Las Vegas
-
అమెరికాలో వరుస దాడులు
వాషింగ్టన్: కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత తొలి 24 గంటల వ్యవధిలోనే అగ్రరాజ్యం అమెరికాలో మూడు భీకర దాడులు జరిగాయి. 16 మంది మరణించారు. పదులు సంఖ్యలో జనం క్షతగాత్రులుగా మారారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం న్యూ ఆర్లియన్స్లో జరిగిన దాడిలో 15 మంది మృతి చెందారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రేరణతో ఓ దుండగుడు జనంపైకి వాహనంపై దూసుకెళ్లాడు. తర్వాత విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని హతమార్చారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే లాస్ వెగాస్లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ సమీపంలో టెస్లా కారు పేలిపోయింది. ఒకరు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. తర్వాత బుధవారం రాత్రి న్యూయార్క్ నైట్క్లబ్లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం వాటిల్లలేదు. అయితే, ఈ మూడు ఘటనలకూ పరస్పరం సంబంధం ఉందని, ఇవన్నీ ముమ్మాటికీ ఉగ్రవాద దాడులేనని ప్రజలు అను మానం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిప్రాయాలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు రెండు ఘటనలను ఉగ్రదాడి కోణంలో విచారణ సాగిస్తుండడం గమనార్హం. జబ్బార్ ట్రక్కులో ఐసిస్ జెండా న్యూ ఆర్లియన్స్లోని బార్బన్ వీధిలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న జనంపైకి శంషుద్దీన్ జబ్బార్ అనే వ్యక్తి వాహనంతో దూసుకొచ్చాడు. ఫోర్డ్ ఎఫ్–150 అద్దె ట్రక్కుతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తర్వాత రైఫిల్తో జనంపైకి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 15 మంది చనిపోగా, 35 మంది గాయపడ్డారు. పోలీసుల కాల్పుల్లో జబ్బార్ హతమయ్యాడు. ట్రక్కులో ఐసిస్ జెండాను గుర్తించినట్లు ఎఫ్బీఐ అధికారులు చెబుతున్నారు. లాస్ వెగాస్లో ట్రంప్ హోటల్ వద్ద టెస్లా కారును పేల్చేసిన వ్యక్తి, జబ్బార్కు సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే వారిద్దరూ గతంలో ఒకే మిలటరీ స్థావరంలో పనిచేశారు. న్యూ ఆర్లియన్స్ దాడిని ఉగ్రవాద దాడిగానే దర్యాప్తు అధికారులు పరిగ ణిస్తున్నారు. ఎక్కువ మందిని చంపాలన్న ఉద్దేశంతోనే జబ్బార్ దాడి చేశాడని అంటున్నారు. ఐసిస్ తో అతడికి సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో ఎఫ్బీఐ గుర్తించినట్లు తెలుస్తోంది. రెండు వాహనాలు ఒకే యాప్ నుంచి.. న్యూ ఆర్లియన్స్ దాడికి ఉపయోగించిన ట్రక్కును, లాస్ వెగాస్ దాడిలో ఉపయోగించిన టెస్లా కారును ‘టూరో యాప్’ నుంచే అద్దెకు తీసుకున్నారు. వాహనంలో బ్యాటరీ వల్ల ఈ పేలుడు జరగలేదని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ధ్రువీకరించారు. కారులో పేలుడు పదార్థాలను అమర్చడం వల్లే అది పేలిందని అన్నారు. కారులో లోపం ఏమీ లేదని స్పష్టంచేశారు. టెస్లా కారు పేలుడు వ్యవహారాన్ని సైతం అధికారులు ఉగ్రవాద దాడి కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. కొలరాడోలోని కొలరాడో స్ప్రింగ్స్లో ఈ వాహనాన్ని దుండగుడు అద్దెకు తీసుకున్నాడు. అక్కడ ఆధారాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే, సదరు దుండగుడి పేరును ఇంకా బయటపెట్టలేదు. కానీ స్థానిక మీడియా కథనం ప్రకారం... మాథ్యూ లివెల్స్బర్గర్ అనే ఈ దుండగుడు కొలరాడో స్ప్రింగ్స్ కారును అద్దెకు తీసుకున్నాడు. కారులో తొలుత నెవడాకు చేరుకున్నాడు. అందులో బాణాసంచా, మోర్టార్స్, గ్యాస్ క్యాన్లు అమర్చాడు. అనంతరం లాస్ వెగాస్లో ట్రంప్ హోటల్ ఎదుట పేల్చేశాడు.నైట్క్లబ్లో 30 రౌండ్ల కాల్పులు మూడో ఘటన విషయానికొస్తే న్యూ యార్క్లో క్వీన్స్ ప్రాంతంలోని నైట్క్లబ్ వద్ద కాల్పులు జరిగాయి. కనీసం 12 మంది గాయపడ్డారు. క్లబ్ బయట వేచి ఉన్న జనంపైకి దాదాపు నలుగురు వ్యక్తులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. కనీసం 30 రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. కాల్పుల అనంతరం అక్కడి నుంచి దుండుగులు పరారయ్యారు. -
అనిరుద్కు రజతం
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక లాస్ వేగస్ షూట్ అంతర్జాతీయ ఆర్చరీ టోర్నమెంట్లో భారత సంతతి కుర్రాడు పింజల అనిరుధ్ కల్యాణ్ రజత పతకంతో మెరిశాడు. హైదరాబాద్లోని లంగర్హౌస్ ప్రాంతానికి చెందిన అనిరుధ్ కుటుంబం అమెరికాలో నివసిస్తోంది. లాస్ వేగస్లో రెండు రోజులపాటు జరిగిన ఈ టోర్నీలో అమెరికాకు ప్రాతినిధ్యం వహించిన అనిరుధ్ రికర్వ్ కబ్ కేటగిరీ లో పోటీపడి రెండో స్థానంలో నిలిచాడు. అనిరుధ్ మొత్తం 547 పాయింట్లు స్కోరు చేసి రజతం నెగ్గాడు. ఇదే టోర్నీలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ స్టార్ వెన్నం జ్యోతి సురేఖ 898 పాయింట్లతో పదో ర్యాంక్లో నిలిచింది. -
అబ్బురపరుస్తున్న గ్యాడ్జెట్స్.. ఎప్పుడైనా చూసారా!
లాస్ వేగాస్లో అట్టహాసంగా జరుగుతున్న 2024 సీఈఎస్ ఈవెంట్లో అత్యుత్తమ ఉత్పత్తులు కనివిందు చేస్తున్నాయి. ఈ ఈవెంట్లో సాధారణ ఉత్పత్తులకంటే కూడా కొత్త టెక్నాలజీతో అబ్బురపరిచే గ్యాడ్జెట్స్, వెహికల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ కథనంలో ఏఐ (AI) టెక్నాలజీ కలిగిన ఉత్తమ గాడ్జెట్లను గురించి వివరంగా తెలుసుకుందాం. బల్లీ (BALLIE) సీఈఎస్ వేదికపై కనిపించిన ఉత్తమ ఏఐ ఉత్పత్తులలో ఒకటి 'బల్లీ'. శామ్సంగ్ కంపెనీ లాంచ్ చేసిన ఈ గ్యాడ్జెట్ చూడటానికి చిన్న బాల్ మాదిరిగా ఉంటుంది. కానీ పనితీరులో మాత్రం దానికదే సాటి అని చెప్పాలి. నిజానికి ఇది ఒక ఎంటర్టైన్మెంట్ డివైజ్ అయినప్పటికీ.. ఇంట్లో చాలా పనులు చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. నెల మీద, పైకప్పు మీద కూడా ప్రాజెక్ట్ చేయగల కెపాసిటీ కలిగిన బల్లీ.. ఈవెంట్లో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ గ్యాడ్జెట్ ధర, వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు. (Image credit: Future) LG స్మార్ట్ హోమ్ ఏజెంట్ శామ్సంగ్ ఉత్పత్తులకు ఏ మాత్రం తీసిపోకుండా.. LG కంపెనీ కూడా ఓ స్మార్ట్ హోమ్ ఏజెంట్ను ఆవిష్కరించింది. లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన ఈ గ్యాడ్జెట్ ఒక స్మార్ట్ హబ్. ఇది ChatGPT వాయిస్తో కమ్యూనికేట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా మీ మానసిక స్థితిని పర్యవేక్షించడంలో కూడా ఇది చాలా సహాయపడుతుంది. ఈ ఏఐ రోబోటిక్ ధర కూడా సంస్థ అధికారికంగా ప్రకటించలేదు. (Image credit: LG) సెగ్వే నవిమో (SEGWAY NAVIMOW) సెగ్వే నవిమో అనేది ఓ రోబోట్ లాన్మూవర్స్. నిజానికి రోబోట్ లాన్మూవర్స్ ఈ రోజు ఆలోచన కాదు. అయితే సీఈఎస్ వేదికపై కనిపించిన ఈ సెగ్వే నవిమో ఏఐ టెక్నాలజీ కలిగిన గ్యాడ్జెట్. ఇది బ్లేడ్హాల్ట్ సెన్సార్, రెయిన్ సెన్సార్, అల్ట్రాసోనిక్ సెన్సార్, విజన్ఫెన్స్ సెన్సార్ వంటి వాటిని కలిగి ఉంటుంది. అమెరికాలో ఈ గ్యాడ్జెట్ ధరలు అందుబాటులో లేదు కానీ.. యూరప్ మార్కెట్లో 1300 డాలర్ల ప్రారంభ ధర వద్ద లభిస్తోంది. (Image credit: Segway) ఓరో (ORO) శామ్సంగ్, LG గ్యాడ్జెస్ట్స్ కంటే కూడా ఓరో అనేది పెంపుడు జంతువులకు మరింత ఫ్రెండ్లీగా ఉంటుంది.పెద్ద పెద్ద కళ్ళు కలిగిం ఈ పరికరం బంతిని విసరడం, ఆహారాన్ని అందించడం వంటివి చేసేలా రూపొందించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూడా పెంపుడు జంతువులను జాగ్రత్తగా చూసుకుంటుంది. దీని ధర 799 డాలర్లు. ఏప్రిల్ నుంచి విక్రయానికి రానున్నట్లు సమాచారం. ఇప్పుడు దీనిని 299 డాలర్ల డౌన్పేమెంట్తో ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. (Image credit: ORo) మొబిన్ (MOBINN) సాధారణంగా గ్యాడ్జెట్స్.. ఇంటి పరిసరాల్లో లేదా ఇంట్లో చదునుగా ఉన్న ప్రాంతాల్లో తిరగటానికి అనుకూలంగా ఉంటాయి. కానీ మొబిన్ అనేది మెట్లను కూడా ఎక్కగలదు. ఫ్లెక్సిబుల్ వీల్స్తో కూడిన ఈ రోబోట్ మనం ఆర్డర్ చేసిన వస్తువులను తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. LiDAR-బేస్డ్ మ్యాపింగ్ సిస్టమ్ను కలిగిన మొబిన్ వర్షం, మంచు, రాత్రి సమయంలో కూడా పని చేస్తుంది. సంస్థ ఈ గ్యాడ్జెట్ ధర, లాంచ్ డేట్ వంటి వాటిని అధికారికంగా వెల్లడించలేదు. (Image credit: MOBINN) లూనా (LOONA) సాధారణంగా ఎవరైనా తమను ఎంటర్టైన్ చేయడానికి పెంపుడు జంతువులను పెంచుకుంటారు. అయితే లూనా అనే రోబోట్ పెంపుడు జంతువులకు ఏ మాత్రం తీసిపోదు. చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ.. ChatGPT ఆధారంగా పనిచేస్తుంది. ఇది కదిలే హోమ్ మానిటర్, ప్రోగ్రామింగ్ లెర్నింగ్ ప్లాట్ఫారమ్గా పనిచేస్తుంది. దీని ధర 380 డాలర్ల వరకు ఉంటుంది. (Image credit: keyirobot) రోబోట్ వాక్యూమ్ రోబోట్ వాక్యూమ్ అనేది వాయిస్ అసిస్టెంట్, రోబోట్ ఆర్మ్, వీడియో కాలింగ్ ఫంక్షనాలిటీ వంటి వాటిని పొందుతుంది. CES 2024 వేదికగా కనిపించిన అద్భుతమైన గ్యాడ్జెట్లలో ఇది కూడా ఒకటి. మరొక పరికరం అవసరం లేకుండా దీనిని కంట్రోల్ చేయవచ్చు. ఈ పరికరం లోపల ఉండే కెమెరా యజమానికి కాల్ చేయగల కెపాసిటీ కలిగి ఉంటుంది. ఈ రోబోట్ వాక్యూమ్ ధర, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. -
షాకింగ్ ఘటన.. కోర్టులోనే జడ్జిపై దాడి చేసిన నిందితుడు
లాస్ వెగాస్: అమెరికాలోని కోర్టులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బెయిల్ నిరాకరించారన్న కోపంతో నిందితుడు తీర్పు చెబుతున్న జడ్జిమీదకు దూసుకెళ్లి దాడి చేశాడు. ఈ అనూహ్య పరిణామం లాస్ వెగాస్లోని కోర్టు హాలులో బుధవారం జరిగింది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు కోర్టులోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. యూఎస్ వార్తా పత్రిక న్యూయార్క్ పోస్టు ప్రచురించిన వివరాల ప్రకారం.. లాస్ వెగాస్లోని క్లార్క్ కౌంటీ డిస్ట్రిక్ కోర్టులో క్రిమినల్ కేసుపై విచారణ జరుగుతోంది. ఈ కేసులో నిందితుడు 30 ఏళ్ల డియోబ్రా రెడెన్కు బెయిల్ ఇచ్చేందుకు మహిళా జడ్జి మేరి కే హోల్ధస్ నిరాకరించారు. అతడిపై ఇప్పటికే అనేక కేసులు ఉన్న నేపథ్యంలో.. మళ్లీ మళ్లీ నేరం చేయకుండా సరైన శిక్ష పడాల్సిందేనని తెలిపారు. దీంతో రెచ్చిపోయిన నిందితుడు ఒక్కసారిగా జడ్జి బెంచ్ వద్దకు దూసుకొచ్చాడు. న్యాయమూర్తి వద్దకు దూకి దాడి చేశాడు. పిడికిలితో పదేపదే కొట్టడంతో సాయం కోసం ఆమె కేకలు వేసింది. Man assaults judge in Las Vegas after probation request denied. pic.twitter.com/Vw5emstedD — Great Clips (@Altaynova) January 3, 2024 ఆమె పక్కనే ఉన్న క్లర్క్, సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించి అతడిని అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే నిందితుడి దాడిలో జడ్జి సహా ఆమె సహాయకుడికి స్పల్పంగా గాయాలయ్యాయి. ఇదంతా నిమిషాల వ్యవధిలో జరిగిపోయింది. నిందితుడి చర్యతో అక్కడ భయానక పరిస్థితి ఏర్పడింది. అనంతరం నిందితుడిని అరెస్ట్చేసి అతడిపై కొత్త నేరారోపణలు మోపి జైలుకు తరలించారు. A man attacked a Clark County judge in court today after she denied his probation. 😬 pic.twitter.com/CkJXj7Tc5a — non aesthetic things (@PicturesFoIder) January 3, 2024 -
ది స్పియర్: 18 వేల మంది లైవ్లో సినిమా చూడొచ్చు!
సినిమాలు చూసేందుకు థియేటర్కు వెళ్తుంటాం.. 3డీలో చూసే సినిమాల కోసం స్పెషల్ 3డీ గ్లాసెస్ ఇస్తుంటారు. కానీ ఇక్కడ చెప్పుకునే ఓ థియేటర్లాంటి వేదికలో మాత్రం ఎటువంటి అద్దాల అవసరం లేకుండానే ఏకంగా 4డీ ఎక్స్పీరియన్స్ వస్తుంది. లోపలే కాదు బయట కూడా ఈ వేదిక రంగులు వెదజిమ్ముతూ ఆకట్టుకుంటోంది. ప్రపంచంలోనే అతి పెద్ద గోళాకారంలో నిర్మించిన ఈ భవంతి పేరు ద స్పియర్. దీని పై, లోపలి భాగాల్లో విశాలమైన ఎల్ఈడీ స్క్రీన్లను ఫిక్స్ చేశారు. ఎల్ఈడీ స్క్రీన్ల వెలుగులతో భవంతి ఆకర్షణీయంగా కనిపిస్తోంది. లోపల ఏర్పాటు చేసిన తెరమీద ఏదైనా వీడియో ప్లే చేస్తుంటే మనం కూడా ఆ వీడియోలో ఉన్న ప్రదేశంలో ఉన్నామేమో అన్న అనుభూతి కలిగేలా స్క్రీన్ల అమరిక ఉంది. ఈ మధ్యే ఈ స్పియర్ను ప్రారంభించగా అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ వేదిక అసలు పేరు ఎమ్ఎస్జీ స్పియర్. ఇది అమెరికాలో లాస్ వెగాస్కు సమీపంలోని ప్యారడైజ్లో ఉంది. ఏదైనా షోలు, కచేరీలు, ఈవెంట్లు జరుపుకోవడానికి ఇది ఎంతో అనువుగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ఎంటర్టైన్మెంట్కు పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. స్పియర్కు సంబంధించి మరిన్ని ఆసక్తికర విషయాలు ► పాపులస్ అనే సంస్థ దీని రూపకల్పనకు నడుం బిగించింది. ► దీని ఎత్తు 366 అడుగులు, వెడల్పు 516 అడుగులు. ► 18,600 సీట్ల సామర్థ్యం కలదు. ► వేదిక వెలుపలి భాగంలో 5,80,000 చదరపు అడుగుల ఎల్ఈడీ స్క్రీన్లు ఉన్నాయి. ► వేవ్ఫీల్డ్, సింథసిస్ టెక్నాలజీతో ఉన్న స్పీకర్స్.. 16కె రిజల్యూషన్ స్క్రీన్ క్వాలిటీ, 4డీ ఎఫెక్స్ట్ దీని ప్రత్యేక స్పెషాలిటీ. ► ఈ వేదికను నిర్మించడానికి అయిన ఖర్చు 2.3 బిలియన్ డాలర్స్ (భారతదేశ కరెన్సీ ప్రకారం రూ.19 వేల కోట్ల పైమాటే) The inside of the Sphere is equally as impressive as the outside! 👏🏼😮🐟 pic.twitter.com/pmmzRXgvzX — H0W_THlNGS_W0RK (@HowThingsWork_) October 17, 2023 View this post on Instagram A post shared by U2 (@u2) View this post on Instagram A post shared by Sphere (@spherevegas) View this post on Instagram A post shared by Sphere (@spherevegas) చదవండి: శుభశ్రీ అవుట్.. రతిక రోజ్కు గోల్డెన్ ఛాన్స్.. ఎలా వాడుకుంటుందో.. -
అతిపెద్ద సినిమా స్క్రీన్.. ప్రత్యేకతలు తెలిస్తే మైండ్ పోద్ది!
మనలో చాలామందికి సినిమా చూడటం వ్యసనం. మందు తాగేవాడికి మత్తు ఎక్కితే కిక్ వస్తుంది. సినిమా చూసేవాడికి స్క్రీన్ ఎంత పెద్దగా ఉంటే.. అంత కిక్ వస్తుంది. ఎందుకంటే ఓ యాక్షన్ సీన్ పెద్ద తెరపై చూస్తుంటే అప్పుడు వచ్చే మజా.. బయట ఎక్కడా దొరకదు కదా! అయితే ఐమాక్స్, సూళ్లురుపేటలోని వి-ఎపిక్ స్క్రీన్స్ ఇప్పటివరకు పెద్దవని అనుకున్నాం. కానీ వాటికి బాబు లాంటి స్క్రీన్ త్వరలో అందుబాటులోకి రానుంది. దీని స్పెషాలిటీ ఏంటో తెలిస్తే మీకు ఫ్యూజులు ఎగిరిపోవడం గ్యారంటీ. ఈ స్క్రీన్ సంగతేంటి? సాధారణంగా సినిమా స్క్రీన్ ఓ గోడ ఆకారంలో అంటే స్క్వేర్ షేపులో ఉంటుంది. దాదాపు ఎక్కడ చూసినా సరే ఇలాంటివే ఉంటాయి. కానీ అమెరికాలోని లాస్ వెగాస్లో మాత్రం రౌండ్(గోళాకారం) షేపులో బంతిలా ఉండే స్క్రీన్ని సిద్ధం చేశారు. ప్రస్తుతం అందరూ దీన్ని రాకాసి స్క్రీన్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే దీని పొడవు, వెడల్పు అలాంటిది మరి. (ఇదీ చదవండి: బెండు తీసిన 'బిగ్బాస్'.. హౌసులో దొంగతనానికి స్కెచ్!) ఈ స్క్రీన్ ప్రత్యేకతలు మిగతా వాటి సంగతేమో గానీ ఈ స్క్రీన్ 366 అడుగుల పొడుగు, 516 అడుగుల వెడల్పుతో ఉంది. ఈ థియేటర్ లో ఏకంగా 18,600 మంది ఒకేసారి కూర్చుని సినిమా చూడొచ్చు. ఈ స్క్రీన్ కి తోడుగా 1,60,000 స్పీకర్లు(చిన్నా పెద్దా కలిపి) ఉన్నాయి. మన దగ్గర ప్రస్తుతం 4K రెజుల్యూషన్ ఉంది. ఈ స్క్రీన్లో 18K రెజుల్యూషన్తో ప్లే అవుతుంది. ఇందులో మూవీ వేయాలంటే.. ఆ ఫైల్ సైజు 5 లక్షల జీబీ(GB) ఉండాల్సిందే. ఫస్ట్ సినిమా అదే ఇకపోతే అక్టోబరు 6న 'పోస్ట్ కార్డ్ ఫ్రమ్ ఎర్త్' సినిమాని.. ఈ రాకాసి స్క్రీన్పై ప్లే చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీన్ని చూసిన నెటిజన్స్.. వామ్మో అనకుండా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి చోట సినిమా చూస్తే చాలు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి స్క్రీన్ రావాలంటే ఇప్పట్లో అస్సలు సాధ్యం కాదు! (ఇదీ చదవండి: గ్లామర్ డోస్ పెంచిన నిహారిక... తమన్నా ముద్దులే ముద్దులు) View this post on Instagram A post shared by Darren Aronofsky (@darrenaronofsky) -
హార్ట్ ఎటాక్ రెస్టారెంట్.. ఫుడ్ తింటే నిజంగానే గుండెనొప్పి వస్తుందేమో!
ఈమధ్యకాలంలో రెస్టారెంట్ బిజినెస్కి డిమాండ్ బాగా పెరిగింది. దీంతో ట్రెండ్కు తగ్గట్లు కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు హోటల్ నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. డిఫరెంట్ థీమ్స్తో,క్యాచీ నేమ్స్తో వ్యాపారాన్ని బాగా విస్తరిస్తున్నారు. అయితే అమెరికాలోని ఓ రెస్టారెంట్ పేరు వింటే మాత్రం మీకు గుండెదడ వచ్చేస్తుంది. ఎందుకంటే, ఆ రెస్టారెంట్ పేరు హార్ట్ ఎటాక్. పేరుకు తగ్గట్లే హాస్పిటల్ థీమ్ మొత్తం హాస్పిటల్ మాదిరి ఉంటుంది. మరి ఈ వెరైటీ రెస్టారెంట్ ఎక్కడ ఉంది? ఎలాంటి వెరైటీ ఫుడ్ ఐటెమ్స్ అక్కడ దొరుకుతాయి అన్నది ఇప్పుడు చూద్దాం. ఇప్పటివరకు రకరకాల వెరైటీ రెస్టారెంట్ పేర్లను విన్నాం, చూశాం. కానీ ఈ రెస్టారెంట్ పేరు వింటేనే గుండెనొప్పి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ రెస్టారెంటపేరు హార్ట్ ఎటాక్ రెస్టారెంట్. అక్కడి ఫుడ్ ఐటెమ్స్ తింటే నిజంగానే మీకు హార్ట్ ఎటాక్ వస్తుందేమో. ఇక్కడ దొరికే బైపాస్ బర్గర్లు తింటే ఏకంగా 10వేల క్యాలరీల శక్తి లభిస్తుంది. బైపాస్ బర్గర్ అంటే ఒకదానిపై మరొకటి పెడుతూ వాటిలో ఉంచే పదార్థాల మోతాదును కూడా పెంచుకుంటూ పోతారు. కేవలం బర్గర్లు మాత్రమే కాదు, అక్కడ దొరికే ప్రతీ ఫుడ్ ఐటెంలో కొవ్వు అతిగానే ఉంటుంది. 2005లో జాన్ బాసో అనే వ్యక్తి ఈ ''హార్ట్ ఎటాక్ గ్రిల్'' రెస్టారెంట్ను ప్రారంభించగా వెరైటీగా ఉండటంతో కొద్ది నెలల్లోనే ఈ రెస్టారెంట్కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక ఈ రెస్టారెంట్ లోపలికి వెళ్లగానే రెస్టారెంట్కి వచ్చామా? లేక హాస్పిటల్కి వచ్చామా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే కస్టమర్స్ పేషెంట్స్లా గౌనులు వేసుకొని వెళ్లాలనే రూల్ ఉంది. ఇక అక్కడి వెయిటర్స్ నర్సులు, డాక్టర్లుగా డ్రెస్ చేసుకుంటారు. అంతేకాకుండా కస్టమర్లు ఇచ్చే ఆర్డర్స్ను ‘ప్రిస్క్రిప్షన్’ అంటారు. ఒకవేళ ఆర్డర్ చేశాక ఫుడ్ ఐటెమ్స్ తినకపోతే మీకు శిక్ష కూడా ఉంటుంది. అదేంటంటే నర్సులు వచ్చి సరదాగా బెల్ట్తో కొడతారట. ఇవన్నీ వింటుంటే..పిచ్చోళ్ల గురించి వినడమే కాదు.. చూడటం ఇదే మొదటి సారి అన్నట్లు ఉంది కదా. ఈ రెస్టారెంట్లో మరో వింత ఏమిటంటే 350 పౌండ్ల కన్నా అధిక బరువున్న వాళ్లకు ఎంత తింటే అంత ఫుడ్ ఫ్రీగా పెడతారట. View this post on Instagram A post shared by Heart Attack Grill (@heartattackgrill) View this post on Instagram A post shared by Heart Attack Grill (@heartattackgrill) View this post on Instagram A post shared by Heart Attack Grill (@heartattackgrill) అయితే కస్టమర్ల ఆరోగ్యాన్ని హానిచేసేలా విపరీతమైన జంక్ను ఎంకరేజ్ చేసేలా ఈ రెస్టారెంట్ ఉందని పలువురు విమర్శిస్తున్నారు. దీంతో తరచూ ఈ రెస్టారెంట్ వార్తల్లో నిలుస్తుంది. అయితే అక్కడ తినడం వల్ల ఆరోగ్యానికి హానీ అని తెలిసినా కస్టమర్ల సంఖ్య మాత్రం రోజురోజుకీ పెరుగుతూనే ఉండటం మరో విశేషం. -
అతి పెద్ద గోళం.. మినుమిట్లు గొలిపే ఎల్ఈడీల మాయాజాలం (ఫొటోలు)
-
ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ ఆవిష్కారం: ఎక్కడో తెలుసా? వైరల్వీడియో
లాస్ వెగాస్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఈడీ గోళం ఆకర్షణీయంగా నిలుస్తోంది. వేగాస్ స్కైలైన్లో ఎల్ఈడీ లైట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో స్క్రీన్ వీడియో వైరల్ అవుతోంది. అయితే ఎంఎస్జీ స్పియర్ అని పిలుస్తున్న ఈ కొత్త ఆవిష్కారం సిన్ సిటీకి కొత్త అందాలతోపాటు సరికొత్త కీర్తిని తెచ్చిపెట్టింది. కొత్త పర్యాటక ఆకర్షణగా నిలుస్తోంది. పర్యాటకులు 366 అడుగుల ఎత్తైన గోళాన్ని విస్మయంతో వీక్షించారు. లాంతరు, భూమి సహా భారీ ఐబాల్, బాస్కెట్బాల్, స్నో గ్లోబ్, జాక్-ఓ వంటి అనేక మెస్మరైజింగ్ డిస్ప్లేలు ఉన్నాయి. The new sphere in Las Vegas is the coolest building I’ve ever seen. It features 580K square feet of fully-programmable LED lighting to produce life-like images visible from miles away. And the story behind it is wilder than the videos it creates: A THREAD 1/16 pic.twitter.com/UO7FPJK2CN — Aakash Gupta 🚀 Product Growth Guy (@aakashg0) July 9, 2023 బౌల్-ఆకారంలో 366 అడుగుల పొడవు , 516 అడుగుల వెడల్పుతో ప్రపంచంలో అత్యధిక రిజల్యూషన్ ర్యాప్రౌండ్ ఎల్ఈడీ స్క్రీన్ను రూపొందించారు. దాదాపు 1.2 మిలియన్ LED పుక్లతో రూపొందించబడిం 580,000-చదరపు అడుగులతో ప్రోగ్రాం చేసిన ఈ ఎక్సోస్పియర్ గ్లోబులో 48 వ్యక్తిగత LED డయోడ్లు ఉంటాయి. ఇది 256 మిలియన్ విభిన్న రంగులను ప్రదర్శిస్తుంది. అంతేకాదు ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఈడీ డిస్ప్లే భూమి, మార్స్ చంద్రుడిగా మారిపోతుంది. స్పేస్షిప్లాగా, అంతరిక్షం నుండి భూమిలా మెరిసిపోతుంది. గ్లోబల్ ఆర్కిటెక్చర్ సంస్థ ఎంఎస్జీ దీన్ని తయారు చేసింది. ఈ బిగ్గెస్ట్ ఐ బాల్ కోసం ఎంఎస్జీ 2.3 బిలియన్ డాలర్లను ఖర్చు చేసిందట. తన 40 ఏళ్ల సర్వీసులోఇంతటి అద్భుతాన్ని చూడలేదని స్పియర్ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ రిచ్ క్లాఫీ కెప్పారు. నెవాడాలోని లాస్ వెగాస్లో( జూలై 04, 2023న) స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తొలిసారిగా ఇది సందడి చేసింది. సెప్టెంబర్ 29న అధికారికంగా లాంచ్కానుందని భావిస్తున్నారు. -
'లైగర్' సినిమా ఎమ్ఎంఏ ఫైట్.. క్రూరమైన క్రీడ నుంచి ఆదరణ దిశగా
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన పాన్ ఇండియా సినిమా ''లైగర్'' ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సినిమా ఫలితం సంగతి పక్కనబెడితే.. ఈ సినిమా ఎంఎంఏ ఫైట్(మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్) నేపథ్యంలో తెరకెక్కింది. మన దేశంలో చాలా మంది ఎంఎంఏ అంటే తెలిసి ఉండకపోవచ్చు. మార్షల్ ఆర్ట్స్ తెలిసినవాళ్లకు మాత్రమే ఈ క్రీడపై కాస్త అవగాహన ఉంటుంది. చాలా మందికి తెలియని ఎంఎంఏ క్రీడ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. -సాక్షి,డెబ్డెస్క్ photo credit : Getty Images ఎంఎంఏ ఫైట్(మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్) అనేది ఒక హైబ్రిడ్ యుద్ధ క్రీడ. బాక్సింగ్, రెజ్లింగ్, జడో, కరాటే, థాయ్ బాక్సింగ్ వంటి క్రీడల నుంచి తీసుకున్న కొన్ని టెక్నిక్స్తో ఎంఎంఏను రూపొందించారు. అయితే ఎంఎంఏ రూపొందించిన తొలి రోజుల్లో ఎలాంటి నిబంధనలు పెట్టకపోవడంతో అత్యంత క్రూరమైన క్రీడగా చాలా మంది పేర్కొన్నారు.కానీ కాలక్రమంలో ఎంఎంఏ ఆ చెడ్డ పేరు నుంచి బయటపడి ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక మంది ప్రేక్షకులు వీక్షిస్తున్న క్రీడగా ఆదరణ పొందుతుండడం విశేషం. photo credit : Getty Images చరిత్ర తిరగేస్తే క్రీస్తూ పూర్వమే ఎంఎంఏ గేమ్ను ఒలింపిక్స్లో ఆడారని ప్రచారంలో ఉంది. ఇది ఎంతవరకు నిజమనేది తెలియదు. మనకు తెలిసి 20వ శతాబ్దంలో బ్రెజిల్ లోని వాలే ట్యూడో ద్వారా ఎంఎంఏ గేమ్ మళ్లీ వెలుగులోకి వచ్చింది. కార్లో, హెలియో అనే ఇద్దరు సోదరులు నార్త్ అమెరికాలో ఈ గేమ్కు బాగా పాపులారిటీ తీసుకొచ్చారు. వాళ్లే ఈ టోర్నమెంట్ కు యూఎఫ్సీ(UFC)-అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్ షిప్ అని పేరు పెట్టారు.అయితే ఈ ఎంఎంఏ(మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్)పై అమెరికా సహా చాలా దేశాల్లో ఆంక్షలు ఉన్నాయి. ఎంఎంఏ మ్యాచ్ల్లో విజయాలను సబ్మిషన్, నాకౌట్, టెక్నికల్ నాకౌట్, న్యాయనిర్ణేతల ద్వారా నిర్ణయిస్తుంటారు. photo credit : Getty Images ఎంఎంఏ ఆట.. కఠిన నిబంధలు ►దశ దిశ లేకుండా సాగుతున్న ఎంఎంఏ ఆటకు యూఎఫ్సీ(అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్షిప్) కొన్ని స్థిరమైన నిబంధనలు, రూల్స్ తీసుకొచ్చింది. ఆ నిబంధనలు, రూల్స్ ఏంటనేవి ఇప్పుడు చూద్దాం ►రింగ్లోకి వెళ్లే ఆటగాళ్లు ప్యాడ్స్ ఉన్న ఫింగర్లెస్ గ్లౌజులతోనే పోరాడాలి ►బూట్లు వేసుకోకూడదు.. తలకు ఎటుంటి సేఫ్గార్డ్స్ పెట్టుకోకూడదు. ►ప్రత్యర్థి ఆటగాడి కంట్లో పొడవడం, కొరకడం, జట్టు లాగడం, తలతో కొట్టడం వంటివి పూర్తిగా నిషేధం. photo credit : Getty Images ఎంఎంఏలో యూనిఫైడ్ రూల్స్ కింద ఒక్కో రౌండు ఐదు నిమిషాల చొప్పున మూడు రౌండ్లు పోరాడాల్సి ఉంటుంది. ఒక్కో రౌండు ముగిసిన తర్వాత ఒక నిమిషం విశ్రాంతినిస్తారు. అదే చాంపియన్షిప్ బౌట్స్లో ఐదు రౌండ్లు ఉంటాయి. ప్రత్యర్థిని నాకౌట్ చేయడం, సబ్మిషన్(ప్రత్యర్థిని ఓటమి ఒప్పుకునేలా చేయడం) ద్వారా గెలుపును నిర్ణయిస్తారు. ఒకవేళ ఇద్దరు ఆటగాళ్లు సమంగా పోరాడితే మాత్రం.. ఇద్దరిలో విజేత ఎవరనేది ప్యానెల్ నిర్ణయిస్తుంది. photo credit : Getty Images ఇక అమెరికాలోని నెవడా రాష్ట్రంలోని లాస్వేగాస్లో ఉన్న యూఎఫ్సీ ఎంఎంఏకు ప్రధాన సంస్థ. ప్రతీ ఏడాది వివిధ స్థాయిల్లో యూఎఫ్సీ ఎంఎంఏ విభాగంలో ఈవెంట్లు నిర్వహిస్తూ వస్తోంది. అందుకే విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా సెకండాఫ్ మొత్తం లాస్వేగాస్లో షూటింగ్ జరుపుకుంది. చదవండి: 'లైగర్' బాక్సాఫీస్ కలెక్షన్స్పై ఎఫెక్ట్ పడిన మౌత్ టాక్ Stuart Broad: ముప్పతిప్పలు పెట్టి తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు.. -
విడాకులు కావాలని అడిగిన భార్య.. కత్తితో 30 సార్లు పొడిచిన భర్త
వాషింగ్టన్: అమెరికా లాస్ వేగాస్లో ఓ వ్యక్తి అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. విడాకులు కావాలని అడిగిన భార్యపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. కత్తితో 30 సార్లు పొడిచి కిరాతక చర్యకు పాల్పడ్డాడు. శనివారం ఈ ఘటన జరిగింది. నిందితుడు క్లిఫర్డ్ జాకబ్స్ను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం కోర్టులో హాజరుపరుచనున్నారు. భార్య వచ్చి విడాకులు కావాలని అడిగిన తర్వాత తన మైండ్ బ్లాంక్ అయిందని నిందితుడు చెప్పాడు. ఏం చేశానో కూడా తనకు గుర్తులేదని పేర్కొన్నాడు. తాను మళ్లీ తేరుకునే సరికి ఆమె రక్తపుమడుగులో ఉన్నట్లు పోలీసులకు వివరించాడు. నిందితుడి ఇంట్లో ఐదు కత్తులు, రక్తపు మరకలు ఉన్న కత్తెర్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. క్లిఫర్డ్ తన భార్యను పొడిచానని, ఆమె చనిపోయిందేమోనని మాట్లాడటం విన్నట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. ఈ ఘటనలో భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె మొహం, మెడపై కత్తిపోట్లున్నాయి. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయంపై మాత్రం ఎలాంటి సమాచారం లేదు. టెక్సాస్లో మే నెలలోనూ విడాకులు అడిగిందని ఉగ్రవాదిలా మారాడు ఓ భర్త. కోర్టు ఆవరణలోనే భార్య, కూతురు, అత్తను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చదవండి: ఆప్ కౌన్సిలర్ను అతి సమీపం నుంచి కాల్చి చంపిన దుండగుడు.. జిమ్ చేస్తుండగా దాడి.. -
Las Vegas: రన్ వేపై రెండు విమానాలు ఢీ.. నలుగురు మృతి
వాషింగ్టన్: అమెరికాలోని ఉత్తర లాస్ వేగస్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం జరిగింది. రన్వే పై రెండు చిన్న విమానాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో విమానాల్లోని మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం సమయంలో జరిగినట్లు ఫెడరల్ ఏవియేషన్ అధికారులు తెలిపారు. సింగిల్ ఇంజిన్ పైపర్ పీఏ-46, సింగిల్ ఇంజిన్ సెస్నా 172లు ఢీకొన్నాయని తెలిపారు. 'ప్రాథమిక సమాచారం ప్రకారం.. సింగిల్ ఇంజిన్ పైపర్ పీఏ-46 విమానాశ్రయంలో దిగేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే రన్ వేపై సెస్నా 172ను ఢీకొట్టింది. దాంతో పైపర్ పీఏ 46 రన్ వే 30కి తూర్పు వైపు పడిపోయింది. సెస్నా సమీపంలోని నీటి కుంటలో పడింది.' అని ఎఫ్ఏఏ ఓ ప్రకటన విడుదల చేసింది. ఒక్కో విమానంలో ఇద్దరు ఉండగా.. మొత్తం మంది మరణించినట్లు సిటీ అగ్నిమాపక విభాగం తెలిపింది. ఇదీ చదవండి: America Indiana City: ఇండియానా షాపింగ్ మాల్లో కాల్పులు.. ముగ్గురి మృతి.. దుండగుడి హతం -
మిసెస్ వరల్డ్ 2022 కంటెస్టెంట్
అందాల పోటీలు పెళ్లికాని యువతులకే అనే పేరుంది. కానీ, పెళ్లయి, బిడ్డలున్నా తమ ఘనతను చాటేలా మిసెస్ ఇండియా, మిసెస్ వరల్డ్ పోటీలూ ఉన్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 15న అమెరికాలోని లాస్ వెగాస్లో ‘మిసెస్ వరల్డ్–2022’ వివాహిత మహిళల కోసం సరికొత్త శైలిలో జరగనుంది. 80 దేశాల నుంచి అందమైన శ్రీమతులు ఈ పోటీలో పాల్గొనబోతున్నారు. భారత దేశం నుంచి నవదీప్ కౌర్ ప్రాతినిధ్యం వహిస్తోంది. మిసెస్ ఇండియా వరల్డ్ (2020–21లో) విజేతగా నిలిచిన 38 ఏళ్ల నవదీప్ కౌర్ ఒడిశాలోని సుందర్గడ్ జిల్లా స్టీల్ హబ్లో పుట్టి పెరిగింది. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. స్టీల్ హబ్ నుండి మిసెస్ ఇండియా వరల్డ్గా మారే వరకు నవదీప్ ప్రయాణం వివాహిత మహిళలను చైతన్యపరిచే దిశగా కొనసాగుతోంది. వ్యక్తిత్వ వికాస కోచ్ నవదీప్ కౌర్కి పెళ్లయి ఏడేళ్లు. ఐదేళ్ల కూతురు ఉంది. ఆరేళ్లుగా పాఠశాల స్థాయి విద్యార్థులకు చదువులో శిక్షణా తరగతులు తీసుకుంటుంది. కొటక్మహీంద్రా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా కెరీర్ ప్రారంభించింది. అటు తర్వాత హెచ్ఆర్, మార్కెటింగ్ గ్రాడ్యుయేషన్ కోసం మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేయడం ప్రారంభించింది. ప్రస్తుతం వ్యక్తిత్వ వికాస కోచ్గా ఎంతోమందిని ప్రభావితం చేస్తోంది. దేశం గర్వించేలా కృషి కిందటేడాది మిసెస్ ఇండియా వరల్డ్ టైటిల్ను గెలుచుకున్నప్పటి నుండే నవదీప్ మిసెస్ వరల్డ్ టైటిల్ను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ‘నా చిన్ననాటి నుంచి ప్రపంచపటంలో మన దేశాన్ని నేను సైతం గొప్పగా చూపించాలనుకునేదాన్ని. అందుకోసం ప్రతి విభాగంలో పనిచేయడానికి ప్రయత్నిస్తూ వస్తున్నాను’ అని తన జీవిత కల గురించి వివరిస్తుంది నవదీప్ కౌర్. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ లేడీస్ సర్కిల్ ఇండియా, రూర్కెలా సిటీ లేడీస్ సర్కిల్తో అనుబంధం కలిగి ఉన్న నవదీప్ కౌర్ ఈ ప్రపంచాన్ని అందరూ జీవించడానికి మెరుగైన ప్రదేశంగా మార్చలన్న ఆకాంక్షనూ వెలిబుచ్చుతుంది. మిసెస్ వరల్డ్ పోటీలలో పాల్గొనడానికి వెళ్లిన నవదీప్ కౌర్కు ఈ సందర్భంగా ఆల్ ద బెస్ట్ చెబుదాం. గ్రాండ్ ఫినాలేను భారత కాలమానప్రకారం జనవరి 16న ఉదయం 6:30 గంటలకు ఆన్లైన్ ద్వారా చూసి, తెలుసుకోవచ్చు. -
సోనీ సంచలన ప్రకటన.. ఇక ఈవీ కార్లు కూడా!
జపాన్కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆటోమొబైల్ రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు ప్రకటించింది. అదీ ప్రపంచంలో శరవేగంగా వృద్ధిచెందుతున్న ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి అడుగుపెడుతున్నట్లు పేర్కొంది. ఇంతకాలం ఎంటర్టైన్మెంట్ రంగంతో అలరించిన సోనీ కంపెనీ.. ఇప్పుడు ఈవీ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. అమెరికా లాస్వెగాస్లో బుధవారం నుంచి(జనవరి 5 నుంచి 8వ తేదీ వరకు) సీఈఎస్ టెక్నాలజీ ట్రేడ్ ఫెయిర్ జరగనుంది. ఈ నేపథ్యంలో న్యూస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన సోనీ గ్రూప్ చైర్మన్-ప్రెసిడెంట్ కెనిచిరో యోషిదా స్వయంగా ఈవీ ఎంట్రీ ప్రకటన చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం ఓ కొత్త కంపెనీతో ముందుకు రానున్నట్లు.. ఆ కంపెనీ పేరును ‘సోనీ మొబిలిటీ ఇన్కార్పోరేషన్’గా ప్రకటించారు. అంతేకాదు Vision-S 02 పేరుతో ఎస్యూవీల ప్రొటోటైప్ను సైతం ప్రదర్శించారు. ఈ కంపెనీని ఆలస్యం చేయకుండా ఈ ఏడాదిలోనే లాంఛ్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈవీ వెహికిల్స్ ప్రకటన తర్వాత సోనీ షేర్ల ధరలు 4 శాతం పెరిగాయి. ఇదిలా ఉంటే సోనీ ఇదివరకే తర్వాతి తరం వాహనాల తయారీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో ఆడియో, వినోదాత్మక వ్యవస్థలను అందిస్తోంది కూడా. ఇప్పటికే పలు టెక్ దిగ్గజ కంపెనీలు ఈవీ మార్కెట్ ప్రకటనలు చేయగా.. Sony ఏకంగా నమునా మోడల్స్ను ప్రదర్శించడంతో పాటు ఆలస్యం చేయకుండా Sony Ev కంపెనీ పనులు మొదలుపెడుతుండడం విశేషం. చదవండి: కొత్త రకం టెస్ట్డ్రైవ్.. మన దేశంలోనే! -
అవునంటారా? దెయ్యంగారేనంటారా!
అనగనగా లాస్ వేగస్లో (యూఎస్)లో ఒక బామ్మ. ఈ బామ్మకు ఒక కొడుకు. అతడికి ఇద్దరు పిల్లలు. ఇప్పటివరకు బానే ఉంది. అయితే బామ్మ మనవడు, మనవరాలు తమ గదిలో అర్ధరాత్రి దాటిన తరువాత నిద్రలోనే ఎవరితోనో మాట్లాడుతున్నారట. మొదట కల కావచ్చు అనుకున్నారట. కానీ పదే పదే పిల్లలు నిద్రలో మాట్లాడుతుండడంతో ఆ గదిలో మోషన్ యాక్టివేటెడ్ కెమెరాను సెట్ చేశారు. రెండు మూడురోజుల తరువాత ఈ కెమెరాను పరిశీలించగా తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఒక ఆకారం కనిపించింది. పిల్లలు ఎవరో ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్లే మాట్లాడుతున్నారట గానీ భయపడడం లేదట. ఒకరోజు అయితే ఈ ఆకారం ‘బయటికి వెళ్లండి’ అని పిల్లలను గట్టిగా గద్దించిందట. బామ్మ ఈ అనుభవాన్ని ఫొటోతో సహా ఫేస్బుక్లో షేర్ చేసింది. సలహా ఇవ్వమని అడిగింది. ‘మూఢనమ్మకాలను వదలండీ’ ‘మీరేదో భ్రమల్లో ఉన్నారు’ ‘ఫేక్ ఇమేజ్’ లాంటి తిట్లతో పాటు– ‘ఇల్లు అమ్మేసి వేరే ఇంట్లోకి మారండి. 20 సంవత్సరాల ఇంట్లోకి దెయ్యాలు రావడం కొత్తేమీ కాదు’ లాంటి సలహాలు కూడా వచ్చాయి. ఒక ఆకారం ఏదో కనిపిస్తున్న ఫొటో గురించి ప్రస్తావన వస్తే–‘ఫేక్ ఫొటోలు సృష్టించే టెక్నికల్ నాలెడ్జ్ నాకు లేదని ఎవరిని అడిగినా చెబుతారు. పబ్లిసిటీ కోసం పాకులాడాల్సిన ఖర్మ నాకేమిటి!’ అంటోంది బామ్మ. నిజం దెయ్యమెరుగు! చదవండి: విమానంలో పిచ్చి చేష్టలు.. 20 ఏళ్ల జైలు, 2 కోట్ల జరిమానా! -
ఆస్తి 5 మిలియన్ డాలర్లు.. కానీ తినేది..
వాషింగ్టన్: ఎడమ చేత్తో కాకిని తోలరు... పిల్లికి బిచ్చం కూడా వేయరు.. సాధారణంగా పిసినారుల గురించి చెప్పేటప్పుడు ఇలాంటి సామెతలు వాడతారు. కానీ ఇక్కడ మనం చెప్పుకోబోయే మహా పిసినారి.. పిల్లికి బిచ్చం వేయదు సరికదా ఆ పిల్లి తినే ఆహారాన్నే తాను తింటుంది. అంతేకాదు ఇంటికి వచ్చిన అతిథులకు సైతం అదే వడ్డిస్తుంది. పాపం.. ఆమె పేదవారేమో అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఆమె ఒక మల్టీ మిలియనీర్. ఆస్తి విలువ సుమారు 5.3 మిలియన్ డాలర్లు(దాదాపు రూ. 38 కోట్లు). కానీ ఒక్క పైసా కూడా వృథా చేయడం ఆమెకు ఇష్టం ఉండదు. వెయ్యి డాలర్లతో నెల మొత్తం గడిపేస్తుంది. వాషింగ్ స్క్రబ్ పీలికలు అయ్యేంత వరకు ఉపయోగిస్తుంది. వంటగదిలో ఒక్క కత్తి మాత్రమే వాడుతుంది. తనను తాను చీపెస్ట్ మల్టీ మిలియనీర్గా చెప్పుకొనే అమీ ఎలిజబెత్ వ్యవహారశైలి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘‘22 నిమిషాలు కాగానే వాటర్ హీటర్ను ఆఫ్ చేసేస్తా. అంతకు మించి క్షణం కూడా ఆలస్యం చేయను. ఎందుకంటే నీళ్లు ఎంత వేడెక్కితే నా స్నానానికి సరిపోతాయో నాకు బాగా తెలుసు. దీంతో నాకు 80 డాలర్లు ఆదా అవుతాయి. అంతేకాదు నేను క్యాట్ ఫుడ్ తీసుకుంటాను. నా ఇంటికి వచ్చేవారికి కూడా అదే పెడతాను. తద్వారా కిరాణా బిల్లు తగ్గిపోతుంది. ’’ అని అమెరికాలోని లాస్ వేగాస్కు చెందిన అమీ టీఎల్సీతో మాట్లాడుతూ తన జీవన విధానం గురించి చెప్పుకొచ్చారు.(చదవండి: పాతిపెట్టిన పిల్లిని తీసి కూర వండేసింది!) అంతేకాదు పాత వస్తువులతోనే కాలం నెట్టుకొస్తానని, తద్వారా కొత్తవి కొనేందుకు ఏటా అవసరమయ్యే సుమారు 2 లక్షల డాలర్లు ఆదా అవుతాయని పేర్కొన్నారు. ఇక అమీ మాజీ భర్త మైఖేల్ ముర్రే ఇంటి పనులన్నీ చేస్తారు. దీంతో పనిమనిషికి ఇవ్వాల్సిన 400 డాలర్లు ఆమెకు మిగిలిపోతున్నాయట. ఇక ఉద్యోగరీత్యా తరచుగా ప్రయాణాలు చేసే అమీ, 17 ఏళ్ల కాలం నాటి కారునే వాడతారు. డబ్బు పొదుపు చేసేందుకే తాను ఈ మార్గాలు ఎంచుకున్నానని, ఎవరు ఏమనుకున్నా తను అసలు పట్టించుకోనని ఆమె చెప్పుకొచ్చారు. అమీకి సంబంధించిన ఇంటర్వ్యూపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. -
నటుడు, అతడి ప్రియురాలు మృతి
లాస్వెగాస్: హాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. నటుడు గ్రెగొరీ టైరీ బోయ్స్(30), అతడి ప్రియురాలు నటాలీ అడెపోజు(27) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. లాస్వెగాపస్లోని గ్రెగొరీ టైరీ బోయ్స్ నివాసంలో వీరిద్దరి మృతదేహాలను గుర్తించారు. వీరు ఆత్మహత్య చేసుకున్నారా, మరేదైనా కారణం ఉందా అనేది తెలియరాలేదు. వీరిద్దరి మృతదేహాలు పక్కపక్కనే ఉన్నాయి. ఘటనా స్థలంలో పౌడర్ లాంటి తెల్లటి పదార్థం దొరికిటనట్టు స్థానిక మీడియా వెల్లడించింది. అయితే ఇది క్రిమినల్ సంఘటన కాదని పోలీసులు పేర్కొన్నారు. టాక్సికాలజీ నివేదిక కోసం తాము ఎదురు చూస్తున్నామని తెలిపారు. వీరిద్దరూ ఏడాది కాలంగా కలిసివుంటున్నారని సమాచారం. బోయిస్కు పదేళ్ల కుమార్తె, అడెపోజుకు కొడుకు ఉన్నాడు. 2008లో వచ్చిన ట్విలైట్ సినిమాలో గ్రెగొరీ టైరీ బోయ్స్ తొలిసారిగా నటించాడు. ఈ సినిమాలో టైలర్ క్రౌలీ పాత్రలో అతడు కనిపించాడు. బోయిస్ మృతి పట్ల అతడి కుటుంబ సభ్యులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నన్ను ఎందుకు వదిలి వెళ్ళావు? అంటూ బోయిస్ తల్లి లిసా వేన్ తల్లడిల్లారు. బోయిస్, అడెపోజు వెస్ట్ కోస్ట్ రాపర్స్ పేరిట చికెన్ వింగ్స్ వ్యాపారాన్ని ప్రారంభించే పనిలో ఉన్నారని ఆమె వెల్లడించారు. బోయిస్ మృతి పట్ల ట్విలైట్ అభిమానులు సంతాపం తెల్పుతున్నారు. -
లాస్ వెగాస్ ‘అవతార్’ షో!
లాస్ వెగాస్: అమెరికాలోని లాస్ వెగాస్లో ‘2020 కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్)’ అదరగొట్టే ఆవిష్కరణలతో అట్టహాసంగా ప్రారంభమైంది. పలు దిగ్గజ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ సంస్థలు తమ కొంగొత్త ఉత్పత్తులను ఇందులో ప్రదర్శనకు ఉంచాయి. మెర్సిడెస్ బెంజ్ ’ఏఐ’ కాన్సెప్ట్ సూపర్ హిట్ హాలీవుడ్ సినిమా అవతార్ ప్రేరణతో రూపొందించిన ఏవీటీఆర్ కాన్సెప్ట్ కారును మెర్సిడెస్ బెంజ్ ఆవిష్కరించింది. పర్యావరణానికి చేటు చేయని విధంగా మనిషి, యంత్రాలు సమన్వయంతో జీవనం సాగించవచ్చని తెలియజెప్పే రీతిలో ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని డిజైన్ చేసింది. ఈ అటానమస్ వాహనంలో స్టీరింగ్ వీల్, పెడల్స్ వంటివి ఉండవు. సెంటర్ కన్సోల్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. బ్యాటరీ సహా ఇందులో అన్ని భాగాలను పూర్తిగా రీసైక్లబుల్ ఉత్పత్తులతో రూపొందించారు. హ్యుందాయ్ ఎయిర్ ట్యాక్సీ దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ కొత్తగా రూపొందిస్తున్న ఎయిర్ ట్యాక్సీలను ఎస్–ఏ1 పేరిట ఆవిష్కరించింది. విద్యుత్తో నడిచే ఈ ఎయిర్ ట్యాక్సీ గరిష్టంగా గంటకూ 290 కి.మీ. వేగంతో ప్రయాణించగలదు. సుమారు 100 కి.మీ. దూరంలో, అరగంట ప్రయాణం ఉండే ప్రాంతాలకు నడిపే ట్యాక్సీ సర్వీసుల కోసం వీటిని వినియోగించేందుకు హ్యుందాయ్తో ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ ఒప్పందం కుదుర్చుకుంది. శాంసంగ్ ‘డిజిటల్ అవతార్’ దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తాజాగా కృత్రిమ మేథతో (ఏఐ)తో పనిచేసే ‘డిజిటల్ మనిషి’(డిజిటల్ అవతార్)ని ఆవిష్కరించింది. ఇది అచ్చం మనుషుల్లాగే సంభా షించడం, భావాలను వ్యక్తపర్చడం వంటివి చేయగలదని సంస్థ పేర్కొంది. నియోన్ అనే ఈ టెక్నాలజీతో డిజిటల్ అవతార్లను సృష్టించవచ్చని, డిస్ప్లేలు లేదా వీడియో గేమ్స్లో ఉపయోగించవచ్చని శాంసంగ్ తెలిపింది. అవసరానికి తగ్గట్లుగా టీవీ యాంకర్లుగా, సినిమా నటులు, అధికార ప్రతినిధులుగా లేదా స్నేహితులుగానూ వీటిని తీర్చిదిద్దుకోవచ్చని సంస్థ పేర్కొంది. శాంసంగ్ డిజిటల్ మనిషి -
బెంజ్ కంపెనీ ‘అవతార్’ కారు లాంచ్
-
చిలీ సింగర్ అర్ధ నగ్నంగా....
-
చిలీ సింగర్ అర్ధ నగ్నంగా.......
చిలీలో మానవ హక్కులకు కాలరాసి ప్రజలను హింసిస్తున్న భద్రతా దళాలకు వ్యతిరేకంగా ప్రముఖ చిలీ–మెక్సికన్ గాయనీ మాన్ లఫ్తార్టే గురువారం నాడు లాస్ వెగాస్లో జరిగిన 20వ లాటిన్ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో అర్ధనగ్నంగా నిరసన ప్రదర్శన జరిపారు. నిరసనగా గుర్తుగా నల్లటి ప్యాంట్, నల్లటి కోటు ధరించిన ఆమె రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ వేదికపైకి ఎక్కి కోటును కిందకు జారవిడిచి తన వక్షోజాలను బయట పెట్టారు. తన చిలీ ప్రజలను హింసించి, రేప్ చేసి, చంపుతున్నారన్న మెడ మీదు నుంచి వక్షోజాల కింది వరకు రాసుకున్నారు. ఆ తర్వాత చిలీ ప్రజల పోరాటానికి మద్దతుగా ఆమె చిలీ కవి రాసిన కవిత్వాన్ని వినిపించారు. ఆ తర్వాత పోరాటానికి మద్దతుగా పాటను కూడా పాడి వినిపించారు. మాన్ లఫ్తార్టే తన పాటలకు వచ్చిన రెండో ‘గ్రామీ అవార్డు ట్రోపీ’ని అందుకోవడానికి అక్కడికి వెళ్లారు. ఆ తర్వాత ఆమె తెల్లటి గౌను ధరించి నవ్వుతూ ట్రోపీతో ప్రేక్షకుల ముందు కనిపించి ఆకట్టుకున్నారు. మంచి పింఛన్లు ఇవ్వాలంటూ మంచి ఆరోగ్య భద్రతను కల్పించాలంటూ, విద్యావకాశాలను పెంచాలంటూ లక్షలాది మంది చిలీ ప్రజలు వీధుల్లోకి వచ్చి గత కొంతకాలంగా నిరసన ప్రదర్శనలు జరుపుతున్నారు. వారి ఆందోళనలను అణచి వేసేందుకు చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్ పియనెరా, అక్టోబర్ 19వ తేదీన దేశంలో అత్యయిక (ఎమర్జెన్సీ) పరిస్థితిని విధించారు. నాటి నుంచి చిలీ భద్రతా దళాలు ప్రజలను నిర్బంధించి హింసిస్తున్నాయి. కొంత మంది మహిళలను రేప్లు చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. భద్రతా దళాలు పేల్చిన పెల్లెట్స్ వల్ల నెల రోజుల్లో దాదాపు 200 మంది అంథులయ్యారు. -
ఫుట్పాత్లపై పడుకోవడం నేరం!
సాక్షి, న్యూఢిల్లీ : లాస్ వెగాస్ నగరంలో ఫుట్పాత్లపై ప్రజలెవరూ పడుకోకుండా నగర పాలక మండలి కొత్త చట్టం తీసుకొచ్చింది. రాత్రి. పగలు తేడా లేకుండా అన్ని వేళల్లో ఫుట్పాత్లపై టెంట్లు వేసుకొని గానీ, నిద్రపోతూ ఎవరైనా కనిపిస్తే దాన్ని నేరంగా పరిగణించి వెయ్యి డాలర్ల జరిమానా విధిస్తారు. అమెరికాలో ఇలాంటి చట్టాన్ని అమలు చేస్తున్న మొదటి నగరంగా కూడా లాస్ వెగాస్కు గుర్తింపు ఉంది. గతంలో బాయిస్, ఇదాహో నగరాలు ఇలాంటి చట్టాలను తీసుకరాగా అమెరికా సర్క్యూట్ కోర్టులు కొట్టివేశాయి. ఈసారి ఇక్కడ అలా జరగదని సిటీ అలార్నీ బ్రాడ్ జెర్బిక్ చెప్పారు. ‘ప్రభుత్వ షెల్టర్లలో పడకలు ఖాళీగా ఉన్నప్పుడు’ అనే క్లాజ్ చట్టంలో తీసుకొచ్చామని ఆయన తెలిపారు. పేద ప్రజలకు ఉద్దేశించిన ప్రభుత్వ షెల్టర్లలో పడకలు ఖాళీగా ఉంటున్నాయని కూడా ఆయన చెప్పారు. లాస్ వెగాస్లో పేద ప్రజలే కాకుండా, డ్రగ్స్కు అలవాటు పడిన వాళ్లు, ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లు ఫుట్పాత్లపై పడుకుంటున్నారు. నగరంలో అద్దెలు ఎక్కువ అవడం వల్ల కూడా చాలా మంది ఫుట్పాత్లను ఆశ్రయిస్తున్నారు. పర్యాటకుల రద్దీ ఎక్కువ ఉన్న చోట్ల ఈ చట్టాన్ని మినహాయించినట్లు అటార్నీ తెలిపారు. బుధవారం నాడే ఈ చట్టాన్ని తీసుకొచ్చిన నగర పాలక మండలి తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. వెయ్యి డాలర్లు కట్టలేని వాళ్లను జైళ్లకు పంపిస్తామని చెబుతున్నారుగానీ ఎన్ని రోజులు పంపిస్తారన్నది చట్టంలో స్పష్టంగా పేర్కొనలేదు. -
విమానంలో లైంగిక దాడి : భారతీయుడికి జైలు శిక్ష
న్యూయార్క్ : విమానంలో నిద్రిస్తున్న మహిళను లైంగికంగా వేధించిన భారతీయుడికి గురువారం తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ ఏడాది జనవరిలో స్పిరిట్ ఎయిర్లైన్స్కు చెందిన విమానంలో లాస్వెగాస్ నుంచి డెట్రాయిట్ వెళుతున్న ప్రభు రామమూర్తి తన పక్కనున్న 23 ఏళ్ల యువతి నిద్రిస్తుండగా అసభ్యకరంగా వ్యవహరించాడు. తాను మెలుకవ వచ్చి చూడగా నిందితుడు తన దుస్తులు తొలగించి తనను తాకరాని చోట తాకుతూ అమర్యాదకరంగా ప్రవర్తించాడని బాధితురాలు వెల్లడించారు. నిందితుడు తీవ్ర తప్పిదానికి పాల్పడినందున 11 సంవత్సరాల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు కోరగా, అమెరికా జిల్లా జడ్జి టెరెన్స్ బెర్గ్ 9 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇతరులు ఈ తరహా నేరాలకు పాల్పడకుండా ఇలాంటి శిక్షలు ఉపకరిస్తాయని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ఆగస్టులో న్యాయస్ధానం రామమూర్తిని దోషిగా తేల్చింది. జైలు శిక్ష పూర్తయిన అనంతరం రామమూర్తిని అమెరికా అధికారులు భారత్కు తరలిస్తారు. కాగా శిక్ష ఖరారు చేసే సమయంలో వృత్తిరీత్యా మోడల్ అయిన బాధితురాలు న్యాయస్ధానంలో మాట్లాడేందుకు నిరాకరించారు. ముందువరుసలో తన బాయ్ఫ్రెండ్తో కలిసి కూర్చుని తీర్పును వీక్షించారు. విచారణ సందర్భంగా ధైర్యంగా తనకు ఎదురైన లైంగిక వేధింపులను వివరించిన బాధితురాలిని అమెరికన్ అటార్నీ మ్యాథ్యూ స్కెండిర్ ప్రశంసించారు. విమానాల్లో ప్రయాణిస్తున్నప్పుడు సురక్షితంగా ఉండే హక్కు ప్రతిఒక్కరికీ ఉందని పేర్కొన్నారు. 2015లో వర్క్ వీసాపై అమెరికా వచ్చిన రామమూర్తి తన భార్యతో కలిసి లాస్వెగాస్ విమానంలో డెట్రాయిట్ వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. -
వైరల్ : చాలా అరుదైన సంఘటన
వాషింగ్టన్ పోస్ట్ : పోగోట్టుకున్న వస్తువులను తిరిగి పొందడం చాలా చాలా కష్టం. పోయిన వస్తువు కాస్తా ఏ పర్సు లాంటిదో అయితే మరిక దాని గురించి మర్చిపోవాల్సిందే. ఒకవేళ అదృష్టం బాగుండి దొరికినా.. అందులో డబ్బులుండటం మాత్ర కల్ల. కానీ అమెరికాకు చెందిన ఓ వ్యక్తికి మాత్రం వీటన్నింటికి కాస్తా భిన్నమైన అనుభవం ఎదురయ్యింది. పోయిన పర్సు దొరకడమేకాక.. దానిలో ఉన్న సొమ్ముకు మరికాస్తా జోడించి మరి చాలా భద్రంగా పార్శిల్ చేశాడు వివరాలు తెలియని ఓ వ్యక్తి. నమ్మడానికి కాస్తా కష్టంగా ఉన్నా ఇది మాత్రం వాస్తవం. వివరాలు.. హంటర్ షమత్ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం తల్లిదండ్రులతో కలిసి లాస్ వెగాస్లో జరుగుతున్న తన సోదరి వివాహానికి హాజరయ్యేందుకు వెళ్లాడు. అయితే తన పర్స్ను విమానంలోనే మర్చిపోయాడు. దానిలో 40 డాలర్ల సొమ్ముతో పాటు, 400 డాలర్ల విలువ చేసే చెక్, అన్నింటికంటే ముఖ్యమైన అతని ఐడీ కార్డ్ ఉన్నాయి. లాస్ వెగాస్లో దిగిన తరువాత తన పర్స్ మర్చిపోయినట్లు గుర్తించిన హంటర్ ఈ విషయం గురించి ఎయిర్లైన్స్ అధికారులకు కూడా సమాచారం ఇచ్చాడు. కానీ ఎటువంటి లాభం లేకపోయింది. పెళ్లికెళ్లి బాగా ఎంజాయ్ చేయాలని భావించిన హంటర్.. తన పర్స్ పోగోట్టుకుని విషాదంలో మునిగి పోయాడు. కనీసం ఐడీ కార్డ్ దొరికిన బాగుండేదనుకున్నాడు హంటర్. ఎందుకంటే అది లేకపోతే అతని తిరిగి తన ఇంటికి వెళ్లలేడు. దాంతో ఈ విషయం గురించి తెగ ఆందోళన పడ్డాడు. వివాహనంతరం కుటుంబంతో కలిసి వెగాస్ నుంచి తన ఇళ్లు దక్షిణ డకోటాకు ప్రయాణమయ్యాడు హంటర్. ఎయిర్పోర్టులో దాదాపు ఓ గంటసేపు విచారించిన తరువాత ఎట్టకేలకు హంటర్ని లోనికి అనుమతించారు. గండం గడిచిందంటూ ఇంటికి చేరుకున్న హంటర్కోసం అప్పటికే ఓ సర్ఫ్రైజ్ ఎదరు చూస్తోంది. అదేంటంటే తాను విమానంలో పొగోట్టుకున్న పర్సు. హంటర్తో పాటే విమానంలో ప్రయాణించిన ఓ వ్యక్తి ఈ పర్సును గమనించి తిరిగి దాన్ని హంటర్కు చేర్చాడు. పర్సుతో పాటు ఓ ఉత్తరాన్ని కూడా పెట్టాడు సదరు వ్యక్తి. ‘హంటర్ ఈ పాటికే నువ్వు నీ పర్సు కోసం తెగ వెతికి ఉంటావని నాకు తెలుసు. ఈ పర్స్ని నువ్వు ఒమాహ నుంచి డెన్వర్కు ప్రయాణించిన విమానంలో.. 12 వరుసలో.. సీట్ ఎఫ్(F) వద్ద జారవిడుచుకున్నావ్. దీని కోసం నువ్వు వెతికి ఉంటావనే భావిస్తున్నాను. ఇక మీదటైన దీన్ని జాగ్రత్తగా ఉంచుకో ఆల్ ది బెస్ట్’ అంటూ హితవు పలికాడు. అంతేకాక పర్స్లో ఉన్న 40 డాలర్లకు మరో 60 డాలర్లను కలిపి మొత్తం 100 డాలర్లను హంటర్కిచ్చాడు. పర్స్ దొరికినందుకు గాను పార్టీ చేసుకునేదకు నేను మరి కొంత సొమ్మును ఇందులో ఉంచుతున్నానంటూ తెలిపాడు సదరు వ్యక్తి. పార్శల్ని చూసిన హంటర్ తొలుత నమ్మలేదు. కానీ తరువాతం సంతోషంతో ఉప్పొంగిపోయాడు. తనకు పార్శల్ పంపిన వ్యక్తి వివరాలు తెలుసుకునేందుకు హంటర్ ప్రయత్నం చేశాడు. కానీ లాభం లేకపోయింది. దాంతో తమకు సాయం చేసిన మంచి వ్యక్తి గురించి నలుగురికి తెలియాలనే ఉద్దేశంతో ఈ విషయాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు హంటర్ తల్లి. దాంతో ఈ విషయం కాస్తా వైరల్ అవ్వడమే కాక.. సదరు ఆగంతకుడికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. -
చనిపోయినా ఎన్నికల్లో గెలిచాడు
లాస్వేగాస్ : అమెరికాలోని నెవడాలో జరిగిన ఎన్నికల్లో గత నెల మరణించిన ఓ వ్యక్తి భారీ మెజార్టీతో గెలుపొందాడు. 36వ అసెంబ్లీ డిస్ట్రిక్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేసిన వేశ్య గృహాల యజమాని, టీవీ రియాలిటీ షో స్టార్ డెన్నిస్ హోప్ (72) విజయం సాధించాడు. అయితే హోప్ గత నెల 16నే మరణించాడు. చనిపోయిన కొద్ది రోజుల ముందే ఆయన 72వ జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు. హోప్ మరణించినా ప్రత్యర్థి డెమోక్రటిక్ అభ్యర్థి లెసియా రామనోవ్పై భారీ ఆధిక్యం లభించింది. నెవడా చట్ట ప్రకారం ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థి మరణించినా ఓటింగ్ జరుగుతుంది. ఒక వేళ చనిపోయిన వ్యక్తి గెలిస్తే .. ఆ పార్టీకి చెందిన మరో వ్యక్తితో ఆ స్థానాన్ని భర్తీ చేస్తారు. దీంతో అతని స్థానాన్ని మరొకరితో భర్తీ చేయాలని కౌంటీ అధికారులు రిపబ్లికన్ పార్టీకి సూచించారు. కేవలం ఈ రాష్ట్రంలోనే వ్యభిచారానికి అధికారికంగా అనుమతుండగా.. హోప్ 5 వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నాడు. హెచ్బీవో ఛానెల్ అడల్ట్ కంటెంట్ క్యాథ్హౌస్ సిరీస్లో కూడా హోప్ నటించాడు. ‘ది ఆర్ట్ ఆఫ్ ది పింప్’ , ది ఆర్ట్ ఆఫ్ ది డీల్’ పేరుతో పుస్తకాలు రాశాడు. -
పాట కోసం ఫ్లైట్ ఎక్కాడు!
పాట కోసం ఫ్లైట్ ఎక్కి ఫారిన్ వెళ్లారు హీరో విజయ్. అక్కడి బ్యూటీఫుల్ లొకేషన్స్లో ప్రేయసితో డ్యూయెట్ పాడుకుంటారట. ఈ సాంగ్ ‘సర్కార్’ చిత్రం కోసమే. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కీర్తీ సురేశ్ కథానాయికగా నటిస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపిస్తారు. రీసెంట్గా చెన్నై షెడ్యూల్లో కోర్ట్ సీన్స్ను తెరకెక్కించిన ‘సర్కార్’ టీమ్ ఇప్పుడు సాంగ్ షూట్ కోసం లాస్ వేగాస్ వెళ్లారని కోలీవుడ్ సమాచారం. ఈ షెడ్యూల్లో వరలక్ష్మీ శరత్కుమార్ కూడా పాల్గొంటారు. ఈ నెల 11వరకు ఈ షెడ్యూల్ను ప్లాన్ చేశారట. ఈ చిత్రం ఈ ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది. ‘కత్తి, తుపాకి’ చిత్రాల తర్వాత విజయ్–మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో అంచనాలున్నాయి. -
విమానంలో రాత్రంతా దుర్బుద్ధి
న్యూయార్క్ : విమానంలో ఓ వ్యక్తి చెప్పకూడని పని చేశాడు. తన పక్క సీట్లో ఉన్న మహిళను అసభ్యకరంగా తడుముతూ రాత్రంతా లైంగికంగా వేధించాడు. అతడి పక్కనే భార్య కూడా ఉంది. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫెడరల్ అథారిటీ అధికారులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రభు రామమూర్తి అనే భారత సంతతి పౌరుడు అమెరికాలో తాత్కాలిక వీసాపై ఉంటున్నాడు. అతడు ఈ నెల (జనవరి) 3న భార్యతో కలిసి లాస్ వేగాస్ నుంచి డెట్రాయిట్కు బయలుదేరాడు. అయితే, విమానంలో అతడి పక్క సీట్లో కిటికీవద్ద ఓ 22 ఏళ్ల మహిళ కూర్చొని ఉంది. ఆమె ఆదమరిచి నిద్రపోతున్న సమయంలో పక్కన కూర్చున్న ప్రభు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె దుస్తుల బటన్స్ కూడా తొలగించాడు. ఆ మహిళకు మెలకువ రాగానే తన దుశ్చర్యలను ఆపేశాడు. కంగారుగా ఆ మహిళ వెంటనే లోపల సిబ్బందికి ఘటనపై ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తన భార్యకు ఆ మహిళకు మధ్య ప్రభు కూర్చుని ఈ దుర్బుద్ది చూపించాడు. సరిగ్గా విమానం మరో 40 నిమిషాల్లో ల్యాండ్ అవుతుందనగా ఈ పనికి పాల్పడ్డాడు. ఈ మేరకు అరెస్టు చేసిన పోలీసులు అతడిని నేరుగా కోర్టుకు తరలించారు. దీంతో కోర్టు అతడికి బెయిల్ కూడా ఇవ్వకుండా అతడు చేసింది చాలా తీవ్రమైన నేరం అని పేర్కొంది. మరోపక్క, ఈ ఘటనపై ప్రభు, అతడి భార్య కలిసి వేర్వేరు సమాధానాలు ఇచ్చారు. పిల్స్ వేసుకుని తాను నిద్రలోకి జారుకున్నానని, ఆ మహిళే తన మొకాళ్లపై నిద్రపోయిందని ప్రభు చెప్పగా, తాము సీట్లు మార్చాలని కోరినా సిబ్బంది ఆ పనిచేయలేదని భార్య చెప్పింది. -
పర్యాటకుల స్వర్గధామం లాస్ వేగాస్
టీ.నగర్: పర్యాటకుల స్వర్గధామంగా లాస్ వేగాస్ విరాజిల్లుతున్నట్లు శార్ధాగ్లోబల్ మార్కెటింగ్ పీఆర్– డైరెక్టర్ పల్లబి రాజ్కోన్వర్ తెలిపారు. చెన్నైలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పర్యాటకులను అత్యధికంగా ఆకర్షిస్తున్న లాస్వేగాస్లో పుట్టిన రోజులు, వార్షికోత్సవాలు, వివాహాలు అధికంగా జరుగుతుంటాయని, అంతేకాకుండా లయొనెల్ రిజీ, సెలిన్ డియోన్, రోడ్ స్టీవర్ట్, ఎల్టన్ జాన్, కార్లోస్ శాంటానా వంటి ఐకానిక్ పెర్ఫామర్స్ ఇక్కడ ఉన్నట్లు తెలిపారు. అలాగే, బ్రిట్ని స్పియర్స్, జెన్నిఫర్ లోపెజ్, బాయ్స్ 11 మెన్, మెరయా కేరి ఇక్కడే ఉంటున్నారని తెలిపారు. అలాగే, ఇక్కడ కంట్రీ మ్యూజిక్ రెసిడెన్సీగా ఉన్న రెబా, బ్రూక్స్, డున్లను సంగీతాభిమానులు దర్శించవచ్చన్నారు. లాస్ వేగాస్ కన్వెన్షన్ అండ్ విజిటర్స్ అథారిటీ (ఎల్వీసీవిఏ) సదరన్ నెవడాను టూరిజం, కన్వెన్షన్ డెస్టినేషన్గా ప్రపంచ వ్యాప్తంగా కలిగివుందని, అలాగే, లాస్వేగాస్ కన్వెన్షన్ సెంటర్, క్యాష్మెన్ సెంటర్ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఐఫోన్, ఆండ్రాయిడ్లలో వేగాస్ వీఆర్ వర్చువల్ రియాలిటీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని www.vrtv. vegas వెబ్సైట్ ద్వారా ఇక్కడి అందాలను వీక్షించి అనుభూతి చెందవచ్చని, మరిన్ని వివరాలకు www. visitlasvegas.com సందర్శించవచ్చని తెలిపారు. -
సెక్స్ రాకెట్లో ఆ ఉన్మాది సోదరుడి అరెస్ట్
లాస్ వెగాస్ : అమెరికా దేశ చరిత్రలోనే అతి పెద్ద నర మేధానికి కారకుడైన స్టీఫెన్ క్రెయిగ్ పాడ్డాక్ (64) సోదరుడు బ్రూస్ పాడ్డాక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లాస్ వెగాస్ మాండలే బే రిసార్ట్ లోని మ్యూజిక్ కాన్సర్ట్ పై బుల్లెట్ల వర్షం కురిపించి స్టీఫెన్ దాదాపు 59 మందిని కాల్చి చంపడంతో పాటు ఎంతో మందిని ప్రాణభయంతో పరుగులు పెట్టించిన విషయం తెలిసిందే. ఉన్మాది స్టీఫెన్ పాడ్డాక్ తమ్ముడు బ్రూస్ పాడ్డాక్ సెక్స్ రాకెట్ నిర్వహిస్తూ దొరికిపోయాడని పోలీసులు బుధవారం వెల్లడించారు. నిందితుడు బ్రూస్ పాడ్డాక్ ముఖ్యంగా టీనేజర్లను వ్యభిచారకూపంలోకి లాగేవాడని ఆరోపణలున్నాయి. గతంలోనూ అతడిపై ఎన్నో కేసులు నమోదయ్యాయని, బ్రూస్ కోసం చేపట్టిన తాజా అపరేషన్లో అతడిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. 18 ఏళ్లలోపు యువతలను బ్రూస్ ట్రాప్ చేసేవాడని, అతడి ఇంట్లో దాదాపు 600 మంది టీనేజీ యువతుల నగ్న చిత్రాలు, పోర్నోగ్రఫీకి సంబంధించిన డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు 12 ఏళ్లలోపు బాలికలకు సైతం డబ్బు ఆశ చూపిస్తూ నగ్న ఫొటోలు తీసి ఆపై వేధింపులకు పాల్పడేవాడు. బ్రూస్ తరచుగా మకాం మారుస్తుండటంతో అతడి అరెస్ట్ ఆలస్యమైనట్లు తెలుస్తోంది. లాస్ వేగాస్ నరమేధానికి పాల్పడ్డ స్టీఫెన్ పాడ్డాక్ మరో తమ్ముడు ఎరిక్ పాడ్డాక్ మాత్రం ఇలాంటి ఉన్మాద చర్యలకు పాల్పడే వ్యక్తి కాదని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. మ్యూజిక్ కన్సార్ట్లో స్టీఫెన్ కాల్పులు జరిపిన అనంతరం ఈ ఘటనపై ఎరిక్ స్పందిస్తూ.. తన సోదరుడు ఇలాంటి చర్యలకు పాల్పడతాడని తెలియగానే షాక్కు గురయ్యానని చెప్పాడు. -
అనుభవం లేకుంటే వేల ప్రాణాలు గాల్లో...
న్యూయార్క్ : ముంబయిలో 2008లో జరిగిన ఉగ్రవాదుల దాడి అనుభవం వల్లే లాస్వేగాస్లో వేల ప్రాణాలు రక్షించడానికి ఉపయోగపడిందని అమెరికా పోలీసు అధికారి చెప్పారు. ఆ అనుభవంతోనే తాము శత్రువును అత్యంత శీఘ్రంగా మట్టుపెట్టగలిగామని లేదంటే వేల ప్రాణాలు పోయేవని ఆందోళన వ్యక్తం చేశారు. లాస్ వేగాస్లో స్టీఫెన్ పెడ్డాక్(64) అనే ఉన్మాది విచ్చలవిడిగా కాల్పులు జరిపి 58మంది ప్రాణాలు బలితీసుకున్న విషయం తెలిసిందే. 500మందికి పైగా గాయాలపాలయ్యారు కూడా. అయితే, అతడిని మట్టుబెట్టడంలో జోసెఫ్ లాంబోర్డ్ అనే వ్యక్తి కీలక పాత్ర పోషించారు. ఆయనన లాస్ వేగాస్ మెట్రోపాలిటన్ పోలీసు డిపార్ట్మెంట్లో షెరిఫ్గా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆయన ముంబయిలో దాడి జరిగినప్పుడు అమెరికన్లు కూడా చనిపోయిన నేపథ్యంలో ఆ దాడి పూర్వపరాలు తెలుసుకున్నారు. అలాగే, ముంబయి పోలీసులు, భారత ఆర్మీ ఉగ్రవాదులను ఎలా మట్టుపెట్టారో తెలుసుకున్నారు. అలాంటి సంఘటనే తమ వద్ద జరిగితే ఎలా స్పందించాలనే విషయంలో ప్రత్యేకంగా తమ వద్ద ఉన్న పోలీసులకు శిక్షణ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆరోజు సంగీత విభావరిపై కాల్పులు జరుగుతుండగా వెంటనే స్పందించి పోలీసులు నేరుగా ఉన్మాది గదిలోకి దూసుకెళ్లి అతడు హతమయ్యేలా చేశారు. లేదంటే ఆ రోజు వేల ప్రాణాలు పోయేవి. దీనికి సంబంధించి లాండోర్డ్ మాట్లాడుతూ.. 'భారత్లోని ముంబయిలో పాక్ ఉగ్రవాదులు చేసిన దాడి మాకు ఓ అనుభవం. దాని ద్వారానే మేం వేల ప్రాణాలు రక్షించుకోగలిగాం. ఈ విషయాన్ని అమెరికన్లు అర్ధం చేసుకోవాలి. సంగీత విభావరిలో దాదాపు 22 వేల మంది ప్రేక్షకులు ఉన్నారు. అతడు విచక్షణ రహితంగా వారిపై కాల్పులు మొదలుపెట్టాడు. శీఘ్రంగా స్పందించిన మా టీం అతడి గదికి వెళ్లి అంతమయ్యేలా చేసింది. ఆ హోటల్ గది నిండా ఆయుధాలు, షార్ప్ విపన్స్, పెద్ద మొత్తంలో గన్ పౌడర్స్ ఉన్నాయి. ఒక ఆయుధ మార్కెట్లాగా ఆ ఉన్మాది ఉన్న గది కనిపించింది. భారీ విధ్వంసం సృష్టించగల 24 అత్యాధునిక మెషిన్ గన్లు, తుపాకులు, రాకెట్ లాంచర్లు ఉన్నాయి. ఆ గది నుంచి వేర్వేరు ప్రాంతాలు అతడు ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టాడు. మూడు మానిటర్లు కూడా సిద్ధం చేసుకొని ఉన్నాడు. వాటన్నింటిని ఉపయోగించినట్లేయితే కచ్చితంగా వేల ప్రాణాలు పోయేవి. కానీ, దానిని నిలువరించగలిగాం' అని వివరించారు. -
ఉగ్రవాదం, అల్లర్లపై నిర్వచనంలో మరీ ఇంత వివక్షా?
అవలోకనం అమెరికాలో ఇటీవల సంగీత కచ్చేరిపై జరిగిన ఘాతుక దాడి.. వ్యక్తి చేసిన కాల్పులే కానీ ఉగ్రవాద చర్య కాదని అక్కడి పోలీసులు చెప్పారు. అతడు క్రైస్తవుడు. అదే ముస్లిం అయితే పోలీసులు ఇలాగే చెప్పేవారా? ప్రముఖ భాషా శాస్త్రవేత్త, రచయిత నామ్ చోమ్స్కీ ఇలాంటి సందర్భంలోనే మాట్లాడుతూ ‘మనం చేస్తే అది ఉగ్రవాద వ్యతిరేక చర్య. వాళ్లు చేస్తే అది ఉగ్రవాదం’ అన్నారు. అమెరికాలోని లాస్ వెగాస్ నగరంలో కొన్ని రోజుల క్రితం సంగీత కచ్చేరీకి హాజ రైన వారిపై ఒక వ్యక్తి జరిపిన కాల్పుల్లో 58 మంది మరణించారు. అతగాడు జన సమూహంపై తన మెషిన్గన్తో గంటసేపు జరిపిన కాల్పుల్లో 500పైగా జనం గాయపడ్డారు. ఇది వ్యక్తి చేసిన కాల్పులు కాబట్టి ఉగ్రవాద చర్య కాదని అమెరికన్ పోలీసులు చెప్పారు. హంతకుడు క్రైస్తవుడు. అతడు ముస్లిం అయితే పోలీసులు ఇలాగే చెప్పేవారా? నేనయితే అలా అనుకోవడం లేదు. ఆ వ్యక్తి గురించి, అతడి ఉద్దేశాల గురించి పెద్దగా తెలియడం లేదు కాబట్టే అతడి చర్య ఉగ్రవాదం కాదని నిర్ధారించడాన్ని, అలాగే మనం ఉగ్రవాదాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నామనే అంశాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ‘రాజకీయ లక్ష్యసాధన కోసం ప్రత్యేకించి పౌరులపై చట్టవిరుద్ధంగా హింసను ప్రయోగించడం, బెదిరించడమే ఉగ్రవాదం‘ అని నా పదకోశం నిర్వచిస్తోంది. దీని ప్రకారం హింసకు సంబంధించిన పలు చర్యలను ఉగ్రవాదంగా చెప్పవచ్చు. మతపరమైన హింస కూడా ఈ నిర్వచనం కిందికే వస్తుంది. మరి హింస కూడా రాజకీయ లక్ష్యసాధన కోసం పౌరులను బెదిరించే ఉద్దేశంతో జరిగే అక్రమ చర్యే కదా. కానీ మనలో చాలామంది మతపర హింసను ఉగ్రవాదంగా పరిగణించరు. 1984లో సిక్కులపై జరిగిన మారణకాండను అల్లర్లు అని పిలిచారు. ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన ముజఫర్నగర్ హింసను అల్లర్లు అన్నారు. బాబ్రీ మసీదును కూల్చివేసిన తర్వాత వందలాది ముస్లింలను హతమార్చిన ముంబై హింస కూడా అల్లర్లేనట. కానీ దానికి ప్రతీకారంగా జరిగిన బాంబు దాడులు మాత్రం ఉగ్రవాదమట. 2002లో అహ్మదాబాద్ లోని నరోడా పటియాలో 97 మంది ముస్లింలను ఊచకోత కోసిన ఘటన అల్లర్లు మాత్రమేనట. ఆ ఏడాదే అహ్మదాబాద్లోని అక్షరధామ్లో 30మంది హిందువులను చంపిన ఘటన మాత్రం ఉగ్రవాద దాడేనట. ‘పౌరులను లక్ష్యంగా చేసుకుని‘ అని ఉన్న పంక్తి మరీ చిత్రమైంది. జమ్మూకశ్మీర్లో జరుగుతున్న దాడుల్లో అనేకం సాయుధ బలగాలపైనే కానీ పౌరులను లక్ష్యంగా చేసుకున్నవి కావు. కానీ వీటిని మాత్రం మనం ఉగ్రవాద దాడులుగానే గుర్తిస్తున్నాం. రాజకీయ, సామాజిక లక్ష్య సాధన కోసం ప్రభుత్వాన్ని లేక పౌర జనాభాను, మరే ఇతర ప్రజా విభాగాన్ని కానీ బెదిరించడానికి లేదా బలవంతపెట్టడానికి చట్టవిరుద్ధంగా బలప్రయోగాన్ని, హింసను ఉపయోగించడమే ఉగ్రవాదమని అమెరికన్ చట్టం నిర్వచిస్తోంది. నేను ముందే చెప్పినట్లుగా లాస్ వెగాస్లో కాల్పులు జరిపిన షూటర్ గురించి, అతడి ఉద్దేశాల గురించి పెద్దగా తెలియదు. అతడి రాజకీయ లేక సామాజిక లక్ష్యాలు ఏంటో తెలియకున్నప్పటికీ అతడి చర్య ఉగ్రవాద దాడి కాదని ఎలా నిర్ధారించారన్నది స్పష్టం కావడం లేదు. ఉగ్ర బీభత్సానికి వ్యతిరేకంగా భారత్ తీసుకొచ్చిన చట్టాన్ని ఉగ్రవాద నిరోధక చట్టం (పొటా) అంటున్నారు. దీనికి 2002లో వాజ్పేయి ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. దేశంలోని అనేక చట్టాల్లాగే పొటాను కూడా పేలవమైన భాషలో రూపొందించారు. భారత సమైక్యత, సమగ్రత లేక సార్వభౌమత్వాన్ని ప్రమాదంలోకి నెట్టే ఉద్దేశంతో లేదా బాంబులను, డైనమైట్లను, ఇతర పేలుడు పదార్థాలను, మండే వస్తువులను, తుపాకులను, ఇతర మారణాయుధాలను, లేదా విషాన్ని, విషపూరిత వాయువులను, విష రసాయనాలను మరే ఇతర (జీవరసాయనిక లేక మరే ఇతర పదార్థాలనైనా) ఉపయోగించడం ద్వారా ప్రజలను, ఏ ఇతర ప్రజావిభాగాన్నయినా భయపెట్టడానికి చేసే దాడులను ఉగ్రవాదమని పొటా నిర్వచించింది. ఇలాంటి దాడుల ద్వారా ఏ వ్యక్తినైనా, వ్యక్తులనైనా చంపడానికి లేదా గాయపర్చడానికి; ఆస్తి నష్టం, విధ్వంసం కలిగించడానికి, వివిధ సామాజిక బృందాల జీవితానికి అవసరమైన అత్యవసర వస్తువుల సరఫరాను దెబ్బతీయడానికి చేసే ప్రయత్నాలన్నీ ఉగ్రవాదం కిందికే వస్తాయని పొటా పేర్కొంది. భారత దేశ రక్షణకు భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వాటి అవసరాల కోసం ఉపయోగించే సామగ్రి, లేదా ఆస్తిని నష్టపరిచే, ధ్వంసం చేసే చర్యలు కూడా ఉగ్రవాదం కిందికే వస్తాయని తెలిపింది. ప్రభుత్వాన్ని లేక మరే ఇతర వ్యక్తినైనా లోబర్చుకోవడానికి, ఎవరినైనా గాయపర్చడానికి, చంపడానికి లేదా నిర్బంధించడానికి పూనుకునే చర్యలన్నీ ఉగ్రవాదం కిందికే వస్తాయని పొటా నిర్వచించింది. ఈ మొత్తం పేరాలో ‘సమైక్యత, సమగ్రత, భద్రత, సార్వభౌమాధికారం‘ అనేవి కీలక పదాలు. భారతదేశ విచ్ఛిన్నత అనే భయం (ఇది ఎక్కడా కనిపించని భయం) ప్రాతిపదికన మనం పెంచుకున్న ఆందోళనే ఉగ్రవాదం పట్ల మన నిర్వచనాన్ని ప్రాథమికంగా నిర్దేశిస్తోంది. ఉగ్రవాదులు ఎన్నడూ ఉపయోగించని డైనమైట్లు వంటి విచిత్రమైన పదాలను ఈ నిర్వచనంలోకి తీసుకొచ్చారు. అదే సమయంలో ఆర్డీఎక్స్, సి14 లేదా ఇతర అధునాతన పేలుడు పదార్థాల ఊసే దీంట్లో లేకపోవడం గమనార్హం. ఉగ్రవాద చట్టాన్ని రూపొందించిన ప్రభుత్వ బ్యూరోక్రాట్ బహుశా బాలీవుడ్ సినిమాలు చూస్తూ పేలుడు పదార్థాలు అంటే ఇవే అనే ఎరుకను కలిగి ఉండవచ్చు. మొత్తంమీద చూస్తే, పెద్దగా ఆలోచించకుండానే ఈ చట్టాన్ని రూపొందించినట్లుంది. దేశంలో అనేక చట్టాలను ఇలాగే పేలవంగా తయారు చేసి సమర్పించారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాంటివి ఉన్నాయి. చట్టవ్యతిరేక పదార్థాల రూపకర్తలు, మాదక ద్రవ్యాల తయారీదారులు, గూండాలు, మానవ అక్రమ రవాణాదారులు, ఇసుక మాఫియా, లైంగిక నేరస్తులు, వీడియో చౌర్యం చేసేవారు తదితరులను నిరోధించే చట్టం కింద తమిళనాడులో మిమ్మల్ని ఏడాది పాటు విచారణ లేకుం డానే నిర్బంధించవచ్చు. మీరు ఏ నేరమూ చేయనవసరం లేదు. భవిష్యత్తులో మీరు నేరం చేస్తారని, చేయవచ్చని అనుమానిస్తే చాలు.. ప్రభుత్వం మిమ్మల్ని ఏడాది పాటు జైలులో పెట్టవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా అత్యాచారాల గురించి ప్రముఖ భాషా శాస్త్రవేత్త, రచయిత నామ్ చోమ్స్కీ మాట్లాడుతూ ‘మనం చేస్తే అది ఉగ్రవాద వ్యతిరేక చర్య. వాళ్లు చేస్తే అది ఉగ్రవాదం‘ అన్నారు. అదే మన విషయంలోకి వస్తే, అవి అల్లర్లు లేక వ్యక్తులు చేసిన పని. అదే ముస్లింలు కనుక చేస్తే కచ్చితంగా ఉగ్రవాదమే. ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
కాబ్స్.. ఓ వీర జవాను
లాస్ వేగాస్ : లాస్ వేగాస్ నరమేథం అమెరికాకు ఓ పీడ కలగా మిగిలింది. మ్యూజిక్ ఫెస్టివల్లో ఉన్న ప్రజలపై ఓ దుండగుడు కనికరం లేకుండా కాల్పులు జరిపి, తనకు తాను కాల్చుకుని మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీసిన ఓ ఫొటో కొద్ది రోజులుగా సోషల్ మీడియా వైరల్ అవుతోంది. బుల్లెట్ల వర్షానికి ఎదురెళ్లిన ఓ అమెరికన్ ఆర్మీ జవాను మహిళను రక్షించిన చిత్రమది. దాడి జరుగుతున్న సమయంలో సంఘటనాస్థలి వైపు దూసుకెళ్లిన వీర జవాను 'కాబ్స్' మహిళకు బుల్లెట్లు తగులకుండా తన శరీరాన్ని అడ్డుగా పెట్టాడు. అంతేకాదు పక్కన ఉన్న వారు బుల్లెట్ల తగిలి కుప్పుకూలుతున్న దృశ్యాన్ని ఆమె కంటపడకుండా ఉంచేందుకు ముఖానికి తన చేతిని అడ్డుగా పెట్టాడు. దుండగుడు కాల్పులు ఆపిన మరుక్షణమే ఆమెను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించాడు. అనంతరం మిగిలిన వారిని రక్షించేందుకు వెళ్లాడు కాబ్స్. గాయాలతో నెత్తురోడుతున్న వారి శరీరాల నుంచి బుల్లెట్లను తన వేళ్లతో బయటకు తీసి అత్యవసర చికిత్సకు తీసుకెళ్లెందుకు కాబ్స్ సాయంగా నిలిచినట్లు తెలిసింది. తొలుత ఫొటో ఆన్లైన్ వైరల్ అయిన సమయంలో ఆమె మరణించినట్లు అందరూ భావించారు. అయితే, ఘటన అనంతరం వారు సేఫ్గా తప్పించుకున్నారని ఫొటోను తీసిన ఫొటోగ్రాఫర్ ఓ అంతర్జాతీయ పత్రికకు చెప్పారు. లాస్ వెగాస్లో మ్యూజిక్ ఫెస్టివల్పై జరిగిన దాడిలో 59 మంది మరణించిన విషయం విదితమే. -
ఆయన అలాంటి వాడు కాదట..?!
-
ఆయన అలాంటి వాడు కాదట..?!
వాషింగ్టన్: లాస్వేగాస్లో నరమేధానికి దిగిన.. స్టీఫెన్ పెడాక్ గురించి అతని గర్ల్ఫ్రెండ్ మార్లు డాన్లీ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నరమేధం జరుగుతున్న సమయంలో పిలిప్పీన్స్లో ఉన్న ఆమె.. అమెరికాకు తిరిగి రావడంతో ఎఫ్బీఐ అధికారులు విచారణకు దిగారు. ఈ విచారణలో పలు కొత్త విషయాలు వెలుగు చూశాయి. పెడాక్ గురించి ఆమె మాట్లాడుతూ.. ‘అతను చాలా మంచివాడు.. మానవత్వం ఉన్న మనిషి, జాలి, దయ వంటి గుణాలు ఉండడమే కాక ఎవరితోనూ విభేధాలు, గొడవలు పడని వ్యక్తి’ అని చెప్పారు. అంతేకాక తనతో పొరపాటున కూడా.. ఇటువంటి రక్తపాతానికి దిగుతున్నట్లు కానీ, హింసాత్మక ఘటన చేస్తున్నట్లుకానీ మాట మాత్రంగానైనా చెప్పలేదని ఆమె అన్నారు. ఈ నరమేధం గురించి ఏ మాత్రం తెలిసున్నా.. ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకునేదాన్ని అని డాన్లీ చెప్పారు. భయంకర విధ్వంసం జరిగిపోయింది.. ఇప్పుడు చేయడానికి ఎవరి దగ్గర ఏం లేదు.. అని ఒకరకమైన నిర్వేదంతో ఆమె చెప్పారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని.. గాయాలతో చికిత్స పొందుతున్నవారు.. త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు డాన్లీ తెలిపారు. నరమేధంపై విచారణ చేస్తున్న అధికారులకు పూర్తిగా సహకరిస్తానని ఆమె స్పష్టం చేశారు. నరమేధం సృష్టించేందుకు పెడాక్కు ఎవరైనా ప్రేరణ కల్పించారా? లేక రక్తపాతం సృష్టించాలన్న ఆలోచనల పెడాక్లో ఎలా వచ్చింది? ఇందుకు నీ దగ్గర ఏదన్నా సమాచారం ఉందా? అని డాన్లీని ఎఫ్బీఐ అధికారులు ప్రశ్నించారు. దానికి స్పందించిన డాన్లీ.. పై విధంగా సమాధానాలు ఇచ్చారు. ఈ కేసుపై విచారణ చేస్తున్న అధికారులు మాత్రం పెడాక్కు సంబందించిన మూలాలను, నరమేధానికి గల కారణాలను తెలుసుకుంటామని చెబుతున్నారు. -
ఆ షూటర్ లక్ష డాలర్లు ఎవరికి పంపాడు..?
లాస్ వెగాస్ : లాస్ వెగాస్లో అనూహ్య దాడితో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. ఈ కేసు అంతు తేల్చేందుకు అధికారులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాల్పులు జరిపిన ఉన్మాది స్టీఫెన్ పెడాక్ (64) ఎందుకు ఆ విధంగా చేసి ఉంటాడనే గుట్టు తెలుసుకునేందుకు పోలీసుల మధ్య ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. తాజాగా అతడు కాల్పులు జరపడానికి ముందు రోజుల్లో దాదాపు లక్ష డాలర్లను పిలిప్పీన్స్కు బదిలీ చేశాడని గుర్తించారు. ప్రస్తుతం అక్కడ అతడి గర్ల్ఫ్రెండ్ మాత్రమే ఉంటుంది. అయితే, ఆ డబ్బు ఆమెకే పంపించాడా లేక మరింకెవరికైనా పంపించాడా అనే విషయం తేలాల్సి ఉంది. అయితే, సంపన్నుడైన పెడాక్ రోజుకు కనీసం పది వేల డాలర్లను జూదంలో వెచ్చించేవాడని పోలీసులు తెలుసుకున్నారు. ఇలాఎలా సాధ్యం అయిందనే దిశగా కూడా తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు. ఇక ప్రస్తుతం పిలిప్పీన్స్లో ఉంటున్న అతడి గర్ల్ఫ్రెండ్ మారిలౌ డాన్లీ (62)ని పోలీసులు తీరిగి బుధవారం అమెరికాకు రప్పించాలనుకుంటున్నారు. ఆమెను ప్రశ్నించడం ద్వారా సమాచారం తెలుసుకోవచ్చని వారు భావిస్తున్నారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పక్కా ప్లాన్ ప్రకరమే అతడు ఈ దారుణకాండకు తెగించాడని తెలుస్తోంది. అతడు అద్దెకు తీసుకున్న హోటల్లోని 32అంతస్తులో ప్రత్యేకంగా బయటా లోపల సెక్యూరిటీ కెమెరాలు కూడా అమర్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడి కోసం ఎవరైనా వస్తే వారిని గుర్తించేందుకు పోలీసులైతే తప్పించుకునేందుకు కూడా ఏర్పాట్లు చేసుకున్నాడట. మరోపక్క, ఐసిస్ కూడా తామే ఈ దాడికి కారణం అని ప్రకటించగా అలా అయ్యే చాన్స్ లేదని పోలీసులు కొట్టి పారేస్తున్నారు. విచారణ పూర్తయితేగాని తాము క్లారిటీ ఇవ్వలేమంటున్నారు. ఉన్మాది గర్ల్ఫ్రెండ్ గురించి ప్రశ్నించినప్పటికీ నేరుగా సమాధానాలు చెప్పేందుకు పోలీసులు ఆసక్తి చూపడం లేదు. ఉన్మాది నిజంగానే ముస్లిం మతంలోకి మారాడా? మారాకా ఐసిస్లో చేరాడా? తానే ఉన్మాదిలా మారి ఈ కాల్పులకు తెగబడ్డాడా? ఈ చర్యకు దిగే ముందు తన గర్ల్ఫ్రెండ్తో ఈ విషయం చెప్పాడా? ఈ విషయం అతడి గర్ల్ఫ్రెండ్కు ముందే తెలుసా? వంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంది. లాస్వెగాస్లో ఆహ్లాదంగా సాగుతున్న మ్యూజిక్ కన్సర్ట్ (సంగీత విభావరి)పై విచ్చలవిడిగా కాల్పులు జరిపి 58 మందిని పొట్టనపెట్టుకున్న విషయం తెలిసిందే. కన్సర్ట్ వేదిక పక్కనున్న హోటల్లోని 32వ అంతస్తునుంచి విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. -
వేగాస్ కాల్పుల్లో రియల్ హీరో
లాస్ వేగాస్: ఎదుటి వారి ప్రాణం కళ్లముందే పోతున్నా మనకు ఎందుకులే అనుకునే ఈ రోజుల్లో ఓవ్యక్తి అసమాన ధైర్యసాహసాలు చూపించాడు. సోమవారం లాస్వేగాస్లో జరిగిన కాల్పుల్లో వందలాది మంది ప్రాణాలు కాపాడాడు. కాలిఫోర్నియాకు చెందిన జొనాథన్ స్మిత్(30) కాఫీ మెషిన్ మెకానిక్గా పని చేస్తున్నాడు. సోమవారం నాడు తన సోదరుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడానికి లాస్వేగాస్ వచ్చాడు. దేశీయ సంగీత ఉత్సవం జరుగుతున్న మాండలై బే హోటల్లో పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నాడు. అంతలోనే కాల్పుల మోత ప్రారంభమైంది. దీంతో తన 9మంది కుటుంబ సభ్యులను కాపాడుకునే ప్రయత్నంలో వారందరని అక్కడ నుంచి సురక్షితంగా బయటకు పంపించగలిగాడు. అనంతరం కాల్పులు జరుగుతున్నయంటూ గట్టిగా అరుస్తూ, అక్కడ ఉన్న వారిని తనతో పాటు రావాలంటూ సూచించాడు. ఎయిర్పోర్టు మార్గంలో ఉన్న వికలాంగుల కార్పార్కింగ్ ప్రాంతానికి అక్కడ ఉన్న చాలా మందిని సురక్షితంగా తరలించగలిగాడు. ఈప్రయత్నంలో దుండగుడి గన్లోంచి స్మిత్ మెడలోకి ఓబుల్లెట్ దూసుకుపోయింది. అయినా ఏమాత్రం భయపడకుండా ప్రజల ప్రాణాలు కాపాడగలిగాడు. ఈ సందర్భంగా స్మిత్ మాట్లాడుతూ తనకు బుల్లెట్ తగిలినందుకు ఏమాత్రం బాధలేదని కొంతమందినైనా రక్షించింనందుకు సంతోషంగా ఉందన్నాడు. మెడలో బుల్లెట్ తగలడంతో స్మిత్ పక్కటెముకలు పాక్షింగా దెబ్బతిన్నాయని, జీవిత కాలం బుల్లెట్ స్మిత్ శరీరంలోనే ఉంటుందని వైద్యులు ప్రకటించారు. తనకు ఎటువంటి ప్రమాదం లేదని, త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతానని స్మిత్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈసంఘటనతో స్మిత్ సోషల్మీడియాలో హీరో అయిపోయాడు. గాయాలతో ఉన్న ఫోటో 75వేల సార్లు షేర్ అవగా, లక్షా 77వేల లైకులను సాధించింది. -
తుపాకి రాజ్యంలో ఉన్మాదం
ఆయుధాలపై ఉన్న యావను వదుల్చుకోవడానికి ససేమిరా సిద్ధపడని అమెరికా అందుకు మరోసారి మూల్యం చెల్లించింది. సోమవారం లాస్వెగాస్లో కోలా హలంగా సాగుతున్న సంగీత కచేరీని తన్మయులై వీక్షిస్తున్న వేలాదిమందిపై అక్కడికి సమీపంలో ఉన్న భవనం నుంచి విచక్షణారహితంగా కాల్పులు సాగించి ఒక ఉన్మాది 59మందిని పొట్టనబెట్టుకుని, మరో 515మందిని గాయపరిచాడు. 32వ అంతస్తు నుంచి ఇష్టానుసారం కాలుస్తుంటే ఎటునుంచి ఎవరు గురిపెట్టారో, ఎటు పోయి ప్రాణాలు దక్కించుకోవాలో తెలియక వేలాదిమంది పరుగులు తీశారు. ఇదంతా తమ ఘనతేనని ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ప్రకటించుకున్నా ఆ సంస్థ నెవరూ విశ్వసించే స్థితి లేదు. అమెరికా విధానాలనూ, రాజకీయాలనూ తుపాకులే శాసిస్తున్న దుస్థితిలో ఇలాంటి ఉన్మత్త ఉదంతాలు నిరాటంకంగా కొనసాగడంలో వింతేమీ లేదు. ఇప్పుడు విషాద ఘటన చోటుచేసుకున్న లాస్వెగాస్ నెవడా రాష్ట్రం లోనిది. అక్కడ రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నవారికంటే, అంటువ్యాధులతో మరణిస్తున్నవారికంటే తుపాకులకు బలవుతున్నవారి సంఖ్యే అధికంగా ఉన్నదంటే ఆయుధాలెంత విచ్చలవిడిగా పెరిగిపోయాయో అర్ధం చేసుకోవచ్చు. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ లాస్వెగాస్ ఘటనపై విచారం వ్యక్తం చేసి ఉండొచ్చు. కానీ ఈ పాపంలో ఆయనా, ఆయన ప్రాతినిధ్యం వహి స్తున్న రిపబ్లికన్ పార్టీ తమ బాధ్యత నుంచి తప్పించుకోలేరు. తుపాకుల వినియో గాన్ని నియంత్రించడానికి ఉద్దేశించిన బిల్లు సెనేట్ ముందుకొచ్చినప్పుడల్లా రిపబ్లికన్లు గట్టిగా వ్యతిరేకిస్తూ వచ్చారు. ఆఖరికి నిరుడు జూన్లో ఓర్లాండో నైట్ క్లబ్పై దాడి జరిగి 50మందిని కాల్చిచంపిన తర్వాత కూడా సెనేట్లో వచ్చిన ప్రతిపాదనలను వారు తోసిపుచ్చారు. ఈ మాదిరి తుపాకి సంస్కృతి అమెరికాలో మినహా ప్రపంచంలో మరే దేశంలోనూ లేదు. బ్రిటన్తోసహా అభివృద్ధి చెందిన దేశాలన్నీ క్రమేపీ దానికి దూరమయ్యాయి. పరిమితులు విధించుకున్నాయి. అమెరికాలో కూడా తుపాకి లైసెన్స్ల జారీలో ఆంక్షలను అమలు చేస్తున్న రాష్ట్రాలు న్నాయి. ఆ రాష్ట్రాల్లో కాల్పుల ఘటనలు అతి స్వల్పంగా ఉన్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయినా వాటిని ఆదర్శంగా తీసుకోవడానికి ఫెడరల్ ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలూ నిరాకరిస్తున్నాయి. సంక్షోభం తలెత్తినప్పుడు దాన్ని అన్ని కోణాల్లోనూ పరిశీలించి పరిష్కరిం చడం, భవిష్యత్తులో తలెత్తకుండా చూడటం ప్రభుత్వం బాధ్యత. ప్రజల స్పంద నలను తెలుసుకోవడం, వాటిపై చర్చ జరిగేలా చూడటం, సహేతుకమైన నిర్ణయం తీసుకుని సమాజాన్ని ఒప్పించడం దాని కనీస కర్తవ్యం. కానీ అమెరికాలో దేని దారి దానిదే. ఘటన జరిగిన రోజు దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం మినహా ప్రభుత్వం వైపు చేసేదేమీ ఉండదు. అటు విపక్షం నుంచి చెదురుమదురు ప్రకటనలొచ్చినా వాటిని ఖండించేందుకు తుపాకి లాబీల నుంచి కొందరు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. లాస్వెగాస్ ఘటన తర్వాత హిల్లరీ క్లింటన్ తుపాకులను అదుపు చేయా లని డిమాండ్ చేస్తే ఆ వెంటనే దాన్ని రాజకీయం చేయొద్దని విమర్శిస్తూ ట్విటర్ హోరెత్తింది. పైగా కాల్పుల ఘటన చోటు చేసుకున్నాక తుపాకులు ఉండాలా వద్దా అనే అంశంపై సర్వేలు జరగడం, వాటిల్లో అధిక సంఖ్యాకులు ఉండాలని కోరడం రివాజుగా మారింది. రెండేళ్లక్రితం ఒరెగన్ రాష్ట్రంలో కళాశాలలోకి ప్రవేశించి ప్రొఫెసర్తో పాటు మరో 9 మందిని ఒక ఉన్మాది కాల్చి చంపినప్పుడు అప్పట్లో రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న ట్రంప్, జెబ్ బుష్లిద్దరూ తుపాకుల నిషేధం డిమాండ్ను అవహేళన చేశారు. ‘సమస్య పరిష్కారం తుపా కుల నిషేధంలో లేదు. మరిన్ని తుపాకులు అందుబాటులోకి తీసుకురాకపోవ డంలో ఉంది’ అని వాదించారు. కళాశాల విద్యార్థుల వద్ద తుపాకులుంటే ఆ ఉన్మాదిని సులభంగా నిలువరించేవారని చెప్పారు. తుపాకులు కొంటున్నవారెవరో, వారికి ఆ అవసరం ఎందుకొచ్చిందో తెలుసు కోవాలన్న ఆసక్తి ప్రభుత్వాలకు ఉండటం లేదు. కొంటున్నవారి నేపథ్యం తెలియక పోవడం ప్రమాదానికి దారితీయొచ్చన్న సంశయంగానీ, అమ్మకాలపై నిఘా అవసరమనిగానీ వాటికి తోచడం లేదు. లాస్వెగాస్ ఘటనే తీసుకుంటే ఉన్మాది స్టీఫెన్ పెడాక్ చాలా సాధారణమైన వ్యక్తి అని, అతనికి ఏ సంస్థతోనూ సంబంధాల్లే వని అతడి సోదరుడు చెబుతున్నాడు. అలా అంటూనే అతన్ని కలిసి ఆర్నెల్లయిం దని అంటున్నాడు. అటు పోలీసులు సైతం పెడాక్పై గతంలో ఎలాంటి కేసులూ లేవంటున్నారు. పెడాక్కు స్వయానా సోదరుడైన వ్యక్తికే సరైన సంబంధాలు లేనప్పుడు ఇరుగుపొరుగువారి గురించి చెప్పేదేముంది? సవ్యంగానే ఉన్నాడను కున్న వ్యక్తి ఒక హోటల్లో రూం తీసుకుని అక్కడ 45 తుపాకులు పోVó శాడంటే, ఆ సంగతి ఎవరికీ తెలియలేదంటే తామెంతటి ప్రమాదకర స్థితిలో ఉన్నామో అమెరికన్లు అర్ధం చేసుకోవాల్సి ఉంది. ప్రపంచంలో ఉగ్రవాదం ఏమూలనున్నా అంతం చేస్తామని చెప్పే అమెరికా తన ఇంట ఏం జరుగుతున్నదో తెలుసుకోలేక పోవడం ఒక వైచిత్రి. దాడి చేసిన వ్యక్తి ముస్లిం అయితే వెనువెంటనే ఆ చర్యను ఉగ్రవాదంగా ప్రకటించే ట్రంప్ ఈ ఉదంతంలో దాని ఊసెత్తలేదు. నెవడా చట్టం ప్రకారం విద్రోహ చర్య, భౌతికంగా హాని తలపెట్టడం, బలప్రయోగంతో నిర్బంధించడం, విధ్వంసం సృష్టించడం, భవనం లేదా మరే ఇతర ఆస్తులను, కమ్యూనికేషన్లు, రవాణా సదాపాయాలను విచ్ఛిన్నం చేయడం, ప్రకృతి వనరులకు నష్టం కలిగిం చడం వగైరాలు ఉగ్రవాదం కిందికొస్తాయని చెబుతున్నది. లాస్ వెగాస్ ఉదం తంలో ఇవన్నీ వర్తించినా ఆ పదాన్ని ఉపయోగించకపోవడాన్నిబట్టి ట్రంప్ ఆంత ర్యాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఏటా తుపాకులు, తూటాల పరిశ్రమ రూ. 10,000 కోట్లకుపైగా లాభాలను ఆర్జిస్తూ వెలుగులీనుతుంటే రోడ్లపై అమాయకులు పిట్టల్లా రాలుతున్నారు. తుపాకి ఉండటం ఒక హోదాగా భావిస్తూ, ప్రాణానికి అదే గ్యారెంటీ అని నమ్ముతూ బతికితే అసలుకే మోసం వస్తుందని సగటు పౌరులు గ్రహించనంత వరకూ, పాలకులపై ఒత్తిడి తీసుకురానంత వరకూ ఇలాంటి ఉన్మాద చర్యలు ఆగవు. -
చీకట్లో ఈఫిల్ టవర్
-
చీకట్లో ఈఫిల్ టవర్
పారిస్ : లాస్వేగాస్ కాల్పుల దుర్ఘటనలో మృతిచెందిన వారికి నివాళిగా పారిస్లోని ఈఫిల్ టవర్లో సోమవారం రాత్రి విద్యుత్ దీపాలను వెలిగించలేదు. ఉగ్రవాద వికృత క్రీడలో 59 మంది మరణించగా.. వందలాది మంది తీవ్ర గాయాల పాలయ్యారు. అమెరికా చరిత్రలోనే అది అత్యంత దారుణమైన దుర్ఘటన. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం ఫ్రాన్స్లోని మార్షిల్లే రైల్వే స్టేషనల్లో ఇద్దరి వ్యక్తులను ఇస్లామిక్ తీవ్రవాదులు హతమార్చిన విషయం తెలిసిందే. ఈ రెండు ఘటలనలను తామే చేసినట్లు ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకుంది. మార్షిల్లే, లాస్వేగాస్ మృతులకు నివాళిగా.. ఈఫిల్ టవర్లోని విద్యుత్ దీపాలను వెలిగించడం లేదని ప్రభుత్వం తెలిపింది. -
నర మేధ కారకుడు.. నమ్మలేని నిజాలు
సాక్షి : కేవలం ఒక్కడే లాస్ వెగాస్ లో 59 మందిని దారుణంగా కాల్పి చంపి .. 520 మందిని గాయపరిచాడు. మాండలే బే రిసార్ట్ లోని మ్యూజిక్ కాన్సర్ట్ పై బుల్లెట్ల వర్షం కురిపించిన స్టీఫెన్ క్రెయిగ్ పాడ్డాక్ అమెరికా దేశ చరిత్రలోనే అతి పెద్ద నర మేధానికి కారకుడయ్యాడు. 64 ఏళ్ల పాడ్డాక్ అసలు ఎందుకిలా చేశాడన్న దానిపై పూర్తి వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. రిసార్ట్ కు 130 కిలోమీటర్ల దూరంలోని ఈశాన్యంలో ఉన్న మెసీ క్వీట్ లో పాడ్డాక్ నివాసముంటున్నాడు. గోల్ఫర్లు, జూదగాళ్లు ఎక్కువగా ఉండే ఆ ప్రాంతంలో ఫెన్తోపాటు పాటు 62 ఏళ్ల మారిలో డాన్లే అనే మహిళ కూడా ఆ ఇంట్లో ఉంటోందంట. అయితే ఆమె ఘటన జరిగిన సమయంలో టోక్యోలో ఉందని, ఆమెతో తాము మాట్లాడామని పోలీసులు వెల్లడించారు. పాడ్డాక్ కు హంటింగ్, ఫిషింగ్, పైలట్ లైసెన్సులు ఉన్నాయని తెలిపారు. ధనికుడైన అతనికి రెండు చిన్నపాటి విమానాలు కూడా ఉన్నాయని తెలిపారు. గతంలో లాక్ హీడ్ మార్టిన్ లో ఇంటర్నల్ ఆడిటర్ గా మూడేళ్లపాటు పనిచేసినట్టు గుర్తించారు. ఈ మధ్య ఇస్లాంకు మతం మారిన అతను.. ఐసిస్లో చేరి ఈ పనికి పాల్పడి ఉంటాడా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాడ్డాక్కు ఎలాంటి నేరచరిత్ర లేదని చెప్పిన పోలీసులు, ఘటన అనంతరం అతని నివాసంలో 34 తుపాకులను, పెద్ద ఎత్తున్న తూటాలను స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో అతని కుటుంబం గురించి మాత్రం ఆసక్తికర విషయాలను వెల్లడించారు. స్టీఫెన్ తండ్రి హాస్కిన్స్ బెంజమిన్ పాడ్డాక్ ఓ కరుడుగట్టిన దొంగ అని తెలుస్తోంది. ఒనానోక సమయంలో ఎఫ్బీఐ మోస్ట్ వాంటెడ్ జాబితాలో అతని పేరు 8 ఏళ్ల పాటు ఉంది. వరుస బ్యాంకు దొంగతనాలతో పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన అతను.. ఓ కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష పడి టెక్సాస్ కేంద్ర కారాగారంలో శిక్షననుభవించాడు. 1969లో జైలు నుంచి తప్పించుకుని పారిపోయాడు కూడా. వైద్యులు అతనిని సైకోపాత్ గా పేర్కొనేవారని, తరచూ ఆత్మహత్యల గురించి తోటి ఖైదీలతో మాట్లాడుతుండే వాడని పోలీసులు తెలిపారు. సోదరుడు ఏం చెబుతున్నాడంటే.. తన సోదరుడు తండ్రి లాగ కాదని ఎరిక్ క్రెయిగ్ పాడ్డాక్ చెబుతున్నారు. మత, రాజకీయ, మిలటరీ సంస్థలతో స్టీఫెన్కు ఎలాంటి సంబంధాలు లేవని ఎరిక్ స్పష్టం చేశారు. అతని అవివాహితుడు అని సోదరుడు చెబుతున్నప్పటికీ.. 1980లో స్టీఫెన్ కాలిఫోర్నియాలో జీవించేప్పుడు ఓ మహిళను వివాహం చేసుకున్నాడని రికార్డులు చెబుతున్నాయి. తన సోదరుడు చాలా మంచివాడని, ఇది తన సోదరుడే చేశాడంటే నమ్మశక్యంగా లేదని, పైగా అతనికి ఆర్థిక సమస్యలు కూడా ఏం లేవని సోదరుడు తెలిపాడు. స్టీఫెన్కు విలాస పురుషుడని.. పోకర్ (జూదం) ఆటంటే తన సోదరుడికి చాలా ఇష్టమని, దాని కోసమే తన నివాసాన్ని లాస్ వెగాస్ కు మార్చాడని ఎరిక్ తెలిపారు. ఓవైపు ఘటనకు తామే బాధ్యులమని ఐసిస్ ఇప్పటికే ప్రకటించగా.. దర్యాప్తు పూర్తయ్యాకే ఆ అంశంపై ఓ నిర్ధారణకు వస్తామని అధికారులు చెబుతున్నారు. ఇక ఇప్పటిదాకా జరిగిన ఘటనల్లో చాలా మట్టుకు యుక్త వయసు ఉన్న వాళ్లే ఘటనలకు పాల్పడిన దాఖలాలు ఉండగా.. 60 ఏళ్ల వయసులో స్టీఫెన్ ఎందుకిలా చేశాడన్నది తేలాల్సి ఉందని మానసిక వైద్య నిపుణులు అంటున్నారు. దీంతో ఉన్మాద చర్యా, ఉగ్ర ఘటన అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
అమెరికా చరిత్రలోనే ఘోర మారణకాండ
-
అమెరికా చరిత్రలోనే ఘోరమారణకాండ
కేసినోలకు, నైట్ క్లబ్లకు ఫేమస్ అయిన లాస్వెగాస్లో నరమేధం సృష్టించాడో రాక్షసుడు. విశాల ప్రాంగణంలో జేసన్ ఆల్డీన్ సంగీతాన్ని ఆస్వాదిస్తున్న భారీ జనసముదాయంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి 58 మందిని పొట్టన పెట్టుకున్నాడు. ఆ మ్యూజిక్ కన్సర్ట్ జరుగుతున్న ప్రదేశానికి పక్కనే ఉన్న ఒక హోటల్లోని 32వ అంతస్తులోని తన గదిలోని కిటికీ నుంచి తాపీగా కిందనున్న అమాయక ప్రజలపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఎక్కడినుంచి దూసుకొస్తున్నాయో తెలియని బుల్లెట్లు శరీరాల్ని ఛిద్రం చేస్తోంటే.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అక్కడి ప్రజలు సురక్షిత ప్రదేశం కోసం పరుగులు పెట్టారు. ఈ కాల్పుల్లో 5 వందల మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ మారణకాండకు పాల్పడిన, స్థానికుడైన స్టీఫెన్ పెడాక్ తనను తాను కాల్చుకుని చనిపోయాడు. ఈ ఘటనలో ఉగ్రవాద కోణాన్ని ఎఫ్బీఐ తోసిపుచ్చగా.. ఈ కాల్పులకు పాల్పడింది తమ సైనికుడేనని ఐసిస్ ప్రకటించింది. లాస్వెగాస్: అమెరికాలో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. లాస్వెగాస్లో ఆహ్లాదంగా సాగుతున్న మ్యూజిక్ కన్సర్ట్ (సంగీత విభావరి)పై విచ్చలవిడిగా కాల్పులు జరిపి 58 మందిని పొట్టనపెట్టుకున్నాడు. కన్సర్ట్ వేదిక పక్కనున్న హోటల్లోని 32వ అంతస్తునుంచి విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. పైనుంచి కాల్పులు జరగటంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ఎటుపోవాలో తెలియక బాధితులు తోచిన వైపు పరుగులు తీశారు. ఉన్మాది మారణకాండతో సంగీతవిభావరి ఆర్తనాదాలతో మార్మోగిపోయింది. ఈ ఘటనలో 500 మందికి పైగా గాయాలయ్యా యి. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనకు కారకుడైన ఉన్మాది స్టీఫెన్ పెడాక్ (64) అనంతరం తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, ఈ ఘటనకు తామే బాధ్యులమని, కొద్ది నెలల క్రితమే పెడాక్ ఇస్లాం మతం స్వీకరించాడని ఐసిస్ పేర్కొంది. అయితే ఇది ఉన్మాద చర్యేనని.. ఉగ్ర ఘటనగా భావించట్లేదని ఎఫ్బీఐ పేర్కొంది. ఈ ఘటనపై ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా పలువురు దేశాధినేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, లాస్వెగాస్ బాధితుల్లో భారతీయులెవరూ లేరని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అసలేం జరిగింది? ‘రూట్ 91’ పేరుతో లాస్వెగాస్లోని మాండలే బేలో మూడ్రోజుల మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతోంది. దాదాపు 30వేల మంది సంగీతాభిమానులు చుట్టు పక్కల రాష్ట్రాలనుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. కచేరీ ఉత్సాహంగా సాగుతోంది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి పదిగంటల సమయంలో కన్సర్ట్లో అందరూ ఉత్సాహంగా ఉన్న సమయంలో హఠాత్తుగా కాల్పులు మొదలయ్యాయి. దీంతో కన్సర్ట్లో కలకలం రేగింది. ఎక్కడినుంచి వస్తున్నాయో తెలియని గుళ్ల వర్షం నుంచి తప్పించుకునే అవకాశమే లేకుండా పోయింది. ఎత్తైన భవనం పైనుంచి పక్కా వ్యూహంతో జరిపిన ఈ కాల్పులు సంగీతాభిమానుల ప్రాణాలను బలితీసుకున్నాయి. ఎటువెళ్లాలో అర్థం కాక ఆర్తనాదాలతో తలోదిక్కుకు పారిపోయే ప్రయత్నంలో మరింత గందరగోళం నెలకొంది. బాధితుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు, వైద్యులు పేర్కొన్నారు. 32వ అంతస్తు నుంచి కన్సర్ట్ వేదిక పక్కనే మాండలే బే కాంప్లెక్స్ ఉంది. ఈ భవనం 32వ అంతస్తులోని హోటల్ గదిలో స్టీఫెన్ పెడాక్ మకాం వేశాడు. ఈ ఘటన కోసం వ్యూహాత్మకంగానే ఎత్తైన భవంతిని పెడాక్ ఎంచుకున్నాడు. ఈయన ఉన్న గది నుంచి కన్సర్ట్ జరుగుతున్న ప్రాంతం 1700 అడుగుల దూరం (ఏటవాలుగా 518 మీటర్లు) ఉంది. పైనుంచి బుల్లెట్లు దూసుకొస్తుండటంతో కచేరీలో ఉన్న వారికి కూడా ఎటుపోవాలో తోచలేదు. దీని కారణంగానే మృతులు, బాధితుల సంఖ్య పెరిగింది. కాల్పులు పక్కనున్న హోటల్ భవంతి నుంచి వస్తున్నాయని గుర్తించిన పోలీసులు 32వ అంతస్తులోని ఆ గదిలోకి చేరుకునేసరికే.. పెడాక్ తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. పోలీసులు ఆ గది నుంచి 10 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే.. ఘటన జరిగిన సమయంలో అతనితోపాటు ఓ మహిళ ఉందని గుర్తించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ ఘటనతో ఆ మహిళకు సంబంధం లేదని నిర్ధారించారు. అమెరికా చరిత్రలోనే అత్యంత దారుణ ఘటనగా ఈ కన్సర్ట్ కాల్పులను పేర్కొన్నారు. ‘ఈ దారుణ ఘటనలో 58 మంది మరణించారు. 200 మంది వరకు గాయపడి ఉంటారని మొదట భావించాం. కానీ 515 మందిని ఆసుపత్రులకు తీసుకెళ్లాం. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది’ అని పోలీసు ఉన్నతాధికారి లోంబార్డో తెలిపారు. లాస్ వెగాస్కు 130కిలోమీటర్ల దూరంలోని మెస్క్విట్ పట్టణంలోని పెడాక్ ఇంటిలోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు. అతని ఇంటినుంచి ఆయుధాలు, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. గాజు పగిలిందనుకున్నాం! ‘కచేరీలో మునిగిపోయి ఉండగా.. ఒక్కసారి గాజు పగిలిన శబ్దం వచ్చింది. ఏం జరిగిందని తెలుసుకునే లోపే బుల్లెట్లు దూసుకొచ్చాయి. కాసేపటికి కాల్పులు ఆగిపోయాయనుకున్న సమయంలో మళ్లీ బుల్లెట్ల వర్షం మొదలైంది’ అని మోనిక్ డెకెర్ఫ్ అనే బాధితుడు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో అమెరికా విఖ్యాత గాయకుడు జేసన్ అల్డీన్ వేదికపై ఉన్నారు. ‘15–20 మంది నా కళ్లముందే చనిపోవటం చూశాన’ంటూ మరో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో చాలా మంది.. ‘కాల్పుల శబ్దం కన్సర్ట్ సౌండ్ ఎఫెక్ట్ లో భాగమనే అనుకున్నాం. క్షణాల్లోనే కన్సర్ట్ మ్యూజిక్ కాదు.. నిజంగానే కాల్పులు జరుగుతున్నాయని అర్థమైంది’ అని పేర్కొన్నారు. మ్యూజిక్ కన్సర్ట్ ఓ యుద్ధభూమిని తలపించింది. అత్యవసర సిబ్బంది చేతికందిన టేబుళ్లు, మెటల్ రెయిలింగ్లను స్ట్రెచర్లుగా వినియోగించి.. బాధితులను వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. ప్రముఖుల దిగ్భ్రాంతి భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా వివిధ దేశాధినేతలు ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీన్ని భయంకరమైన దుర్ఘటనగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. బాధితులకు దేశమంతా అండగా ఉందన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. లాస్వెగాస్ ఘటనకు సంతాపంగా వైట్హౌజ్తోపాటుగా ప్రభుత్వ కార్యాలయాలపై అమెరికా జాతీయ జెండాను అవనతం చేశారు. ‘మతిలేని ఈ దుశ్చర్య.. కలచివేసింది’ అని పోప్ ఫ్రాన్సిస్ ట్వీటర్లో పేర్కొన్నారు. ఘోరమైన దాడిగా అభివర్ణించిన బ్రిటన్ ప్రధాని థెరిసా మే.. బాధితులకు సానుభూతి తెలిపారు. గతేడాది జూన్లో ఫ్లోరిడాలోని పల్స్ నైట్క్లబ్లో జరిగిన కాల్పుల దుర్ఘటనలో 49 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 2015 నవంబర్లో పారిస్లోని బాటక్లాన్లో జరిగిన ఓ కన్సర్ట్పై జరిగిన దాడిలో 90 మంది మృతిచెందారు. అది మా పనే: ఐసిస్ మ్యూజిక్ కన్సర్ట్పై కాల్పుల ఘటనకు తమదే బాధ్యతని ఐసిస్ పేర్కొంది. ‘లాస్వెగాస్ దాడికి కారకుడు మా సైనికుడే. మా సూచన మేరకే పెడాక్ ఈ దాడికి పాల్పడ్డాడు. ఐసిస్ జిహాదీలపై దాడులకు పాల్పడే దేశాలకు ఇదే గతి పడుతుంది. పెడాక్ కొద్ది నెలల క్రితమే ఇస్లాం స్వీకరించాడు’ అని ఐసిస్ సమాచార విభాగం అమాక్ ఆన్లైన్ ప్రకటనలో పేర్కొంది. అయితే.. ఈ ఘటనలో ఉగ్రకోణమేదీ కనబడలేదని ఎఫ్బీఐ తెలిపింది. ఇప్పటివరకు జరిగిన విచారణలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో పెడాక్కు ఎటువంటి సంబంధం లేదని తేలిందని స్పష్టం చేసింది. పెడాక్ అమెరికాకు చెందిన విమానయాన, భద్రత సంస్థ ‘లాక్హీడ్ మార్టిన్’లో 1985 నుంచి 1988 వరకు పనిచేశాడు. అమెరికాలో రక్తచరిత్ర నెవడాలోని లాస్ వెగాస్లోకాల్పులు (2017) ఫ్లోరిడాలోని ఓర్లాండో నైట్క్లబ్ (2016) వర్జీనియా పాలిటెక్నిక్ ఇనిస్టిట్యూట్ 2007) కనెక్టికట్లోని శాండీహుక్ స్కూల్ (2012) టెక్సాస్లోని లూబీ రెస్టారెంట్లో (1991) కాలిఫోర్నియాలోని మెక్డొనాల్డ్లో (1984) శాన్ బెర్నార్డినో దాడి (2015) ఎడ్మండ్ పోస్టాఫీస్లో కాల్పులు (1986) ఫోర్డ్వుడ్లో కాల్పులు (2009) బిగ్హాంప్టన్లో కాల్పులు (2009) కొలరాడోలోని అరోరాలో (2012) ప్రాణాలతో బయటపడ్డాం.. సాక్షి, అమరావతి: అమెరికాలోని లాస్వెగాస్లో జరిగిన కాల్పుల ప్రాంతంలో చిక్కుకున్న పశ్చిమగోదావరి జిల్లా భీమవరం యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. భీమవరంకు చెందిన కర్రి ప్రేమ్ కుమార్(జర్నలిస్టు), మల్లినీడి తిరుమలరావు (బాబి, రియల్టర్), నారాయణ (వ్యాపారి), మరో ఇద్దరు సెప్టెంబర్ 15న అమెరికా పర్యటనకు వెళ్లారు. వేర్వేరు నగరాల్లో పర్యటించి చివరిగా లాస్వెగాస్కు వచ్చారు. అక్కడ కాల్పులు చోటుచేసుకోవడంతో పోలీసుల సహకారంతో ప్రాణాలతో బయటపడి హోటల్లో తలదాచుకున్నారు. అసలేం జరుగుతోందో అర్థంకాలేదు:ప్రేమ్కుమార్ ‘శుక్రవారం లాస్వెగాస్కు వచ్చాం. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో కాసినో గేమ్ బోర్డుల వద్ద చూస్తున్నాం. అదే సమయంలో మా హోటల్ పక్కనున్న మరో హోటల్లో సంగీత కచేరి జరుగుతోంది. కచేరీకి దాదాపు 25 వేల మంది ప్రేక్షకులొచ్చారు. ఒక్కసారిగా కాల్పుల మోత విన్పించడంతో ప్రేక్షకులంతా చెల్లాచెదురుగా పరుగెత్తారు. ఏం జరుగుతుందో అర్థంకాలేదు. భయంతో ఒకరినొకరు తొక్కుకుంటూ పరుగెత్తారు. అందరూ సేఫ్జోన్కు వెళ్లాలని సెక్యూరిటీ సిబ్బంది సంకేతాలిచ్చారు. హోటల్లో ఓదుండగుడు కాల్పులు జరుపుతున్నట్టుగా మాకు సమాచారం అందింది. చాలా మంది హోటళ్లలో సేఫ్జోన్లో ఉన్నారు. విమాన సర్వీసులు పునరుద్ధరిస్తే ఇక్కడి నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నాం’. -
‘షూటర్ ఆత్మాహుతి’
లాస్వెగాస్: హోటల్లో జరుగుతున్న సంగీత విభావరిలోకి చొచ్చుకువచ్చి కాల్పులు జరిపిన దుండగుడు ఆత్మాహుతికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. తాను దాక్కున్న హోటల్ రూమ్ను భద్రతా సిబ్బంది పగులగొట్టే ముందు షూటర్ తనను తాను హతమార్చుకుని ఉండవచ్చని భావిస్తున్నామని లాస్వెగాస్ షెరీఫ్ జోసెఫ్ లాంబార్డో చెప్పారు. కాన్సర్ట్కు హాజరైన వారిపై దుండగుడు కాల్పులు జరిపిన 32వ ఫ్లోర్లోకి వెళ్లిన అధికారులకు 10 రైఫిళ్లు కనిపించాయని ఆయన తెలిపారు. దుండగుడి కాల్పులతో 50 మంది మరణించగా దాదాపు 400 మందికి పైగా గాయపడ్డారు. తీవ్ర కలకలం రేపిన ఈ దాడిని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. -
షూటర్ ఎవరంటే..?
లాస్వెగాస్: అమెరికాలో నరమేధం సృష్టించిన దుండగుడిని లాస్వెగాస్కు చెందిన 64 ఏళ్ల స్టీఫెన్ పడోక్గా పోలీసులు గుర్తించారు. మాండలై బే హోటల్లో ఏర్పాటు చేసిన సంగీత విభావరిలో విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఈ దుండగుడిని పోలీసులు మట్టుబెట్టారు. మరో షూటర్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ ఘటనలో 50 మందికి పైగా మరణించగా, 200 మంది గాయపడ్డారు. దాడి అనంతరం గల్లంతైన వారి కోసం తెలుసుకునేందుకు పోలీసులు హెల్ప్లైన్ నెంబర్లను విడుదల చేశారు. కాసినో హోటల్ 31వ అంతస్తులో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు సాయుధులు కాల్పులు జరిపారు. -
నరమేధం.. 50మంది రక్తపు మడుగులో
-
నరమేధం.. 50మంది రక్తపు మడుగులో
న్యూయార్క్ : లాస్ వేగాస్ భారీ నరమేధమే చోటు చేసుకుంది. తాజాగా అందిన సమాచారం సాయుధుడి కాల్పుల్లో దాదాపు 50మంది మృత్యువాత పడినట్లు సమాచారం. వందలాదిమంది గాయాలపాలయ్యారని, వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెబుతున్నారు. కాల్పులు జరిపింది ఇద్దరు వ్యక్తులని తెలుస్తోంది. లాస్ వేగాస్లో ఆదివారం అర్ధరాత్రి ఓ సాయుధుడు విచ్చలవిడిగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో తొలుత ఇద్దరే చనిపోయినట్లు తెలిసినా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 50మంది పైగా చనిపోయారు. లాస్ వేగాస్ స్ట్రిప్లో దేశీయ సంగీత ఉత్సవం జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సంగీత విభావరి జరుగుతున్న మాండలై బే హోటల్లో సాయుధుడు ఒక్కసారిగా కాల్పలకు తెగబడ్డాడు. దీంతో ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు భయభ్రాంతులకు గురై.. ప్రాణాలు దక్కించుకునేందుకు ఒక్కసారిగా పరుగులు తీశారు. సంఘటనా స్థలంలో భీతావహ పరిస్థితి నెలకొంది. కాల్పుల గురించి సమాచారం అందడంతో వెంటనే పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. కాల్పులకు తెగబడ్డ సాయుధుడిని హతమార్చినట్టు లాస్ వేగాస్ పోలీసులు ధ్రువీకరించారు. అయితే, మరొకరు ఉన్నట్లు సమాచారం. ఆ వ్యక్తి ఒక మహిళ అని, ఆమెకోసం పోలీసులు గాలిస్తున్నారు. అలాగే గుర్తింపు కార్డు లేని వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. లాస్ వేగాస్ లోపలికి వచ్చే మార్గాలన్నంటిని మూసి వేసి హై అలర్ట్ విధించారు. -
ఓ మై గాడ్.. లాస్ వేగాస్: టాలీవుడ్ హీరో ఆవేదన
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని లాస్ వేగాస్లో సంగీత విభావరిలో కాల్పులు చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. సంగీత విభావరిలో పాల్గొన్నవారు లక్ష్యంగా సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతిచెందారు. దాదాపు 24 మందికి గాయాలయ్యాయి. దేశీయ సంగీత ఉత్సవంలో ఆనందంగా తేలిపోతున్న ఆహూతులను ఈ ఘటన ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది. సాయుధుడి కాల్పుల మోతతో భయభ్రాంతులకు గురైన ప్రజలు ప్రాణాలు దక్కించుకునేందుకు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. తీవ్ర భయోత్పాతాన్ని రేకెత్తించిన ఈ ఘటనపై టాలీవుడ్ యువహీరో నిఖిల్ సిద్ధార్థ్ ట్విట్టర్లో స్పందించాడు. 'ఓ మై గాడ్ లాస్ వేగాస్. ఆనందదాయకమైన నగరంలో ఇలా జరగడం భావ్యం కాదు. అమాయకులపై ఇలా కాల్పులకు తెగబడుతున్న రాక్షసులను అడ్డుకొని శిక్షించాలి' అని నిఖిల్ ట్వీట్ చేశాడు. 'వందలాది తుపాకీ గుళ్లు పేలాయి. లాస్ వేగాస్లోని ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాను' అని పేర్కొన్నాడు. Omg Las Vegas... u city of happiness.. This isn't fair... monsters who r shooting like this at innocent ppl need to be stopped nd punished https://t.co/fbx3E09qZd — Nikhil Siddhartha (@actor_Nikhil) 2 October 2017 Hundreds and hundreds of shots being fired.. Praying for everyone in Vegas tonight... https://t.co/bvRCk8oxON — Nikhil Siddhartha (@actor_Nikhil) 2 October 2017 -
లాస్ వేగాస్లో కాల్పులు.. భీతావహ పరిస్థితి
లాస్ వేగాస్: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. లాస్ వేగాస్లో ఆదివారం అర్ధరాత్రి ఓ సాయుధుడు విచ్చలవిడిగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో కనీసం ఇద్దరు చనిపోగా.. 24మందికి తీవ్ర గాయాలైనట్టు సమాచారం. లాస్ వేగాస్ స్ట్రిప్లో దేశీయ సంగీత ఉత్సవం జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సంగీత విభావరి జరుగుతున్న మాండలై బే హోటల్లో సాయుధుడు ఒక్కసారిగా కాల్పలకు తెగబడ్డాడు. దీంతో ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు భయభ్రాంతులకు గురై.. ప్రాణాలు దక్కించుకునేందుకు ఒక్కసారిగా పరుగులు తీశారు. సంఘటనా స్థలంలో భీతావహ పరిస్థితి నెలకొంది. కాల్పుల గురించి సమాచారం అందడంతో వెంటనే పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. కాల్పులకు తెగబడ్డ సాయుధుడిని హతమార్చినట్టు లాస్ వేగాస్ పోలీసులు ధ్రువీకరించారు. అయితే, సాయుధుడికి సంబంధించిన వివరాలేవీ వెల్లడించలేదు. సంఘటనా స్థలం నుంచి పలువురు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్టు సీఎన్ఎన్ వెల్లడించింది. మాండలై బే రిసార్ట్లోని 32వ అంతస్తులో సాయుధ కాల్పులు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కాల్పులతో లాస్ వేగాస్ నగరం ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందింది. నగరం పూర్తిగా నిర్మానుష్యంగా మారింది. సంఘటన స్థలం వైపు ప్రజలు ఎవరూ రాకూడదని పోలీసులు సూచించారు. -
ప్రపంచంలోనే అరుదైన దొంగతనం
-
ప్రపంచంలోనే అరుదైన దొంగతనం
లాస్వెగాస్: కుడి చేతికి కూడా తెలియకుండా ఎడమచేత్తో దొంగతనాలు చేస్తూ చోరకళకు గుర్తింపుతెచ్చేవారు కొందరైతే, కళను అపహాస్యం చేస్తూ వార్తల్లో నిలిచేవాళ్లు మరికొందరు! ఈ ఫొటోలో కనిపిస్తున్నవాడు రెండో రకం. తన బృందంతోకలిసి ఓ గోడౌన్లోకి చొరబడ్డ వీడు.. ఏకంగా 30 వేల కండోమ్స్, వందలకొద్దీ సెక్స్ టాయ్స్ని ఎత్తుకెళ్లాడు. రెండు రోజుల పాటు వీరి దోపిడీపర్వం కొనసాగింది. అభివృద్ధి చెందిన అమెరికాలో కండోమ్స్ విరివిగా దొరుకుతున్నా, వీళ్లిలా దొంగతనం చేయడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో కండోమ్స్ దొంగతనానికి గురికావడం ప్రపంచంలో ఇదే మొదటిసారి! లెలో అనే స్విడిష్ సెక్స్ టాయ్స్ కంపెనీకి లాస్వెగాస్లో ఓ గోడౌన్ ఉంది. అక్కడ నిలువుచేసే కండోమ్స్, సెక్స్టాయ్స్ లాంటి ఉత్పత్తులను రకరకాల ప్రాంతాలకు రవాణాచేస్తుంటారు. మెమోరియల్ డే సెలవుల సందర్భంగా వారంపాటు గోడౌన్ తెరవలేదు. దీనిని అవకాశంగా భావించిన దొంగలు.. సోమ, మంగళ వేర్హౌస్లోని 30 వేల కండోమ్స్, సెక్స్టాయ్లను దొంగిలించారు. సెక్యూరిటీ లేకపోవడంతో ఏకంగా కారునే లోపలికి తెచ్చి వస్తువులను దోచుకెళ్లారు. తమ గోడౌన్లో దొంగతనం జరిగిన విషయాన్ని లెలో సంస్థ తన అఫీషియల్ ఫేస్బుక్ ద్వారా వెల్లడించింది. దానికి సంబంధించిన వీడియో ఫుటేజీని కూడా పోస్ట్ చేసింది. ‘అన్ని కండోమ్స్ను వాళ్లు ఏం చేసుకుంటారో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. అది తెలిస్తేగనుక ఆ పార్టీకి స్పాన్సరర్స్గా ఉండేవాళ్లం..’అని చమత్కరించారు లెలో ప్రతినిధులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. -
స్మార్ట్ఫోన్ యూజర్లకు స్వీట్న్యూస్
స్మార్ట్ఫోన్ వినియోగదారులకు ఇజ్రాయెల్ స్టార్టప్ ‘స్టోర్ డాట్’ తీపి కబురు అందించింది. ఐదు నిమిషాల్లోనే ఫుల్చార్జింగ్ కాగల ఫ్లాష్ బ్యాటరీలను త్వరలో అందుబాటులోకి తేనున్నట్టు వెల్లడించింది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ బ్యాటరీలు వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని స్టోర్ డాట్ సీఈవో డొరొన్ మియర్స్డార్ఫ్ ‘బీబీసీ’తో చెప్పారు. వీటిని మార్కెట్లోకి తీసుకు రావడానికి ఏర్పాట్లు పూర్తయినట్టు చెప్పారు. ఫ్లాష్ బ్యాటరీలు ఐదు నిమిషాల్లోనే చార్జ్ అవుతాయని తెలిపారు. వీటిని తయారు చేసేందుకు ఏ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారో చెప్పేందుకు ఆయన నిరాకరించారు. తాము అందించిన సాంకేతిక పరిజ్ఞానంతో ఆసియా ఖండానికి చెందిన రెండు బ్యాటరీ తయారీ సంస్థలు పైలట్ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టాయని, వచ్చే మొదటి త్రైమాసికంలో పెద్ద ఎత్తున ఫ్లాష్ బ్యాటరీలు తయారయ్యే అకాశముందని వివరించారు. అత్యంత వేగంగా బ్యాటరీ చార్జింగ్ చేయగల సాంకేతిక పరిజ్ఞానం గురించి 2015లో స్టోర్ డాట్ వెల్లడించింది. లాస్ వెగాస్లోని జరిగిన సీఈఎస్ టెక్ షోలో ఫ్లాష్ బ్యాటరీలను ప్రదర్శించింది. సాంప్రదాయేతర చర్యలను ప్రేరేపించే పదార్థాలతో ఈ బ్యాటరీలను తయారు చేసినట్టు డొరొన్ తెలిపారు. యానోడ్ నుంచి కాథోడ్కు అయాన్లను పంపించే ఎలక్ట్రిక్ ప్రక్రియను వేగవంతం చేసే పదార్థాలను ఇందులో పొందుపరిచినట్టు చెప్పారు. అతి సూక్ష్మమైన నానో మెటీరియల్స్, ఆర్గానిక్ కాంపౌడ్స్ వినియోగించి వీటిని తయారు చేశారు. వీటి పనితీరుపై సాంకేతిక విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వేగంగా చార్జ్ అయ్యే బ్యాటరీలను తయారు చేసేందుకు చాలా కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయి. -
ప్రత్యర్థుల మాటల యుద్ధం
లాస్వెగాస్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఘట్టం ఫైనల్ రౌండ్ డిబేట్ హోరాహోరీగా సాగింది. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్లు ఈ బిగ్ డిబేట్లో మాటలు తూటాలు పేల్చుకున్నారు. అమెరికాలోని మిలియన్ ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రత్యర్థులకు ఇదే చివరి అవకాశం. దీంతో ప్రత్యర్థులిద్దరూ తమదైన శైలిలో దూసుకెళ్లారు. ఈ ఫైనల్ డిబేట్ కార్యక్రమంలో ట్రంప్, హిల్లరీలు కొన్ని కొన్ని సందర్భాల్లో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ప్రధానంగా మహిళలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, రష్యాను సమర్థించిన విషయం, తన కంపెనీల్లో చైనా ఉద్యోగులను అధిక సంఖ్యలో నియమించుకోవడం, విదేశాంగ విధానం తదితరాలపై ప్రశ్నలు సంధించినప్పుడు ట్రంప్ కాస్త ఇబ్బంది పడగా, హిల్లరీ క్లింటన్ ఈ మెయిల్స్ వ్యవహారం, క్లింటన్ ఫౌండేషన్ నిధులు, రహస్య వ్యవహారాలు వంటి వాటిపై సమాధానం చెప్పినప్పుడు ఇద్దరూ కాస్త అసహనంగా కదిలారు. ఫైనల్ డిబేట్లో ప్రత్యర్థుల హామీలు, ఆరోపణలు కొన్ని... జీడీపీపైన : ట్రంప్ హామీలివీ.. అమెరికాలోనూ నేను ఉద్యోగవకాశాలను విపరీతంగా సృష్టిస్తాను. ప్రస్తుతమున్న జీడీపీని 1శాతం నుంచి 4శాతానికి తీసుకెళ్తా. ఆ శాతాన్ని 5 శాతం నుంచి 6 శాతానికి మేము పెంచగలమని నేను భావిస్తున్నా. మన ఉద్యోగాలను మళ్లీ వెనక్కి తీసుకురావడమే నా లక్ష్యం. క్లింటన్ హామీలివీ.... కార్పొరేషన్లు న్యాయంగా వేతనాలు చెల్లించాలని మేము ఆదేశిస్తాం. ఆర్థికవేత్తలు నిరంతరం చర్చించే మిడిల్ అవుట్గ్రోత్ను మేము సాధిస్తాం. మధ్య తరగతి ప్రజలు వృద్ధిలోకి వస్తే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. అలెప్పోపై... ట్రంప్ ఆరోపణలు.. అలెప్పో ఓ భయంకరమైన విపత్తు. ఏదైతే జరిగిందో అది చాలా విచారించదగినది. హిల్లరీ క్లింటన్ వల్లే అదంతా జరిగింది. ఆమె దానిలో తలదూర్చకుండా ఉంటే, అంతా మంచి జరిగి ఉండేది. క్లింటన్ హామీలు... మేము లక్షల కొలది ప్రజలను సిరియాలనోనూ వదిలిపెట్టాం.మేము ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని చూస్తున్నాం. ఆ ఒప్పందం సిరియాకు సాయం చేయడానికి ఓ మంచి డీల్గా ఉండాలని భావిస్తున్నాం. అది రష్యా, సిరియా ఇరు దేశాల ప్రజలకు స్పష్టంగా అర్థమవ్వాలి. ఐఎస్ఐఎస్పై... ట్రంప్.. ఎప్పుడైతే క్లింటన్ వెళ్లిపోతారో, అప్పుడు ఆమెతోనే అన్నీ ఐఎస్ఐఎస్ కార్యచరణలు వైదొలుగుతాయి. మోసుల్ను ఐఎస్ఐఎస్ నుంచి మళ్లీ ఆధీనంలోకి తెచ్చుకోలుగుతాం.. మోసుల్ మళ్లీ ఇరాన్ స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి అమెరికా ప్రమేయం చాలా ప్రయోజనకరం. క్లింటన్ ...ఇరాక్ ముట్టడిని ఆయన సమర్థించడం లేదని మరోసారి స్పష్టమైంది. కానీ మూలాల్లో పరిశీలిస్తే ట్రంప్ దాడులకు అనుకూలమంటూ తేలుతుందని ఆరోపించారు. లైంగిక దుష్ఫచరణ ఆరోపణలపై... ట్రంప్ : నేను మహిళలను గౌరవించినంతగా ఎవరూ గౌరవించలేరు.(ఈ మాటలతో డిబేట్లో పాల్గొన్న ప్రేక్షకులు ఓసారిగా గట్టిగా నవ్వారు). నాపై వచ్చిన లైంగిక ఆరోపణల కథనాలన్నీ అవాస్తవం. కనీసం నా భార్యకు కూడా క్షమాపణ చెప్పలేదు. ఎందుకంటే నేను తప్పేమీ చేయలేదు. క్లింటన్ : మహిళలను అవమానించడం డోనాల్డ్ ట్రంప్ ఓ పెద్ద విజయంగా భావిస్తున్నారు. ట్రంప్ మహిళల కోసం ఏం చేశారో వింటూనే ఉన్నాం. పలువురు మహిళలు ఇప్పటికే ముందుకు వచ్చి ట్రంప్ చర్యలు గురించి వాపోతున్నారు. కనీసం వారికి ఆయన క్షమాపణ కూడా చెప్పలేదు. ఉద్యోగాలపై : ట్రంప్.. ఒకవేళ హిల్లరీ క్లింటన్ అధ్యక్షురాలు అయితే, దేశం గజిబిజి గందరగోళంలో పడిపోతుంది. క్లింటన్.. ప్రస్తుత అధ్యక్షులు ఒబామా ఆర్థికవ్యవస్థను కాపాడినట్టు విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు. ట్రంప్ : క్లింటన్ పన్నుల ప్రణాళిక ఓ విపత్తు. హిల్లరీ ప్రణాళిక కింద భారీగా పన్నులు పెరిగాయి. పన్నులు తగ్గించడానికి నేను కొత్త ఒప్పందాలను తీసుకొస్తా. క్లింటన్ : ట్రంప్ ప్రణాళికేమిటో తెలుసా.. మరోసారి అమెరికాను ఆర్థిక సంక్షోభంలో సృష్టించడమే. చివరి ప్రకటనలు: క్లింటన్ .. మన దేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడంలో ప్రతిఒక్కరి సహాయం మాకు అవసరం. చిన్నారులు, కుటుంబాల కోసం నా జీవితాంతం కృషిచేస్తా. ట్రంప్...ఆఫ్రికన్ అమెరికన్లకు, లాటిన్లకు నా శాయాశక్తుల కృషి చేస్తా. అమెరికాను మళ్లీ గ్రేట్గా నిరూపిస్తా. -
ప్రపంచంలోనే విచిత్రమైన పెళ్లి!
లాస్ ఏంజిల్స్: వరుడు ఆరన్ చక్కగా బ్లాక్ సూటు, కోటు వేసుకొని పెళ్లికొడుకులా ముస్తాబయ్యాడు. వధువు కూడా చక్కని కవర్లో ఒదిగి ఉంది. ఇద్దరు ఎదురెదురుగా ఉండగా పెళ్లి పెద్ద మైఖేల్ కెల్లీ.. ఇద్దరితో ప్రమాణాలు చేయించాడు. ఆరన్ అనబడే నువ్వు ఈ స్మార్ట్ఫోన్ను చట్టబద్ధంగా వివాహం చేసేందుకు సమ్మతిస్తున్నావా? ఈ స్మార్ట్ఫోన్ను ప్రేమిస్తూ.. గౌరవిస్తూ.. విశ్వసనీయంగా ఉంటూ.. సుఖంగా చూసుకుంటానని దైవసాక్షిగా వాగ్దానం చేస్తున్నావా? అని ఆరన్ని అడిగాడు. అందుకు ఆరన్ సమ్మతించడంతో అంగరంగ వైభవంగా స్మార్ట్ఫోన్తో అతని పెళ్లి జరిగింది. పోయి, పోయి స్మార్ట్ఫోన్ను పెళ్లిచేసుకోవడం ఏమిటని విస్తుపోతున్నారా? అవునండి అమెరికాలోని లాస్ ఏంజిల్స్కు చెందిన ఆరన్ చెర్వెనార్ ఏరికోరి మరీ తన మొబైల్ ఫోన్ను పెళ్లిచేసుకున్నాడు. ఈ పెళ్లి తంతు మధురానుభూతిగా మిగిలిపోవాలని అతడు లాస్ ఏంజిల్స్ నుంచి లాస్ వెగాస్ వచ్చి.. అక్కడ సంప్రదాయబద్ధంగా స్మార్ట్ఫోన్ను జీవిత భాగస్వామి చేసుకున్నాడు. ఈ విచిత్రమైన పెళ్లి తంతు జరిపించే పెద్దగా మైఖేల్ కెళ్లి వ్యవహరించారు. లాస్ వెగాస్కు పెళ్లి కోసం వచ్చే ఎంతోమంది జంటలను తాను ఏకం చేశానని, తొలిసారిగా ఆరన్-సెల్ఫోన్ జంటకు వివాహం చేశానని మైఖేల్ చెప్పారు. మరీ ఆరన్ స్మార్ట్ఫోన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడంటే అందుకు కారణం లేకపోలేదు. మనుష్యులకు ఇప్పుడు సెల్ఫోన్తో అనుబంధం విపరీతంగా పెరిగిపోయింది. అది లేకుండా నిమిషం కూడా ఉండలేని పరిస్థితి. పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకొనే వరకు అస్తమానం సెల్ఫోన్ దగ్గరుండాల్సిందే. అలా స్మార్ట్ఫోన్కు మనుష్యులు బానిసలు అయిపోతున్నారు కనుక తాను దానిని పెళ్లి చేసుకుంటే తప్పేమున్నదని భావనతో ఆరన్ ఇంత పనిచేశాడట. -
అప్పుడు ఏడ్వాలో నవ్వాలో అర్థం కాలేదు!
సెలబ్రిటీల జీవితం చాలా సుఖంగా ఉంటుంది. అన్ని సౌకర్యాలూ ఉంటాయి. చీకూ చింతా లేకుండా హ్యాపీగా బతికేయొచ్చు అని చాలామంది అనుకుంటారు. కానీ, వాళ్లకూ ఇబ్బందులు ఉంటాయ్. బాడీగార్డులు లేకుండా బయటికొస్తే.. వీరాభిమానులతో ఇబ్బంది ఉండదు కానీ, వెర్రి అభిమానులతో ఇబ్బందులు తప్పవ్. అసలు సెలబ్రిటీలు ఏ మూడ్లో ఉన్నారో కూడా చూసుకోకుండా ఫొటోగ్రాఫులూ, ఆటోగ్రాఫులూ అడుగుతారు. ఇంకా ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు. ఇటీవల రకుల్ప్రీత్ సింగ్కి ఇలాంటి అనుభవమే ఎదురైంది. తెలుగు పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా దూసుకెళుతోన్న రకుల్కి ఈ మధ్య కాస్త తీరిక చిక్కింది. అంతే.. తన క్లోజ్ఫ్రెండ్స్తో కలిసి లాస్ వేగాస్ వెళ్లారు. అక్కడికెళ్లాలనే కల రకుల్కి ఎప్పట్నుంచో ఉంది. వేగాస్లో చూడాల్సినవన్నీ చూసేసి, తిరుగు ప్రయాణమయ్యారు. వేగాస్ నుంచి సీటెల్ వెళ్లి, అట్నుంచి దుబాయ్ వెళ్లి, అక్కణ్ణుంచి హైదరాబాద్ రావాలన్నది ఈ బ్యూటీ ప్లాన్. కట్ చేస్తే.. సీటెల్ ఎయిర్పోర్ట్లోకి ఎంటరై, ఫ్లైట్ ఎక్కుదామనుకుంటున్న సమయంలో మెడ దగ్గర సన్నగా నొప్పి మొదలైందట. ఆ నొప్పి భరించలేనంత పెద్దది కావడంతో తన మ్యానేజర్కి ఫోన్ చేసి, విషయం చెప్పారు రకుల్. అప్పటికప్పుడు రకుల్ని ఆస్పత్రికి తీసుకెళ్లారట. ఒకవైపు నొప్పితో రకుల్ విలవిలలాడుతుంటే.. అక్కడే ఉన్న ఒకావిడ, ‘మీరు రకుల్ కదూ’ అని అడగడంతో పాటు, ‘మీతో ఫొటో దిగాలని ఉంది’ అన్నదట. అలాంటి పరిస్థితిలో రకుల్కి ఏమనిపించి ఉంటుందో ఊహించవచ్చు. చుట్టూ ఉన్నవాళ్లు రకుల్ పరిస్థితి చెప్పడంతో, ఆవిడ ‘అయ్యో’ అని అక్కణ్ణుంచి వెళ్లిపోయారట. ‘‘నిజంగా నాకు నవ్వాలో ఏడ్వాలో అర్థం కాలేదు. ఏడుపు కన్నా నవ్వే వచ్చింది’’ అని రకుల్ పేర్కొన్నారు. -
అమెరికాలో కారు బీభత్సం
లాస్ వెగాస్: ఒకవైపు ప్రపంచసుందరి పోటీలు, కిరీటం సంబరాలతో సందడిగా ఉన్న ఆ ప్రాంతంలో ఉన్నట్టుండి అలజడి రేగింది. అకస్మాత్తుగా జనాల మీదికి వేగంగా దూసుకొచ్చిన ఓ కారు బీభత్సం సృష్టించింది. అసలే ఉగ్రదాడులతో ప్రపంచమంతా బెంబేలెత్తిపోతున్న నేపథ్యంలో ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతను రాజేసింది. అమెరికాలోని లాస్ వెగాస్లో చోటుచేసుకున్న ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడిక్కడే చనిపోయాడు. డ్రైవర్ కారును పాదచారుల మీద నుంచి వేగంగా తీసుకెళ్లడంతో సుమారు 37 మంది గాయపడ్డారు. మిస్ యూనివర్స్ పోటీలు జరుగుతున్న లాస్ వెగాస్లోని పారిస్ హోటల్ ముందు ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిలో పిల్లలు, వృద్ధులు, మహిళలు ఉన్నారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నామని స్థానిక పోలీసులు ట్వీట్ చేశారు. బాధితుల్లో చాలామంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు తెలిపారు. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేక ప్రమాదమా అనే విషయం ఇంకా స్పష్టం కాలేదని, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
విమానంలో మంటలు.. తప్పిన భారీ ప్రాణ నష్టం
-
విమానంలో మంటలు.. తప్పిన భారీ ప్రాణ నష్టం
- లాస్ వెగాస్ మెక్ కారెన్ విమానాశ్రయంలో ఘటన - ప్రమాద సమయంలో విమానంలో 172 మంది టేక్ ఆఫ్ అయ్యేందుకు రన్ వే పైకి వచ్చిన విమానంలో ఒక్కసారిగా మంటలు చెరేగిన సంఘటన అమెరికాలోని లాస్ వెగాస్ మెక్ కారెన్ విమానాశ్రయంలో బుధవారం ఉదయం (భారత కాలమానం ప్రకారం) జరిగింది. పెనుముప్పు తప్పినట్లుగా భావిస్తున్న ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. బ్రిటిష్ ఎయిర్ వేస్ కు చెందిన బోయింగ్ 777 విమానం లాస్ వెగాస్ నుంచి లండన్ వెళ్లాల్సిఉంది. ఇంధనం నింపుకొన్న అనంతరం టేక్ ఆఫ్ అయ్యేందుకు రన్ వే పైకి వచ్చింది. అంతలోనే విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో విమానంలో 159 మంది ప్రయాణికులతోపాటు 13 మంది సిబ్బంది కూడా ఉన్నారు. లోపలంతా దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ప్రయాణికులు ఊపిరాడక ఇబ్బందిపడ్డారు. వెంటనే అప్రమత్తమైన ఎయిర్ పోర్టు సిబ్బంది.. పరుగున విమానం వద్దకు చేరుకుని అత్యవసర కిటీకీలను బద్దలుకొట్టి ప్రయాణికులను కిందికి దించారు. మంటలు చెలరేగడం రెండు నిమిషాలు ఆలస్యమయ్యేదుంటే విమానం వేగానికి భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేదని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. ఇద్దరు ప్రయాణికులు మాత్రం గాయపడ్డారని, మిగతావారిని సురక్షితంగా కాపాడగలిగామని అత్యవసర సిబ్బంది చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సిఉంది. -
నింగి, నేల కలసిన వేళ
-
రెజ్లర్ సుశీల్కు గాయం
ప్రపంచ చాంపియన్షిప్కు దూరం న్యూఢిల్లీ: భుజం గాయం కారణంగా రెజ్లర్ సుశీల్ కుమార్ ప్రపంచ చాంపియన్షిప్కు దూరమయ్యాడు. సెప్టెంబర్ 7 నుంచి 12 వరకు లాస్వెగాస్లో ఈ మెగా టోర్నీ జరుగనుంది. 2016 రియో ఒలింపిక్స్ కోసం ఇది తొలి క్వాలిఫయింగ్ ఈవెంట్. ‘ప్రాక్టీస్ సమయంలో నా కుడి భుజానికి గాయమైంది. డాక్టర్లు విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చా రు. ప్రస్తుతానికైతే ఈ గాయం ఎప్పుడు నయమవుతుందో చెప్పలేను. దీంతో ఈనెల 6,7న జరిగే సెలక్ష న్ ట్రయల్స్కు అందుబాటులో ఉండలేకపోతున్నా ను. ఈ కారణంగా ప్రపంచ చాంపియన్షిప్లోనూ ఆడనట్టే. ఈ టోర్నీ అనంతరం వచ్చే ఏడాది మరో ఆరు క్వాలిఫయింగ్ టోర్నీలు ఉంటాయి. వీటిలో పాల్గొని సత్తా చూపాలనుకుంటున్నాను’ అని లండన్ ఒలింపిక్స్లో రజతం సాధించిన సుశీల్ చెప్పాడు. -
సరికొత్త టెక్నాలజీతో బీఎండబ్ల్యూ ఐ3 ఎలక్ట్రిక్ కార్
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ కంపెనీ సరికొత్త టెక్నాలజీతో ఐ3ఎలక్ట్రిక్ కార్ ప్రోటో టైప్ను అమెరికాలోని లాస్వేగాస్ ఆటోషోలో డిస్ప్లేకు ఉంచింది. 4 లేజర్ సెన్సార్స్, స్కానర్స్తో ఈ సిస్టమ్ వర్క్ చేసే విధంగా టెక్నాలజీని అఫ్గ్రేడ్ చేశారు. తనకు తానే ఆటో పార్కింగ్ చేసుకునేవిధంగా ఈ కారును రూపొందించారు. ఈ కారులో రూపొందించిన ఆక్టివ్ ఆసిస్ట్ టెక్నాలజీతో స్మార్ట్ వాచీ ద్వారా వెహికిల్ను కంట్రోల్ చేయవచ్చు. అంతేకాదు యాక్సిడెంట్స్ కాకుండా ఉండే విధంగా సెన్సార్స్ ఏర్పాటు కూడా ఉంది. ఈ సెన్సార్స్ ద్వారా కారు 360 డిగ్రీలతో చుట్టూ పరిక్షించే విధంగా కెమెరాలు కూడా ఉన్నాయి. అంతేకాదు సెల్ప్ నెట్ కనెక్టివిటీ ద్వారా జిపిఎస్ సిస్టమ్తో రోడ్డుపైన ఉండే బ్యాంకులు, రెస్టారెంట్స్ వివరాలను కూడా క్షుణ్ణంగా తెలుసుకునే వీలును కల్పిస్తోంది బిఎమ్డబ్ల్యూలోని ఐ3 టెక్నాలజీ. -
కారులో కోటిన్నర క్యాష్!
లాస్ వెగాస్: కోటి రూపాయలు కంటబడితే ఎవరైనా ఏం చేస్తారు. ఎవరూ చూడకుండా చటుక్కున నొక్కేద్దామనుకునే వాళ్లే ఎక్కువ. అయితే అమెరికాలోని లాస్ వెగాస్లో ఓ క్యాబ్ డ్రైవర్ మాత్రం ఇలాంటి పని పనిచేయలేదు. తన కారులో ఓ ప్రయాణికుడు మరిచిపోయిన సుమారు కోటిన్నర రూపాయలను కాజేయకుండా తిరిగి అప్పగించి తన నిజాయితీ చాటుకున్నాడు. తన నిజాయితీతో అవార్డుతో పాటు అందరి మనసులు గెల్చుకున్నాడు. లాస్ వెగాస్లో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్న గెర్నాండో గామ్బోయ్ తన కారు వెనుక సీటులో ఓ ప్రయాణికుడు మరిచిపోయిన బ్యాగ్ను గుర్తించి తెరిచి చూశాడు. అందులో ౩ లక్షల డాలర్లు(సుమారు రూ. 1.8 కోట్లు) ఉన్నట్టు గుర్తించాడు. ఈ డబ్బు తన కారులో ఎక్కిన పోకర్ ఆటగాడికి చెందినదిగా తెలుసుకున్న గామ్బోయ్ తన కంపెనీ ఎల్లో చెకర్ స్టార్ ట్రాన్స్పోర్టేషన్కు సమాచారం అందించాడు. తమ కారులో దొరికిన డబ్బును ప్రయాణికుడికి అందజేసింది ఆ కంపెనీ. అంతేకాదు పెద్ద మొత్తంలో డబ్బు దొరికినా ఆశ పడకుండా నిజాయితీ చాటుకున్న గామ్బోయ్ను 'డ్రైవర్ ఆఫ్ ద ఇయర్' అవార్డుతో సత్కరించింది. అతడికి వెయ్యి డాలర్లు బహుమతిగా ఇచ్చింది, మంచి రెస్టారెంట్లో విందు భోజనం ఏర్పాటు చేసింది. వీటన్నికంటే తనదికాని సొమ్ముకు ఆశ పడకుండా తిరిగిచ్చేయడమే ఎక్కువ ఆనందాన్నిచ్చిందని 13 ఏళ్లుగా డ్రైవింగ్ చేస్తున్న గామ్బోయ్ వినయంగా చెప్పాడు. -
బ్రిట్నీ స్పియర్స్ రోజుకు ఆరు సార్లు..
అమెరికా పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ మంచి భోజన ప్రియురాలు. ఈ మధ్య ఇష్టమైన వంటకాలన్నీ తెగ లాగించేసి కాస్త బరువు పెరిగింది. ఈ అందాల భామకు ఇదే ఇప్పుడు సమస్యగా మారింది. నాజుగ్గా ఉండేందు కోసం భోజనం కాస్త తగ్గించి సన్నబడాలని ప్రయత్నిస్తోంది కానీ ఆచరణలో విఫలమవుతోంది. ఆమే ఈ విషయాన్ని వెల్లడించింది. 'ఈ రోజు ఆరుసార్లు తిన్నాను. ఆహారం విషయంలో జాగ్రత్తలేమీ తీసుకోను. ఎందుకంటే భోజనమంటే నాకు చాలా ఇష్టం. తగ్గించడం చాలా కష్టం. మీరు కూడా ఇష్టమైనవన్నీ తినేయండి' అంటూ 31 ఏళ్ల పాప్ సింగర్ సెలవిచ్చింది. వచ్చే డిసెంబర్లో లాస్ వేగాస్లో జరిగే ఓ ప్రోగ్రామ్ కోసం ఆమె సన్నద్ధమవుతోంది. దాదాపు ప్రతిరోజూ ప్రదర్శనలు ఇవ్వాల్సి ఉంటుంది. అందాన్ని, ఫిట్నెస్ను కాపాడుకోవడంపై బ్రిట్నీ దృష్టిసారిస్తోంది.