Lakshmi Parvathi
-
చంద్రబాబు రాజకీయం అంతా మోసం, అబద్ధాలు
-
చంద్రబాబు జీవితమంటేనే కుట్రలు, హత్యా రాజకీయాలు: లక్ష్మీపార్వతి
సాక్షి, తాడేపల్లి: హత్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని మండిపడ్డారు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి. అలాగే, చంద్రబాబు రాజకీయ జీవితం అంతా కుట్రలు, హత్యా రాజకీయాలే అని ఆరోపించారు. పోలీసుల మీద దాడులు చేయించిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. పరిపాలన చేయటం చేతగాని అసమర్థుడు చంద్రబాబు అంటూ ఘాటు విమర్శలు చేశారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘కుట్రలు, కుతంత్రాలకు ప్రతిబింబం చంద్రబాబు. తన చేతికి మట్టి అంటకుండా పని కానిచ్చే వ్యక్తి చంద్రబాబు. తన రాజకీయ జీవితం అంతా కుట్రలు, హత్యా రాజకీయాలే. అసెంబ్లీలో పచ్చి బూతులు మాట్లాడుతూ బయట మాత్రం సుద్దులు చెప్తున్నారు. వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యుల మీద పచ్చిగా మాట్లాడుతున్నారు. మరి వారి మీద కేసులు, శిక్షలు ఎందుకు విధించడం లేదు.వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఆ పథకాలకు పేరు పెడితే తప్పు పడుతున్నారు. మరి చంద్రబాబు హయాంలో ప్రతి చెట్టు, పుట్టకు పచ్చ రంగులు వేయలేదా?. చంద్రన్న తోఫా పేరుతో సంచుల మీద కూడా చంద్రబాబు ఫొటోలు వేయలేదా?. రాజకీయ కక్షతోనే ఎన్టీఆర్ని పదవి నుంచి దించేశారు. నన్ను రోడ్డు మీద పడేశారు.వినుకొండలో రషీద్ను దారుణంగా హత్య చేయించింది ఎవరు?. పోలీసులను కీలు బొమ్మల్లా చేసుకుని దుర్మార్గాలు చేస్తున్నారు. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా చంద్రబాబుకు సిగ్గు రాలేదు. మహిళల మీద అత్యాచారాలు చేసినా.. టీడీపీ గూండాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?. పరిపాలన చేయటం చేతగాని అసమర్థుడు చంద్రబాబు. వైఎస్ జగన్ తెచ్చిన పథకాలను కాపీ కొట్టటానికి సిగ్గులేదా చంద్రబాబూ?. వైఎస్ జగన్పై రెండు సార్లు హత్యాయత్నం చేయించిన నీచుడు బాబు. పోలీసుల మీద దాడులు చేయించిన వ్యక్తి. చంద్రబాబు నీచ, హత్యా రాజకీయాలు ప్రజలందరికీ తెలుసు. ఇప్పటికైనా విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలి’ అని డిమాండ్ చేశారు. -
చంద్రబాబుకి లక్ష్మి పార్వతి వార్నింగ్
-
లోకేష్ను అదుపు చేయకపోతే బాబుకు కష్టాలు తప్పవు: లక్ష్మీపార్వతి
సాక్షి, హైదరాబాద్: ఏపీలో కూటమి సర్కార్.. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కారదర్శి లక్ష్మీపార్వతి. ఇదే సమయంలో నారా లోకేష్ను అదుపులో పెట్టకపోతే రానున్న రోజుల్లో చంద్రబాబు తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకుంటారని తెలిపారు.నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్పై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కారదర్శి నందమూరి లక్ష్మీపార్వతి స్పందించారు. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..‘అనారోగ్యంతో బాధ పడుతున్న పోసానిని ఇబ్బంది పెడుతున్నారు. తనకు వచ్చిన అవార్డును పోసాని తిరస్కరించారు. ఆయన అవార్డు తిరస్కరించారని కక్ష గట్టి కేసులు పెట్టారు. నారా లోకేష్ను అదుపులో పెట్టకపోతే రానున్న కాలంలో చంద్రబాబుకు కష్టాలు తప్పవు. మీరంతా రాక్షస జాతిలో పుట్టారా?. పురాణాల్లో చదువుకున్నాం. ఇప్పుడు చూస్తున్నాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.పోసానికి అస్వస్థత..ఇదిలా ఉండగా.. పోసాని కృష్ణమురళిని అక్రమ కేసులో ఇరికించి, అరెస్టు చేయడమే కాకుండా, ఆయన ఆరోగ్యం పట్ల కూడా ప్రభుత్వం కుట్రపూరితంగానే వ్యవహరించింది. బుధవారం రాత్రి హైదరాబాద్లో అరెస్టు చేసిన పోసాని మురళిని గురువారం రాత్రి కోర్టులో హాజరుపరిచి, శుక్రవారం రాజంపేట సబ్జైలుకు తీసుకెళ్లారు. అక్కడ విరేచనాలు అయినట్లు కుటుంబ సభ్యులకు పోసాని తెలిపారు. శనివారం గుండెల్లో, కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో ముందుగా అక్కడి పీహెచ్సీకి తరలించారు. అక్కడ ప్రాథమికంగా పరీక్షలు చేయించి, వైద్యుల సూచన మేరకు కడపలోని రిమ్స్కు తరలించారు. ఇక్కడ కూడా ఆయన పట్ల ప్రభుత్వం, పోలీసులు అత్యంత క్రూరంగా వ్యవహరించారు. గుండెల్లో, కడుపు నొప్పితో బాధపడుతున్నా అంబులెన్సులో కాకుండా పోలీసు వాహనంలోనే తీసుకెళ్లడం క్రూరత్వమే.పైగా, ఆయనది అనారోగ్యం కాదని, నటన అంటూ రైల్వే కోడూరు రూరల్ సీఐ వెంకటేశ్వర్లు రిమ్స్ ఆవరణలోనే మీడియాతో మాట్లాడుతూ చెప్పడం అందరినీ విస్మయపరిచింది. 67 ఏళ్ల వయస్సులో ఉన్న ఓ ప్రముఖుడు, సీనియర్ సిటిజన్ పట్ల ఓ సీఐ ఇంత దారుణంగా మాట్లాడటం ప్రభుత్వ కర్కశత్వానికి నిదర్శనమని పలువురు మండిపడుతున్నారు. ఇదే తరుణంలో పోసానికి ఏదైనా జరగరానిది జరిగితే బాధ్యత ఎవరిదంటూ ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. -
చంద్రబాబుది రాజకీయం కాదు.. బ్రోకరిజం: లక్ష్మీపార్వతి
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు చేసేది రాజకీయం కాదని.. బ్రోకరిజం అంటూ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఆడపిల్లల కన్నీళ్లు ఈ ప్రభుత్వానికి కనపఢం లేదని దుయ్యబట్టారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబుని మనిషిగా కూడా తాను గుర్తించటం లేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు వలన ఎల్లో మీడియా.. ఎల్లో మీడియా వలన చంద్రబాబు బతుకుతున్నారు. వీరి వలన ప్రజలకు ఎలాంటి మేలు జరగదంటూ ఆమె వ్యాఖ్యానించారు.‘‘చంద్రబాబుకు తన పాలన మీద నమ్మకం ఉంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలి. జనం ఎవరికి ఓట్లు వేస్తారో తేలుతుంది. లక్షన్నర కోట్లు అప్పులు చేసి ఏం చేశారు?. మీ జేబుల్లోకి వెళ్లాయా?. ప్రజలను పూర్తిగా మద్యం మత్తులోకి నెట్టేశారు, జనాన్ని మత్తులో పెట్టి పరిపాలన చేస్తున్నారు. రేషన్ డిపోలను టీడీపీ ఆఫీసుల్లో నిర్వహించటం ఈ పాలనలోనే చూస్తున్నాం. చంద్రబాబు పాలనలో రేపిస్టులు, దొంగలు కాలర్ ఎగురవేసుకుని తిరుగుతున్నారు. తిరుపతి లక్ష్మికి ఒక న్యాయం, ముంబాయి నటి జత్వానీకి ఇంకో న్యాయమా?’’ అంటూ లక్ష్మీపార్వతి నిలదీశారు.‘‘పరిపాలన చేసే అర్హత చంద్రబాబుకు లేదు. తిరుపతి లక్ష్మీ విషయంలో ప్రత్యేక కమిటీతో విచారణ జరపాలి. ఏబీ వెంకటేశ్వరరావు వంటి వ్యక్తి చేతిలో పెట్టి పోలీసు వ్యవస్థను నడపటం దారుణం. కులాల గురించి భయంకరంగా మాట్లాడిన వ్యక్తి ఏబీ వెంకటేశ్వరరావు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేయటం ఏంటి?. పిచ్చోడి చేతిలో రాయిలాగ ప్రభుత్వ పనితీరు మారింది. ఎన్టీఆర్ మంచిపాలనే ఇప్పటికీ ప్రజల్లో ఆయన ఉండటానికి కారణం. మరి చెప్పుకోవడానికి చంద్రబాబు ఏం పాలన చేస్తున్నారు. జీవిత చరమాంకంలో ఉన్న చంద్రబాబు ఇకనైనా మారాలి’’ అని లక్ష్మీ పార్వతి హితవు పలికారు.ఇదీ చదవండి: ఈ చంద్రబాబు ఛీటర్ కాదా?: వైఎస్ జగన్అధికారం కోసం చంద్రబాబు చేయని నీచపు పనలు లేవు. అబద్దాల కోటలో బతుకుతున్నాడు. తిరుపతి లడ్డూ నుంచి ప్రతి విషయంలోనూ అబద్ధాలే. లోకేష్ అవినీతి, అరాచకాలు విపరీతంగా ఉన్నాయి. నారావారి సంప్రదాయంలో చెడు మాత్రమే మిగిలింది. కన్నతండ్రిగా చంద్రబాబు లోకేష్ని కట్టడి చేయాలి. సనాతన ధర్మం అనే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు?. మహిళలపై అరాచకాలు జరుగుతుంటే ఎందుకు ప్రశ్నించటంలేదు?. తిరుపతిలో లక్ష్మిని కరిణ్రాయల్ అనేవాడు మోసం చేశాడు. తప్పు చేసిన వాడు రోడ్డు మీద తిరుగుతున్నాడు. బాధితురాలు జైలు పాలైంది. మిర్చి రైతులు ధరల్లేక అల్లాడిపోతుండే చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రజలంటే చంద్రబాబుకు గౌరవం లేదు’’ అని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. -
ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా లక్ష్మి పార్వతి హాట్ కామెంట్స్
-
నాపై సోషల్ మీడియాలో వేధింపులు.. బాబుకు బాధ్యత లేదా?: లక్ష్మీపార్వతి
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న వేధింపులపై స్పందించాల్సిన బాధ్యత మీకు లేదా చంద్రబాబు అని ప్రశ్నించారు నందమూరి లక్ష్మీపార్వతి(Lakshmi Parvathi). మీరు అనుకున్నా.. అనుకోకున్నా మీ అత్తగారిని కదా చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. అలాగే, ఎన్టీఆర్ గౌరవం కాపాడేలా తాను బ్రతుకుతున్నట్టు తెలిపారు.నేడు దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు (NTR) వర్ధంతి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు నందమూరి లక్ష్మీపార్వతి. ఇదే సమయంలో ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడ లక్ష్మీపార్వతి మాట్లాడుతూ..‘29 ఏళ్లుగా ఎన్టీఆర్కు దూరమై మనోవేదనకు గురవుతున్నాను. నా ఫోన్ నెంబర్ను ఎవరో టీడీపీ వాళ్లు సోషల్ మీడియాలో పెట్టారు. నిన్నటి నుంచి వరుసగా వెయ్యికిపైగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.మీరు అనుకున్నా.. అనుకోకున్నా మీ అత్తగారిని కదా చంద్రబాబు. ఇలాంటి అవమానం నాకు జరుగుతుంటే మీరు చూస్తూ ఉంటారా?. ఇన్నేళ్లు డబ్బులు ఉన్నా లేకున్నా ఎవరినీ చేయిచాచి అడగలేదు. ఎన్టీఆర్ గౌరవం కాపాడేలా బ్రతుకుతున్నాను. నామీద ఎందుకు మీకు కక్ష.. నేనేం తప్పు చేశాను. ఎన్టీఆర్ పేరుతో మీరంతా లక్షల కోట్లు సంపాదించారు. అలాగే పెద్దాయన్న సాగనంపారు. నాపై జరుగుతున్న వేధింపులపై స్పందించాల్సిన బాధ్యత మీకు లేదా చంద్రబాబు’ అని ప్రశ్నించారు.ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా ఆయనకు కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), కల్యాణ్ రామ్ (Kalyan Ram) పుష్ఫగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. వారితో పాటు నందమూరి బాలకృష్ణ (Nandmuri Bala Krishna), రామకృష్ణ (Rama Krishna)లు కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి నటుడిగా, నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ (NTR) ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. చంద్రబాబు కూడా ఎన్టీఆర్కు నివాళులు అర్పించనున్నారు. -
అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక చంద్రబాబు..?
-
గుర్తుపెట్టుకో.. జగన్ ఎవడ్నివదలడు.. వడ్డీతో కలిపి ఇచ్చేస్తాం
-
కూటమి ప్రభుత్వంపై లక్ష్మీ పార్వతి మండిపడ్డారు.
-
నీచపు చంద్రబాబుకు కాలమే బుద్ధి చెప్తుంది: లక్ష్మీపార్వతి
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్లో నీచమైన సామాజిక వ్యవస్థను తయారు చేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ మహిళా నేత లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఆమె శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కూటమి సర్కార్ ప్రజాసమస్యలను గాలికి వదిలేసింది. హామీల అమలుపై ప్రశ్నిస్తే.. అక్రమకేసులు పెడుతున్నారు. అర్థరాత్రి సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు. జగన్ను ఎదుర్కొనే దమ్ములేక కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు. పాలన చేతకాక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. నీచమైన సామాజిక వ్యవస్థను తయారు చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఎల్లో మీడియా సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తూనే ఉంది. బాబు, రామోజీ ఎన్ని కుట్రలు చేశారో నాకు తెలుసు. ఈనాడు పేపర్ కాదు.. విష పత్రిక. మార్గదర్శి పేరుతో ప్రజల సొమ్ము కొల్లగొట్టారు. ఈనాడులో ఎన్టీఆర్పై ఎన్నో దారుణమైన కార్టూన్లు వేశారు. ఎన్టీఆర్ను పిచ్చోడిలా చిత్రీకరించి బొమ్మలు వేశారు. ఈ మేరకు.. గతంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ను అవమానిస్తూ.. కించపరుస్తూ వేసిన కార్టూన్లను ఆమె మీడియాకు ప్రదర్శించి చూపించారామె. అలాగే.. దోచుకోవడం, వ్యవస్థలను మేనేజ్ చేయడమే బాబుకు తెలుసు. ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కల్యాణ్.. పారిపోయాడు. నీచపు చంద్రబాబుకు కాలమే బుద్ధి చెప్తుంది’’ అని లక్ష్మీపార్వతి అన్నారు. -
తుమ్మితే జగన్... ఎక్కిళ్ళు వస్తే జగన్.. చంద్రబాబు పై లక్ష్మీ పార్వతి ఫైర్
-
చంద్రబాబుకు నిలువెల్లా విషమే: లక్ష్మీపార్వతి ఆగ్రహం
సాక్షి, తాడేపల్లి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు ఎంత నీచానికైనా వెనుకాడడు అంటూ తీవ్ర విమర్శలు చేశారు.లక్ష్మీపార్వతి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు ఇవాళ దేవుడితో ఆటలాడుతున్నాడు. లడ్డూ తయారీలో ఎలాంటి కల్తీ నెయ్యి వాడలేదు. ఇది వందల ఏళ్లుగా అనవాయితీగా వస్తోంది. చంద్రబాబు హయాంలో నెయ్యిలో కల్తీ జరిగితే వైఎస్ జగన్పై నింద వేస్తున్నారు. చంద్రబాబు వల్ల తిరుమల గోవిందుడికి కళంకం వచ్చింది. స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు ఎంత నీచానికి అయిన వెనుకాడడు. చంద్రబాబుకు నిలువెల్లా విషమే ఉంటుంది’ అంటూ విమర్శించారు. ఇది కూడా చదవండి: తిరుమల లడ్డూపై మరో మారు చంద్రబాబు అబద్ధాలు -
చంద్రబాబు దేవుడితో కూడా ఆటలు అడుతున్నాడు: లక్ష్మీపార్వతి
-
KSR Live Show: రాష్ట్రాన్ని పాలిస్తున్నది చంద్రబాబు కాదు.. వెనక ఉన్నది ఎవరో చెప్పిన లక్ష్మీ పార్వతి
-
మంచి పరిపాలన వైఎస్ జగన్ కే సాధ్యం
-
ఎన్టీఆర్ ఆశీస్సులతో సీఎం జగన్ ప్రమాణస్వీకారం
-
ఎన్టీఆర్ స్మరణలో కుటుంబ సభ్యులు.. 101 జయంతికి ఘాట్ వద్ద నివాళులు (ఫొటోలు)
-
హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు
-
జగన్కు ఎన్టీఆర్ ఆశీస్సులున్నాయి: లక్ష్మీపార్వతి
హైదరాబాద్, సాక్షి: టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి నేడు(మే 28). ఈ సందర్భంగా ఆయన సతీమణి, వైఎస్సార్సీపీ నేత లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్లో మరోసారి మంచి పరిపాలనే నడుస్తుందని ఈ సందర్భంగా ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘వైఎస్ జగన్కు ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయి. జూన్ 4 తర్వాత జగన్ సీఎంగా ప్రమాణం చేస్తారు. ఏపీలో మళ్లీ మంచి పరిపాలన వస్తుంది’’ అని అన్నారామె. అంతకు ముందు.. మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్లు ఎన్టీఆర్కు నివాళులర్పించారు. తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకుని తాతను స్మరించుకున్నారు.ఇదీ చదవండి: మహోన్నత వ్యక్తిత్వం... మేరునగ ధీరత్వం! -
మహోన్నత వ్యక్తిత్వం... మేరునగ ధీరత్వం!
‘న నిశ్చితాత్ విరమంతి ధీరాః’ అని భర్తృహరి చెప్పినట్లు... తలపెట్టిన కార్యాన్ని సాధించే వరకు ధీరులు తమ ప్రయత్నాలను ఎన్ని ఇబ్బందులెదురైనా నిలబడి సాధిస్తారు. వెనక్కు తగ్గరు. అందుకు ఉదాహరణ ఎన్టీఆర్. ఆశయం లేని అడుగులు బురద గుంటలో ప్రయాణం లాంటివనీ, గమ్యం చేరవనీ నమ్మి ఆచరించిన వ్యక్తుల్లో ఎన్టీఆర్ అగ్రస్థానంలో నిలుస్తారు. గొప్ప మనసున్న తండ్రి ఆయన. భార్యను ప్రేమించి గౌరవించే మహోన్నత సంస్కారం ఆయనది. పేద ప్రజల్ని కన్న బిడ్డల్లాగా పరిపాలించారు. అవినీతి రహితమైన సమాజాన్ని ఏర్పరచటానికి చిత్తశుద్ధితో పాటుపడ్డారు. అందుకే – మరణించిన తరువాత కూడా ఆ మహోన్నత వ్యక్తి నేటికీ జీవించే ఉన్నారు.తెలుగు రాష్ట్రంలో కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో 1923 మే 28న జన్మించిన మహానేత ఎన్టీఆర్ గారికి నేటికి 101 సంవత్సరాలు. అయినా ఇప్పటికీ ఆయన దివ్య తేజస్సు తగ్గలేదు. మరణించి 28 సంవత్సరాలు అయినా ఎన్టీఆర్ పేరు అభిమానుల గుండెల్లో మారుమ్రోగుతూనే వుంది. ఆ రూపం అలరిస్తూనే ఉంది. ఆయన సినిమాలు, రాజకీయ జీవితంలో మాదిరిగానే ఆయన వ్యక్తిత్వంలోనూ అనేకానేక విశేషాంశాలు ఇమిడి ఉన్నాయి. ఎన్టీఆర్ గారిలో మొదటి నుండి కూడా ఇచ్చిన మాటకు కట్టుబడటం, అనుకున్నది సాధించేవరకు వెనుకడుగు వేయకపోవటం అనేవి ప్రత్యేక గుణాలు. ఇవే ఆయనను సినీ, రాజకీయ రంగాల్లో విజయపథం వైపు నడిపించాయి. ‘న నిశ్చితాత్ విరమంతి ధీరాః’ అని భర్తృహరి చెప్పినట్లు... తలపెట్టిన కార్యాన్ని సాధించే వరకు ధీరులు తమ ప్రయత్నాలను ఎన్ని ఇబ్బందులెదురైనా నిలబడి సాధిస్తారు. వెనక్కు తగ్గరు. ఆ లక్షణం ఎన్టీఆర్ తర్వాత మళ్లీ ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డిలో చూశాను. ముక్కుసూటిగా పోయే ఇలాంటి నాయకులకు శత్రువులు కూడా ఎక్కువే అనడటానికి వీరిద్దరూ ఎదుర్కొన్న సంఘటనలే సాక్ష్యం. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా – ఆయన భార్యగా అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తిని కనుక ఆయన వ్యక్తిత్వాన్ని తెలియచేసే ప్రధానమైన రెండు మూడు సంఘటనలు వివరిస్తాను. ఒక్క మా పెళ్లి విషయంలోనే తీసుకుంటే పెళ్లికి ముందు– తర్వాత ఎన్టీఆర్ ఎన్నో రకాల సమస్యల్ని ఎదుర్కొన్నారు. తిరుపతిలో జరిగిన ‘మేజర్ చంద్రకాంత్’ సినిమా వేడుకల్లో ఎన్టీఆర్ మా వివాహ ప్రకటన చేయగానే చంద్రబాబు ఆ ప్రకటన ప్రజల్లోకి వెళ్లకూడదని మైకులాపించి, లైట్లు ఆర్పించారు. అయినా ఆయన మరుసటి రోజు ఇంట్లోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి మా పెళ్లిని ప్రకటించి మరీ వివాహం చేసుకున్నారు. అక్కడ నుండి నన్ను ప్రజల్లోకి తీసుకెళ్లకుండా చేయటానికి చంద్రబాబు, కుటుంబ సభ్యులు కలిసి ఎన్నో పన్నాగాలు పన్నారు. ఎన్టీఆర్ ధైర్యంగా నన్ను అందరి ముందుకు తీసుకెళ్లి నా స్థానం ఏమిటో సగర్వంగా ప్రకటించారు. ప్రతి అవమానంలో అండగా నిలబడి మాకు కీడు చేస్తున్న వారందరినీ ఎదిరించారు. చీకటి రాజకీయాలకు అలవాటు పడ్డ చంద్రబాబు లాంటి వ్యక్తికి ఆయనొక సవాలుగా నిలబడ్డారు. పెద్ద వయస్సులో ఒంటరితనంతో బాధపడుతున్న ఎంతోమందికి మా వివాహం ఒక మార్గం చూపించింది. దాని మీద కొన్ని ఆర్గనైజేషన్స్ ఏర్పడటం కూడా ఒక విశేషమే! మరో సంఘటన – 1994 ఎన్నికల ప్రచారంలో నన్ను ఇంట్లో ఉంచమని అనేకమంది ద్వారా చెప్పించారు. ఎన్.వి రమణ లాంటి అన్యాయవాదుల్ని ఇంటికి పంపి ఈ పెళ్లి చెల్లదని కూడా వాదించేటట్లు చేశారు. ఎన్టీఆర్ దేనికీ చలించలేదు. తన ఆలోచన మార్చుకోలేదు. నన్ను తీసుకునే ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. స్వయంగా 216 స్థానాలు, మిత్ర పక్షాలకు మరో 34 స్థానాలు సంపాదించి రాజకీయరంగంలో ఒక రికార్డు సాధించారు. మళ్లీ ఆ స్థాయి రికార్డును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తిరగరాశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవిని తమ అధికార దాహంతో లాగేయాలని కుట్రలు పన్నిన రామోజీ, చంద్రబాబు అందుకు నన్నే కారకురాలిగా చూపించారు. ఒక రాజ్యాంగేతర శక్తిగా నా ప్రాతను చిత్రీకరించి, నన్ను విడిచి పెడితేనే తిరిగి పదవి ఇస్తామని ప్రలోభపెట్టారు. ఇక్కడే ఎన్టీఆర్ గొప్ప వ్యక్తిత్వం మేరు పర్వతం లాగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి పదవిని వదులుకోవటానికి సిద్ధపడ్డారు కానీ భార్యను మాత్రం వదులుకోలేదు. పైగా వారికో సవాల్ విసిరారు. ‘‘నా పార్టీ, నేను సాధించుకున్న పదవి నాకు తిరిగి ఇవ్వటమేమిటి? ధర్మబద్ధంగా వివాహం చేసుకున్న స్త్రీని బయటకు పంపించటం ఏమిటి? మీ భార్యల్ని అలా వదిలేస్తారా? నా భార్య తప్పు చేసిందని నిరూపించండి. బహిరంగంగా ఆమెను శిక్షిస్తాను’’ అన్నారు. ఈ మాటలు ఆయన ఆత్మవిశ్వాసాన్ని, తనపై నమ్మకాన్ని నిలబెట్టాయి. ఎప్పటికప్పుడు వారి నిందల నుండి నన్ను గుండెల్లో పొదువుకొని కాపాడుకున్నారు ఆయన. ఒక సందర్భంలో ఎన్టీఆర్ విలేకర్లతో మాట్లాడుతూ– ‘‘రాజ్యం కోసం ఆ రాముడు తన భార్యను అడవులకు పంపేశాడు. కానీ ఈ రాముడు తన భార్య గౌరవం కోసం అధికారాన్నే వదులుకున్నాడు’’ అన్నారు. ఇలాంటి నిశ్చితాభిప్రాయాలు ఎంతమంది మగవాళ్లలో ఉంటాయి?! చాలా తక్కువ మంది మాత్రమే కనిపిస్తారు. ఎన్టీఆర్ గారి సదభిప్రాయాలను, ఆశయాలను అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకుని కుటుంబ సభ్యులు ఎంతో బాధించారు– వేధించారు– అవమానాల పాలు చేశారు. అయినా చివరి క్షణం వరకు ఆయన తన కుటుంబాన్ని ప్రేమిస్తూనే ఉన్నారు. ప్రతిరోజూ వాళ్ల ఇంటికి స్వీట్లూ, ఫ్రూట్లూ పంపిస్తూనే వచ్చారు. వాళ్లు అప్పుడప్పుడూ వచ్చి డబ్బు పట్టుకుని పోతూ ఉండేవారు. మళ్లీ బయట మాత్రం వాళ్లంతా చంద్రబాబుతో చేతులు కలపడం! ఏది ఏమయినా గొప్ప మనసున్న తండ్రి ఎన్టీఆర్. భార్యను ప్రేమించి గౌరవించే మహోన్నత సంస్కారం ఆయనది. పేద ప్రజల్ని కన్న బిడ్డల్లాగా పాలించినవారు. అవినీతి రహితమైన సమాజాన్ని ఏర్పరచటానికి ప్రయత్నించి భంగపడ్డ ధీరుడు.ఎన్ని రకాలుగా చంద్రబాబు, రామోజీలు కుట్రలు పన్ని అవమానించినా, పదవి లాగేసినా తల వంచకుండా తన చివరి క్షణం వరకు ఆయన తన పోరాటాన్ని కొనసాగించారే తప్ప ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ‘‘స్థిరత్వం, ధీరత్వం, ఉచితజ్ఞతా, ప్రియ వక్తృత్వం– చత్వారో సహజాగుణాః అభ్యాసే న లభ్యంతే’’ అని పెద్దలు చెప్పినట్లు ఈ లక్షణాలు ఆయన పుట్టుకతోనే వచ్చాయి. చివరి వరకు ఆ గుణాలు నిలబెట్టుకున్న ధీర గంభీరుడు ఎన్టీఆర్. నిబద్ధత లేని జీవితం ముళ్ల చెట్టు లాంటిది. ఎవరికీ ఉపయోగం ఉండదు. ఆశయం లేని అడుగులు బురద గుంటలో ప్రయాణం లాంటివి. గమ్యం చేరవు. ఇది నమ్మి ఆచరించిన వ్యక్తుల్లో ఎన్టీఆర్ అగ్రస్థానంలో నిలుస్తారు. అందుకే మరణించి కూడా నేటికీ మన మధ్య జీవించే ఉన్నారు. డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి వ్యాసకర్త ఎన్టీఆర్ సతీమణి -
వదినమ్మ బండారం బయటపెట్టిన లక్ష్మీపార్వతి
-
వదిన మరిది బండారం బయటపెట్టిన లక్ష్మీపార్వతి
-
చంద్రబాబుకి బయపడి గుళ్లలో తలా దాచుకుంటున్నారు..
-
ఆఖరికి మోదీ కూడా..దిగజారుడు మాటలు ఎందుకు..?
-
లోకేష్ ఎంట్రీతోనే హత్యా రాజకీయాలు: నందమూరి లక్ష్మీపార్వతి
సాక్షి, గుంటూరు: మంగళగిరిలో నారా లోకేష్ ఎంట్రీతోనే హత్యా రాజకీయాలు మొదలయ్యాయని అన్నారు వైఎస్సార్సీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి. అలాగే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో చంద్రబాబు.. బీజేపీని ఎందుకు ప్రశ్నించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, లక్ష్మీపార్వతి ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లోకేష్ ఎంట్రీతోనే మంగళగిరిలో హత్యా రాజకీయాలు మొదలయ్యాయి. దీనికి ఉదాహారణే వెంకటరెడ్డి హత్య. చంద్రబాబు, నారా లోకేష్ హింసా రాజకీయాలకు పాల్పడే వ్యక్తులు. రాజధాని భూముల కేసుల్లో ఇప్పటకే మాజీ మంత్రి నారాయణ, పుల్లారావులు ఉన్నారు.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కేంద్రం తీసుకువచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ప్రధాని మోదీ, బీజేపీని చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదు. అవినీతి, దుర్మార్గానికి మారుపేరే చంద్రబాబు. అటువంటి వ్యక్తి రాజకీయ లబ్ధి కోసమే వైఎస్సార్సీపీపై విష ప్రచారం చేస్తున్నాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులకు మేలు చేసే వ్యక్తి. భూములు లాక్కునే వ్యక్తి కాదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
పద్మవ్యూహంలో వీర అర్జునుడు
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది మరో మహాభారతం. వీరత్వంతో యుద్ధం చేస్తున్న బాలుడు అభిమన్యుడి మీద నాలుగు మూలల నుండి అస్త్ర పరంపరలు సంధించారు ఆనాడు. పేద ప్రజల సంక్షేమమే ఆశయంగా దుష్ట గ్రహాల్ని ఎదిరిస్తూ పాలన చేస్తున్న పిన్న వయస్కుడైన జగన్ మీద అన్ని వైపుల నుండి దాడి చేస్తున్నారు ఈనాడు. వీరి ప్రయత్నమంతా జగన్ను యుద్ధభూమి నుండి తప్పించాలని! అయితే జగన్ అభిమన్యుడు కాదు, అర్జునుడు. కనుకనే ‘ఏనుంగు మీది కెగయు సింహ కిశోరంబు రీతి’గా దుష్టుల పన్నాగాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ పద్మవ్యూహాన్ని ఛేదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. దుర్యోధన సైన్యంలా వారంతా రోజురోజుకు పెరిగిపోతుంటే ఇవతల జగన్ ప్రజాదరణ అంతకంతకు పెరిగిపోతూనే వుంది.మహాభారత రాజకీయం అన్ని కాలాలకు వర్తిస్తుందనటానికి ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలే నిదర్శనం. ధర్మరాజును ప్రాణాలతో బంధించటానికి ఆనాడు ద్రోణుడు పద్మవ్యూహం పన్నాడు. అది చాలా ప్రమాదకరమైనది. శత్రువు లోపల ప్రవేశించడమంటే అతని మరణాన్ని కొనితెచ్చుకోవటమే. దానినే చక్రవ్యూహం అని కూడా అంటారు. ఇక్కడ ఆంధ్రాలో కూడా జగన్మోహన్రెడ్డి గారి చుట్టూ పద్మ వ్యూహం అల్లబడింది. అతిరథ మహారథులందరూ ఒక్కడిని జయించడానికి లేదా మట్టుపెట్టడానికి అంచెలంచెలుగా వ్యూహాత్మకంగా కుట్రలు సాగిస్తున్నారు. అక్కడ తలపండిన ద్రోణుడు ఆ వ్యూహానికి కర్త అయితే, ఇక్కడ 87 ఏళ్ళ వృద్ధ రామోజీ ఇదంతా నడిపిస్తున్నాడు. వీళ్ళ ఎత్తుగడలో భాగం మీడియా ద్వారా జగన్నూ, ఆయన పాలనను రోజూ దుమ్మెత్తిపోయడం. సోషల్ మీడియా ద్వారా వ్యక్తిత్వ హననానికి పాల్పడటం. దానికి వైకాపా సోషల్ మీడియా ఎదురు దాడికి దిగటంతో ఆ ఆటలు సాగలేదు.ఇక ఎన్డీయేతో రామోజీతో పాటు వెంకయ్య కూడా కష్టపడి పొత్తును కుదిర్చారు. దానితో ఈ మూడో అంచె వ్యూహాన్ని జగన్ అస్సలు దాటలేడని వాళ్ళు భ్రమపడ్డారు. కానీ ఈ అవకాశ పొత్తులు ప్రజలకే నచ్చక ఛీ కొట్టడంతో అదికూడా ఫెయిలయ్యింది.దాంతో ‘చతుర్విధోపాయసాధ్యేతు రిపౌసాంత్వమప క్రియాన్’... అనగా సామ భేద దాన దండోపాయాల్లో, బలమైన శత్రువును ఎదుర్కోవా లంటే నాలుగవది అయిన దండోపాయమే సరయినదని ఈ కూటమి భావించి ఏకంగా ప్రాణాలు తియ్యటానికి తెగించింది. అందుకే విజ యవాడలో సూటిగా బాణం వేయగలిగిన సైంధవుడి లాంటి సతీష్ను బోండా ఉమ డైరక్షన్లో ప్రవేశపెట్టారు. జగన్మోహన్రెడ్డి అన్నట్టు, ఆ దైవమే ఆ సమయంలో కూడా ఆయనను కాపాడింది. ఏ కొంచెం స్థానం మారినా, పెను విషాదం చోటు చేసుకునేది.వీరత్వంతో నిజాయితీగా యుద్ధం చేస్తున్న ఒక్క బాలుడి (అభిమన్యుడు) మీద నాలుగు మూలల నుండి అస్త్ర పరంపరలుసంధించారు ఆనాడు. పేద ప్రజల సంక్షేమమే ఆశయంగా పెట్టుకుని దుష్ట గ్రహాల్ని ఎదిరిస్తూ నిర్భయంగా పాలన చేస్తున్న ఈ పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రి మీద అన్ని వైపుల నుండి దాడి చేస్తు న్నారు ఈనాడు. ఆయన చేస్తున్న సంక్షేమాన్ని ఆపుచేయటానికి మేధావుల ముసుగులో ఒక ఫోరమ్ బయటకు వచ్చింది. ఇప్పటి వరకు వృద్ధులకు, అంగ వికలురకు నిరంతరం సేవలందిస్తున్న వలంటీరు వ్యవస్థను ఈ కుహనా మేధావులు ఆపించి ఏదో గొప్ప కార్యం సాధించినట్లు భుజాలెగరేస్తున్నారు.ఈసారి ఈ దుష్టకూటమి ఎన్నారై వింగ్ను చివరి చక్రంలోకి ప్రవేశపెట్టింది. దానికి ప్రధాన నాయకుడు కోమటి జయరాం. 2020లో వైకాపా నుండి 23 మంది ఎమ్యెల్యేలను కొనటం దగ్గర నుండి మొన్న ఎమ్మెల్యే శ్రీదేవికి డబ్బు ఇచ్చి ఎమ్మెల్సీ ఓటు కొను క్కునే వరకు కథంతా నడిపించింది ఈ ఎన్నారై మేధావే. కోట్లాది రూపాయలతో ఓటరు ‘వెధవలను’ (వాళ్ళ భాషలో) కొనటానికి మరో అస్త్రం సిద్ధం చేశారు. అదృష్టవశాత్తూ అది కూడా బయటపడిపోయింది. కాలం సమీపించినపుడు పాపాత్ములు ఏ పని చేసినా అది వాళ్ళకు ఎదురీతగానే మారుతుందన్న సామెత నిజ మైంది. భారతం కూడా అదే చెబుతుంది. ‘పిరికితనము, నేరప్రవృత్తి, పదవి, ధనాశ లాంటి ప్రవృత్తి గలవానికి సిరి తనంతట తానే తొలగి పోతుంది’ అనే మాట చంద్రబాబు పట్ల ఋజువు కాబోతున్నది.ఇక జగన్ మీద తండ్రీకొడుకుల వాగ్బాణాలయితే చెప్పే పని లేదు. ఒక్కడిని చుట్టు ముట్టి బహిరంగ దూషణలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. వీరి ప్రయత్నమంతా జగన్ను యుద్ధభూమి నుండి తప్పించాలని! ఆయన చేసిన పాపం ఏమిటి? ఆనాడు భారత యుద్ధంలో కూడా కపటోపాయంతో తండ్రిని దూరంగా పంపి అభిమ న్యుడిని బలి చేశారు. ఈరోజు కూడా ఈ ఎన్నికల సమరంలో తండ్రి లేని జగన్ను ఇంతమందీ కలసి ముట్టడిస్తున్నారు. అయితే ఆయన అర్జునుడు కనుక ‘ఏనుంగు మీది కెగయు సింహ కిశోరంబు రీతి’గా ఈ దుష్టుల పన్నాగాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ పద్మవ్యూ హాన్ని ఛేదించుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. జగన్ అంటే ధైర్యం, జగన్ అంటే ధర్మం, జగన్ అంటే విశ్వసనీయత. అందుకే వీరి బరితెగింపు నీచరాజకీయాలను తన పదునయిన అస్త్రాలతో ఛిన్నా భిన్నం చేసుకుంటూ అశేష ప్రజల ఆశీస్సులందుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు.ఇక కూటమి దురవస్థ కూడా కౌరవుల మధ్య పొసగని అభిప్రా యాల్లాగానే ఉంది. ఒకరిపై ఒకరికి నమ్మకం లేదు. ఎవరు ఎవరిని వెన్నుపోటు పొడుస్తారో అని అస్తమానం అదే భయంతో బతుకు తున్నారు. ఎందుకంటే ఈ మూడు పార్టీలకు సిద్ధాంత బలం లేదు. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ పరోక్షంగా కలుస్తాయి. కమ్యూనిస్టులు బీజేపీ కూటమికి మద్దతిస్తారు. ఒక విచిత్రమైన రాజకీయ విన్యాసం ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతున్నది. కుల నాయకుడి కోసం ఐఏఎస్ పట్టాలను దాచిపెట్టి కుల రౌడీల్లా వీధుల్లోకొస్తారు కుహనా మేధా వులు. తండ్రికి మరో వెన్నుపోటుదారు పురందేశ్వరి. వైయస్సార్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ తిరుగుతున్న షర్మిల లాంటి వాళ్ళు కూడా ఈ విష కూటమితో కలిసి జగన్ను తిట్టి పోస్తారు. దుర్యోధన సైన్యంలా వీరంతా రోజురోజుకు పెరిగి పోతుంటే ఇవతల జగన్ ప్రజా దరణ అంతకంతకు పెరిగిపోతూనే వుంది. ఇంకా జగన్ను చంపడానికి ప్రయత్నించిన, హర్షవర్ధన చౌదరి, బోండా ఉమా లాంటి రౌడీలు కూడా ఈ వర్గంలో తక్కువేమీ కాదు. రాష్ట్రంలో ఈ అల్లరి మూకలు వైకాపా కార్యకర్తల మీద సాగిస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. నిన్న గాక మొన్న మంగళగిరిలో రాష్ట్రంలో రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తూ హింసావాదాన్ని రెచ్చగొడుతున్న లోకేష్ గూండాలు ఎదురుగా వెళ్ళి పార్టీ ప్రచారంలో ఉన్న వెంకటరెడ్డిని బైకులతో గుద్ది చంపేశారు. దానిని కూడా సమర్థించుకుంటూ వీరి ప్రచారం సాగిపోతూనే వుంది.ఈ ఆంధ్రా కురుక్షేత్రంలో మే 13న జరిగే ఎన్నికలు అన్నింటికీ సమాధానం చెబుతాయి. ప్రళయం వస్తే మొత్తం ఊడ్చేసినట్లు రేపు ఈ ఓటరు సునామీ ఈ కౌరవ సైన్యాన్నంతా ఓడించి దూరంగా విసిరేస్తుందనే మాట ఖాయం. దేశమంతా మెచ్చుకుంటున్న జగన్ పాలన మళ్ళీ రావటం ఖాయం. కొద్దిరోజులు ఓపిక పడదాం. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలంటే ప్రతి ఓటు జగన్కు వేసి వీళ్ళ పద్మవ్యూహాన్ని ధ్వంసం చెయ్యాలి. వీర అర్జునుడికి విజయం అందించాలి.- వ్యాసకర్త ఆంధ్రపదేశ్ తెలుగు–సంస్కృత అకాడమీ ఛైర్పర్సన్- డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి -
బాబు నీచ రాజకీయాలపై లక్ష్మీపార్వతి ఫైర్
-
ఎన్టీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టింది నువ్వే..
-
తండ్రిని చంపినవాళ్లకు ఇది ఒక లెక్కనా: లక్ష్మీపార్వతి
-
‘వై నాట్ 175?’ నినాదం స్ఫూర్తితో...
ఎట్టకేలకు ఎన్నికల నగార మోగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 4 ‘సిద్ధం’ సభల ద్వారా తమ సత్తా ఏంటో చాటుకుంది. అభ్య ర్థులను అన్ని పార్టీల కన్నా ముందే ప్రకటించి ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. మొత్తం 175 అసెంబ్లీ నియోజక వర్గాలు, 25 ఎంపీ స్థానాలకు సామాజిక న్యాయాన్ననుసరించి అభ్యర్థులను నిర్ణయించారు వైఎస్సార్సీపీ వారు. బీసీలకు అసెంబ్లీ, పార్లమెంటుకు కలిపి మొత్తం 59 టికెట్లు ఇచ్చారు. ఆశ్చర్యమేమిటంటే వీరిలో చాలామంది అతిపేదలు. ఇది రాజకీయానికి ఒక కొత్త నిర్వచనంగా చెప్పవచ్చు. మరోపక్క అప్పటికప్పుడు సూట్కేసులతో విమానాలు దిగిన పెద్దలకు మాత్రమే చంద్రబాబు సీట్లు కేటాయిస్తున్నారు. అందులోనూ స్వజాతి పక్షులే ఎక్కువ. సీనియర్లు దిక్కుతోచక దిక్కులు చూస్తున్నారు. ఇదిలావుంటే ‘గండస్యోపరిపిటకవత్’ అనే సామెత (గోడదెబ్బ – చెంపదెబ్బ)గా ఇష్టంలేని పొత్తుల వల్ల టీడీపీ – జనసేన కార్యకర్తలు బాహాబాహీ యుద్ధానికి దిగుతున్నారు. ఇక అసలు నాయకుడు ఎన్డీయే పొత్తుకోసం నాలుగు సంవత్సరాలుగా ఎదురు చూసి, చూసి రాయబారాలు పంపీ, పంపీ ఎట్టకేలకు వదినగారి దయతో చేరి పోయారు. తన జన్మధన్య మైందనుకుంటూ రాష్ట్రానికి తిరిగి వచ్చి సీట్ల పంపిణీ ప్రారంభిస్తే... అది పూర్తిగా బెడిసికొట్టి సిగపట్ల వ్యవ హారం సీరియస్గా సాగుతున్నది. పోనీ సభల ద్వారా వాటిని కవర్ చేసుకుందామంటే వెయ్యి రూపాయలు, క్వార్టర్ బాటిల్, బిర్యానీ ఇచ్చినా తినేసి పోతున్నారు కానీ సభదాకా రావడంలేదు. ‘రామేశ్వరం పోయినా శనేశ్వరం పోదనట్లు’ మోసాలు, అడ్డ దారులు తప్ప నిఖార్సయిన రాజకీయం తెలియని ఈ అబద్ధాల కోరును భరించలేమని జనాలు 2019లోనే అధికారం నుండి తోసేస్తే, అదేమీ గుర్తించకుండా తనకుతానే గొప్పనాయకుడిని అనుకుంటూ మతిలేని ఉపన్యాసాలు ఇస్తున్న ఇతనికి తోడు దత్తపుత్రుడొకరు. రాసిచ్చిన డైలాగులు ఆవేశంలో వూగిపోతూ చదవటం తప్ప సొంత ఆలోచన లేదు పవన్ కల్యాణ్కు. ఇక అసలు పుత్రుడిని చూద్దామంటే అతని పేరెత్తితేనే పార్టీ పారిపోతున్నది. ఇప్పుడు చంద్రబాబు కూడా అదేదారిలో ఉన్నాడు. అతడికి సర్టిఫికెట్స్ తప్ప ఏ భాషా రాదు. కొత్తగా వచ్చిన మరో తోడు వదినగారు. ప్రస్తుతం తన ఒక్కసీటు గెలిస్తే చాలు వచ్చే ఎన్డీయే ప్రభుత్వంలో ఎలాగయినా మంత్రిపదవి దక్కించుకోవాలని సొంత పార్టీనే తాకట్టు పెడుతున్నారు. ఈ నలుగురు ఇలా నడుస్తుంటే... వీళ్ళకేడరు మాత్రం నియోజక వర్గాల్లో తన్నుకోవడంలో యమ బిజీగా ఉన్నారు. సిద్ధాంత బలం లేక రాష్ట్ర ప్రయోజనాల గురించి ఒక్కమాట మాట్లాడలేక పోతున్నారు. కానీ జగన్ను తిట్టడానికి మాత్రం ఒకేదారిలో నడుస్తున్నారు. వాళ్ళకున్న సిద్ధాంతమల్లా జగన్ ఓడిపోవాలి. ఎందుకంటే సమా ధానం లేదు. వీళ్ళ ఎజెండాలో కులగర్జనలు, మతాల పూత్కా రాలు, ముఖ్యమంత్రి మీద విష ప్రచారాలు నిరంతరం వినిపిస్తూనే ఉన్నాయి. అదుపు తప్పిన కట్టుబాట్లతో, అబద్ధపు రాతలే తమ ధ్యేయ మన్నట్లు కులఅహంకారంతో పిచ్చిరాతలు రాస్తున్నాయి పచ్చ పత్రికలు. ఒక అవినీతిపరుడి కొమ్ముకాస్తూ అవి ఏనాడో విలువల్ని పోగొట్టు కున్నాయి. మరోవైపు మరో దత్తపుత్రిక వచ్చి చేరింది. కుటుంబ వ్యవస్థను నాశనం చేసే విద్యలో ఎన్నో డిగ్రీలు పొందిన చంద్రబాబు మరో కుటుంబ వినాశనానికి పూనుకున్నాడు. ఎన్టీఆర్ కుటుంబాన్ని చీల్చి ఇంటి పెద్దను నాశనం చేసిన ఇతడు, పచ్చగా, సమష్టిగా కష్టాలను సమైక్యంగా ఎదుర్కొని, ఎన్నో ఇబ్బందులను అధిగమించి అధికారాన్ని సాధించుకున్న వైఎస్సార్ కుటుంబం మీద తన వక్రదృష్టి సారించాడు. ఫలితంగా అదికూడా చీలిపోయింది. ఈ దురాశాపరులు అభివృద్ధిలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ భవిష్య త్తును నాశనం చెయ్యటానికి కంకణం కట్టుకున్నారు. సామాజిక సహ జీవనంతో సౌభ్రాతృత్వంగా వర్ధిల్లుతున్న ఆంధ్రుల ప్రశాంతతను చెరపటానికి ఈ కూటమి ప్రయత్నిస్తున్నది. కానీ ఆంధ్రులు అమా యకులు కాదు. స్వాతంత్య్ర పోరాటం నుండి ఇప్పటి వరకు ఎన్నో రాజకీయాలను, ఎందరో నాయకులను చూసిన అనుభవం వారిది. అందుకే ఈ దుష్టగ్రహ కూటమి సభలకు వెళ్ళకుండా తమ నిరసన తెలియజేస్తూనే ఉన్నారు. వారి ఏ సభ చూసినా, ఖాళీ కుర్చీలే. వీరి పతనం చివరిదశకు చేరిందనటానికి ఇవన్నీ సంకేతాలే. రాజనీతిజ్ఞుడు, అనుభవజ్ఞుడు అయిన మోదీ ఈ పొత్తుకు సుముఖంగా లేరనే విషయం వారి ప్రవర్తన, ప్రసంగధోరణి చెప్పకనే చెప్పాయి. జగన్ గురించి ఏమీ విమర్శించక పోవటం, వైరి గుండెల్లో గునపాలు గుచ్చినట్లే వుంది. పక్క రాష్ట్రాలయిన తెలంగాణ, కర్ణాటక, చెన్నై సభల్లో అక్కడి ముఖ్యమంత్రులను ఏకిపారేశారు మోదీ. ఆ ప్రసంగాలతో పోల్చి చూస్తే ఏపీ ముఖ్యమంత్రిని, ఆయన పాలనను ప్రధాని మెచ్చినట్లే కనిపించింది. ఇంకో విషయం కొంచెం లోతుగా ఆలోచిస్తే అర్థమవుతుంది. అది జగన్ పట్ల వారికున్న అభిమానం. ప్రధానమంత్రి కంటే ఐదు నిమిషాల ముందు ప్రసంగించిన చంద్ర బాబు జగన్ను విమర్శిస్తూ ‘తల్లిని, చెల్లిని చూసుకోలేనివాడు ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళ కెలా మేలుచేస్తాడు...’ అంటూ తన లేకితనాన్ని ప్రదర్శించుకున్నాడు. కానీ మోదీ ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్లుగా ‘అన్నా, చెల్లి ఒకటే. ఇది కాంగ్రెస్–వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడ’ అంటూ చంద్రబాబు గొప్పగా ప్రయోగించాలనుకున్న షర్మిల అస్త్రాన్ని ఉపసంహరించారు. ప్రైమ్ మినిస్టర్ ముందు జగన్ను పెద్ద విలన్గా చూపించాలనుకున్న వీళ్ళ ఎత్తుగడను ఆయన చిత్తుచేసి ప్రజల్ని ఒక అయోమయంలో ఉంచి వెళ్ళిపోయారు. ‘ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు’ ఈ సభ ద్వారా తన బలాన్ని నిరూపించుకోవాలనుకున్న చంద్రబాబుకు, పవన్ కల్యాణ్లకు అవమానాలే మిగిలాయి. లక్షల్లో వస్తారన్న జనం రాలేదు. వచ్చిన ప్రధానమంత్రి వీరి పేరయినా ఎత్తలేదు. మరో పక్క పొత్తుకు గండికొడుతున్నాడని బీజేపీ సీనియర్లు అధిష్టానానికి లేఖ రాశారు. ఆ పొత్తు చివరిదాకా వుంటుందో లేదో తెలియదు. జనసైన్యం అసలు సహకరించటం లేదు. ఇక ఓట్లు షేర్ చేసుకునే దెప్పుడు? ‘కత్తితో చంపేవాడు ఆ కత్తితోనే చస్తాడు’ అన్నట్లు అవగాహన, రాజకీయ సంస్కారం లేని ముఠాలను తయారుచేసుకున్న దత్తపుత్రుడి సైన్యం తమ నాయకుల మీదే తిరుగుబాటు చేస్తోంది. ఎటుచూసినా పంచకూళ్ళ కూటమికి గందరగోళంలా తయారయ్యింది పరిస్థితి. కలసినా ఒకళ్ళనొకళ్ళు ఓడించుకుంటారు. మరోవైపు జగన్ ఒక్కడే తన సైన్యంతో ముందుకు దూసుకు పోతున్నాడు. అతని ఆయుధం ప్రజాబలం. అతని నినాదం పేదల సంక్షేమం. అతని సైన్యం ఐకమత్యంతో నాయకుడిని అనుసరించే పార్టీ. ఇప్పుడు చెప్పండి – ముఖ్యమంత్రి జగన్ అన్నట్లుగా ‘వైనాట్– 175?’ సాధించి చూపెడదాం – ఆదర్శ రాజ్యాన్ని నిలబెడదాం. - వ్యాసకర్త ఆంధ్రపదేశ్ తెలుగు అకాడమీ ఛైర్పర్సన్ - డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి -
రెండేళ్లలో 13.37 లక్షల పుస్తకాల ముద్రణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యేక అకాడమీ ప్రచురణలను మార్కెట్లోకి తీసుకొచ్చి నట్టు తెలుగు, సంస్కృత అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి తెలిపారు. తెలుగు భాషాభివృద్ధి, ఉన్నత విద్యకు అవసరమైన విజ్ఞాన సంపదను అందించేందుకు అకాడమీ విశేష కృషి చేస్తోందన్నారు. గురువారం వడ్డేశ్వరంలోని ఆమె కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి అకాడమీ విభజన పూర్తయిన తర్వాత ఏపీలో సేవలు ప్రారంభించిన రెండేళ్లలో రూ. 21 కోట్ల విలువైన 13.37 లక్షల పుస్తకాలను ముద్రించామన్నారు. డీఎస్సీ, బీఈడీ, టెట్, ఏపీపీఎస్సీతో పాటు వివిధ రకాల పోటీ పరీక్షల సిలబస్తో 67 రకాల పుస్తకాలకు సంబంధించి 3 లక్షల కాపీలను మార్కెట్లోకి విడుదల చేశామన్నారు. వీటితో పాటు 10.37 లక్షల ఇంటర్మీడియెట్ పాఠ్యపుస్తకాలను ముద్రించడం ద్వారా పేద విద్యార్థులకు తక్కువ ధరకు స్టడీ మెటీరియల్స్ అందించామన్నారు. ఆంగ్లం, ఇతర భాషల ద్వారా వాడుకలోకి వచ్చి న పదాలకు త్వరలోనే తెలుగు పదజాలాన్ని రూపొందిస్తామన్నారు. తెలుగు–సంస్కృతం–ఆంగ్లం కలగలిపిన త్రిభాషా పదకోశాన్ని (డిక్షనరీ) ముద్రిస్తామన్నారు. డిగ్రీ, పీజీ పాఠ్యప్రణాళికలకు తగ్గట్టుగా పుస్తకాలను ముద్రిస్తామన్నారు. ఇకపై అకాడమీ ప్రతి ముద్రణను తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రవేశపెడుతుందన్నారు. బాబు స్వార్థానికి అకాడమీ బలి చంద్రబాబు స్వార్థ రాజకీయాలకు తెలుగు అకాడమీ తీవ్రంగా నష్టపోయిందని లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన హయాంలో తెలుగు అకాడమీ విభజనను పట్టించుకోలేదన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు అకాడమీని ఏర్పాటు చేశారన్నారు. అనంతరం కోర్టుకు వెళ్లి ఉమ్మడి అకాడమీ విభజన పూర్తి చేసి ఏపీ వాటా కింద రూ. 140 కోట్లు సాధించామన్నారు. కానీ, చంద్రబాబు అకాడమీ ప్రచురణలకు పాతరేసి నారాయణకు పాఠ్యపుస్తకాల ముద్రణను కట్టబెట్టడం ద్వారా భారీ రేట్లకు విక్రయించి రూ. కోట్లు దండుకున్నారని మండిపడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎల్లో మీడియా అకాడమీ సేవలపై విషం చిమ్ముతోందన్నారు. తిరుపతి నుంచే తెలుగు, సంస్కృత అకాడమీలు పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయన్నారు. విజయవాడ కేంద్రంలో ఎక్కువ ముద్రణాలయాలు ఉండటంతో ప్రింటింగ్ ఉద్యోగులు మాత్రమే స్థానిక కార్యాలయంలో సేవలందిస్తున్నారన్నారు. త్వరలోనే తిరుపతిలో ఎస్వీ వర్సిటీ స్థలంలో తెలుగు, సంస్కృత అకాడమీ శాశ్వత భవనం నిర్మాణాన్ని చేపడతామన్నారు. -
టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులకి లక్ష్మి పార్వతి స్ట్రాంగ్ కౌంటర్
-
చంద్రబాబుకు జూ.ఎన్టీఆర్ మద్దతు పలకడు: లక్ష్మీపార్వతి
సాక్షి, గుంటూరు: అమిత్ షా ఇంటిముందు శివరాత్రి జాగారం చేసి చంద్రబాబు పొత్తులకు ఒప్పించాడంటూ వైఎస్సార్సీపీ మహిళా నేత, ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు అనైతికమన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఆత్మగౌరవం కలిగిన వ్యక్తి అని, చంద్రబాబుకు మద్దతు పలకడని లక్ష్మీపార్వతి అన్నారు. వరుణ్ తేజ్ ప్రచారం చేస్తే టీడీపీ పొత్తుకు ఓట్లేమీ పడవు. వారు రీల్ హీరోలే గాని రియల్ హీరోలు కాదు. ఈ సిద్దం సభ ద్వారా మరోసారి సీఎం జగన్ సత్తా తెలుస్తుంది. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అఖండ మెజారిటీతో గెలుస్తుందని లక్ష్మీపార్వతి అన్నారు. కేసుల నుంచి బాబు తప్పించుకోవడానికే.. వైఎస్సార్ జిల్లా: ఏ ప్రయోజనం కోసం టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుందో ప్రజలకు సమాధానం చెప్పాలంటూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. పోలవరం కోసమా, విశాఖ స్టీల్ కోసమా, ప్రత్యేక హోదా కోసమా, రాష్ట్ర అభివృద్ది కోసమా దేనికోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారో వివరణ ఇవ్వాలన్నారు. గతంలో బీజేపీ ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిందని, దూది ఏకి పారేసినట్లు విమర్శించే బాబు ఇప్పుడు కలయిక ఏంటి? నరేంద్ర మోదీని, అమిత్ షా పట్ల చంద్రబాబు వ్యవరించిన తీరు ఎవరూ మర్చిపోరు. ఈ రాష్ట్రం రెండు ముక్కలు కావడానికి బీజేపీ, కాంగ్రెస్సే కారణం’’ అని శివప్రసాద్రెడ్డి దుయ్యబట్టారు. టీడీపీ ఉనికి కోసం, లోకేష్ రాజకీయ భవిషత్తు కోసం ఈ పొత్తు. గతంలో ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి ఇదంతా’’ శివప్రసాద్రెడ్డి దుయ్యబట్టారు. బీజేపీతో పొత్తు కోసం టీడీపీ వెంపర్లాట: ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి ఎన్ని పార్టీలు పొత్తులు పెట్టుకున్నా రాష్ట్రంలో గెలిచేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనేనని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. ఈ సారి 75 శాతం ఓట్లతో తిరిగి అధికారంలోకి వస్తాం. బీజేపీతో పొత్తు కోసం టీడీపీ వెంపర్లాడింది. సింహం సింగిల్గా వస్తుంది అనేలా జగన్ సింగిల్గా వస్తారు. మళ్లీ సీఎం అవ్వడం ఖాయం. 14 ఏళ్లు అధికారంలో ఉండి చంద్రబాబు చేసిన మంచి ఏంటి? కరవును తోడుగా తెచ్చారు వర్షాలు లేక రైతులు, ప్రజలు ఇబ్బందులు పడ్దారు. కాలర్ ఎగరేసి చెప్పే దమ్ము ధైర్యం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. 175కి 175 స్థానాల్లో అలవోకగా గెలుస్తాం’’ అని రవీంద్రనాథ్రెడ్డి పేర్కొన్నారు. -
ఆమ్ ఆద్మీ ని చూసి నేర్చుకో పవన్
-
పవన్ ఓ సైకో: లక్ష్మీపార్వతి
సాక్షి, విశాఖపట్నం: పవన్ కల్యాణ్ను సైకో అంటూ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి మండిపడ్డారు. సీఎం జగన్ను విమర్శించే హక్కు పవన్కు లేదని, ప్రభుత్వ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు కనిపించడం లేదా? అంటూ ఆమె ధ్వజమెత్తారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నీచుడు.. ఎన్టీఆర్ కుటుంబాన్ని చీల్చాడు. ఇప్పుడు జగన్ కుటుంబాన్ని చీల్చుతున్నారు. సునీత చంద్రబాబు చేతిలో సునీత కీలుబొమ్మగా మారారు. నీ తండ్రిని హత్య చేసినవారిని వదిలి సీఎం జగన్ను విమర్శిస్తున్నారు. నీ తండ్రిని ఓడించిన టీడీపీ చేతుల్లో పడ్డావు సునీత’’ అంటూ లక్ష్మీపార్వతి హెచ్చరించారు. తాడేపల్లి గూడెం సభ చూసిన తర్వాత టీడీపీ ఎంత బలహీనంగా ఉందో కనిపించింది. పవన్ మీకు ఆలోచన లేదా?. 75 ఏళ్ల ముసలి చంద్రబాబుపై అరవై కేసులు వున్నాయి.ఎలా నమ్మావ్ పవన్. నీ బలహీనతతో కాపు సామాజిక వర్గాన్ని అవమాన పరిచావు. నీ బలహీనతను చంద్రబాబు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. నీ బలహీనత ఏంటో అర్థం కావడం లేదు. ఎప్పుడైనా కాపు సామాజిక వర్గానికి మేలు చేశావా?. మీ బాస్ రెండు ఎకరాల నుంచి 6 లక్షల కోట్లకు ఎలా ఎదిగారు?’’ అంటూ లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. ‘‘పవన్ కల్యాణ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి. నీచుడైన చంద్రబాబు ఉచ్చులో పడ్డాడు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఏపీకి ప్రమాదం. గత టీడీపీ పాలనలో ఒక్క అభివృద్ధి పని జరిగిందా?. అప్పుడు ఎన్టీఆర్పై దుష్ప్రచా రం చేసిన పచ్చ మీడియా ఇప్పుడు జగన్పై గట్టింది. ప్రతి కుటుంబంలో చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలు నడుపుతున్నారు. షర్మిల గురించి అందరికీ తెలుసు. తండ్రిని మోసం చేసిన పార్టీతో జత కలిసింది. మంచి కుటుంబంలో పుట్టిన షర్మిల, సునీత.. ఎందుకు చంద్రబాబు ఉచ్చులో పడ్డారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు నైజం బయట పడుతుంది’’ అని లక్ష్మీపార్వతీ పేర్కొన్నారు. ఇదీ చదవండి: సునీత ముసుగు నేటితో తొలగిపోయింది: సజ్జల -
మీరెంత మంది కలిసి వచ్చినా సీఎం జగన్ను ఓడించలేరు: లక్ష్మీ పార్వతి
-
వాడు పనికిమాలిన వెధవ... వీడు ఒక పిచ్చోడు: లక్ష్మి పార్వతి
-
ముందే ఓటమిని అంగీకరించిన బాబు: లక్ష్మీ పార్వతి
-
జగన్ పాలన-మహిళ స్పందన రాష్ట్రస్థాయి మహిళ సదస్సు
-
మహిళా సాధికారతకు సీఎం జగన్ ప్రభుత్వం పెద్దపీట
-
అల్లుడి బాగోతం అత్తగా నాకే తెలుసు: లక్ష్మీపార్వతి
విజయవాడ, సాక్షి: చంద్రబాబు ఆడవాళ్లను అస్యహించుకుంటే.. అయితే మహిళకు సాధికారతతో సమాజం వృద్ధి చెందుతుందని సీఎం జగన్ బలంగా నమ్మారని తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి అన్నారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘జగన్ పాలన - మహిళ స్పందన’ రాష్ట్రస్థాయి మహిళా సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. రామ్ మనోహర్ లోహియా మహిళా పక్షపాతి.. అలాగే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళా సంస్కర్త. ఇందిరాగాంధీ మహిళల స్థితి గతులు తెలుసుకునేందుకు రామచంద్రగుహ కమిటీ వేశారు. ఆ కమిటీ ఓ నివేదిక ఇచ్చింది. 16 ఏళ్ల ఇందిరాగాంధీ పాలనలో కూడా మహిళల స్థితిగతులు మారలేదు.. ఆ కమిటీ నివేదిక ఇచ్చినా ఇబ్బందులు తొలగిపోలేదు. అలాంటిది.. ఇందిరాగాంధీ చేయలేని పనిని సీఎం జగన్ చేసి చూపించారు ఓ మహర్షిలా జగన్.. .. మహిళలకు ఆస్తిహక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్కే దక్కింది. మహిళల కోసం తొలిసారిగా పద్మావతి యూనివర్శిటీని స్థాపించారాయన. అలాగే.. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించారు. ఎన్టీఆర్ తర్వాత మహిళల సాధికారితకు కృషి చేసింది వైఎస్సార్.. ఇప్పుడు వైఎస్ జగన్. దేశంలో మహిళలకు అన్నిరంగాల్లో పెద్దపీట వేస్తున్న ఏకైక సీఎం జగన్ ఒక్కరే. అందుకే ప్రజలు మంచి మనసుతో ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి.. జగన్మోహన్రెడ్డి ఒక వ్యవస్థ. వయసులో చిన్నవాడే అయినా ఆయన ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి. అణగారిన వర్గాలకు గుర్తింపునిచ్చిన వ్యక్తి. పేదలు...మహిళల అభ్యున్నతికి ఒక మహర్షిలా పాటు పడుతున్నారు. భారతదేశ చరిత్రలో విద్యకు ఇంత ప్రాధాన్యం ఇచ్చిన ఒకే ఒక్కరు జగన్. అందుకే జగన్ చేస్తున్న మంచి పనులను మనమంతా అందరికీ చెప్పాలి. రాబోయే 15 ఏళ్లపాటు ఇదే ప్రభుత్వం ఉంటే ప్రపంచంలోనే ఏపీ నెంబర్ వన్ గా నిలుస్తుంది చంద్రబాబు పనైపోయింది అల్లుడి బాగోతం అత్తగా నాకే తెలుసు. గత పాలనలో రూ. 6 లక్షల కోట్లు లూటీ జరిగింది. చంద్రబాబు పనైపోయింది. ముసలోడైపోయాడు.. మూడుకాళ్లొచ్చేశాయి. అందుకే తన కొడుకుని సీఎం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. చంద్రబాబు బాధితుల్లో నేను, నాభర్త ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటాం. చంద్రబాబుకి ఆడవాళ్లంటే అసహ్యం. జగన్ను తిట్టడానికే చంద్రబాబు మీటింగ్లు పెడుతున్నాడు. సన్నాసి అయిన లోకేష్ కావాలా?.. మంచి వ్యక్తి అయిన జగన్ కావాలో ప్రజలు ఆలోచించాలి. పొరబాటున ప్రభుత్వం మారితే ఏపీ పూర్తిగా దోపిడీకి గురవుతుంది అని ఏపీ ప్రజలను హెచ్చరించారామె. ఈ సమావేశంలో యూనిసెఫ్ ప్రతినిధి బండ్లమూడి రోజారాణి,మారుతీ మహిళా సొసైటీ అధ్యక్షురాలు సునీతా లఖంరాజు, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. -
చంద్రబాబు,అమిత్ షా భేటీపై లక్ష్మి పార్వతి ఫైర్
-
టీడీపీని చంద్రబాబు హీన స్థితికి తెచ్చాడు: లక్ష్మీపార్వతి
సాక్షి, గుంటూరు: మహానుభావుడు సీనియర్ ఎన్టీఆర్ నాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. నేడు, చంద్రబాబు అదే టీడీపీని ప్రతీ వాళ్ల కాళ్ల దగ్గర పడేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి. అలాగే, కేసుల భయంతో చంద్రబాబు బీజేపీలో పొత్తులు పెట్టుకోవడానికి తహతహలాడుతున్నాడని విమర్శించారు. కాగా, లక్ష్మీపార్వతి శనివారం గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ పెద్దల్ని కలవాలని 25 సార్లు బ్రతిమిలాడుకుంటే ఒక మీడియేటర్ ద్వారా వారిని కలిశారనే ప్రచారం జరుగుతోంది. నాడు కాంగ్రెస్కు వ్యతిరేకంగా సీనియర్ ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించారు. నేడు చంద్రబాబు అదే టీడీపీని ప్రతీ వాళ్ల కాళ్ల దగ్గర పడేస్తున్నాడు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీని హీనమైన పరిస్థితి తీసుకువచ్చాడు. ఎంతో మహోన్నతమైన విలువలతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే చంద్రబాబు నాయుడు ఆయనను బహిష్కరించారు. కాంగ్రెస్ వ్యతిరేకంగా టీడీపీని స్థాపిస్తే మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు సపోర్ట్ చేసి ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశాడు. కేసుల భయంతోనే చంద్రబాబు బీజేపీతో పొత్తులు పెట్టుకోవడానికి తహతహలాడుతున్నాడు. బీజేపీకి చంద్రబాబు ఎంత డబ్బు అయినా ఇస్తానంటున్నాడు. అవసరమైతే టీడీపీని పూర్తిగా తీసేసుకుని కేసుల నుంచి బయటపడేమయని పెద్దల్ని వేడుకుంటున్నాడు. నారా లోకేష్ ఓ పనికిమాలిన వ్యక్తి. లోకేష్ను తీసుకొచ్చి ప్రజల మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబును ప్రజలు ఎంత అసహ్యించుకుంటున్నారో ఆయన సభలను చూస్తే అర్థమవుతుంది. పచ్చ మీడియా కూడా లోకేష్ మాదిరిగానే మారింది. లోకేష్ చెప్పినట్టు 200 సీట్లు వస్తాయని బాకా ఊదుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు’ అంటూ కామెంట్స్ చేశారు. -
రెండు ఎకరాలున్న చంద్రబాబు వేలాది కోట్లకు అధిపతి ఎలా అయ్యారు ?
-
నాకు సీటు రావడానికి సీఎం జగనే కారణం: లక్ష్మీ పార్వతి
-
ABN, ఈనాడుపై లక్ష్మి పార్వతి ఫైర్
-
వేమూరి రాధాకృష్ణకు లక్ష్మీ పార్వతి చురకలు
సాక్షి, విజయవాడ: ఏబీఎన్, ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణకు ఎన్టీఆర్ సతీమణి, వైఎస్సార్సీపీ నేత నందమూరి లక్ష్మీపార్వతి బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు అవినీతిని ప్రొత్సహించి.. ఈనాడు టీడీపీని పతనం అంచున నిలబెట్టడంలో రాధాకృష్ణ పాత్రను లేఖలో ప్రస్తావిస్తూ.. చురకలతో పాటు వ్యంగ్యాస్త్రాలు సంధించారామె. చంద్రబాబు, ఆయనకి భుజంగా ఉంటూ రాధాకృష్ణ, రామోజీరావులు.. ఈ ముగ్గురు తెలుగు దేశం పార్టీకి నేటి దుస్థితిని కలగజేశారని లేఖలో లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మీలాంటి(రాధాకృష్ణను ఉద్దేశించి..) వాళ్లు ఉంటారని తెలియకనే ఎన్టీఆర్ ఆనాడు టీడీపీని స్థాపించారు. నాడు 201 స్థానాల్లో నెగ్గి ప్రభంజనం సృష్టించిన పార్టీ.. 2019 ఎన్నికల్లో 23 సీట్లకు పరిమితం అయ్యింది. అందుకు కారణం మీతో పాటు చంద్రబాబు, రామోజీరావులే’’ అని లేఖలో పేర్కొన్నారామె. నార్ల వెంకటేశ్వరరావు లాంటి గొప్ప జర్నలిస్టు స్థాపించిన ఆంధ్రజ్యోతిని ఇప్పుడు ఒక చిత్తుకాగితంగా, చెత్త బుట్టగా మార్చావంటూ రాధాకృష్ణపై లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఎవరో కష్టపడి సాధించుకున్నది తెలివిగా ఎత్తుకుపోవడంలో మీ గురుశిష్యులు ఇద్దరూ సిద్ధ హస్తులే అంటూ.. చంద్రబాబుకి, రాధాకృష్ణకి చురకలంటించారామె. తనను టీడీపీలో దుష్టశక్తిగా, సైతాన్గా, రాజ్యాంగేతర శక్తిగా అభివర్ణించిన ఆనాటి యెల్లో మీడియా.. ఆ ఆరోపణల్ని ఇప్పటివరకు రుజువు చేయలేకపోయిందని అన్నారామె. అల్లుడు కదాని అప్పజెబితే ఇల్లంతా ఏదో చేసాడట! నారా లోకేష్ను అడ్డదారిలో తీసుకొచ్చి మంత్రిని చేస్తే.. అవినీతి రెండింతలు పెరిగిందని లక్ష్మీ పార్వతి లేఖలో పేర్కొన్నారు. అప్పటిదాకా ఒక చేత్తోనే సంపాదించిన చంద్రబాబు.. కొడుకు చేతుల్ని కలుపుకొని లక్షల కోట్లకు ఎగబాకాడని ఆరోపించారామె. అయినా.. అలాంటి కుటుంబాన్ని జాకీలు పెట్టి లేపడానికి ఆంధ్రజ్యోతి ఉంది కదా అంటూ ఎద్దేవా చేశారు లక్ష్మీ పార్వతి. ఎంత గొప్ప విజనరీనో? చంద్రబాబు విజన్కు ఆకాశానికి ఎత్తే రాధాకృష్ణకు లేఖలో చురకలంటించారామె. వెన్నుపోటు, అడ్డగోలు అవినీతి సంపాదన, కేసులు బయటకు రాకుండా మేనేజ్ చేయడంలో నలభై ఏళ్ల ఇండస్ట్రీ(చంద్రబాబు) గొప్ప విజన్ సాధించారని అన్నారామె. ‘‘ప్రస్తుతం తెలుగుదేశం పరువు ఏ మురుగు గుంటలో పడి దొర్లుతుందో చూడండి. అవినీతి చక్రవర్తి మీ విజనరీ నాయకుడు పై కేసులు మీద కేసులు వస్తుంటే.. జైలు గోడల మధ్య ఊచలు లెక్క పెట్టాడు. కొడుకు నారా లోకేష్ జైలు దారిలో ఉన్నాడు. హెరిటేజ్ లెక్కలు చెప్పలేక భువనేశ్వరి రోడ్లమీద తిరుగుతున్నది. ఎంత గొప్ప విజనరీ’’ అని లేఖలో లక్ష్మీ పార్వతి ఎద్దేవా చేశారు. టీడీపీకి సమాధి కట్టి కోట్లు సంపాదించారు పేదల పార్టీగా ఉన్న టీడీపీని.. పెద్దల పార్టీగా మార్చడానికి చంద్రబాబు, రాధాకృష్ణ చాలా కష్టపడ్డారంటూ విమర్శలు గుప్పించారామె. ఏ కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారో.. తెలంగాణలో ఇప్పుడు అదే కాంగ్రెస్ కాళ్ల దగ్గర టీడీపీని పెట్టాడని.. ఏపీలోనూ కేసుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీకి తాకట్టు పెట్టే యత్నం జరుగుతోందని.. గంగా నదిలాంటి టీడీపీని మురుగు కాలువగా మార్చి అబద్దాల పునాదుల మీద నడిపిస్తున్నారని మండిపడ్డారామె. తెలుగు దేశం ఖ్యాతిని సమాధి చేసి.. ఆ రాళ్లతో కోట్లు సంపాదించుకున్నారంటూ రాధాకృష్ణ, చంద్రబాబులపై ఆమె లేఖ ద్వారా తీవ్ర ఆరోపణలు గుప్పించారు. -
చంద్రబాబుపై లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు
-
చంద్రబాబు బండారం మొత్తం ఆధారాలతో బయటపెట్టిన లక్ష్మి పార్వతి
-
లాయర్ల ఫీజు చెల్లించడానికి డబ్బులు ఎక్కడివి?: లక్ష్మీపార్వతి
సాక్షి, విజయవాడ: లాయర్లకు వేల కోట్ల ఫీజులు చెల్లించడానికి. .చంద్రబాబుకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్మతి ప్రశ్నించారు. దాచుకున్న అవినీతి సొమ్మును.. లాయర్లకు చెల్లించడానికే లోకేష్ ఢిల్లీలో మకాం పెట్టారా అని మండిపడ్డారు. ఎక్కడెక్కడో దాచిపెట్టిన అవినీతి సొమ్మును తెప్పిస్తున్నాడా అనే సందేహం కలుగుతోందన్నారు. 40 రోజులుగా చంద్రబాబు కోసం 19 మంది లాయర్లు పనిచేస్తున్నారని, సీనియర్ లాయర్లకు రోజు రూ. కోటి నుంచి రూ.2.50 కోట్ల ఫీజు ఉందని తెలిపారు. ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరసు నడుస్తున్న చంద్రబాబు కేసుల మీద వాదించడానికి రోజుకు అన్ని ఖర్చులు కలిసి మూడు కోట్లు అయితే..లాయర్ల ఫీజుకే రూ. 2 వేల కోట్లకు పైగా ఖర్చు అయి ఉండొచ్చని ఆరోపించారు. 2 శాతం హెరిటేజ్ షేర్లను విక్రయిస్తే రూ. 400 కోట్ల ఆదాయం వస్తుందని భువనేశ్వరి చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. న్యాయవాదలు ఫీజులు, ఇతర ఖర్చులు చెల్లించడానికి ఆమె 5000 కోట్లకు మించి ఎన్ని షేర్లను విక్రయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. చదవండి: చంద్రబాబుకి కోర్టుల్లో వరుస ఎదురుదెబ్బలు లాయర్ల ఫీజు చెల్లించడానికి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయో చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యలు చెప్పాలని, వారి సంపద, ఆదాయ వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. లాయర్లకు ఎంత చెల్లిస్తున్నారు.. ఆ డబ్బును ఎక్కడనుంచి తెస్తున్నారనే విషయం చంద్రబాబును రోజు తమ పేపర్లలో, టీవీలలో చూపిస్తున్న పచ్చమీడియా అయినా దీనికి సమాధానం చెప్పాలని అన్నారు. దేశ ప్రధానిగా 16 సంవత్సరాలు పనిచేసిన ఇందిరాగాంధీ కూడా తన కేసును వాదించడానికి ఇద్దరే లాయర్లను పెట్టుకున్నారని, ఇంత స్థాయిలో అమెరికా ప్రెసిడెంటు కూడా పెట్టుకోలేదనుకుంటానంటూ సెటైర్లు వేశారు. -
తాటి చెట్టు పెరిగినట్టు పెరిగాడు కానీ ఏం లాభం..చంద్రబాబుపై లక్ష్మి పార్వతి పంచులు..
-
చంద్రబాబుపై నందమూరి లక్ష్మీ పార్వతి సీరియస్ కామెంట్స్
సాక్షి, పశ్చిమ గోదావరి: టీడీపీ అధినేత చంద్రబాబుపై తెలుగు భాష అకాడమీ ఛైర్పర్సన్ లక్ష్మీ పార్వతి సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబుకి తాడిచెట్టుకి వచ్చినట్లు 75ఏళ్ళు వచ్చాయి ఏం ఉపయోగం. ఎవరో అమెరికాలో కనిపెట్టిన సెల్ ఫోన్ను కనిపెట్టానని, ఎవరో తెచ్చిన ఐటీ తానే తెచ్చామని చెప్పడం చంద్రబాబుకి అలవాటు. ప్రభుత్వ ఖజానాని కూడా తన సొంత డబ్బులా అనుకుని దోచుకున్న వ్యక్తి చంద్రబాబు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలోని వచ్చిన మూడు నెలల్లోనే రూ.371 కోట్లు, ఆరు నెలల్లో వేల కోట్లు దోచేసిన వ్యక్తి చంద్రబాబు. రాజధాని పేరుతో లక్ష కోట్లు దోచుకున్నాడు. అల్లుడి గురించి చెప్పాలంటే అత్తగారే చెప్పాలి కదా అని కామెంట్స్ చేశారు. కాగా, తాడేపల్లి గూడెంలో వైఎస్సార్ మేధావుల వేదిక, ఏపీ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో సుపరిపాలన దిశగా ఆంధ్రప్రదేశ్ రూపాంతరం అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఏపీ మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, తెలుగు భాష అకాడమీ ఛైర్పర్సన్ లక్ష్మీ పార్వతి, స్టేట్ అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, ఏపీ గ్రంథాలయ కమిటీ ఛైర్మన్ మండపాటి శేషగిరి రావు పాల్గొన్నారు. సీఎం జగన్తోనే సాధ్యమైంది.. ఈ సందర్బంగా లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ.. ‘ప్రపంచ స్థాయిలో ఐక్యరాజ్యసమితికి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వెళ్లడం మాములు విషయం కాదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలోనే సాధ్యమైంది. విద్య, వైద్యం సరిగ్గా సమపాళ్లలో అందితేనే వ్యవస్థ బాగుంటుందని నమ్మి, ఆచరణలో పెట్టిన వ్యక్తి సీఎం జగన్. గత ప్రభుత్వంలో 3000 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు ఫుల్ అవుతున్నాయి. అంటే విద్యకు ఎంత ప్రాధాన్యత ఉందొ అర్థం అవుతుంది. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చిన వ్యక్తి సీఎం జగన్. 175 స్థానాల్లో వైఎస్సార్సీపీదే గెలుపు.. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా సీఎం జగన్ పరిపాలన అందిస్తున్నారు. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా సీఎం జగన్ అమలు చేస్తున్నారు. తండ్రి ఒక కుటుంబం కోసం ఏ విధంగా ఆలోచిస్తారో అదే విధంగా ప్రతీ కుటుంబం కోసం వారిలో ఒక వ్యక్తిగా జగన్ ఆలోచిస్తున్నారు. టీడీపీలో కూడా 70 శాతం మంది మన ప్రభుత్వం ద్వారా లబ్ది పొందుతున్నారు. ప్రజలు తెలివైన వారు కాబట్టే 23సీట్లుతో గత ఎన్నికల్లో చంద్రబాబుని పక్కన కూర్చోపెట్టారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ 175కి 175 సీట్లలో గెలుస్తారు’ అని అన్నారు. ఇది కూడా చదవండి: పవన్ మాటల వెనుక ఆంతర్యం ఏమిటో? -
‘చంద్రబాబు నీచ చరిత్రను మరిచిపోయావా భువనేశ్వరి?’
సాక్షి, విజయవాడ: చంద్రబాబు నాయుడు నీచ చరిత్రను భార్య భువనేశ్వరి మరిచిపోయారా? అంటూ ప్రశ్నించారు లక్ష్మీపార్వతి. రాజధాని పేరుతో అమరావతిలో చేసింది పెద్ద అవినీతేనని లక్ష్మీ పార్వతి స్పష్టం చేశారు. విజయవాడ నుంచి మీడియాతో మాట్లాడిన ఆమె.. ‘ చంద్రబాబు, లోకేష్లు నీతిమంతులైతే విచారణ ఎదుర్కోవాలి కదా?, చంద్రబాబు తరహాలోనే లోకేష్ కూడా అవినీతి చేశారు. అవినీతిపరులకు భువనేశ్వరి సపోర్ట్ చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఎన్టీఆర్కు ఏనాడైనా భోజనం పెట్టావా భువనేశ్వరి?, చంద్రబాబు దోచిన డబ్బంతా విదేశాల్లో పెట్టుబడి పెడుతున్నారు. చంద్రబాబు తన అవినీతి కేసులకు ఎందుకు స్టే తెచ్చుకున్నారు. చంద్రబాబు హైటెక్ సిటీ కట్టి దాని చుట్టూ ఉన్న భూములను తన వారికి కట్టబెట్టారు’ అని లక్ష్మీ పార్వతి విమర్శించారు. -
ఎన్టీఆర్ గారి మనసు చాలా మంచిది..!
-
నా కోరిక... నేను కోరేది ఒకటే : లక్ష్మీ పార్వతి
-
లక్ష్మీ పార్వతి తన జీవిత యుద్ధం..!
-
నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు : లక్ష్మి పార్వతి
-
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి లక్ష్మీ పార్వతి
-
ఎన్టీఆర్ పెళ్లి రోజు X చంద్రబాబు పెళ్లి రోజు
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబును ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. నంద్యాలలో సెప్టెంబర్ 9న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత సెప్టెంబర్ 10న ఆయనకు 14 రోజుల రిమాండ్ను విధిస్తున్నట్లు కోర్టు తీర్పు వెల్లడించింది. అక్కడి నుంచి ఆయన్ను రాజమండ్రి జైలుకు పంపించారు. అక్కడ బాబుకు ఖైదీ నంబర్ 7691 కేటాయించారు. సెప్టెంబర్ 10కి ఇంకో ప్రత్యేకత ఉంది. అది ఎన్టీఆర్ పెళ్లిరోజు. అదే రోజున లక్ష్మీపార్వతిని తిరుపతిలో ఎన్టీఆర్ అభిమానుల ముందు వివాహం చేసుకున్నారు. చంద్రబాబు అరెస్ట్తో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారిని తెలుగు ప్రజలు ఇప్పుడు బాగా గుర్తుచేసుకుంటున్నారు. ఆయన అల్లుడు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అవినీతి కేసులో అరెస్ట్ అయ్యి జైలు ఊచలు లెక్కిస్తున్న వేళ ఎన్టీఆర్కు అప్పట్లో చంద్రబాబు చేసిన అన్యాయాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఆయన ఎంతగానో నమ్మిన చంద్రబాబే ఆయన పదవితో పాటు పార్టీని అక్రమంగా లాక్కోవడం.. రాజకీయంగా ఆయన్ని పతనం చేయడం.. ఆయనపైనే చెప్పులు వేయించి, మానసిక క్షోభకు గురిచేసి తీవ్ర అవమానాలకు గురిచేయడం. అదే ఆవేదనలో ఎన్టీఆర్ మరణించడం. ఈ విషయాలు జనం ఎప్పటికీ మరిచిపోలేనివే. తాజాగా బాబు అరెస్ట్తో అన్నగారి ఆత్మ శివతాండవం చేస్తుంటుందని ఆయన అభిమానులు మీడియా ద్వారా తెలుపుతున్నారు. అన్నగారి పెళ్లిరోజే బాబు జైలుకు అది 1993 సెప్టెంబర్ 10 తిరుపతిలో మేజర్ చంద్రకాంత్ సినిమా 100వ రోజుల వేడుక జరుగుతుండగా వేదికపైకి లక్ష్మీ పార్వతిని పిలిచారు. తన కుటుంబ సభ్యుల వల్ల ఆమె చాలా ఇబ్బంది పడుతుందని లక్షల అభిమానుల సాక్షిగా బహిరంగంగా చెప్పారు. ఆమెను వివాహం చేసుకుంటున్నట్లు ఆయన అక్కడే ప్రకటించారు. పెప్టెంబర్ 11న తిరుపతిలోనే లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకున్నారు. (చదవండి: అవ్వ!!! ఇంతకన్న వెన్నుపోటు ఉంటుందా?.. ఆర్జీవీ ట్వీట్ వైరల్) అలా కొద్దిరోజులు గడిచిన తర్వాత చంద్రబాబు వెన్నుపోటుకు గురి కావడం... అలా ఆయన చివరి రోజులు కూడా ఆత్మ క్షోభను అనుభవిస్తూ మరణించారు. ఆ పాపమే నేడు చంద్రబాబును వెంటాడుతుందని ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. అందుకే ఎన్టీఆర్ పెళ్లిరోజే చంద్రబాబు ఊచలు లెక్కపెడుతున్నాడని.. ఇదీ దేవుడు స్క్రిప్ట్ కాదు అన్నగారి స్క్రిప్ట్ అంటూ నేడు వారందరూ సంతోషిస్తున్నారు. బాబుగారిని వెంటాడుతున్న అన్నగారి స్క్రిప్ట్ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కుని ఆపై అక్రమంగా ప్రజా సొమ్మును దోచుకోవడం.. ఇలా గతంలో చంద్రబాబు చేసిన లేక్కలేనన్ని పాపాలు వెంటాడుతున్నాయి. గతంలో అనేక విషయాల్లో ఆయన అనుసరించిన వైఖరి ప్రస్తుతం బాబుకు ఎదురుదెబ్బ తగిలేలా కాలం వెంటాడుతుంది. 74వ ఏట ఎన్టీఆర్కు ఘోరమైన అవమానం చేసిన చంద్రబాబు విచిత్రంగా అదే 74వ ఏటా తాను కూడా క్షోభ అనుభవించాల్సి వచ్చింది. ఇది ఎన్టీఆర్ రాసిన స్క్రిప్టే.. కోర్టులతో పాటు ఎల్లో మీడియాను వాడుకుని రాష్ట్రాన్ని మోసం చేసిన చంద్రబాబు.. అదే కోర్టుల ద్వారా జైలుకు వెళ్లడం వంటివి చూస్తే నిజమేనని అనిపిస్తుంది. ఇది ఎన్టీఆర్ ఆత్మ శాంతించే రోజని అన్నగారి అభిమానులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. పలువురు ఎన్టీఆర్ అభిమానులైతే ఆయన చిత్ర పటాలకు, విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేస్తున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు అరెస్టుతో మరోసారి ఎన్టీఆర్ను తెలుగు ప్రజలంతా గుర్తుచేసుకుంటున్నారు. 23 నంబర్తో పాటు 14 కూడా 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా అనుభం, 14 ఏళ్ల ప్రతిపక్షనేతగా పనిచేసిన అనుభవం నాది అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబుకు సరిగ్గా 14 రోజుల రిమాండ్ను కోర్టు విధించింది. ఇది కదా కాల నిర్ణయం అంటే..? అని కొంతమంది నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. 'చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691. 7+6+9+1 = 23. ఆయన అరెస్ట్ అయిన ఏడాది కూడా 2023. అంటే 23 చంద్రబాబుకు లక్కీ నెంబర్ అని ఎద్దేవా చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. -
ఎన్టీఆర్ కు నివాళులర్పించిన లక్ష్మి పార్వతి..!
-
ఆ దుర్మార్గుడి పాపం పండింది..
-
నాకైతే రాత్రంతా నిద్ర పట్టలేదు..
-
లక్ష్మీ పార్వతి వేదిక ఎక్కగానే.. చంద్రబాబు అలా..
దివంగత ముఖ్యమంత్రి, ప్రఖ్యాత సినీ నటుడు ఎన్టీ రామారావు అంటే తెలుగు ప్రజల్లో ఆరాధ్య భావం ఉంటుంది. కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించిన నందమూరి తారకరామారావు మొదట సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎనలేని గుర్తింపు పొందారు.. అదే మాదిరిగా రాజకీయ రంగంలో కూడా చరిత్ర సృష్టించారు. దేశ వ్యాప్తంగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పి ఎంతో ఘన చరిత్ర కలిగిన ఎన్టీఆర్.. తన జీవితంలోని చివరి ఘడియల్లో మాత్రం చాలా దారుణ పరిస్థితులు ఎదుర్కొన్నారు. తన సొంత కుటుంబానికే చెందిన వాళ్లే తిరుగుబావుటా ఎగరేసి.. ఎన్టీఆర్ను అత్యంత అవమానకర రీతిలో ముఖ్యమంత్రి పదవి నుంచి దించేశారు. ఎన్టీఆర్ను పదవీచ్యుతుడిని చేసేందుకు వారు సాకుగా చూపించిన ఏకైక వ్యక్తి.. లక్ష్మీపార్వతి! ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఆయన జీవితంలోకి వచ్చిన లక్ష్మీపార్వతి.. కడవరకూ ఆయన వెన్నంటే ఉన్నారు. లక్ష్మీపార్వతి పేరు లేకుండా ఆయన చరిత్ర గురించి చెప్పడం కష్టమే అనేంతలా ఆయన జీవితంలో ఆమె కీలక పాత్ర పోషించారు. చరిత్రలో స్త్రీ పాత్ర లేకుండా ఎపిసోడ్లు లేవు. అలా ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎలా వచ్చారు..? ఆమెకు ఆయన ఇచ్చిన స్థానం ఎలాంటిది..? ఎన్టీఆర్ చివరి రోజుల్లో అచేతన స్థితిలో ఉంటే లక్ష్మీపార్వతి చేసిన సేవ ఎలాంటిది..? ఎన్టీఆర్కు ఎంతో సేవ చేసిన ఆమెపై కుట్రలు పన్నింది ఎవరు..? నాడు ఇవ్వన్నీ ప్రత్యక్షంగా చూసిన ప్రముఖ జర్నలిస్ట్ దాసు కేశవ రావు ఈ వ్యాసం ద్వారా తెలిపారు. ఎన్టీఆర్ను లక్ష్మీపార్వతి ఎందుకు కలిశారు? గుంటూరు జిల్లా పచ్చల తాడిపర్రుకు చెందిన లక్ష్మీపార్వతిని మొదటగా వీరగంధం వెంకట సుబ్బారావు వివాహం చేసుకున్నారు. ఆయన హరికథా విద్వాంసుడు. లక్ష్మీపార్వతి కంటే ఆయన 20 ఏళ్లు పెద్దవాడు. ఆమె పెళ్లి నాటికే తెలుగు భాషా పాండిత్యం మీద మంచి పట్టు సాధించి ఉన్నారు. భారత ఇతిహాసాలు, పురాణాల పట్ల లక్ష్మీపార్వతికి మంచి పరిజ్ఞానం ఉంది. ఆప్పట్లో ఆమె పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఒక కళాశాలలో ఉపాధ్యాయురాలిగా కూడా బోధించారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి M. Phil పూర్తి చేసిన ఆమె పీహెచ్డీ కోసం నమోదు చేసుకున్నారు. ఇందులో భాగంగా 'సినిమాలో పౌరాణిక విశేషాలు అంశంపై ఆమె పరిశోధన చేయాలనుకున్నారు. అలా ఆమె మొదటగా ఎన్టీఆర్ను కలవాలని అనుకున్నారు. లక్ష్మీపార్వతికి నో చెప్పిన ఎన్టీఆర్ ఆమె తన భర్త వీరగంధం వెంకట సుబ్బారావుతో కలిసి 1985లో న్యూఢిల్లీకి వెళ్లి అక్కడ రామారావును కలుసుకున్నారు. తన రీసర్చ్తో పాటు ఎన్టీఆర్ జీవిత చరిత్ర రాయడం కోసం సాకారం ఇవ్వాలని లక్ష్మీపార్వతి కోరడంతో ఆయన కుదరదని చెప్పారు. ప్రస్తుతం తాను చాలా బిజీగా ఉన్నానని లక్ష్మీపార్వతితో ఎన్టీఆర్ చెప్పారు. అలా మొదటిసారి వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆకలితో పడుకున్న ఎన్టీఆర్ 1993-94లో ఏం జరిగిందో జర్నలిస్ట్ దాసు కేశవ రావు ఇలా చెప్పారు. ఆ సమయంలో ఎన్టీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఒకరోజు పర్యటన ముగించుకుని బంజారాహిల్స్లోని రోడ్ నంబర్ 13న ఎన్టీఆర్ నివాసానికి తిరిగి వచ్చాం. అప్పుడు ఆయనతో పాటు నేనూ ఉన్నాను. ఇల్లు దాదాపుగా ఖాళీగా ఉంది. అప్పుడు ఇంట్లో ఒకరిద్దరు పనివాళ్లు మినహాయించి ఎవరూ లేరు. ఆ సమయంలో ఆయన ఆకలితో ఉన్నారు.. కానీ అక్కడ తినటానికి ఏం లేదు. ఎన్టీఆర్ ఖాళీ కడుపుతో పడుకోబోతుండగా ఆయన దగ్గర పనిచేస్తున్న ఒకరు ఆ పరిస్థితిని చూసి చలించిపోయి .. ఎన్టీఆర్ స్నేహితుడి ఇంటి వద్దకు వెళ్లి అప్పటికప్పడు భోజనం తయారు చేపించుకుని వచ్చి వడ్డించాడు. ఆయన జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటనలలో ఇది ఒకటి. బడి పంతులు సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు సమాంతరంగా నిజ జీవితంలో కూడా ఇలాంటివి ఎన్నో జరిగాయి. కుటుంబ సభ్యులకు దూరం 1984లో తన మొదటి భార్య బసవ తారకం మరణం తర్వాత ఎన్టీఆర్ ఒంటరిగా మిగిలిపోయారు. అప్పటి నుంచి ఆయనకు పనివాళ్లే అన్నం వడ్డించడం వంటివి చేసేవారు. ఆయనకు 7 మంది కుమారులు, నలుగురు కూతుళ్లు ఉన్నా కూడా కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదు. వాళ్లూ ఆయన ఉంటున్న ఇంటి వద్దకు వచ్చే వాళ్లు కాదు. ఒంటిరిగానే ఉండేవారు. ఆ సమయంలో అతన్ని దగ్గరుండి చూసుకోవాల్సిన శ్రద్ధగల భాగస్వామి అవసరం. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో లక్ష్మీపార్వతి 1991-92లో రామారావు జీవితంలోకి ప్రవేశించారు. అప్పటికే ఆమె తన భర్త నుంచి విడిపోయి ఉన్నారు. చాలా రోజుల నుంచి తన రీసెర్చ్, ఆటో బయోగ్రఫీ కోసం ఆమె పదే పదే అభ్యర్థన చేస్తుండటంతో చివరకు ఎన్టీఆర్ అంగీకరించారు. ఆ సమయంలో (1991-92) ఎన్టీఆర్ ప్రతిపక్ష నేతగా ఉండటంతో ఆమె పరిశోధన, జీవిత చరిత్ర గురించి రాసేందుకు మరింత సులభం అయింది. ఆప్పుడు ఎన్టీఆర్కు కూడా ఎక్కువ సమయం దొరికింది. పురాణాలు, భారత సంస్కృతిపై లక్ష్మీపార్వతికి ఉన్న పరిజ్ఞానం, విశ్లేషణతో ఎన్టీఆర్ ఆశ్చర్యపోయారు. అలా రోజూ వారిద్దరూ చర్చిస్తుండటంతో వారిని మరింత దగ్గర చేసింది. కానీ అప్పట్లో ఆమె నరసరావుపేట తెలుగు విశ్వవిద్యాలయానికి బస్సులో వెళ్లి రావడం ఇబ్బందిగా ఉండటంతో ఎన్టీఆర్ ఆమెకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అలా ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయంలో ఆమె ఉండేందుకు బస కూడా ఏర్పాటు అయింది. ఆస్పత్రిలో ఎన్టీఆర్ ఉంటే.. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి మధ్య అనుబంధం మరింత బలపడటంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. అప్పుడు వారిలో ఎన్టీఆర్ పట్ల విపరీతమైన కోపం పెరిగింది. అప్పటికే ఎన్టీఆర్కు దూరంగా ఉన్న కుటుంబ సభ్యులు లక్ష్మీపార్వతి ఎంట్రీతో జీర్ణించుకోలేకపోయారు. ఆమెపై ద్వేషం పెంచుకున్నారు. ఒకరోజు రాత్రిపూట ఎన్టీఆర్కు రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయాయి. దాదాపు అయన కోమాలోకి వెళ్లిపోయారు. ఆప్పుడు ఎంతో ఆందోళనలో లక్ష్మీపార్వతి ఉన్నారు. ఆయన్ను వెంటనే ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించారు. అప్పుడు కూడా కుటుంబ సభ్యులు చూసేందుకు వెళ్ల లేదు. ఆస్పత్రిలో ఎన్టీఆర్కు ఆమె ఎనలేని సేవ చేయడం జరిగింది. అలా ఆయన మళ్లీ ఆరోగ్యంగా కోలుకున్నారు. 1993 సెప్టెంబర్ 10న ప్రకటన ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి మధ్య ఉన్న సంబంధంపై మీడియా, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. వాళ్ల గురించి పుకార్లు కూడా ప్రారంభం అయ్యాయి. కానీ ఎన్టీఆర్ వాటి పట్ల ఎక్కడా స్పందించలేదు. సరిగ్గా అలాంటి సమయంలోనే మేజర్ చంద్రకాంత్ సినిమా 100వ రోజు వేడుక తిరుపతిలో జరుగుతుంది. అక్కడ ఈ టాపిక్పై స్పందించాలని ఆయన నిర్ణయించుకున్నారు. అప్పుడు ఆయన్ను ఆపేందుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అందురూ ప్రయత్నించారు. కానీ కుదరలేదు. అది 1993 సెప్టెంబర్ 10 తిరుపతిలో సభ... ఎన్టీఆర్ అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఆ సమయంలో సభకు దూరంగా కూర్చోని ఉన్న లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ వేదికపైకి పిలిచారు. దాంతో ఆ సమయంలో అక్కడే ఉన్న నారా చంద్రబాబు నాయుడు హుటాహుటిన కిందకు వెళ్లిపోయారు. ఇవన్నీ ఎన్టీఆర్ లెక్క చేయలేదు. తమ కుటుంబ సభ్యులు లక్ష్మీ పార్వతిని పలు ఇబ్బందులకు గురిచేశారు. ఆమె గురించి తప్పుగా ప్రచారం చేశారు. 'నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు దూరంగా ఉంటే లక్ష్మీ పార్వతి నాకు అండగా నిలిచింది.' అని ఎన్టీఆర్ అన్నారు. ఆమెను వివాహం చేసుకుంటున్నట్లు ఆయన అక్కడే ప్రకటించారు. అలా ఆమెను తన భార్యగా బహిరంగంగానే చాటిచెప్పారు. అంతేకాకుండా 1994 ఎన్నికల ప్రచారం సమయంలో కూడా ఆమెను తన వెంటే ఉండేలా చేసుకున్నారు. ఎన్నికల ప్రచారం, పార్టీ సమావేశాలలో ఎన్టీఆర్తో పాటుగా ఆమె కూడా కీలకంగా పనిచేశారు. 1995 ఎన్టీఆర్ పర్యటనతో పతనం అలా ఎన్నికలు పూర్తి కావడం... తెలుగుదేశం భారీ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి రావడం జరిగిపోయాయి. ఆ సమయానికి ఆమె అదృష్టం బాగానే ఉంది. మరోవైపు పార్టీలో చంద్రబాబు నాయుడు పతనం ప్రారంభం అయింది. 1995లో లక్ష్మీ పార్వతితో పాటు ఎన్టీఆర్ UK పర్యటనకు వెళ్లారు. అప్పుడు UK పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రిని కలిసేందుకు వెళ్లారు. కానీ వారిద్దరూ ఇండియాకు తిరిగి రావడం కొంత ఆలస్యం అయింది. అదే ఎన్టీఆర్ పతనానికి దారి తీసింది. పావులు కదిపిన చంద్రబాబు ఇలాంటి సమయం కోసం చంద్రబాబుతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. అప్పుడు చంద్రబాబు వ్యూహాత్మకంగా పావులు కదిపారు. ఆ సమయంలో జరిగిన స్థానిక, పౌర సంస్థల ఎన్నికల్లో టీడీపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అప్పటి వరకు ఎన్టీఆర్కు నమ్మకంగా ఉన్న విధేయుల నుంచి తిరుగుబావుట ఎదురైంది. ఇదంతా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉన్న మెజారిటీ ఎమ్మెల్యేలే నడిపించారు. అలా 1995 ఆగష్టులో రామారావు, లక్ష్మీ పార్వతిలు ఈ సంక్షోభాన్ని పసిగట్టలేకపోయారు. పార్టీ అధ్యక్షుడి పదవి చంద్రబాబు నాయుడుకు చేరింది. తర్వాత ముఖ్యమంత్రి పదవి వరించింది. అక్కడితో ఎన్టీఆర్ చరిత్ర ముగిసిపోయింది. ఆ సమయం నుంచి చంద్రబాబు ఏది చెబితే అదే జరుగుతూ వచ్చింది. ఆ విధంగా, లక్ష్మీ పార్వతి కూడా తన భర్తతో పాటుగా ఉన్నత స్థానం నుంచి కిందకు పడిపోయారు. అలా కొన్ని నెలల తరువాత (1996) ఎన్టీఆర్ మరణించడం జరిగిపోయింది. అలా ఎన్టీఆర్ చివరి రోజులు క్షోభ,వేదనతో ముగిసిపోయాయి. -
అయ్యో లక్ష్మీపార్వతి.. ‘రాబంధు’వుల రాజకీయం ఇది!
దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్మృతికి ఆయన కుటుంబ సభ్యులు నివాళి అర్పిస్తున్న తీరు వివాదాస్పదంగా కనిపిస్తోంది. తాజాగా ఆయన పేరిట ఒక నాణేన్ని తీసుకు రావడం ఆసక్తికరమైన అంశమే అయినా.. అందులో రాజకీయ దురుద్దేశాలు కనిపించడం మాత్రం ఆయన గౌరవాన్ని తగ్గించడమే అవుతుంది. అసలు కేంద్ర ప్రభుత్వం స్వయంగా చేయవలసిన ఈ పనిని కుటుంబ సభ్యులు చేసిన తీరు, దానికి ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతిని పిలవకపోవడం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును, టీడీపీ నుంచి బీజేపీలో చేరిన కొందరు నేతలను ఆహ్వానించడం.. ఆ కార్యక్రమానికి బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా రావడం, ఆ తర్వాత ఆయనతో చంద్రబాబు మంతనాలు జరపడం.. ఇవన్నీ కూడా ఎన్టీఆర్ పేరును వీళ్లు రాజకీయంగా వాడేసుకునే యత్నమేననిపిస్తుంది. తమను గతంలో తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు సరసన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరి దంపతులు కూర్చుని మంతనాలు జరపడం కూడా ఆశ్చర్యంగానే ఉంటుంది. దీనిని చంద్రబాబు తెలివితేటలు అనాలా?లేక పురందేశ్వరి అవకాశవాదం అనాలా? అనేది చెప్పలేం. ఒకప్పుడు దగ్గుబాటి దంపతులు తమను చంద్రబాబు అవమానాలపాలు చేశారని బాధపడుతుండేవారు. వెంకటేశ్వరరావు అయితే ఏకంగా పుస్తకాన్నే రాశారు. మరి అలాంటివారు ఇప్పుడు అలయ్ బలయ్ మాదిరి కూర్చోగలిగారంటే ఏమనుకోవాలన్న ప్రశ్న వస్తుంది. చంద్రబాబు చేతిలో వెంకటేశ్వరరావు ఒకసారి కాదు.. పలుమార్లు దెబ్బతిన్నారు. అవమానాలకు గురయ్యారు. వారు పూర్తిగా కలిసిపోయారో, లేదో తెలియదు కాని అందరి దృష్టిని ఆకర్షించారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించడం , తొమ్మిది నెలల్లో అధికారంలోకి రావడం ఒక సంచలనం అయితే, ఆయన తన కుటుంబ సభ్యుల చేతిలోనే ఘోర పరాభవానికి గురై పదవి కోల్పోవడం మరో పెద్ద విషాదం. ఆ తర్వాత కొద్ది కాలానికే ఆయన గుండెపోటుతో కాలం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో కుటుంబ పాత్ర ఏమిటి అన్నది ఎప్పటికీ చర్చనీయాంశంగానే ఉంటుంది. ✍️ ఎన్టీఆర్ మరణించిన తర్వాత ఆయన ఆస్తుల వారసత్వాన్ని కుటుంబ సభ్యులు పొందితే, ఆస్తులతో పాటు రాజకీయ వారసత్వం తమదేనని అల్లుడు చంద్రబాబు నాయుడు లాగేసుకున్నారు. ఆయన జీవితం చరమాంకంలో ఉన్నప్పుడు వీరెవ్వరూ ఆయన పట్ల కనికరం చూపకపోవడం బాధాకర ఘట్టమైతే, ఆయన మృతి చెందిన తర్వాత మాత్రం ఎంతో అపారమైన ప్రేమాభిమానాలు ఉన్నట్లు ప్రవర్తించడం అచ్చం అదేదో నాటకంలా అనిపిస్తుంది. మరి ఎన్టీఆర్ ఇష్టపడి పెళ్లి చేసుకున్న రెండో భార్య లక్ష్మీపార్వతి సంగతేమిటి?. ఎన్టీఆర్ గొప్పదనం గురించి చెబుతున్నవారు ఆయన భార్యను వెలివేస్తారా?ఎన్.టి.ఆర్.జీవించి ఉన్నప్పుడు తమకు అవసరమైనప్పుడు ఇదే లక్ష్మీపార్వతితో ఎలా మాట మంతీ కలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో జరిగిందంతా తప్పు అనుకుంటే.. కుటుంబ ప్రతిష్ట దెబ్బతిన్నదని భావిస్తే.. లక్ష్మీపార్వతి మాత్రమే తప్పు చేశారా?. పెళ్లి చేసుకున్న ఎన్టీఆర్ సంగతేమిటి?. ఎన్.టిఆర్ కుటుంబంలో ఇంకెవరూ విడాకులు తీసుకోలేదా? మరో పెళ్ళి చేసుకోలేదా?. పై విషయాల జోలికి వెళ్లడం పద్దతి కాదు. కానీ, రాజకీయాలలో క్రియాశీలకంగా ఉండి, పది మందికి నీతులు చెప్పే నేతలుగా ఉన్న పురందేశ్వరికాని, చంద్రబాబు నాయుడు కాని ఇలా చేసి ఉండాల్సింది కాదని చెప్పక తప్పదు. ఒకపక్క మహిళలను గౌరవించాలని చెబుతూ , ఇంకో పక్క లక్ష్మీపార్వతిని వీలైనప్పుడల్లా అవమానించడం ఎలా సమర్ధించగలం?. తమకు అవసరమైతే ఒక నాయకుడు మూడు పెళ్లిళ్లు చేసుకున్నా, ఒకరిని పెళ్లి చేసుకుని మరొకరితో సంబంధం పెట్టుకున్నారన్న అబియోగాలు ఉన్నా ఆయనను సమర్ధించడం ,రాజకీయ స్నేహం కోసం వెంపర్లాడడాన్ని ఏమనాలి?.. ✍️ సరే.. ఇది ప్రైవేటు కార్యక్రమం అని చెప్పవచ్చు. కానీ జరిగింది రాష్ట్రపతి భవన్ లో అన్న సంగతి మర్చిపోకూడదు. కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇందులో ఇన్వాల్వ్ కాకపోయినా, కేంద్రం అనుమతితోనే ఈ నాణేల ముద్రణ జరిగిందని గుర్తుంచుకోవాలి. పైగా ఇవేవి చలామణిలో ఉండే నాణాలు కాదట. ఎవరైనా వీటిని 3,500 రూపాయల నుంచి 4,850 రూపాయలకు కొనుగోలు చేసుకోవచ్చట. అంటే ఎవరైనా తమకు కావల్సిన నాణేలను తయారు చేసుకోవచ్చు. ఈ మాత్రం దానికి అదేదో కేంద్రం విడుదల చేస్తున్నట్లు ఎందుకు ప్రచారం చేశారు. ఇది ప్రైవేట్ నాణెమే అయితే ఎన్.టి.ఆర్.ను అవమానించినట్లు కాదా? అదే కేంద్రం కనుక నిజమైన నాణాలను విడుదల చేసి ఉంటే అవి జనం చేతిలోకి వెళ్లేవి కదా! అది కదా ఆయనను గౌరవించడం అంటే!. ✍️ ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలని కోరే వీళ్లు.. గతంలో వాజ్ పేయి ఉన్నప్పుడు ఇవ్వాలన్న ఆలోచన జరిగితే ఎందుకు అంత సుముఖత చూపలేదు?. కేవలం లక్ష్మీపార్వతి ఆ అవార్డు అందుకుంటారనే కదా అప్పుడు అలా చేసింది!. అదే సమయంలో చంద్రబాబు మాత్రం ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఎన్టీఆర్ భారతరత్న ఇవ్వాలని అంటారు. ఎన్.టి.ఆర్. అంతటి గొప్ప వ్యక్తి అయితే చంద్రబాబే ఎందుకు కూలదోశారు?. ఆ తర్వాత ఇంటర్వ్యూలలో ఎన్.టి.ఆర్.కు విలువలు లేవని ఎలా చెప్పారు?.. ఇలాంటి ప్రశ్నలకు.. వాళ్ల దగ్గరి నుంచి సమాధానం రాదు. నాణేం విడుదల కేవలం కుటుంబ సభ్యుల కార్యక్రమం అయితే.. వైఎస్సార్సీపీ అసమ్మతి ఎంపీ రఘురామకృష్ణంరాజు, టిడిపి నుంచి బిజెపిలోకి వెళ్లిన మాజీ ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరి, మరో ఒకరిద్దరు.. అక్కడ ఎలా ఉన్నారు?. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రను ఎలా పిలిచారు?. వీళ్లంతా ఎన్టీఆర్ బంధువులా? లక్ష్మీపార్వతి మాత్రం కాకపోయిందా? అదేదో పురందేశ్వరి ఇంటిలో కార్యక్రమం అయితే ఆమె ఇష్టం వచ్చినట్లు చేసుకుని ఉండవచ్చు. కానీ, రాష్ట్రపతి భవన్ లో పెట్టాక అది పబ్లిక్ కార్యక్రమంగానే ఉంటుంది. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. ✍️ ఇక రాజకీయం చూస్తే.. ఇటీవలికాలంలో బీజేపీతో ఎలాగొలా అంటకాగాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలకు దీనిని ఒక అవకాశంగా తీసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. వారి మధ్య జరిగిన మంతనాలు ఏమిటో తెలియదుగాని, కచ్చితంగా రాజకీయ స్నేహం చేయడానికి చంద్రబాబు అర్రులు చాస్తున్న వేళ ఈ భేటీ జరిగింది. దీనికి బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి చొరవ తీసుకోవడం విమర్శలకు దారి తీస్తోంది. ఎన్టీఆర్ను పదవీచ్యుతుడిని చేయడంలో తనకు సహకరించిన వెంకటేశ్వరరావుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు చెప్పి, ఆ తర్వాత అవమానించి బయటకు పంపేశారు. ఆయన లక్ష్మీపార్వతి పార్టీ టిక్కెట్ మీద రాజ్యసభ సభ్యుడు అయ్యారు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి సహకారంతో మళ్లీ ఎమ్మెల్యే అయ్యారు. తన భార్య పురందేశ్వరి ఎంపీ అయి కేంద్ర మంత్రి అయ్యారు. అప్పట్లో పార్లమెంటులో చంద్రబాబుతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ విగ్రహాన్ని పురందేశ్వరి ఏర్పాటు చేశారు. సోనియాగాంధీకి ఆమె ధన్యవాదాలు కూడా తెలిపారు. అది అధికారిక కార్యక్రమంగా జరిగితే అప్పుడు కూడా లక్ష్మీపార్వతిని పిలవకపోతే ఆమె ఎలాగోలా ఎవరి సహకారంతోనే లోపలికి వెళ్లగలిగిందట. తన ఇంటిలో జరిగిన ఒక వివాహ కార్యక్రమానికి చంద్రబాబు వస్తే పలకరించడానికి కూడా ఇష్టపడని పురందేశ్వరి.. రాజకీయం కోసం ఇప్పుడు జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీకి సహకరించడం అందరిని ఆశ్చర్య పరుస్తోంది. పురందేశ్వరికి మరి తన తండ్రి చివరి రోజుల్లో దగ్గర ఉండి సేవలందించిన లక్ష్మీపార్వతి మాత్రం ఎలా కొరగాకుండా పోయింది?. ఇలా చేస్తే ఎన్టీఆర్ ఆత్మ సంతోషిస్తుందా?తండ్రి గురించి ఎంత గొప్ప ఉపన్యాసం చేసినా విలువ ఉంటుందా? చంద్రబాబు గురించి ఎన్టీఆర్ ఏమన్నది వీడియో సహితంగా ఉన్నా.. దానిని పట్టించుకోని పురందేశ్వరి తన తండ్రి ప్రేమించిన లక్ష్మీపార్వతిని మాత్రం అవమానిస్తున్నారు. ఇదేనా తండ్రికి ఇచ్చిన నివాళి అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
అసలు విలన్ పురంధరేశ్వరి: లక్ష్మీపార్వతి
సాక్షి, అమరావతి: దివంగత నందమూరి తారకరామారావు పేరు మీద 100 రూపాయల స్మారక నాణేం విడుదల కార్యక్రమంపై ఆయన సతీమణి లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఆహ్వానం అందించకపోవంపై ఇదివరకే ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ రాష్ట్రపతి, ప్రధాని, ఆర్థిక మంత్రికి సైతం లేఖ రాశారు. ఈ క్రమంలో ఇవాళ్టి కార్యక్రమంపై తాజాగా ఆమె అసంతృప్తి లేఖను విడుదల చేశారు. అంతేకాదు ఎన్టీఆర్ కూతురు దగ్గుబాటి పురంధేశ్వరిపైనా ఆమె ఆగ్రహాం వ్యక్తం చేస్తూ.. మీడియా ముందుకు వచ్చారు. ‘‘ఎన్టీఆర్ పేరుతో వంద రూపాయిల నాణం విడుదల చేయడం సంతోషంగా ఉంది. కానీ, నాకు ఆహ్వానం అందించకపోవడం, నన్ను పిలవకపోవడం బాధగా అనిపిస్తోంది. రాష్ట్రపతికి, ప్రధానికి, ఆర్థికమంత్రి కి లేఖ రాశాను.ప్రభుత్వమే నిర్వహిస్తే భార్యగా నన్ను పిలవకపోడం తప్పు. ఇన్విటేషన్ చూస్తే ప్రైవేటు ఫంక్షన్ కి రాష్ట్రపతి గెస్ట్ గా వెళ్తున్నట్టు ఉంది. ఎన్టీఆర్ భార్యగా నన్ను పిలవకపవడం అన్యాయం. ఆయన ప్రాణాలు తీసిన వాళ్ళు వారసులుగా చలామణి అవుతున్నారు. భార్యగా నాణెం అందుకోడానికి అర్హత నాకే ఉంది.. వీళ్లకు లేదు. ప్రాణాలు తీసిన వాళ్ళు నాణెం విడుదలకు వెళ్లారు?’’ అని సూటిగా నిలదీశారామె. పురంధేశ్వరిపై ధ్వజం ఇక నుంచి తన పోరాటం పురంధేశ్వరిపైనేనని లక్ష్మీ పార్వతి ప్రకటించారు. ‘‘ఎన్టీఆర్ కి అర్ధాంగిగా నన్ను ఆహ్వానించకపోవడం దుర్మార్గం. తండ్రికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తులా కుటుంబ సభ్యులగా చెలామణీ అవుతారా?. పురంధేశ్వరి ఎంతో దుర్మార్గురాలు. నా వల్ల మీకు జరిగిన నష్టం ఏమిటి. ఎన్టీఆర్ కొడుకులు అమాయకులు. కూతుళ్లు పురందేశ్వరి, భువనేశ్వరులే దుర్మార్గులు. పురంధేశ్వరి చంద్రబాబుతో కలిసి కుట్ర చేస్తోంది. పురంధేశ్వరి తిరిగిన ప్రతీనియోజకవర్గంలో తిరుగుతా. ఒక్క సీటు కూడా ప్రచారం చేస్తా. వీళ్ళ గురించి ntr ఏమన్నారో ప్రజలకు వివరిస్తా. ఎన్నాళ్ళు వీళ్ళ నుండి అవమానాలు పడుతూ ఉండాలి. పురంధరేశ్వరి కి నేను ఏమి అడ్డం వచ్చాను.. అయన కష్టాల్లో ఉంటే పురంధరేశ్వరి వచ్చిందా..?. నన్నెందుకు చులకన చేస్తున్నారు.. నన్ను చులకన చేస్తే NTR ను చేసినట్టే. NTR ను చంద్రబాబు బయటకి వెన్నుపోటు కు ఇంటర్నల్ గా పురంధరేశ్వరి ప్రధాన కారకురాలు. పురంధేశ్వరి రాజకీయాల్లోకి వద్దు అన్నారని NTR పై కుట్ర చేసింది. తండ్రిపై కోపంతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది. కేంద్ర మంత్రిగా ఉండి అవినీతి చేసింది పురంధరేశ్వరి. ‘‘నాకు జరిగిన అవమానం నీకు ఏదో ఒక రోజు వస్తుంది. ఈరోజు నుంచి నా పోరాటం నీమీదే’’ అని పురందేశ్వరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారామె. చంద్రబాబుతో కలిసి పురంధేశ్వరి కుట్రలు.. నాకు జరిగిన అవమానం నా భర్త ఎన్టీఆర్కు అవమానంగా భావిస్తాను. NTR నన్ను వివాహం చేసుకున్నారో లేదో.. అయన పిల్లలు సమాధానం చెప్పాలి. నన్ను పిలవకుండా పురంధరేశ్వరి, చంద్రబాబు అడ్డుకున్నారు. NTR భార్యను అని మెడలో ఫోటో పెట్టుకుని తిరగాలా.?. NTR తో వివాహం అయినట్టు ఫోటోలు, వార్తా కధనాలు ఉన్నాయి. సాక్షాత్తు ntr అనేకసార్లు బహిరంగంగా చెప్పారు. నన్ను పెళ్ళి చేసుకోలేదని అని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది. NTR యుగ పురుషుడు అంటున్నారు.. పెళ్లి చేసుకోకపోతే యుగ పురుషుడు అవుతాడా..?. ఇంతకాలం ntr కుటుంబంపై అభిమానంతో సైలెంట్ గా ఉన్నాను. ఇకపై ఆ కుటుంబాన్ని వదిలిపెట్టను.. చంద్రబాబు, పురంధరేశ్వరి, బాలకృష్ణ అందరినీ బయటకు లాగుతా. వచ్చే ఎన్నికల తరువాత వీళ్ళు రాజకీయాల్లో ఉండకుండా చేస్తా. పురంధేశ్వరి టీడీపీ ఏజెంట్ ఎన్నికల సమయంలో ntr ను వాడుకుంటున్నారు. కేంద్రం భారతరత్న ఇస్తాను అంటే పురంధరేశ్వరి అడ్డుకుంది. భువనేశ్వరి, పురంధరేశ్వరి ఇద్దరూ తండ్రికి ద్రోహం చేశారు.. మళ్లీ పురంధేశ్వరి, చంద్రబాబు ఏకమైపోయారు. కానీ, నాకంటే ఎక్కువ అవమానానికి పురంధరేశ్వరి గురవుతారు. ఎన్టీఆర్కు రావాల్సిన భారతరత్న రాకుండా చేశారు. పురంధేశ్వరి బిజెపి లో ఉంటూ టిడిపికి పనిచేయడమేంటి?. బిజెపికి చెబుతున్నా...పురందేశ్వరి టిడిపి ఏజెంట్ గా పనిచేస్తోంది...పురందేశ్వరి కుట్రలు అర్ధం చేసుకోవాలని బీజేపీని కోరుతున్నా. జూనియర్ను బాబుతో కలపాలని.. జూ ఎన్టీఆర్ కు ఆహ్వానం ఇచ్చారో లేదో నాకు తెలీదు. జూ ఎన్టీఆర్ వస్తే అక్కడ చంద్రబాబు, జూ ఎన్టీఆర్ ను కలపాలని ప్రయత్నం చేసింది. ప్రభుత్వ ఇన్విటేషన్ అయితే జూ ఎన్టీఆర్ హాజరు అయ్యేవారు. ప్రైవేటు ఫంక్షన్ కనుకే జూ ఎన్టీఆర్ హాజరుకాలేదు. పురంధరేశ్వరి కుట్రను బీజేపీ తెలుసుకోవాలని మరోసారి కోరుతున్నారు. చంద్రబాబు స్క్రిప్ట్ పురంధరేశ్వరి చదువుతుంది. సీఎం వైఎస్ జగన్ కి వ్యతిరేకంగా భయంకర కుట్రలు చేస్తున్నారు. నేను రాసిన లేఖలను సమాధానం రాలేదు. అందుకే ఢిల్లీ వెళ్తాను.. ప్రధాని, రాష్ట్రపతి, నిర్మలా సీతారామన్ లను కలుస్తా అని లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు. -
రాష్ట్రపతి ముర్ముకు లక్ష్మీపార్వతి లేఖ
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ నేత, ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఎన్టీఆర్ పేరు మీద రూ.100 నాణేం విడుదల కార్యక్రమానికి తనను ఆహ్వానించకపోవడంపై ఆమె లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ భార్యనైన తనను ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించలేదని, తక్షణం జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని లక్ష్మీపార్వతి లేఖలో కోరారు. భార్యగా తానే అసలైన వారసురాలినని లేఖలో పేర్కొన్న లక్ష్మీపార్వతి.. ఎన్టీఆర్ పేరుపై రూ.100 నాణెం విడుదల చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు, ఇతర కుటుంబసభ్యుల వల్లే ఎన్టీఆర్ చనిపోయారని, ఎన్టీఆర్ మరణానికి కారణమైన వారిని కార్యక్రమానికి పిలవడంపై లేఖలో లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: చంద్రబాబే కదా సిసలైన సైకో! -
ఇప్పుడు పార్టీ విడిచిపెట్టే వారికీ అదే గతి పడుతుంది: లక్ష్మీ పార్వతి
-
టీడీపీని నందమూరి కుటుంబానికి అప్పగించాలి: లక్ష్మీపార్వతి
సాక్షి, నెల్లూరు: చంద్రబాబు ఛాప్టర్ పుత్రుడు, దత్త పుత్రుడు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఎంత తిరిగినా ప్రజలు నమ్మరంటూ చంద్రబాబు నాయుడికి చురకలు అంటించారు తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మి పార్వతి. చంద్రబాబు హయాంలో అభివృద్ధి శూన్యమని, కష్టపడుతున్నాడు గనుకే ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారని ఆమె స్పష్టం చేశారు. చంద్రబాబు తన హయాంలో ధనవంతుడు అయ్యాడే తప్ప.. పేదల గురించి ఏమాత్రం పట్టించుకోలేదని పేర్కొన్నారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చెయ్యలేదు. పైగా ఇసుక మీద రూ. 4 వేల కోట్లు అక్రమంగా సంపాదించారు. అవినీతిలో బాబుకి స్టాన్ఫర్డ్యూనివర్సిటీ సర్టిఫికెట్ ఇవ్వొచ్చు. సైకో, శాడిస్ట్ కాబట్టే.. ప్రశ్నించే వారిని గుర్రాలతో తొక్కించాడు. ఎమ్మార్వో వనజాక్షిని బెదిరించాడు. నాయీ బ్రాహ్మణులను జైల్లో పెడతానన్నాడు. అందుకే 2019లోనే చంద్రబాబు చాప్టర్ క్లోజ్ అయింది. కాబట్టి, పుత్రుడు లోకేష్, దత్త పుత్రుడు పవన్ కల్యాణ్లు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినా.. ప్రజలు నమ్మరు అని తేల్చేశారామె. అయోమయం లోకేష్ పనికి మాలిన నారా లోకేష్ కోసం కోట్లు ఖర్చు పెట్టి భాష నేర్పించాడు చంద్రబాబు. అయినా అతనిలో మార్పు రాలేదు. స్వర్గీయ ఎన్టీఆర్ మనవడిగా లోకేష్ను ప్రజలు స్వీకరించడం లేదు. అసలు ఆ పోలికే నక్కకి నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది. లోకేష్ అయోమయంలో మాట్లాడుతున్నాడు. టీడీపీ హయాంలో జరిగిన అవినీతిని.. వైఎస్సార్సీపీ హయాంలో జరిగినట్లు విమర్శిస్తున్నాడు. నందమూరి అభిమానులు చంద్రబాబు, లోకేష్లను రాజకీయాల నుంచి తరిమి కొట్టాలి. టీడీపీని తిరిగి నందమూరి కుటుంబానికి అప్పగించాలి. కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్లకు పార్టీ పగ్గాలు అప్పగించాలి అని లక్ష్మీ పార్వతి డిమాండ్ చేశారు. ఇప్పుడే ఇలా మాట్లాడితే ఎలా? అధికారంలోకి రాక ముందే.. చంద్రబాబు సొంతపుత్రుడితో పాటు దత్తపుత్రుడు సైతం చంపుతా, నరుకుతా, బట్టలు విప్పి కొడతా అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. సినిమాలు చేసుకుంటున్న పవన్ని తెర మీదకు తెచ్చి.. కాపు నాయకుల్ని తిట్టిస్తున్నారు. విష వృక్షం నీడలో రాజకీయాలు చెయ్యొద్దని గతంలో పవన్ కల్యాణ్కి చెప్పాను అని లక్ష్మీపార్వతి గుర్తు చేసుకున్నారు. చీడ పురుగులు పోతేనే.. అమ్ముడుపోయే నాయకులు అన్ని పార్టీలో ఉంటారు.. అలాంటి చిడ పురుగులు వెళ్లిపోతేనే పార్టీ బలపడుతుంది. రాజకీయంగా చంద్రబాబును నమ్మకున్న వారు భూస్థాపితం అవ్వడం ఖాయం. గతంలో 23 మంది ఎమ్మెల్యే లను చంద్రబాబు కొనుగోలు చేశాడు. పార్టీ మారిన ఆ 23 మంది ఎమ్మెల్యే లకు ఇప్పుడు రోడ్డు మీద ఉన్నారు. ఒడిపోతాము, టికెట్ రాదనే భయంతోనే వాళ్ళు పార్టీ జంప్ చేశారు.. రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలకు రాని ఇబ్బంది, ఆ ముగ్గురికి ఏమొచ్చింది? కేవలం పార్టీ గుర్తు మీద గెలిచి స్వార్దం కోసం పార్టీ మారరు వాళ్లు అంటూ పేర్కొన్నారామె. ఇదీ చదవండి: దగ్గరుండి పవన్ పరువు తీసేశారు! -
చంద్రబాబు వల్ల ఎన్టీఆర్కు మూడు సార్లు గుండెపోటు : పోసాని
సాక్షి, విజయవాడ: లక్ష్మీ పార్వతి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు చంద్రబాబు నాయుడు చాలా ప్రయత్నించాడని, కానీ ఎన్టీఆర్ మాత్రం అవేవి పట్టించుకోలేదని నటుడు, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి అన్నారు. ఎన్టీఆర్ 100వ జయంతి నేడు. ఈ సందర్భంగా విజవాడలో ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పోసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఆయన నెంబర్ వన్ హీరో అని తెలుసు.. కృష్ణుడు అని తెలుసు.. వెన్నుపోటు పొడిపించుకున్నవాడని తెలుసు. చంద్రబాబు చేతుల్లో చనిపోయాడని తెలుసు. నేను చెప్పాల్సింది ఏం లేదు. (చదవండి: వాళ్లే ఎన్టీఆర్కు నిజమైన వారసులు: లక్ష్మీపార్వతి ) ఎన్టీఆర్ జీవితంలో మీకు తెలియని కొన్ని నిజాలు చెబుతా. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతిని ఆయనే తీసుకొచ్చుకున్నాడు. ఆమెకు అప్పటికే చాలా ఆస్తులు ఉన్నాయి. ఆమె ఓ లెక్చరర్. సంస్కృతం బాగా వచ్చు. గొప్ప మేధావి. అలాంటి వ్యక్తి ఎన్టీఆర్ పక్కన ఉంటే తన ఆటలు సాగవని చంద్రబాబు భావించాడు. ఎలాగైనా ఆమెను బయటకు పంపించాలని కుట్ర పన్నాడు. లక్ష్మీ పార్వతి స్నేహితురాలి కొడుకుతో ఆమెకు అక్రమ సంబంధం ఉందని పుకార్లు పుట్టించాడు. ఇదే విషయం ఎన్టీఆర్ వరకు వెళ్లింది. ఓ రోజు ఎన్టీఆర్.. లక్ష్మీ పార్వతిని, ఆ అబ్బాయిని, చంద్రబాబుని ఇంట్లోకి పిలిపించుకున్నాడు. తిరుపతి లడ్డు ఆ అబ్బాయి చేతిలో పెట్టి.. ‘దీనిపై ప్రమాణం చేసి చెప్పు.. లక్ష్మీ పార్వతికి నీకు మధ్య ఉన్న సంబంధం ఏంటి?’ అని అన్నాడు. అప్పుడు ఆ అబ్బాయి గట్టిగా ఏడుస్తూ..‘లక్ష్మీ పార్వతి నాకు తల్లి లాంటిది సర్. నేను ఏ తప్పు చేయలేదు’ అని చెప్పాడు. అప్పుడు వెంటనే ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులందరిని పిలిచి.. ‘నా ఆరోగ్యం సహకరించడం లేదు. తోడు కోసం ఆ అమ్మాయి(లక్ష్మీ పార్వతి)ని పెళ్లి చేసుకుంటాను’ అని చెప్పాడు. అప్పుడు ఇంట్లో వాళ్లు ఎవరూ ఒప్పకోలేదు. కారణం ఎన్టీఆర్ ఎక్కడ తన ఆస్తులన్నీ ఆమెకు ఇస్తారోననే భయం. కానీ లక్ష్మీ పార్వతి ఎప్పుడూ ఆస్తుల గురించి ఎన్టీఆర్ దగ్గర ప్రస్తావించలేదు. ఓ గొప్ప వ్యక్తికి తోడుగా ఉంటున్నానని సంతోష పడింది. చంద్రబాబు చేసే పనుల వల్ల ఎన్టీఆర్కు మూడు సార్లు గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో చిన్న పిల్లాడిలా అతన్ని చూసుకుంది లక్ష్మీ పార్వతి గారే. ఎవరూ అతన్ని పట్టించుకోలేదు. ఆయన్ని బతికించుకోవడం కోసం ప్రతి సంవత్సరం అవార్డులు ఇస్తుంది లక్ష్మీ పార్వతి. ఎన్టీఆర్ ఆస్తులన్నీ చంద్రబాబు, అతని వారసులు తీసుకుంటే.. ఈమె మాత్రం ఇప్పటికి అతని పేరుని బతికించుకోవడం కోసం కష్టపడుతోంది. అవార్డులు, సేవా కార్యక్రమాలు చేసుకోవడం కోసం తన గాజులతో సహా అన్ని అమ్ముకుంది. కానీ వైఎస్ జగన్ చేతిలో ఘోరంగా ఓడిన తర్వాత.. ఇప్పుడు ఎన్టీఆర్ బొమ్మను చూసి ఓట్లు వేయండి అంటూ చంద్రబాబు కపట ప్రేమను చూపిస్తున్నాడు. రామరావు ఆత్మ శాంతించాలంటే మళ్లీ ఇదే ప్రభుత్వం అధికారంలోకి రావాలి. చంద్రబాబు లాంటి గుణంలేని నాయకుడికి తగిన బుద్ది చెప్పాలి’అని పోసాని అన్నారు. -
ఎన్టీఆర్ ను చంద్రబాబు ఎన్నోసార్లు అవమానించాడు
-
వాళ్లే ఎన్టీఆర్కు నిజమైన వారసులు: లక్ష్మీపార్వతి
సాక్షి, విజయవాడ: నగరంలోని ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు నందమూరి లక్ష్మీపార్వతి, డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ, కొడాలి నాని, పేర్నినాని హాజరయ్యారు. ఈ సందర్బంగా లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. విజయవాడ నడిబొడ్డున ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరగడం చాలా ఆనందంగా ఉంది. ఎన్టీఆర్కు జరిగిన అన్యాయంపై పోరాడి పోరాడి అలసిపోయాను. నా ఆవేదనను ఒక్కరు కూడా పట్టించుకోలేదు. ఎన్టీఆర్ వారసులమంటూ ఎవరెవరో డబ్బాలు కొట్టుకుంటున్నారు. కుడుపున పుడితే వారసులు కాదు. ఎన్టీఆర్కు చివరి వరకూ అండగా నిలబడిన వారే నిజమైన వారసులు. ఎన్టీఆర్కు చివరి క్షణాల్లో అండగా ఉంది దేవినేని నెహ్రూ మాత్రమే. దేవినేని నెహ్రూ మాత్రమే ఎన్టీఆర్కు అసలైన వారసుడు. మాట్లాడటం కూడా రాని లోకేష్ కూడా నేనే వారసుడినంటున్నాడు. ఎన్టీఆర్ను మోసం చేసిన ఈ దుర్మార్గులు ఎలా వారసులు అవుతారు. చంద్రబాబు అంత నీచుడు మరొకడు లేడు. చంద్రబాబు వెన్నుపోటుపై ఎన్టీఆర్ ఎంతో బాధపడ్డారు. ఎన్టీఆర్ను చంద్రబాబు ఎన్నోసార్లు అవమానించాడు. ఎన్టీఆర్ పేరు కానీ.. ఫొటో కానీ.. పెట్టుకునే అర్హత చంద్రబాబుకు లేదు. ఎన్టీఆర్ ఆశయాలను సమాధి చేసిన వ్యక్తి చంద్రబాబు. ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. నా వ్యక్తిత్వాన్ని నిలబెట్టిన సీఎం జగన్కు జీవితాంతం రుణపడి ఉంటాను. క్లిష్టసమయంలో డైరెక్టర్ రాం గోపాల్వర్మ నాకు ధైర్యానిచ్చారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో నా పాత్ర గురించి అందరికీ చెప్పారు. నా క్యారెక్టర్ను తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినపుడు నాకు పోసాని కృష్ణమురళీ ఓ సోదరుడిగా అండగా నిలిచారు అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: చంద్రబాబు లాంటి నీచుడు ఎక్కడా ఉండడు: లక్ష్మీపార్వతి -
చంద్రబాబు లాంటి నీచుడు ఎక్కడా ఉండడు: లక్ష్మీపార్వతి
సాక్షి, అమరావతి: ఎన్టీఆర్ను చంపిన దుర్మార్గుడు చంద్రబాబు అని నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు. చంద్రబాబు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు చేస్తే ఆయన ఆత్మ క్షోభిస్తోందని ఆమె తెలిపారు. ఎన్టీఆర్ పేరు ఎత్తడానికి కూడా చంద్రబాబుకు అర్హత లేదు.. చివరికి ఆయన కుటుంబాన్ని కూడా దూరం చేశాడని మండిపడ్డారు. చంద్రబాబు, రామోజీరావు కలిసి పార్టీని కూలదోశారు.. వైస్రాయ్ హోటల్ వద్ద చెప్పులు వేయించి ఎన్టీఆర్ను తీవ్రంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పేరును జిల్లాకు పెట్టిన మనసున్న వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. ఆస్తులు పంచుకున్న కొడుకులు, పార్టీని లాక్కున్న చంద్రబాబు.. ఎన్టీఆర్కు వారసులు కాదని.. ఎన్టీఆర్ పేరు ఎత్తడానికి వీళ్లకున్న అర్హత ఏంటని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పేరు వాడటానికి కొడుకులకు కూడా నైతిక హక్కు లేదని.. ఎన్నికలొచ్చే సరికి కొడుకులకు తండ్రి గుర్తుకువచ్చాడా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్కు భారతరత్న కావాలని చంద్రబాబు ఏరోజూ అడగలేదని నాటి ప్రధాని వాజ్పేయి తనతో స్వయంగా చెప్పారన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిజమైన వారసుడు సీఎం జగన్: దేవినేని అవినాష్ ఎన్టీఆర్ ఆశయాలకు నిజమైన వారసుడు సీఎం జగన్ అని దేవినేని అవినాష్ అన్నారు. కేవలం ఓట్ల కోసమే టీడీపీ ఎన్టీఆర్ పేరును వాడుకుంటోందని మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ గుర్తుకురారు.. ప్రతిపక్షంలో ఉంటే మాత్రం ఎన్టీఆర్ గుర్తొస్తారని ఎద్దేవా చేశారు. చదవండి: టీడీపీ మహానాడులో లోకేష్కు షాకిచ్చిన కార్యకర్త -
రజినీకాంత్ చంద్రబాబుతో కలిసి ఆయన కూడా వెన్నుపోటు దారుడుగా మారారు : లక్ష్మీపార్వతి
-
రజినీకాంత్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన లక్ష్మీపార్వతి
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుతో కలిసి రజినీకాంత్ కూడా వెన్నుపోటుదారుడిగా మారారని ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఆమె ‘సాక్షి’ మీడియాతో మాట్లాడుతూ, రజనీకి చిత్తశుద్ది ఉంటే ఎన్టీఆర్ చివరి రోజుల్లో మాట్లాడిన మాటలు తెలుసుకోవాలని హితపు పలికారు. అవేమీ లేకుండా పుస్తకాలు రిలీజ్ చేసినంత మాత్రాన జనం నమ్మరన్నారు. బాలకృష్ణ రెండు సినిమాలు తీస్తే ఏమైందో.. రజనీకాంత్ మాటలకు కూడా అలాంటి విశ్వసనీయతే ఉంటుందన్నారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు, రజనీకాంత్కు లేదని స్పష్టం చేశారు. ఇంకోసారి ఎన్టీఆర్ గురించి రజనీకాంత్ మాట్లాడితే సహించేది లేదన్నారు. చదవండి: ‘పవన్ను బ్లాక్మెయిల్ చేసేందుకు రజినీ రంగంలోకి!’ ‘వెన్నుపోటు సమయంలో చంద్రబాబుకు అండగా నిలిచిన వ్యక్తి రజనీకాంత్.. తర్వాత ఎన్టీఆర్ను కలిసి తాను తప్పు చేశానని క్షమించమని అడిగారు. వెన్నుపోటు ఎపిసోడ్లో రజనీకాంత్పై అనేక విమర్శలు వచ్చాయి. తమిళ పత్రికలు తీవ్రంగా విమర్శలు రాశాయి. ఆ తర్వాత చాలా కాలంగా ఏపీ రాజకీయాల వైపు రాలేదు. ఇన్నాళ్ళ తర్వాత మళ్లీ చంద్రబాబు తెలివిగా రజనీకాంత్ను వాడుకుంటున్నారు. రజనీకాంత్ ద్వారా బీజేపీకి దగ్గర అవ్వాలని చంద్రబాబు ప్లాన్. అనేక సర్వేల్లో జగన్ పాలనపై ప్రజలు మద్దతు తెలుపుతున్నట్లు వస్తుంది. దీంతో చంద్రబాబు తట్టుకోలేక మళ్లీ సినిమా వాళ్లతో డ్రామాలాడిస్తున్నారు.’ అని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. చదవండి: ఏపీవ్యాప్తంగా మార్గదర్శి బ్రాంచ్ల్లో సీఐడీ సోదాలు -
రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ధనవంతుడిగా చంద్రబాబు
-
రిచెస్ట్ పొలిటీషియన్ చంద్రబాబు
-
చంద్రబాబు 5 లక్షల కోట్లు అక్రమంగా సంపాదించాడు: లక్ష్మి పార్వతి
-
విదేశాల్లో చంద్రబాబు నల్లధనం రూ.5 లక్షల కోట్లు
తిరుపతి రూరల్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమార్జన చేసి దుబాయ్, స్విట్జర్లాండ్లో దాచిన రూ.5 లక్షల కోట్ల నల్లధనాన్ని స్వదేశానికి రప్పించాలని తెలుగు, సంస్కృత అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు. తిరుపతిలోని అకాడమీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. విదేశాల్లో లక్షల కోట్ల రూపాయలు దాచిన చంద్రబాబుపై ఈడీ, సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీనిపై స్పందించాలని కోరారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాయనున్నట్లు చెప్పారు. చంద్రబాబు అక్రమార్జనలపై పోరాటం చేస్తూనే ఉంటానన్నారు. విషయ పరిజ్ఞానం లేని దద్దమ్మ, ఒక్కచోట కూడా గెలవలేని లోకేశ్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించడం కామెడీగా ఉందన్నారు. ప్రజాపాలన సాగుతున్న రాష్ట్రంలో విమర్శించేందుకు ఎలాంటి అవకాశం లేకపోవడంతో ప్రతిపక్ష పార్టీ వారు ఫ్ర్రస్టేషన్లో బూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. టీడీపీ సోషల్ మీడియాలో పనికిమాలిన వెధవల్ని, పెంపుడు కుక్కల్ని పోషిస్తూ మహిళలను సైతం కించపరచడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇ చ్చిన హామీల్లో ఇప్పటికే 98 శాతం హామీలను అమలు చేసినందువల్లే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి ఆదరించాలని కోరుతున్నారని చెప్పారు. బాలకృష్ణ మాట్లాడితే ఆరు నెలలకు కూడా అర్థం కాదు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఏం మాట్లాడతారో, ఎందుకు మాట్లాడుతారో ఆరునెలలకు కూడా ఎవ్వరికీ అర్థం కాదని ఎద్దేవా చేశారు. పుస్తకాలు చదువుతున్న పవన్కళ్యాణ్కు ప్రజాసంక్షేమం ఎందుకు కనపించడంలేదని ప్రశ్నించారు. కనిపించే అభివృద్ధి, సంక్షేమాన్ని సైతం విమర్శిస్తూ ఉంటే రానున్న ఎన్నికల్లో సైతం ఆయన్ని రెండు కాదు.. మూడుచోట్ల పోటీచేసినా ప్రజలు ఓడిస్తారని హెచ్చరించారు. రాష్ట్రానికి పట్టిన సైకో చంద్రబాబు అని, ఎల్లో మీడియా అండతో కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టాలని ప్రయతి్నస్తూనే ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు పాపాలు పండిపోయాయని, ఆయనకు రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు. తెలుగు అకాడమీకి పూర్వవైభవం రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నిర్విర్యం చేసిన తెలుగు అకాడమీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్వవైభవం తీసుకొస్తున్నారని చెప్పారు. ఇప్పటికే ఇంటర్మిడియట్ పుస్తకాలను ముద్రిస్తున్నామని, త్వరలో డిగ్రీ పుస్తకాలను, పోటీ పరీక్షలకు అవసరమయ్యే 17 రకాల పుస్తకాలను ముద్రించనున్నట్లు తెలిపారు. అన్ని జిల్లాల మాండలిక పుస్తకాలు ముద్రిస్తామన్నారు. జాతీయ సంస్కృత యూనివర్సిటీతో కలిసి పనిచేస్తామని తెలిపారు. తెలుగు అకాడమీ పేరుతో నకిలీ వెబ్సైట్ తయారు చేసి, ఉద్యోగాలు ఇస్తామంటూ మోసాలు చేస్తుండటంపై విజయవాడలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ నుంచి రూ.90 కోట్లు రావాల్సి ఉందని, విలువైన ఆస్తులు కూడా అక్కడ ఉన్నాయని తెలిపారు. వాటికోసం ప్రయతి్నస్తుంటే తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని, దీనిపై హైకోర్టులో పోరాడుతున్నామని ఆమె చెప్పారు. -
తారకరత్న మృతిపై లక్ష్మీ పార్వతి సంచనల వ్యాఖ్యలు
-
తారకరత్న మృతి బాధాకరం.. చంద్రబాబుపై లక్ష్మీపార్వతి సంచలన కామెంట్స్
సాక్షి, తిరుపతి: టీడీపీ నేత, నటుడు నందమూరి తారకరత్న అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. కాగా, తారకరత్న మృతిపై తెలుగు అకాడమీ ఛైర్పర్సన్ లక్ష్మీపార్వతి సంచలన కామెంట్స్ చేశారు. ప్రాణాలు కోల్పోయిన తారకరత్నను తమ స్వార్ధ రాజకీయాల కోసం ఇన్నాళ్లు ఆసుపత్రిలో ఉంచారని తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా, లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడుతూ.. తారకరత్న అకాల మరణం చాలా బాధాకరమైన విషయం. చంద్రబాబు మా కుటుంబంపై నీచమైన రాజకీయ విధానం అవలంభించాడు. నారా లోకేష్ పాదయాత్రకు, లోకేష్కు చెడ్డ పేరు వస్తుందని తారకరత్న మరణవార్తను ఇన్నాళ్లు దాచిపెట్టిన వ్యక్తి చంద్రబాబు. ప్రాణాలు కోల్పోయిన తారకరత్నను తమ స్వార్ధ రాజకీయాల కోసం ఇన్నాళ్లు ఆసుపత్రిలో ఉంచారు. రెండు రోజులు పాదయాత్ర వాయిదా వేసినప్పడే మరణ వార్త ప్రకటించి ఉండాలి. ప్రజలు అపశకునంగా భావిస్తారని ఇన్నాళ్లు డ్రామా చేశారు. తండ్రీకొడుకులు రాష్ట్రానికే అపశకునం అని ప్రజలకు తెలుసు. తారకరత్న భార్యాబిడ్డలను, తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురిచేసిన వ్యక్తి చంద్రబాబు. నీచమైన రాజకీయాలు చేయడం మానేస్తేనే నందమూరి కుటుంబం బాగుపడుతుందని వ్యాఖ్యలు చేశారు. -
ఇరుకు సందుల్లో మీటింగ్లు పెట్టి ప్రాణాలు తీస్తే చూస్తూ ఊరుకోవాలా?
విశాఖపట్టణం: ఏపీ రాజకీయాల్లో ప్రతిపక్షాల తీరు హేయంగా ఉందని తెలుగు సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు నందమూరి లక్ష్మిపార్వతి విమర్శించారు. ప్రభుత్వం నిజం చెబితే తప్పుగా ఉందని, అదే టీడీపీ తప్పు చేసినా ఒప్పు అన్నట్లు ప్రతిపక్షాల తీరు ఉందన్నారు. ‘ప్రజల ప్రాణాలను కాపాడేందుకు జీవో నెం. 1 తీసుకువస్తే స్టేలతో అడ్డు పడుతున్నారు. ఎక్కడా వైఎస్సార్సీపీ కోర్టులను విమర్శించదు. కానీ కోర్టులను తప్పు దారి పట్టించడంలో టీడీపీ దిట్ట. ఇరుకు సందుల్లో మీటింగ్లు పెట్టీ ప్రాణాలు తీస్తే చూస్తూ ఊరుకోవాలా?, హంతకులు ఇద్దరు సాక్ష్యం చెప్పుకున్నట్లు బాలకృష్ణ, చంద్రబాబు మాటలు ఉన్నాయి. వ్యవస్థను అడ్డం పెట్టుకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. మూడు రాజధానుల విషయంలో రాజకీయం చేస్తూ కుట్రలు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలకు ఆత్మ గౌరవం ఉండదా?, ఎన్టీఆర్ డబ్బు తీసుకుని ఆయనను దూషించిన వ్యక్తులే ఇప్పుడు ఫోటోలు వాడుతున్నారు’ అని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. -
లక్ష్మీపార్వతికి మాతృ వియోగం
సాక్షి, అమరావతి: ఏపీ తెలుగు, సంస్కృతి అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతికి మాతృ వియోగం కలిగింది. ఆమె తల్లి దాసరి సామ్రాజ్యం అనారోగ్యంతో ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. -
జగన్ పరిపాలనే ఆయన్ని మళ్లీ గెలిపిస్తుంది
గుంటూరు ఎడ్యుకేషన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందిస్తున్న ప్రజాసంక్షేమ పరిపాలనే ఆయన్ని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తుందని రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రజలు మరోసారి ఓటువేసి తప్పు చేయరని, 2024లో జరిగేవి ఆయనకు చివరి ఎన్నికలని పేర్కొన్నారు. గుంటూరు బ్రాడీపేటలో ఉన్నవ లక్ష్మీనారాయణ, లక్ష్మీబాయి దంపతులు నెలకొల్పిన శారదానికేతన్ మహిళా విద్యాసంస్థల శతాబ్ది మహోత్సవాల్లో మంగళవారం ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల తరువాత బాబుతో పాటు టీడీపీ భూస్థాపితం కానుందని చెప్పారు. తన పాలనలో మేలు జరిగితే తిరిగి వైఎస్సార్సీపీకి ఓటెయ్యాలని సీఎం వైఎస్ జగన్ నిర్మొహమాటంగా ప్రజలకు చెబుతున్నారన్నారు. ఇటువంటి మాట చెప్పే దమ్మూ, ధైర్యం ప్రజానాయకుడైన జగన్కు మాత్రమే ఉన్నాయని చెప్పారు. అధికారం దక్కలేదనే అక్కసుతో బాబు ప్రజలను బూతులు తిడుతున్నారని అన్నారు. గతంలో చాన్స్ ఇచ్చిన ప్రజలే తిరిగి ఆయన్ని 23 సీట్లకు పరిమితం చేశారని గుర్తుచేశారు. -
మహేశ్ బాబు ఒంటరివాడైపోయాడు.. ఆ కుటుంబానికి నా ప్రగాడ సానుభుతి: లక్ష్మీ పార్వతి
-
ఎన్టీఆర్ హంతకులకు ఆయనపై ప్రేమ ఉందా!
సాక్షి, అమరావతి: ఎన్టీఆర్ హంతకులకు ఆయనపై ప్రేమ ఉందా అని ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. ఎన్టీఆర్ హంతకులే హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు ఉంచాలంటూ కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎన్టీఆర్పై చంద్రబాబులా ద్వేషం గానీ, శత్రుత్వం గానీ లేవని, పైగా గౌరవం, అభిమానం ఉన్నాయని తెలిపారు. అందువల్లే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారని తెలిపారు. ఎన్టీఆర్ పేరు జిల్లాకు ఉండాలా.. యూనివర్సిటీకి ఉండాలా అంటే.. జిల్లాకే తన ఓటు అని స్పష్టంచేశారు. జిల్లా అనేది పెద్దదని, యూనివర్సిటీ అన్నది చిన్నది అని విమర్శించే వారు తెలుసుకోవాలన్నారు. హెల్త్ యూనివర్సిటీకి ఆరోగ్యశ్రీ సృష్టికర్త, రూపాయి వైద్యుడిగా పేరు గడించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు పెట్టడమే సముచితమని అన్నారు. ఆమె సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆనాడు ఎల్లో మీడియాలో ఎన్టీఆర్కు వ్యతిరేకంగా వచ్చిన వార్తలను ప్రదర్శించారు. ఎన్టీఆర్కు భారతరత్న రాకుండా అడ్డుపడ్డవారు ఆయన్ను గౌరవిస్తారంటే ప్రజలు నమ్ముతారా అని లక్ష్మీపార్వతి అన్నారు. ప్రతి మహానాడులో ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేయడం, చెత్తబుట్టలో వేయడం పరిపాటని తెలిపారు. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు.. ఎన్టీఆర్ గౌరవార్థం ఏం చేశారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చంద్రబాబుకు వంతపాడి కన్న తండ్రినే చంపుకున్నారని చెప్పారు. ఆయన గౌరవాన్ని కాపాడలేని వారు బిడ్డలు ఎలా అవుతారని ప్రశ్నించారు. ఇప్పటికీ పశ్చాత్తాపం కలగదా అని అన్నారు. ఎన్టీఆర్ జీవితంలోకి తాను వచ్చాకే వసంతం వచ్చిందని లక్ష్మీపార్వతి చెప్పారు. ఆయన బతికి ఉన్నప్పుడు తన కాళ్ళు మొక్కినవారే, ఇప్పుడు తిడుతున్నారన్నారు. బాబుతో కుమ్మక్కై రామోజీ ఆనాడు ఎన్టీఆర్పై తప్పుడు రాతలు రాశారని, ఇప్పుడూ సీఎం జగన్పై దు్రష్పచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్టీఆర్ను బాబు అండ్ కో హత్య చేశారా లేదా అని రామోజీ, రాధాకృష్ణలను నిలదీశారు. రాజకీయానికే కాదు కులానికి కూడా గౌరవం తెచ్చిన ఒక పెద్దను సజీవ దహనం చేసింది వీరే కదా అని అన్నారు. స్పీకర్ పదానికి అగౌరవం తెచ్చిన వ్యక్తి యనమల రామకృష్ణుడు అని మండిపడ్డారు. రాధాకృష్ణ చెత్త పలుకులకు తాను భయపడనని చెప్పారు. ఎన్టీఆర్పై నాకున్న అభిమానం అందరికీ తెలుసు ఎన్టీఆర్పై తనకున్న అభిమానం అందరికీ తెలుసునన్నారు. పిచ్చి పిచ్చి కార్టూన్లతో ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని కించపరిచింది పచ్చమీడియానే అని చెప్పారు. తాను ఏనాడూ పదవుల కోసం తాను ఆశపడలేదన్నారు. ఇందుకు ఆయన ఇంటర్వ్యూలలో చెప్పిన మాటలే సాక్ష్యమన్నారు. టెక్కలి, గోరంట్ల నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఎన్టీఆర్, ఆయన అభిమానులు కోరినా వద్దని చెప్పానని అన్నారు. ఎన్టీఆర్ భార్య పదవికి మించింది తనకు ఏదీ లేదని చెప్పానన్నారు. లక్ష్మీపార్వతి భార్య మాత్రమే కాదని, తల్లిలాంటిదని ఆనాడు ఎన్టీఆర్ చెప్పారని గుర్తు చేశారు. పత్రికల్లో వచ్చినవి రామోజీ, రాధాకృష్ణ, చంద్రబాబు చదవలేదా అని ప్రశ్నించారు. ఈనాడు అబద్ధపు రాతలను ఎన్టీఆర్ ఆనాడే తప్పుబట్టారని చెప్పారు. ఎన్టీఆర్కు అన్యాయం చేయనని చంద్రబాబు ఆనాడు లోకేశ్ మీద ప్రమాణం చేసి మాట తప్పలేదా అని నిలదీశారు. తాను అడ్డుపడి ఉంటే ఎన్టీఆర్ కేబినెట్లో చంద్రబాబుకు ఫైనాన్స్, రెవెన్యూ వంటి కీలక శాఖలు దక్కేవి కాదని చెప్పారు. ఎన్టీఆర్ అసలు తనను పెళ్లి చేసుకోలేదని, ఆ ఇంటి పేరు వాడుకునే హక్కు తనకు లేదంటూ అతి దారుణంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు అధికార వ్యామోహాన్ని ఎదిరించినందుకే మహిళనైన తనపై విషప్రచారం చేస్తున్నారని అన్నారు. వారి ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు కదా? ఇది సమంజసమా అని ప్రశ్నించారు. తమ పెళ్లి గురించి తప్పుగా మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. రామోజీ, రాధాకృష్ణలకు బుద్ధీ, జ్ఞానం ఉందా? ఎన్టీఆర్కు చేసిన ద్రోహాన్ని, అధికార దాహాన్ని కప్పిపుచ్చుకోవడానికి పచ్చ మీడియా, టీడీపీ సోషల్ మీడియా తనపై విష ప్రచారం చేస్తోందని చెప్పారు. అసలు రామోజీ, రాధాకృష్ణలకు బుద్ధీ, జ్ఞానం ఉందా.. వెన్నుపోటును అధికార మార్పు అంటారా అని ప్రశ్నించారు. పత్రికాధిపతులని చెప్పుకోవటానికి వారు అనర్హులని చెప్పారు. అధికార దాహంతో చంద్రబాబు, లోకేశ్లు ఎల్లో మీడియాతో కలిసి చేసే దు్రష్పచారాలను, వెన్నుపోటుదారుల మాటలను నమ్మొద్దని ప్రజలను కోరారు. -
అధికారంలో ఉన్న ఏరోజైనా ఎన్టీఆర్ పేరు పెట్టావా చంద్రబాబూ ?
-
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: ఎన్టీఆర్ను చంపిన దుర్మార్గులకు ఆయన గురించి మాట్లాడే అర్హత లేదని ఏపీ తెలుగు, సంస్కృతి అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతి మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో పేరు మార్పుపై ఎప్పుడూ కూడా ఆలోచించని వారు ఇప్పుడు రాద్దాంతం చేస్తుంటే ప్రజలు అసహ్యించుకుంటున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు, రాధాకృష్ణ ఓ వీడియోలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు తీసేయాలని మాట్లాడుకోలేదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు మారిస్తే మాత్రం వీళ్లు మరోలా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ‘ఎన్టీఆర్ పేరు.. హెల్త్ యూనివర్సిటీకి కావాలా? జిల్లాకి కావాలా? అంటే నేను జిల్లాకే పేరు ఉండాలని అంటాను. వర్శిటీ కంటే జిల్లా చాలా పెద్దది. జిల్లాకు పేరు పెట్టడంలోనే వైఎస్ జగన్కు ఎన్టీఆర్పై ఉన్న ప్రేమ ఏంటో తెలుస్తోంది. ద్వేషంతోనో, పగతోనో వర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చలేదు. రూపాయి వైద్యుడిగా వైఎస్సార్ పేరు పెట్టే విషయంలో సీఎం జగన్ చెప్పిన విషయం సబబుగా ఉంది. మరో గొప్ప ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టేలా నేను సీఎం వద్దకు వెళ్తాను. ఇక్కడ ఎన్టీఆర్ను అగౌరవపరిచింది ఏముంది? యూనివర్సిటీ ఉన్న జిల్లా పేరే ఎన్టీఆర్ ఉంది. సీఎం జగన్ ఎన్టీఆర్పై గౌరవం ఉందని అసెంబ్లీ వేదికగా స్పష్టంగా చెప్పారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వొద్దని వాజ్పేయికి చంద్రబాబే స్వయంగా చెప్పారు. ఎన్టీఆర్కు భారతరత్న రాకుండా అడ్డుకున్న దుర్మార్గుడు చంద్రబాబు’అని లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: (ఆ మర్డర్ వెనుక నువ్వు, రామోజీ లేరా?: లక్ష్మీపార్వతి) -
ఆ మర్డర్ వెనుక నువ్వు, రామోజీ లేరా?: లక్ష్మీపార్వతి
సాక్షి, తాడేపల్లి: అధికార దాహంతో చంద్రబాబునాయుడు ఎల్లోమీడియాలో తనపై పిచ్చి కూతలు రాయిస్తున్నారంటూ తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎలాంటి స్వార్థం కోసం ఎన్టీఆర్ జీవితంలోకి రాలేదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్పై తనకున్న అభిమానం గురించి అందరికీ తెలుసన్నారు. ఏరోజూ పార్టీ విషయాల్లో జోక్యం చేసుకోలేదని తెలిపారు. అల్లుళ్ల కొట్లాట వల్లే 1989లో ఓడిపోయామని ఎన్టీఆర్ ఆనాడు చెప్పారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ జీవితంలోకి ఆమె ప్రవేశించాక టీడీపీ ఘనవిజయం సాధించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గతంలో ఎన్టీఆర్ మాట్లాడిన వీడియోని లక్ష్మీ పార్వతి ప్రదర్శించారు. 'చంద్రబాబు అధికార వ్యామోహాన్ని పక్కదారి పట్టించేందుకు ఇప్పుడు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. నాకు అధికార దాహం ఉంటే ఆనాడు చంద్రబాబుకు రెండు పదవులు వచ్చేవా?. చంద్రబాబు నమ్మించి గొంతుకోస్తాడని ఎన్టీఆర్ నాతో చాలాసార్లు చెప్పారు. అయితే ఎన్టీఆర్కు ద్రోహం చేయబోనని చంద్రబాబు నాకు ప్రమాణం చేశారు. పాముకు పాలుపోస్తున్నావని చంద్రబాబు గురించి ఎన్టీఆర్ ఆనాడే అన్నారు. చంద్రబాబు రోజుకో అబద్ధం మాట్లాడతాడు. ఈ రోజు తండ్రి గురించి మాట్లాడుతున్న కుటుంబ సభ్యులు సిగ్గుపడాలి. ఇప్పటికైనా పశ్చాత్తాప పడరా?. చంద్రబాబు కుట్రలో భాగంగానే ఈటీవీని లాంచ్ చేశారు. రామోజీ పిచ్చి రాతలపై అప్పట్లోనే ఎన్టీఆర్ స్పందించారు. ఎన్టీఆర్పై ఈనాడులో పిచ్చిపిచ్చి కార్టూన్లు వేశారు. ఎల్లోమీడియా ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని కించపరిచింది. తప్పుడు ప్రచారంతో ఎమ్మెల్యేల్లో భయాందోళన సృష్టించారు. అప్పటి స్పీకర్ యనమల వెన్నుపోటులో భాగమయ్యాడు. వైశ్రాయ్ హోటల్ దగ్గర చెప్పులు వేయించిన సంగతి గుర్తులేదా?. రామోజీరావు, చంద్రబాబు, రాధాకృష్ణ కలిసే కుట్ర చేశారు. ఎన్టీఆర్ ప్రధాని అవుతారన్న భయంతోనే కుట్ర చేశారు. ఎన్టీఆర్ను చంపిన హంతకులు గురించి అందరికీ తెలియాలి. అధికారంలో ఉన్న ఏరోజైనా ఎన్టీఆర్ పేరు పెట్టావా చంద్రబాబూ?. ఎన్టీఆర్ పేరు తీసేయాలని రాధాకృష్ణ, నువ్వు మాట్లాడుకోలేదా?. ఎన్టీఆర్ది హత్యా? కాదా?. ఆ హత్య వెనుక నువ్వు, రామోజీ లేరా? అని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. -
డాక్టర్ సమ్మెట నాగమల్లేశ్వరరావుకు తెలుగు అకాడమీ పురస్కారం
తెలుగు, సంస్కృత అకాడమీ ఆధ్వర్యంలో గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన పలువురు ప్రముఖులకు తెలుగు, సంస్కృత అకాడమీ పురస్కారాలు ప్రదానం చేసింది. ఈ కార్యక్రమంలో కవిత్వం-విమర్శ కేటగిరి కింద ఆల్ ఇండియా రేడియో న్యూస్ రీడర్ డాక్టర్ సమ్మెట నాగమల్లేశ్వరరావుకు తెలుగు అకాడమీ అధ్యక్షులు డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి పురస్కారం అందించారు. డాక్టర్ సమ్మెట నాగమల్లేశ్వరరావు కవిగా, రచయితగా, సాహిత్య విమర్శకునిగా, అనువాదకుడిగా, అధ్యాపకుడిగా, మీడియా గురుగా సుప్రసిద్ధులు. వివిధ కళాశాలల్లో తెలుగు అధ్యాపకుడిగా పని చేసిన ఆయన వాడుక భాష, తెలుగు వ్యాక్యం ప్రధాన అంశాలుగా పలు విశ్వవిద్యాలయాల్లో వందల మంది జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చారు. ఉస్మానియా నుంచి ఎం.ఏ., హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఫిల్., తెలుగు విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్.డీ చేశారు. తెలంగాణ పోరాట కథలపై ఎం.ఫిల్లో పరిశోధన గ్రంథాన్ని సమర్పించారు. తెలుగు కవిత్వంలో ఆధునికత, ఆవిర్భావ వికాసాలపైన చేసిన మౌలిక సాధికార పరిశోధన సాహితీ విద్యార్థులకు మార్గదర్శకంగా నిలిచింది. నిరంతర భాషా అధ్యయనం కారణంగా శాసన భాష నుంచి వర్తమాన సాహిత్యం వరకు అనేక అంశాలపై పలువేదికల నుంచి సమ్మెట ప్రసంగించారు. హైదరాబాద్లో తెలుగు సాహితీ సమితిని స్థాపించి నెల నెలా సాహిత్య సమావేశాలు నిర్వహిస్తూ పుస్తక పఠనాన్ని ప్రోత్సహిస్తున్నారు. రావిశాస్త్రి, డాక్టర్ కేశవరెడ్డి రచనలపై కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సదస్సులు నిర్వహించారు. విజయవాడ, విశాఖ, రాజమండ్రి, హైదరాబాద్లతో పాటు న్యూఢిల్లీ, పోర్ట్ బ్లెయిర్, తిరువనంతపురం, సిమ్లాలలో తెలుగు సాహిత్యంపై ప్రసంగించారు. కేంద్ర సాహిత్య అకాడమీకి చెందిన గిరిజన, మౌఖిక సాహిత్య కేంద్రంలో క్రియాశీల సభ్యుడిగా తెలుగు ప్రాంతాల గిరిజన సాహిత్యంపై విజయవాడలో రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించారు. భారత స్వాతంత్య్ర అమృత మహోత్సవాలలో భాగంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ సిమ్లాలో నిర్వహించిన అంతర్జాతీయ సాహిత్య ఉత్సవంలో గోండుల కథలపై ప్రసంగించారు. కృష్ణా జిల్లా నెమ్మలూరుకు చెందిన డాక్టర్ సమ్మెట, నిడుమోలు, మచిలీపట్నం, హైదరాబాద్, రాజమండ్రిల్లో విద్యాభ్యాసం చేశారు. న్యూఢిల్లీలో ఆకాశవాణిలో తెలుగు న్యూస్ రీడర్గా పని చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో పని చేస్తున్నారు. పాతికేళ్ల పాటు కొన్ని వేల సార్లు ఆకాశవాణిలో ఉచ్చారణ దోషం లేకుండా వార్తలు చదవడం తన భాషా సేవలో భాగమని తెలిపారు. తెలుగు, సంస్కృత అకాడమీ అవార్డు తన బాధ్యత మరింత పెంచిందని డాక్టర్ సమ్మెట నాగమల్లేశ్వరరావు అన్నారు. -
మరి చంద్రబాబు మంత్రి పదవి ఎందుకు ఇవ్వనట్టు?
సాక్షి, అమరావతి: అప్పట్లో నాకు వడ్డాణం ఇవ్వనందుకే తనకు మంత్రి పదవి రాలేదని 27 ఏళ్ల తర్వాత ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించడం విడ్డూరంగా ఉందని తెలుగు–సంస్కృత అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. ‘వైశ్రాయ్ సంఘటనలో ప్రధాన పాత్ర పోషించిన నీకు చంద్రబాబు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు’ అని ఎర్రబెల్లిని ఆమె నిలదీశారు. ‘చంద్రబాబు భార్య కూడా వజ్రాలు, వైఢూర్యాలు, వడ్డాణాలు అడిగారా? అందుకనే మంత్రి పదవి రాలేదా? అబద్ధాలు చెప్పడానికి సిగ్గుగా లేదా’ అని ఎర్రబెల్లిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వాసఘాతకులు, ఎన్టీఆర్ హంతకులంతా మళ్లీ కలుస్తున్నారని.. తెలంగాణ సీఎం కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ సోమవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్టీఆర్ అధికారంలోకొచ్చిన 8 నెలల్లోనే.. తనను బూచిగా చూపి.. చంద్రబాబును సీఎంను చేసేందుకు రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ నిర్వహించిన పాత్రను ఆడియోలు, వీడియోలు ద్వారా ఎన్టీఆర్ అప్పట్లోనే లోకానికి తెలియజేశారని గుర్తుచేశారు. అప్పట్లో ఓ హోటల్లో జర్నలిస్టులకు డబ్బులు పంపిణీ చేసి.. ఎన్టీఆర్కు, నాకు వ్యతిరేకంగా, చంద్రబాబుకు అనుకూలంగా వార్తలు రాయించిన బ్రోకర్ రాధాకృష్ణ అని ధ్వజమెత్తారు. ‘ఆదివారం ఏబీఎన్లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో తెలంగాణ మంత్రి, ఇప్పటికీ టీడీపీ పురిటి కంపును వదల్చుకోని ఎర్రబెల్లి దయాకర్రావు నాపై చేసిన వ్యాఖ్యలు చూశాక ఈ ప్రకటన చేస్తున్నా.. ఎర్రబెల్లి దయాకర్రావు మనిషైతే గుడిలో దేవుడి ముందు తన బిడ్డలు, మనవలపై ప్రమాణం చేసి.. నేను అతడిని వడ్డాణం అడిగానని చెప్పగలరా’ అని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. ఎన్టీఆర్ ఏ నమ్మకంతో తనను వివాహం చేసుకున్నారో.. చివరి వరకూ ఆ నమ్మకాన్ని కాపాడుకుంటూ వచ్చానని తెలిపారు. ఎన్టీఆర్ ఇచ్చిన ఆస్తిని కూడా నిలబెట్టుకోలేక.. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న తనను సీఎం వైఎస్ జగన్ ఓ బిడ్డలా ఆదుకుని నిలబెట్టారని తెలిపారు. -
ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చంద్రబాబు ఉచ్చులో చిక్కుకున్నారు
-
ఉమామహేశ్వరి ఆత్మహత్యపై సీబీఐ దర్యాప్తు చేయాలి
సాక్షి, అమరావతి: ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి కోరారు. సీబీఐ విచారణ కోరుతూ చంద్రబాబు లేఖ రాయాలని.. ఆయన రాయకపోతే తానే లేఖ రాస్తానన్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నందమూరి లక్ష్మీపార్వతి బుధవారం మీడియాతో మాట్లాడారు. తండ్రి ఎన్టీఆర్ చావుకు కారణమైన చంద్రబాబును నమ్మి మోసపోతున్న నందమూరి కుటుంబాన్ని చూస్తే జాలేస్తుందని చెప్పారు. హరికృష్ణ మరణానికి కూడా బాబే కారణమని ధ్వజమెత్తారు. చంద్రబాబు కారణంగా హరికృష్ణ మానసిక క్షోభ అనుభవించాడని గుర్తు చేశారు. ఆత్మహత్య చేసుకునే పిరికితనం ఎన్టీఆర్ కుటుంబంలో లేదు.. ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి మరణం తనను కలచివేసిందని లక్ష్మీపార్వతి చెప్పారు. ఆమె బలవన్మరణానికి చంద్రబాబే కారణమనే అనుమానం కలుగుతోందన్నారు. ఆత్మహత్యకు ముందు ఉమామహేశ్వరి రాసిన సూసైడ్ నోట్ చంద్రబాబు అక్కడకు చేరాకే మాయమైందన్నారు. ఉమామహేశ్వరి ఎంతో ధైర్యవంతురాలు, విద్యావంతురాలని చెప్పారు. ఆత్మహత్య చేసుకునే పిరికితనం ఎన్టీఆర్ కుటుంబంలోనే లేదన్నారు. ఆస్తి కోసం, చంద్రబాబు, లోకేష్ ఆమెతో గొడవ పడుతున్నారని.. ఆ ఒత్తిడి భరించలేకే ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారని ప్రచారం జరుగుతోందని చెప్పారు. ఆమె సూసైడ్ నోట్ మాయం కావడంతో మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయన్నారు. కోడెల మృతికీ బాబే కారణం.. గతంలో కోడెల శివప్రసాదరావు మరణానికి కూడా చంద్రబాబే కారణమని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఆయనను బాబు చాలా దారుణంగా మోసం చేశాడన్నారు. అదే వి«షయాన్ని కోడెల స్వయంగా తన ఫోన్లో రికార్డు చేసుకున్నారని చెప్పారు. దాంతో ఆ ఫోన్నే మాయం చేశారన్నారు. కోడెలను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి కాకుండా దూరంగా ఉన్న బసవతారకం ఆస్పత్రికి తీసుకుపోయారని గుర్తు చేశారు. దీంతో ఆయన మరణించారన్నారు. ఆ తర్వాత కోడెల భౌతికకాయాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు ఏ స్థాయిలో రాజకీయాలు చేశాడో అందరికీ తెలిసిన విషయమేనని చెప్పారు. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ను కూడా తన స్వార్థ రాజకీయాల కోసం వినియోగించుకున్నాడని మండిపడ్డారు. ఆ తర్వాత తన కొడుకు కోసం అదే జూనియర్ ఎన్టీఆర్ను దూరం చేశాడన్నారు. చివరకు ఆయన సినిమాలకు కూడా అడ్డుపడ్డాడని గుర్తు చేశారు. ఎన్టీఆర్ కుటుంబంలో శని.. చంద్రబాబు ఎన్టీఆర్ కుటుంబంలోకి శనిలా చంద్రబాబు ప్రవేశించారని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. బాబు ఒక్కొక్కరిని బలి తీసుకుంటున్నారన్నారు. ఎన్టీఆర్ మరణానికి కారణమై ఆ పేరును వాడుకుం టున్న దుర్మార్గుడు బాబని ధ్వజమె త్తారు. పార్టీ పేరుతో రూ.లక్షల కోట్లు సంపాదించారని విమర్శించారు. చంద్ర బాబు వెంటనే ఎన్టీఆర్ కుటుంబాన్ని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. బాల కృష్ణకు బాధ్యతలు అప్పగించాలన్నారు. ఎన్టీఆర్ చిన్న కూతురు ఆత్మహత్య అంతా ఓ మిస్టరీలా ఉన్నా.. సోషల్ మీడియాలో చాలా వస్తున్నాయన్నారు. బాబు మనస్తత్వం, అతడి నీచ, హత్యా రాజకీయాలు తెలిసిన ఎవరైనా కొన్నిం టిని అనుమానించక తప్పదని చెప్పారు. శవ రాజకీయాలు చంద్రబాబుకు వెన్న తో పెట్టిన విద్య అన్నారు. హరికృష్ణ మరణానికీ పరోక్షంగా బాబే కారణమని జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్ ఇప్ప టికీ ఆయనతో మాట్లాడరని తెలిపారు. -
టీడీపీలో మహిళలకు సరైన గౌరవం లేదు
-
తెలుగువారి ఆత్మ గౌరవం ఎన్టీఆర్
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): తెలుగువారి ఆత్మగౌరవం నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)అని ఆంధ్రప్రదేశ్ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని హోటల్ ఐలాపురంలో ఫిలాంత్రోఫిక్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శతజయంత్యుత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరచిన వారికి ఎన్టీఆర్ కీర్తి పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. లక్ష్మీపార్వతి మాట్లాడుతూ జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఒక జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేసి చరిత్ర సృష్టించిన సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎన్టీఆర్ శతజయంతి ప్రత్యేక సంచికను లక్ష్మీపార్వతి ఆవిష్కరించారు. ముగ్గురికి జీవిత సాఫల్య పురస్కారాలు, 30 మందికి కీర్తి పురస్కారాలు అందజేశారు. ఫిలంత్రోఫిక్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ అద్దంకి రాజా యోనా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ కళా వేదిక చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్, డ్రీం ఆర్గనైజేషన్ అధ్యక్షుడు మేదర సురేష్, రంగస్థల నటుడు గుంటి పిచ్చయ్య, జాతీయ ఉపాధ్యాయ అవార్డ్ గ్రహీత పారుపల్లి సురేష్, పర్యావరణ వేత్త చిలుకూరి శ్రీనివాస్రావు, పుడమి సాహితీ వేదిక అధ్యక్షుడు చిలుముల బాల్రెడ్డి, సాహితీవేత్తలు గూటం స్వామి, కొల్లి రమావతి పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ఏర్పాటై నేటికి మూడేళ్లు
-
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన లక్ష్మీ పార్వతి
-
NTR Satha Jayanthi: నివాళులు అర్పించిన లక్ష్మీపార్వతి, జూ.ఎన్టీఆర్
ఎన్టీఆర్ శత జయంతి: నేడు దివంగత మాజీ ముఖ్యమంత్రి, నటుడు నందమూరి తారక రామారావు శత జయంతి. ఆయన జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్లో లక్ష్మీపార్వతి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి మాట్లాడుతూ..‘‘స్వచ్ఛమైన రాజకీయాలు నడిపిన వ్యక్తి ఎన్టీఆర్. వెన్నుపోట్ల ద్వారా రాజ్యాన్ని తీసుకురావాలని ఎన్టీఆర్ ఎప్పుడూ అనుకోలేదు. రాబోయే తరాలకు ఎన్టీఆర్ ఆదర్శం’’ అంటూ వ్యాఖ్యానించారు. అంతకుముందు నటులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్రామ్లు కూడా ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అభిమానులు జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ శతజయంతి: పదే పదే తలచు తెలుగుజాతి -
ఆత్మవిశ్వాసానికి నిండైన రూపం!
తెలుగు సినీ వినీలాకాశంలో రారాజుగా వెలుగొందుతున్న సమయంలో ‘ఢిల్లీ’ కాళ్లకింద తెలుగువాడి ఆత్మగౌరవం నలిగిపోతుంటే చూసి రగిలిపోయారు ఎన్టీఆర్. అందుకే రాజకీయ రంగప్రవేశం చేశారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి ‘తెలుగువారి ఆత్మ గౌరవ’ నినాదంతో కేవలం 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో అధికార పీఠాన్ని అధిరోహించారు. ‘రెండు రూపాయలకు కిలో బియ్యం’ ‘పేదలకు పక్కా ఇళ్ళు’ వంటి పథకాలు, బీసీలకు 29 శాతం అవకాశాలు కల్పించడం ద్వారా ప్రజల మనస్సుల్లో సుస్థిర స్థానం సంపాదించారు. ఇప్పుడు జగన్మోహన్రెడ్డి ఇంకో అడుగు ముందుకేసి బీసీలకు 50 శాతం అవకాశాలు కల్పిస్తున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే – ఈ ఇద్దరు వ్యక్తులకూ శత్రువు ఒకరే కావడం! ‘‘నేను అవమానాల పాలైనప్పుడల్లా మీరు గౌరవంతో కిరీటం పెట్టారు నన్ను దుమ్మెత్తి పోస్తున్నప్పుడు నా నిజాయితీ ఆదర్శంపట్ల విశ్వాసం ప్రకటించారు నన్ను నియంతృత్వపు ఉక్కుపాదాల క్రింద నలుపుతున్నప్పుడు మీ నాయకుడిగా గుర్తించారు నన్ను నేను సమర్థించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మీరు నన్ను సమర్థించారు ప్రతి సామాన్యమైన రీతిలో అత్యల్ప మానవునిగా సేవ చేయుటయే గర్వంగా భావిస్తుంటే మీరు నన్ను పైకెత్తి ప్రపంచం ముందు మీ ప్రతినిధిగా నిలబెట్టారు’’ అనీబిసెంట్ ఇంగ్లిష్లో రాసిన కవిత అంటూ 1989లో తెలుగు దేశం పార్టీ ఓడిపోయాక గండిపేట ‘తెలుగు విజయం’ ఆఫీసులో జరిగిన పార్టీ మీటింగులో ఎన్టీఆర్ గారు ఈ కవితను వినిపించారు.పార్టీ పట్ల, సభ్యుల పట్ల, ప్రజల పట్ల ఆయనకున్న అపారమైన విశ్వాసాన్ని తనవారే భగ్నం చెయ్యటం ఆయన ఊహించని విషయం. చివరకు తనవారి చేతిలో ఘాతుకానికి బలైపోవటానికి కారణాలు ఆయన మంచితనం, నిష్కాపట్యమే తప్ప మరొకటి కాదు. అటు వంటి నాయకుడిని పొట్టన పెట్టుకున్న చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ వెన్నుపోటుదార్లుగా చరిత్ర ఉన్నంతవరకూ ఉంటారు. ఆయన వ్యక్తిగత జీవితం, సినిమా, రాజకీయ జీవితాలు పరిశీలిస్తే మాట తప్పని మనిషిగా, పేదవర్గాల పట్ల సానుభూతి ఉన్న నాయకుడిగా నమ్మి వచ్చిన స్త్రీకి తాళికట్టి గౌరవాన్ని కాపాడిన మేరు నగ ధీరుడిగా కన్పిస్తారు. ఎన్టీఆర్ నిజంగా చారిత్రక పురుషుడే. ఒక మనిషి జీవితంలో ఎన్ని ఆరోహణా సోపానా లుంటాయో అవన్నీ అధివసించిన వ్యక్తి. 1923 మే 28న కృష్ణా జిల్లా, నిమ్మకూరు గ్రామంలో రైతుబిడ్డగా జన్మించి, ఉన్న ఆస్తులు పోగొట్టుకుని, కన్న ఊరుని విడిచి విజయవాడకు చేరింది ఆయన బాల్యం. తండ్రి చేసిన పాల వ్యాపారంలో తోడుగా నిలిచిన ఉత్తమ పుత్రుడు. నివసిస్తున్న పూరి పాకలో వర్షం వస్తే అది పడిపోకుండా తెల్లవార్లూ తండ్రితోపాటు నిట్టాడి కొయ్యను పట్టుకొని, కుటుంబాన్ని రక్షించుకొన్న కష్టజీవి. బ్రేకుల్లేని పాత హెర్క్యులస్ సైకిల్ మీద 60 కిలోల బరువును పెట్టుకొని పంక్చర్ అయిన సైకిల్ను నడిపించుకుంటూ 60 మైళ్ళు అర్ధరాత్రి విజయవాడ దాకా ప్రయాణం చేసిన సాహసి. స్నేహితుని వివాహానికి వెళ్లాల్సిన రైలు తప్పిపోతే ఆ పట్టాల వెంబడే 30 మైళ్ళు నడిచి వెళ్ళిన స్నేహశీలి. అంతేకాదు, తమ్ముడు త్రివిక్రమరావుకు ‘పెదమద్దా’ వాళ్ళ అమ్మాయిని ఇస్తామని చెప్పి తీరా ముహూర్తాలు పెట్టుకునే సమయానికి రాకుండా మొహం చాటేసినప్పుడు... మధ్యవర్తుల ద్వారా త్రివిక్రమరావుకు చదువులేదు, ఆస్తి లేదు, అందువల్ల భార్యను పోషించలేడు కనుక ఈ సంబంధం వదిలేస్తున్నామని వారన్నట్లు తెలియడంతో... ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పెంపుడు తండ్రి ద్వారా తనకు సంక్రమించిన ఆస్తిని అప్పటికప్పుడే తమ్ముడి పేర మార్చి వివాహం జరిపించిన సోదర ప్రేమికుడు. కష్టపడి బీఏ చదివి, సబ్ రిజిస్ట్రార్గా ఉద్యోగం సంపాదించి కూడా అక్కడ జరుగుతున్న అవినీతి నచ్చక ఆ ఉద్యోగం వదిలేసి సినీ రంగంలో భవిష్యత్తును వెతుక్కున్న నీతిమంతుడు. సినిమా రంగాన్ని 30 ఏళ్లకు పైగా శాసించిన కళాకారుడు. 1949లో ‘మనదేశం’లో చిన్న ఎస్సై పాత్రతో మొదలైన సినీ జీవితం అప్రతిహతంగా కొనసాగింది. సమయపాలన, అకుంఠిత దీక్ష అగ్రస్థానంలో నిలబెట్టాయి. నిర్మాతను ఎన్నడూ కష్టపెట్టలేదు. 1970 వరకు ఆయన రెమ్యునరేషన్ – వేలల్లోనే ఉండేది. ప్రతి చిత్రంలో తన వేషాన్ని 6 వారాల్లోగా పూర్తి చేసేవారు. 1969 వరకు నెలకొక్క సినిమా చొప్పున చేశారు. 1964 ఒక్క సంవత్సరంలో మాత్రం 15 సినిమాలు చేసి రికార్డు సృష్టించారు. 1949 నుండి 1982 వరకు అంటే 33 సంవత్సరాల్లో సుమారు 300 సినిమాల్లో నటించారు. ఇందులో 140 చిత్రాలు వెయ్యి థియేటర్లలో 100 రోజులు ప్రదర్శితమయ్యాయి. 33 సినిమాలు 108 ప్రదర్శన శాలల్లో 25 వారాలు ప్రదర్శించబడి రజతోత్సవం జరుపుకున్నాయి. కళామతల్లికి ఎనలేని సేవ చేసి తన 60వ యేట రాజకీయాల్లో ప్రవేశించారు. తెలుగుభాష పట్ల మక్కువ కల్గిన ఆయన తన పార్టీకి ‘తెలుగుదేశం’ అని పేరు పెట్టుకుని, ఆత్మ గౌరవ నినాదంతో 1982 మార్చి 29న పార్టీని ప్రకటించి, కేవలం 9 నెలల్లోనే అధికారానికి తీసుకురావటం చారిత్రాత్మకం. 1965లో ఒకసారి, 1978లో రెండవసారి జరిపిన ప్రయోగాలు విఫలమై కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ శక్తి లేదనుకున్న తరుణంలో ఎన్టీఆర్ ఆకర్షణ ఆయన పార్టీకి బలంగా నిలబడి గెలిపించింది. నాడు కాంగ్రెస్ను ఎదిరించి నిలబడిన నాయకుడు ఎన్టీఆర్ అయితే... నేడు అదే కాంగ్రెస్ను రెండు రాష్ట్రాలలో మట్టి కరిపించిన ప్రజాకర్షణ మళ్లీ జగన్మోహన్రెడ్డి గారిదే. ఇద్దరి ఆశయం ఒక్కటే. సామాజిక న్యాయం, అగ్రకులాధిపత్యంలో ఎన్నో ఏళ్లుగా నలిగి ఓటుకే తప్ప పదవికి దూరంగా ఉంచబడ్డ బడుగు, బలహీన వర్గాలను ఆదరించి అక్కున చేర్చుకుంది ఈ ఇద్దరు నాయకులే. ‘పటేల్–పట్వారీ’ వ్యవస్థను తొలగించి ‘మండల’ వ్యవస్థను తెచ్చి ఎన్టీఆర్ ప్రజల దగ్గరకు ప్రభుత్వాన్ని నడిపించారు. ‘రెండు రూపాయలకు కిలో బియ్యం’ ఇవ్వడం, పక్కా ఇళ్ళు నిర్మించడం, బీసీలకు 29 శాతం అవకాశాలు కల్పించడం ద్వారా ప్రజల మనస్సుల్లో సుస్థిర స్థానం సంపాదించారు. ఇప్పుడు జగన్మోహన్రెడ్డి ఇంకో అడుగు ముందుకేసి 50 శాతం అవకాశాలు ఇచ్చి ఆదుకుంటున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే – ఈ మంచి పనులు చేసిన ఇద్దరు వ్యక్తులకూ శత్రువు ఒకరే. రాజకీయం అంటే అడ్డదారులే అని నమ్మినవాడు, అవినీతిని జీవిత లక్ష్యంగా చేసుకుని సొంత మామనే అధికారం కోసం వెన్నుపోటు పొడిచి పదవిలోకి వచ్చినవాడు చంద్రబాబు. తన స్వార్థం కోసం ప్రజాస్వామ్యాన్ని 1995 ఆగస్టు 25న ఘోరంగా పాతిపెట్టిన వ్యక్తి. అతని వలన ఎంతోమంది తమ రాజకీయ జీవితాన్ని వదులుకోవలసి వచ్చింది. నాదెండ్ల దగ్గరనుండి నల్లపరెడ్డి వరకు అందరూ బలి పశువులే. ఉన్నతమైన వ్యక్తిత్వంతో నిస్వార్థంగా ప్రజలకు మేలు చేద్దామనుకొని రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ పదవినీ, పార్టీనీ లాక్కొని చెప్పులేయించాడు. చివరకు బ్యాంకు ఖాతాలను కూడా స్తంభింపచేసిన ఇటువంటి నీచ మనస్తత్వం మానవ జాతిలో కనిపించదు. అవమాన భారంతో అల్లుడి దుర్మార్గాలను ఎదిరించలేక అలసిపోయిన ఎన్టీఆర్... ఆడియో, వీడియోల రూపంలో చంద్ర బాబు వెన్నుపోటు తెలియజేసి చివరకు ఆక్రోశిస్తూనే 1996 జనవరి 18వ తేదీన ఈ లోకాన్ని విడిచిపెట్టారు. ‘‘ఆ పశ్చిమాశా విషాదాంత కావ్యమై వ్యాపించు కాల మేఘాళిలో’ అన్న శ్రీశ్రీ మాటలు ఈ విషాద దృశ్యానికి సాక్ష్యంగా నిలుస్తాయి. ఆయన ఆశయాల అడుగు జాడలలో నడుస్తూ, పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని బహుశా ఆయన ఆత్మ ఆశీర్వదిస్తూనే ఉంటుంది. ‘విషం కక్కే భుజంగాలో, మదం పట్టిన మాతంగాలో’ ఎవ్వరు అడ్డుపడినా జగన్మోహన్రెడ్డి తన ఆశయాల బాటలో ముందుకు సాగుతూనే ఉంటారు. ఉండాలి కూడా! వ్యాసకర్త: డా‘‘ నందమూరి లక్ష్మీపార్వతి రచయిత్రి, ఎన్టీఆర్ సతీమణి (నేడు ఎన్టీఆర్ శతజయంతి సంవత్సరం ప్రారంభం) -
ఎన్టీఆర్ జిల్లా విషయంలో టీడీపీ డొంకతిరుగుడు యవ్వారం
-
ఎన్టీఆర్ అభిమానుల కోరిక తీరింది..
సాక్షి, విజయవాడ: తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త జిల్లాల ఏర్పాటు కార్యక్రమాన్ని వర్చువల్గా ప్రారంభించారు. కాగా, కొత్త జిల్లాల ఏర్పాటుపై తెలుగు అకాడమీ చైర్పర్సన్, ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి స్పందించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘తమ పార్టీ, బంధువుకు కాకపోయినా ఎన్టీఆర్ను సీఎం జగన్ గౌరవించారు. సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఎన్టీఆర్కు నిజమైన వారసుడు జగన్మోహన్రెడ్డి. కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం సంతోషంగా ఉంది. ఇన్నాళ్లకు ఎన్టీఆర్ అభిమానుల కోరిక తీరింది. టీడీపీ పార్టీని లాక్కుని ఎన్టీఆర్ను చంద్రబాబు మోసం చేశాడు. మొదటి నుంచి ఎన్టీఆర్ మీద చంద్రబాబుకు కక్ష.. వ్యతిరేక భావం. ఎన్టీఆర్ మంచివాడు కాదు అని బ్యాడ్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. భారతరత్న విషయంలో కూడా ఎన్టీఆర్కు చంద్రబాబు ద్రోహం చేశాడు. టీడీపీ దొంగల పార్టీగా తయారైంది’’ అని అన్నారు. ఇక, విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటైన విషయం తెలిసిందే. -
మీ అన్నను మాట్లాడుతున్నాను...
‘‘ఈ గూడుపుఠాణికి గురువు, ఈ మోసానికి మూలస్తంభం, ఈ పద్మవ్యూహానికి కేంద్రబిందువు చంద్రబాబునాయుడు. నా అల్లుడనబడుతున్నవాడు. అతను ప్రజాసేవ కోసం కాక పదవి కోసం తెలుగుదేశం పార్టీలో చేరాడు అనే మర్మాన్ని నేను కనిపెట్టలేకపోయాను. ప్రజాసంక్షేమం, ప్రజా సమస్యలు తప్ప మరేమీ మనసులో ఉండని నేను... అతను కడుతున్న ముఠాలు, చేరదీస్తున్న గ్రూపులను గురించి పట్టించుకోలేదు. అతనిలో పదవీకాంక్ష ఇంతగా గూడుకట్టుకుందనీ, ఆ కోరిక అతనిని ద్రోహిగా మారుస్తుందనీ, అతని వలన ప్రజాస్వామ్యం పట్టపగలే హత్యకు గురవుతుందనీ, అధికారం కోసం ఆ పెద్ద మనిషి ఇంతటి అల్పమైన, నీచమైన, అతి దారుణమైన వెన్నుపోటుకు కూడా సిద్ధపడతాడనీ నేనూహించలేకపోయాను’’ అని బాధపడ్డారు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్. పదవీచ్యుతుడయిన తరువాత ఆయన చేసిన క్యాసెట్లోని భావాలు యథాతథంగా... తమ్ముల్లారా, చెల్లెళ్లారా! ఇదిగో మీ అన్నను మాట్లాడుతున్నాను. శ్రద్ధగా ఆలకించండి. మీ బుద్ధితో ఆలోచించండి. మీ నిర్ణయంతో నన్ను ఆదేశించండి. మీకు తెలుసు ప్రజలే నా దేవుళ్లని, ప్రజాక్షేమమే నా ఊపిరని, ప్రజా సేవే పరమార్థమని. బడుగు ప్రజల అభ్యు న్నతి కోసమే ఈ జీవితం అంకితమని మీకు తెలుసు. అందుకే మీ అండే నాకు కొండంత బలం. మీ చైతన్యమే నా జీవన నాడి. మీరు చెప్పేదే న్యాయం. చేసేదే ధర్మం. కాబట్టి నాటి నుండి నేటి వరకు జరిగిన చరిత్రను మీ ముందు, ప్రజాన్యాయస్థానం ముందు ఉంచుతున్నాను... మంచేదో చెడేదో, నిజమేదో అబద్ధమేదో మీకు తెలియాలని! ఆశయానికీ ఆశకూ, త్యాగానికీ స్వార్థానికీ, నీతికీ అవినీతికీ మధ్య జరుగుతున్న ఈ సమరంలో న్యాయ నిర్ణేతలు మీరు. 1982వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని స్థాపించాను. ఎందుకు? కళామతల్లి ముద్దుబిడ్డగా, మీ అందరి ఆప్యాయతలను చూరగొన్న అదృష్టవంతుడిగా, భగవంతుని వేషధారణలో పునీతమైన నా జీవితాన్ని రాజకీయాల్లో ఎందుకు ప్రవేశపెట్టాను? ఎందుకు? తెలుగు వెలుగులు దిగంతాలు ప్రసరించాలని. తెలుగువారి ఆత్మ గౌరవం ఆకాశం అంత ఎత్తు ఎదగాలని. తరతరాల దోపిడీలో నలిగి బ్రతుకు భారంగా కృంగి కృశించిపోయిన బడుగు జీవుల కన్నీళ్ళు తుడవాలని ఎముకలు ముక్కలు చేసుకున్నా. ఒక్కపూట గంజికైనా నోచుకోని ఆ కష్టజీవులకు పట్టెడన్నం పెట్టడం కోసం, జాతి జీవనాడులైన అసామాన్య జీవులకు ఓ గూడు కట్టించడం కోసం ప్రజాసేవే పరమార్థంగా ఎంచిన నా ఆదర్శాన్ని మీరు ఆదరించారు. నా మీద విశ్వాసంతో, నా ఆశయాల పట్ల నమ్మకంతో పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అపురూపమైన విజయాన్ని అందించారు. 35 ఏళ్ళ కాంగ్రెస్ దుష్ట పరిపాలనకు స్వస్తి చెప్పి, మీ అన్నకు ప్రభుత్వాన్ని అప్పగించారు. అందుకే జనసేవా పథకాలు అమలు చేశాను. బడుగు వర్గాల కోసం లక్షల కొద్దీ ఇళ్ళు నిర్మించాను. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకంలో నిరుపేదలకింత అన్నం పెట్టగలిగాను. ఆడపడుచులకు ఆస్తి హక్కును అందించాను. కార్మికులకు, కర్షకులకు ఒకరేమిటి? అన్ని వర్గాల వారిని ఆత్మీయులుగా భావించాను, గౌర వించాను, సత్కరించాను. ఆ తరువాత 1989వ సంవత్సరం ఎన్నికలలో కూడా ప్రజాభిమానం తెలుగుదేశం పట్లే ఉన్నప్పటికీ పార్టీలోని కొందరు స్వార్థపరులు, బడావ్యాపారులు రాజకీయ దళారీలతో కుమ్మక్కై, తమ స్వప్రయోజనాల కోసం పార్టీ శ్రేయస్సును, రాష్ట్ర శ్రేయస్సును విస్మరించి సంకుచిత రాజకీయాలు నడపబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. 5 సంవత్సరములు ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల సమస్య పట్ల తెలుగు దేశం పార్టీ స్పందించింది. 1994లో మళ్ళీ ఎన్నికలు వచ్చినవి. తెలుగుదేశం పార్టీకి 150 సీట్ల కన్నా మించి రావనీ, ఆ 150 మంది శాసనసభ్యులలో ఏ పార్టీకో 50 మందిని ప్రలోభపెట్టి పార్టీని చీల్చి తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవాలనీ పార్టీలో కొందరు కుట్రదారులు ముందుగా పథకం వేశారు. కానీ వాళ్ళ ఆశలకు విరుద్ధంగా, రాజకీయ పండిత అంచనాలకు మించిన విధంగా అపూర్వమైన విజయాన్ని మీరు నాకు సాధించిపెట్టారు. మీ అన్న మీద ఉన్న విశ్వాసాన్ని మరోసారి మహాద్భుతంగా ప్రకటించారు. 224 సీట్లతో అధికారాన్ని చేపట్టిన తెలుగుదేశం పార్టీ ప్రాభవాన్ని ప్రకటించడం చేతగాని ఆ తెలుగు దేశం వ్యతిరేక శక్తులు కొంతమంది లోలోన గూడుపుఠాణి అవలం బించారు. ఈ గూడుపుఠాణికి గురువు, ఈ కుట్రకు గూడు, ఈ మోసానికి మూలస్తంభం, ఈ పద్మవ్యూహానికి కేంద్ర బిందువు చంద్రబాబునాయుడు. నా అల్లుడనబడుతున్నవాడు. నా గుండెల్లో చిచ్చుపెట్టినవాడు. మీ అందరికీ తెలుసు. తెలుగుదేశం ఆవిర్భవించడానికి ముందు అతనేమిటో! కాంగ్రెస్లో ఉండి, తెలుగుదేశం పార్టీని ఎదిరించి నాతోనైనా పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికి, తెలుగుదేశం మహా ప్రభంజనంలో కొట్టుకుపోయిన ఒక చిన్న మిడత. తెలుగుదేశం అఖండ విజయం సాధించింది. అధికారానికి వచ్చిన తరువాత అతను పార్టీలో చేరతానని వస్తే, అతనిని పార్టీలో చేర్చుకోవద్దని కొందరు హితవు చెప్పారు. అయినా కానీ అతను పశ్చాత్తాపాన్ని ప్రకటించాడు కదా అని ఔదార్యంతో చేర్చుకున్నాను. తరువాత పార్టీలో ముఖ్యమైన పదవిని ఇచ్చాను. కానీ అతను ప్రజాసేవ కోసం కాక పదవి కోసం తెలుగుదేశం పార్టీలో చేరాడు అనే మర్మాన్ని నేను కనిపెట్టలేకపోయాను. ప్రజాసంక్షేమం, ప్రజా సమస్యలు తప్ప మరేమీ మనసులో ఉండని నేను... అతను కడుతున్న ముఠాలు, చేర దీస్తున్న గ్రూపులను గురించి పట్టించుకోలేదు. అసలు అతనిలో పదవీకాంక్ష ఇంతగా గూడుకట్టుకుందనీ, ఆ కోరిక అతనిని ద్రోహిగా మారుస్తుందనీ, అతని వల్లే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తప్పు కోవలసి వస్తుందనీ, అతని వలన ప్రజాభీష్టమే వ్యర్థమవుతుందనీ, ప్రజాస్వామ్యం పట్టపగలే హత్యకు గురవుతుందనీ, అధికారం కోసం ఆ పెద్ద మనిషి ఇంతటి అల్పమైన, నీచమైన, అతి దారుణమైన వెన్నుపోటుకు కూడా సిద్ధపడతాడనీ నేనూహించలేకపోయాను. నాతోనే ఉంటూ, ప్రభుత్వంలో ముఖ్యమైన బాధ్యతలను నిర్వహి స్తూనే చాటుగా, మాటుగా, రహస్యంగా పద్మవ్యూహం పన్నుతాడన్న విషయాన్ని నేను గుర్తించలేకపోయాను. తన పదవీకాంక్షను తీర్చుకోవడం కోసం తండ్రి నుంచి కొడుకును దూరం చేశాడు. తండ్రి పట్ల అంతులేని ఆరాధనాభావం ఉన్నవాడు నా హరి. నిద్రాహారాలు మాని చైతన్యరథాన్ని నడిపిన నా బిడ్డ. తండ్రి కాల్లో ముల్లు గుచ్చుకుంటే తన కంట్లో గుచ్చుకున్నంతగా వాపోయే నా హరిని నాకు దూరం చేశాడు. నా ముందు నిలబడి ఎరగని నా కుమారుణ్ణి నన్నే ఎదిరించి, కవ్వించేందుకు పురిగొల్పాడు. ఒక సాకు, ఒక వంక, ఒక అభియోగం సృష్టించాడు. కార్యకర్తలకు ఏదో అన్యాయం జరిగిందట. ఏమిటి ఆ అన్యాయం? ఎవరికి ఆ అన్యాయం? పార్టీ పట్ల శ్రద్ధాభక్తులతో, అంకిత భావంతో పనిచేసి ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న ఏ కార్యకర్తలకు, ఏ నా తమ్ముళ్ళకు అన్యాయం జరగలేదు. ఒకవేళ ఏదైనా లోటు జరిగితే అది అవకాశ వాదులకే జరిగింది. చంద్రబాబు, ఆ పెద్దమనిషి, ఆ మేక వన్నె పులి, ఆ తేనె పూసిన కత్తి తయారు చేసిన కుట్రదారులకే జరిగింది. నా దేవుళ్ళు ప్రజలు. ఆ ప్రజల ముందుకు ప్రభుత్వాన్ని తీసుకువెళ్ళాలని మరలా నేను పర్యటన ప్రారంభించాను. ఆ పర్యటనలో నాతోనే ఉంటూ, నేనే దేవుణ్ణి అని చెబుతూ, చాపకింద నీళ్ళ లాగా, పుట్టలో తేళ్ళలాగా, పొదల్లో నక్కల్లాగా, కుట్రలు, కుతంత్రాన్ని అల్లారు. మోసాన్ని పోషించారు. ప్రజాప్రభుత్వాన్ని దించడానికి బడా వ్యాపా రుల్ని, రాజకీయ దళారుల్ని, ఈనాడు గోబెల్స్ ప్రచారంలో దిట్టల్ని కూడగట్టారు. ఆగస్టు 23వ తేదీ వరకు నేను ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నాను. పర్యటన ముగించుకుని నేను హైదరాబాదు తిరిగి వచ్చేలోపే చంద్రబాబు తన కుతంత్రాన్ని అమలు జరపడం ప్రారంభించాడు. పార్టీ సమస్యలను, ప్రభుత్వ విషయాలను చర్చించాలన్న మిషతో శాసనసభ్యులను పిలిపించాడు. 24వ తేదీన ఆ శాసన సభ్యుల్లో కొందరిని వైశ్రాయ్ హోటల్లో నిర్బంధించాడు. 70 మంది ఉంటే 150 మంది ఉన్నారని గోబెల్స్ ప్రచారం చేయించి శాసన సభ్యుల మనస్సును ప్రభావితం చేయించాడు. అమాయకులైన నా తమ్ముళ్ళను, నా శాసనసభ్యులను రకరకాలుగా మభ్యపెట్టి, బడా వ్యాపారుల సాయంతో ప్రలోభపెట్టి, నా దగ్గరకు రావడానికి యత్నించిన వాళ్ళను హోటల్ నుండి బయటకు రానివ్వకుండా రౌడీలను, గూండాలను కాపలా పెట్టి ఆ శాసన సభ్యులందరూ తనకు సపోర్టు అని ప్రచారం చేయించాడు. సిగ్గుచేటు. క్షమించరాని నేరం. వీళ్ళంతా ఇలా ఎందుకు చేశారు? ఎందుకు వెన్నుపోటు పొడిచారు? ఏమిటి... ఏమిటీ ఈ ఎన్టీఆర్ చేసిన తప్పు? ఏమిటీ... ఈ రామారావు చేసిన నేరం? ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరించిన మరుక్షణం మద్య నిషేధం ఫైలు మీద సంతకం పెట్టి, ఆడపడుచుల కన్నీళ్ళు తుడవడం తప్పా? కిలో బియ్యం రెండురూపాయలకే ఇవ్వాలని నిర్ణయించడం నా నేరమా? ఏమిటి నేను చేసిన తప్పు? అన్నదాత రైతన్న పంటలు పండించడానికి వాడే విద్యుచ్ఛక్తి సాలుకు హార్స్ పవర్ 50 రూపా యలకే సరఫరా చేయడమా? ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా, ఆర్థిక ఇబ్బందులు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టినా, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు చిత్తశుద్ధితో అమలు చేయడమా? ఏ దేవుళ్ళు నాకు అధికారాన్ని ఇచ్చారో ఆ ప్రజల వాకిటికే ప్రభుత్వాన్ని తీసు కెళ్ళడమా? ఏమిటీ నేను చేసిన నేరం? నోరు లేని జనానికి నోరు ఇవ్వడమా? బడుగు, బలహీన వర్గాల్లో రాజకీయ చైతన్యాన్ని రగిలించడమా? ఏ పథకం అమలు ఎలా జరుగుతున్నదో, జరగక పోతే ఎందుకు జరగడం లేదో నిలదీసి అడిగే అవకాశాన్ని, బలాన్ని అట్టడుగు వర్గాలకు అందించడమా? ఇవేమీ కావు. ఆ పెద్ద మనుష్యుల దృష్టిలో నా నేరం వాళ్ళ స్వార్థాలకు ఎన్టీఆర్ ఉపయోగ పడక పోవడం. బడావ్యాపారుల, సారాజుల చేతుల్లో కీలుబొమ్మ ప్రభుత్వం కాకపోవడం! దళారీలు, పవర్ బ్రోకర్స్కు ఆస్కారం లేకపోవడం... ఇవి నేను చేసిన నేరాలు. మరి వాళ్ళు పెద్ద మనుష్యులు! ప్రజాస్వామ్య రక్షకులట! రక్షకులా? కాదు, భక్షకులు. ధనకాంక్షతో, పదవీ వ్యామోహంతో, పెడదారులు పట్టిన వీరు స్వప్రయోజనాలు తప్ప ప్రజల గురించి ఏనాడూ ఆలోచించని ఈ స్వార్థపరులు ప్రజా ప్రయోజనాలు సాధిస్తారా? ప్రజాభిమతాన్ని తలక్రిందులు చేసిన వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారా? అంకిత భావంతో ప్రజాసేవ చేస్తారా? ఇంత నీచానికి ఒడిగట్టిన చంద్ర బాబు... ఎన్టీఆర్ మా దేవుడు, ఆయన విధానాలే అమలు జరుపు తానంటాడు. చేతులు జోడించి నమస్కారం చేసి, తుపాకీ పేల్చిన గాంధీ మహాత్ముని పొట్టన పెట్టుకున్న గాడ్సే కన్నా మించిన హంత కుడు. పదవి ఉన్నా లేకపోయినా నేను ప్రజల మనిషిని. చివరి రక్తపు బొట్టు వరకు, ప్రజాసేవే పరమార్థంగా ఈ జీవితాన్ని సాగిస్తాను. ప్రజలే నా దేవుళ్ళు. ప్రజల హృదయమే నా దేవాలయం. ఈ వెన్నుపోటు తగిలింది నాకు మాత్రమే కాదు. ప్రజలకు, మీకు మీరు వేసిన ఓటుకు. మీరు నమ్మిన ప్రజాస్వామ్యానికి. మీరు విశ్వసించిన ఆశయాలకు, ఆధర్మాలకు ఈ వెన్నుపోటు. ఈ విఘాతం. తమ్ముళ్ళూ! చెల్లెళ్ళూ! ఇప్పుడు ఆలోచించండి. మీరు నాకు అండ. మీకు నా కైదండ. కుట్రదారులకు బుద్ధి చెప్పండి. దగాకోరులకు తగిన శాస్తి చేయండి. లాలూచీదారుల ఆటలు కట్టించండి. విశ్లేషణ డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి ‘తెలుగుతేజం (ఎన్టీఆర్ రాజకీయం జీవితం)’ పుస్తకంలోని ‘జామాతా – దశమ గ్రహః’ అధ్యాయం లోంచి. -
ఒక్క పాటతో కోట్ల మంది మదిని గెలిచింది.. ఆ పాటతోనే..
ఆ యువతి బస్సు సౌకర్యం లేని మారుమూల గ్రామంలో జన్మించింది. అయితేనేం. ‘ఊరంత వెన్నెలా.. మనసంతా చీకటి’ పాటతో కోట్లాది మంది మదిని గెలిచింది. పుట్టిన ఊరికి పేరు ప్రతిష్టతో పాటు బస్సు సౌకర్యం తీసుకొచ్చింది దాసరి లక్ష్మీపార్వతి. కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామానికి చెందిన ఈ యువ గాయని శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడింది. మనోగతం ఆమె మాటల్లోనే.. saregamapa singer parvathy: మాది సాధారణ మధ్య తరగతి కుటుంబం. మా తల్లిదండ్రులు దాసరి శ్రీనివాసులు, మీనాక్షమ్మలకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూమార్తెలు సంతానం. అందరి కంటే మా కుటుంబంలో పెద్దది అక్క సరస్వతి, తర్వాత ఇద్దరు అన్నలు చంద్రమోహన్, ఉపేంద్ర. వారి తర్వాత నేను పుట్టాను. మాకున్న 4.70 ఎకరాల పొలంలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. చిన్నప్పటి నుంచి నాకు పాటలంటే ఇష్టం. మా ఊరి ప్రాథమిక స్కూలులో చదివేటప్పుడు మొదటిసారిగా ‘పుట్టింటికిరా చెల్లి’ సినిమాలో పాట పాడాను. దీన్ని విన్న మా ఉపాధ్యాయుడు మద్దయ్య భవిష్యత్తులో మంచిస్థాయిలో ఉంటావని చెప్పి అభినందించారు. తర్వాత 4,5 తరగతులను డోన్ మండలం జగదుర్తి గ్రామ సమీపంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో, 6 నుంచి 10 తరగతి వరకు కొత్తపల్లె మండలంలోని కస్తూరిబా బాలికల పాఠశాల, ఇంటర్ ఎమ్మిగనూరు ప్రభుత్వ కాలేజీలో చదివాను. నేను అక్కడ పాటలు పాడటాన్ని చూసి ఉపాధ్యాయులు ప్రోత్సహించేవారు. ఇంటర్ తర్వాత వ్యవసాయం కలిసిరాక కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఏడాదిపాటు ఇంటి దగ్గరే ఉన్నా. ఈ సమయంలో మా అమ్మనానలు, అన్నలు పడుతున్న కష్టాన్ని కళ్లారా చూసి వారితో పాటు నేను పొలం పనులకు వెళ్లాను. తిరుపతి సంగీత కళాశాలలో శిక్షణ ఒకరోజు నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు పాటలు పాడుతుంటే పలుకూరు గ్రామానికి చెందిన హర్మోనిస్టు హరి విని సంగీతం నేర్పిస్తే మీ చెల్లెలు మంచి గాయని అవుతుందని మా అన్నయ్యకు చెప్పారు. అలా ఆయన ద్వారానే తిరుపతిలో సంగీత కళాశాల ఉందనే విషయం తెలుసుకుని 2017లో ఆ కళాశాలకు అన్లైన్లో దరఖాస్తు చేసుకుని చేరాను. అక్కడ గురువు వల్లూరి సురేష్బాబు వద్ద శిక్షణ తీసుకున్నాను. గతేడాది డిసెంబర్ 9న ఎస్వీబీసీలో చానల్లో ‘అదిగో అల్లదిగో’ ప్రోగ్రాంకు పాట పాడే అవకాశం వచ్చింది. అక్కడ ‘ఏమి చేయవచ్చునే’ అనే అన్నమయ్య కీర్తన పాడాను. న్యాయనిర్ణేతగా వచ్చిన ఎస్పీ శైలజ నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించింది. పాటతో బస్సు వచ్చింది ఈయేడాది జనవరి 14న ఓ తెలుగు చానల్లో సరిగమప కార్యక్రమానికి సెలెక్షన్ నిర్వహించారు. అందులో నేను ఎంపికై తొలుత ‘ఊరంత వెన్నెల.. మనసంతా చీకటి’ పాట పాడాను. నా పాటను మెచ్చి సంగీత సామ్రాట్ కోటి నీకు ఏమీ కావాలో కోరుకోమన్నారు. వెంటనే మా గ్రామానికి బస్సు వేయాలని కోరా. అందుకు న్యాయనిర్ణేతలు అంగీకరించి ఏపీ మంత్రి పేర్ని నానితో మాట్లాడి డోన్ నుంచి దేవనకొండ వెళ్లే బస్సును మా గ్రామానికి వచ్చేలా చేశారు. ఇందుకు సహకరించిన అందరికీ ప్రత్యేకంగా మా గ్రామం తరపున ధన్యవాదములు తెలియజేస్తున్నా. అలాగే కర్నూలు నుంచి వయా ఈదుల దేవరబండ మీద మా గ్రామ సమీపంలోని బండపల్లె వరకు బస్సు వస్తుంది. అది కూడా మా గ్రామంలోకి వచ్చిపోతే వివిధ పనుల మీద నేరుగా కర్నూలుకు వెళ్లే రైతులకు మేలు జరుగుతుందని గాయని లక్ష్మీపార్వతి అభిప్రాయపడ్డారు. భవిష్యత్లో మంచి సింగర్గా స్థిరపడి జిల్లాలో సంగీత పాఠశాల ఏర్పాటు చేసి ఆసక్తి ఉన్న వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వాలన్నదే తన ఆశయమని ఈ యువ గాయని చెప్పుకొచ్చారు. -
ఏపీలో ఎన్టీఆర్ కలల పాలన: లక్ష్మీపార్వతి
ఖైరతాబాద్: ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజలకు ఎంతో న్యాయం జరుగుతోందని, ఎన్టీఆర్ కలలుగన్న రాజ్యం సాకారమైందని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆమె ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేయడం, వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను కావాలని తొలగించడంలాంటి చర్యలు ఏ పార్టీకి మంచిది కాదని చెప్పారు. ప్రతిపక్షాల వారు వైఎస్ జగన్ లాగా హుందాగా వ్యవహరించాలని కోరారు. ఎన్టీఆర్ లెజెండ్..: బాలకృష్ణ: ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంగళవారం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, సుహాసిని ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. బాలకృష్ణ మాట్లాడుతూ సినీ, రాజకీయరంగాల్లో ఎన్టీఆర్ పాత్ర మరువలేనిదని, ఆయన లెజెండ్ అని చెప్పారు. -
ఎన్టీఆర్ ఆత్మతో మాట్లాడాను: లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు
-
ఎన్టీఆర్కు మరణం ఉండదు: లక్ష్మీపార్వతి
సాక్షి, హైదరాబాద్: ఎన్టీఆర్కు మరణం ఉండదని లక్ష్మీపార్వతి అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్లోని సమాధి వద్ద లక్ష్మీపార్వతి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఎన్టీఆర్ భౌతికంగా దూరమైనా అందరి మనసుల్లో ఉన్నారన్నారు. జాతీయ రాజకీయాల్లో ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారని లక్ష్మీపార్వతి అన్నారు. చదవండి: టీడీపీ కుట్ర బట్టబయలు.. చంద్రబాబు ఆడియో లీక్.. -
బాలకృష్ణ నిజాలు తెలుసుకోవాలి
సాక్షి, అమరావతి: రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ఎన్టీఆర్ సతీమణి, తెలుగు–సంస్కృత అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి అన్నారు. శనివారం ఆమె తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ను మోసం చేసినట్టే ఆయన కుటుంబ సభ్యులను కూడా చంద్రబాబు మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో ఎక్కడా భువనేశ్వరి ప్రస్తావన రాకపోయినప్పటికీ చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకుని మసిపూసి మారేడు కాయ చేశారని మండిపడ్డారు. ఇవేవీ గుర్తించకుండా నేటికీ బాబు ట్రాప్లో పడి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మోసపోతుండటం బాధాకరమని పేర్కొన్నారు. చదవండి: (‘చంద్రబాబు సతీమణి గురించి సభలో ఎక్కడా ప్రస్తావన రాలేదు’) ఈ నిజాల్ని బాలకృష్ణ గుర్తించాలన్నారు. వైశ్రాయ్ హోటల్ ముందు ఎన్టీఆర్పై చెప్పులు వేయించి.. వెన్నుపోటు పొడవటం వెనుక కర్త, కర్మ, క్రియ చంద్రబాబే అని అప్పట్లో వివరించినా బాలకృష్ణ స్పందించలేదన్నారు. అధికారం కోసం బాబు చేస్తున్న కుట్రలను ఇప్పటికైనా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు గుర్తించాలని కోరారు. నాడు ఎన్టీఆర్ కన్నీరు పెట్టినప్పుడు కుటుంబ సభ్యులకు కనిపించలేదా అని నిలదీశారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి ఆయన చివరి రోజుల్లో క్షోభకు గురిచేసిన చంద్రబాబుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మద్దతు ఇవ్వడం సమంజసం కాదన్నారు. మహానీయుడి కుటుంబంలో పుట్టి ఇంత మూర్ఖంగా ఎలా ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. ‘ఆస్కార్ అవార్డును దాటిపోయేలా నటిస్తున్నాడు. చదవండి: (చంద్రబాబు ఫ్రస్టేషన్లో ఉన్నాడు: మంత్రి బాలినేని) నన్ను మించిన నటుడు చంద్రబాబు’ అని ఎన్టీఆర్ అన్న మాటలను లక్ష్మీపార్వతి గుర్తు చేశారు. రాజకీయ లబ్ధి కోసం ఎలాంటి పనైనా చేయగల సిద్ధహస్తుడు చంద్రబాబు అని పేర్కొన్నారు. 25 ఏళ్లపాటు చంద్రబాబుపై పోరాడానని, ఎన్ని కష్టాలు పడ్డా ఎన్టీఆర్ సిద్ధాంతాన్ని తాను ఇప్పటికీ వదిలిపెట్టలేదని తెలిపారు. బాబుపై పోరాటం చేయడానికే వైఎస్సార్సీపీలో చేరానని చెప్పారు. వైఎస్సార్సీపీ నాయకులు చంద్రబాబుపై విమర్శలు చేస్తారే తప్ప ఏనాడైనా ఆడవాళ్ల జోలికి పోయారా అని ప్రశ్నించారు. వైఎస్ షర్మిలపై అనేక రకాలుగా కామెంట్స్ చేయించింది చంద్రబాబు కాదా అని నిలదీశారు. -
తినడానికి వీలుగా మా అల్లుడు తెర కట్టుకుని దీక్ష చేస్తున్నాడు: లక్ష్మీపార్వతి
సాక్షి, గుంటూరు: చంద్రబాబు దుర్మార్గుడు, అబద్దాల కోరు అంటూ తెలుగు–సంస్కృత అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి ఫైర్ అయ్యారు. గుంటురులో రెండో రోజూ కొనసాగుతున్న జనాగ్రహ దీక్షలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. 'అన్ని వ్యవస్థల్లోనూ చంద్రబాబు తన మనుషులను పెట్టుకొని వ్యవస్థలను భ్రష్టుపట్టించాడు. బాబు అనకూడని, వినకూడని మాటలు అనిపించి పైశాచిక ఆనందాన్ని పొందుతాడు. సంస్కారానికి, చంద్రబాబుకి చాలా దూరం ఉంది. అబద్దం చంద్రబాబుతోనే పుట్టింది. అతనితోనే పెరిగింది. అతనితోనే పోతుంది. ఆయన సొంత నియోజకవర్గంలోనే గెలవలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో రోజుకో నూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడు. సీఎం వైఎస్ జగన్ 30 లక్షల మందికి పైగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే.. చంద్రబాబు కోర్టుకెళ్లి స్టే తెచ్చాడు. అమరావతి అంటాడు ఇక్కడ మాత్రం మా అల్లుడికి ఇళ్లు లేదు. నేను వచ్చేటపుడు చూశాను. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర బిర్యానీ పొట్లాలు అందలేదని కొంతమంది, డబ్బులు అందలేదని మరికొంతమంది గొడవ చేస్తున్నారు. తినటానికి వీలుగా వెనుక ఒక తెర కట్టుకుని మా అల్లుడు దీక్ష చేస్తున్నాడు. రాష్ట్రంలో మహానేత పాలన సాగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రజలు మహానేతగా తయారు చేశారు' అని లక్ష్మీపార్వతి అన్నారు. చదవండి: (చంద్రబాబు డైరెక్షన్లోనే పట్టాభి అనుచిత వ్యాఖ్యలు: సజ్జల) -
ఆయన గురించి నేనెప్పుడో చెప్పా..
-
‘పోసాని భార్యను అవమానించడం దారుణం.. భగవంతుడే మీకు బుద్ధి చెప్తాడు’
సాక్షి, విజయవాడ: మహిళల ఆత్మగౌరవాన్ని దిగజార్చిన హీనుడు చంద్రబాబు అంటూ తెలుగు–సంస్కృత అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి ఫైర్ అయ్యారు. పోసాని మురళి భార్యకు జరిగిన అవమానం చూశాక మాట్లాడకుండా ఉండటం మానవత్వం కాదు. నీచ నికృష్ట రాజకీయ చదరంగం ప్రారంభించి, చివరకు సంస్కార హీనుల్ని తయారుచేసి మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే స్థాయికి తెలుగుదేశాన్ని దిగజార్చిన హీనుడు చంద్రబాబు. బాబులాగే ఇటువంటి హీనరాజకీయాలకు వారసత్వంగా మహిళల వ్యక్తిత్వాలను కించపరుస్తూ లోకేష్, పవన్ కల్యాణ్ సాగిస్తున్న దాడులు ఎంతో కాలం సాగవు. మీ ఇంటి స్త్రీలను అవమానపరిచిన అదే టీడీపీతో కలిసి పనిచేస్తూ విలువలకు తిలోదకాలు ఇచ్చారు. ఈ అరాచకాలు సహించలేనివి. ఎంతో ఉత్తమురాలు, ఏనాడు బయటకు రాని పోసాని భార్యను మీరు అవమానించడం అంటే మీరు ఏ స్థితికి దిగజారిపోయారో ఆలోచించుకోండి. ముగింపు తొందరలోనే ఉంది. భగవంతుడే మీకు బుద్ది చెప్తాడు' అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చదవండి: (బద్వేలు ఉపఎన్నిక: ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే..) -
ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాలను ఆవిష్కరించిన ఆదిమూలపు సురేష్
సాక్షి, విజయవాడ: తెలుగు, సంస్కృత అకాడమి, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ముద్రించిన ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం విజయవాడలో జరిగింది. రాష్ట్ర విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి సతీష్చంద్ర, అకాడమి చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి, సంచాలకులు వి. రామకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ‘‘ఏపీ విభజన తర్వాత తెలుగు అకాడమీ హైదరాబాద్లో ఉండిపోయింది. గత ప్రభుత్వం తెలుగు అకాడమీని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగు అకాడమీని ప్రారంభించాం. తెలుగు, సంస్కృతి అకాడమీగా మార్పు చేసి భాషాభివృద్దికి కృషి చేస్తున్నాం. అకాడమీ ఏర్పాటు తర్వాత మొదటి సారిగా ఇంటర్ పాఠ్యపుస్తకాలని రూపొందించి ముద్రించడం అకాడమీ ఘనవిజయం’’ అన్నారు. (చదవండి: ‘తల్లిదండ్రులను వేధించి ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు’) ‘‘తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలలో ఇపుడు ముద్రణ జరిగింది. ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరానికి సంబంధించి 54 పుస్తకాలని ముద్రించాం. పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే విద్యార్ధులకి తెలుగు అకాడమీ పుస్తకాలు ఉపయోగపడతాయి. డీఎస్సీ లాంటి పోటీ పరీక్షలకి అనుగుణంగా పుస్తకాలు ముద్రించాం. డిగ్రీ, అనువాద పుస్తకాలు, ప్రాచీన, ఆధునిక పుస్తకాల ముద్రణకి తెలుగు, సంస్కృత అకాడమీ చర్యలు తీసుకోవాలి. తెలంగాణా నుంచి ఏపీకి రావాల్సిన తెలుగు అకాడమీ నిధులు, ఉద్యోగుల విషయమై సుప్రీం తీర్పుకి అనుగుణంగా ముందుకు వెళ్తాం. తిరుపతి కేంద్రంగా తెలుగు, సంస్కృతి అకాడమీ నడుస్తోంది. అన్ని సమస్యలు పరిష్కరించి తెలుగు, సంస్కృత అకాడమీని బలోపేతం చేస్తాం’’ అన్నారు. (చదవండి: తెలుగు భాష సంస్కృతం నుంచే మమేకమైందని గుర్తించాలి: లక్ష్మీపార్వతి) తెలుగు అకాడమీ పుస్తకాలంటే విద్యార్థులకు మక్కువ: లక్ష్మీపార్వతి తెలుగు అకాడమీ విభజనపై ఎపికి అనుకూల మైన తీర్పు వచ్చిందన్నారు తెలుగు, సంస్కృతి అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘వచ్చే నెల మొదటి వారంలోపు తెలుగు అకాడమీ విభజన పూర్తి అవుతుందని భావిస్తున్నాం. తెలుగు అకాడమీ ముద్రించే పుస్తకాలపై విద్యార్ధులలో మక్కువ ఎక్కువ. పుస్తకాలలో నాణ్యత ఉంటుందని భావిస్తారు. పోటీ పరీక్షలు, డిగ్రీ, పీజీ పుస్తకాల ముద్రణ కూడా తయారవుతోంది. సీఎం వైఎస్ జగన్ సూచనలకి అనుగుణంగా తెలుగు, సంస్కృతి అకాడమీని తీర్చుదిద్దుతున్నాం’’ చదవండి: ‘ప్రజల అవసరాలకు తగ్గట్టుగా విద్య ఉండాలన్నదే ఉద్దేశం’ -
లోకేశ్.. తాటతీస్తాం జాగ్రత్త!
Lakshmi Parvathi Slams Nara Lokesh: సాక్షి,అమరావతి: లోకేశ్.. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే తాట తీస్తాం.. అంటూ తెలుగు–సంస్కృత అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి హెచ్చరించారు. సీఎం జగన్పై లోకేశ్ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని, టీడీపీకి భవిష్యత్తు లేదన్న భయాందోళనలే ఆయనతో ఇలా మాట్లాడిస్తున్నాయన్నారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. లోకేశ్ భాషను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చిన్న సైగ చేస్తే.. లోకేశ్ను ఏం చేసేందుకైనా మేం సిద్ధం అంటూ హెచ్చరించారు. ఏడో తరగతి కూడా పాస్కాని వ్యక్తికి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో సర్టిఫికెట్ ఎలా వచ్చిందో అందరికీ తెలుసన్నారు. ఏదైనా కొంతకాలమే సహిస్తామని, ఎక్కువైతే ప్రజలు తిరుగుబాటు చేస్తారని చెప్పారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోకుంటే.. ఆపై జరిగే అనర్థాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. చంద్రబాబు, లోకేశ్లు మేనేజ్ చేసుకుని కేసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నారంటూ ధ్వజమెత్తారు. లక్ష కోట్లు దోచిన చంద్రబాబు, లోకేశ్లు ధన బలంతో మదమెక్కి మాట్లాడుతున్నారని, వీరు ఎన్ని చేసినా టీడీపీ అధికారంలోకి రావడం అసాధ్యమన్నారు. అద్భుత పాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ను ప్రజలంతా కీర్తిస్తున్నారన్నారు. -
‘టీడీపీ అండ్ కో పిచ్చి మాటలు మానుకోవాలి’
సాక్షి, నెల్లూరు జిల్లా: టీడీపీ అండ్ కో ఇకనైనా అర్ధం పర్థం లేని పిచ్చి మాటలు మానుకోవాలని తెలుగు, సంస్కృత భాషా అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి హితవు పలికారు. తెలుగు సరిగా రానివాళ్లు కూడా తెలుగు గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, మతిలేని వాళ్లు రాసిన స్ర్కిప్ట్ను వాళ్లు చదువుతున్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో తెలుగు భాషకు ఇప్పుడు సరైన పునాది పడుతోంది. ప్రైవేట్ స్కూళ్లలో తెలుగును తప్పనిసరి చేసిన ప్రభుత్వం మాదని అన్నారు. తెలుగు అకాడమీ, విశ్వవిద్యాలయ పునరుద్ధరణ జరగబోతోందని, ఏపీలో తెలుగు భాషకు నిజమైన పట్టం కట్టబోతున్నామని లక్ష్మీ పార్వతి అన్నారు. ఇవీ చదవండి: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ ఇంటర్లో సీఈసీ చేశారా.. కామర్స్ కోర్సులకు మంచి డిమాండ్ -
తెలుగు భాష సంస్కృతం నుంచే మమేకమైందని గుర్తించాలి: లక్ష్మీపార్వతి
-
తెలుగు భాష సంస్కృతం నుంచే మమేకమైందని గుర్తించాలి: లక్ష్మీపార్వతి
సాక్షి, గుంటూరు: తెలుగు భాష సంస్కృతం నుంచే మమేకమైందన్న విషయాన్ని గుర్తించాలని ఏపీ సాహిత్యఅకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. అలాంటప్పుడు తెలుగు అకాడమీని తెలుగు&సంస్కృత అకాడమీగా పేరు మార్చడంలో తప్పులేదని వ్యాఖ్యానించారు. గతంలో తెలుగు అకాడమీని చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశారని, సీఎం జగన్ ప్రభుత్వంలో తెలుగు అకాడమీకి పూర్వ వైభవం వచ్చిందని తెలిపారు. తిరుపతిలో తెలుగు&సంస్కృతం అకాడమీ భవనం నెలకొల్పారని, భాషా చైతన్య సదస్సులను రాష్ట్రంలోని అన్ని వర్శిటీల్లో నిర్వహిస్తామన్నారు. -
ఎన్టీఆర్ ఆశయాలను ఏపీలో సీఎం జగన్ అమలు చేస్తున్నారు: లక్ష్మీపార్వతి
-
తెలుగు అకాడమీ ఆధ్వర్యం లో ఉగాది వేడుకలు
-
చంద్రబాబు నిజ స్వరూపం మరోసారి బయట పడింది : లక్ష్మిపార్వతి
-
చంద్రబాబు ప్రజల్ని పీల్చి పిప్పి చేశారు
తిరుపతి తుడా/చిల్లకూరు: చంద్రబాబు స్వలాభం కోసం టీడీపీని సర్వనాశనం చేశారని వైఎస్సార్సీపీ నేత, ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. ఆదివారం తిరుపతిలో పలు డివిజన్లలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డితో కలసి ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్ధించారు. ఆమె మాట్లాడుతూ గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి దెబ్బకు పదేళ్లు ఇంటికే పరిమితమైన చంద్రబాబు ఒక శాతం అధిక ఓట్లతో 2014లో సీఎం అయ్యాడని, ఆ ఐదేళ్లు ప్రజలను పీడించి పిప్పిచేశారని విమర్శించారు. కొడుకు లోకేష్ను రాజకీయాల్లోకి తెచ్చి అవినీతితో లక్షకోట్లు సంపాదించారని ఆరోపించారు. ఎన్టీఆర్ పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన టీడీపీని సర్వనాశనం చేశారని, తన సంపాదన కోసం పార్టీని అడ్డుపెట్టుకున్నారని విమర్శించారు. గురుమూర్తికి మద్దతుగా ప్రచారంలో పాల్గొనేందుకు చిల్లకూరు మండలంలోని మోమిడిలోని వేమారెడ్డి కుమారస్వామిరెడ్డి నివాసానికి చేరుకున్న లక్ష్మీపార్వతి విలేకరులతో మాట్లాడారు. పవన్ రోడ్షోలో తిరుమల పవిత్రతపై లేనిపోనివి మాట్లాడారన్నారు. -
చంద్రబాబు కారణంగా వ్యవస్థ భ్రష్టుపడుతుంది
ఒంగోలు: చంద్రబాబు కారణంగానే వ్యవస్థ భ్రష్టుపడుతుందని , ప్రజల కోసం మనమా లేక మనకోసం ప్రజలా అనే పరిస్థితి నేడు నెలకొందని ఏపీ సాహిత్య అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. ఆదివారం ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో సాహిత్య కార్యక్రమానికి హాజరైన ఆమె కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ జీవించి ఉన్నప్పుడు నిమ్మగడ్డ ఎంతో మంచిగా ఉండే వారని, తనకు అతని గురించి బాగా తెలుసన్నారు. కానీ నేడు రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి చంద్రబాబు చేతిలో పావుగా మారడం బాధాకరమని, ఈ సమయంలో నిమ్మగడ్డ తెలివి తేటలు ఏమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నో ఏళ్లపాటు సంపాదించుకున్న మంచి పేరు మొత్తం ప్రస్తుతం కోల్పోతున్నారని, ఇప్పటికైనా మంచి వ్యవస్థకు నాంది పలికేందుకు చంద్రబాబు కబంద హస్తాల నుంచి బయటకు రావాలని నిమ్మగడ్డకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకునే పరిస్థితులు ఉండవని, ఆయన అనుకున్నదే నిజం చేయాలనుకుంటారన్నారు. అధికారంలో ఉన్నన్నాళ్లు అవినీతి, అక్రమాలు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీచ రాజకీయాలు చంద్రబాబు నైజం అన్నారు. భారత దేశం లౌకిక రాజ్యం అని, సర్వమతాలు సమానమే అన్నారు. చంద్రబాబు నీచ, క్షుద్ర రాజకీయాలకు నిదర్శనంగా దేవుళ్లను కూడా రాజకీయాల్లోకి లాగారని , ఒక వైపు హిందువును అంటూనే మరో వైపు హిందూ విగ్రహాలను ధ్వంసం చేయమని ఎవరైనా చెబుతారా , అలా చెబితే వారు హిందూ ద్రోహి అవుతారు తప్ప హిందువు కారన్నారు. ఇటువంటి వ్యక్తులను బీజేపీ సైతం దూరంగా ఉంచడం మంచిదని ఆ పారీ్టకి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. మరో వైపు జగన్మోహన్రెడ్డి కుటుంబ వ్యవహారాల గురించి రాసిన వారు చంద్రబాబు , భువనేశ్వరి పలుక్కోవడం లేదు, చంద్రబాబుకు భోజనం కూడా పెట్టడం లేదు అంటే దీనిని ఆయన నిరూపించుకుంటారా అని ప్రశ్నించారు. ఏ కుటుంబం గురించి అయినా విమర్శించడం సరికాదన్నారు. -
బాబు అక్రమాస్తుల కేసులో తీర్పు వాయిదా
సాక్షి, హైదరాబాద్: మాజీ సీఎం చంద్రబాబు అక్రమాస్తులపై ఏసీబీ విచారణకు ఆదేశించాలని ఏపీ తెలుగు అకాడమీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్పై తీర్పు నవంబర్ 24కు వాయిదాపడింది. సీఎంగా ఉన్న సమయంలో భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టారని, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన నేపథ్యంలో ఏసీబీ విచారణకు ఆదేశించాలని లక్ష్మీపార్వతి 2005లో ఏసీబీ కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ నిలిపి వేయాలంటూ బాబు హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు పొందారు. -
చంద్రబాబు వల్లే ఎన్టీఆర్ మరణించారు
కావలి: తెలుగు ప్రజల అభిమాన నటుడు నందమూరి తారక రామారావు చంద్రబాబు నాయుడి దుర్మార్గమైన కుట్రల వల్లే మరణించారని ఎన్టీఆర్ సతీమణి, తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని ముసునూరు గ్రామంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం విగ్రహాన్ని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. అధికార దాహంతో చంద్రబాబు కుట్రలో భాగస్వాములైన టీడీపీ నేతలందరూ ఎన్టీఆర్కు ద్రోహం చేసిన వారేనన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఓట్ల కోసం ఎన్టీఆర్ పేరు వాడుకుంటారని, అనంతరం ఏ సందర్భంలో కూడా ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకురాని దుష్టుడని మండిపడ్డారు. తాను చంద్రబాబు నాయుడుపై 20 ఏళ్లుగా చేస్తున్న పోరాటానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ద్వారా ఫలితం దక్కిందని చెప్పారు. అందరి సంక్షేమాన్ని కోరుకుంటూ పలు పథకాలు అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్ మరో 30 ఏళ్లు సీఎంగా కొనసాగుతారని లక్ష్మీపార్వతి చెప్పారు. -
చంద్రబాబుని జైలుకి పంపేవరకూ పోరాడతా..
సాక్షి, నెల్లూరు: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును జైలుకు పంపేవరకూ తాను వదిలేది లేదని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానించారు. చంద్రబాబు అక్రమ ఆస్తుల కేసుపై ఆమె శుక్రవారమిక్కడ మాట్లాడుతూ.. ‘న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. ఏసీబీ కోర్టులో న్యాయం జరక్కపోతే హైకోర్టుకు వెళతాను. అక్కడ కూడా న్యాయం దక్కకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా. కేసు విత్డ్రా చేసుకోమని గతంలో చంద్రబాబు నాకు ఫోన్ చేసి ఒత్తిడి చేశారు’ అని తెలిపారు. చంద్రబాబు అక్రమాస్తుల కేసు విచారణ 21కి వాయిదా సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్రమాస్తుల కేసు విచారణ ఈ నెల 21కి వాయిదా పడింది. చంద్రబాబుపై తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్పై హైదరాబాద్లోని ఏసీబీ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని, ఆయన ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలని లక్ష్మీ పార్వతి పిటిషన్లో పేర్కొన్నారు. ఆయనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయాలని కోరారు. చంద్రబాబుపై స్టే వేకెట్ అయిన వివరాలను ఆమె స్వయంగా కోర్టుకు సమర్పించారు. 1978 నుంచి 2005 వరకు బాబు ఆస్తుల వివరాలను ఆమె కోర్టు ముందుంచారు. కాగా 2004 ఎన్నికల అఫిడవిట్లో చంద్రబాబు చూపిన ఆస్తులుపై లక్ష్మీపార్వతి ఏసీబీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 1987 నుండి 2005 వరకు చంద్రబాబు అక్రమంగా తన వ్యక్తి గత ఆస్తులను పెంచుకున్నారంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏసీబీ కేసు కొనసాగుతున్న నేపథ్యంలో 2005లో హైకోర్టు నుండి చంద్రబాబు స్టే తెచ్చుకున్నారు. అయితే ఇటీవలే ఆ స్టే వెకేట్ అయింది. అలాగే నేతల కేసుల విచారణలో భాగంగా చంద్రబాబు అక్రమాస్తుల కేసు మళ్లీ తెరమీదకు వచ్చింది. ప్రజా ప్రతినిధుల కేసుల విచారణలో భాగంగా దర్యాప్తు ముమ్మరం కానుంది. -
సోనియా తిరుమల వచ్చినప్పుడు డిక్లరేషన్ అడిగారా!
సాక్షి, అమరావతి: తిరుమలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి డిక్లరేషన్ విషయంలో విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై తెలుగు అకాడమీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ నేత నందమూరి లక్ష్మీ పార్వతి విరుచుకుపడ్డారు. ప్రతి ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళంతా ఖాళీగా ఉంటూ ప్రభుత్వంపై అర్థం లేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. డిక్లరేషన్ పేరుతో అనవసరంగా ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద బురద చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు విపక్షాలకు పట్టడం లేదని విమర్శించిన లక్ష్మీ పార్వతి.. మతం పేరుతో ప్రజలని రెచ్చగొట్టాలని చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ కల్చర్లో ఎటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారో అలాగే ఇప్పడు మతం పేరుతో రెచ్చగొడుతున్నారన్నారు. (‘ఆ స్కామ్లో లోకేష్ అడ్డంగా దొరికారు’) చంద్రబాబు కాంగ్రెస్ నుండి వచ్చారు కాబట్టి కాంగ్రెస్ సంప్రదాయాలను ఇంకా మర్చిపోలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ, టీడీపీ నేతలు రాష్ట్రంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. టీడీపీ నేతలు మాట్లాడినట్లే బీజేపీ నాయకులు మూర్ఖంగా మాట్లాడుతున్నారని, హిందూ సంప్రదాయం చంద్రబాబు ఎప్పుడు పాటించారో చెప్పాలని డిమాండ్ చేశారు. హిందూ మతం పట్ల చంద్రబాబు నమ్మకం ఉంటే ప్రజలకు నిరూపించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి డిక్లరేషన్ గురించి మాట్లాడే వారు సోనియా గాంధీ తిరుమల వచ్చినప్పుడు డిక్లరేషన్ అడిగారా అని ప్రశ్నించారు. కాషాయం వేసిన మూర్ఖులు అంతా ఒక చోట చేరారని,, హిందూ అనేది ఒక మతం కాదని, హిందూ అనేది ఒక ధర్మం అన్నారు. మతం పేరు చెప్పి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. (మనసు చంపుకొని టీడీపీలో ఉండలేకపోయా..) ‘లోకేష్ను ముఖ్యమంత్రిని చెయ్యడం కోసం భువనేశ్వరి క్షుద్ర పూజలు చేసింది. అమ్మవారి దేవాలయంలో అర్థరాత్రి క్షుద్ర పూజలు చేయించిన దుర్మార్గురాలు చంద్రబాబు భార్య. బీజేపీకి అస్సలు చిత్తశుద్ధి ఉంటే గతం సంవత్సరంలో కూడా జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. అప్పుడు లేని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తారు. భువనేశ్వరి, లోకేష్ కోసం చేసిన క్షుద్ర పూజల గురించి బీజేపీ నేతలు అడగాలి. ముఖ్యమంత్రికి రాష్ట్రంపై సర్వ హక్కులు ఉంటాయి. రాజు విష్ణువుతో సమానమని పురాణాలు చెప్తున్నాయి. రాజుకు మతాలు అంటగట్టడం దారుణం. బీజేపీ, టీడీపీ నేతలు డిక్లరేషన్ గురించి వాస్తవాలు మాట్లాడాలి. జగన్ ఎప్పుడో హిందువుగా మారారు. గతంలో స్వరూపానంద జగన్మోహన్రెడ్డిని తీసుకొని గంగా నదిలో పూజలు చేయించారు. గంగా నదిలో మూడు మునకలు మునిగి హిందువుగా మారారు. అలా అని క్రిస్టియానీటిని పక్కన పెట్టినట్లు కాదు. (అందుకే సీబీఐ విచారణ కోరుతున్నాం) కొందరు స్వామీజీలు కాషాయం ధరించి రాజకీయాలు చేస్తున్నారు. ముస్లింగా ఉన్న కరీం దాసు, బిబి నాంచారి ఎవరో స్వామిజీలకు తెలీదా. మతం పేరుతో ప్రజలలో హింసను రెచ్చగొట్టి మధ్య యుగంలోకి నెడతారా. కుహనా హిందువులను హెచ్చరిస్తున్నా అవాస్తవాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. సమాజానికి కావాల్సింది విద్యా, వైద్యం కానీ మతం, కులం కాదు. ఇప్పటికైనా రాజకీయ పక్షాలు అభివృద్ధి, సంక్షేమం కోసం పని చేయాలి. డిక్లరేషన్ పై బహిరంగ చర్చకు ఎవరితో అయిన నేను సిద్ధం. హిందూ సంప్రదాయం, పురాణాలపై నాకు పూర్తి అవగాహన ఉంది. నేను ఖురాన్, బైబిల్, భగవద్గీతను నేను చదివాను. సర్వమతాలను నేను ఆరాధిస్తాను’ అని లక్ష్మీ పార్వతి అన్నారు. -
బాబు అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి
సాక్షి, అమరావతి: చంద్రబాబుకు దమ్ము, ధైర్యం, వ్యవస్థల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆయన చేసిన అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణకు సిద్ధపడాలని ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి సవాలు విసిరారు. గతంలో తాను చంద్రబాబు అక్రమాలపై వేసిన కేసును 14 ఏళ్లపాటు స్టేలతో అడ్డుకున్నారని తెలిపారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో లక్ష్మీపార్వతి మాట్లాడారు. ఆమె ఇంకా ఏమన్నారంటే... ► చంద్రబాబు అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాస్తున్నాను. ఈ మేరకు నా విజ్ఞప్తిని అంగీకరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, న్యాయ వ్యవస్థకు కూడా లేఖ రాస్తున్నా. దీనిపై ప్రధాని స్పందించి విచారణకు ఆదేశించాలి. ► చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ను అవినీతిమయం చేసి ఏటీఎంగా మార్చారన్న ప్రధాని.. గత ప్రభుత్వ అవినీతిని ఎత్తి చూపించారు. ► ఇప్పుడైనా ఆ అవినీతిపై విచారణకు ఆదేశించాల్సిన బాధ్యత ప్రధానిపై ఉంది. ► ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేశారో బాబు స్పష్టం చేయాలి. కనీస ఆధారాలే లేకుండా ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రధానికి బాబు లేఖ ఎలా రాస్తారు. ► చంద్రబాబు అవినీతి సామ్రాజ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయం ముసుగులో బాబు వ్యవస్థలను దోపిడీ చేస్తున్నారు. -
చంద్రబాబు ఎప్పుడూ సొంత బలంపై నెగ్గలేదు
-
ఎన్టీఆర్కు నివాళులర్పించిన లక్ష్మీపార్వతి
-
‘ఆయన డైరెక్షన్లోనే ఆ దాడి జరిగింది’
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర, రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేశారని తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి విమర్శించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు స్క్రిప్టునే కాంగ్రెస్ నేతలు చదువుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు డైరెక్షన్లోనే ఎంపీ నందిగం సురేష్పై దాడి చేశారని మండిపడ్డారు. అమరావతి రైతులను మోసం చేసింది చంద్రబాబేనని.. అమరావతి రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి న్యాయం చేస్తున్నారని తెలిపారు. రైతుల సంక్షేమానికి సీఎం జగన్ అనేక పథకాలు తీసుకొచ్చారని చెప్పారు. (ఉరిమిన ఉత్తరాంధ్ర) విశాఖపై ఎల్లోమీడియాతో చంద్రబాబు దుష్ప్రచారం చేయించారని ధ్వజమెత్తారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ను చంద్రబాబు అడ్డుకున్నారని.. అందుకే విశాఖ ప్రజలు ఆయనను అడ్డుకున్నారని తెలిపారు. చంద్రబాబు అవినీతి పరుడు, స్వార్థపరుడని.. సొంత మామకే వెన్నుపోటు పొడిచి చెప్పులు వేయించారని మండిపడ్డారు. ఇవాళ ప్రజలే చంద్రబాబుపై చెప్పులు వేస్తున్నారని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. -
శారదాపీఠాన్ని సందర్శించిన లక్ష్మీ పార్వతి
-
నిర్మల్ కొయ్యబొమ్మల నేపథ్యంలో...
తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న లక్ష్మీ పార్వతి తొలిసారి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘రాధాకృష్ణ’. అనురాగ్, ముస్కాన్ శెట్టి జంటగా నటించారు. ప్రసాద్ వర్మ దర్శకత్వం వహించారు. దర్శకుడు ‘ఢమరుకం’ శ్రీనివాస్ రెడ్డి సమర్పణలో హరిణి ఆరాధ్య క్రియేషన్స్ పతాకంపై పుప్పాల సాగరిక, శ్రీనివాస్ కానూరు నిర్మించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘కనుమరుగవుతున్న నిర్మల్ కొయ్య బొమ్మల కథ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. అందరి హృదయాలను హత్తుకునే ఆప్యాయతలు ఉంటాయి. పల్లె వాతావరణంలోని అన్ని రకాల భావోద్వేగాలతో కూడిన ఒక అందమైన ప్రేమకథ ఇది. ఎక్కడా రాజీ పడకుండా అనుకున్న విధంగా చిత్రీకరించాం. నిర్మాణానంతర కార్యక్రమాలు అతి త్వరలో పూర్తి చేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. సంపూర్ణేష్ బాబు, అలీ , కృష్ణ భగవాన్, చమ్మక్ చంద్ర ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరా: టి.సురేందర్ రెడ్డి, సంగీతం: ఎమ్.ఎమ్.శ్రీలేఖ. -
‘వారు జైలుకెళ్లితే చూడాలని ఉంది’
సాక్షి, రాజమండ్రి: గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రాన్ని పడిపడి దోచుకున్నారని తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి విమర్శించారు. సోమవారం ఆమె తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ భూములపై గత ప్రభుత్వం సిట్ వేసి చిన్న ఉద్యోగులను బలిచేశారన్నారు. సీఎం వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన సిట్ ద్వారా వాస్తవాలు వెల్లడవుతాయన్నారు. సిట్ అధికారులు, కేంద్ర బృందాలు సమన్వయంతో పకడ్బందీగా పనిచేస్తారని తెలిపారు. ‘చంద్రబాబు, అచ్చెన్నాయుడు, సుజనా నాయుడు జైలుకి వెళ్లడం చూడాలని ఉంది. మళ్లీ తాను అధికారంలోకి వస్తే చంద్రబాబుని అండమాన్ జైలు పంపించాలని ఉందని ఎన్టీఆర్ అంటుండే వారు. ఆ రోజులు త్వరలోనే వస్తాయని ఆశిస్తున్నా’ అంటూ లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు తెలుగుకు పూర్వవైభవం తీసుకువస్తాం.. ప్రాచీన తెలుగుకు పూర్వవైభవం తీసుకువస్తామని లక్ష్మీపార్వతి తెలిపారు. తెలుగు సాహిత్య పీఠాన్ని యూనివర్శిటీగా అభివృద్ధి చేస్తామన్నారు. ఆంగ్లంతో పాటు తెలుగును కచ్చితంగా బోధించాలని ప్రైవేటు విద్యాసంస్థలకు ఆదేశాలిచ్చామని పేర్కొన్నారు. తెలుగు అకాడమీ ద్వారా తెలుగు భాషాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. విద్యార్ధులను అన్నిరంగాలలో తీర్చిదిద్దడానికే తెలుగుతో పాటు ఆంగ్ల భాషకు సీఎం జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆమె తెలిపారు. ఆ స్థలాలను తీసుకోవడం లేదు: ఎంపీ మార్గాని భరత్ తెలుగు సాహిత్య పీఠం స్థలాన్ని పేదల ఇళ్ళ స్థలాలకు తీసుకోవడం లేదని ఎంపీ మార్గాని భరత్రామ్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు యూనివర్శిటీ అక్కడే ఉంటుందని.. విద్యార్థులు తక్కువ ఉన్నందున ఖాళీగా ఉన్న స్థలాన్ని అధికారులు పరిశీలించారంతేనని పేర్కొన్నారు. విద్యాసంస్థలు, దేవాదాయ శాఖ భూములు ఇళ్ల స్థలాలకు సేకరించవద్దని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు. తెలుగు యూనివర్శిటీకి పూర్వ వైభవం తీసుకువస్తామని చెప్పారు. త్వరలోనే వీసీని నియమిస్తామని సీఎం చెప్పారని తెలిపారు. తెలుగు యూనివర్శిటీలో జ్యోతిష్యం, వాస్తు వంటి విభాగాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తెలుగు యూనివర్శిటీలో 1.2 ఎకరాలను చంద్రబాబు హయాంలో ప్రైవేట్ గ్యాస్ సంస్థకు ఇచ్చారని ఎంపీ మార్గాని భరత్ తెలిపారు. -
చంద్రబాబు పాపం పండింది: లక్ష్మీ పార్వతి
-
‘విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు’
సాక్షి, అనంతపురం: వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం ప్రవేశపెడుతున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. గురువారం అనంతపురంలోని జేఎన్టీయూలో వైస్ చాన్సలర్ల టెక్ సదస్సును మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల పేద విద్యార్థులు లబ్ధి పొందుతున్నారని కొనియాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డైనమిక్ లీడర్ అని, ఆయన ప్రవేశపెట్టిన అమ్మ ఒడి చారిత్రాత్మక పథకమన్నారు. ఇక విద్యావ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తెస్తున్నామని తెలిపారు. రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ద్వారా అధిక ఫీజుల నియంత్రణ చేపడుతామని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో యూనివర్సిటీలు అస్తవ్యస్తం ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ.. దివంగత వైఎస్సార్, ఎన్టీఆర్ విద్యకు పెద్ద పీట వేశారన్నారు. కానీ చంద్రబాబు పాలనలో యూనివర్సిటీలు అస్తవ్యస్తంగా మారాయని పేర్కొన్నారు. సీఎం జగన్ విద్యాభివృద్ధికి నడుం బిగించారని, ఆయన విద్య వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం శుభపరిణామమని కొనియాడారు. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకునేందుకు ఇంగ్లిషు మీడియం దోహదపడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు, లక్ష్మీ పార్వతి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి, వివిధ రాష్ట్రాలకు చెందిన సాంకేతిక విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్లు పాల్గొన్నారు. -
చంద్రబాబు అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా
-
చంద్రబాబు అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్రమాస్తుల కేసుపై తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్పై హైదరాబాద్లోని ఏసీబీ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని, ఆయన ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలని లక్ష్మీ పార్వతి పిటిషన్లో పేర్కొన్నారు. ఆయనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయాలని కోరారు. చంద్రబాబుపై స్టే వేకెట్ అయిన వివరాలను ఆమె స్వయంగా కోర్టుకు సమర్పించారు. 1978 నుంచి 2005 వరకు బాబు ఆస్తుల వివరాలను ఆమె కోర్టు ముందుంచారు. (చదవండి : అమరావతి భూముల విషయంలో త్యాగమేముందీ..?) కేసు రిజిస్టర్ కాకముందే హైకోర్టు నుంచే స్టే ఎలా తెచ్చుకున్నారో తెలపాలని ఆమె కోర్టు ద్వారా ప్రశ్నించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా రూ.300 తీసుకున్న బాబు.. అక్రమంగా వేలకోట్ల రూపాయలు సంపాదించారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. చంద్రబాబు ఆస్తులపై సమగ్ర విచారణకు ఆదేశాలు ఇవ్వాలని ఆమె కోర్టును కోరారు. అయితే, హైకోర్టులో ఇప్పటికే ఈ కేసుపై స్టే ఉందని బాబు తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. దాంతో హైకోర్టు స్టే వివరాలను పరిశీలిస్తామని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. (చదవండి : ఆదాయం వేలల్లో.. కోట్లు ఎలా సంపాదించారు?) -
చంద్రబాబు అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారంటూ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి వేసిన అక్రమాస్తుల కేసు పిటిషన్పై శుక్రవారం ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. లక్ష్మీపార్వతి తరఫున సీనియర్ న్యాయవాది కోకా శ్రీనివాస్ కుమార్ వాదనలు వినిపించారు. చంద్రబాబు అధికారికంగా వెల్లడించిన ఆస్తుల వివరాల ఆధారంగానే తాము ఫిర్యాదు చేశామని కోర్టుకు తెలిపారు. రూ.వేలల్లో ఆదాయం ఉన్న చంద్రబాబు కొద్ది కాలానికే కోట్లకు ఎలా పడగెత్తారో వివరించలేదన్నారు. ‘పిల్లనిచ్చిన ఎన్టీఆర్ కూడా కట్నం ఇవ్వలేదని అధికారిక పత్రాల్లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు ఎన్నికల సమయంలో.. అసెంబ్లీకి ఇచ్చిన పత్రాల్లో ప్రస్తావించారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పొందిన జీతభత్యాలతోనే కోట్లాది రూపాయలు సంపాదించినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఎలా కూడగట్టారో తేల్చాల్సిన అవసరం ఉంది. హెరిటేజ్ కంపెనీ ఏర్పాటు చేశాక నెలకు రూ.20 వేలు చొప్పున ఐదు నెలలే తీసుకున్నట్లు చంద్రబాబు చెప్పారు. అలాంటప్పుడు కోట్ల రూపాయల ఆస్తిని ఎలా ఆర్జించారో తేల్చేందుకు తగిన ఉత్తర్వులివ్వాలి’ అని కోర్టును కోరారు. అయితే సాంకేతిక కారణాల వల్ల నేటికీ ఈ కేసులో స్టే ఉన్నట్లు వెబ్సైట్లో ఉండటంతో పూర్తి వివరాలు తెలుసుకుని వచ్చే విచారణ సమయంలో చెప్పాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేసింది. కేసు నేపథ్యం ఇదీ.. : ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో 2005లో చంద్రబాబుపై లక్ష్మీపార్వతి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై పూర్తిస్థాయిలో విచారణ ప్రారంభించక ముందే చంద్రబాబు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. తన వాదనలను సైతం వినాలని కోరారు. అయితే ఫిర్యాదును విచారణకు స్వీకరించడానికి ముందు దశలోనే వాదనలు వినడం సాధ్యంకాదని చంద్రబాబు అభ్యర్థనను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. దీనిపై చంద్రబాబు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసి స్టే పొందారు. సివిల్, క్రిమినల్ కేసుల్లో స్టే 6 నెలలకు మించకూడదని సుప్రీంకోర్టు గతేడాది ఇచ్చిన తీర్పు నేపథ్యంలో స్టే గడువు ముగిసింది. లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్పై ఏసీబీ కోర్టు గతేడాది నవంబర్ 18న విచారణ ప్రారంభించింది. -
చంద్రబాబు అక్రమాస్తుల కేసు; విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై విచారణ జరిపించాలని 14 ఏళ్ల క్రితం లక్ష్మీపార్వతి దాఖలు చేసిన ఫిర్యాదుపై హైదరాబాద్ ఏసీబీ కోర్టు మళ్లీ విచారణ ప్రారంభించింది. పిటిషన్పై విచారణకు సంబంధించి లక్ష్మీపార్వతి నుంచి ఆధారాలు సేకరించాలని అధికారులను ఏసీబీ కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 6కు వాయిదా వేసింది. గతంలో అప్పటి న్యాయమూర్తి డీఎస్ఆర్ వర్మ ఏసీబీ కోర్టులో విచారణకు సంబంధించి తదుపరి చర్యలు నిలిపేస్తూ స్టే ఉత్తర్వులిచ్చారు. అయితే స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ లక్ష్మీపార్వతి 2005లో దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. అప్పటి నుంచి కొనసాగుతూ వస్తున్న స్టే గడువు ముగియడంతో ఏసీబీ కోర్టు విచారణను పునఃప్రారంభించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం స్టే 10 సంవత్సరాలు దాటితే ఎత్తివేయబడుతుంది. -
పెద్దల సిద్ధాంతాలను కాపాడుకోవాలి
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాల పథకాలతో సుభిక్ష పాలన అందిస్తున్నారని తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. విజయవాడలో ఆదివారం జరిగిన ఏపీ రాష్ట్ర చాత్తద శ్రీ వైష్ణవ సంఘ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం, కార్తీక వన మహోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఐక్యమత్యం, అనుబంధంతో కార్తీక మహోత్సవం నిర్వహించడం శుభపరిణామన్నారు. పెద్దల సిద్ధాంతాలను కాపాడుకోవాలని లక్ష్మీపార్వతి పిలుపునిచ్చారు. రామానుజచార్యులు అష్టాక్షరీ మంత్రం అందరికీ అందించారన్నారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ, 13 జిల్లాల చాత్తాద శ్రీ వైష్ణవుల సంఘం సభ్యులు పాల్గొన్నారు. -
చంద్రబాబుకు ఏసీబీ కోర్టు షాక్
సాక్షి, అమరావతి : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు హైదరాబాద్ లోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక న్యాయస్థానం గట్టి షాక్ ఇచ్చింది. 14 ఏళ్ల క్రితం ఏసీబీ కోర్టులో లక్ష్మీపార్వతి దాఖలు చేసి న ఫిర్యాదుపై తదుపరి విచారణ చేపట్టేందుకు ఏసీబీ కోర్టు అంగీ కరించింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ కేసులో చంద్రబాబు స్టే గడువు ముగియడం, స్టే విష యంలో హైకోర్టు నుంచి ఎలాంటి పొడిగింపు లేకపోవడంతో కేసులో తదుపరి ప్రక్రియను ప్రారంభి స్తామని ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి సాంబశివరావు నాయుడు సోమ వారం లిఖితపూర్వక ఉత్తర్వులు జారీ చేశారు. ఫిర్యాదుదారుగా ఉన్నలక్ష్మీపార్వతి సాక్ష్యాన్ని నమోదు చేయాలని నిర్ణయించి తదుపరి విచారణను ఈ నెల 25కి కోర్టు వాయిదా వేసింది. సివిల్, క్రిమినల్ కేసుల్లో స్టే ఆరు నెలలకు మించకూడదని సుప్రీంకోర్టు గత ఏడాది ఇచ్చిన తీర్పును, చంద్రబాబు స్టే గడువు ముగిసిన విషయాన్ని, ఆ స్టేకు ఎలాంటి పొడిగింపు లేకపోవడాన్ని జడ్జి తన ఉత్తర్వుల్లో పొందుపరిచారు. విచారణ సందర్భంగా చంద్రబాబు తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ, తదుపరి ఉత్తర్వులు వెలువరించేంత వరకు 2005లో హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులు కొనసాగుతాయని వాదించారు. లక్ష్మీపార్వతి తరఫు న్యాయవాది సురేందర్రెడ్డి జోక్యం చేసుకుంటూ, సివిల్, క్రిమినల్ కేసుల్లో స్టే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేశారు. ఆ స్టే పొడిగింపు ఉత్తర్వులు లేవని కోర్టుకు వివరించారు. పూర్వాపరాలు పరిశీలించి.. ఈ కేసు ప్రస్తుత దశలో చంద్రబాబు తరఫు న్యాయవాది వాదనలు వినిపించేందుకు నిబంధనలు అంగీకరించవని లక్ష్మీపార్వతి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 2005 మార్చి 14న అప్పట్లో ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జడ్జి పరిశీలించారు. కేసు విచారణకు స్వీకరించడానికి ముందు దశలో చంద్రబాబు తరఫు న్యాయవాది వాదనలు వినిపించేందుకు వీలులేదన్న ఆ ఉత్తర్వుల్ని జడ్జి పరిగణనలోకి తీసుకున్నారు. 2005లో హైకోర్టు ఇచ్చిన స్టేను పొడిగించని విషయాన్ని, ఈ విషయాన్ని చంద్రబాబు తరఫు న్యాయవాది నిర్ధారించిన విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో, చంద్రబాబు 2005లో తెచ్చుకున్న స్టేను పొడిగిస్తూ హైకోర్టు ఎలాంటి లిఖితపూర్వక ఉత్తర్వులు ఇవ్వలేదని జడ్జి గుర్తు చేశారు. అందువల్ల ఈ కేసులో తదుపరి ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. 14 ఏళ్లుగా కొనసాగుతున్న స్టే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని, దీనిపై ఏసీబీ విచారణకు ఆదేశించాలని కోరుతూ లక్ష్మీపార్వతి 2005లో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ ఫిర్యాదుపై పూర్తిస్థాయి విచారణ ప్రారంభించక ముందే చంద్రబాబు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఫిర్యాదును స్వీకరించడానికి ముందే వాదనలు వినడం సాధ్యం కాదంటూ చంద్రబాబు అభ్యర్థనను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. దీనిపై ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కింది కోర్టు ఉత్తర్వులు సవాలు చేస్తున్నప్పుడు క్రిమినల్ పిటిషన్ దాఖలు చేయడం పరిపాటి.. అయితే చంద్రబాబు రిట్ పిటిషన్ దాఖలు చేయడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఆ పిటిషన్పై విచారణ జరిపిన అప్పటి న్యాయమూర్తి డీఎస్ఆర్ వర్మ ఏసీబీ కోర్టులో విచారణకు సంబంధించిన తదుపరి చర్యలు నిలిపేస్తూ 2005లోనే స్టే ఉత్తర్వులిచ్చారు. స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ లక్ష్మీపార్వతి అనుబంధ పిటిషన్ దాఖలు చేయగా, దానిని హైకోర్టు కొట్టేసింది. అప్పటి నుంచి స్టే కొనసాగుతూ వస్తోంది. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఇటీవల ఈ కేసు ఏసీబీ కోర్టు ముందుకు విచారణకొచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో స్టే లేనట్లేనని భావిస్తూ విచారణ కొనసాగింపునకు జడ్జి గోవర్థన్రెడ్డి నిర్ణయించారు. లక్ష్మీపార్వతి హాజరుకు ఆదేశాలిచ్చి విచారణ వాయిదా వేశారు. ఆ తరువాత కొద్దిరోజులకే గోవర్థన్రెడ్డి బదిలీ అయ్యారు. -
ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా విమర్శలా?
సాక్షి, అమరావతి : చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి విలయతాండవం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి ధ్వజమెత్తారు. అవినీతికి పాల్పడిన చంద్రబాబు, లోకేష్లు రహస్యంగా వందల జీఓలు విడుదల చేశారని విమర్శించారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కార్యలయంలో ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబుకు ఎంత వయస్సు వచ్చింది అనేది కాదు.. ఎంత బుద్ది వచ్చిందనేది ఆలోచించాలని హితవు పలికారు. ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ పునిహితో అనే వ్యక్తి సైతం టీడీపీ హయాంలో ఏపీలో పరిస్థితులు అతి దారుణంగా ఉన్నాయని, దీనికంటే బిహార్ ఎంతో నయం అని వ్యాఖ్యలు చేశారని ప్రస్తావించారు. అవినీతి ద్వారా రాష్ట్రంలో సంపాదించిన డబ్బంతా ప్రయాణాల పేరుతో విదేశాలకు తరలించారని ఆరోపించారు. చంద్రబాబు రూ. 6,17,585.19 కోట్ల అవినీతికి పాల్పడ్డాడని వైఎస్సార్సీపీ పుస్తకం కూడా విడుదల చేసిందన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ కూడా ఒక నివేదిక ఇచ్చిందన్నారు .అవినీతి చక్రవర్తి చంద్రబాబుపై విచారణ చేయాలని రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్లకు లేఖ రాస్తానన్నారు. ఆమె మాట్లాడుతూ.. ‘మొదటినుంచి బాబు అవినీతి పరుడే. ఆయన అవినీతిపై అప్పటి విపక్షాలు కూడా పోరాటం చేశాయి. చంద్రబాబు అవినీతి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తిని నేనే. గతంలో ఆయనపై కేసు కూడా వేశాను. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని ఏకంగా ప్రధానమంత్రి సైతం వ్యాఖ్యనించారు. చంద్రబాబు అవినీతిపై రాష్ట్రపతి, గవర్నర్, ప్రధానమంత్రికి లేఖలు రాయాలని నిర్ణయించుకున్నాను. చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో కేసు నడుస్తోంది. పోలవరంపై వైఎస్సార్ర్సీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్కు వెళ్తే రూ. 800 కోట్లు ఆదా అయ్యింది. అంత చిన్న అంశంపై ఇంత మిగిలితే.. మిగిలిన అంశాల్లో బాబు దోపిడి ఎంత ఉందో అర్ధం చేసుకోవాలి.. ఇన్ని దోపిడీలు చేసి మీరు ఎలా తిరుగుతున్నారు మీపై చర్యలు ఉండవా’ అని బాబును ప్రశ్నించారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు, లోకేష్, పవన్.. ఐదు నెలల్లో ఇంత పారదర్శకపాలన దేశంలో ఎక్కడ జరిగిందో చూపించాలని లక్ష్మీపార్వతి వారికి సవాలు విసిరారు. అవినీతిపై నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉక్కుపాదం మోపుతున్నారని పేర్కొన్నారు. పేద ప్రజల గుండెల్లో వైఎస్ జగన్ గూడు కట్టుకున్నారని, ఐదు నెలల్లోనే ఎన్నో సంక్షేమ పథకాలకు ఊపిరి పోశారని ఆమె తెలిపారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం జగన్ అవినీతికి తావు లేకుండా పారదర్శకమైన పరిపాలన అందిస్తున్నారని అన్నారు. ప్రజలు తిరస్కరించినా బాబుకు బుద్ది రాలేదు. చంద్రబాబు దెయ్యంలా ప్రవర్తిస్తున్నారని, గతంలో బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి మోసం చేశారని విమర్శించారు. తమ ఓట్లతో ప్రజలు తిరస్కరించినా చంద్రబాబుకు బుద్ది రాలేదని, రాజకీయాలకు బాబు చీడపురుగు అని వ్యాఖ్యనించారు. మొదట ఎన్టీఆర్ అనేక సంక్షేమ పథకాలు చేపట్టారని, ఆ తరువాత వైఎస్ రాజశేఖరరెడ్డి మంచి పాలనను అందించారని.. నేడు సీఎం వైఎస్ జగన్ సంక్షేమ రాజ్యం దిశగా పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కంటే ముఖ్యమంత్రి అధిక పొదుపు చర్యలు చేపడుతున్నారన్నారు. ప్రతి జనవరిలో ఉద్యోగాల భర్తీ చేపడతామని సీఎం జగన్ ప్రకటించడం నిరుద్యోగులకు పండగ వంటిదని ఆమె పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీని బలోపేతం చేశారని, ఇతర రాష్ట్రాల్లో సైతం ఆరోగ్యసేవలు అందేలా చేశారని అన్నారు. ఆటోడ్రైవర్లకు పదివేల రూపాయలు అందించారని సీఎం జగన్ పాలనను ప్రశంసించారు. విషవృక్షం కింద నిలబడ్డావు దోపిడి దొంగలతో చేరి నీతులు చెబుతావా అంటూ జనసేన అధక్షుడు పవన్ కల్యాణ్ను ఆమె ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ నీ ఆదర్శం ఏంటో చెప్పాలని, కనీసం నువ్వు చేసే పని నీకైనా అర్థం అవుతుందా అని లక్ష్మీ పార్వతి ప్రశ్నించారు. ‘రెండు సీట్లలో పోటీ చేస్తే రెండు చోట్ల ఓడిపోయావు. నీవు వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ఆయననే విమర్శిస్తావు. సీఎం జగన్ ను చూసి నేర్చుకో. ఆయన వన్ మెన్ ఆర్మీలా ఉన్నారు. అందుకే ప్రజలు నమ్మి అధికారం అందించారు. అదే నాయకత్వం అంటే. అవినీతి చక్రవర్తి చంద్రబాబుతో పవన్ దోస్తీ సరికాదు. నీవు విషవృక్షం కింద నిలబడ్డావు. నీవు ఎప్పటికీ ఎదగలేవు. కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసులు బనాయించిన వైఎస్ జగన్ వెనకడుగు వేయలేదు. ప్రజలను మాత్రమే నమ్మాడు. నదులు నిండిపారుతున్నాయి. ఎవరు నిజమైన నాయకుడో ప్రకృతే చెప్పింది. ఇలాంటి పరిస్దితిలో ఇసుక తీయడం సాధ్యమేనా. ఇసుక మా వాళ్లు దోపిడీ చేస్తున్నారా.. ఒక్కరినైనా పట్టివ్వు నీవు చేప్పేది వాస్తవమో కాదో తెలిసిపోతుంది.‘ అని లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానించారు. -
ఓర్వలేకే విమర్శలు
సాక్షి, అమరావతి: అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర హామీలను నెరవేరుస్తూ జనరంజకంగా పాలిస్తుంటే ప్రతిపక్ష చంద్రబాబు అక్కసుతో అర్థం లేని విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో ముఖ్యమంత్రి జగన్ పాలన సాగుతోందన్నారు. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు తీరును తీవ్రంగా తప్పు బట్టారు. ఒకేదఫాలో 4 లక్షలకు పైగా ఉద్యోగాల భర్తీ, ఆర్టీసీ విలీనానికి చర్యలు, ఆశా వర్కర్ల జీతాల పెంపు, వృద్ధాప్య పింఛన్ల పెంపు లాంటివి ఎన్నో నాలుగు నెలల్లోనే సీఎం జగన్ అమలు చేసి చూపారన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి పథకాలను నేరుగా పేదల ఇళ్లకే చేరవేసేందుకు ముఖ్యమంత్రి జగన్ తాపత్రయ పడుతుంటే చంద్రబాబు ఓర్వలేక అక్కసు వెళ్లగక్కుతున్నారని దుయ్యబట్టారు. రూ.6 లక్షల కోట్ల మేర అవినీతి, కుంభకోణాలకు పాల్పడిన చంద్రబాబుకు ముఖ్యమంత్రిని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. సరిగ్గా మాట్లాడటం కూడా రాని లోకేష్ ట్విట్టర్ బాబుగా పేరు తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. బాబుకు ఆస్కార్ ఇవ్వొచ్చని ఎన్టీఆరే అన్నారు.. స్పీకర్ పదవికి మచ్చ తెచ్చిన కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకుంటే శవ రాజకీయం చేసిన చంద్రబాబు ఆయన జీవించి ఉండగా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. చంద్రబాబు నీచమైన కుట్రలకు ఎల్లో మీడియా వంత పాడుతోందన్నారు. మాజీ ముఖ్యమంత్రి భార్యనైన తనపై నాడు రెండు చానెళ్లతో చంద్రబాబు తీవ్ర దుష్ప్రచారం చేయించారని చెప్పారు. కరకట్టపై చంద్రబాబు ఉంటున్న అక్రమ నివాసం ఆయనకు ఏమైనా వారసత్వంగా వచ్చిందా? అని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. చంద్రబాబు – లింగమనేని రమేష్కు మధ్య ఉన్న రహస్యాలన్నీ తేటతెల్లం అయిపోయాయన్నారు. రమేష్ భూములు సీఆర్డీఏ పరిధిలోకి రాకుండా చంద్రబాబు సాయం చేశారని చెప్పారు. నిజంగా చంద్రబాబుకు సెంటు భూమి కూడా లేకుంటే చందాలు వేసుకుని తన అల్లుడికి 200 గజాల్లో ఇల్లు కట్టించి ఇవ్వడానికి అత్తగా సిద్ధంగా ఉన్నానని వ్యంగ్యంగా అన్నారు. చంద్రబాబుకు నటనలో ఆస్కార్ అవార్డు ఇవ్వవచ్చని దివంగత ఎన్టీఆరే స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. -
‘రాజధానిని మారుస్తామని ఎవరూ అనలేదు’
సాక్షి, విశాఖపట్నం: రాజధానిని మారుస్తామని మంత్రులెవరూ వ్యాఖ్యలు చెయ్యకపోయినా కొందరు టీడీపీ, బీజేపీ నేతలు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. అమరావతి నిర్మాణంలో ల్యాండ్ పూలింగ్ పేరుతో తన బినామీలు, బంధువులకు తక్కువరేట్లకే ముట్టజెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు రాజధానిని దొనకొండకు మారుస్తున్నారని, ఇన్ సైడర్ ట్రేడింగ్కు పాల్పడుతున్నారని ఆరోపించడం దారుణమన్నారు. రాజధాని నిర్మాణంలో అవినీతి జరిగిందని, వికేంద్రీకరణ జరగాలనే ఆలోచనలో సీఎం వైఎస్ జగన్ ఉన్నారన్నారు. బాబు బినామీలైన కొందరు బీజేపీలో చేరి రాజధాని మారుస్తున్నారనే దుష్ప్రచారాలు పుట్టిస్తున్నారన్నారు. బాబు బినామీలు సుజనాచౌదరి, మురళీమోహన్లతో పాటు అయినవారికి వేల ఎకరాలు కట్టబెట్టిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. -
దొనకొండకు రాజధాని అని ఎవరు చెప్పారు?
సాక్షి, విశాఖపట్నం: రైతుల దృష్టి మరల్చేందుకే రాజధానిని మార్పు చేస్తున్నారని టీడీపీ ప్రచారం చేస్తుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. బుధవారం విశాఖ వైఎస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన మహిళా విభాగాల ప్రతినిధుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..దొనకొండకు రాజధాని మార్చుతున్నారని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్ రాజధాని మార్చుతామని ఎప్పుడూ చెప్పలేదన్నారు. రాజధాని నిర్మాణం పేరిట చంద్రబాబు అండ్ కో.. రైతుల భూములను బలవంతంగా లాగేశారన్నారు. ట్రేడింగ్ చేసేది వాళ్లే... దొనకొండలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరుగుతోందని చంద్రబాబు అంటున్నారని..ఆ ట్రేడింగ్ చేసేది చంద్రబాబు,ఆయన కుమారుడు లోకేషేనని విమర్శించారు. విశ్వ రాజధాని నిర్మిస్తున్నామని చంద్రబాబు చెప్పినా కూడా అక్కడ ప్రజలు ఎందుకు ఓడించారని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం పేరిట రైతుల భూములను బలవంతంగా లాక్కురన్నారని మండిపడ్డారు. రైతుల దృష్టిని మరల్చేందుకే రాజధాని దుమారం లేపారని వ్యాఖ్యనించారు. అందరూ చెప్పుకుంటున్నారు.. బాలకృష్ణ వియ్యంకుడు ఎకరం భూమి లక్ష రూపాయలకు లాగేసినట్టు జనం అందరూ చెప్పుకుంటున్నారని వ్యాఖ్యనించారు. నిరుద్యోగులను భృతి పేరిట చంద్రబాబు మోసం చేస్తే..ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామ సచివాలయాలు ద్వారా ఉద్యోగాలు ఇచ్చి ఆదుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం ఆఖరి రోజుల్లో రెండు వేల కోట్ల నిధులు కూడా మళ్లించారని విమర్శించారు. గతంలో చంద్రబాబు, కిరణ్కుమార్ రెడ్డి కుమ్మక్కై పాలన సాగించారని..అదే సమయంలో బాలకృష్ణ అల్లుడికి భూమి కేటాయించారన్నారు. ఎకరం లక్ష రూపాయలకు భూమి కేటాయింపు ఎలా జరిగిందో..టీడీపీ నాయకులే సమాధానం చెప్పాలన్నారు. గత ప్రభుత్వం అన్ని శాఖలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. అక్షరాస్యతలో దేశంలోనే నెంబర్వన్గా ఆంధ్రప్రదేశ్ను నిలపడానికి అమ్మఒడిని సీఎం జగన్ ప్రారంభించారని వెల్లడించారు. కార్యక్రమంలో అనుబంధ సంఘాల ప్రతినిధులు యువశ్రీ, సాగరీక, శ్రీదేవి వర్మ, పీలా ఉమా రాణి, రాధ, గొలగాని లక్ష్మీ పాల్గొన్నారు. -
లోకేశ్ను పక్కనపెడితేనే: లక్ష్మీపార్వతి
సాక్షి, తిరుమల : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు, మాజీమంత్రి నారా లోకేశ్పై లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం లక్ష్మీపార్వతి మాట్లాడుతూ..‘లోకేశ్ ఎంత మాట్లాడితే టీడీపీ అంత భ్రష్టు పడుతుంది. తెలుగుదేశం పార్టీ బాగుపడాలి అంటే లోకేశ్ను పక్కన పెట్టాలి. మహిళలను కించపరిచేలా లోకేశ్ మరోసారి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ప్రజా పరిపాలన సాగుతోంది. ఇల్లు బాగు చేస్తూంటే ఎలుకలు ఏడ్చిన చందంగా ప్రతిపక్షం వ్యవహరిస్తోంది’ అని దుయ్యబట్టారు. శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు కాగా పలువురు ప్రముఖులు ఇవాళ స్వామివారిని దర్శించుకున్నారు. తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుపరిపాలన అందించాలని కోరుకున్నట్లు చెప్పారు. శ్రీవారి ఆశీస్సులతో రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. మరోవైపు ఎమ్మెల్యేలు ద్వారకానాథ్రెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డి, లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాత రాకేశ్ రెడ్డి, రచయిత చిన్నికృష్ణ తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు. -
టీడీపీ నేతల ప్రోద్భలంతోనే ఆ దుష్ప్రచారం?
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి, సినీనటి పూనమ్కౌర్లపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కోటేశ్వరరావు అలియాస్ కోటి మంగళవారం నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. ఇతడిపై హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసుస్టేషన్లో రెండు కేసులు నమోదై ఉన్నాయి. తనపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో జరిగిన దాడి వెనుక కోటి అనే వ్యక్తి ఉన్నాడని లక్ష్మీపార్వతి సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసు దర్యాప్తులో ఉండగానే సినీనటి పూనమ్కౌర్ కూడా తనపై గుర్తు తెలియని వ్యక్తులు అభ్యంతకరమైన పోస్టింగ్లు పెట్టారంటూ ఫిర్యాదు ఇచ్చారు. ఈ రెండు కేసులను సాంకేతికంగా దర్యాప్తు చేసిన సైబర్క్రైమ్ పోలీసులు రెండు కేసుల్లోనూ కోటినే ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తుండగా, లాయర్తో కలిసి వచ్చి లొంగిపోతానంటూ కోటి కొన్నాళ్లుగా సైబర్క్రైమ్ పోలీసులకు వర్తమానం పంపుతూ వచ్చాడు. హఠాత్తుగా మంగళవారం నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. అతని రాకని పసిగట్టి సైబర్క్రైమ్ పోలీసులు కోర్టుకు చేరుకునేలోపే కోటి న్యాయస్థానంలో లొంగిపోయాడు. చదవండి: (దురుద్దేశంతోనే నాపై దుష్ప్రచారం: లక్ష్మీ పార్వతి) ప్రముఖులకు దగ్గరై... ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ నాయకులు సోషల్మీడియా కేంద్రంగా వైసీపీ నాయకులపై విషప్రచారం చేశారు. ఇందులో కోటిని కూడా ఉపయోగించారు. టీడీపీ నేతలు ఓ పథకం ప్రకారం వారు టార్గెట్ చేసిన వారి వద్దకు కోటిని పంపిస్తుంటారని సైబర్క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు. వారి ‘లక్ష్యాల’తో పరిచయం, స్నేహాం ద్వారా తనపై నమ్మకం కలిగేలా ప్రవర్తించి కోటి ఆపై అసలు పని ప్రారంభిస్తాడు. అవకాశం చిక్కినప్పుడల్లా వారి ఫోన్లలో తనకు కావాల్సిన అంశాలు పొందుపరిచే వాడని, లక్ష్మీపార్వతి ఫోన్ను కూడా అలాగే ఉపయోగించినట్లు ఆధారాలు లభించాయని పోలీసులు పేర్కొన్నారు. కోటిని అదే విధంగా పూనమ్కౌర్ వద్దకు కూడా పంపిన టీడీపీ నాయకులు ఆమెతో ఏపీకి చెందిన ఓ ప్రముఖ నటుడికి వ్యతిరేకంగా మాట్లాడించి, వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేసేలా చేశారని భావిస్తున్నారు. ఈ రెండు కేసులకు సంబంధించిన పలు వివరాలను కోటి నుంచి రాబట్టాల్సి ఉండటంతో సైబర్క్రైమ్ పోలీసులు అతణ్ణి కస్టడీకి కోరాలని భావిస్తున్నారు. సోషల్ మీడియాలో కోటి కార్యకలాపాలు, కోటికి, టీడీపీ నాయకులకు ఉన్న సంబంధాల గురించి నిర్థారణ కావాలంటే అతణ్ణి కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాల్సి ఉందని వారు చెప్తున్నారు. చదవండి: సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన పూనమ్ కౌర్ -
ఎన్టీఆర్ గొప్ప నటుడు
హైదరాబాద్ : నందమూరి తారకరామారావు గొప్ప నటుడని తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్ కె.రోశయ్య అన్నారు. మంగళవారం ఎన్టీఆర్ విజ్ఞాన్ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ అస్సామీ రచయిత, మాజీ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ నగేన్ సాకియాకు ఎన్టీఆర్ జాతీయ సాహితీ పురస్కారం–2019 ప్రదానం చేశారు. అనంతరం రోశయ్య మాట్లాడుతూ, రాజకీయంగా వైరుధ్యం ఉన్నప్పటికి నటుడిగా ఎన్టీఆర్ను ఎంతో అభిమానించానని అన్నారు. ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కె.వి.రమణాచారి మాట్లాడుతూ, రాజకీయం విడదీస్తుందని.. సాహిత్యం మాత్రం అందరినీ కలుపుకుపోతుందని అన్నారు. ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ చైర్పర్సన్ ఎన్.లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరిట సేవచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా నృత్య గురువు ఇందిరా ముస్నూరి శిష్యబృందం చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీనటి జీవిత రాజశేఖర్, ఆర్టీఐ మాజీ కమిషనర్ పి.విజయ్బాబు, ప్రముఖ రచయిత్రి డాక్టర్ అనంతలక్ష్మి, చింత కిరణ్కుమార్, యువ కళావాహిని అధ్యక్షులు వై.కె.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ జయంతి ఏర్పాట్లపై లక్ష్మీ పార్వతి అసహనం
-
ఎన్టీఆర్ ఘాట్ను అలంకరించరా?
సాక్షి, హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి వేడుకలపై ఆయన సతీమణి లక్ష్మీపార్వతి అసహనం వ్యక్తం చేశారు. కనీసం ఆయన ఘట్ను కూడా అలంకరించరా? అంటూ మండిపడ్డారు. మంగళవారం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన ఘాట్కు వచ్చిన ఆమె నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ జయంతి వేడుకలకు సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్ర ప్రదేశంగా భావించాల్సిన టీడీపీ శ్రేణులు ఘాట్ను అలంకరించకుండా వదిలేసారన్నారు. ఆ మహానేత ఘాట్ వద్ద ఒక్క బ్యానర్ను కూడా ఏర్పాటు చేయరా? అని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన అన్యాయాలు, కుట్రల వల్ల తగిన శాస్త్రి జరిగిందన్నారు. తానేప్పుడు టీడీపీకి వ్యతిరేకం కాదని, కానీ చంద్రబాబు అనే వ్యక్తికి మాత్రం వ్యతిరేకమన్నారు. టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పులన్నిటిని నిశ్చయ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సరిదిద్దుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
‘టార్గెట్ పెట్టి మరీ మద్యాన్ని అమ్మిస్తున్నారు’
సాక్షి, గుంటూరు : మద్యం వల్ల అత్యాచారాలు, కిరాయి హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని, టార్గెట్లు పెట్టి మరీ ప్రభుత్వాలు మద్యాన్ని అమ్మిస్తున్నాయని వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో.. దశలవారీగా మద్యనిషేధం అమలుపై చర్చా వేదికలో మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన సమాజం ఉన్న దేశాలు ఆర్థికంగా ముందుకు వెళ్తున్నాయని అన్నారు. ఎన్నికల్లో మద్యం పంపిణీ వల్ల చిన్న పిల్లలు సైతం మద్యానికి బానిసలవుతున్నారని పేర్కొన్నారు. మద్యంపై అందరికీ అవగాహనం కలిగించినప్పుడే మార్పు వస్తుందని, వైఎస్ జగన్ దశలవారీగా మద్యపాన నియంత్రణ చేస్తానన్నారని పునరుద్ఘాటించారు. ఇదే కార్యక్రమాని హాజరైన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. ‘అప్పట్లో ఎన్టీఆర్ మద్యనిషేధం చేస్తానంటే మహిళలు చాలా ఆనందించారు. కానీ ఇప్పటి ప్రభుత్వాలు మద్యాన్ని హోమ్ డెలివరీ చేసే వరకు దిగజారాయి. అనంతపురంలో మంచి నీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే, మద్యం వల్ల ప్రభుత్వం రూ.244 కోట్లు ఆదాయం పొందింది. ఆ డబ్బుతో మంచి నీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం తన ఖజానాలో వేసుకుంది. చిన్నపిల్లలు సైతం తాగుడుకు అలవాటు పడుతున్నారు.. తల్లిదండ్రులు కూడా పిల్లలను గమనిస్తూ వుండాలి. అందరూ బాధ్యతతో వ్యవహరిస్తే మద్యాన్ని నిర్మూలించవచ్చ’న్నారు. మాజీ సీఎస్ అజేయ కల్లం మాట్లాడుతూ.. ‘మద్యపానం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ప్రభుత్వాలు మద్యాన్ని ఆదాయ వనరుగా చూడకూడదు. సమాజం మీద బాధ్యత లేనట్టు వ్యహరించకూడదు. మద్యపాన నిషేధంపై స్వచ్చంద సంస్థలు పోరాటం చేయాలి. దశలవారీగా మద్యపాన నిషేధంపై సమగ్ర చర్చ జరగాలి’ అని పేర్కొన్నారు. ‘మద్యం వల్ల చిన్న చిన్న కుటుంబాలు మరింతగా ఛిన్నాబిన్నం అవుతున్నాయి. డ్రైవర్లు తాగి వాహనం నడిపితే ఎన్నో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. రోడ్డుప్రమాదాలపై సమీక్ష చేస్తే మద్యం వల్ల జరుగుతున్న ప్రమాదాలే ఎక్కువని తేలాయి. మద్యపాన నిషేధం అమలు చేయలేరా? అని నన్ను చాలామంది అడుగుతుంటారు. పాలకులకు చిత్తశుద్ధి ఉంటే కచ్చితంగా అమలు చేయవచ్చ’ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. -
‘టీడీపీకి 40కి మించి రావు’
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్యాను గాలి బాగా వీస్తోందని, 120 నుంచి 130 సీట్లు గెలుచుకుని వైఎస్సార్సీపీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వైఎస్సార్సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి ధీమా వ్యక్తం చేశారు. గుంటూరులో లక్ష్మీపార్వతి విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో పెట్టిన రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీలను పూర్తి చేయలేదని చెప్పారు. ప్రభుత్వ ఆర్ధిక వ్యవస్థను నాశనం చేసి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి తీసుకువచ్చారని ఆరోపించారు. స్పెషల్ విమానాలను వాడి ప్రజల ధనాన్ని వృధా చేశారని మండిపడ్డారు. నాడు ఎన్టీఆర్కు వెన్నుపోటు నుంచి నేడు ప్రజలకు వెన్నుపోటువరకు చంద్రబాబుకు ప్రజాతీర్పులో శిక్ష తప్పదని శపించారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి 40 సీట్లకు మించిరావని జోస్యం చెప్పారు.