే అర్థమవుతుంది. అది జగన్ పట్ల వారికున్న అభిమానం. ప్రధానమంత్రి కంటే ఐదు నిమిషాల ముందు ప్రసంగించిన చంద్ర బాబు జగన్ను విమర్శిస్తూ ‘తల్లిని, చెల్లిని చూసుకోలేనివాడు ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళ కెలా మేలుచేస్తాడు...’ అంటూ తన లేకితనాన్ని ప్రదర్శించుకున్నాడు. కానీ మోదీ ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్లుగా ‘అన్నా, చెల్లి ఒకటే. ఇది కాంగ్రెస్–వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడ’ అంటూ చంద్రబాబు గొప్పగా ప్రయోగించాలనుకున్న షర్మిల అస్త్రాన్ని ఉపసంహరించారు. ప్రైమ్ మినిస్టర్ ముందు జగన్ను పెద్ద విలన్గా చూపించాలనుకున్న వీళ్ళ ఎత్తుగడను ఆయన చిత్తుచేసి ప్రజల్ని ఒక అయోమయంలో ఉంచి వెళ్ళిపోయారు. ‘ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు’ ఈ సభ ద్వారా తన బలాన్ని నిరూపించుకోవాలనుకున్న చంద్రబాబుకు, పవన్ కల్యాణ్లకు అవమానాలే మిగిలాయి. లక్షల్లో వస్తారన్న జనం రాలేదు. వచ్చిన ప్రధానమంత్రి వీరి పేరయినా ఎత్తలేదు. మరో పక్క పొత్తుకు గండికొడుతున్నాడని బీజేపీ సీనియర్లు అధిష్టానానికి లేఖ రాశారు. ఆ పొత్తు చివరిదాకా వుంటుందో లేదో తెలియదు. జనసైన్యం అసలు సహకరించటం లేదు. ఇక ఓట్లు షేర్ చేసుకునే దెప్పుడు? ‘కత్తితో చంపేవాడు ఆ కత్తితోనే చస్తాడు’ అన్నట్లు అవగాహన, రాజకీయ సంస్కారం లేని ముఠాలను తయారుచేసుకున్న దత్తపుత్రుడి సైన్యం తమ నాయకుల మీదే తిరుగుబాటు చేస్తోంది. ఎటుచూసినా పంచకూళ్ళ కూటమికి గందరగోళంలా తయారయ్యింది పరిస్థితి. కలసినా ఒకళ్ళనొకళ్ళు ఓడించుకుంటారు. మరోవైపు జగన్ ఒక్కడే తన సైన్యంతో ముందుకు దూసుకు పోతున్నాడు. అతని ఆయుధం ప్రజాబలం. అతని నినాదం పేదల సంక్షేమం. అతని సైన్యం ఐకమత్యంతో నాయకుడిని అనుసరించే పార్టీ. ఇప్పుడు చెప్పండి – ముఖ్యమంత్రి జగన్ అన్నట్లుగా ‘వైనాట్– 175?’ సాధించి చూపెడదాం – ఆదర్శ రాజ్యాన్ని నిలబెడదాం. - వ్యాసకర్త ఆంధ్రపదేశ్ తెలుగు అకాడమీ ఛైర్పర్సన్ - డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి -
రెండేళ్లలో 13.37 లక్షల పుస్తకాల ముద్రణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యేక అకాడమీ ప్రచురణలను మార్కెట్లోకి తీసుకొచ్చి నట్టు తెలుగు, సంస్కృత అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి తెలిపారు. తెలుగు భాషాభివృద్ధి, ఉన్నత విద్యకు అవసరమైన విజ్ఞాన సంపదను అందించేందుకు అకాడమీ విశేష కృషి చేస్తోందన్నారు. గురువారం వడ్డేశ్వరంలోని ఆమె కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి అకాడమీ విభజన పూర్తయిన తర్వాత ఏపీలో సేవలు ప్రారంభించిన రెండేళ్లలో రూ. 21 కోట్ల విలువైన 13.37 లక్షల పుస్తకాలను ముద్రించామన్నారు. డీఎస్సీ, బీఈడీ, టెట్, ఏపీపీఎస్సీతో పాటు వివిధ రకాల పోటీ పరీక్షల సిలబస్తో 67 రకాల పుస్తకాలకు సంబంధించి 3 లక్షల కాపీలను మార్కెట్లోకి విడుదల చేశామన్నారు. వీటితో పాటు 10.37 లక్షల ఇంటర్మీడియెట్ పాఠ్యపుస్తకాలను ముద్రించడం ద్వారా పేద విద్యార్థులకు తక్కువ ధరకు స్టడీ మెటీరియల్స్ అందించామన్నారు. ఆంగ్లం, ఇతర భాషల ద్వారా వాడుకలోకి వచ్చి న పదాలకు త్వరలోనే తెలుగు పదజాలాన్ని రూపొందిస్తామన్నారు. తెలుగు–సంస్కృతం–ఆంగ్లం కలగలిపిన త్రిభాషా పదకోశాన్ని (డిక్షనరీ) ముద్రిస్తామన్నారు. డిగ్రీ, పీజీ పాఠ్యప్రణాళికలకు తగ్గట్టుగా పుస్తకాలను ముద్రిస్తామన్నారు. ఇకపై అకాడమీ ప్రతి ముద్రణను తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రవేశపెడుతుందన్నారు. బాబు స్వార్థానికి అకాడమీ బలి చంద్రబాబు స్వార్థ రాజకీయాలకు తెలుగు అకాడమీ తీవ్రంగా నష్టపోయిందని లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన హయాంలో తెలుగు అకాడమీ విభజనను పట్టించుకోలేదన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు అకాడమీని ఏర్పాటు చేశారన్నారు. అనంతరం కోర్టుకు వెళ్లి ఉమ్మడి అకాడమీ విభజన పూర్తి చేసి ఏపీ వాటా కింద రూ. 140 కోట్లు సాధించామన్నారు. కానీ, చంద్రబాబు అకాడమీ ప్రచురణలకు పాతరేసి నారాయణకు పాఠ్యపుస్తకాల ముద్రణను కట్టబెట్టడం ద్వారా భారీ రేట్లకు విక్రయించి రూ. కోట్లు దండుకున్నారని మండిపడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎల్లో మీడియా అకాడమీ సేవలపై విషం చిమ్ముతోందన్నారు. తిరుపతి నుంచే తెలుగు, సంస్కృత అకాడమీలు పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయన్నారు. విజయవాడ కేంద్రంలో ఎక్కువ ముద్రణాలయాలు ఉండటంతో ప్రింటింగ్ ఉద్యోగులు మాత్రమే స్థానిక కార్యాలయంలో సేవలందిస్తున్నారన్నారు. త్వరలోనే తిరుపతిలో ఎస్వీ వర్సిటీ స్థలంలో తెలుగు, సంస్కృత అకాడమీ శాశ్వత భవనం నిర్మాణాన్ని చేపడతామన్నారు. -
టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులకి లక్ష్మి పార్వతి స్ట్రాంగ్ కౌంటర్
-
చంద్రబాబుకు జూ.ఎన్టీఆర్ మద్దతు పలకడు: లక్ష్మీపార్వతి
సాక్షి, గుంటూరు: అమిత్ షా ఇంటిముందు శివరాత్రి జాగారం చేసి చంద్రబాబు పొత్తులకు ఒప్పించాడంటూ వైఎస్సార్సీపీ మహిళా నేత, ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు అనైతికమన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఆత్మగౌరవం కలిగిన వ్యక్తి అని, చంద్రబాబుకు మద్దతు పలకడని లక్ష్మీపార్వతి అన్నారు. వరుణ్ తేజ్ ప్రచారం చేస్తే టీడీపీ పొత్తుకు ఓట్లేమీ పడవు. వారు రీల్ హీరోలే గాని రియల్ హీరోలు కాదు. ఈ సిద్దం సభ ద్వారా మరోసారి సీఎం జగన్ సత్తా తెలుస్తుంది. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అఖండ మెజారిటీతో గెలుస్తుందని లక్ష్మీపార్వతి అన్నారు. కేసుల నుంచి బాబు తప్పించుకోవడానికే.. వైఎస్సార్ జిల్లా: ఏ ప్రయోజనం కోసం టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుందో ప్రజలకు సమాధానం చెప్పాలంటూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. పోలవరం కోసమా, విశాఖ స్టీల్ కోసమా, ప్రత్యేక హోదా కోసమా, రాష్ట్ర అభివృద్ది కోసమా దేనికోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారో వివరణ ఇవ్వాలన్నారు. గతంలో బీజేపీ ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిందని, దూది ఏకి పారేసినట్లు విమర్శించే బాబు ఇప్పుడు కలయిక ఏంటి? నరేంద్ర మోదీని, అమిత్ షా పట్ల చంద్రబాబు వ్యవరించిన తీరు ఎవరూ మర్చిపోరు. ఈ రాష్ట్రం రెండు ముక్కలు కావడానికి బీజేపీ, కాంగ్రెస్సే కారణం’’ అని శివప్రసాద్రెడ్డి దుయ్యబట్టారు. టీడీపీ ఉనికి కోసం, లోకేష్ రాజకీయ భవిషత్తు కోసం ఈ పొత్తు. గతంలో ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి ఇదంతా’’ శివప్రసాద్రెడ్డి దుయ్యబట్టారు. బీజేపీతో పొత్తు కోసం టీడీపీ వెంపర్లాట: ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి ఎన్ని పార్టీలు పొత్తులు పెట్టుకున్నా రాష్ట్రంలో గెలిచేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనేనని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. ఈ సారి 75 శాతం ఓట్లతో తిరిగి అధికారంలోకి వస్తాం. బీజేపీతో పొత్తు కోసం టీడీపీ వెంపర్లాడింది. సింహం సింగిల్గా వస్తుంది అనేలా జగన్ సింగిల్గా వస్తారు. మళ్లీ సీఎం అవ్వడం ఖాయం. 14 ఏళ్లు అధికారంలో ఉండి చంద్రబాబు చేసిన మంచి ఏంటి? కరవును తోడుగా తెచ్చారు వర్షాలు లేక రైతులు, ప్రజలు ఇబ్బందులు పడ్దారు. కాలర్ ఎగరేసి చెప్పే దమ్ము ధైర్యం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. 175కి 175 స్థానాల్లో అలవోకగా గెలుస్తాం’’ అని రవీంద్రనాథ్రెడ్డి పేర్కొన్నారు. -
ఆమ్ ఆద్మీ ని చూసి నేర్చుకో పవన్
-
పవన్ ఓ సైకో: లక్ష్మీపార్వతి
సాక్షి, విశాఖపట్నం: పవన్ కల్యాణ్ను సైకో అంటూ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి మండిపడ్డారు. సీఎం జగన్ను విమర్శించే హక్కు పవన్కు లేదని, ప్రభుత్వ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు కనిపించడం లేదా? అంటూ ఆమె ధ్వజమెత్తారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నీచుడు.. ఎన్టీఆర్ కుటుంబాన్ని చీల్చాడు. ఇప్పుడు జగన్ కుటుంబాన్ని చీల్చుతున్నారు. సునీత చంద్రబాబు చేతిలో సునీత కీలుబొమ్మగా మారారు. నీ తండ్రిని హత్య చేసినవారిని వదిలి సీఎం జగన్ను విమర్శిస్తున్నారు. నీ తండ్రిని ఓడించిన టీడీపీ చేతుల్లో పడ్డావు సునీత’’ అంటూ లక్ష్మీపార్వతి హెచ్చరించారు. తాడేపల్లి గూడెం సభ చూసిన తర్వాత టీడీపీ ఎంత బలహీనంగా ఉందో కనిపించింది. పవన్ మీకు ఆలోచన లేదా?. 75 ఏళ్ల ముసలి చంద్రబాబుపై అరవై కేసులు వున్నాయి.ఎలా నమ్మావ్ పవన్. నీ బలహీనతతో కాపు సామాజిక వర్గాన్ని అవమాన పరిచావు. నీ బలహీనతను చంద్రబాబు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. నీ బలహీనత ఏంటో అర్థం కావడం లేదు. ఎప్పుడైనా కాపు సామాజిక వర్గానికి మేలు చేశావా?. మీ బాస్ రెండు ఎకరాల నుంచి 6 లక్షల కోట్లకు ఎలా ఎదిగారు?’’ అంటూ లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. ‘‘పవన్ కల్యాణ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి. నీచుడైన చంద్రబాబు ఉచ్చులో పడ్డాడు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఏపీకి ప్రమాదం. గత టీడీపీ పాలనలో ఒక్క అభివృద్ధి పని జరిగిందా?. అప్పుడు ఎన్టీఆర్పై దుష్ప్రచా రం చేసిన పచ్చ మీడియా ఇప్పుడు జగన్పై గట్టింది. ప్రతి కుటుంబంలో చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలు నడుపుతున్నారు. షర్మిల గురించి అందరికీ తెలుసు. తండ్రిని మోసం చేసిన పార్టీతో జత కలిసింది. మంచి కుటుంబంలో పుట్టిన షర్మిల, సునీత.. ఎందుకు చంద్రబాబు ఉచ్చులో పడ్డారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు నైజం బయట పడుతుంది’’ అని లక్ష్మీపార్వతీ పేర్కొన్నారు. ఇదీ చదవండి: సునీత ముసుగు నేటితో తొలగిపోయింది: సజ్జల -
మీరెంత మంది కలిసి వచ్చినా సీఎం జగన్ను ఓడించలేరు: లక్ష్మీ పార్వతి
-
వాడు పనికిమాలిన వెధవ... వీడు ఒక పిచ్చోడు: లక్ష్మి పార్వతి
-
ముందే ఓటమిని అంగీకరించిన బాబు: లక్ష్మీ పార్వతి
-
జగన్ పాలన-మహిళ స్పందన రాష్ట్రస్థాయి మహిళ సదస్సు
-
మహిళా సాధికారతకు సీఎం జగన్ ప్రభుత్వం పెద్దపీట
-
అల్లుడి బాగోతం అత్తగా నాకే తెలుసు: లక్ష్మీపార్వతి
విజయవాడ, సాక్షి: చంద్రబాబు ఆడవాళ్లను అస్యహించుకుంటే.. అయితే మహిళకు సాధికారతతో సమాజం వృద్ధి చెందుతుందని సీఎం జగన్ బలంగా నమ్మారని తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి అన్నారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘జగన్ పాలన - మహిళ స్పందన’ రాష్ట్రస్థాయి మహిళా సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. రామ్ మనోహర్ లోహియా మహిళా పక్షపాతి.. అలాగే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళా సంస్కర్త. ఇందిరాగాంధీ మహిళల స్థితి గతులు తెలుసుకునేందుకు రామచంద్రగుహ కమిటీ వేశారు. ఆ కమిటీ ఓ నివేదిక ఇచ్చింది. 16 ఏళ్ల ఇందిరాగాంధీ పాలనలో కూడా మహిళల స్థితిగతులు మారలేదు.. ఆ కమిటీ నివేదిక ఇచ్చినా ఇబ్బందులు తొలగిపోలేదు. అలాంటిది.. ఇందిరాగాంధీ చేయలేని పనిని సీఎం జగన్ చేసి చూపించారు ఓ మహర్షిలా జగన్.. .. మహిళలకు ఆస్తిహక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్కే దక్కింది. మహిళల కోసం తొలిసారిగా పద్మావతి యూనివర్శిటీని స్థాపించారాయన. అలాగే.. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించారు. ఎన్టీఆర్ తర్వాత మహిళల సాధికారితకు కృషి చేసింది వైఎస్సార్.. ఇప్పుడు వైఎస్ జగన్. దేశంలో మహిళలకు అన్నిరంగాల్లో పెద్దపీట వేస్తున్న ఏకైక సీఎం జగన్ ఒక్కరే. అందుకే ప్రజలు మంచి మనసుతో ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి.. జగన్మోహన్రెడ్డి ఒక వ్యవస్థ. వయసులో చిన్నవాడే అయినా ఆయన ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి. అణగారిన వర్గాలకు గుర్తింపునిచ్చిన వ్యక్తి. పేదలు...మహిళల అభ్యున్నతికి ఒక మహర్షిలా పాటు పడుతున్నారు. భారతదేశ చరిత్రలో విద్యకు ఇంత ప్రాధాన్యం ఇచ్చిన ఒకే ఒక్కరు జగన్. అందుకే జగన్ చేస్తున్న మంచి పనులను మనమంతా అందరికీ చెప్పాలి. రాబోయే 15 ఏళ్లపాటు ఇదే ప్రభుత్వం ఉంటే ప్రపంచంలోనే ఏపీ నెంబర్ వన్ గా నిలుస్తుంది చంద్రబాబు పనైపోయింది అల్లుడి బాగోతం అత్తగా నాకే తెలుసు. గత పాలనలో రూ. 6 లక్షల కోట్లు లూటీ జరిగింది. చంద్రబాబు పనైపోయింది. ముసలోడైపోయాడు.. మూడుకాళ్లొచ్చేశాయి. అందుకే తన కొడుకుని సీఎం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. చంద్రబాబు బాధితుల్లో నేను, నాభర్త ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటాం. చంద్రబాబుకి ఆడవాళ్లంటే అసహ్యం. జగన్ను తిట్టడానికే చంద్రబాబు మీటింగ్లు పెడుతున్నాడు. సన్నాసి అయిన లోకేష్ కావాలా?.. మంచి వ్యక్తి అయిన జగన్ కావాలో ప్రజలు ఆలోచించాలి. పొరబాటున ప్రభుత్వం మారితే ఏపీ పూర్తిగా దోపిడీకి గురవుతుంది అని ఏపీ ప్రజలను హెచ్చరించారామె. ఈ సమావేశంలో యూనిసెఫ్ ప్రతినిధి బండ్లమూడి రోజారాణి,మారుతీ మహిళా సొసైటీ అధ్యక్షురాలు సునీతా లఖంరాజు, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. -
చంద్రబాబు,అమిత్ షా భేటీపై లక్ష్మి పార్వతి ఫైర్
-
టీడీపీని చంద్రబాబు హీన స్థితికి తెచ్చాడు: లక్ష్మీపార్వతి
సాక్షి, గుంటూరు: మహానుభావుడు సీనియర్ ఎన్టీఆర్ నాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. నేడు, చంద్రబాబు అదే టీడీపీని ప్రతీ వాళ్ల కాళ్ల దగ్గర పడేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి. అలాగే, కేసుల భయంతో చంద్రబాబు బీజేపీలో పొత్తులు పెట్టుకోవడానికి తహతహలాడుతున్నాడని విమర్శించారు. కాగా, లక్ష్మీపార్వతి శనివారం గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ పెద్దల్ని కలవాలని 25 సార్లు బ్రతిమిలాడుకుంటే ఒక మీడియేటర్ ద్వారా వారిని కలిశారనే ప్రచారం జరుగుతోంది. నాడు కాంగ్రెస్కు వ్యతిరేకంగా సీనియర్ ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించారు. నేడు చంద్రబాబు అదే టీడీపీని ప్రతీ వాళ్ల కాళ్ల దగ్గర పడేస్తున్నాడు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీని హీనమైన పరిస్థితి తీసుకువచ్చాడు. ఎంతో మహోన్నతమైన విలువలతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే చంద్రబాబు నాయుడు ఆయనను బహిష్కరించారు. కాంగ్రెస్ వ్యతిరేకంగా టీడీపీని స్థాపిస్తే మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు సపోర్ట్ చేసి ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశాడు. కేసుల భయంతోనే చంద్రబాబు బీజేపీతో పొత్తులు పెట్టుకోవడానికి తహతహలాడుతున్నాడు. బీజేపీకి చంద్రబాబు ఎంత డబ్బు అయినా ఇస్తానంటున్నాడు. అవసరమైతే టీడీపీని పూర్తిగా తీసేసుకుని కేసుల నుంచి బయటపడేమయని పెద్దల్ని వేడుకుంటున్నాడు. నారా లోకేష్ ఓ పనికిమాలిన వ్యక్తి. లోకేష్ను తీసుకొచ్చి ప్రజల మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబును ప్రజలు ఎంత అసహ్యించుకుంటున్నారో ఆయన సభలను చూస్తే అర్థమవుతుంది. పచ్చ మీడియా కూడా లోకేష్ మాదిరిగానే మారింది. లోకేష్ చెప్పినట్టు 200 సీట్లు వస్తాయని బాకా ఊదుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు’ అంటూ కామెంట్స్ చేశారు. -
రెండు ఎకరాలున్న చంద్రబాబు వేలాది కోట్లకు అధిపతి ఎలా అయ్యారు ?
-
నాకు సీటు రావడానికి సీఎం జగనే కారణం: లక్ష్మీ పార్వతి
-
ABN, ఈనాడుపై లక్ష్మి పార్వతి ఫైర్
-
వేమూరి రాధాకృష్ణకు లక్ష్మీ పార్వతి చురకలు
సాక్షి, విజయవాడ: ఏబీఎన్, ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణకు ఎన్టీఆర్ సతీమణి, వైఎస్సార్సీపీ నేత నందమూరి లక్ష్మీపార్వతి బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు అవినీతిని ప్రొత్సహించి.. ఈనాడు టీడీపీని పతనం అంచున నిలబెట్టడంలో రాధాకృష్ణ పాత్రను లేఖలో ప్రస్తావిస్తూ.. చురకలతో పాటు వ్యంగ్యాస్త్రాలు సంధించారామె. చంద్రబాబు, ఆయనకి భుజంగా ఉంటూ రాధాకృష్ణ, రామోజీరావులు.. ఈ ముగ్గురు తెలుగు దేశం పార్టీకి నేటి దుస్థితిని కలగజేశారని లేఖలో లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మీలాంటి(రాధాకృష్ణను ఉద్దేశించి..) వాళ్లు ఉంటారని తెలియకనే ఎన్టీఆర్ ఆనాడు టీడీపీని స్థాపించారు. నాడు 201 స్థానాల్లో నెగ్గి ప్రభంజనం సృష్టించిన పార్టీ.. 2019 ఎన్నికల్లో 23 సీట్లకు పరిమితం అయ్యింది. అందుకు కారణం మీతో పాటు చంద్రబాబు, రామోజీరావులే’’ అని లేఖలో పేర్కొన్నారామె. నార్ల వెంకటేశ్వరరావు లాంటి గొప్ప జర్నలిస్టు స్థాపించిన ఆంధ్రజ్యోతిని ఇప్పుడు ఒక చిత్తుకాగితంగా, చెత్త బుట్టగా మార్చావంటూ రాధాకృష్ణపై లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఎవరో కష్టపడి సాధించుకున్నది తెలివిగా ఎత్తుకుపోవడంలో మీ గురుశిష్యులు ఇద్దరూ సిద్ధ హస్తులే అంటూ.. చంద్రబాబుకి, రాధాకృష్ణకి చురకలంటించారామె. తనను టీడీపీలో దుష్టశక్తిగా, సైతాన్గా, రాజ్యాంగేతర శక్తిగా అభివర్ణించిన ఆనాటి యెల్లో మీడియా.. ఆ ఆరోపణల్ని ఇప్పటివరకు రుజువు చేయలేకపోయిందని అన్నారామె. అల్లుడు కదాని అప్పజెబితే ఇల్లంతా ఏదో చేసాడట! నారా లోకేష్ను అడ్డదారిలో తీసుకొచ్చి మంత్రిని చేస్తే.. అవినీతి రెండింతలు పెరిగిందని లక్ష్మీ పార్వతి లేఖలో పేర్కొన్నారు. అప్పటిదాకా ఒక చేత్తోనే సంపాదించిన చంద్రబాబు.. కొడుకు చేతుల్ని కలుపుకొని లక్షల కోట్లకు ఎగబాకాడని ఆరోపించారామె. అయినా.. అలాంటి కుటుంబాన్ని జాకీలు పెట్టి లేపడానికి ఆంధ్రజ్యోతి ఉంది కదా అంటూ ఎద్దేవా చేశారు లక్ష్మీ పార్వతి. ఎంత గొప్ప విజనరీనో? చంద్రబాబు విజన్కు ఆకాశానికి ఎత్తే రాధాకృష్ణకు లేఖలో చురకలంటించారామె. వెన్నుపోటు, అడ్డగోలు అవినీతి సంపాదన, కేసులు బయటకు రాకుండా మేనేజ్ చేయడంలో నలభై ఏళ్ల ఇండస్ట్రీ(చంద్రబాబు) గొప్ప విజన్ సాధించారని అన్నారామె. ‘‘ప్రస్తుతం తెలుగుదేశం పరువు ఏ మురుగు గుంటలో పడి దొర్లుతుందో చూడండి. అవినీతి చక్రవర్తి మీ విజనరీ నాయకుడు పై కేసులు మీద కేసులు వస్తుంటే.. జైలు గోడల మధ్య ఊచలు లెక్క పెట్టాడు. కొడుకు నారా లోకేష్ జైలు దారిలో ఉన్నాడు. హెరిటేజ్ లెక్కలు చెప్పలేక భువనేశ్వరి రోడ్లమీద తిరుగుతున్నది. ఎంత గొప్ప విజనరీ’’ అని లేఖలో లక్ష్మీ పార్వతి ఎద్దేవా చేశారు. టీడీపీకి సమాధి కట్టి కోట్లు సంపాదించారు పేదల పార్టీగా ఉన్న టీడీపీని.. పెద్దల పార్టీగా మార్చడానికి చంద్రబాబు, రాధాకృష్ణ చాలా కష్టపడ్డారంటూ విమర్శలు గుప్పించారామె. ఏ కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారో.. తెలంగాణలో ఇప్పుడు అదే కాంగ్రెస్ కాళ్ల దగ్గర టీడీపీని పెట్టాడని.. ఏపీలోనూ కేసుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీకి తాకట్టు పెట్టే యత్నం జరుగుతోందని.. గంగా నదిలాంటి టీడీపీని మురుగు కాలువగా మార్చి అబద్దాల పునాదుల మీద నడిపిస్తున్నారని మండిపడ్డారామె. తెలుగు దేశం ఖ్యాతిని సమాధి చేసి.. ఆ రాళ్లతో కోట్లు సంపాదించుకున్నారంటూ రాధాకృష్ణ, చంద్రబాబులపై ఆమె లేఖ ద్వారా తీవ్ర ఆరోపణలు గుప్పించారు. -
చంద్రబాబుపై లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు
-
చంద్రబాబు బండారం మొత్తం ఆధారాలతో బయటపెట్టిన లక్ష్మి పార్వతి
-
లాయర్ల ఫీజు చెల్లించడానికి డబ్బులు ఎక్కడివి?: లక్ష్మీపార్వతి
సాక్షి, విజయవాడ: లాయర్లకు వేల కోట్ల ఫీజులు చెల్లించడానికి. .చంద్రబాబుకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్మతి ప్రశ్నించారు. దాచుకున్న అవినీతి సొమ్మును.. లాయర్లకు చెల్లించడానికే లోకేష్ ఢిల్లీలో మకాం పెట్టారా అని మండిపడ్డారు. ఎక్కడెక్కడో దాచిపెట్టిన అవినీతి సొమ్మును తెప్పిస్తున్నాడా అనే సందేహం కలుగుతోందన్నారు. 40 రోజులుగా చంద్రబాబు కోసం 19 మంది లాయర్లు పనిచేస్తున్నారని, సీనియర్ లాయర్లకు రోజు రూ. కోటి నుంచి రూ.2.50 కోట్ల ఫీజు ఉందని తెలిపారు. ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరసు నడుస్తున్న చంద్రబాబు కేసుల మీద వాదించడానికి రోజుకు అన్ని ఖర్చులు కలిసి మూడు కోట్లు అయితే..లాయర్ల ఫీజుకే రూ. 2 వేల కోట్లకు పైగా ఖర్చు అయి ఉండొచ్చని ఆరోపించారు. 2 శాతం హెరిటేజ్ షేర్లను విక్రయిస్తే రూ. 400 కోట్ల ఆదాయం వస్తుందని భువనేశ్వరి చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. న్యాయవాదలు ఫీజులు, ఇతర ఖర్చులు చెల్లించడానికి ఆమె 5000 కోట్లకు మించి ఎన్ని షేర్లను విక్రయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. చదవండి: చంద్రబాబుకి కోర్టుల్లో వరుస ఎదురుదెబ్బలు లాయర్ల ఫీజు చెల్లించడానికి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయో చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యలు చెప్పాలని, వారి సంపద, ఆదాయ వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. లాయర్లకు ఎంత చెల్లిస్తున్నారు.. ఆ డబ్బును ఎక్కడనుంచి తెస్తున్నారనే విషయం చంద్రబాబును రోజు తమ పేపర్లలో, టీవీలలో చూపిస్తున్న పచ్చమీడియా అయినా దీనికి సమాధానం చెప్పాలని అన్నారు. దేశ ప్రధానిగా 16 సంవత్సరాలు పనిచేసిన ఇందిరాగాంధీ కూడా తన కేసును వాదించడానికి ఇద్దరే లాయర్లను పెట్టుకున్నారని, ఇంత స్థాయిలో అమెరికా ప్రెసిడెంటు కూడా పెట్టుకోలేదనుకుంటానంటూ సెటైర్లు వేశారు. -
తాటి చెట్టు పెరిగినట్టు పెరిగాడు కానీ ఏం లాభం..చంద్రబాబుపై లక్ష్మి పార్వతి పంచులు..
-
చంద్రబాబుపై నందమూరి లక్ష్మీ పార్వతి సీరియస్ కామెంట్స్
సాక్షి, పశ్చిమ గోదావరి: టీడీపీ అధినేత చంద్రబాబుపై తెలుగు భాష అకాడమీ ఛైర్పర్సన్ లక్ష్మీ పార్వతి సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబుకి తాడిచెట్టుకి వచ్చినట్లు 75ఏళ్ళు వచ్చాయి ఏం ఉపయోగం. ఎవరో అమెరికాలో కనిపెట్టిన సెల్ ఫోన్ను కనిపెట్టానని, ఎవరో తెచ్చిన ఐటీ తానే తెచ్చామని చెప్పడం చంద్రబాబుకి అలవాటు. ప్రభుత్వ ఖజానాని కూడా తన సొంత డబ్బులా అనుకుని దోచుకున్న వ్యక్తి చంద్రబాబు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలోని వచ్చిన మూడు నెలల్లోనే రూ.371 కోట్లు, ఆరు నెలల్లో వేల కోట్లు దోచేసిన వ్యక్తి చంద్రబాబు. రాజధాని పేరుతో లక్ష కోట్లు దోచుకున్నాడు. అల్లుడి గురించి చెప్పాలంటే అత్తగారే చెప్పాలి కదా అని కామెంట్స్ చేశారు. కాగా, తాడేపల్లి గూడెంలో వైఎస్సార్ మేధావుల వేదిక, ఏపీ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో సుపరిపాలన దిశగా ఆంధ్రప్రదేశ్ రూపాంతరం అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఏపీ మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, తెలుగు భాష అకాడమీ ఛైర్పర్సన్ లక్ష్మీ పార్వతి, స్టేట్ అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, ఏపీ గ్రంథాలయ కమిటీ ఛైర్మన్ మండపాటి శేషగిరి రావు పాల్గొన్నారు. సీఎం జగన్తోనే సాధ్యమైంది.. ఈ సందర్బంగా లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ.. ‘ప్రపంచ స్థాయిలో ఐక్యరాజ్యసమితికి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వెళ్లడం మాములు విషయం కాదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలోనే సాధ్యమైంది. విద్య, వైద్యం సరిగ్గా సమపాళ్లలో అందితేనే వ్యవస్థ బాగుంటుందని నమ్మి, ఆచరణలో పెట్టిన వ్యక్తి సీఎం జగన్. గత ప్రభుత్వంలో 3000 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు ఫుల్ అవుతున్నాయి. అంటే విద్యకు ఎంత ప్రాధాన్యత ఉందొ అర్థం అవుతుంది. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చిన వ్యక్తి సీఎం జగన్. 175 స్థానాల్లో వైఎస్సార్సీపీదే గెలుపు.. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా సీఎం జగన్ పరిపాలన అందిస్తున్నారు. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా సీఎం జగన్ అమలు చేస్తున్నారు. తండ్రి ఒక కుటుంబం కోసం ఏ విధంగా ఆలోచిస్తారో అదే విధంగా ప్రతీ కుటుంబం కోసం వారిలో ఒక వ్యక్తిగా జగన్ ఆలోచిస్తున్నారు. టీడీపీలో కూడా 70 శాతం మంది మన ప్రభుత్వం ద్వారా లబ్ది పొందుతున్నారు. ప్రజలు తెలివైన వారు కాబట్టే 23సీట్లుతో గత ఎన్నికల్లో చంద్రబాబుని పక్కన కూర్చోపెట్టారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ 175కి 175 సీట్లలో గెలుస్తారు’ అని అన్నారు. ఇది కూడా చదవండి: పవన్ మాటల వెనుక ఆంతర్యం ఏమిటో? -
‘చంద్రబాబు నీచ చరిత్రను మరిచిపోయావా భువనేశ్వరి?’
సాక్షి, విజయవాడ: చంద్రబాబు నాయుడు నీచ చరిత్రను భార్య భువనేశ్వరి మరిచిపోయారా? అంటూ ప్రశ్నించారు లక్ష్మీపార్వతి. రాజధాని పేరుతో అమరావతిలో చేసింది పెద్ద అవినీతేనని లక్ష్మీ పార్వతి స్పష్టం చేశారు. విజయవాడ నుంచి మీడియాతో మాట్లాడిన ఆమె.. ‘ చంద్రబాబు, లోకేష్లు నీతిమంతులైతే విచారణ ఎదుర్కోవాలి కదా?, చంద్రబాబు తరహాలోనే లోకేష్ కూడా అవినీతి చేశారు. అవినీతిపరులకు భువనేశ్వరి సపోర్ట్ చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఎన్టీఆర్కు ఏనాడైనా భోజనం పెట్టావా భువనేశ్వరి?, చంద్రబాబు దోచిన డబ్బంతా విదేశాల్లో పెట్టుబడి పెడుతున్నారు. చంద్రబాబు తన అవినీతి కేసులకు ఎందుకు స్టే తెచ్చుకున్నారు. చంద్రబాబు హైటెక్ సిటీ కట్టి దాని చుట్టూ ఉన్న భూములను తన వారికి కట్టబెట్టారు’ అని లక్ష్మీ పార్వతి విమర్శించారు. -
ఎన్టీఆర్ గారి మనసు చాలా మంచిది..!
-
నా కోరిక... నేను కోరేది ఒకటే : లక్ష్మీ పార్వతి
-
లక్ష్మీ పార్వతి తన జీవిత యుద్ధం..!
-
నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు : లక్ష్మి పార్వతి
-
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి లక్ష్మీ పార్వతి
-
ఎన్టీఆర్ పెళ్లి రోజు X చంద్రబాబు పెళ్లి రోజు
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబును ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. నంద్యాలలో సెప్టెంబర్ 9న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత సెప్టెంబర్ 10న ఆయనకు 14 రోజుల రిమాండ్ను విధిస్తున్నట్లు కోర్టు తీర్పు వెల్లడించింది. అక్కడి నుంచి ఆయన్ను రాజమండ్రి జైలుకు పంపించారు. అక్కడ బాబుకు ఖైదీ నంబర్ 7691 కేటాయించారు. సెప్టెంబర్ 10కి ఇంకో ప్రత్యేకత ఉంది. అది ఎన్టీఆర్ పెళ్లిరోజు. అదే రోజున లక్ష్మీపార్వతిని తిరుపతిలో ఎన్టీఆర్ అభిమానుల ముందు వివాహం చేసుకున్నారు. చంద్రబాబు అరెస్ట్తో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారిని తెలుగు ప్రజలు ఇప్పుడు బాగా గుర్తుచేసుకుంటున్నారు. ఆయన అల్లుడు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అవినీతి కేసులో అరెస్ట్ అయ్యి జైలు ఊచలు లెక్కిస్తున్న వేళ ఎన్టీఆర్కు అప్పట్లో చంద్రబాబు చేసిన అన్యాయాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఆయన ఎంతగానో నమ్మిన చంద్రబాబే ఆయన పదవితో పాటు పార్టీని అక్రమంగా లాక్కోవడం.. రాజకీయంగా ఆయన్ని పతనం చేయడం.. ఆయనపైనే చెప్పులు వేయించి, మానసిక క్షోభకు గురిచేసి తీవ్ర అవమానాలకు గురిచేయడం. అదే ఆవేదనలో ఎన్టీఆర్ మరణించడం. ఈ విషయాలు జనం ఎప్పటికీ మరిచిపోలేనివే. తాజాగా బాబు అరెస్ట్తో అన్నగారి ఆత్మ శివతాండవం చేస్తుంటుందని ఆయన అభిమానులు మీడియా ద్వారా తెలుపుతున్నారు. అన్నగారి పెళ్లిరోజే బాబు జైలుకు అది 1993 సెప్టెంబర్ 10 తిరుపతిలో మేజర్ చంద్రకాంత్ సినిమా 100వ రోజుల వేడుక జరుగుతుండగా వేదికపైకి లక్ష్మీ పార్వతిని పిలిచారు. తన కుటుంబ సభ్యుల వల్ల ఆమె చాలా ఇబ్బంది పడుతుందని లక్షల అభిమానుల సాక్షిగా బహిరంగంగా చెప్పారు. ఆమెను వివాహం చేసుకుంటున్నట్లు ఆయన అక్కడే ప్రకటించారు. పెప్టెంబర్ 11న తిరుపతిలోనే లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకున్నారు. (చదవండి: అవ్వ!!! ఇంతకన్న వెన్నుపోటు ఉంటుందా?.. ఆర్జీవీ ట్వీట్ వైరల్) అలా కొద్దిరోజులు గడిచిన తర్వాత చంద్రబాబు వెన్నుపోటుకు గురి కావడం... అలా ఆయన చివరి రోజులు కూడా ఆత్మ క్షోభను అనుభవిస్తూ మరణించారు. ఆ పాపమే నేడు చంద్రబాబును వెంటాడుతుందని ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. అందుకే ఎన్టీఆర్ పెళ్లిరోజే చంద్రబాబు ఊచలు లెక్కపెడుతున్నాడని.. ఇదీ దేవుడు స్క్రిప్ట్ కాదు అన్నగారి స్క్రిప్ట్ అంటూ నేడు వారందరూ సంతోషిస్తున్నారు. బాబుగారిని వెంటాడుతున్న అన్నగారి స్క్రిప్ట్ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కుని ఆపై అక్రమంగా ప్రజా సొమ్మును దోచుకోవడం.. ఇలా గతంలో చంద్రబాబు చేసిన లేక్కలేనన్ని పాపాలు వెంటాడుతున్నాయి. గతంలో అనేక విషయాల్లో ఆయన అనుసరించిన వైఖరి ప్రస్తుతం బాబుకు ఎదురుదెబ్బ తగిలేలా కాలం వెంటాడుతుంది. 74వ ఏట ఎన్టీఆర్కు ఘోరమైన అవమానం చేసిన చంద్రబాబు విచిత్రంగా అదే 74వ ఏటా తాను కూడా క్షోభ అనుభవించాల్సి వచ్చింది. ఇది ఎన్టీఆర్ రాసిన స్క్రిప్టే.. కోర్టులతో పాటు ఎల్లో మీడియాను వాడుకుని రాష్ట్రాన్ని మోసం చేసిన చంద్రబాబు.. అదే కోర్టుల ద్వారా జైలుకు వెళ్లడం వంటివి చూస్తే నిజమేనని అనిపిస్తుంది. ఇది ఎన్టీఆర్ ఆత్మ శాంతించే రోజని అన్నగారి అభిమానులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. పలువురు ఎన్టీఆర్ అభిమానులైతే ఆయన చిత్ర పటాలకు, విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేస్తున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు అరెస్టుతో మరోసారి ఎన్టీఆర్ను తెలుగు ప్రజలంతా గుర్తుచేసుకుంటున్నారు. 23 నంబర్తో పాటు 14 కూడా 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా అనుభం, 14 ఏళ్ల ప్రతిపక్షనేతగా పనిచేసిన అనుభవం నాది అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబుకు సరిగ్గా 14 రోజుల రిమాండ్ను కోర్టు విధించింది. ఇది కదా కాల నిర్ణయం అంటే..? అని కొంతమంది నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. 'చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691. 7+6+9+1 = 23. ఆయన అరెస్ట్ అయిన ఏడాది కూడా 2023. అంటే 23 చంద్రబాబుకు లక్కీ నెంబర్ అని ఎద్దేవా చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. -
ఎన్టీఆర్ కు నివాళులర్పించిన లక్ష్మి పార్వతి..!
-
ఆ దుర్మార్గుడి పాపం పండింది..
-
నాకైతే రాత్రంతా నిద్ర పట్టలేదు..
-
లక్ష్మీ పార్వతి వేదిక ఎక్కగానే.. చంద్రబాబు అలా..
దివంగత ముఖ్యమంత్రి, ప్రఖ్యాత సినీ నటుడు ఎన్టీ రామారావు అంటే తెలుగు ప్రజల్లో ఆరాధ్య భావం ఉంటుంది. కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించిన నందమూరి తారకరామారావు మొదట సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎనలేని గుర్తింపు పొందారు.. అదే మాదిరిగా రాజకీయ రంగంలో కూడా చరిత్ర సృష్టించారు. దేశ వ్యాప్తంగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పి ఎంతో ఘన చరిత్ర కలిగిన ఎన్టీఆర్.. తన జీవితంలోని చివరి ఘడియల్లో మాత్రం చాలా దారుణ పరిస్థితులు ఎదుర్కొన్నారు. తన సొంత కుటుంబానికే చెందిన వాళ్లే తిరుగుబావుటా ఎగరేసి.. ఎన్టీఆర్ను అత్యంత అవమానకర రీతిలో ముఖ్యమంత్రి పదవి నుంచి దించేశారు. ఎన్టీఆర్ను పదవీచ్యుతుడిని చేసేందుకు వారు సాకుగా చూపించిన ఏకైక వ్యక్తి.. లక్ష్మీపార్వతి! ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఆయన జీవితంలోకి వచ్చిన లక్ష్మీపార్వతి.. కడవరకూ ఆయన వెన్నంటే ఉన్నారు. లక్ష్మీపార్వతి పేరు లేకుండా ఆయన చరిత్ర గురించి చెప్పడం కష్టమే అనేంతలా ఆయన జీవితంలో ఆమె కీలక పాత్ర పోషించారు. చరిత్రలో స్త్రీ పాత్ర లేకుండా ఎపిసోడ్లు లేవు. అలా ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎలా వచ్చారు..? ఆమెకు ఆయన ఇచ్చిన స్థానం ఎలాంటిది..? ఎన్టీఆర్ చివరి రోజుల్లో అచేతన స్థితిలో ఉంటే లక్ష్మీపార్వతి చేసిన సేవ ఎలాంటిది..? ఎన్టీఆర్కు ఎంతో సేవ చేసిన ఆమెపై కుట్రలు పన్నింది ఎవరు..? నాడు ఇవ్వన్నీ ప్రత్యక్షంగా చూసిన ప్రముఖ జర్నలిస్ట్ దాసు కేశవ రావు ఈ వ్యాసం ద్వారా తెలిపారు. ఎన్టీఆర్ను లక్ష్మీపార్వతి ఎందుకు కలిశారు? గుంటూరు జిల్లా పచ్చల తాడిపర్రుకు చెందిన లక్ష్మీపార్వతిని మొదటగా వీరగంధం వెంకట సుబ్బారావు వివాహం చేసుకున్నారు. ఆయన హరికథా విద్వాంసుడు. లక్ష్మీపార్వతి కంటే ఆయన 20 ఏళ్లు పెద్దవాడు. ఆమె పెళ్లి నాటికే తెలుగు భాషా పాండిత్యం మీద మంచి పట్టు సాధించి ఉన్నారు. భారత ఇతిహాసాలు, పురాణాల పట్ల లక్ష్మీపార్వతికి మంచి పరిజ్ఞానం ఉంది. ఆప్పట్లో ఆమె పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఒక కళాశాలలో ఉపాధ్యాయురాలిగా కూడా బోధించారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి M. Phil పూర్తి చేసిన ఆమె పీహెచ్డీ కోసం నమోదు చేసుకున్నారు. ఇందులో భాగంగా 'సినిమాలో పౌరాణిక విశేషాలు అంశంపై ఆమె పరిశోధన చేయాలనుకున్నారు. అలా ఆమె మొదటగా ఎన్టీఆర్ను కలవాలని అనుకున్నారు. లక్ష్మీపార్వతికి నో చెప్పిన ఎన్టీఆర్ ఆమె తన భర్త వీరగంధం వెంకట సుబ్బారావుతో కలిసి 1985లో న్యూఢిల్లీకి వెళ్లి అక్కడ రామారావును కలుసుకున్నారు. తన రీసర్చ్తో పాటు ఎన్టీఆర్ జీవిత చరిత్ర రాయడం కోసం సాకారం ఇవ్వాలని లక్ష్మీపార్వతి కోరడంతో ఆయన కుదరదని చెప్పారు. ప్రస్తుతం తాను చాలా బిజీగా ఉన్నానని లక్ష్మీపార్వతితో ఎన్టీఆర్ చెప్పారు. అలా మొదటిసారి వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆకలితో పడుకున్న ఎన్టీఆర్ 1993-94లో ఏం జరిగిందో జర్నలిస్ట్ దాసు కేశవ రావు ఇలా చెప్పారు. ఆ సమయంలో ఎన్టీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఒకరోజు పర్యటన ముగించుకుని బంజారాహిల్స్లోని రోడ్ నంబర్ 13న ఎన్టీఆర్ నివాసానికి తిరిగి వచ్చాం. అప్పుడు ఆయనతో పాటు నేనూ ఉన్నాను. ఇల్లు దాదాపుగా ఖాళీగా ఉంది. అప్పుడు ఇంట్లో ఒకరిద్దరు పనివాళ్లు మినహాయించి ఎవరూ లేరు. ఆ సమయంలో ఆయన ఆకలితో ఉన్నారు.. కానీ అక్కడ తినటానికి ఏం లేదు. ఎన్టీఆర్ ఖాళీ కడుపుతో పడుకోబోతుండగా ఆయన దగ్గర పనిచేస్తున్న ఒకరు ఆ పరిస్థితిని చూసి చలించిపోయి .. ఎన్టీఆర్ స్నేహితుడి ఇంటి వద్దకు వెళ్లి అప్పటికప్పడు భోజనం తయారు చేపించుకుని వచ్చి వడ్డించాడు. ఆయన జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటనలలో ఇది ఒకటి. బడి పంతులు సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు సమాంతరంగా నిజ జీవితంలో కూడా ఇలాంటివి ఎన్నో జరిగాయి. కుటుంబ సభ్యులకు దూరం 1984లో తన మొదటి భార్య బసవ తారకం మరణం తర్వాత ఎన్టీఆర్ ఒంటరిగా మిగిలిపోయారు. అప్పటి నుంచి ఆయనకు పనివాళ్లే అన్నం వడ్డించడం వంటివి చేసేవారు. ఆయనకు 7 మంది కుమారులు, నలుగురు కూతుళ్లు ఉన్నా కూడా కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదు. వాళ్లూ ఆయన ఉంటున్న ఇంటి వద్దకు వచ్చే వాళ్లు కాదు. ఒంటిరిగానే ఉండేవారు. ఆ సమయంలో అతన్ని దగ్గరుండి చూసుకోవాల్సిన శ్రద్ధగల భాగస్వామి అవసరం. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో లక్ష్మీపార్వతి 1991-92లో రామారావు జీవితంలోకి ప్రవేశించారు. అప్పటికే ఆమె తన భర్త నుంచి విడిపోయి ఉన్నారు. చాలా రోజుల నుంచి తన రీసెర్చ్, ఆటో బయోగ్రఫీ కోసం ఆమె పదే పదే అభ్యర్థన చేస్తుండటంతో చివరకు ఎన్టీఆర్ అంగీకరించారు. ఆ సమయంలో (1991-92) ఎన్టీఆర్ ప్రతిపక్ష నేతగా ఉండటంతో ఆమె పరిశోధన, జీవిత చరిత్ర గురించి రాసేందుకు మరింత సులభం అయింది. ఆప్పుడు ఎన్టీఆర్కు కూడా ఎక్కువ సమయం దొరికింది. పురాణాలు, భారత సంస్కృతిపై లక్ష్మీపార్వతికి ఉన్న పరిజ్ఞానం, విశ్లేషణతో ఎన్టీఆర్ ఆశ్చర్యపోయారు. అలా రోజూ వారిద్దరూ చర్చిస్తుండటంతో వారిని మరింత దగ్గర చేసింది. కానీ అప్పట్లో ఆమె నరసరావుపేట తెలుగు విశ్వవిద్యాలయానికి బస్సులో వెళ్లి రావడం ఇబ్బందిగా ఉండటంతో ఎన్టీఆర్ ఆమెకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అలా ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయంలో ఆమె ఉండేందుకు బస కూడా ఏర్పాటు అయింది. ఆస్పత్రిలో ఎన్టీఆర్ ఉంటే.. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి మధ్య అనుబంధం మరింత బలపడటంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. అప్పుడు వారిలో ఎన్టీఆర్ పట్ల విపరీతమైన కోపం పెరిగింది. అప్పటికే ఎన్టీఆర్కు దూరంగా ఉన్న కుటుంబ సభ్యులు లక్ష్మీపార్వతి ఎంట్రీతో జీర్ణించుకోలేకపోయారు. ఆమెపై ద్వేషం పెంచుకున్నారు. ఒకరోజు రాత్రిపూట ఎన్టీఆర్కు రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయాయి. దాదాపు అయన కోమాలోకి వెళ్లిపోయారు. ఆప్పుడు ఎంతో ఆందోళనలో లక్ష్మీపార్వతి ఉన్నారు. ఆయన్ను వెంటనే ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించారు. అప్పుడు కూడా కుటుంబ సభ్యులు చూసేందుకు వెళ్ల లేదు. ఆస్పత్రిలో ఎన్టీఆర్కు ఆమె ఎనలేని సేవ చేయడం జరిగింది. అలా ఆయన మళ్లీ ఆరోగ్యంగా కోలుకున్నారు. 1993 సెప్టెంబర్ 10న ప్రకటన ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి మధ్య ఉన్న సంబంధంపై మీడియా, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. వాళ్ల గురించి పుకార్లు కూడా ప్రారంభం అయ్యాయి. కానీ ఎన్టీఆర్ వాటి పట్ల ఎక్కడా స్పందించలేదు. సరిగ్గా అలాంటి సమయంలోనే మేజర్ చంద్రకాంత్ సినిమా 100వ రోజు వేడుక తిరుపతిలో జరుగుతుంది. అక్కడ ఈ టాపిక్పై స్పందించాలని ఆయన నిర్ణయించుకున్నారు. అప్పుడు ఆయన్ను ఆపేందుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అందురూ ప్రయత్నించారు. కానీ కుదరలేదు. అది 1993 సెప్టెంబర్ 10 తిరుపతిలో సభ... ఎన్టీఆర్ అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఆ సమయంలో సభకు దూరంగా కూర్చోని ఉన్న లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ వేదికపైకి పిలిచారు. దాంతో ఆ సమయంలో అక్కడే ఉన్న నారా చంద్రబాబు నాయుడు హుటాహుటిన కిందకు వెళ్లిపోయారు. ఇవన్నీ ఎన్టీఆర్ లెక్క చేయలేదు. తమ కుటుంబ సభ్యులు లక్ష్మీ పార్వతిని పలు ఇబ్బందులకు గురిచేశారు. ఆమె గురించి తప్పుగా ప్రచారం చేశారు. 'నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు దూరంగా ఉంటే లక్ష్మీ పార్వతి నాకు అండగా నిలిచింది.' అని ఎన్టీఆర్ అన్నారు. ఆమెను వివాహం చేసుకుంటున్నట్లు ఆయన అక్కడే ప్రకటించారు. అలా ఆమెను తన భార్యగా బహిరంగంగానే చాటిచెప్పారు. అంతేకాకుండా 1994 ఎన్నికల ప్రచారం సమయంలో కూడా ఆమెను తన వెంటే ఉండేలా చేసుకున్నారు. ఎన్నికల ప్రచారం, పార్టీ సమావేశాలలో ఎన్టీఆర్తో పాటుగా ఆమె కూడా కీలకంగా పనిచేశారు. 1995 ఎన్టీఆర్ పర్యటనతో పతనం అలా ఎన్నికలు పూర్తి కావడం... తెలుగుదేశం భారీ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి రావడం జరిగిపోయాయి. ఆ సమయానికి ఆమె అదృష్టం బాగానే ఉంది. మరోవైపు పార్టీలో చంద్రబాబు నాయుడు పతనం ప్రారంభం అయింది. 1995లో లక్ష్మీ పార్వతితో పాటు ఎన్టీఆర్ UK పర్యటనకు వెళ్లారు. అప్పుడు UK పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రిని కలిసేందుకు వెళ్లారు. కానీ వారిద్దరూ ఇండియాకు తిరిగి రావడం కొంత ఆలస్యం అయింది. అదే ఎన్టీఆర్ పతనానికి దారి తీసింది. పావులు కదిపిన చంద్రబాబు ఇలాంటి సమయం కోసం చంద్రబాబుతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. అప్పుడు చంద్రబాబు వ్యూహాత్మకంగా పావులు కదిపారు. ఆ సమయంలో జరిగిన స్థానిక, పౌర సంస్థల ఎన్నికల్లో టీడీపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అప్పటి వరకు ఎన్టీఆర్కు నమ్మకంగా ఉన్న విధేయుల నుంచి తిరుగుబావుట ఎదురైంది. ఇదంతా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉన్న మెజారిటీ ఎమ్మెల్యేలే నడిపించారు. అలా 1995 ఆగష్టులో రామారావు, లక్ష్మీ పార్వతిలు ఈ సంక్షోభాన్ని పసిగట్టలేకపోయారు. పార్టీ అధ్యక్షుడి పదవి చంద్రబాబు నాయుడుకు చేరింది. తర్వాత ముఖ్యమంత్రి పదవి వరించింది. అక్కడితో ఎన్టీఆర్ చరిత్ర ముగిసిపోయింది. ఆ సమయం నుంచి చంద్రబాబు ఏది చెబితే అదే జరుగుతూ వచ్చింది. ఆ విధంగా, లక్ష్మీ పార్వతి కూడా తన భర్తతో పాటుగా ఉన్నత స్థానం నుంచి కిందకు పడిపోయారు. అలా కొన్ని నెలల తరువాత (1996) ఎన్టీఆర్ మరణించడం జరిగిపోయింది. అలా ఎన్టీఆర్ చివరి రోజులు క్షోభ,వేదనతో ముగిసిపోయాయి. -
అయ్యో లక్ష్మీపార్వతి.. ‘రాబంధు’వుల రాజకీయం ఇది!
దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్మృతికి ఆయన కుటుంబ సభ్యులు నివాళి అర్పిస్తున్న తీరు వివాదాస్పదంగా కనిపిస్తోంది. తాజాగా ఆయన పేరిట ఒక నాణేన్ని తీసుకు రావడం ఆసక్తికరమైన అంశమే అయినా.. అందులో రాజకీయ దురుద్దేశాలు కనిపించడం మాత్రం ఆయన గౌరవాన్ని తగ్గించడమే అవుతుంది. అసలు కేంద్ర ప్రభుత్వం స్వయంగా చేయవలసిన ఈ పనిని కుటుంబ సభ్యులు చేసిన తీరు, దానికి ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతిని పిలవకపోవడం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును, టీడీపీ నుంచి బీజేపీలో చేరిన కొందరు నేతలను ఆహ్వానించడం.. ఆ కార్యక్రమానికి బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా రావడం, ఆ తర్వాత ఆయనతో చంద్రబాబు మంతనాలు జరపడం.. ఇవన్నీ కూడా ఎన్టీఆర్ పేరును వీళ్లు రాజకీయంగా వాడేసుకునే యత్నమేననిపిస్తుంది. తమను గతంలో తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు సరసన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరి దంపతులు కూర్చుని మంతనాలు జరపడం కూడా ఆశ్చర్యంగానే ఉంటుంది. దీనిని చంద్రబాబు తెలివితేటలు అనాలా?లేక పురందేశ్వరి అవకాశవాదం అనాలా? అనేది చెప్పలేం. ఒకప్పుడు దగ్గుబాటి దంపతులు తమను చంద్రబాబు అవమానాలపాలు చేశారని బాధపడుతుండేవారు. వెంకటేశ్వరరావు అయితే ఏకంగా పుస్తకాన్నే రాశారు. మరి అలాంటివారు ఇప్పుడు అలయ్ బలయ్ మాదిరి కూర్చోగలిగారంటే ఏమనుకోవాలన్న ప్రశ్న వస్తుంది. చంద్రబాబు చేతిలో వెంకటేశ్వరరావు ఒకసారి కాదు.. పలుమార్లు దెబ్బతిన్నారు. అవమానాలకు గురయ్యారు. వారు పూర్తిగా కలిసిపోయారో, లేదో తెలియదు కాని అందరి దృష్టిని ఆకర్షించారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించడం , తొమ్మిది నెలల్లో అధికారంలోకి రావడం ఒక సంచలనం అయితే, ఆయన తన కుటుంబ సభ్యుల చేతిలోనే ఘోర పరాభవానికి గురై పదవి కోల్పోవడం మరో పెద్ద విషాదం. ఆ తర్వాత కొద్ది కాలానికే ఆయన గుండెపోటుతో కాలం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో కుటుంబ పాత్ర ఏమిటి అన్నది ఎప్పటికీ చర్చనీయాంశంగానే ఉంటుంది. ✍️ ఎన్టీఆర్ మరణించిన తర్వాత ఆయన ఆస్తుల వారసత్వాన్ని కుటుంబ సభ్యులు పొందితే, ఆస్తులతో పాటు రాజకీయ వారసత్వం తమదేనని అల్లుడు చంద్రబాబు నాయుడు లాగేసుకున్నారు. ఆయన జీవితం చరమాంకంలో ఉన్నప్పుడు వీరెవ్వరూ ఆయన పట్ల కనికరం చూపకపోవడం బాధాకర ఘట్టమైతే, ఆయన మృతి చెందిన తర్వాత మాత్రం ఎంతో అపారమైన ప్రేమాభిమానాలు ఉన్నట్లు ప్రవర్తించడం అచ్చం అదేదో నాటకంలా అనిపిస్తుంది. మరి ఎన్టీఆర్ ఇష్టపడి పెళ్లి చేసుకున్న రెండో భార్య లక్ష్మీపార్వతి సంగతేమిటి?. ఎన్టీఆర్ గొప్పదనం గురించి చెబుతున్నవారు ఆయన భార్యను వెలివేస్తారా?ఎన్.టి.ఆర్.జీవించి ఉన్నప్పుడు తమకు అవసరమైనప్పుడు ఇదే లక్ష్మీపార్వతితో ఎలా మాట మంతీ కలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో జరిగిందంతా తప్పు అనుకుంటే.. కుటుంబ ప్రతిష్ట దెబ్బతిన్నదని భావిస్తే.. లక్ష్మీపార్వతి మాత్రమే తప్పు చేశారా?. పెళ్లి చేసుకున్న ఎన్టీఆర్ సంగతేమిటి?. ఎన్.టిఆర్ కుటుంబంలో ఇంకెవరూ విడాకులు తీసుకోలేదా? మరో పెళ్ళి చేసుకోలేదా?. పై విషయాల జోలికి వెళ్లడం పద్దతి కాదు. కానీ, రాజకీయాలలో క్రియాశీలకంగా ఉండి, పది మందికి నీతులు చెప్పే నేతలుగా ఉన్న పురందేశ్వరికాని, చంద్రబాబు నాయుడు కాని ఇలా చేసి ఉండాల్సింది కాదని చెప్పక తప్పదు. ఒకపక్క మహిళలను గౌరవించాలని చెబుతూ , ఇంకో పక్క లక్ష్మీపార్వతిని వీలైనప్పుడల్లా అవమానించడం ఎలా సమర్ధించగలం?. తమకు అవసరమైతే ఒక నాయకుడు మూడు పెళ్లిళ్లు చేసుకున్నా, ఒకరిని పెళ్లి చేసుకుని మరొకరితో సంబంధం పెట్టుకున్నారన్న అబియోగాలు ఉన్నా ఆయనను సమర్ధించడం ,రాజకీయ స్నేహం కోసం వెంపర్లాడడాన్ని ఏమనాలి?.. ✍️ సరే.. ఇది ప్రైవేటు కార్యక్రమం అని చెప్పవచ్చు. కానీ జరిగింది రాష్ట్రపతి భవన్ లో అన్న సంగతి మర్చిపోకూడదు. కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇందులో ఇన్వాల్వ్ కాకపోయినా, కేంద్రం అనుమతితోనే ఈ నాణేల ముద్రణ జరిగిందని గుర్తుంచుకోవాలి. పైగా ఇవేవి చలామణిలో ఉండే నాణాలు కాదట. ఎవరైనా వీటిని 3,500 రూపాయల నుంచి 4,850 రూపాయలకు కొనుగోలు చేసుకోవచ్చట. అంటే ఎవరైనా తమకు కావల్సిన నాణేలను తయారు చేసుకోవచ్చు. ఈ మాత్రం దానికి అదేదో కేంద్రం విడుదల చేస్తున్నట్లు ఎందుకు ప్రచారం చేశారు. ఇది ప్రైవేట్ నాణెమే అయితే ఎన్.టి.ఆర్.ను అవమానించినట్లు కాదా? అదే కేంద్రం కనుక నిజమైన నాణాలను విడుదల చేసి ఉంటే అవి జనం చేతిలోకి వెళ్లేవి కదా! అది కదా ఆయనను గౌరవించడం అంటే!. ✍️ ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలని కోరే వీళ్లు.. గతంలో వాజ్ పేయి ఉన్నప్పుడు ఇవ్వాలన్న ఆలోచన జరిగితే ఎందుకు అంత సుముఖత చూపలేదు?. కేవలం లక్ష్మీపార్వతి ఆ అవార్డు అందుకుంటారనే కదా అప్పుడు అలా చేసింది!. అదే సమయంలో చంద్రబాబు మాత్రం ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఎన్టీఆర్ భారతరత్న ఇవ్వాలని అంటారు. ఎన్.టి.ఆర్. అంతటి గొప్ప వ్యక్తి అయితే చంద్రబాబే ఎందుకు కూలదోశారు?. ఆ తర్వాత ఇంటర్వ్యూలలో ఎన్.టి.ఆర్.కు విలువలు లేవని ఎలా చెప్పారు?.. ఇలాంటి ప్రశ్నలకు.. వాళ్ల దగ్గరి నుంచి సమాధానం రాదు. నాణేం విడుదల కేవలం కుటుంబ సభ్యుల కార్యక్రమం అయితే.. వైఎస్సార్సీపీ అసమ్మతి ఎంపీ రఘురామకృష్ణంరాజు, టిడిపి నుంచి బిజెపిలోకి వెళ్లిన మాజీ ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరి, మరో ఒకరిద్దరు.. అక్కడ ఎలా ఉన్నారు?. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రను ఎలా పిలిచారు?. వీళ్లంతా ఎన్టీఆర్ బంధువులా? లక్ష్మీపార్వతి మాత్రం కాకపోయిందా? అదేదో పురందేశ్వరి ఇంటిలో కార్యక్రమం అయితే ఆమె ఇష్టం వచ్చినట్లు చేసుకుని ఉండవచ్చు. కానీ, రాష్ట్రపతి భవన్ లో పెట్టాక అది పబ్లిక్ కార్యక్రమంగానే ఉంటుంది. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. ✍️ ఇక రాజకీయం చూస్తే.. ఇటీవలికాలంలో బీజేపీతో ఎలాగొలా అంటకాగాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలకు దీనిని ఒక అవకాశంగా తీసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. వారి మధ్య జరిగిన మంతనాలు ఏమిటో తెలియదుగాని, కచ్చితంగా రాజకీయ స్నేహం చేయడానికి చంద్రబాబు అర్రులు చాస్తున్న వేళ ఈ భేటీ జరిగింది. దీనికి బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి చొరవ తీసుకోవడం విమర్శలకు దారి తీస్తోంది. ఎన్టీఆర్ను పదవీచ్యుతుడిని చేయడంలో తనకు సహకరించిన వెంకటేశ్వరరావుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు చెప్పి, ఆ తర్వాత అవమానించి బయటకు పంపేశారు. ఆయన లక్ష్మీపార్వతి పార్టీ టిక్కెట్ మీద రాజ్యసభ సభ్యుడు అయ్యారు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి సహకారంతో మళ్లీ ఎమ్మెల్యే అయ్యారు. తన భార్య పురందేశ్వరి ఎంపీ అయి కేంద్ర మంత్రి అయ్యారు. అప్పట్లో పార్లమెంటులో చంద్రబాబుతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ విగ్రహాన్ని పురందేశ్వరి ఏర్పాటు చేశారు. సోనియాగాంధీకి ఆమె ధన్యవాదాలు కూడా తెలిపారు. అది అధికారిక కార్యక్రమంగా జరిగితే అప్పుడు కూడా లక్ష్మీపార్వతిని పిలవకపోతే ఆమె ఎలాగోలా ఎవరి సహకారంతోనే లోపలికి వెళ్లగలిగిందట. తన ఇంటిలో జరిగిన ఒక వివాహ కార్యక్రమానికి చంద్రబాబు వస్తే పలకరించడానికి కూడా ఇష్టపడని పురందేశ్వరి.. రాజకీయం కోసం ఇప్పుడు జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీకి సహకరించడం అందరిని ఆశ్చర్య పరుస్తోంది. పురందేశ్వరికి మరి తన తండ్రి చివరి రోజుల్లో దగ్గర ఉండి సేవలందించిన లక్ష్మీపార్వతి మాత్రం ఎలా కొరగాకుండా పోయింది?. ఇలా చేస్తే ఎన్టీఆర్ ఆత్మ సంతోషిస్తుందా?తండ్రి గురించి ఎంత గొప్ప ఉపన్యాసం చేసినా విలువ ఉంటుందా? చంద్రబాబు గురించి ఎన్టీఆర్ ఏమన్నది వీడియో సహితంగా ఉన్నా.. దానిని పట్టించుకోని పురందేశ్వరి తన తండ్రి ప్రేమించిన లక్ష్మీపార్వతిని మాత్రం అవమానిస్తున్నారు. ఇదేనా తండ్రికి ఇచ్చిన నివాళి అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
అసలు విలన్ పురంధరేశ్వరి: లక్ష్మీపార్వతి
సాక్షి, అమరావతి: దివంగత నందమూరి తారకరామారావు పేరు మీద 100 రూపాయల స్మారక నాణేం విడుదల కార్యక్రమంపై ఆయన సతీమణి లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఆహ్వానం అందించకపోవంపై ఇదివరకే ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ రాష్ట్రపతి, ప్రధాని, ఆర్థిక మంత్రికి సైతం లేఖ రాశారు. ఈ క్రమంలో ఇవాళ్టి కార్యక్రమంపై తాజాగా ఆమె అసంతృప్తి లేఖను విడుదల చేశారు. అంతేకాదు ఎన్టీఆర్ కూతురు దగ్గుబాటి పురంధేశ్వరిపైనా ఆమె ఆగ్రహాం వ్యక్తం చేస్తూ.. మీడియా ముందుకు వచ్చారు. ‘‘ఎన్టీఆర్ పేరుతో వంద రూపాయిల నాణం విడుదల చేయడం సంతోషంగా ఉంది. కానీ, నాకు ఆహ్వానం అందించకపోవడం, నన్ను పిలవకపోవడం బాధగా అనిపిస్తోంది. రాష్ట్రపతికి, ప్రధానికి, ఆర్థికమంత్రి కి లేఖ రాశాను.ప్రభుత్వమే నిర్వహిస్తే భార్యగా నన్ను పిలవకపోడం తప్పు. ఇన్విటేషన్ చూస్తే ప్రైవేటు ఫంక్షన్ కి రాష్ట్రపతి గెస్ట్ గా వెళ్తున్నట్టు ఉంది. ఎన్టీఆర్ భార్యగా నన్ను పిలవకపవడం అన్యాయం. ఆయన ప్రాణాలు తీసిన వాళ్ళు వారసులుగా చలామణి అవుతున్నారు. భార్యగా నాణెం అందుకోడానికి అర్హత నాకే ఉంది.. వీళ్లకు లేదు. ప్రాణాలు తీసిన వాళ్ళు నాణెం విడుదలకు వెళ్లారు?’’ అని సూటిగా నిలదీశారామె. పురంధేశ్వరిపై ధ్వజం ఇక నుంచి తన పోరాటం పురంధేశ్వరిపైనేనని లక్ష్మీ పార్వతి ప్రకటించారు. ‘‘ఎన్టీఆర్ కి అర్ధాంగిగా నన్ను ఆహ్వానించకపోవడం దుర్మార్గం. తండ్రికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తులా కుటుంబ సభ్యులగా చెలామణీ అవుతారా?. పురంధేశ్వరి ఎంతో దుర్మార్గురాలు. నా వల్ల మీకు జరిగిన నష్టం ఏమిటి. ఎన్టీఆర్ కొడుకులు అమాయకులు. కూతుళ్లు పురందేశ్వరి, భువనేశ్వరులే దుర్మార్గులు. పురంధేశ్వరి చంద్రబాబుతో కలిసి కుట్ర చేస్తోంది. పురంధేశ్వరి తిరిగిన ప్రతీనియోజకవర్గంలో తిరుగుతా. ఒక్క సీటు కూడా ప్రచారం చేస్తా. వీళ్ళ గురించి ntr ఏమన్నారో ప్రజలకు వివరిస్తా. ఎన్నాళ్ళు వీళ్ళ నుండి అవమానాలు పడుతూ ఉండాలి. పురంధరేశ్వరి కి నేను ఏమి అడ్డం వచ్చాను.. అయన కష్టాల్లో ఉంటే పురంధరేశ్వరి వచ్చిందా..?. నన్నెందుకు చులకన చేస్తున్నారు.. నన్ను చులకన చేస్తే NTR ను చేసినట్టే. NTR ను చంద్రబాబు బయటకి వెన్నుపోటు కు ఇంటర్నల్ గా పురంధరేశ్వరి ప్రధాన కారకురాలు. పురంధేశ్వరి రాజకీయాల్లోకి వద్దు అన్నారని NTR పై కుట్ర చేసింది. తండ్రిపై కోపంతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది. కేంద్ర మంత్రిగా ఉండి అవినీతి చేసింది పురంధరేశ్వరి. ‘‘నాకు జరిగిన అవమానం నీకు ఏదో ఒక రోజు వస్తుంది. ఈరోజు నుంచి నా పోరాటం నీమీదే’’ అని పురందేశ్వరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారామె. చంద్రబాబుతో కలిసి పురంధేశ్వరి కుట్రలు.. నాకు జరిగిన అవమానం నా భర్త ఎన్టీఆర్కు అవమానంగా భావిస్తాను. NTR నన్ను వివాహం చేసుకున్నారో లేదో.. అయన పిల్లలు సమాధానం చెప్పాలి. నన్ను పిలవకుండా పురంధరేశ్వరి, చంద్రబాబు అడ్డుకున్నారు. NTR భార్యను అని మెడలో ఫోటో పెట్టుకుని తిరగాలా.?. NTR తో వివాహం అయినట్టు ఫోటోలు, వార్తా కధనాలు ఉన్నాయి. సాక్షాత్తు ntr అనేకసార్లు బహిరంగంగా చెప్పారు. నన్ను పెళ్ళి చేసుకోలేదని అని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది. NTR యుగ పురుషుడు అంటున్నారు.. పెళ్లి చేసుకోకపోతే యుగ పురుషుడు అవుతాడా..?. ఇంతకాలం ntr కుటుంబంపై అభిమానంతో సైలెంట్ గా ఉన్నాను. ఇకపై ఆ కుటుంబాన్ని వదిలిపెట్టను.. చంద్రబాబు, పురంధరేశ్వరి, బాలకృష్ణ అందరినీ బయటకు లాగుతా. వచ్చే ఎన్నికల తరువాత వీళ్ళు రాజకీయాల్లో ఉండకుండా చేస్తా. పురంధేశ్వరి టీడీపీ ఏజెంట్ ఎన్నికల సమయంలో ntr ను వాడుకుంటున్నారు. కేంద్రం భారతరత్న ఇస్తాను అంటే పురంధరేశ్వరి అడ్డుకుంది. భువనేశ్వరి, పురంధరేశ్వరి ఇద్దరూ తండ్రికి ద్రోహం చేశారు.. మళ్లీ పురంధేశ్వరి, చంద్రబాబు ఏకమైపోయారు. కానీ, నాకంటే ఎక్కువ అవమానానికి పురంధరేశ్వరి గురవుతారు. ఎన్టీఆర్కు రావాల్సిన భారతరత్న రాకుండా చేశారు. పురంధేశ్వరి బిజెపి లో ఉంటూ టిడిపికి పనిచేయడమేంటి?. బిజెపికి చెబుతున్నా...పురందేశ్వరి టిడిపి ఏజెంట్ గా పనిచేస్తోంది...పురందేశ్వరి కుట్రలు అర్ధం చేసుకోవాలని బీజేపీని కోరుతున్నా. జూనియర్ను బాబుతో కలపాలని.. జూ ఎన్టీఆర్ కు ఆహ్వానం ఇచ్చారో లేదో నాకు తెలీదు. జూ ఎన్టీఆర్ వస్తే అక్కడ చంద్రబాబు, జూ ఎన్టీఆర్ ను కలపాలని ప్రయత్నం చేసింది. ప్రభుత్వ ఇన్విటేషన్ అయితే జూ ఎన్టీఆర్ హాజరు అయ్యేవారు. ప్రైవేటు ఫంక్షన్ కనుకే జూ ఎన్టీఆర్ హాజరుకాలేదు. పురంధరేశ్వరి కుట్రను బీజేపీ తెలుసుకోవాలని మరోసారి కోరుతున్నారు. చంద్రబాబు స్క్రిప్ట్ పురంధరేశ్వరి చదువుతుంది. సీఎం వైఎస్ జగన్ కి వ్యతిరేకంగా భయంకర కుట్రలు చేస్తున్నారు. నేను రాసిన లేఖలను సమాధానం రాలేదు. అందుకే ఢిల్లీ వెళ్తాను.. ప్రధాని, రాష్ట్రపతి, నిర్మలా సీతారామన్ లను కలుస్తా అని లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు. -
రాష్ట్రపతి ముర్ముకు లక్ష్మీపార్వతి లేఖ
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ నేత, ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఎన్టీఆర్ పేరు మీద రూ.100 నాణేం విడుదల కార్యక్రమానికి తనను ఆహ్వానించకపోవడంపై ఆమె లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ భార్యనైన తనను ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించలేదని, తక్షణం జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని లక్ష్మీపార్వతి లేఖలో కోరారు. భార్యగా తానే అసలైన వారసురాలినని లేఖలో పేర్కొన్న లక్ష్మీపార్వతి.. ఎన్టీఆర్ పేరుపై రూ.100 నాణెం విడుదల చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు, ఇతర కుటుంబసభ్యుల వల్లే ఎన్టీఆర్ చనిపోయారని, ఎన్టీఆర్ మరణానికి కారణమైన వారిని కార్యక్రమానికి పిలవడంపై లేఖలో లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: చంద్రబాబే కదా సిసలైన సైకో! -
ఇప్పుడు పార్టీ విడిచిపెట్టే వారికీ అదే గతి పడుతుంది: లక్ష్మీ పార్వతి
-
టీడీపీని నందమూరి కుటుంబానికి అప్పగించాలి: లక్ష్మీపార్వతి
సాక్షి, నెల్లూరు: చంద్రబాబు ఛాప్టర్ పుత్రుడు, దత్త పుత్రుడు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఎంత తిరిగినా ప్రజలు నమ్మరంటూ చంద్రబాబు నాయుడికి చురకలు అంటించారు తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మి పార్వతి. చంద్రబాబు హయాంలో అభివృద్ధి శూన్యమని, కష్టపడుతున్నాడు గనుకే ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారని ఆమె స్పష్టం చేశారు. చంద్రబాబు తన హయాంలో ధనవంతుడు అయ్యాడే తప్ప.. పేదల గురించి ఏమాత్రం పట్టించుకోలేదని పేర్కొన్నారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చెయ్యలేదు. పైగా ఇసుక మీద రూ. 4 వేల కోట్లు అక్రమంగా సంపాదించారు. అవినీతిలో బాబుకి స్టాన్ఫర్డ్యూనివర్సిటీ సర్టిఫికెట్ ఇవ్వొచ్చు. సైకో, శాడిస్ట్ కాబట్టే.. ప్రశ్నించే వారిని గుర్రాలతో తొక్కించాడు. ఎమ్మార్వో వనజాక్షిని బెదిరించాడు. నాయీ బ్రాహ్మణులను జైల్లో పెడతానన్నాడు. అందుకే 2019లోనే చంద్రబాబు చాప్టర్ క్లోజ్ అయింది. కాబట్టి, పుత్రుడు లోకేష్, దత్త పుత్రుడు పవన్ కల్యాణ్లు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినా.. ప్రజలు నమ్మరు అని తేల్చేశారామె. అయోమయం లోకేష్ పనికి మాలిన నారా లోకేష్ కోసం కోట్లు ఖర్చు పెట్టి భాష నేర్పించాడు చంద్రబాబు. అయినా అతనిలో మార్పు రాలేదు. స్వర్గీయ ఎన్టీఆర్ మనవడిగా లోకేష్ను ప్రజలు స్వీకరించడం లేదు. అసలు ఆ పోలికే నక్కకి నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది. లోకేష్ అయోమయంలో మాట్లాడుతున్నాడు. టీడీపీ హయాంలో జరిగిన అవినీతిని.. వైఎస్సార్సీపీ హయాంలో జరిగినట్లు విమర్శిస్తున్నాడు. నందమూరి అభిమానులు చంద్రబాబు, లోకేష్లను రాజకీయాల నుంచి తరిమి కొట్టాలి. టీడీపీని తిరిగి నందమూరి కుటుంబానికి అప్పగించాలి. కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్లకు పార్టీ పగ్గాలు అప్పగించాలి అని లక్ష్మీ పార్వతి డిమాండ్ చేశారు. ఇప్పుడే ఇలా మాట్లాడితే ఎలా? అధికారంలోకి రాక ముందే.. చంద్రబాబు సొంతపుత్రుడితో పాటు దత్తపుత్రుడు సైతం చంపుతా, నరుకుతా, బట్టలు విప్పి కొడతా అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. సినిమాలు చేసుకుంటున్న పవన్ని తెర మీదకు తెచ్చి.. కాపు నాయకుల్ని తిట్టిస్తున్నారు. విష వృక్షం నీడలో రాజకీయాలు చెయ్యొద్దని గతంలో పవన్ కల్యాణ్కి చెప్పాను అని లక్ష్మీపార్వతి గుర్తు చేసుకున్నారు. చీడ పురుగులు పోతేనే.. అమ్ముడుపోయే నాయకులు అన్ని పార్టీలో ఉంటారు.. అలాంటి చిడ పురుగులు వెళ్లిపోతేనే పార్టీ బలపడుతుంది. రాజకీయంగా చంద్రబాబును నమ్మకున్న వారు భూస్థాపితం అవ్వడం ఖాయం. గతంలో 23 మంది ఎమ్మెల్యే లను చంద్రబాబు కొనుగోలు చేశాడు. పార్టీ మారిన ఆ 23 మంది ఎమ్మెల్యే లకు ఇప్పుడు రోడ్డు మీద ఉన్నారు. ఒడిపోతాము, టికెట్ రాదనే భయంతోనే వాళ్ళు పార్టీ జంప్ చేశారు.. రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలకు రాని ఇబ్బంది, ఆ ముగ్గురికి ఏమొచ్చింది? కేవలం పార్టీ గుర్తు మీద గెలిచి స్వార్దం కోసం పార్టీ మారరు వాళ్లు అంటూ పేర్కొన్నారామె. ఇదీ చదవండి: దగ్గరుండి పవన్ పరువు తీసేశారు! -
చంద్రబాబు వల్ల ఎన్టీఆర్కు మూడు సార్లు గుండెపోటు : పోసాని
సాక్షి, విజయవాడ: లక్ష్మీ పార్వతి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు చంద్రబాబు నాయుడు చాలా ప్రయత్నించాడని, కానీ ఎన్టీఆర్ మాత్రం అవేవి పట్టించుకోలేదని నటుడు, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి అన్నారు. ఎన్టీఆర్ 100వ జయంతి నేడు. ఈ సందర్భంగా విజవాడలో ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పోసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఆయన నెంబర్ వన్ హీరో అని తెలుసు.. కృష్ణుడు అని తెలుసు.. వెన్నుపోటు పొడిపించుకున్నవాడని తెలుసు. చంద్రబాబు చేతుల్లో చనిపోయాడని తెలుసు. నేను చెప్పాల్సింది ఏం లేదు. (చదవండి: వాళ్లే ఎన్టీఆర్కు నిజమైన వారసులు: లక్ష్మీపార్వతి ) ఎన్టీఆర్ జీవితంలో మీకు తెలియని కొన్ని నిజాలు చెబుతా. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతిని ఆయనే తీసుకొచ్చుకున్నాడు. ఆమెకు అప్పటికే చాలా ఆస్తులు ఉన్నాయి. ఆమె ఓ లెక్చరర్. సంస్కృతం బాగా వచ్చు. గొప్ప మేధావి. అలాంటి వ్యక్తి ఎన్టీఆర్ పక్కన ఉంటే తన ఆటలు సాగవని చంద్రబాబు భావించాడు. ఎలాగైనా ఆమెను బయటకు పంపించాలని కుట్ర పన్నాడు. లక్ష్మీ పార్వతి స్నేహితురాలి కొడుకుతో ఆమెకు అక్రమ సంబంధం ఉందని పుకార్లు పుట్టించాడు. ఇదే విషయం ఎన్టీఆర్ వరకు వెళ్లింది. ఓ రోజు ఎన్టీఆర్.. లక్ష్మీ పార్వతిని, ఆ అబ్బాయిని, చంద్రబాబుని ఇంట్లోకి పిలిపించుకున్నాడు. తిరుపతి లడ్డు ఆ అబ్బాయి చేతిలో పెట్టి.. ‘దీనిపై ప్రమాణం చేసి చెప్పు.. లక్ష్మీ పార్వతికి నీకు మధ్య ఉన్న సంబంధం ఏంటి?’ అని అన్నాడు. అప్పుడు ఆ అబ్బాయి గట్టిగా ఏడుస్తూ..‘లక్ష్మీ పార్వతి నాకు తల్లి లాంటిది సర్. నేను ఏ తప్పు చేయలేదు’ అని చెప్పాడు. అప్పుడు వెంటనే ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులందరిని పిలిచి.. ‘నా ఆరోగ్యం సహకరించడం లేదు. తోడు కోసం ఆ అమ్మాయి(లక్ష్మీ పార్వతి)ని పెళ్లి చేసుకుంటాను’ అని చెప్పాడు. అప్పుడు ఇంట్లో వాళ్లు ఎవరూ ఒప్పకోలేదు. కారణం ఎన్టీఆర్ ఎక్కడ తన ఆస్తులన్నీ ఆమెకు ఇస్తారోననే భయం. కానీ లక్ష్మీ పార్వతి ఎప్పుడూ ఆస్తుల గురించి ఎన్టీఆర్ దగ్గర ప్రస్తావించలేదు. ఓ గొప్ప వ్యక్తికి తోడుగా ఉంటున్నానని సంతోష పడింది. చంద్రబాబు చేసే పనుల వల్ల ఎన్టీఆర్కు మూడు సార్లు గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో చిన్న పిల్లాడిలా అతన్ని చూసుకుంది లక్ష్మీ పార్వతి గారే. ఎవరూ అతన్ని పట్టించుకోలేదు. ఆయన్ని బతికించుకోవడం కోసం ప్రతి సంవత్సరం అవార్డులు ఇస్తుంది లక్ష్మీ పార్వతి. ఎన్టీఆర్ ఆస్తులన్నీ చంద్రబాబు, అతని వారసులు తీసుకుంటే.. ఈమె మాత్రం ఇప్పటికి అతని పేరుని బతికించుకోవడం కోసం కష్టపడుతోంది. అవార్డులు, సేవా కార్యక్రమాలు చేసుకోవడం కోసం తన గాజులతో సహా అన్ని అమ్ముకుంది. కానీ వైఎస్ జగన్ చేతిలో ఘోరంగా ఓడిన తర్వాత.. ఇప్పుడు ఎన్టీఆర్ బొమ్మను చూసి ఓట్లు వేయండి అంటూ చంద్రబాబు కపట ప్రేమను చూపిస్తున్నాడు. రామరావు ఆత్మ శాంతించాలంటే మళ్లీ ఇదే ప్రభుత్వం అధికారంలోకి రావాలి. చంద్రబాబు లాంటి గుణంలేని నాయకుడికి తగిన బుద్ది చెప్పాలి’అని పోసాని అన్నారు. -
ఎన్టీఆర్ ను చంద్రబాబు ఎన్నోసార్లు అవమానించాడు
-
వాళ్లే ఎన్టీఆర్కు నిజమైన వారసులు: లక్ష్మీపార్వతి
సాక్షి, విజయవాడ: నగరంలోని ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు నందమూరి లక్ష్మీపార్వతి, డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ, కొడాలి నాని, పేర్నినాని హాజరయ్యారు. ఈ సందర్బంగా లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. విజయవాడ నడిబొడ్డున ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరగడం చాలా ఆనందంగా ఉంది. ఎన్టీఆర్కు జరిగిన అన్యాయంపై పోరాడి పోరాడి అలసిపోయాను. నా ఆవేదనను ఒక్కరు కూడా పట్టించుకోలేదు. ఎన్టీఆర్ వారసులమంటూ ఎవరెవరో డబ్బాలు కొట్టుకుంటున్నారు. కుడుపున పుడితే వారసులు కాదు. ఎన్టీఆర్కు చివరి వరకూ అండగా నిలబడిన వారే నిజమైన వారసులు. ఎన్టీఆర్కు చివరి క్షణాల్లో అండగా ఉంది దేవినేని నెహ్రూ మాత్రమే. దేవినేని నెహ్రూ మాత్రమే ఎన్టీఆర్కు అసలైన వారసుడు. మాట్లాడటం కూడా రాని లోకేష్ కూడా నేనే వారసుడినంటున్నాడు. ఎన్టీఆర్ను మోసం చేసిన ఈ దుర్మార్గులు ఎలా వారసులు అవుతారు. చంద్రబాబు అంత నీచుడు మరొకడు లేడు. చంద్రబాబు వెన్నుపోటుపై ఎన్టీఆర్ ఎంతో బాధపడ్డారు. ఎన్టీఆర్ను చంద్రబాబు ఎన్నోసార్లు అవమానించాడు. ఎన్టీఆర్ పేరు కానీ.. ఫొటో కానీ.. పెట్టుకునే అర్హత చంద్రబాబుకు లేదు. ఎన్టీఆర్ ఆశయాలను సమాధి చేసిన వ్యక్తి చంద్రబాబు. ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. నా వ్యక్తిత్వాన్ని నిలబెట్టిన సీఎం జగన్కు జీవితాంతం రుణపడి ఉంటాను. క్లిష్టసమయంలో డైరెక్టర్ రాం గోపాల్వర్మ నాకు ధైర్యానిచ్చారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో నా పాత్ర గురించి అందరికీ చెప్పారు. నా క్యారెక్టర్ను తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినపుడు నాకు పోసాని కృష్ణమురళీ ఓ సోదరుడిగా అండగా నిలిచారు అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: చంద్రబాబు లాంటి నీచుడు ఎక్కడా ఉండడు: లక్ష్మీపార్వతి -
చంద్రబాబు లాంటి నీచుడు ఎక్కడా ఉండడు: లక్ష్మీపార్వతి
సాక్షి, అమరావతి: ఎన్టీఆర్ను చంపిన దుర్మార్గుడు చంద్రబాబు అని నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు. చంద్రబాబు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు చేస్తే ఆయన ఆత్మ క్షోభిస్తోందని ఆమె తెలిపారు. ఎన్టీఆర్ పేరు ఎత్తడానికి కూడా చంద్రబాబుకు అర్హత లేదు.. చివరికి ఆయన కుటుంబాన్ని కూడా దూరం చేశాడని మండిపడ్డారు. చంద్రబాబు, రామోజీరావు కలిసి పార్టీని కూలదోశారు.. వైస్రాయ్ హోటల్ వద్ద చెప్పులు వేయించి ఎన్టీఆర్ను తీవ్రంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పేరును జిల్లాకు పెట్టిన మనసున్న వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. ఆస్తులు పంచుకున్న కొడుకులు, పార్టీని లాక్కున్న చంద్రబాబు.. ఎన్టీఆర్కు వారసులు కాదని.. ఎన్టీఆర్ పేరు ఎత్తడానికి వీళ్లకున్న అర్హత ఏంటని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పేరు వాడటానికి కొడుకులకు కూడా నైతిక హక్కు లేదని.. ఎన్నికలొచ్చే సరికి కొడుకులకు తండ్రి గుర్తుకువచ్చాడా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్కు భారతరత్న కావాలని చంద్రబాబు ఏరోజూ అడగలేదని నాటి ప్రధాని వాజ్పేయి తనతో స్వయంగా చెప్పారన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిజమైన వారసుడు సీఎం జగన్: దేవినేని అవినాష్ ఎన్టీఆర్ ఆశయాలకు నిజమైన వారసుడు సీఎం జగన్ అని దేవినేని అవినాష్ అన్నారు. కేవలం ఓట్ల కోసమే టీడీపీ ఎన్టీఆర్ పేరును వాడుకుంటోందని మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ గుర్తుకురారు.. ప్రతిపక్షంలో ఉంటే మాత్రం ఎన్టీఆర్ గుర్తొస్తారని ఎద్దేవా చేశారు. చదవండి: టీడీపీ మహానాడులో లోకేష్కు షాకిచ్చిన కార్యకర్త -
రజినీకాంత్ చంద్రబాబుతో కలిసి ఆయన కూడా వెన్నుపోటు దారుడుగా మారారు : లక్ష్మీపార్వతి
-
రజినీకాంత్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన లక్ష్మీపార్వతి
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుతో కలిసి రజినీకాంత్ కూడా వెన్నుపోటుదారుడిగా మారారని ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఆమె ‘సాక్షి’ మీడియాతో మాట్లాడుతూ, రజనీకి చిత్తశుద్ది ఉంటే ఎన్టీఆర్ చివరి రోజుల్లో మాట్లాడిన మాటలు తెలుసుకోవాలని హితపు పలికారు. అవేమీ లేకుండా పుస్తకాలు రిలీజ్ చేసినంత మాత్రాన జనం నమ్మరన్నారు. బాలకృష్ణ రెండు సినిమాలు తీస్తే ఏమైందో.. రజనీకాంత్ మాటలకు కూడా అలాంటి విశ్వసనీయతే ఉంటుందన్నారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు, రజనీకాంత్కు లేదని స్పష్టం చేశారు. ఇంకోసారి ఎన్టీఆర్ గురించి రజనీకాంత్ మాట్లాడితే సహించేది లేదన్నారు. చదవండి: ‘పవన్ను బ్లాక్మెయిల్ చేసేందుకు రజినీ రంగంలోకి!’ ‘వెన్నుపోటు సమయంలో చంద్రబాబుకు అండగా నిలిచిన వ్యక్తి రజనీకాంత్.. తర్వాత ఎన్టీఆర్ను కలిసి తాను తప్పు చేశానని క్షమించమని అడిగారు. వెన్నుపోటు ఎపిసోడ్లో రజనీకాంత్పై అనేక విమర్శలు వచ్చాయి. తమిళ పత్రికలు తీవ్రంగా విమర్శలు రాశాయి. ఆ తర్వాత చాలా కాలంగా ఏపీ రాజకీయాల వైపు రాలేదు. ఇన్నాళ్ళ తర్వాత మళ్లీ చంద్రబాబు తెలివిగా రజనీకాంత్ను వాడుకుంటున్నారు. రజనీకాంత్ ద్వారా బీజేపీకి దగ్గర అవ్వాలని చంద్రబాబు ప్లాన్. అనేక సర్వేల్లో జగన్ పాలనపై ప్రజలు మద్దతు తెలుపుతున్నట్లు వస్తుంది. దీంతో చంద్రబాబు తట్టుకోలేక మళ్లీ సినిమా వాళ్లతో డ్రామాలాడిస్తున్నారు.’ అని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. చదవండి: ఏపీవ్యాప్తంగా మార్గదర్శి బ్రాంచ్ల్లో సీఐడీ సోదాలు -
రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ధనవంతుడిగా చంద్రబాబు
-
రిచెస్ట్ పొలిటీషియన్ చంద్రబాబు
-
చంద్రబాబు 5 లక్షల కోట్లు అక్రమంగా సంపాదించాడు: లక్ష్మి పార్వతి
-
విదేశాల్లో చంద్రబాబు నల్లధనం రూ.5 లక్షల కోట్లు
తిరుపతి రూరల్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమార్జన చేసి దుబాయ్, స్విట్జర్లాండ్లో దాచిన రూ.5 లక్షల కోట్ల నల్లధనాన్ని స్వదేశానికి రప్పించాలని తెలుగు, సంస్కృత అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు. తిరుపతిలోని అకాడమీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. విదేశాల్లో లక్షల కోట్ల రూపాయలు దాచిన చంద్రబాబుపై ఈడీ, సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీనిపై స్పందించాలని కోరారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాయనున్నట్లు చెప్పారు. చంద్రబాబు అక్రమార్జనలపై పోరాటం చేస్తూనే ఉంటానన్నారు. విషయ పరిజ్ఞానం లేని దద్దమ్మ, ఒక్కచోట కూడా గెలవలేని లోకేశ్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించడం కామెడీగా ఉందన్నారు. ప్రజాపాలన సాగుతున్న రాష్ట్రంలో విమర్శించేందుకు ఎలాంటి అవకాశం లేకపోవడంతో ప్రతిపక్ష పార్టీ వారు ఫ్ర్రస్టేషన్లో బూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. టీడీపీ సోషల్ మీడియాలో పనికిమాలిన వెధవల్ని, పెంపుడు కుక్కల్ని పోషిస్తూ మహిళలను సైతం కించపరచడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇ చ్చిన హామీల్లో ఇప్పటికే 98 శాతం హామీలను అమలు చేసినందువల్లే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి ఆదరించాలని కోరుతున్నారని చెప్పారు. బాలకృష్ణ మాట్లాడితే ఆరు నెలలకు కూడా అర్థం కాదు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఏం మాట్లాడతారో, ఎందుకు మాట్లాడుతారో ఆరునెలలకు కూడా ఎవ్వరికీ అర్థం కాదని ఎద్దేవా చేశారు. పుస్తకాలు చదువుతున్న పవన్కళ్యాణ్కు ప్రజాసంక్షేమం ఎందుకు కనపించడంలేదని ప్రశ్నించారు. కనిపించే అభివృద్ధి, సంక్షేమాన్ని సైతం విమర్శిస్తూ ఉంటే రానున్న ఎన్నికల్లో సైతం ఆయన్ని రెండు కాదు.. మూడుచోట్ల పోటీచేసినా ప్రజలు ఓడిస్తారని హెచ్చరించారు. రాష్ట్రానికి పట్టిన సైకో చంద్రబాబు అని, ఎల్లో మీడియా అండతో కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టాలని ప్రయతి్నస్తూనే ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు పాపాలు పండిపోయాయని, ఆయనకు రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు. తెలుగు అకాడమీకి పూర్వవైభవం రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నిర్విర్యం చేసిన తెలుగు అకాడమీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్వవైభవం తీసుకొస్తున్నారని చెప్పారు. ఇప్పటికే ఇంటర్మిడియట్ పుస్తకాలను ముద్రిస్తున్నామని, త్వరలో డిగ్రీ పుస్తకాలను, పోటీ పరీక్షలకు అవసరమయ్యే 17 రకాల పుస్తకాలను ముద్రించనున్నట్లు తెలిపారు. అన్ని జిల్లాల మాండలిక పుస్తకాలు ముద్రిస్తామన్నారు. జాతీయ సంస్కృత యూనివర్సిటీతో కలిసి పనిచేస్తామని తెలిపారు. తెలుగు అకాడమీ పేరుతో నకిలీ వెబ్సైట్ తయారు చేసి, ఉద్యోగాలు ఇస్తామంటూ మోసాలు చేస్తుండటంపై విజయవాడలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ నుంచి రూ.90 కోట్లు రావాల్సి ఉందని, విలువైన ఆస్తులు కూడా అక్కడ ఉన్నాయని తెలిపారు. వాటికోసం ప్రయతి్నస్తుంటే తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని, దీనిపై హైకోర్టులో పోరాడుతున్నామని ఆమె చెప్పారు. -
తారకరత్న మృతిపై లక్ష్మీ పార్వతి సంచనల వ్యాఖ్యలు
-
తారకరత్న మృతి బాధాకరం.. చంద్రబాబుపై లక్ష్మీపార్వతి సంచలన కామెంట్స్
సాక్షి, తిరుపతి: టీడీపీ నేత, నటుడు నందమూరి తారకరత్న అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. కాగా, తారకరత్న మృతిపై తెలుగు అకాడమీ ఛైర్పర్సన్ లక్ష్మీపార్వతి సంచలన కామెంట్స్ చేశారు. ప్రాణాలు కోల్పోయిన తారకరత్నను తమ స్వార్ధ రాజకీయాల కోసం ఇన్నాళ్లు ఆసుపత్రిలో ఉంచారని తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా, లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడుతూ.. తారకరత్న అకాల మరణం చాలా బాధాకరమైన విషయం. చంద్రబాబు మా కుటుంబంపై నీచమైన రాజకీయ విధానం అవలంభించాడు. నారా లోకేష్ పాదయాత్రకు, లోకేష్కు చెడ్డ పేరు వస్తుందని తారకరత్న మరణవార్తను ఇన్నాళ్లు దాచిపెట్టిన వ్యక్తి చంద్రబాబు. ప్రాణాలు కోల్పోయిన తారకరత్నను తమ స్వార్ధ రాజకీయాల కోసం ఇన్నాళ్లు ఆసుపత్రిలో ఉంచారు. రెండు రోజులు పాదయాత్ర వాయిదా వేసినప్పడే మరణ వార్త ప్రకటించి ఉండాలి. ప్రజలు అపశకునంగా భావిస్తారని ఇన్నాళ్లు డ్రామా చేశారు. తండ్రీకొడుకులు రాష్ట్రానికే అపశకునం అని ప్రజలకు తెలుసు. తారకరత్న భార్యాబిడ్డలను, తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురిచేసిన వ్యక్తి చంద్రబాబు. నీచమైన రాజకీయాలు చేయడం మానేస్తేనే నందమూరి కుటుంబం బాగుపడుతుందని వ్యాఖ్యలు చేశారు. -
ఇరుకు సందుల్లో మీటింగ్లు పెట్టి ప్రాణాలు తీస్తే చూస్తూ ఊరుకోవాలా?
విశాఖపట్టణం: ఏపీ రాజకీయాల్లో ప్రతిపక్షాల తీరు హేయంగా ఉందని తెలుగు సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు నందమూరి లక్ష్మిపార్వతి విమర్శించారు. ప్రభుత్వం నిజం చెబితే తప్పుగా ఉందని, అదే టీడీపీ తప్పు చేసినా ఒప్పు అన్నట్లు ప్రతిపక్షాల తీరు ఉందన్నారు. ‘ప్రజల ప్రాణాలను కాపాడేందుకు జీవో నెం. 1 తీసుకువస్తే స్టేలతో అడ్డు పడుతున్నారు. ఎక్కడా వైఎస్సార్సీపీ కోర్టులను విమర్శించదు. కానీ కోర్టులను తప్పు దారి పట్టించడంలో టీడీపీ దిట్ట. ఇరుకు సందుల్లో మీటింగ్లు పెట్టీ ప్రాణాలు తీస్తే చూస్తూ ఊరుకోవాలా?, హంతకులు ఇద్దరు సాక్ష్యం చెప్పుకున్నట్లు బాలకృష్ణ, చంద్రబాబు మాటలు ఉన్నాయి. వ్యవస్థను అడ్డం పెట్టుకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. మూడు రాజధానుల విషయంలో రాజకీయం చేస్తూ కుట్రలు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలకు ఆత్మ గౌరవం ఉండదా?, ఎన్టీఆర్ డబ్బు తీసుకుని ఆయనను దూషించిన వ్యక్తులే ఇప్పుడు ఫోటోలు వాడుతున్నారు’ అని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. -
లక్ష్మీపార్వతికి మాతృ వియోగం
సాక్షి, అమరావతి: ఏపీ తెలుగు, సంస్కృతి అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతికి మాతృ వియోగం కలిగింది. ఆమె తల్లి దాసరి సామ్రాజ్యం అనారోగ్యంతో ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. -
జగన్ పరిపాలనే ఆయన్ని మళ్లీ గెలిపిస్తుంది
గుంటూరు ఎడ్యుకేషన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందిస్తున్న ప్రజాసంక్షేమ పరిపాలనే ఆయన్ని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తుందని రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రజలు మరోసారి ఓటువేసి తప్పు చేయరని, 2024లో జరిగేవి ఆయనకు చివరి ఎన్నికలని పేర్కొన్నారు. గుంటూరు బ్రాడీపేటలో ఉన్నవ లక్ష్మీనారాయణ, లక్ష్మీబాయి దంపతులు నెలకొల్పిన శారదానికేతన్ మహిళా విద్యాసంస్థల శతాబ్ది మహోత్సవాల్లో మంగళవారం ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల తరువాత బాబుతో పాటు టీడీపీ భూస్థాపితం కానుందని చెప్పారు. తన పాలనలో మేలు జరిగితే తిరిగి వైఎస్సార్సీపీకి ఓటెయ్యాలని సీఎం వైఎస్ జగన్ నిర్మొహమాటంగా ప్రజలకు చెబుతున్నారన్నారు. ఇటువంటి మాట చెప్పే దమ్మూ, ధైర్యం ప్రజానాయకుడైన జగన్కు మాత్రమే ఉన్నాయని చెప్పారు. అధికారం దక్కలేదనే అక్కసుతో బాబు ప్రజలను బూతులు తిడుతున్నారని అన్నారు. గతంలో చాన్స్ ఇచ్చిన ప్రజలే తిరిగి ఆయన్ని 23 సీట్లకు పరిమితం చేశారని గుర్తుచేశారు.