mahalakshmi
-
వారి వల్ల ప్రతిసారి ఫోటోలు షేర్ చేస్తూనే బతుకుతున్నాం: రవీందర్
ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా నటించిన ‘డ్రాగన్’ (Dragon) సినిమాతో నటుడు రవీందర్ పేరు మరోసారి నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో ఫేక్ సర్టిఫికెట్లు సరఫరా చేసే వ్యక్తిగా ఆయన కనిపించాడు. ఆయన గతంలో పలు సినిమాలకు నిర్మాతగా కూడా ఉన్నారు. డ్రాగన్ సినిమా తనకు చాలా పేరు తీసుకొచ్చిందని సంతోషంలో ఉన్నారు. తాజాగా ఆయన సతీమణి మహాలక్ష్మితో పాటు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో పలు విషయాలను రవీందర్ పంచుకున్నాడు. తనకు పెళ్లి అయిన తర్వాత చాలామంది హేళన చేశారని వాపోయాడు. ఇంత అందమైన అమ్మాయితో పెళ్లి ఏంటి అంటూ కొందరు మెసేజ్లు కూడా చేశారని ఇలా చెప్పుకొచ్చాడు.మహాలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. పెళ్లి తర్వాత చాలా విమర్శలు వచ్చినా కూడా భరించాము. కొద్దిరోజుల తర్వాత మేమిద్దరం విడాకులు తీసుకున్నామని, విడిపోయామని కూడా వార్తలు వచ్చాయి. అది చూసి నవ్వుకున్నాం. ఇంత అందమైన స్త్రీ ఇంత శరీరాకృతి ఉన్న వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంది..? ఈ పెళ్లి ఎన్ని రోజులు ఉంటుందిలే అంటూ అందరూ హేళన చేసే వాళ్లే కనిపించారు. కొందరైతే మేము విడాకులు తీసుకుని విడిపోయి వేరువేరుగా ఉంటున్నామని ప్రచారం చేశారు. ఇలాంటి వార్తలు వచ్చిన ప్రతిసారీ.. మేం కలిసి ఉన్నాము అంటూ ఫోటోలు పోస్ట్ చేస్తూ రూమర్స్కు ముగింపు పలుకుతున్నాం. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. కొందరి చేస్తున్న హేళన తట్టుకోలేక ఎన్నోసార్లు ఫోటోలు షేర్ చేస్తూ బతుకుతున్నాం. చాలామందికి వారి జీవితం ఏమౌతుందో అనే కంటే ఇతరుల జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.' అని ఆయన అన్నారు. వెన్నుపోటు పొడిచారు: మహాలక్ష్మిఇదే ఇంటర్వ్యూలో పాల్గొన్న మహాలక్ష్మి చెప్పుకొచ్చారు. 'నమ్మిన వ్యక్తులే మాకు వెన్నుపోటు పొడిచారు. మాతో సన్నిహితంగా ఉంటూనే అలాంటి పనిచేశారు. ఎప్పుడైతే మనం ఇతరులను సర్వస్వం అని నమ్ముతామే వాళ్లే వెన్నుపోటు పొడుస్తారు. శత్రువు కూడా అలాంటి పనిచేయడు. మనతో పాటు ఉన్నవాడు, మనకు బాగా తెలిసినవాడు మాత్రమే మన వెన్నులో పొడవగలడు. మన జీవితంలో అమ్మ, నాన్న, భర్త, పిల్లలు తప్ప ఎవరినీ నమ్మలేని పరిస్థితి ఉందని' ఆమె చెప్పింది. అయితే, వారికి నష్టం చేసిన వ్యక్తి పేరు మాత్రం చెప్పలేదు. కొద్దిరోజుల క్రితం ఆర్థిక లావాదేవీల విషయంలో రవీందర్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. నమ్మిన వ్యక్తి వల్లే తమకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆమె గతంలో కూడా ఒకసారి చెప్పింది.కోలీవుడ్లో సన్ మ్యూజిక్లో హోస్ట్గా చేసిన మహాలక్ష్మి ఆపై సీరియల్స్తో మరింత పాపులర్ అయింది. ఆమెకు అనిల్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కానీ, ఇద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. తదనంతరం, నిర్మాత రవీందర్ని ప్రేమించి ఆమె పెళ్లి చేసుకుంది. -
కథను నమ్ముకునే ఈ సినిమా తీశాం: టాలీవుడ్ నిర్మాత
రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం "తల్లి మనసు". ఈ సినిమాను వి శ్రీనివాస్ (సిప్పీ) దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై ముత్యాల సుబ్బయ్య తనయుడు ముత్యాల అనంత కిషోర్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ నిర్మాత ముత్యాల సుబ్బయ్య మాట్లాదుతూ.. "ప్రముఖ హీరోలందరితో సినిమాలు చేశా. దర్శకుడిగా 50 సినిమాలను తీశా. మంచి కథలను ఎంచుకోవడమే కాదు వాటికి తగ్గ మంచి టైటిల్స్ పెట్టి.. ప్రేక్షకుల ఆదరణతో నా సినీ ప్రయాణం సాగింది. నా యాభై సినిమాలలో అద్భుతమైన సక్సెస్ సినిమాలే కాదు. కొన్ని ఫెయిల్యూర్స్ కూడా లేకపోలేదు. అయినప్పటికీ ఏ రోజు ఏదో ఒక సినిమా చేయాలని అనుకోలేదు. ఏదో ఒక కోణంలో సమాజానికి పనికి వచ్చే పాయింట్తో పాటు సెంటిమెంట్, కామెడీ, డ్రామా లాంటి అంశాలను మేళవించి సినిమాలు చేశా. ఒక దశలో కొన్ని సెంటిమెంట్ సినిమాల కారణంగా నాకు సెంటిమెంట్ సుబ్బయ్య అని కూడా పేరొచ్చింది. నేను దర్శకుడిగా 50 సినిమాలను చేశా. తప్ప నిర్మాతగా గతంలో ఏ సినిమాను తీయలేదు. మా పెద్ద అబ్బాయి అనంత కిషోర్కు నిర్మాతగా ఒక మంచి సినిమా తీయాలనే అభిరుచి మేరకు నిర్మించడం జరిగింది. మంచి కథ దొరికే వరకు వేచి చూసి మా బ్యానర్ ముత్యాల మూవీ మేకర్పై ఈ సినిమాను రూపొందించాం. ఒక అనుభవం ఉన్న నిర్మాతగా అన్నీ తానై అనంత కిషోర్ ఎంతో చక్కగా చూసుకున్నారని' అని అన్నారు. అనంతరం మాట్లాడుతూ.. 'నా దగ్గర.. అలాగే చిత్ర పరిశ్రమలో దర్శకత్వ శాఖలో సుదీర్ఘ అనుభవం గురించిన వి శ్రీనివాస్ (సిప్పీ)ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. నేను సీనియర్ దర్శకుడిని అయినప్పటికీ చిత్ర నిర్మాణంలో కానీ దర్శకత్వంలో కానీ సూచనలు, సలహాలు ఇచ్చానే తప్ప ఎక్కడా తలదూర్చలేదు. ప్రేక్షకుల మనసులను హత్తుకునేలా ఈ చిత్రం ఉంటుంది. ఒక ఫీల్ గుడ్ మూవీ అని సెన్సార్ సభ్యులు కూడా ప్రశంసించడం ఆనందం కలిగించింది. ఒకరు ఓల్డ్ టైటిల్లా అనిపిస్తోందని కామెంట్ చేశారు. అందుకు నేను చెప్పింది ఒక్కటే... తల్లి లేకుండా ప్రపంచమే లేదు. మనుష్యులకే కాదు సమస్త జీవ రాశికి, ఆఖరికి చెట్లకు సైతం తల్లి వేరు వల్లే పుట్టుక జరుగుతుందని, బదులిచ్చా. అలాంటి తల్లి భావోద్వేగం, తపనను ఈ చిత్రంలో చక్కగా ఆవిష్కరించడం జరిగింది. చూస్తున్న ప్రేక్షకులు ప్రతీ ఒక్కరూ కథలో పాత్రలతో లీనమవుతారు. పాత్రలకు తగ్గ నటీ నటులనే ఎంచుకున్నాం. టైటిల్ పాత్రదారి కోసం ఎందరో నటీమణులను ప్రయత్నించాం. ఎట్టకేలకు కన్నడలో నటిగా మంచి పేరు తెచ్చుకున్న రచిత మహాలక్ష్మి అంగీకరించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు ఆకట్టుకుంటుంది. కథకు తగ్గట్టు మూడు పాటలు ఉంటాయి. మా అందరి అంచనాలను ఈ సినిమా నిలబెడుతుంది" అని అన్నారు. కాగా.. ఈ చిత్రానికి కోటి సంగీతమందించారు. -
మహాలక్ష్మి నన్ను కొట్టింది!.. అందుకే ముక్కలు చేశా
బనశంకరి: ఐటీ నగరంలో వయ్యాలికావల్ మునేశ్వరనగరలో మహాలక్ష్మీ (29) అనే నేపాలీ యువతిని హత్య చేసి, ఖండాలుగా నరికి ఫ్రిజ్లో కుక్కి పారిపోయిన హంతకుడు ముక్తిరంజన్ రాయ్ కూడా కడతేరిపోయాడు. అతడు ఒడిశాలో ఆత్మహత్య చేసుకున్నాడు. హత్యకు కారణాలను డెత్నోట్లో రాశాడు. ఈ నెల 3వ తేదీన ప్రేయసి మహాలక్ష్మీని హత్యచేశానని అందులో తెలిపాడు. ఆమె ఇంటికి వెళ్లాను, వ్యక్తిగత విషయాలతో గొడవ జరిగింది, ఆమె నాపై దాడి చేసింది. సహనం కోల్పోయి ఆమెను హత్య చేశానని రాశాడు. శరీరాన్ని 59 ముక్కలు చేసి ఫ్రిజ్లో పెట్టాను. ఆమె ప్రవర్తనతో విరక్తిచెంది ఈ దారుణానికి పాల్పడ్డానని తెలిపాడు. ముందుగా ఆమెను గొంతు పిసికి చంపాను, తరువాత బాత్రూమ్లో ఆమె శరీరాన్ని హ్యాక్సా బ్లేడుతో ముక్కలుముక్కలుగా చేశాను. ఆపై ఫ్రిజ్లో పెట్టాను. బాత్రూమ్లో యాసిడ్ పోసి శుభ్రం చేశానని డెత్నోట్లో రాశాడు.సొంతూరికి వెళ్లి ఆత్మహత్య20 రోజులుగా మృతదేహం ఫ్రిజ్లో ఉండిపోయింది. నాలుగు రోజుల కిందట యువతి హత్య వెలుగులోకి వచ్చింది. ముక్తిరంజన్ రాయ్తో ఎక్కువసార్లు మాట్లాడినట్లు కాల్ డేటాలో తేలింది. ఇద్దరూ ఒకే మాల్లో పనిచేసేవారు. అలా ప్రేమాయణం ప్రారంభించారు. హత్య తరువాత దుండగుడు 23వ తేదీ ఒడిశాలో సొంతూరైన పండి గ్రామానికి వెళ్లిపోయాడు. ఇంట్లో గడిపి మరుసటి రోజు స్కూటర్, ల్యాప్టాప్ తీసుకుని సమీప శ్మశానానికి వెళ్లాడు. చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. -
మహాలక్ష్మి కేసులో షాకింగ్ ట్విస్ట్
భువనేశ్వర్: బెంగళూరులో సంచలనం సృష్టించిన మహలక్ష్మి హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసు నిందితుడు ముక్తి రంజన్ రాయ్ అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఒడిషాలోని తన సొంత ఊరికి పారిపోయిన అతను.. ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. బెంగళూరులో మహాలక్ష్మి అనే మహిళను చంపి ముక్కలుగా నరికి ఫ్రిడ్జిలో దాచిన ఉదంతం గురించి తెలిసిందే. ఈ కేసులో ముక్తీ రంజన్ రాయ్ను తొలి నుంచి అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో భద్రక్(ఒడిషా) జిల్లా పాండి గ్రామానికి పారిపోయిన రాయ్.. సమీపంలోని కూలేపాడు గ్రామానికి వెళ్లి ఓ చెట్టుకు ఉరేసుకున్నాడు. ఘటనా స్థలంలో ఓ స్కూటీ, అందులో నోట్ బుక్ ఉన్నాయని ఒడిషా పోలీసులు చెబుతున్నారు. అందులో మహాలక్ష్మిని తానే చంపానని, ఆ బాధతోనే బలవనర్మణానికి పాల్పడుతున్నట్లు ముక్తి రంజన్ రాయ్ రాసినట్లు నోట్ దొరికిందని తెలిపారు. అయితే.. బెంగళూరు పోలీసులు దీనిని ధృవీకరించుకోవాల్సి ఉంది. గత శనివారం ఫ్రిజ్లో ఉన్న శవం వాసన రావడంతో అసలు విషయం బయటపడింది. అయితే చాలా తొందరగానే బెంగళూరు పోలీసులు ఈ కేసును చేధించగలిగారు. సెప్టెంబర్ 1 నుంచి మహాలక్ష్మి మాల్కు వెళ్లడం లేదు. అదే రోజు నుంచి ముక్తి కూడా పనికి వెళ్లలేదు. బహుశా హత్య సెప్టెంబర్2వ తేదీనే జరిగి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. మహాలక్ష్మి(26) బెంగళూరులోని ఓ మాల్లో పని చేస్తోంది. భర్త నుంచి ఆమె దూరంగా ఉంది. ఈ క్రమంలో మాల్లోనే పని చేస్తున్న ముక్తి రంజన్కు దగ్గరైంది. అయితే గత కొంతకాలంగా మహాలక్ష్మి.. మరో వ్యక్తితో చనువుగా ఉంటోందని భర్త హేమంత్ దాస్ పోలీసులకు తెలిపాడు. ఈ క్రమంలోనే ప్రియురాలిపై కోపం పెంచుకున్న ముక్తి రంజన్.. ఆమెను కిరాతకంగా హత్య చేసి ఉంటాడని బెంగళూరు పోలీసులు భావిస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
అత్త ఇంటికి అల్లుడు నిప్పు
మైసూరు: భార్యను తన వెంట పంపించడం లేదనే కోపంతో అత్త ఇంటికి నిప్పు పెట్టాడో అల్లుడు. ఈ సంఘటన తాలూకాలోని అరసనకెరె గ్రామంలో జరిగింది. మంగళగౌరి అనే యువతికి టీ.కాటూరు నివాసి శ్రీనివాస్తో వివాహమైంది. పూల వ్యాపారం సాగించే శ్రీనివాస్ భార్యతో గొడవ పడడంతో ఆమె పుట్టినింటికి వెళ్లిపోయింది. అత్తమామలే తన భార్యను పంపించడం లేదని పగ పెంచుకున్నాడు. అత్త ఇంటికి వెళ్లి తలుపు సందులో నుంచి పెట్రోలు పోసి నిప్పంటించి పరారయ్యాడు. ఇంటిలో మంటలు వ్యాపించి అక్కడ ఉన్న సుమారు రూ.20 వేల విలువ చేసే వస్తువులు కాలిబూడిదయ్యాయి. ఈ ఘటనపై జయపుర పోలీసులు కేసు నమోదు చేశారు. -
వాడొక శాడిస్టు!
బనశంకరి: వయ్యాలికావల్ మునేశ్వరబ్లాక్లో మహాలక్ష్మీ (29) హత్య కేసుకు సంబంధించి వైద్య బృందం శవపరీక్ష నివేదికను విచారణ అధికారులకు అందజేశారు. మరోపక్క వయ్యాలి కావల్ పోలీసులు కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. ఘటనా స్థలంలో తనిఖీల్లో ఫ్రిడ్జ్పై వేలిముద్రల ఆచూకీ లభించినట్లు తెలిసింది. దీనిపై ఎఫ్ఎస్ఎల్ నిపుణులు నుంచి పోలీసులు సమాచారం సేకరించారు. మహాలక్ష్మీ హత్య వెనుక హంతకుడు ఒక్కరేనా లేక ఇద్దరా అనే దానిపై అనుమానం వ్యక్తమైంది. హంతకుడిని శాడిస్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి అనుమానిత హంతకుడి సోదరుడిని పిలిపించి సుమారు 2 గంటల పాటు విచారణ చేపట్టిన పోలీసులు సమాచారం రాబట్టారు. హతురాలు మహలక్ష్మీ అనుమానిత హంతకుడు ఒకేచోట పనిచేసేవారు. మల్లేశ్వరంలోని వస్త్రదుకాణంలో ఇద్దరు పనిచేసేవారు. పలు కారణాలతో హంతకుడు ఆరునెలలు క్రితం విడిచిపెట్టాడు. దీంతో అప్పటి నుంచి మహలక్ష్మీ అతని నుంచి దూరంగా ఉండటంతో అతనిలో పగ రగిలింది. ఆ కారణంగానే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది.హంతకుడిలో వికృత ప్రవృత్తి :మహలక్ష్మీ హంతకుడు సడోమాసోకిస్ట్ తరహా ఉన్నారని అతడిని త్వరలో అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు తెలిపారు. హంతకుడు మహిళ దేహాన్ని 30 ముక్కలుగా కోసి ప్రిజ్లో భద్రపరచాడు. హంతకుడిలో శాడిస్టు ప్రవృత్తి ఉన్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు. -
మహాలక్ష్మి హత్య కేసులో నిందితుడిని పట్టుకుంటాం
దొడ్డబళ్లాపురం: బెంగళూరు వయ్యాలికావల్లోని బసప్ప గార్డెన్లో జరిగిన మహాలక్ష్మి హత్య కేసులో కీలక సమాచారం లభించిందని, త్వరలో నిందితుడిని అరెస్టు చేస్తామని హోంమంత్రి జీ పరమేశ్వర్ తెలిపారు. సోమవారం ఇందుకు సంబంధించి మీడియాతో మాట్లాడిన ఆయన ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉన్నందున ఎటువంటి సమాచారం ఇవ్వలేనన్నారు. నిందితులు ఎంతమంది అనేది స్పష్టత రాలేదని అయితే త్వరలో అరెస్టు చేస్తామన్నారు. మరోవైపు పోలీసులు ఆరు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.వాసవి దేవాలయం క్యాషియర్ ఇంట్లో చోరీవాసవి దేవాలయం క్యాషియర్ ఇంట్లో చోరీ జరిగిన సంఘటన మాగడి పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని వాసవి దేవాలయం ఖజాంచి అయిన వేణుగోపాల్ ఇంట్లో చోరీ జరిగింది. వేణుగోపాల్ ఆదివారం ఆర్యవైశ్య సంఘం కార్యక్రమం నిమిత్తం చెన్నపట్టణకు కుటుంబ సమేతంగా వెళ్లారు. ఆ రోజు రాత్రి ఇంట్లో జొరబడ్డ దొంగలు దేవాలయానికి సంబంధించిన 4 కేజీల బంగారు, వెండి ఆభరణాలు దోచుకున్నారు. వేణుగోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాగడి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
యువతిని 30 ముక్కలుగా నరికి..
దొడ్డబళ్లాపురం: ఓ యువతిని చంపి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్లో దాచిన భయానక ఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. వయ్యాలికావల్ పోలీస్స్టేషన్ పరిధి మల్లేశ్వరంలోని ఓ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో శనివారం స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి సోదా చేయగా ఫ్రిజ్లో కుక్కిన మహిళ శరీర భాగాలు 30కి పైగా బయటపడ్డాయి. వారం క్రితం ఈ దారుణం చోటుచేసుకున్నట్లు భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన మహాలక్ష్మి (29)అనే బాధితురాలు కర్ణాటకలో కొంతకాలంగా ఉంటున్నారని ఏసీపీ సతీశ్ కుమార్ చెప్పారు. సింగిల్ బెడ్ రూం ఇంట్లో ఆమె ఒక్కతే ఉంటున్నారని తెలిపారు. ఆమె వివరాలను సేకరించామని, అయితే ఇప్పుడే వాటిని బయటపెట్టలేమని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. పరిచయమున్న వారే దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానాలున్నాయి. ఇలా ఉండగా, మహాలక్ష్మి హత్యకు గురైన విషయం తెలిసిన ఆమె భర్త కూడా అక్కడికి చేరుకున్నాడు. మహాలక్ష్మి మాల్లో పని చేస్తుండగా, అతడు బెంగళూరుకు సమీపంలోని ఆశ్రమంలో ఉద్యోగి అని సమాచారం. -
అర్ధరాత్రి భర్త చేసిన పనికి బుల్లితెర నటి ఎమోషనల్..!
కోలీవుడ్ ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు. గతేడాది నటి మహాలక్ష్మి శంకర్ను ఆయన పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తరచుగా వార్తల్లొ నిలిచారు. వీరిద్దరి పెళ్లి తర్వాత ఓ కేసులో అరెస్ట్ అయిన రవీందర్ ఇటీవలే బెయిల్పై రిలీజై వచ్చారు కూడా. ఆ తర్వాత తమిళ బిగ్బాస్ సీజన్పై రివ్యూలు ఇస్తూ అభిమానులను అలరించారు. తాజాగా ఈ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. ఇవాళ రవీందర్ భార్య మహాలక్ష్మి పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు సర్ప్రైజ్ ఇచ్చాడు. అర్ధరాత్రి కేక్ తీసుకొచ్చి భార్య బర్త్డేను సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను మహాలక్ష్మి తన ఇన్స్టాలో షేర్ చేశారు. అంతే ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. మహాలక్ష్మి తన ఇన్స్టాలో రాస్తూ.. 'ఈ పుట్టినరోజు తీవ్ర భావోద్వేగాలతో నిండిపోయింది. నా భర్త అర్ధరాత్రి నన్ను నిద్రలేపి కేక్తో సర్ప్రైజ్ ఇచ్చారు. అతన్ని భర్తగా కలిగి ఉండటం చాలా అదృష్టంగా భావిస్తున్నా. మా అమ్మ, సోదరుడు నన్ను మానసిక వికలాంగుల కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ పిల్లలకు అన్న దానం చేశాం. ఇది నా గుండెకు హత్తుకునే అనుభవం. ముఖ్యంగా మా అమ్మ, చిన్న సోదరుడు చోటేకి ధన్యవాదాలు. మా నాన్న బంగ్లాదేశ్ నుంచి విష్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చారు. అన్ని సమయాల్లో అండగా నిలిచిన మామయ్యకు ధన్యవాదాలు. ఈ రోజు నా జీవితంలో ఎల్లప్పుడూ ప్రత్యేకమైంది. మీ అందరు నా చుట్టూ ఉన్నందుకు సంతోషంగా ఉన్నా. ఈ రోజున శుభాకాంక్షలు తెలిపేందుకు సమయాన్ని వెచ్చించినందుకు నా కుటుంబం, స్నేహితులందరికీ, నన్ను ప్రేమించే వారికి కృతజ్ఞతలు' అంటూ మహాలక్ష్మి పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు మహాలక్ష్మికి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అయితే తన పుట్టినరోజు సందర్భంగా నటి మహాలక్ష్మి కీలక నిర్ణయం తీసుకున్నారు. అవయవదానానికి ఆమె ముందుకొచ్చారు. నేను చనిపోయాక కూడా నా ఆర్గాన్ ఇతరుల రూపంలో బతికే ఉంటాయని ఆమె తెలిపారు. నేను ఒక అవయవ దాతగా మారి ఇతరుల జీవితాల్లో వెలుగులు తీసుకురాగలననే నమ్మకంతో ప్రేరణ పొందినట్లు వెల్లడించారు. నా నిర్ణయంతో అవసరమైన వారికి మంచి జరుగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇన్స్టాలో పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Pephands (@pephands_org) View this post on Instagram A post shared by Mahalakshmi Shankar (@mahalakshmi_actress_official) View this post on Instagram A post shared by Mahalakshmi Shankar (@mahalakshmi_actress_official) -
మహాలక్ష్మి సిటీ బస్సులు ప్రారంభం..!
-
మహాలక్ష్మి స్కీమ్ తో మహిళలకు అవస్థలు.. సజ్జనార్ క్లారిటీ
-
మహాలక్ష్మీ స్కీమ్, కొత్త బస్సులపై సజ్జనార్ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మహాలక్ష్మి స్కీమ్, కొత్త ఆర్టీసీ బస్సుల గురించి టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే 2,375 కొత్త బస్సులు తీసుకుంటున్నట్టు తెలిపారు. అలాగే, మహాలక్ష్మీ స్కీమ్ ద్వారా 12కోట్లకుపైగా మహిళలు బస్సుల్లో ప్రయాణించినట్టు సజ్జనార్ చెప్పుకొచ్చారు. కాగా, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఈరోజు నాంపల్లిలోని తెలుగు వర్సిటీలో బ్లైండ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ లూయిస్ బ్రెయిలీ 215వ జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చరిత్రాత్మక నిర్ణయం. తెలంగాణలో 45 రోజుల్లో 12కోట్లకు పైగా మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారని అన్నారు. ఇదే సమయంలో సజ్జనార్..‘ఉచిత ప్రయాణం కారణంగా వికలాంగులకు కేటాయించిన సీట్లలో కూడా మహిళలు కూర్చుంటున్నారు. ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు నా దృష్టికి వచ్చాయి. త్వరలో 2,375 కొత్త బస్సులు తీసుకుంటున్నాం. అప్పుడు కొంత వెసులుబాటు కలుగుతుంది. అవసరమైతే వికలాంగుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసే విధంగా ఆర్టీసీ యాజమాన్యం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. అనౌన్స్మెంట్, ఎంక్వయిరీ రూమ్ ఉద్యోగాల్లో అంధులకు అవకాశం కల్పిస్తాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
మరోసారి తెరపైకి నిర్మాత రవీందర్.. ఈసారి ఏకంగా ఆక్సిజన్తో!
కోలీవుడ్ ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తుంటారు. గతేడాది నటి మహాలక్ష్మి శంకర్ను ఆయన పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తరచుగా వార్తల్లొ నిలిచారు. పెళ్లి తర్వాత ఓ కేసులో అరెస్ట్ అయిన రవీందర్ ఇటీవలే బెయిల్పై రిలీజ్ అయ్యారు. అయితే ప్రస్తుతం జైలు నుంచి విడుదలైన రవీందర్ యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నారు. తమిళ బిగ్బాస్ సీజన్పై రివ్యూలు ఇస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఆయన యూట్యూబ్లో వీడియో చూస్తే అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. తాజా వీడియోలో ఏకంగా ఆక్సిజన్ ట్యూబ్ పెట్టుకుని మరీ కనిపించారు. అంతే కాకుండా అనారోగ్యంతోనే బిగ్బాస్ ఎపిసోడ్పై తన రివ్యూ ఇచ్చారు. ఇది చూసిన అభిమానులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ మీ పట్టుదల సూపర్ సార్ అంటూ కామెంట్స్ చేశారు. మరికొందరేమో ముందు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి సార్.. బిగ్బాస్ రివ్యూలు ఎప్పుడైన ఇవ్వొచ్చు అంటూ సలహాలు ఇస్తున్నారు. అయితే మొహానికి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకోవడంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని వెల్లడించారు. వారం రోజులుగా ఐసీయూలో చికిత్స తీసుకున్నట్లు రవీందర్ పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు నెటిజన్స్ ఆరోగ్యం సహకరించనప్పుడు వీడియోలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. కాగా.. లిబ్రా ప్రొడక్షన్స్ బ్యానర్పై ఆయన పలు సినిమాలు నిర్మించిన రవీందర్ కోలీవుడ్లో మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత బుల్లితెర నటి మహాలక్ష్మితో అతని వివాహం జరిగింది. దీంతో మీడియా, అభిమానుల దృష్టిని వారు ఆకర్షించారు. -
TSRTC: వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం: సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. దీంతో, బస్సుల్లో విపరీతంగా రద్దీ పెరిగిపోయింది. అవసరం లేకున్నా కొందరు బస్సుల్లో ప్రయాణించడంతో ఫుట్బోర్డుపై వేలాడుతూ ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో ప్రయాణికులకు జాగ్రత్తలు చెప్పిన ఓ మహిళా కండక్టర్ను కొందరు మహిళలు దూషించడంతో ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. అంతటితో ఆగకుండా ఆమెను బస్సు నుంచి దింపేశారు. ఇక, ఈ ఘటనను ఆర్టీసీ యాజమాన్యం సీరియస్గా తీసుకుంది. దీనిపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రయాణికులకు వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనపై సజ్జనార్ స్పందిస్తూ..‘టీఎస్ఆర్టీకి సిబ్బంది వెన్నుముక. వారు అనునిత్యం నిబద్దతతో విధులు నిర్వర్తిస్తూ ప్రతి రోజు లక్షలాది ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. సిబ్బంది కృషి వల్లనే సంస్థ మనగలుగుతుంది. మహాలక్ష్మి స్కీమ్ అమలులోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లైనా సిబ్బందిని కొందరు దూషించడం, దాడులు చేయడం సరికాదు. ఇలాంటి ఘటనలకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం సహించదు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే మా అధికారులు ఈ ఘటనలపై పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆర్టీసీ సిబ్బందికి ప్రయాణికులు సహకరించాలి. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సహకరించాలని కోరుతున్నాం అని అన్నారు. #TSRTC కి సిబ్బంది వెన్నుముక. వారు అనునిత్యం నిబద్దతతో విధులు నిర్వర్తిస్తూ ప్రతి రోజు లక్షలాది ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. సిబ్బంది కృషి వల్లనే సంస్థ మనగలుగుతుంది. మహాలక్ష్మి స్కీమ్ అమలులోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. సంస్థకు బ్రాండ్… pic.twitter.com/4PIOXQmAAX — V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 28, 2023 -
జీరో టికెట్పై కండక్టర్ల కన్నింగ్ ప్లాన్.. చర్యలకు TSRTC రెడీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీరో టికెట్ విషయంతో కొందరు కండక్టర్లు అత్యుత్యాహం చూపిస్తున్నారు. ఎక్కువ మందిని తీసుకెళ్తున్నామని చూపించుకోవడానికి లెక్కలు పెంచుతూ ఇష్టారీతిన టికెట్స్ కొడుతున్నారు. ఈ విషయం ఆర్టీసీ అధికారులు దృష్టికి చేరడంలో దీనిపై యాజమాన్యం చర్యలకు సిద్ధమైంది. వివరాల ప్రకారం.. కేపీహెచ్బీలో ఓ ప్రయాణికురాలు బస్సు ఎక్కారు. ఆధార్కార్డు చూపించి టికెట్ ఎస్ఆర్ నగర్ వరకూ టికెట్ ఇవ్వమని కోరారు. అయితే, బస్సు కండక్టర్ మాత్రం ఆమెకు.. కోఠి వరకూ జీరో టికెట్ ఇచ్చారు. దీంతో, టికెట్పై అదేంటని ప్రయాణికురాలు ప్రశ్నించగా.. మీరేమీ డబ్బులు ఇవ్వలేదు కదా? అని అన్నాడు. అదే బస్సుల్లో సదరు కండక్టర్ మరొకరికి కూడా ఇలాగే టికెట్ ఇచ్చినట్టు తేలింది. కాగా, విషయాన్ని సదరు ప్రయాణికులు అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు. ఇలాంటి ఫిర్యాదులు గ్రేటర్జోన్ అధికారుల దృష్టికి వెళ్లాయి. దీంతో, యాజమాన్యం చర్యలకు సిద్ధమైంది. అయినా కండక్టర్లలో మార్పు రావడంలేదు. అయితే.. అంతకుముందు నుంచి కూడా 2850 బస్సులులే ఉండగా.. ప్రయాణికులు మాత్రం రెట్టింపు అయ్యారు. గతంలో 11లక్షల మంది ప్రయాణిస్తే.. ప్రస్తుతం ఆ సంఖ్య 18లక్షలకు చేరింది. ఉదయం, సాయంత్రం బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. సీట్లు 60శాతం మహిళలతో నిండిపోతున్నాయి. 43 సీట్ల మెట్రో ఎక్స్ప్రెస్, 45 సీట్ల ఆర్డినరీ బస్సుల్లో వందమంది వరకూ ప్రయాణిస్తున్నారు. ఎంత పెరిగినా 2850 బస్సుల్లో 18లక్షల మంది ఎలా అవుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎక్కువమంది ప్రయాణికుల్ని తీసుకెళ్తే డ్రైవర్, కండక్టర్లకు యాజమాన్యం నజరానాలు ప్రకటించింది. అందుకే కొంతమంది జీరో టిక్కెట్లు జారీ చేసి లెక్కలు పెంచుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్ల చేతివాటం! 100 శాతం ఆక్యుపెన్సీ రేషియో పెంచడం కోసం మహిళా ప్రయాణికులు ఎక్కిన దాని కన్నా ఎక్కువ జీరో టిక్కెట్లు కొడుతున్న ఆర్టీసీ కండక్టర్లు. ఉత్తి పుణ్యానికి జీరో టిక్కెట్లు కొడుతూ ప్రభుత్వం ధనం వృధా చేస్తున్న కండక్టర్లు. మహబూబ్ నగర్ నుండి తాండూరు… pic.twitter.com/Ht6fnPZP4q — Telugu Scribe (@TeluguScribe) December 24, 2023 ఇటీవల ఓ పల్లెవెలుగులో కండక్టర్ కూడా ఇలాగే చేసినట్టు ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ప్రయాణికులు బస్సు ఎక్కకపోయినా కండక్టర్ జీరో టికెట్ కొడుతున్నారని సదరు ప్రయాణికుడు ఆరోపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
ఫ్రీ జర్నీ.. తెలంగాణ మహిళలకు అలర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళలకు అలర్ట్. నవంబర్ 15 అంటే రేపు శుక్రవారం నుంచి ప్రయాణాల్లో ఆధార్ సహా ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాల్సిందే. కండక్టర్లకు ఆ కార్డుల్ని చూపించడంతో పాటు.. జీరో టికెట్ తీసుకోవాల్సిందేనని టీఎస్ఆర్టీసీ మహిళా ప్రయాణికులకు సూచించింది. ఉదయం నుంచి ఈ నిబంధన అమలు అవుతుందని తెలిపింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకంలో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు ఉచిత ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తోంది. డిసెంబర్ 9న ఈ స్కీమ్ ప్రారంభం అయ్యింది. అయితే తొలివారం గుర్తింపు కార్డు అక్కర్లేకుండానే ప్రయాణించే వెసులుబాటు కల్పించింది. ఆ తర్వాత మాత్రం ఏదైనా గుర్తింపు కార్డు ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలుపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పర్యవేక్షించారు. గురువారం వర్చువల్గా అధికారులతో సమావేశమైన ఆయన.. కండక్టర్లు జీరో టికెట్ జారీ చేయాలని, ప్రయాణికురాలు విధిగా జీరో టికెట్ తీసుకోవాలని కోరారు. ప్రస్తుతానికి ఎలాంటి ఫిర్యాదులు లేకుండా పథకం విజయవంతంగా అమలు అవుతోందని.. అతి తక్కువ సమయంలోనే జీరో టికెట్ కోసం సాప్ట్ వేర్ ను అప్ డేట్ చేశారని అధికారుల్ని అభినందించారాయన. ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ అమల్లో భాగంగా శుక్రవారం నుంచి మహిళలకు జీరో టికెట్లను జారీ చేస్తున్నట్లు @TSRTCHQ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు(@SajjanarVC) తెలిపారు. ప్రతి ప్రయాణికురాలు విధిగా జీరో టికెట్ ను తీసుకుని సంస్థకు సహకరించాలని ఆయన కోరారు. మహిళలకు జీరో… pic.twitter.com/XgPKGPqtpf — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 14, 2023 మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ జర్నీ స్కీమ్ కింద.. రాష్ట్రవ్యాప్తంగా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులు, సిటీలో ఆర్డీనరీ, మెట్రో బస్సుల్లో మాత్రమే ఉచితంగా ప్రయాణించే వీలు ఉంది. తెలంగాణ వాళ్లకు(గుర్తింపు కార్డు ఉండాల్సిందే) మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. -
ఆయన తగ్గలేదు.. నేనే లావెక్కుతా: మహాలక్ష్మి
తమిళ నిర్మాత, లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్, నటి మహాలక్ష్మి వివాహం తర్వాత చాలా మంది నుంచి ట్రోల్స్ ఎదుర్కొన్నారు. చాలా రహస్యంగా పెళ్లి చేసుకున్న వారిద్దరి పెళ్లి ఫోటోలు బయటకు రావడంతో భారీగా వైరల్ అయ్యాయి. వివాహం తర్వాత రవీందర్ చాలా అవహేళనలు ఎదుర్కొన్నాడు. దీనికి ప్రధాన కారణం ఆయన మితిమీరిన బరువు ఉండటమే.. మహాలక్ష్మి మాత్రం నాజుగ్గా ఉంటుంది. దీంతో డబ్బు కోసమే రవీందర్ను మహాలక్ష్మి పెళ్లి చేసుకుందంటూ ఆమెను నెటిజన్లు ట్రోల్ చేశారు. ఇలా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న ఈ జంట మాత్రం లైఫ్ను ఆనందంగానే లీడ్ చేస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మహాలక్ష్మి తన వ్యక్తిగత జీవితం గురించి, భర్త గురించి ఓపెన్గా చెప్పింది. తనను ఎక్కువగా బాధపెట్టిన దాని గురించి బహిరంగంగా మాట్లాడింది. 'మా పెళ్లి సందర్భంగా చాలా మంది ట్రోల్స్ చేశారు. కానీ వాటన్నింటినీ పట్టించుకోలేదు. అలాగే నా భర్త రవీందర్ బరువు ఎక్కువగా ఉండడంతో ఆయన కోసం నేనూ బరువు పెరిగేందుకు ప్లాన్ చేస్తున్నాను. బరువు తగ్గాలని రవీందర్ ఎంత ప్రయత్నం చేసినా అది కుదరడం లేదు.. కాబట్టి నేనే ఆయన మాదిరి బరువు పెరగాలని చూస్తున్న. బరువు పెరిగేందుకు నేను అధికంగా కొవ్వు పదర్థాలు కూడా తీసుకుంటున్నాను. ఆర్ధరాత్రి సమయంలో ఎక్కువగా ఫుడ్ తింటున్నాను. ఆ సమయంలో నాకు నిద్ర కూడా పోతుంది. ఎలాగైనా నేను కూడ ఆయనలా మారాలి. అప్పుడైనా ఈ ట్రోల్స్ ఆగిపోతాయి అనుకుంటా.' అని ఆమె సంచలన నిర్ణయం తీసుకుంది. కానీ తన భర్త రవీందర్ జుట్టు నెరిసిపోవడం చాలా బాధగా ఉందని ఆ ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది. మహాలక్ష్మి నిర్ణయాన్ని మార్చుకోవాలని లేదంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని తన భర్త చెప్పినా అందుకు ఆమె అంగీకరించలేదని తెలిపింది. ఏమేమైనా త్వరలో బరువు పెరగాలనే ఆలోచనతో మహాలక్ష్మి ఉంది. ప్రస్తుతం ఆమె చెప్పిన మాటలు కోలీవుడ్లో వైరల్ అవుతున్నాయి. మహాలక్ష్మి, రవీందర్ ఇద్దరిదీ కూడా రెండో పెళ్లినే.. ఇద్దరికీ మొదటి వివాహం నుంచి ఒక బిడ్డ ఉంది. మొదటి వివాహం ముగిసిన తర్వాత ఇద్దరూ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు.పెళ్లి సమయంలో మహాలక్ష్మి డబ్బు కోసమే రవీందర్ని పెళ్లిచేసుకుందని, అతని సంపద చూసి నటి పెళ్లికి సిద్ధమైందని పలువురు చెప్పారు. అంతేకాదు మహాలక్ష్మి లాంటి అందమైన అమ్మాయిని పొందడానికి నిర్మాత రవీందర్ ఎన్నో ట్రిక్కులు వేశారని సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వచ్చాయి. అయితే ట్రోల్స్ను అధిగమించి మంచి వైవాహిక జీవితాన్ని గడపగలమని వారు చాలాసార్లు నిరూపించారు. ఆ మధ్య వారిద్దరూ విడాకులు తీసుకున్నారనే పుకార్లు వచ్చాయి. వాటిలో నిజం లేదని ఆమె తెలిపింది. ఆ మధ్య రవీందర్పై చీటింగ్ కేసు నమోదు కావడంతో జైలుకు వెళ్లే పరిస్థితి కూడా వచ్చింది. ఒకరిని మోసం చేసి డబ్బులు తీసుకున్నారంటూ నిర్మాతపై కేసు నమోదైంది. చివరికి ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. View this post on Instagram A post shared by Mahalakshmi Shankar (@mahalakshmi_actress_official) -
కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే మాట తప్పదు: డిప్యూటీ సీఎం భట్టి
ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకం అమలులో భాగంగా ఖమ్మం పాత బస్టాండ్లో మహిళలకు తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ ఆర్టీసీ బస్సులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలకు ఉచిత టికెట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం, కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే మాట తప్పదని తెలిపారు. ఇది ప్రజల ప్రభుత్వం, రాహుల్ గాంధీ చెప్పినట్టుగా అన్ని హామీలను అమలు చేస్తాం, సంపాదను సృష్టిస్తాం, సంపాదను ప్రజలకు పంచుతామని పేర్కొన్నారు. మహిళలు ఒక్క రూపాయ ఖర్చు లేకుండా ప్రయాణం చేయొచ్చని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గత ప్రభుత్వం అమలు చెయ్యలేదని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వేచ్ఛగా బ్రతకోచ్చని, ఎలాంటి నిర్భందాలు ఉండవని తెలిపారు. ఖమ్మం జిల్లాలో 10కి 9 స్థానాలల్లో ప్రజలు గెలిపించారని గుర్తుచేశారు. ప్రజలు ఆఫీస్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, అధికారులు ప్రజల ఇంటికి వచ్చి పనులు చేస్తారని తెలిపారు. రెవేన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ప్రజలు అద్భుతమైన విజయాన్ని అందించన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం, ఇప్పుడు రెండు పధకాలను అమలు చేశామని తెలిపారు. మహిళ ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ స్కీమ్లను ప్రారంభించామని పేర్కొన్నారు. వ్యవసాయం ,మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా ప్రజల కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్న మీ ఋణం తీర్చుకోలేమని అన్నారు. తన రాజకీయ జీవితం 40 ఏళ్ళు ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ళు అవకాశం కల్పించారని అన్నారు. గతంలో కొందరు పనికిరాని వ్యక్తుల వలన తప్పులు జరిగాయని మండిపడ్డారు. -
పనుండి చార్మినార్ వెళ్లి.. గచ్చిబౌలిలో చెల్లిని, హయత్నగర్లో బంధువులను కలిసి వస్తున్నా!
పనుండి చార్మినార్ వెళ్లా.. అక్కడి నుంచి గచ్చిబౌలిలో మా చెల్లెలి ఇంటికెళ్లి, అటు నుంచి హయత్నగర్ వెళ్లి మా పేరెంట్స్తో మాట్లాడి.. కోఠిలో షాపింగ్ చేసి వచ్చే సరికి లేటయిందండీ! -
గ్యారంటీగా అమలు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని 2004లో కరీంనగర్ గడ్డ మీద సోనియాగాంధీ మాట ఇచ్చారు. ఆ మాట మీద నిలబడి 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించారు. నాది తెలంగాణ అని గర్వంగా చెప్పుకొనే అవకాశం కల్పించారు. ఆ స్ఫూర్తి, ఆలోచనతోనే ఈ ఏడాది సెప్టెంబర్ 17న తుక్కుగూడ సభలో ఆరు గ్యారంటీల పేరుతో రాష్ట్ర ప్రజలకు హామీలు ఇచ్చారు. ఆ ఆరు గ్యారంటీల్లో రెండింటిని సోనియా జన్మదినం సందర్భంగా శనివారం నుంచి అమల్లోకి తెస్తున్నాం. తెలంగాణ ఇచ్చినట్టుగానే ఆరు గ్యారంటీలనూ అమలు చేస్తాం..’’అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ప్రకటించారు. శనివారం శాసనసభలో కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం.. అసెంబ్లీ ప్రాంగణంలోనే చేయూత, మహాలక్ష్మి పథకాలకు పచ్చజెండా ఊపారు. ‘చేయూత’పథకం కింద రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధి రూ.10 లక్షలకు పెంపు, ‘మహాలక్ష్మి’పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ, ఇతర మంత్రులు, శాసనసభ్యులతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. తాము ఇచ్చిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో నిక్కచ్చిగా అమలు చేస్తామని చెప్పారు. తెలంగాణను సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. డిసెంబర్ 9 తెలంగాణకు పండుగ రోజు అని వ్యాఖ్యానించారు. లోగో ఆవిష్కరించి.. జెండా ఊపి.. ‘చేయూత’పథకంలో భాగంగా రాష్ట్రంలోని పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య చికిత్సల పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతూ లోగో, పోస్టర్ను సీఎం రేవంత్రెడ్డి ఆవిష్కరించారు. తర్వాత మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్కలతోపాటు మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రేలతో కలసి మహిళల ఉచిత ప్రయాణ బస్సును జెండా ఊపి ప్రారంభించారు. ఉచిత టికెట్ను ఆవిష్కరించారు. ఉప్పల్ డిపోకు చెందిన టీఎస్08జెడ్ 0143 నంబర్ బస్సులో మహిళా ప్రయాణికులతో కలసి లోయర్ ట్యాంక్బండ్ ప్రాంతంలోని అంబేడ్కర్ విగ్రహం వరకు ప్రయాణించారు. ఈ బస్సులో సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, సీఎస్ శాంతికుమారి, మహిళా ఐఏఎస్ అధికారులు వాణీప్రసాద్, టీకే శ్రీదేవి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, మహిళా ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, యశస్వినిరెడ్డి, ఎమ్మెల్యేల బంధువులు ప్రయాణించారు. ఈ సందర్భంగా తొలి ఉచిత టికెట్ను తెలంగాణకు చెందిన ప్రఖ్యాత బాక్సర్ నిఖత్ జరీన్కు రేవంత్రెడ్డి అందజేశారు. ఈ బస్సుతోపాటు ఏర్పాటు చేసిన మరో రెండు బస్సుల్లో జీహెచ్ఎంసీ కార్మికులు, విద్యార్థినులు ప్రయాణించారు. ఈ కార్యక్రమంతో రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఆర్టీసీ ప్రారంభించింది. అంబేడ్కర్కు ఘనంగా నివాళి అర్పించి.. అసెంబ్లీ నుంచి బస్సులో ట్యాంక్బండ్ వరకు వెళ్లిన సీఎం రేవంత్, మంత్రులు, అధికారులు.. అక్కడ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తర్వాత సీఎం సహా అందరూ అదే ఆర్టీసీ బస్సులో తిరిగి వెళ్లారు. ఈ సందర్భంగా రేవంత్ బస్సులో నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ఉండగా.. మంత్రి సీతక్క, కొండా సురేఖ ఇద్దరూ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అంటూ పోస్టర్లను ప్రదర్శించారు. ‘మహాలక్ష్మి’తో మరింత సంతోషం: రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ కొత్త ప్రభుత్వంలో తనకు రవాణాశాఖ దక్కడం సంతోషంగా ఉందని.. తనకు ఆ శాఖను కేటాయించిన తొలిరోజే ఆర్టీసీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే పథకాన్ని ప్రారంభించటం మరింత సంతోషాన్ని కలిగించిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ‘‘ఇది గొప్ప పథకం, మహిళలకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. దీన్ని అంతా కలసి విజయవంతం చేయాలి. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వెసులుబాటు ఉందన్న ఉద్దేశంతో.. అంతగా అవసరం లేకున్నా బస్సుల్లో ప్రయాణిస్తూ ఉంటే తోటివారికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకే అవసరమున్న మహిళలు దీన్ని వినియోగించుకోవాలని కోరుతున్నా. ఓ రెండు వారాలు దీన్ని సమీక్షిస్తూ తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం. నేను కొత్త మంత్రిని అయినందున శాఖపై పూర్తి అవగాహన రావాల్సి ఉంది. త్వరలోనే కార్యాచరణ ప్రారంభిస్తాను’’అని పొన్నం ప్రభాకర్ చెప్పారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో పేదలకు వైద్యం రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రారంభించిన ‘చేయూత’పథకం ద్వారా రాష్ట్రంలోని పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించనున్నారు. ఈ పథకంలో భాగంగా నిరుపేదలకు ఆరోగ్య భద్రతను కల్పించే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఒక్కో కుటుంబానికి ఏటా రూ.10 లక్షల వరకు ఉచితంగా వైద్య సాయం అందుతుంది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 90.10 లక్షల కుటుంబాలు ఈ పథకం కింద లబ్ధి పొందుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వైద్యపరంగా మొత్తం 1,672 ప్యాకేజీలు అమలుకావడంతోపాటు 21 స్పెషాలిటీ సేవలు అందుతాయని వెల్లడించాయి. -
మహాలక్ష్మీ పథకం ప్రారంభం.. మహిళలకు ఉచిత ప్రయాణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల హామీల్లో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. అసెంబ్లీ వద్ద ఆర్టీసీ బస్సుల్లో మహిళలు, యువతులు ఉచితంగా ప్రయాణించే మహాలక్ష్మి పథకాన్ని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లాంఛనంగా ప్రారంభించారు. అలాగే, రాజీవ్ ఆరోగ్యశ్రీ(చేయూత)ని ప్రారంభించిన సీఎం, మంత్రులు. దీంతో, ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి మహాలక్ష్మీ పథకం అమలులోకి రానుంది. తెలంగాణలో పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. అసెంబ్లీ ఆవరణలో మూడు బస్సులు ప్రారంభమయ్యాయి. ఇక, ఆరోగ్యశ్రీ కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వైద్యఖర్యులను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయ తీసుకుంది. మంత్రులు సీతక్క, కొండా సురేఖ పచ్చజెండాను ఊపి బస్సులను ప్రారంభించారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. నేడు సోనియా గాంధీ పుట్టినరోజు. డిసెంబర్ 9 తెలంగాణకు పండుగ రోజు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియా నెరవేర్చారు. నాది తెలంగాణ అని చెప్పుకునే అవకాశాన్ని సోనియా మనకు ఇచ్చారు. మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాం. తెలంగాణవ్యాప్తంగా మహాలక్ష్మీ పథకం అమలులోకి వస్తుంది. ఆరు గ్యారంటీల్లో భాగంగా రెండు గ్యారంటీలను అమలుచేస్తున్నాం అని అన్నారు. అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ మంత్రులు, మహిళ నేతలు బస్సులో ట్యాంక్ బండ్కు బయలుదేరారు. దీంతో, అక్కడ సందడి వాతావరణం చోటుచేసుకుంది. ఇక, నేటి మధ్యాహ్నం నుంచి మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు. నిఖత్ జరీన్కు ప్రోత్సాహకం.. అలాగే, బాక్సర్ జఖర్ ఘరీన్కు రూ. 2కోట్ల చెక్ను సీఎం రేవంత్ అందించారు. వరల్డ్ చాంపియన్, కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్, బాక్సర్ నిఖత్ జరీన్కు పారిస్ ఒలింపిక్స్ సన్నద్ధత కోసం రూ.2 కోట్ల చెక్ అందించిన సీఎం రేవంత్ రెడ్డి. -
జేబులో నోటులాంటి కేసీఆర్ను వదులుకోవద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సంపదను పెంచి పేదలకు పంచి వారిని కడుపులో పెట్టుకుని చూడాలన్నదే సీఎం కేసీఆర్ విధానమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడిస్తాం, కూల్చేస్తామని కొందరు అంటున్నారని, జేబులో నోటు లాంటి సీఎంను వదులుకోవద్దని పిలుపునిచ్చారు. ఖైరతాబాద్ నియోజకవర్గ బీజేపీ నేత పల్లపు గోవర్దన్, హిమాయత్నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి శుక్రవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ చిల్లర మాటలకు పడిపోతే హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోతుందని అన్నారు. హైదరాబాద్లో మౌలిక వసతులు మెరుగు పరుస్తూ నగరాన్ని పసిగుడ్డులా చూసుకుంటున్నామన్నారు. ‘వండి పెట్టుడు.. మూతి తుడుసుడు తప్ప అన్నీ ప్రభుత్వమే చేస్తుంది’అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో మరో లక్ష ఇళ్లు హైదరాబాద్ మహా నగరంలో పేదల కోసం ఇప్పటికే లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి 70వేలు పంపిణీ చేశామని, మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరో లక్ష ఇళ్లు నిర్మిస్తామని కేటీఆర్ వెల్లడించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా హైదరాబాద్ మెట్రోను 400 కి.మీ మేర విస్తరిస్తామన్నారు. సినీ నటులు రజనీకాంత్, సన్నీ డియోల్, లయ తదితరులు హైదరాబాద్ను అమెరికా నగరాలతో పోలి్చన విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్రెడ్డి, దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్కు యునైటెడ్ ముస్లిం ఫోరం మద్దతు మైనారీ్టల సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేస్తున్న బీఆర్ఎస్కు అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతును ఇస్తున్నట్లు యునైటెడ్ ముస్లిం ఫోరం ప్రకటించింది. ప్రగతిభవన్లో ఫోరం ప్రతినిధులు శుక్రవారం మంత్రి కేటీఆర్తో భేటీ అయ్యారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ముస్లింల జీవితాల్లో గణనీయ మార్పు వచి్చందని, బడ్జెట్లో కేటాయింపులు పెంచడంతో పాటు మైనారిటీ విద్యా సంస్థల ఏర్పాటు వంటివి ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. కేటీఆర్ను కలిసిన వారిలో అక్బర్ నిజాముద్దిన్, జియాఉద్దిన్ నయ్యర్, సయ్యద్ మసూద్ తదితరులున్నారు. -
నేను ఏ తప్పూ చేయలేదు.. ఏడ్చేసిన మహాలక్ష్మి భర్త
చీటింగ్ కేసులో అరెస్టయిన తమిళ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ బెయిల్పై బయటకు వచ్చాడు. అయితే తనను అన్యాయంగా కేసులో ఇరికించాడని వాపోయాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఎమోషనలయ్యాడు. 'నాకు మా అమ్మ తర్వాత మహాలక్ష్మి అంటేనే ఎక్కువ ఇష్టం. ఆమె నాకు దొరికిన వరం. మా ఇద్దరినీ ఎవరూ విడదీయలేరు. ట్రోలర్స్ ఎన్నైనా అనుకోండి.. ఎంతైనా తిట్టుకోండి. కానీ మమ్మల్ని వేరు చేయలేరు. నన్ను అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లినప్పుడు కింద కూర్చోమన్నారు. కానీ అందరికీ వారి శరీరం సహకరించినట్లుగా నా బాడీ నాకు సహకరించదు. నేను చెప్పేది కూడా వినకుండా అరెస్ట్ చేసి లాక్కెళ్లారు. నేను ఏ తప్పూ చేయలేదు. నా మీద ఫిర్యాదు చేసిన వ్యక్తే అనేక తప్పుడు పనులు చేశాడు, దొంగతనాలు చేశాడు. అవన్నీ నాకు తెలిసిపోవడంతో నామీదే తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయించాడు. నేను అతడిని వదిలిపెట్టను. తన బండారం మొత్తం బయటపెడతాను, దోషిగా నిరూపిస్తాను' అంటూ ఏడ్చేశాడు రవీందర్. ఏ కేసులో అరెస్ట్ అయ్యాడంటే? వ్యర్థాల నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేసే ప్రాజెక్ట్తో కోట్లు సంపాదించవచ్చంటూ చెన్నైకి చెందిన బాలాజీ అనే వ్యక్తిని నమ్మించాడు రవీందర్. అందుకు కావాల్సిన నకిలీ పత్రాలను సిద్ధం చేసి అతడి దగ్గరి నుంచి రూ.15 కోట్లకు పైగా డబ్బు తీసుకున్నాడు. 2020లో సెప్టెంబర్ 17న ఈ ఒప్పందం జరిగింది. అయితే డబ్బు ముట్టిన తర్వాత రవీందర్ ప్రాజెక్ట్ను పక్కన పడేశాడని, కనీసం తన డబ్బు తిరిగివ్వాలని కోరినప్పటికీ అందుకు సరిగా స్పందించలేదని బాలాజీ వాదన. దీంతో అతడు చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు రవీందర్ను అరెస్ట్ చేశారు. రెండు, మూడు రోజుల క్రితమే అతడు బెయిల్ మీద బయటకు వచ్చాడు. View this post on Instagram A post shared by Mahalakshmi Shankar (@mahalakshmi_actress_official) చదవండి: తన టైమ్ బాగుందంటోన్న నేషనల్ క్రష్ -
అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు: బుల్లితెర నటి తీవ్ర ఆరోపణలు!
కోలీవుడ్ ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవలే చీటింగ్ కేసులో జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఒక వ్యాపారవేత్తను ఆయన మోసం చేసినందుకు గాను అరెస్ట్ అయ్యాడు. ఈ వార్త కోలీవుడ్లో సంచలనంగా మారింది. అయితే గతేడాది బుల్లితెర నటి మహాలక్ష్మి శంకర్ను ఆయన పెళ్లి చేసుకున్నారు. అయితే ఇటీవల భర్త జైలుకు వెళ్లినప్పటికీ ఎప్పటిలాగే ఇన్స్టాలో ఫోటోలు షేర్ చేసింది. దీంతో భర్త జైల్లో ఉంటే మీకిది అవసరమా నెటిజన్స్ ఆమెను తప్పుపడుతున్నారు. (ఇది చదవండి: 'హ్యాపీ బర్త్ డే క్యూటీ'.. బన్నీ ఎమోషనల్ పోస్ట్!) అయితే తాజాగా వీరిద్దరి వ్యవహారం కోలీవుడ్లో మరోసారి హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం రవీందర్ జైలులో ఉండగా.. ఆయన భార్య మహాలక్ష్మి సంచలన కామెంట్స్ చేసింది. తన భర్త రవీందర్ తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని ఆరోపించింది. ఈ విషయాలన్నీ తనకు చెప్పలేదని బంధువులతో వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మహాలక్ష్మి మాట్లాడుతూ..'పెళ్లికి ముందు ఇలాంటి విషయాలు నాకు తెలియవు. రవీందర్ కూడా సమస్యలుని అనే విషయం చెప్పలేదు.. నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు' అంటూ తన భర్త రవీందర్ గురించి సన్నిహితుల ముందు చెప్పింది. ప్రస్తుతం ఈ విషయంలో కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. రవీందర్ జైలుకెళ్లడం వల్ల అతని భార్య మహాలక్ష్మి ఒత్తిడికి లోనవుతున్నట్లు కూడా కొందరు చెబుతున్నారు. అయితే ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కాగా.. ఓ వైపు ఆమెకు ఇప్పటికే పెళ్లై ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఆమె అనిల్ అనే వ్యక్తిని పెళ్లాడింది. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో 2019లో విడాకులు తీసుకున్నారు. గతేడాది నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ వివాహం చేసుకుంది. ప్రస్తుతం అతను మోసం కేసులో అరెస్టవడంతో మహాలక్ష్మి చేసిన కామెంట్స్ కోలీవుడ్లో చర్చకు దారితీశాయి. కాగా.. ఇటీవలే ఈ జంట మొదటి వివాహా వార్షికోత్సవం కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: నటి మహాలక్ష్మి భర్త రవీందర్ అరెస్ట్) View this post on Instagram A post shared by Ravindar Chandrasekaran (@ravindarchandrasekaran) -
భర్త జైల్లో ఉంటే ఫోటోషూట్స్తో బిజీగా ఉన్న మహాలక్ష్మి!
కోలీవుడ్లో నటి మహాలక్ష్మి- నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ జంట వెరీ పాపులర్.. వీరిద్దరూ కలిసి ఫోటో దిగినా, వీడియోలు షేర్ చేసినా ఇట్టే వైరల్ అవుతుంటాయి. ఆదర్శ దంపతులని కొందరు కితాబిస్తే.. డబ్బు కోసమే అతడిని పెళ్లి చేసుకుందని మరికొందరు విమర్శిస్తుంటారు. ఇకపోతే ఇటీవలే చీటింగ్ కేసులో రవీందర్ అరెస్టయిన సంగతి తెలిసిందే! ప్రస్తుతం ఆయన ఇంకా జైల్లోనే ఉన్నాడు. భర్త జైల్లో.. భార్య ఫోటోషూట్స్తో బిజీలో ఇటువంటి సమయంలో మహాలక్ష్మి చేసిన పనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భర్త జైల్లో ఉంటే నటి ఫోటోషూట్లతో బిజీగా ఉంది. వరుసగా ఫోటోషూట్స్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో పంచుకుంటోంది. అంతా మంచే జరుగుతుంది.. నా హృదయం నీకోసమే ఎదురుచూస్తోంది అని వాటికి క్యాప్షన్ జోడించింది. క్యాప్షన్ బాగానే ఉన్నా మహాలక్ష్మి ఫోటోషూట్, అందులో ఆమె సరదాగా చిరునవ్వులు ఒలికించడం చూస్తే ఏదో తేడా కొడుతోందంటున్నారు కొందరు నెటిజన్లు. పెళ్లికంటే ముందే డీల్ నిజంగానే మహాలక్ష్మి డబ్బు కోసమే అతడిని పెళ్లాడి, ఇప్పుడు కావాలనే తనని జైలుకు పంపించిందా? అన్న అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నారు. అయితే నటి అభిమానులు మాత్రం ఈ ఆరోపణలను తిప్పికొడుతున్నారు. వీరు చాలాకాలంగా ప్రేమించుకున్నప్పటికీ పెళ్లి మాత్రం గతేడాదే జరిగిందని.. దానికంటే ముందే ఈ ప్రాజెక్ట్ గురించి ఒప్పందం చేసుకున్నారని అంటున్నారు. నిర్మాత అరెస్ట్.. కారణమేంటంటే.. వ్యర్థాల నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేసే ప్రాజెక్ట్తో కోట్లు సంపాదించవచ్చంటూ చెన్నైకి చెందిన బాలాజీ అనే వ్యక్తిని నమ్మబలికించాడు రవీందర్. అందుకు కావాల్సిన నకిలీ పత్రాలను సిద్ధం చేసి అతడి దగ్గరి నుంచి రూ.15 కోట్లకు పైగా డబ్బు తీసుకున్నాడు. 2020లో సెప్టెంబర్ 17న ఈ ఒప్పందం జరిగింది. అయితే డబ్బు ముట్టిన తర్వాత రవీందర్ ప్రాజెక్ట్ను పక్కన పడేశాడు. పోనీ, తన డబ్బు తిరిగివ్వాలని కోరినప్పటికీ అందుకు సరిగా స్పందించలేదు. దీంతో బాలాజీ చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు రవీందర్ను అరెస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Mahalakshmi Shankar (@mahalakshmi_actress_official) View this post on Instagram A post shared by Mahalakshmi Shankar (@mahalakshmi_actress_official) View this post on Instagram A post shared by Mahalakshmi Shankar (@mahalakshmi_actress_official) చదవండి: మీరా సూసైడ్.. కంటతడి పెట్టిస్తున్న విజయ్ ఆంటోని భార్య మాటలు.. -
కన్నబిడ్డలనే కాల్వలోకి తోసి...
బిజినేపల్లి: కల్లు తాగొద్దని భర్త హెచ్చరించాడన్న కోపంతో ఓ తల్లి ముక్కుపచ్చలారని తన నలుగురు చిన్నారులను కాల్వలో విసిరేసింది. ఈ ఉదంతం శనివారం నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని ఎర్రకుంటతండాలో చోటుచేసుకుంది. మండలంలోని లట్టుపల్లి పంచాయతీ పరిధిలోని ఎర్రకుంట తండాకు చెందిన లలిత మంగనూర్కు చెందిన శరబందను ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి కూతుళ్లు మహాలక్ష్మి (7), సాత్విక (5), మంజుల (3)తోపాటు 7 నెలల కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో లలిత కొన్నాళ్లుగా మందు కల్లును తాగుతుండటంతో పలుమార్లు భర్త శరబంద మందలించాడు. దీంతో భర్త తరచూ మందలిస్తున్నాడని లలిత శనివారం బిజినేపల్లి పోలీస్స్టేషన్కు చేరుకుని వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. పోలీసులు శరబందను స్టేషన్కు రావాలని ఫోన్ చేసి పిలిచారు. మధ్యాహ్నం కావడంతో పిల్లలకు ఏమైనా తినిపించుకు వస్తానని చెప్పి వెళ్లిన లలిత.. పోలీస్స్టేషన్ సమీపంలోని కేఎల్ఐ కాల్వలోకి చిన్నారులతో కలిసి దిగింది. అటుగా వెళ్తున్న కొందరు ఆమెను గమనిస్తుండగానే నలుగురు చిన్నారులను కాల్వలోకి విసిరేసింది. వెంటనే వారు బిజినేపల్లి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించి కాల్వలోకి దిగారు. పోలీసులు సైతం కాల్వ వద్దకు వచ్చి గాలించగా.. నీటి ఉధృతికి చిన్నారులు కిలోమీటరు మేర కొట్టుకుపోయారు. చివరికి ముగ్గురు కుమార్తెల మృతదేహాలు లభించగా.. బాలుడు మార్కండేయ ఆచూకీ లభించలేదు. అప్పటికే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. చిన్నారులను కాల్వలో విసిరేసిన తల్లిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న భర్త శరబంద సైతం పోలీస్స్టేషన్కు చేరుకున్నాడు. చిన్నారుల మృతదేహాలను పోలీసులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
దటీజ్ డాక్టర్ మహాలక్ష్మీ..వెయ్యికి పైగా డైడ్బాడీస్కి పోస్ట్మార్టం
‘అమ్మాయిలు పోస్ట్మార్టం చేయలేరు’ ఈ అపోహ తప్పని నిరూపిస్తున్నారు ఈ రంగంలోకి వస్తున్న యువ డాక్టర్లు. నాలుగేళ్లలో వెయ్యికి పైగా మృతదేహాలకు పోస్ట్మార్టం చేసి, అమ్మాయిలూ చేయగలరు అని నిరూపిస్తున్నారు కర్ణాటకలోని కార్వార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మహాలక్ష్మి మన దేశంలో మొట్టమొదటి ఫోరెన్సిక్ సైంటిస్ట్గా డాక్టర్ రుక్మిణీ కృష్ణమూర్తి వార్తల్లో నిలిచారు. ముంబయ్లోని ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీలో 1974లో చేరిన ఆమె రిటైర్ అయ్యేంతవరకు వర్క్ చేశారు. ఆమె స్ఫూర్తితో ఆ తర్వాత ఈ రంగంవైపు ఆసక్తి చూపినవాళ్లు ఉన్నారు. కానీ, వేళ్లమీద లెక్కించదగిన సంఖ్యలోనే ఉన్నారు. అనారోగ్యంతో ఉన్నవారిని చూడటం సాధారణం. కానీ, కాలిపోయిన శరీరాలు, ప్రమాదాలలో ఛిద్రమైన శరీరాలు, నీటిలో మునిగిపోయిన శరీరాలు చూడటం సాధారణం కాదు. విషం కారణంగా శరీరం నీలం రంగులోకి మారడం లేదా ఆత్మహత్య కారణంగా మృతదేహాలను చూడటం మరింత బాధాకరం. సున్నితమనస్కులైన మహిళలు ఈ ఛాలెంజ్ను స్వీకరించలేరనేది అందరూ అనుకునేమాట. అయితే, ఈ వృత్తిని తాను ఛాలెంజింగ్గా తీసుకున్నానని చెబుతున్నారు డాక్టర్ మహాలక్ష్మి. చదువుకునే రోజుల్లో... ‘‘అమ్మనాన్నలకు ఐదుగురం ఆడపిల్లలం. అందులో ముగ్గురం డాక్టర్లమే. ఒక అక్క డెంటిస్ట్, మరొకరు ఆయుర్వేద డాక్టర్. వాళ్లని చూసే నేనూ డాక్టర్ కావాలని కల కన్నాను. ఆయుర్వేద వైద్యురాలైన మా అక్క ఫోరెన్సిక్ డాక్టర్ కావాలనుకుంది. కానీ, తను ఆ దారిలో వెళ్లలేకపోయింది. నేను ఈ టాపిక్ను ఎంచుకున్నప్పుడు మా అక్క ఎంతో సపోర్ట్నిచ్చింది. మా నాన్న ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసేవారు. అమ్మ గృహిణి. మా ఇంట్లో ఎప్పుడూ చదువుకే ప్రాధాన్యత ఉండేది. రిస్క్ ఎందుకు అన్నారు.. చదువుకునే రోజుల్లో సీఐడీ సీరియల్ చూసేదాన్ని. అందులో ఫోరెన్సిక్ విభాగం నాకు చాలా ఆసక్తిగా అనిపించేది. ఎంబీబీఎస్ రెండో సంవత్సరంలోనే ఫోరెన్సిక్కు సంబంధించిన సమాచారం తెలుసుకోవడం మొదలుపెట్టాను. మా ప్రొఫెసర్లు కూడా నాకు ఆ విభాగానికి సంబంధించిన సమాచారాన్ని, నేర కథనాలను వివరించేవారు. ఇందుకు సంబంధించిన నవలలు కూడా చదివాను. మా క్లాస్మేట్ అబ్బాయిలు మాత్రం ‘ఈ విభాగం వద్దు, అమ్మాయివి ఎందుకు రిస్క్. ఇది కేవలం మార్చురీ గురించి మాత్రమే కాదు, సాక్ష్యం కోసం కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. పోలీసులతో కలిసి పనిచేయాలి. రాత్రి, పగలు ఎప్పుడు అవసరమున్నా చురుగ్గా పనిచేయాలి. లేడీస్కి అంత సులభం కాదు’ అన్నారు. ‘మా నాన్నగారు కూడా పెళ్లై, సంప్రదాయ కుటుంబంలోకి వెళితే ఇబ్బందులుగా మారతాయి’ అన్నారు. కానీ, ఒక కేసు దర్యాప్తులో ఫోరెన్సిక్ నిపుణుల పాత్ర చాలా ముఖ్యం అని నాకు తెలుసు. ఈ ఫీల్డ్లో ఛాలెంజెస్ ఎక్కువ. నేను చేయగలను అని భావించే ఈ విభాగంలోకి వచ్చాను. ఇప్పుడు నా నిర్ణయాన్ని అంతా సమర్ధిస్తున్నారు’’ అని వివరించారు ఈ ఫోరెన్సిక్ డాక్టర్. అనేక పరిశోధనలు.. మేల్ డామినేటెడ్ వృత్తిలో ఎలా చోటు సంపాదించుకున్నావని నన్ను చాలామంది అడుగుతుంటారు. సవాళ్లు అంటే ఇష్టం అని చెబుతుంటాను. నేను పుట్టి పెరిగింది కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలోని హుబ్లీ నగరం. ప్రాథమిక విద్య వరకు బెల్గాంలో చదివాను. ఆ తర్వాత కాలేజీ చదువంతా హుబ్లీలోనే. 2007 నుండి 2017 మధ్యన బెల్గాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి ఎంబీబీఎస్ పూర్తి చేశాను. ఏడాది పాటు గ్రామీణ ప్రజలకు సేవ చేశాను. 2020లో ఫోరెన్సిక్ విభాగంలో చేరాను. అప్పటి నుండి అనేక పరిశోధనలను ఫోరెన్సిక్ నిపుణుల బృందంతో కలిసి పనిచేశాను. మెడికల్ స్టూడెంట్స్కు క్లాసులు తీసుకుంటున్నాను. ఈ విభాగంలో గోల్డ్ మెడల్ వచ్చింది. – డాక్టర్ మహాలక్ష్మి -
భర్తకు 6 అడుగుల గిఫ్ట్ ఇచ్చిన నటి
-
బర్త్డే కానుకగా భర్తకు 6 అడుగుల గిఫ్ట్ ఇచ్చిన నటి.. వైరల్ వీడియో!
తమిళ నిర్మాత, లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్, నటి మహాలక్ష్మి పెళ్లి చేసుకోవడంతో ఒక్కసారిగా ఈ జంట పాపులర్ అయిపోయింది. దీనికి కారణం నిర్మాత రవీందర్ అతి బరువు ఉండటమే. మహాలక్ష్మి మాత్రం పొట్టిగా, నాజుగ్గా ఉంటుంది. దీంతో డబ్బు కోసమే రవీందర్ను మహాలక్ష్మి పెళ్లి చేసుకుందంటూ ఆమెను నెటిజన్లు ట్రోల్ చేశారు. అంతేకాదు రవీందర్ భారీకాయం చూసి అతడిని బాడీ షేమింగ్ కూడా చేశారు నెటిజన్లు. (ఇదీ చదవండి: 61 ఏళ్ల వ్యక్తితో శృంగారం.. రియాక్ట్ అయిన హీరోయిన్) వారి పెళ్లి అయి రెండేళ్లు దాటింది.. ఈ జర్నీలో వారిద్దరిపై భారీగానే ట్రోలింగ జరిగింది. ఒకసారి అయితే ఏకంగా ఈ జంట విడాకులు తీసుకుంటుందని ప్రచరాం జరిగింది. పెళ్లి అయి అన్నేళ్లైనా ఇంకా ఎందుకు తల్లివి కాలదేని ఇలా పలు రకాలుగా ఆ జంటపై పలు కామెంట్లు వచ్చేవి. అయితే అవేవి తమను బాధించవని, తాము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కాబట్టి సంతోషంగా ఉన్నామని బహిరంగానే ఆ జంట చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: ప్రముఖ సింగర్తో అనిరుధ్ ప్రేమాయణం) తాజాగా రవీందర్ పుట్టినరోజు సందర్భంగా తన భర్తకు 6 అడుగుల ప్రత్యేక బహుమతిని ఇచ్చి మహాలక్ష్మి ఆశ్చర్య పరిచింది. ఆ వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో కూడా పంచుకుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రత్యేక బహుమతి ఏమిటంటే... 6 అడుగుల ఎత్తు ఉన్న రవీంద్ర ఫోటోను చక్కటి పెయింటింగ్తో తయారు చేయించి తన భర్తకు పుట్టినరోజు కానుకగా ఇచ్చింది. మహాలక్ష్మి బర్త్డే విషెష్ చెబుతూ ఇన్స్టాగ్రామ్లో ఇలా రాసింది. 'జీవితంలో నాకు మళ్లీ ధైర్యం తెచ్చిన మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. మీరే నా బలం. అందుకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని.' అని చెప్పుకొచ్చింది. ఈ వీడియోపై చాలా మంది నెటిజన్లు లైక్లతో పాటు పాజిటివ్ కామెంట్లు పెట్టారు. పలువురు రవీందర్కు విషెస్ చెబుతూ.. చెత్తగ మాట్లాడే వారిని పట్టించుకోకుండా ఇలా సంతోషంగా జీవితంలో ముందుకు సాగాలని కోరారు. -
భర్తకు విడాకులిచ్చిన బుల్లితెర నటి?
-
భర్తకు విడాకులిచ్చిన బుల్లితెర నటి? ఫోటోతో క్లారిటీ!
జీవితంలో పెళ్లి అనేది అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఈ పెళ్లిళ్లకు వచ్చేవాళ్లంతా జంట ఈడూజోడూ బాగుందా? అనే చూస్తారు. అమ్మాయి కంటే అబ్బాయి పొట్టిగా ఉన్నా, ఒకరు బక్కచిక్కగా ఉండి మరొకరు లావుగా ఉన్నా, ఒకరిది చిన్న వయసై ఉండి మరొకరిది ముదురు ముఖమైనా బుగ్గలు నొక్కుకుంటారు. జోడీ అస్సలు బాగోలేదని ముఖం మీదే చెప్తారు. తమిళ సెలబ్రిటీ జంట రవీందర్ చంద్రశేఖర్- మహాలక్ష్మిల విషయంలోనూ ఇదే జరిగింది. మహాలక్ష్మి యాంకర్, బుల్లితెర నటి.. పొట్టిగా, నాజూకుగా ఉంటుంది. రవీందర్ చంద్రశేఖరన్ తమిళ నిర్మాత, లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత.. భారీకాయుడు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇద్దరికీ ఇది రెండో వివాహమే! పెద్దల అంగీకారంతో వీరు వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు. కానీ ఈ జంటపై నెట్టింట తరచూ ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. ఓపక్క భారీకాయంపై రవీందర్ను బాడీ షేమింగ్, మరో పక్క డబ్బు కోసమే అతడిని పెళ్లి చేసుకున్నావంటూ మహాలక్ష్మిని విమర్శిస్తూ ఉంటారు. ఆ ట్రోలర్స్ నూరు మూయిస్తూ భర్తతో కలిసి ఉన్న ఫోటోలు తరచూ షేర్ చేస్తూనే ఉంటుంది మహాలక్ష్మి. ఈ మధ్యకాలంలో కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ఏకంగా వీరు విడిపోయారంటూ ప్రచారం మొదలు పెట్టారు. ఈ క్రమంలో తాజాగా భర్తతో కలిసి దిగిన ఫోటో షేర్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో ఓ రొమాంటిక్ పోస్ట్ పెట్టింది నటి. 'నువ్వు నా భుజంపై చేయి వేసినప్పుడు ఈ ప్రపంచంలో నేను ఏదయినా చేయగలను అన్నంత ధైర్యం వస్తుంది. నా మనసు నిండా నువ్వే అమ్ము, ఐ లవ్యూ' అని క్యాప్షన్లో రాసుకొచ్చింది. దీనికి రవీందర్ కూడా లవ్ యూ అంటూ రిప్లై ఇచ్చాడు. 'మీరిద్దరూ విడిపోయాన్న వార్త రాగానే భయపడిపోయాను, ఇప్పుడు సంతోషంగా ఉంది..', 'ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్లు విడాకుల దాకా వెళ్లిపోయారు, తీరా ఇక్కడ చూస్తే మీరు కలిసే ఉన్నారు. సంతోషంగా ఉంది' అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Mahalakshmi Shankar (@mahalakshmi_actress_official) చదవండి: చిన్న వయసులోనే కారు నడిపిన మహేశ్.. పోలీసుల ఎంట్రీతో ట్విస్ట్! -
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా మహాలక్ష్మీ యాగం
-
పాపులర్ కపుల్ రవీంద్రన్-మహాలక్ష్మి ఫొటోలు చూశారా?
-
మహాలక్ష్మి తల్లి కాబోతుందా? ఫొటో వైరల్
తమిళ నిర్మాత, లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్, నటి మహాలక్ష్మి ఇటీవల పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. పెళ్లి అనంతరం ఈ జంట ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్గా మారారు. దీనికి కారణం నిర్మాత రవీందర్ అతి బరువు ఉండటమే. మహాలక్ష్మి మాత్రం పొట్టిగా, నాజుగ్గా ఉంటుంది. దీంతో డబ్బు కోసమే రవీందర్ను మహాలక్ష్మి పెళ్లి చేసుకుందంటూ ఆమెను నెటిజన్లు ట్రోల్ చేశారు. అంతేకాదు రవీందర్ భారీకాయం చూసి అతడిని బాడీ షేమింగ్ చేశారు నెటిజన్లు. అయితే అవేవి తమను బాధించవని, తాము ప్రేమించి పెళ్లి చేసుకున్నామంటూ ట్రోల్స్పై ఈ జంట స్పందించింది. చదవండి: ఆందోళనకరంగా జబర్దస్త్ కమెడియన్ ఆరోగ్యం, నడవలేని స్థితిలో.. అంతేకాదు తరచూ ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తం చేస్తూ ట్రోలర్స్ నోరు మూయించే ప్రయత్నం చేస్తోంది ఈ జంట. అయినప్పటికీ వారిపై ట్రోల్స్ ఆగడం లేదు. ఇదిలా ఉంటే ఈ జంట త్వరలోనే గుడ్న్యూస్ చెప్పనుందని తెలుస్తోంది. మహాలక్ష్మి గర్భవతి అయినట్లు సోషల్ మీడియా జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ జంట డిన్నర్ డేట్కు వెళ్లిన ఫొటోలను షేర్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోను రవీందర్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. అయితే ఈ ఫొటోలో మహాలక్ష్మీ కాస్తా లావుగా, పొట్ట భాగం ముందుకు ఉన్నట్లుంది. చూస్తుంటే ఆమె గర్భవతి అన్నట్లుగాకనిపించింది. దీంతో ఆమెను చూసి మహాలక్ష్మి ప్రెగ్నెంటా? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు దీనికి రవీందర్ ఇచ్చిన క్యాప్షన్ చూస్తుంటే అదే నిజం అనేట్టుగా ఉంది. చదవండి: అద్దె ఇంట్లో ఉండేవాళ్లం, రెంట్ కట్టలేక 2 నెలలకో ఇల్లు మారేవాళ్లం: రష్మిక ‘ఐ లవ్ యూ చెప్పడంలోనే నా సంతోషం లేదు.. నేను వ్యక్తం చేయకపోయినా నువ్వు నా కోసమే జీవించావంటూ నువ్వు చూపించే నీ నిజమైన ప్రేమ కూడా కారణం’ అంటూ ఈ ఫొటోకి రాసుకొచ్చాడు. దీంతో పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సెప్టెంబర్ 1న ఈ జంట ఇరువురి కుంటుంబ సభ్యుల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరికి ఇది రెండో వివాహం. రెండేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరి కుటుంబ సభ్యుల అంగీకారంతో ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. కెరీర్ మధ్యలో, మహాలక్ష్మి అనిల్ నేరేడిమిల్లిని వివాహం చేసుకుంది. మహాలక్ష్మికి తన మొదటి భర్తతో మగబిడ్డ జన్మనిచ్చింది. View this post on Instagram A post shared by Ravindar Chandrasekaran (@ravindarchandrasekaran) View this post on Instagram A post shared by Ravindar Chandrasekaran (@ravindarchandrasekaran) -
మహాలక్ష్మికి నా భర్తతో అఫైర్.. అందుకే ఆమె భర్త వదిలేశాడు : నటి
ప్రముఖ తమిళ నిర్మాత రవీందర్ బుల్లితెర నటి వీజే మహాలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. చూడచక్కని రూపంతో అందంగా ఉన్న మహాలక్ష్మీ.. భారీకాయుడైన రవీందర్ను పెళ్లాడటంతో ఈ జంట హాట్టాపిక్గా నిలిచింది. వీరి పెళ్లి గురించి తమిళనాటే కాకుండా సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ మధ్యకాలంలో వీళ్లపై వచ్చినన్ని ట్రోల్స్ ఎవరి మీద వచ్చి ఉండవు. వీరిద్దరికి ఇది రెండో పెళ్లి. తాజాగా మహాలక్ష్మి గురించి నటి జయశ్రీ సంచలన ఆరోపణలు చేసింది. మహాలక్ష్మికి తన భర్తతో అఫైర్ ఉందని, అందుకే మొదటి భర్త ఆమెను వదిలేశాడంటూ పేర్కొంది. తన ముందే ఆమెతో వీడియో కాల్స్ చేసి మాట్లాడేవాడని, అంతేకాకుండా మహాలక్ష్మి కొడుకు తన భర్తను నాన్న అని పిలుస్తున్నాడంటూ గతంలో జయశ్రీ ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. అయితే ఆ వార్తలను కొట్టిపారేసిన మహాలక్ష్మి జయశ్రీ కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తుందని, ఇందులో నిజం లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా తన వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో రవీందర్ తనకు అండగా నిలబడ్డాడని, అందుకే అతనితో కొత్త జీవితం ప్రారంభించానని తెలిపింది. -
భార్యకు కాస్ట్లీ కారు బహుమతిగా ఇచ్చిన నిర్మాత రవీందర్, ధరెంతంటే!
ప్రముఖ నిర్మాణ సంస్థ లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్, నటి మహాలక్ష్మి పెళ్లితో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్గా మారరు. రెండు నెలల క్రితం మూడు మూళ్ల బంధంతో ఒక్కటైన ఈ జంట ఒక్కసారిగా సోషల్ మీడియాలో, వార్తల్లోకెక్కారు. తాము ఒక్కటయ్యామంటూ ఫొటోలు షేర్ చేయడంతో వీరిని ట్రోల్స్ ఆటాడుకున్నారు నెటిజన్లు. దీనికి కారణం నిర్మాత రవిందర్ అధిక బరువు. కేవలం డబ్బు కోసమే రవిందర్ను మహాలక్ష్మి పెళ్లి చేసుకుందని ఈ జంటను టార్గెట్ చేశారు. చదవండి: సమంత అనారోగ్యంపై స్పందించిన మరో అక్కినేని హీరో, వెంకటేశ్ కూతురు అయితే ఈవేవి పట్టించుకుని ఈ జంట తమ దాంపత్యాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా భార్యకు కాస్ట్లీ కారు బాహుమతిగా ఇచ్చి తనపై ఉన్న ప్రేమను మరోసారి వ్యక్తం చేశాడు నిర్మాత రవీందర్. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘మనం జీవితాంతం ప్రేమించే వ్యక్తిని కనుగొనడం చాలా కష్టం. మనం ప్రేమించే వ్యక్తి.. తిరిగి మనల్ని అంతే గొప్పగా ప్రేమిస్తే అది మరింత విశేషం. కొత్త భార్య, కొత్త జీవితం, కొత్త కారు.. ఈజీ డ్రైవింగ్ అండ్ క్రేజీ సాయంతో స్వచ్ఛమైన స్వర్గం లాంటి కారును మనం పొందగలమని కోరుకుంటున్నాను’ అంటూ తమిళంలో రాసుకొచ్చాడు. ఈ సందర్భంగా భార్యతో కలిసి షో రూం దగ్గర కారు కొంటున్న వీడియోను షేర్ చేశాడు. చదవండి: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. యువ నటుడు, గాయకుడు మృతి నిర్మాత రవీందర్ తన భార్య మహాలక్ష్మికి ఇచ్చిన ఈ కారు ధర ఆసక్తిగా మారింది. బ్రిటిష్ ఆటోమొబైల్ కంపెనీ మోరీస్ గ్యారేజీ కారుని భార్యకు ఆయన గిఫ్ట్గా ఇచ్చాడు. దీని ధర సుమారు రూ. 32 లక్షల వరకు ఉంటుందని అంచనా. కాగా వీరిద్దరికి ఇది రెండో పెళ్లి అనే విషయం తెలిసిందే. నటి మహాలక్ష్మికి గతంలో అనిల్ నేరేడిమిలితో వివాహం జరిగగా వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల మహాలక్ష్మి 2019లో మొదటి భర్తతో విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి కుమారుడితో ఒంటరి నివసిస్తున్న ఆమె ఈ క్రమంలో రవీందర్ చంద్రశేఖరన్తో ప్రేమలో పడింది. సెప్టెంబర్ 1న ఈ జంట ఇరువురి కుంటుంబ సభ్యుల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. View this post on Instagram A post shared by ♜🅼🅰🅷🅰🅻🅰🅺🆂🅷🅼🅸❤️ (@mahalakshmi_actress_official) View this post on Instagram A post shared by ♜🅼🅰🅷🅰🅻🅰🅺🆂🅷🅼🅸❤️ (@mahalakshmi_actress_official) View this post on Instagram A post shared by Ravindar Chandrasekaran (@ravindarchandrasekaran) -
3 కోట్ల నోట్లు, 6 కిలోల స్వర్ణం, 3 కిలోల వెండితో ‘మహాలక్ష్మి’
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): విశాఖ కురుపాం మార్కెట్ సమీపంలో కొలువైన కన్యకాపరమేశ్వరి ఆలయంలో శుక్రవారం వాసవీమాత మహాలక్ష్మిగా దర్శనమిచ్చారు. అమ్మవారి మూలవిరాట్కు పాలు, పెరుగు, గంధం, తేనె వంటి 108 సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం మహాలక్ష్మి రూపంలో అలంకరించి, స్వర్ణవస్త్రసహిత సకలాభరణాలు, 108 స్వర్ణ పుష్పాలతో నివేదన గావించారు. ఆలయ గర్భగుడిలో 6 కిలోల స్వర్ణాభరణాలు, బంగారు బిస్కెట్లు, 3 కిలోల వెండి వస్తువులు, బిస్కెట్లతో పాటు రూ.3 కోట్లు విలువైన భారతీయ కరెన్సీతో ఇలా అలంకరించారు. చదవండి: శ్రీరస్తు.. శుభమస్తు.. ‘కళ్యాణమస్తు’ -
నిర్మాతతో రెండో పెళ్లి.. భార్యకు ఎంత బంగారం పెట్టాడో తెలుసా?
ప్రముఖ తమిళ నిర్మాత రవీందర్ బుల్లితెర నటి వీజే మహాలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. చూడచక్కని రూపంతో అందంగా ఉన్న మహాలక్ష్మీ.. భారీకాయుడైన రవీందర్ను పెళ్లాడటంతో ఈ జంట హాట్టాపిక్గా నిలిచింది. వీరి పెళ్లి గురించి తమిళనాటే కాకుండా సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ప్రేమకు అందంతో పనిలేదు అని కొందరు పొగుడుతుంటే, మరికొందరేమో డబ్బు ఉంటే అందంతో పని లేదు, అతను నిర్మాత, అతని దగ్గర బాగా డబ్బులున్నాయి కాబట్టే అతడ్ని పెళ్లాడింది అంటూ తెగ ట్రోల్స్ చేశారు. ఇక పెళ్లినాటి నుంచి సోషల్ మీడియాలో వీపరీతంగా సెన్సేషన్ అయిన ఈ జంట ఏం చేసినా క్షణాల్లో వైరల్ అయ్యేది. తాజాగా మహాలక్ష్మికి పెళ్లి సందర్బంగా రవీందర్ ఇచ్చిన కానుకలు ఇప్పుడు నెట్టింట హాట్టాపిక్గా మారాయి. రవీందర్ భార్య కోసం సుమారు కేజీన్నర బంగారు కానుకలను గిఫ్టుగా ఇచ్చినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పెళ్లిరోజు ఆమె ధరించిన బంగారం మొత్తం నిర్మాత రవీందర్ చేయించిందు అంటున్నారు. కాగా వీరిద్దరికి ఇది రెండో వివాహం. యాంకర్గా కెరీర్ మొదలుపెట్టిన మహాలక్ష్మీ నటిగా తమిళనాట మంచి గుర్తింపును సంపాదించుకుంది. -
ఉచితంగా చదువుకోండి.. ఉన్నతంగా ఎదగండి
నిరుపేద కుటుంబాల్లో తల్లిదండ్రులిద్దరూ పనిచేస్తే గానీ పూటగడవని పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా విద్యనందిస్తున్నప్పటికీ, బడిలో నేర్చున్న పాఠాలను ఇంట్లో వల్లెవేయించడానికి గానీ, హోంవర్క్ చేయించడానికి కానీ ఎవరూ ఉండరు. పిల్లలకు సొంతంగా హోమ్వర్క్ ఎలా చేయాలో తెలియదు. దీంతో వాళ్లు మరుసటి రోజు టీచర్ హోంవర్క్ అడుగుతుందని స్కూలుకు వెళ్లడానికి భయపడి మధ్యలోనే స్కూలు మానేసి అరకొర చదువులతో భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి వారిని ఆదుకోవడానికి 70 ఏళ్ల శివస్వామి, మహాలక్ష్మి దంపతులు ఏర్పాటు చేసిన ఉచిత సెంటరే ‘కల్వితునై’. ‘ఉచితంగా నేర్చుకుని ఉన్నతంగా ఎదగండి’ అని చెబుతున్నారు ఈ దంపతులు. కోయంబత్తూరుకు చెందిన మహాలక్ష్మి దంపతులు 2010 లో రిటైర్ అయ్యారు. ‘సమాజం ఇచ్చినదాన్ని తిరిగి ఇవ్వాలి’ అన్న ఆలోచనా దృక్పథం కలిగిన వారు కావడంతో.. నిరుపేద పిల్లలు పడుతోన్న ఇబ్బందులను గమనించి వారికోసం ఏకంగా నలభై లక్షల రూపాయలను పెట్టి 2014లో ‘కల్వితునై’ పేరిట విద్యాసంస్థను ఏర్పాటుచేశారు. నాలుగో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఒక బ్యాచ్గా, తొమ్మిది నుంచి 12వ తరగతి వరకు రెండోబ్యాచ్గా పిల్లలకు ట్యూషన్ చెబుతున్నారు. అలా ఈ సెంటర్లో నిత్యం 130 మంది పిల్లలు చదువుకుంటున్నారు. వీరికోసం టీచర్లకు జీతాలు చెల్లించి చదువు చెప్పిస్తున్నారు ఈ దంపతులు. ఇప్పటిదాకా వెయ్యిమందికిపైగా విద్యార్థులు ఇక్కడ చదువుకోగా, 350 మందికిపైగా మంచి ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. చదువుతోపాటు... పాఠాలేగాక కథలు చెప్పించడం, మొక్కలు నాటించడం, కల్చరల్ ఈవెంట్స్, జాతీయ పర్వదినాలను నిర్వహించడం ద్వారా పిల్లల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇంకా సమ్మర్ క్యాంప్లు, టూర్లకు తీసుకెళ్లడం, సేంద్రియ వ్యవసాయం గురించి వివరించడం వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాలికలకు మెనుస్ట్రేషన్ సెషన్స్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్ తయారీలో శిక్షణ ఇప్పిస్తున్నారు. విద్యార్థులు ఎటువంటి పరిస్థితుల్లోనూ జారిపోకుండా ఉండేందుకు వొకేషనల్ ట్రైనింగ్ కోర్సులు, సాఫ్ట్స్కిల్స్లో శిక్షణను మొదలు పెట్టారు. బేసిక్ కంప్యూటర్ కోర్సులు, బయట యాభైవేల రూపాయలు ఖరీదు చేసే సీఏ ఫౌండేషన్ కోర్సును 4,500కే అందించి ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్ను బంగారు మయం చేస్తున్నారు. ఇవన్నీ చేయడానికి నెలకు లక్షరూపాయలు ఖర్చు అవుతుంది. సీఎస్ఆర్, బాష్, విప్రో, ఇంకా ఇతరులు ఇచ్చే విరాళాల ద్వారా సెంటర్ను నడిపిస్తున్నారు. వీరి వద్ద చదువుకున్న వాళ్లు వందశాతం ఉత్తీర్ణత సాధించారు. ఇదంతా చూస్తుంటే ఇలాంటి వారు మన రాష్ట్రాల్లోనూ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. చదువునుంచి దృష్టి మరల్చకుండా... నిరుపేదలకు కనీస అవసరాలు తీరాలన్నా కష్టమే. అందుకే వాళ్లు డబ్బు సంపాదన మీదే దృష్టిపెడతారు. పిల్లల చదువుల గురించి శ్రద్ధ తీసుకునే అవగాహన, సమయం వారికి ఉండదు. దానివల్ల వారి భవిష్యత్ తరాలు కూడా పేదరికంలోనే మగ్గిపోతున్నారు. ఇటువంటివారికి ఉచితంగా ట్యూషన్ చెప్పడం ద్వారా వారి భవిష్యత్ మారుతుందని ఈ సెంటర్ను ఏర్పాటు చేశాం. దీనిద్వారా కొంతమంది టీచర్లకు ఉపాధి దొరకడంతోపాటు విద్యార్థులకు చక్కని బోధన అందుతుంది. ఎప్పుడూ చదువే కాకుండా వివిధ రకాల విజ్ఞాన, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, సంక్రాంతి సమయంలో కొత్తబట్టలు ఇవ్వడం, రోజూ ఆరోగ్యకరమైన స్నాక్స్ అందిస్తూ చదువునుంచి పిల్లల దృష్టి మరలకుండా చూస్తున్నాం’’ – శివస్వామి, మహాలక్ష్మి -
నిర్మాతతో టీవీ నటి రెండో పెళ్లి, కొత్త జంటపై దారుణమైన ట్రోల్స్
ప్రముఖ నిర్మాణ సంస్థ లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్, సీరియల్ నటి మహాలక్ష్మీ పెళ్లి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్టాపిక్గా నిలుస్తోంది. సెప్టెంబర్ 1న ఈ జంట ఇరువురి కుంటుంబ సభ్యుల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరికి ఇది రెండో వివాహం. రెండేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరి కుటుంబ సభ్యుల సమ్మతితో సెప్టెంబర్ 1న ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. తామిద్దరం ఒక్కటయ్యామంటూ ఇద్దరు పెళ్లి ఫొటోలు షేర్ చేశారు. దీంతో అప్పటి నుంచి ఈ కొత్త జంట ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాదు వీరిద్దరి వివాహం నెట్టింట చర్చనీయాంశమైంది. చదవండి: వైరల్గా మోదీ, బీజేపీపై సమంత కామెంట్స్, మండిపడుతున్న నెటిజన్లు! దీనికి కారణం నిర్మాత రవీందర్ భారీ కాయం.. మహాలక్ష్మీ సన్నగా ఉండటమే. అప్పటి నుంచి ఈ జంటను ట్రోల్ చేయడం, రవిందర్పై బాడీ షేమింగ్ చేయడం చేస్తున్నారు నెటిజన్లు. ‘అలాంటి వ్యక్తిని మహాలక్ష్మి ఎలా పెళ్లి చేసుకుంది.. ఇది నిజమా?’,‘డబ్బు కోసమే ఆయనను ఆమె పెళ్లి చేసుకుంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక తాజాగా ఓ తెలుగు యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో తమపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్పై స్పందించింది ఈ జంట. ఆయన బరువు తనకు పెద్ద సమస్య కాదని చెప్పి ట్రోలర్స్కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు నటి మహాలక్ష్మి. ‘నాకు ఆయనంటే ఇష్టం. ఆయన ఎలా ఉన్నారో అలానే ఇష్టపడ్డాను. ఆయన బరువు తగ్గి వస్తా అన్నారు. అవసరం లేదు అని చెప్పాను. చదవండి: సినీ అవకాశాల పేరుతో అశ్లీల వీడియోలు.. 30కి పైగా హార్డ్డిస్క్లు బరువు గురించి చాలా సార్లు మాట్లాడారు. ఫారెన్ వెళ్లి ట్రాన్స్ఫాం అవుతా అన్నారు. కానీ అవేవీ చేయోద్దండి, మీరు ఉన్నట్టే ఉండండి అని చెప్పాను’ అని మహాలక్ష్మి అన్నారు. ఆ తర్వాత తమ జంటపై కొన్ని యూట్యూబ్ చానల్స్ థంబ్ నేల్స్ చూసి ఇద్దరం నవ్వుకున్నామని చెప్పారు. ఇక నిర్మాత రవిందర్ మాట్లాడుతూ.. నెగిటివ్ కామెంట్స్ పెద్దగా పట్టించుకోమన్నారు. ‘మా పెళ్లి ఇంత వైరల్ అవుతుందని అస్సలు ఊహించలేదు. చాలా మంది మాకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే మరికొందరు సోషల్ మీడియాలో మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా నాపై బాడీ షేమింగ్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఎదుటివారి లైఫ్ అనేసరికి అందరు సులువుగా మాటలు అనేస్తారు. వాటికి నేను పెద్దగా కుమిలిపోను’ అని ఆయన చెప్పుకొచ్చారు. -
Thati Mahalakshmi: మాజీ ఎమ్మెల్యే కూతురు ఆత్మహత్య
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నాయకులు తాటి వెంకటేశ్వర్లు కుమార్తె తాటి మహాలక్ష్మి బుధవారం ఇంట్లో తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తెల్లవారు జామున ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఎంతకు గది తలుపులు తెరవకపోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా మహాలక్ష్మి ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే బంధువులు భద్రాచలం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్ తెలిపారు. అనంతరం పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తండ్రి తాటి వెంకటేశ్వర్లు హుటాహుటిన భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వచ్చి కన్న కూతురు మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. మహాలక్ష్మి ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని పీజీ ప్రిపేర్ అవుతోంది. కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: (రైళ్లో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారా!.. ఇకపై ఇట్టే దొరికిపోతారు) -
రంగస్థలం..శ్రీ మహాలక్ష్మీ లేడీస్ డ్రామా గ్రూప్
ఫ్లాష్బ్యాక్లు సినిమాల్లోనే కాదు నాటకాల్లో కూడా ఉంటాయి. నాటకాల్లోనే కాదు నాటకరంగ సంస్థలకు కూడా ఉంటాయి. ఒక తమిళపత్రికలో నాటకరంగానికి సంబంధించిన వ్యాసం ఒకటి చదివింది జ్ఞానం బాలసుబ్రమణియన్. ఒకాయన తన అభిప్రాయాన్ని ఇలా చెప్పాడు: ‘తమిళ నాటకరంగంలో రాసే మహిళలు, నటించే మహిళలు లేరు. ఎంతో సామర్థ్యం ఉంటేగానీ ఇది సాధ్యం కాదు అనుకోండి’ ఆయన మాటలను సవాలుగా తీసుకుంది జ్ఞానం. వరకట్న రక్కసిపై నాటిక రాసింది. నిజానికి అంతవరకు తనకు రచన, నాటకరంగంలో ఎలాంటి అనుభవం లేదు. తాను రాసిన నాటికను ఆకాశవాణికి పంపించింది. వారు తిరస్కరించారు. చిన్న నిరాశ! జ్ఞానం భర్త పెద్ద అధికారి. ఆయన బాంబేకు బదిలీ అయ్యాడు. భర్తతో పాటు బాంబేకు వెళ్లింది జ్ఞానం. ఒకానొక రోజు వరకట్న సమస్యపై తాను రాసిన నాటికను బాంబేలో ప్రదర్శించారు. అనూహ్యమైన స్పందన వచ్చింది. తన మీద తనకు నమ్మకం ఏర్పడడానికి ఆ స్పందనే కారణం అయింది. ఈ నమ్మకమే ‘మహాలక్ష్మీ లేడిస్ డ్రామా గ్రూప్’ శ్రీకారం చుట్టడానికి నాంది అయింది. నాటకరంగంలో స్త్రీ ప్రాతినిధ్యాన్ని పెంచడానికి ఏర్పాటయిందే ఈ డ్రామా గ్రూప్. అయితే...రకరకాల భయాల వల్ల ఈ డ్రామా గ్రూప్లో చేరడానికి మహిళలు సంకోచించేవారు. ‘ప్రయత్నిస్తే ఫలించనిదేముంది’ అనే నానుడిని మరింత గట్టిగా నమ్మింది జ్ఞానం. ఒకటికి పదిసార్లు వారితో మాట్లాడి ఒప్పించింది. మొదట్లో ఇద్దరు చేరారు. ఆ ఇద్దరు ఆరుగురు ఆయ్యారు... అలా పెరుగుతూ పోయారు. అలా చేరిన వాళ్లు గతంలో ఎన్నడూ నాటకాల్లో నటించలేదు. నటన మీద ప్రేమ తప్ప నటనలో ఓనమాలు తెలియని వాళ్లే. సాధారణంగా నాటకాల్లో స్త్రీ పాత్రలను పురుషులు ధరిస్తారు. కానీ ‘మహాలక్ష్మీ లేడీస్ డ్రామా గ్రూప్’లో పురుష పాత్రలను స్త్రీలే ధరిస్తారు. మొదట్లో ఇది చాలామందికి వింతగా అనిపించేది. ఇది ఆ నాటక సంస్థకు చెందిన ‘ప్రత్యేకత’గా కూడా మారింది. ఈ ఆల్–వుమెన్ డ్రామా గ్రూప్ నుంచి కాలక్షేప నాటకాలు రాలేదు. కనువిప్పు కలిగించే నాటకాలు వచ్చాయి. వర్నకట్నం, వర్కింగ్ ఉమెన్స్ ఎదుర్కొనే సమస్యలు, బాల్యవివాహాలు...మొదలైన వాటితో పాట ఆధ్యాత్మిక విషయాలను కూడా ఇతివృత్తాలుగా ఎంచుకుంది ఈ నాటకసమాజం. స్టేజీ ఎక్కడానికి ముందు ఒక్కో నాటకాన్ని ఇంచుమించు 30 సార్లు రిహార్సల్స్ చేస్తారు. కట్ చేస్తే....ఇది సోషల్ మీడియా కాలం. ఒక ఊళ్లో నాటకం వేస్తే ఆ ఊరే చూస్తుంది. అదే నాటకం డిజిటల్ స్పేస్లోకి వస్తే ఊరూ, వాడ ఏమీ ఖర్మ...ప్రపంచమే చూస్తుంది. అలా అని.. రంగస్థలాన్ని తోసిరాజనాలనేది వారి ఉద్దేశం కాదు. ఒకవైపు రంగస్థలానికి ప్రాధాన్యం ఇస్తూనే అదనపు వేదికను కూడా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలనేది వారి నిర్ణయం వెనక కారణం. తొలిసారిగా ‘ఎందరో మహానుభావులు’ యూట్యూబ్లో రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని మూడు లక్షల మందికి పైగా వ్యూయర్స్ చూడడం నాటక సంస్థకు ఎంతో ఉత్సాహం, ధైర్యాన్ని ఇచ్చింది. ‘మహాలక్ష్మీ...ఎందరో మహిళల కలలకు రెక్కలు ఇచ్చింది’ అంటోంది సుదీర్ఘ కాలంగా ఈ నాటకరంగ సంస్థతో అనుబంధం ఉన్న కమల ఈశ్వరీ. నాటక సంస్థ మొదలైనప్పుడు...సమస్యలు కొన్నే ఉండవచ్చు. ఇప్పుడు ఎటు చూసినా ఏదో ఒక సమస్య. మాధ్యమాలు కూడా పెరిగాయి. ఆ మాధ్యమాల వేదికగా, రకరకాల ఆధునిక సమస్యలపై పోరాడడమే ‘మహాలక్ష్మీ లేడిస్ డ్రామా గ్రూప్’ లక్ష్యం. -
ఆమె బతుకును ఎంచుకుంది
జీవించడంలో ఉన్న ఆనందం మరణించడంలో లేదు అంటుంది డాక్టర్ మహాలక్ష్మి. ఇటీవల గృహిణులు క్షణికావేశంలో ఆత్మహత్యలను ఎంచుకుంటున్నప్పుడు మహాలక్ష్మి వంటివారి జీవితం సరైన స్ఫూర్తి అనిపిస్తుంది. 26 ఏళ్ల వయసులో యాసిడ్ దాడికి లోనైన ఈ మైసూర్ వైద్యురాలు జీవించడాన్నే తన మార్గంగా ఎంచుకుంది. కోవిడ్ పేషెంట్స్కు వైద్యం చేస్తూ తను జీవించి ఉండటానికి ఒక అర్థాన్ని కూడా చెబుతోంది. ఇంతకన్నా ఏం కావాలి? మైసూర్ ప్రభుత్వాస్పత్రిలో రోజుకు 50 నుంచి 60 మంది పేషెంట్స్ను ఓపిలో చూస్తుంది డాక్టర్ మహాలక్ష్మి. కోవిడ్ కాలం వచ్చాక ఆమె కోవిడ్ వార్డుల్లో విధులు నిర్వర్తిస్తూ గత సంవత్సరకాలంగా ప్రాణాలు కాపాడుతోంది. ‘నేను బతికి ఉండటం వల్లే వారిని బతికించగలుగుతున్నాను’ అంటుంది ఆమె. అవును... జీవితంలో ఆత్మహత్య చేసుకోవడానికి కావలసిన అన్ని కారణాలు ఆమె దగ్గర ఉన్నాయి. కాని ఆమె చావును కాకుండా బతుకును ఎంచుకుంది. బతుకులోనే అందం, ఆనందం, పరమార్థం ఉన్నాయని నిశ్చయించుకుంది. బతికి సాధించాలనేది ఆమె తత్త్వం. ఇవాళ కొంతమంది గృహిణులు చిన్న చిన్న కారణాలకే మనస్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకోవడం, పిల్లలతో సహా విపరీతమైన నిర్ణయాలను తీసుకోవడం కనిపిస్తూ ఉంది. అలాంటి ఆలోచనలు ఉన్నవారు ప్రతికూలతలను ఎదుర్కొనే మనోబలాన్ని పెంచుకోవాలని అంటుంది మహాలక్ష్మి. 2001లో యాసిడ్ దాడి మైసూర్ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ చేసిన మహాలక్ష్మి తన 26వ ఏట ఒక అద్దె ఇంటి లో క్లినిక్ మొదలెట్టింది. దాని యజమాని చిక్క బసవయ్య ఆమెను లైంగికంగా వేధించడం మొదలెట్టాడు. అది భరించలేని ఆమె పోలీస్ కంప్లయింట్ ఇచ్చి క్లినిక్ ఖాళీ చేసి వేరే చోట ప్రారంభించింది. ఇది చూసి ఓర్వలేని చిక్కబసవయ్య జనవరి 11, 2001న ఆమె క్లినిక్ మూసి ఇంటికి వెళుతుండగా ఆమెపై యాసిడ్ దాడి చేశాడు. ఆ యాసిడ్ దాడి సరిగ్గా ఒక 60 సెకన్లలో ముగిసి ఉంటుంది. కాని అది ఆమె జీవితాన్నే మార్చేసింది. 25 సర్జరీలు ‘ముఖం వికారంగా ఉంటే ఈ సమాజంలో ఆదరణ ఉండదు. అటువంటివారు నాలుగు గోడల మధ్య మగ్గిపోవాల్సిందే. కాని నేనలా ఉండదలుచుకోలేదు. 25 సర్జరీలు చేయించుకుని ఎంతవరకు ముఖాన్ని సరి చేసుకోగలనో అంత చేయించుకున్నాను. ఆ సమయంలో డిప్రెషన్ చుట్టుముట్టింది. బతుకు మీద ఆశ సన్నగిల్లింది. కాని బతకాలనే నిశ్చయించుకున్నాను. నేను నా ప్రాక్టీస్ను కొనసాగిస్తూ ఈ కష్టాన్ని మర్చిపోవాలని అనుకున్నాను. వైద్యవృత్తి అభ్యసించిన నేను నా మానసిక భౌతిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో గట్టిగా ఆలోచించాను. నిజానికి యాసిడ్ దాడిలో గాని ఇతర ఏ ఆరోగ్య సమస్యల్లోగాని జీవిత సమస్యల్లో గాని మానసిక బలమే ముఖ్యం అని గ్రహించాను. ఆ మనసును గట్టి చేసుకుంటే మనం కష్టాలు దాటొచ్చు. నేను అదే చేశాను’ అంటుంది మహాలక్ష్మి. 2001లో ఆమెపై దాడి జరిగితే 2005లో సెషన్స్ కోర్టు ఆధారాల్లేవని నిందితుణ్ణి వదిలిపెట్టింది. కాని మహాలక్ష్మి హైకోర్టులో పోరాడింది. 2012లో హైకోర్టు చిక్కబసవయ్యకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ‘అంతవరకూ నేను కేసు ను గట్టిగా పట్టుకోవాల్సి వచ్చింది. ఆలస్యంగానైనా న్యాయం జరిగింది’ అంటుంది మహాలక్ష్మి. చదువే శరణ్యం ‘స్త్రీలు బాగా చదువుకోవాలి. జీవితంలో ఎదురయ్యే ఏ సవాలునైనా ఎదిరించాలంటే మన దగ్గర చదువు ఉండాలి. అప్పుడే మనం మరింత ధైర్యంగా ఉండగలం. అంతేకాదు మనకు జరిగే ఎటువంటి అన్యాయం పైన అయినా పోరాటం చేయగలం. స్త్రీలు బాధితులయ్యి తల దించుకునే పరిస్థితి సమాజంలో ఉంటుంది. కాని మన పైన పీడన చేసేవారే తల దించుకునేలా చేయాలి. అందుకు సమాజంలో మార్పు రావాలి’ అంటుంది మహాలక్ష్మి. ‘నేను జీవితంలో ఎన్నడూ నిరాశను దగ్గరకు రానిచ్చేలా ఉండకూడదు అని నిశ్చయించుకున్నాను. ఆశతో ఉంటే అన్నీ మారుతాయి’ అంటుంది మహాలక్ష్మి. సవాళ్లను ఎదుర్కొనే సందర్భాలు వస్తే మానసిక స్థయిర్యంతో ఎదుర్కొనాలి తప్ప మరణాన్ని ఆశ్రయించకూడదని మహాలక్ష్మి జీవితం గట్టిగా చెబుతోంది. స్త్రీలు బాధితులయ్యి తల దించుకునే పరిస్థితి సమాజంలో ఉంటుంది. కాని మన పైన పీడన చేసేవారే తల దించుకునేలా చేయాలి. అందుకు సమాజంలో మార్పు రావాలి. -
మూడు సంపదల పండగ
తెల్లవారు జామునే పొలానికి వెళ్లే అలవాటున్న రైతు ఆ రోజు కూడా ఐదు గంటలకు తన పొలం చేరుకునేసరికి, అక్కడ నిండుగా అలంకరించుకుని ఉన్న ముగ్గురు యువతులు కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. వారిని చూస్తూనే ‘ఈ ముగ్గురూ అచ్చంగా మహాలక్ష్మికి ప్రతిరూపంలా ఉన్నారు. వీరెవరో, వీరి కబుర్లేమిటో వినాల్సిందే అనుకున్నాడు. అయితే తను కనిపిస్తే వారు వెళ్లిపోతారేమోనని ఒక చెట్టుచాటున కూర్చున్నాడు. ‘‘అక్కా! భోగి లక్ష్మి! నీకు భోగాలు ఎక్కువ. అందుకే భోగినాడు తలంటు పోస్తారు, భోగి పండ్లు పోస్తారు, భోగి మంటలు వేస్తారు, అన్ని బాల భోగాలు చేస్తారు. పొంగలి వండుతారు. ఎంతైనా పెద్దదానివి కదా! అందుకే నీకు సకల భోగాలు జరుగుతాయి.. అన్నారు చెల్లెళ్లు మకర లక్ష్మి, కనుమ లక్ష్మి. ‘‘అలా అంటావేంటే మకరలక్ష్మీ! నువ్వు వచ్చిన రోజునే కదా పెద్ద పండుగ అంటారు. అసలు ఈ పండుగనే నీ పేరుతో మకర సంక్రాంతి అని పిలుస్తారు. సూర్యభగవానుడు నీ రాశిలో ప్రవేశించినందుకేగా ఈ పండుగ చేసుకునేది. ఉద్యోగస్థులకు సెలవు ప్రకటించేది కూడా నీ పండుగకే కదా. కొత్త బట్టలు కట్టుకునేది కూడా నీ పండుగకే కదా.. అంది కనుమ లక్ష్మి. ఇద్దరి మాటలు విన్న భోగి లక్ష్మి, ‘‘మీరిద్దరూ నాకు చెల్లెళ్లు, నా పండుగ రోజున ఏదైనా చీడ ఉండే అది పోగొట్టడానికి భోగి మంట వేసి, మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను కదా నేను. అంతేనా, నాతో పాటు మీరు కూడా ఉంటేనే కదా ఈ పండుగ. మకర లక్ష్మి వచ్చిందంటూ నీ కోసమే కదా బొబ్బట్లు, పులిహోర... వంటి పెద్ద పెద్ద పిండి వంటలు వండుతారు. పిల్లలు గాలిపటాలు ఎగురవేస్తారు. పెద్దలకు నైవేద్యాలు పెడతారు. మీమీ ప్రాధాన్యత మీకు ఎప్పుడూ ఉంటుంది’’ అంటూ చెల్లెళ్లను ఆప్యాయంగా మందలించింది భోగి లక్ష్మి. ‘‘నిజమే అక్కా! ఏదో సరదాగా అన్నాం. నీ మాటే నిజం. ఎవరి ప్రాధాన్యత వారికి ఉంటుంది. కనుమనాడు మినుము కొరకాలంటూ రకరకాల గారెలు వేస్తారు. మాంసాహారులు కడుపునిండుగా ఆ రోజున మాంసమే తింటారు. కార్మికులకు సెలవు ప్రకటిస్తారు. భోగిలక్ష్మి వచ్చిన నాడు ఎవ్వరికీ సెలవు ఉండదు. అందరూ ఎవరి పనులు వారు చేసుకోవలసిందే’’ ఇలా ముగ్గురు లక్ష్ములు ఒకరినొకరు పొగుడుకుంటున్నారో, నిందాస్తుతులో తెలియకుండా సంభాషణ సాగుతోందనిపించింది రైతుకి. ‘‘అక్కా భోగిలక్ష్మి, మన మాటలను పక్కన పెడితే, నాకు మాత్రం ఒకటి అర్థమవుతోంది. మనం ముగ్గురం కలిసి వస్తేనే ఈ పండుగ. ఇదే పెద్ద పండుగ... అని కనుమ లక్ష్మి అంటుంటే... అవును నిజమే... మన ముగ్గురం కలిసి వస్తున్నందుకే బొమ్మలు కొలువు పెట్టుకుంటున్నారు, మనం రావడానికి నెల రోజులు ముందు నుంచి ముగ్గులు వేసుకుంటున్నారు, గొబ్బెమ్మలు పెట్టుకుంటున్నారు, తిరుప్పావై చదువుకుంటున్నారు..’’ అంది భోగి లక్ష్మి. ‘‘అంతేనా, అక్క ఎప్పుడెప్పుడు వస్తుందా గోదా కల్యాణం, ఎప్పుడెప్పుడు చేసుకుందామా అని ఎదురు చూస్తుంటారు.. ’’అంది మకర లక్ష్మి. ‘‘మనం అసలు విషయం మర్చిపోయాం. ఈ నెలనాళ్లు హరిదాసుల హరినామ సంకీర్తనలతో తెలుగు లోగిళ్లు మారుమోగుతుంటాయి. గంగిరెద్దుల వారు ప్రతి ఇంటిముందు నిలబడి, అమ్మగారికి దండం పెట్టు.. అంటూ వృషభరాజం చేత నమస్కరింపచేస్తారు. వారికీ, వీరికీ కూడా సంవత్సరానికి సరిపడా సంభారాలు సమకూరతాయి..’’ అంది కనుమలక్ష్మి. ‘‘అవును అసలు వీరి వల్లే కదా, ఈ మాసమంతా పండుగ కళ సంతరించుకుంటుంది. ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు... పుడమితల్లికే కొత్త అందాన్ని తీసుకువస్తాయి..’’ అంది మకరలక్ష్మి. ‘ఇలా వారు మాట్లాడుకుంటూంటే పరవశంగా వింటున్న ఆ రైతు ఇక మనసు ఉండబట్టుకోలేక, వారి దగ్గరకు వచ్చి, ముగురమ్మలకు పాద నమస్కారం చేసి, ‘‘అమ్మా, మీ ముగ్గురు లచ్చిందేవులూ ఈ రోజు నా పొలానికి వచ్చి, మాట్లాడుకోవటం నాకు ఎంత ఆనందంగా ఉందో! మీరు వస్తున్నారనే కదా, మా ఆడబిడ్డలు అల్లుళ్లతో, మనుమలతో కలిసి పుట్టింటికి వస్తున్నారు. మా రైతుల ఇళ్లన్నీ మీకు పుట్టింటితో సమానమే. మీరు వస్తున్నందుకే కదా అందరికీ చేతినిండా పని.. మా పంటలు పండిన సంబరంతో మీకు నైవేద్యాలు పెట్టాలి. అప్పుడే మా కడుపు చల్లగా ఉంటుంది. మా కుటుంబాలు చల్లగా ఉంటాయి. మీరు ఎప్పటికీ మమ్మల్ని ఇలాగే చల్లగా చూడాలి తల్లీ’’ అంటూ వారిని తన ఇంటికి సాదరంగా ఆహ్వానించాడు. ముగ్గురూ ఎంతో ఆనందంగా వచ్చారు. ఆ రైతు ముగ్గురు బంగారు తల్లులకీ భోగి పళ్లు పోశాడు, పిండి వంటలు తయారు చేశాడు, కనుమ నాడు వారిని రథం మీద గుండె తడితో వారి ఇళ్లకు సాగనంపాడు. మరు సంవత్సరం కోసం ఆ రోజు నుంచే కళ్లల్లో ఆశలు పెట్టుకుని ఎదురుచూడసాగాడు. సృజన: వైజయంతి పురాణపండ -
ప్రముఖ రచయిత్రి కందుకూరి మహాలక్ష్మి కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ రచయిత్రి కందుకూరి వెంకట మహాలక్ష్మి ఢిల్లీలోని మునిర్కాలో ఉన్న తమ స్వగృహంలో శనివారం ఉదయం 10.30 గంటలకు కన్నుమూశారు. మహాలక్ష్మి తొలితరం రేడియో న్యూస్ రీడర్గా అందరికీ సుపరిచితులైన కందుకూరి సూర్యనారాయణ సతీమణి. ఆయన ఆకాశవాణిలో పదవీ విరమణ చేసిన తరువాత ఢిల్లీలో స్థిరపడిన మహాలక్ష్మి ఆంధ్రప్రదేశ్ భవన్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు. ఆమె రచయిత్రి, గాయని, వ్యాఖ్యాత, నటి, నాటక దర్శకురాలిగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపి మన్ననలు పొందారు. ఆమె 150కి పైగా కథానికలు, మూడు పుస్తకాలు, అనేక కవితలు, నాటకాలు రాశారు. ఆమె రచనలు పలు పత్రికలలో ప్రచురితమై పలువురి ప్రశంసలు అందుకున్నాయి. ఆమెకు 2009లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ రచయిత్రి అవార్డు అందించింది. మహాలక్ష్మి ఇంద్రజాల ప్రదర్శనలో కూడా నేర్పరి. తన 12 వ ఏటనే విఖ్యాత ఇంద్రజాలికుడు పీసీ సర్కార్ ఎదుట ప్రదర్శన ఇచ్చి ఆయన ప్రశంసలందుకున్నారు. ఆమె 1960 దశకంలో రేడియో మాస్కోలో కూడా పనిచేశారు. బల్గేరియాలో జరిగిన యూత్ కల్చరల్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో 1998లో జరిగిన ప్రపంచ తెలుగు సమావేశానికి సాహిత్య విభాగం చైర్పర్సన్గా మహాలక్ష్మి వ్యవహరించారు. అదేవిధంగా ఆంధ్ర వనితామండలి ప్రచురించిన ‘న్యాయవాణి’ అనే పత్రికకు సంపాదకురాలిగా కూడా ఉన్నారు. ఇందులో మహిళల సమస్యలకు పరిష్కారాలు చూపేవారు. ఆమెకు మాతృభాషపట్ల ఎనలేని మమకారం. ‘లోకకల్యాణం కోసమే సాహిత్య సేవ’అనే నమ్మకంతో పనిచేసేవారు. మహాలక్ష్మి రచనలపై తిరుపతి, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో పలువురు పరిశోధనలు చేసి పీహెచ్డీలు పొందారు. ప్రధానంగా జానపద సాహిత్యానికి ఆమె పెద్దపీట వేసి ప్రాచుర్యం కల్పించారు. దేశ,విదేశాల్లో అత్యుత్తమ పురస్కారాలు పొందారు. మహాలక్ష్మి మృతి పట్ల ఢిల్లీలోని పలువురు తెలుగువారు, సాహితీ ప్రముఖులు, తెలంగాణ సారస్వత పరిషత్ ప్రతినిధులు తమ సంతాపం వ్యక్తం చేశారు. -
మంత్రి వెల్లంపల్లి నివాసంలో విషాదం
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నివాసంలో విషాదం నెలకొంది. ఆయన తల్లి మహాలక్ష్మమ్మ (73) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొద్దిరోజులుగా ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహాలక్ష్మమ్మ ఇవాళ సాయంత్రం మరణించారు. కుటుంబసభ్యులు సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మంత్రి వెల్లంపల్లి మాతృమూర్తి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. వెల్లంపల్లి కుటుంసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మహాలక్ష్మమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. మరోవైపు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు పార్థసారధి, మేరుగ నాగార్జున తదితరులు మంత్రి వెల్లంపల్లిని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి వెల్లంపల్లి తల్లి మహాలక్ష్మమ్మ పార్ధీవ దేహానికి వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతమ్రెడ్డి నివాళులు అర్పించారు. వెల్లంపల్లి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వెల్లంపల్లి శ్రీనివాసరావును ఫోన్లో పరామర్శించారు. మహాలక్ష్మమ్మ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. -
అమ్మను మించిన అమ్మ
తాము జన్మనిచ్చిన ఒకరిద్దరు పిల్లల్ని ఉదయం నిద్రలేపడం.. వారి అల్లరిని భరించి స్నానం చేయించడం.. టిఫిన్ తినిపించి.. హోం వర్క్ చేయించి బడికి పంపేటప్పటికే అమ్మలు అలసిపోతున్నారు. సాయంత్రం మళ్లీ పిల్లలు ఇంటికి వచ్చినప్పటి నుంచి వాళ్లను నిద్రపుచ్చే వరకు అమ్మ అవస్థలు చెప్పలేం. కానీ పదకొండేళ్లుగా అనాథలు, తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న వారిని 300 మంది ఆలనాపాలన చూస్తోంది ఈ అమ్మను మించిన అమ్మ. కేకేనగర్: వేలకు వేలు ఫీజులు పోసి చదివిస్తున్న పాఠశాలలకు వచ్చే పిల్లలు క్రమశిక్షణగా ఉండకపోతే వెంటనే ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులకు ఎస్ఎంఎస్ పంపుతున్నారు. అలాంటి రోజుల్లో అనాథ పిల్లలకు తల్లి, తండ్రి.. గురువు.. దైవం.. అన్నీ తానై నిలుస్తోంది ఓ ప్రేమమూర్తి. ఆమె తిరువణ్ణామలై జిల్లా జవ్వాదు పర్వత ప్రాంతంలోని హాస్టల్తో కూడిన ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు మహాలక్ష్మి. ఈ పాఠశాలలో మొత్తం 300 మంది విద్యార్థులు హాస్టల్లో బసచేసి చదువుతున్నారు. వారిలో చాలామంది అనాథలు. మరికొందరు సమీప ప్రాంతంలోని గిరిజనుల బిడ్డలు. 2006వ సంవత్సరంలో మహాలక్ష్మి ఈ పాఠశాలకు ఉపాధ్యాయురాలిగా వచ్చారు. మొదటిరోజు బడిలో పిల్లలన్ని చూస్తే అంతా జుట్టు పెంచుకుని, మాసిన బట్టలతో కనిపించారు. అందరూ శుభ్రంగా క్రాప్ చేసుకుని, ఉతికిన బట్టలు వేసుకుని రావాలని ఆమె పిల్లలకు చెప్పారు. మరుసటి రోజు నుంచి సగం మంది పిల్లలు స్కూలుకు రావడం మానేశారు. అసలు సంగతి ఏంటని వాకబు చేశారు. వారందరికీ క్రాప్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేవని తెలిసింది. దీంతో ఆమె తల్లిడిల్లిపోయింది. మరుసటి రోజు నుంచి పిల్లలకు ఆమే స్నానం చేయించడం.. గోరుముద్దలు తినిపించడం.. పాఠశాల సమయం అయిపోయాక వారిని ఆడించడం మొదలుపెట్టారు. వారికి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. చివరకు జుట్టు పెరిగి ఉన్న పిల్లలకు తానే క్రాప్ చేయడం ప్రారంభించారు. మొదట్లో తెలిసినట్లు ఎలాగో జుట్టు కత్తిరించారు. ఒకరికి క్రాప్ చేసేందుకు అరగంట పట్టింది. అయినా సరిగ్గా రాకపోవడంతో ఆమె సంతృప్తి చెందలేదు. కొద్దిరోజులు సెలూన్కు వెళ్లి క్రాప్ చేయడం నేర్చుకున్నారు. ఆ తర్వాత పది నిమిషాల్లో క్రాప్ చేసి వారికి స్నానం చేయిస్తున్నారు. పిల్లల మొహంలో చిరునవ్వు చూడాలని.. తల్లిదండ్రులు లేని అనాథలు.. అమ్మానాన్న ఉన్నా వారికి దూరంగా ఉన్న వారిలో చిరునవ్వు చూడాలనుకున్నాను. పాఠశాలలో వారికి విద్యాబుద్ధులు నేర్పించడమే కాదు.. వారికి అమ్మా నాన్న లేని లోటు తీర్చాలనుకున్నాను. వారికి సేవ చేయడంలో నాకు ఎంతో తృప్తిగా ఉంది. వారంతా నా బిడ్డలుగానే భావిస్తున్నాను. – మహాలక్ష్మి -
నాట్యమంటే ప్రాణం
కాకినాడ కల్చరల్ : వండర్ బుక్ ఆఫ్ రికార్డు అవార్డు, జీనియస్ అవార్డులు సాధించిన స్థానిక జగన్నాథపురానికి చెందిన మోకాన మహాలక్ష్మి నృత్యమే శ్వాస అన్నారు. తాను నేర్చుకొన్న నృత్యాన్ని పదిమందికి పంచి కళామాతల్లి రుణం తీర్చుకుంటున్నారు. సూర్య నృత్యనికేతన్ ఏర్పాటు చేసి నృత్యంపై ఆసక్తి ఉన్న పేద విద్యార్థులను గుర్తించి కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇస్తూ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఈమె కూచిపూడి నృత్యం రంగంలో సేవలకు గుర్తింపుగా పలు అవార్డులు అందుకున్నారు. ఈమె కంచెర్ల వీరభద్రరావు, జయలక్ష్మి ద్వితీయ పుత్రిక, చిన్నప్పటి నుంచి ఆమెకు నృత్యంపై ఉన్న ఆసక్తిని తల్లిదండ్రులు గుర్తించి ప్రముఖ నాట్యాచార్యులు ఎంవీ రమణ వద్ద శిక్షణ ఇప్పించారు. అక్కడ నాట్యంలో మెళకువలు నేర్చుకొని అంచలంచెలుగా ఎదిగి సూర్య నృత్య నికేతన్ స్థాపించారు. కాకినాడలో నాలుగు బ్రాంచీలు, ద్రాక్షారామ, నడకుదురు, కరప, ఇంజరం ఇలా మొత్తం ఎనిమిది చోట్ల çసుమారు 300 మందికి ఆమె శిక్షణ ఇస్తున్నారు. 1998–2000లో తిరుపతి శ్రీవిద్యా నికేతన్లో శిక్షకురాలుగా పని చేసిన మహాలక్ష్మి తన 21వ ఏటనే ప్రముఖ నటుడు డాక్టర్ ఎం.మోమాన్బాబు జన్మదిన వేడుకల్లో అనేక మంది సినీ అర్టిస్టుల సమక్షంలో విద్యార్థులతో శివతాండవం చేయించి మన్నలు పొందారు. ఈ సందర్భంతో సినీ హిరో రజనీకాంత్, మోమాన్బాబు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. కూచిపూడి గ్రామంలోను పలు చోట్ల విద్యార్థులతో ప్రదర్శనలు ఇచ్చి మన్నలు పొందారు. తాను జీవించినంత కాలం నాట్యం పదిమందికి నేర్పాలనే తపనతో జీవిస్తున్నానని వండర్ బుక్ ఆఫ్ రికార్డు అవార్డు, జీనియస్ అవార్డుల ప్రధానంతో తన బాధ్యత మరింత పెరిగిందని మహాలక్ష్మి చెబుతున్నారు. -
మహాలక్ష్మికి వండర్ బుక్ ఆఫ్ రికార్డు అవార్డు
కాకినాడ కల్చరల్ : స్థానిక సూర్య కళామందిర్లో శ్రీసూర్య నృత్య నికేతన్ నిర్వహాకురాలు కె.మహాలక్ష్మికి వండర్ బుక్ ఆఫ్ రికార్డు అవార్డు, జీనియస్ అవార్డులను బుధవారం ప్రదానం చేశారు. ఈమె నృత్య రంగానికి చేస్తున్న సేవలను గుర్తించి అవార్డులు ప్రదానం చేసినట్టు వండర్ బుక్ ఆఫ్ రికార్డు(లండన్) ప్రతినిధి అలమండ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ముఖ్యఅతిథులుగా హాజరైన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరావు మాట్లాడుతూ మహాలక్ష్మి తన విద్యార్థుతో దేశ, విదేశాలలో ప్రదర్శనలు ఏర్పాటు చేసి కాకినాడ ఖ్యాతిని ఖండాంతర వ్యాప్తి చేస్తోందన్నారు. ఈమె ప్రతిభకు ఫలితంగానే ప్రతిష్టాత్మౖమైన వండర్ బుక్ ఆఫ్ రికార్డు అవార్డు దక్కిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి అన్నారు. ఈమె నృత్య రంగానికి చేస్తున్న సేవలు ప్రశంసనీయమని రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతి పోటీలు సభికులను అలరించాయి. పెద్ద ఎత్తున కళాకారులు హాజరయ్యారు. -
ఆలయాల్లో చోరీ
పులివెందుల: పులివెందుల పట్టణంలోని పీబీసీ కార్యాలయం ఎదురుగా ఉన్న శ్రీమహాలక్ష్మి ఆలయంలోనూ, ఆర్యవైశ్య కాలనీ సమీపంలో ఉన్న శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయంలో సోమవారం అర్థరాత్రి దొంగలు పడ్డారు. మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారి తాళిబొట్లు 2, గిన్నెబాట్లు 2, లక్ష్మీకాసులు 2, తీర్థం గిన్నెలు దోచుకెళ్లారు. మొత్తం నాలుగు తులాల బంగారు అపహరణకు గురైంది. అలాగే హుండీలను పగులగొట్టి అందులోని నగదును కూడా ఎత్తుకెళ్లారు. ఆర్యవైశ్య కాలనీలోని శ్రీలక్ష్మినరసింహ స్వామి ఆలయంలో విలువైన వస్తువులు దొరకకపోవడంతో హుండీని పగులగొట్టి అందులోని నగదును మాత్రమే తీసుకెళ్లారు. ఒకే రోజు పట్టణంలోని రెండు ఆలయాల్లో దొంగతనాలు జరగడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పులివెందుల అర్బన్ సీఐ ప్రసాద్తోపాటు కడప నుంచి క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించారు. -
తండ్రి హత్య కేసులో ప్రేమికుడితోపాటు కుమార్తె లొంగుబాటు
కేకే.నగర్: తండ్రిని హత్య చేసిన కేసులో ప్రేమికుడు సహా కుమార్తె న్యాయస్థానంలో లొంగిపోయింది. ఈ సంఘటన కో యంబత్తూరులో చోటు చేసుకుంది. కోయంబత్తూరు చొక్కం పుదూర్ షణ్ముగానగర్కు చెందిన నాగరాజన్ (55) కెమికల్ బిజినెస్ చేసేవాడు. ఇతని భార్య ప్రమీల. కుమార్తె మహాలక్ష్మి. ఈమె కోయంబత్తూరు మలుమిచ్చింపట్టిలో గల ప్రైవేటు కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతోంది. మహాలక్ష్మి ఒత్తకాల్ మండపం ప్రీమియర్ మిల్ ఆర్సీ నగర్కు చెందిన సతీష్ (19)ను ప్రేమించింది. వీరి ప్రేమను ఆమె తండ్రి నాగరాజన్ అంగీకరించలేదు. కూతురుకు మద్దతు ఇచ్చిన ప్రమీల, మహాలక్ష్మిని నాగరాజన్ ఇంటి నుంచి తరిమేశాడు. ఈ కారణంగా నాగరాజన్ పై వారికి ద్వేషం ఏర్పడింది. ఆయన్ని హత్య చేయాలని మహాలక్ష్మి, ప్రమీల, సతీష్ కలిసి పథకం పన్నారు. దాని ప్రకారం సతీష్, తన మిత్రులు నలుగురితో కలిసి నెక్కమమ్ తోటలో నాగరాజన్పై కత్తితో దాడి జరిపి హత్య చేశారు. ఈ నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులు వెతుకుతున్న మహాలక్ష్మి, సతీష్ శుక్రవారం కోయంబత్తూర్ జేఎం 5 మెజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోయారు. కేసుపై విచారణ జరిపిన మెజిస్ట్రేట్ ఇద్దరికి రిమాండ్ విధించి... జూన్ 17వ తేదీన పొల్లాచ్చి జేఎం 2 మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచాలని ఉత్తర్వులు జారీ చేశారు. అయితే పరారీలో ఉన్న నాగరాజన్ భార్య ప్రమీల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
పసిమొగ్గను చిదిమేసింది
-
పసిమొగ్గను చిదిమేసింది
♦ స్కూల్ బస్సు చక్రం కింద నలిగి14 నెలల చిన్నారి దుర్మరణం ♦ వనస్థలిపురంలో ఘటన హైదరాబాద్: స్కూల్ బస్సు రూపంలో వచ్చిన మృత్యువు ఆ పసిమొగ్గను చిదిమేసింది. ప్రతి రోజు అక్క పాఠశాలకు వెళ్లే బస్సే ఆ చిన్నారి పాలిట మృత్యుశకటంగా మారింది. ఈ హృదయ విదారకమైన ఘటన వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా వనపర్తి మండలం కడుకుంట్లకు చెందిన మిద్దె బాల్రాజ్, జనని భార్యాభర్తలు. బాల్రాజ్ వృత్తిరీత్యా పెయింటర్. వీరికి నమ్రత(4), మహాలక్ష్మీ(14 నెలలు) ఇద్దరు పిల్లలు. వీరు వనస్థలిపురం శాతవాహన నగర్లో నివసిస్తున్నారు. నమ్రత ఎస్కేడీ నగర్లోని బాలకార్తికేయ పాఠశాలలో నర్సరీ చదువుతోంది. ప్రతిరోజు పాఠశాలకు చెందిన బస్సులోనే స్కూలుకు వెళ్లివస్తుంది. రోజూ మాదిరిగానే పాఠశాల నుంచి బుధవారం సాయంత్రం 4.30 గంటలకు పాఠశాల బస్సు(టీఎస్08యూబీ3347) ఇంటి ముందు వచ్చి ఆగింది. తల్లి జనని బస్సులో నుంచి నమ్రతను తీసుకుంది. ఇదే సమయంలో ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న 14 నెలల చిన్నారి మహాలక్ష్మీ అక్కను చూడాలనే ఆత్రుతతో బస్సు ముందుకొచ్చింది. పసిపాపను గమనించని డ్రైవర్ బస్సును ముందుకు పోనివ్వడంతో చిన్నారి చక్రాల కింద నలిగిపోయింది. తల నుజ్జునుజ్జవ్వడంతో అక్కడికక్కడే మృతిచెందింది. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. వనస్థలిపురం సీఐ పుష్పన్కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. పాప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి బస్సును పోలీస్స్టేషన్కు తీసుకువెళ్లారు. చిన్నారి దుర్మరణంతో శాతవాహన నగర్లో విషాదఛాయలు అలముకున్నాయి. -
కొలంబోలో విశాఖ జంట అనుమానాస్పద మరణం
సీపీ కార్యాలయానికి భారత రాయబారి సమాచారం గాజువాక: విశాఖలోని గాజువాక ప్రాంతానికి చెందిన ఒక జంట శ్రీలంకలోని కొలంబోలో అనుమానాస్పదంగా మృతి చెందింది. దీనిపై అక్కడి భారత రాయబారి నుంచి నగర పోలీస్ కమిషనర్కు సమాచారం అందింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గాజువాక సమీపం శ్రీనగర్లోని ఫ్రెండ్స్ ఎన్క్లేవ్లో నివసిస్తున్న బొబ్బా పృథ్వీరాజ్ (30)కు చెన్నైలోని కోమత్నగర్కు చెందిన నాగబోయిన మహాలక్ష్మి(28)తో ఏడాది క్రితం వివాహమైనట్టు తెలిసింది. వీరిద్దరూ గత నెల చివరి వారంలో కొలంబో వెళ్లారు. అక్కడ వెల్లవెట్ట పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ హోటల్లో గత నెల 27న బస చేశారు. ఈ నెల ఒకటో తేదీ రాత్రి నుంచి వారు బయటకు రాకపోవడంతో హోటల్ యజమాని అక్కడి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి వెళ్లిన పోలీసులు గదిలో వారిద్దరూ మృతి చెందినట్టు గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం. ఈ విషయాన్ని భారత రాయబార కార్యాలయం నుంచి తెలుసుకున్న నగర పోలీస్ కమిషనర్.. సమాచారాన్ని గాజువాక పోలీసులకు తెలిపారు. దీంతో వారు ఈ సమాచారాన్ని మృతుని బంధువులకు తెలిపారు. ఫ్రెండ్స ఎన్క్లేవ్లోని ప్లాట్లో పృథ్వీరాజ్ సోదరి ఉంటున్నట్టు పోలీసు వర్గాల సమాచారం. మృతుని తల్లిదండ్రులు రెండేళ్ల క్రితమే వేరే ప్రాంతంలో స్థిరపడ్డారని,పృథ్వీరాజ్ ఇక్కడి చిరునామాతో విదేశాలకు వెళ్లాడని చెబుతున్నారు. -
ఎక్కడమ్మా ‘బంగారు తల్లి’
ఇప్పటి వరకూ పథకంలో 17,015 మంది తల్లులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే వీరిలో 7,621 మందికి మాత్రమే మొదటి విడత నగదు అందించారు. మిగిలిన వారికి నగదు ఎప్పుడు వస్తుందో కూడా అధికారులు చెప్పలేని స్థితిలో ఉన్నారు. దాదాపు ఏడాది నుంచి పథకానికి సంబంధించి రూపాయి కూడా ప్రభుత్వం చెల్లించడంలేదు. దరఖాస్తు చేసుకున్న వారిలో 16,014 మంది తల్లులకు మాత్రమే ఆధార్ ఉంది. 9394 మంది బాలింతలు పథకానికి సంబంధించిన మొదటి విడత చెల్లింపులకు ఎదురుచూపులు చూస్తున్నారు.ఒంగోలు సెంట్రల్: ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన బంగారు తల్లి పథకం లబ్ధిదారుల దరిచేరడం లేదు. 2013 మే 1 నుంచి ప్రారంభమైన ఈ పథకం ఆది నుంచి బాలారిష్టాలు ఎదుర్కొంటోంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ‘మహాలక్ష్మి’గా మార్చి అమలు చేస్తామంది. కానీ దాని ఊసే పట్టించుకోలేదు. ఇప్పటికే చేరిన లబ్ధిదారులకు మొదటి విడత రూ.2,500 కూడా చెల్లించలేని పరిస్థితి. 2013 మార్చి నుంచి మే 24వ తేదీ వరకు ఎన్నికల కోడ్ నేపథ్యంలో బంగారు తల్లి పథకానికి సంబంధించి చెల్లింపులు జరగలేదు. అనంతరం రాష్ట్ర విభజనతో ఇప్పటి వరకు చెల్లింపు ప్రక్రియ నిలిచిపోయింది. బాండ్లు కూడా అందజేయలేదు. దీంతో పేద, బలహీనవర్గాల కుటుంబాల్లో ఆడపిల్లలు పుట్టిన బాలింతలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ పథకం సెంట్రల్ బ్యాంకు ద్వారా అమలవుతోంది. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన లబ్ధిదారుల ఖాతాలను వేరుపరిచే ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పథకంలో చేరేందుకున్న నిబంధనలతో చాలా మంది అర్హత ఉన్నా..పథకానికి దూరమవుతున్నారు. కొత్తగా వివాహం అయిన వారికి ఆధార్కార్డు కానీ, రేషన్కార్డు కానీ ఉండదు. దీంతో వీరి పిల్లలకు ఈ పథకం వర్తించడం లేదు. ఆధార్ లేనివారు 1001 మంది: తెలుపు రేషన్ కార్డు ఉన్న బడుగు, బలహీన వర్గాల కుటుంబాల్లో పుట్టిన ఆడబిడ్డలకు అసరాగా ఉండటానికి ఉద్దేశించిన బంగారు తల్లి పథకం ఆడబిడ్డలకు ఆసరా ఇవ్వడంలేదు. చాలా మంది బాలింతలకు ఆధార్ కార్డులు లేవు. ఇప్పటికీ ఆధార్ లేని బాలింతలు 1001 మంది వరకూ ఉన్నారు. ఏఎన్ఎంలు గర్భిణిల పేర్లను నమోదు చేయాలి. అంగన్వాడీ కార్యకర్తలు జననాలను నివేదించాలి. గ్రామాధికారి ఆన్లైన్లో బాలిక వివరాలు న మోదు చేసి పాఠశాలకు వె ళ్లే వరకూ పర్యవేక్షించాలి. పాఠశాలల్లో హెచ్ఎంలు, కళాశాలల్లో చేరిన తర్వాత ప్రిన్సిపల్స్ వారి వివరాలను నమోదు చేయాలి. బంగారు తల్లి పథకాన్ని ఆధార్కు అనుసంధానం చేశారు. ఆధార్ ద్వారానే కుటుంబాలను గుర్తిస్తారు. ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానంలో నేరుగా బాలికల బ్యాంకు ఖాతాలకే నగదు చెల్లిస్తారు. వీటికి బయోమెట్రిక్ విధానం కూడా పరిగణలోకి తీసుకుంటారు. ‘బంగారు తల్లి’తో ఉపయోగాలివీ... బంగారు తల్లి పథకం కింద 2013వ సంవత్సరం మే 1 తరువాత జన్మించిన ఆడపిల్లలకు రూ.2,500లను ఖాతాలో జమ చేస్తారు. బాలిక మొదటి పుట్టిన రోజు వెయ్యి రూపాయలు చెల్లిస్తారు. రెండో సంవత్సరం వచ్చేసరికి మరో వెయ్యి ఇస్తారు. మూడో సంవత్సరం అంగన్వాడీ కేంద్రంలో చేర్పిస్తే రూ.1500 జమచేస్తారు. ఇలా నాలుగైదేళ్లకు ఏటా రూ.1500 చొప్పున చెల్లిస్తారు. బాలిక మొదటి తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఏడాదికి రూ.2 వేలు చొప్పున ఇస్తారు. బాలిక 6,7,8, తరగతులు చదివే వరకూ ఏడాదికి రూ 2,500 జమ చేస్తారు. బాలిక 9,10 తరగతులు చదివే సమయంలో ఏడాదికి రూ.3 వేలు చొప్పున చెల్లిస్తారు. ఇంటర్మీడియెట్ రెండు సంవత్సరాలకు ఏడాదికి రూ.3500ల చొప్పున జమ చేస్తారు. డిగ్రీలో చేరిన అనంతరం వరుసగా మూడు సంవత్సరాలు రూ.4 వేలు జమ చేస్తారు. డిగ్రీ పూర్తయిన తర్వాత ప్రభుత్వం ఆమె పేరిట లక్ష రూపాయలు జమ చేస్తుంది. -
జాతీయ బాక్సింగ్ పోటీలకు మహాలక్ష్మి ఎంపిక
మామిడికుదురు : ఆలిండియా బాక్సింగ్ పోటీలకు మలికిపురానికి చెందిన ఎస్.మహాలక్ష్మి ఎంపికైనట్టు బాక్సింగ్ కోచ్ బొంతు మధుకుమార్ శుక్రవారం తెలిపారు. అంతర్ కళాశాలల విశ్వవిద్యాలయాల స్థాయిలో విజయవాడ ఆర్కే ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో గురువారం జరిగిన అర్హత పోటీల్లో ప్రతిభ ఆధారంగా మహాలక్ష్మిని ఎంపిక చేశారని పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి పిభ్రవరి 2 వరకు పంజాబ్లో జరిగే పోటీల్లో ఈమె పాల్గొంటుందని వెల్లడించారు. మహాలక్ష్మి స్థానిక నవయువ క్రీడా యువజన సేవా సంఘం ఆ ధ్వర్యంలో బాక్సింగ్లో శిక్షణ పొందిందని, ఈమె ప్రస్తు తం విజయవాడలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతోందని, వివరించారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి ని పలువురు అభినందించారు. -
ఎస్కలేటర్ల మధ్య పడిపోయిన చిన్నారి
ఎస్కలేటర్ల మధ్య పడిపోయిన చిన్నారి రైల్వే పోలీసుల అప్రమత్తతో సురక్షితంగా బయటపడ్డ వైనం సికింద్రాబాద్: నడుస్తున్న రెండు ఎస్కలేటర్ల మధ్య పడిపోయిన ఓ చిన్నారి రైల్వేపోలీసుల అప్రమత్తతో సురక్షితంగా బయటపడింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో బుధవారం ఈ ఘటన జరిగింది. వివరాలు... ఉప్పుగూడకు చెందిన నాగేందర్, నాగమ్మ దంపతులు కుమార్తె మహాలక్ష్మిని మల్కాజిగిరికి చెందిన ఆంజనేయులుకు ఇచ్చి రెండేళ్ల క్రితం పెళ్లి జరిపించారు. వీరికి మహేశ్వరి అనే పది నెలల పాపం ఉంది. కొద్దిరోజుల క్రితం మహాలక్ష్మి కూతురు మహేశ్వరిని తీసుకొని మల్కాజిగిరి నుంచి తల్లిగారి ఇంటికి వెళ్లింది. బుధవారం ఉప్పుగూడ నుంచి మల్కాజిగిరికి వెళ్లేందుకు బయలుదేరిన మహేశ్వరి వెంట ఆమె తల్లిదండ్రులు నాగేందర్, నాగమ్మ సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. 6వ నెంబర్ ప్లాట్ఫామ్పై దిగిన వీరంతా రైల్వేస్టేషన్ నుంచి బయటకు వచ్చేందుకు ఎస్కలేటర్ ఎక్కారు. తాత నాగేందర్ మనవరాలు మహేశ్వరిని చంకన ఎత్తుకుని, మరో చేతిలో బ్యాగును పట్టుకుని ఎస్కలేటర్ ఎక్కేందుకు యత్నించాడు. అయితే, ఆయనకు ఎస్కలేటర్ గురించి అవగాహన లేకపోవడంతో కాలుజారింది. తనను తాను రక్షించుకునే యత్నంలో ఆయన తన చంకన ఉన్న మనవరాలు మహేశ్వరిని వదిలేశాడు. దీంతో ఆ చిన్నారి రెండు ఎస్కలేటర్ల మధ్య అడుగు వెడల్పు కలిగిన ఖాళీ స్థలంలోంచి కింద పడిపోయింది. గది గమనించిన తల్లి కేకలు వేయడంతో అక్కడే ఉన్న ఆపరేటర్ ఎస్కలేటర్లను నిలిపివేశాడు. రెండు ఎస్కలేటర్ల మధ్యలోంచి తొంగి చూసినప్పటికీ మొదట పాప కనిపించలేదు. దీంతో పది మీటర్ల ఎత్తు నుంచి ఎస్కలేటర్ల మధ్య పడిన ఆ చిన్నారికి ఏమైందోనని అందరూ భయపడ్డారు. వెంటనే అక్కడికి చేరుకున్న రైల్వే పోలీసులు సాంకేతిక నిపుణుల సహాయంతో ప్లాట్ఫామ్ను ఆనుకుని ఉన్న ఎస్కలేటర్ విడిభాగాలను విప్పి చూడగా మహేశ్వరి సురక్షితంగా బయటపడింది. తలకు చిన్నపాటిగాయంతో చిన్నారి బయట పడటంతో కుటుంబసభ్యులతో పాటు అక్కడ ఉన్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఎంబీఏ విద్యార్థిని బలవన్మరణం
ఖైరతాబాద్, న్యూస్లైన్: ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన సైఫాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ చంద్రశేఖర్ కథనం ప్రకారం... చింతలబస్తీలో నివాసముండే మునిస్వామి ప్రైవేట్ ప్రెస్లో ఉద్యోగి. ఇతనికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె మహాలక్ష్మి(21) రామాంతపూర్లోని అరోరా కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. చిన్నకుమార్తె మానస సీఏ చేస్తోంది. చిన్నకుమార్తెకు ఆరోగ్యం బాగోకపోవడంతో శనివారం ఉదయం 11 గంటలకు తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహాలక్ష్మి మధ్యాహ్నం 2 గంటలకు తల్లిదండ్రులకు టిఫిన్ తయారు చేసి పంపింది. ఆ తర్వాత చెల్లెలు ఫోన్ చేస్తే స్విచ్ఛాప్ వచ్చింది. దీంతో ఆమె తమ ఇంటి పక్కన ఉండే వారికి ఫోన్ చేసి.. తమ ఇంటికి వెళ్లి చూడమని కోరింది. వారు వచ్చి తలుపు తట్టినా తీయలేదు. ఈ సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు వెంటనే ఇంటికి చేరుకున్నారు. మహాలక్ష్మి ఎంతకూ తలుపు తీయకపోవడంతో వెంటిలేటర్లోంచి చూడగా సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి తలుపులు తెరిచి చూడగా మహాలక్ష్మిఫ్యాన్కు చీరతో ఉరేసుకొని మృతి చెంది ఉంది. మధ్యాహ్నం తమకు టిఫిన్ పంపిన కూతురు అంతలోనే ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. అందరితో కలివిడిగా ఉండే మహాలక్ష్మి ఆత్మహత్య చేసుకోవడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా, మహాలక్ష్మి బలవన్మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్నోట్ కూడా దొరకలేదు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పల్లెగూటికి పండగొచ్చింది
రైతు కష్టం ఫలించింది. పంటలు ఇంటికి చేరుతున్నాయి. అందరి మొహాల్లో ఆనందం. ఇంట సంక్రాంతి సంబరాలు. పండిన ధాన్యాన్ని అవసరానికి దాచుకోగా మిగిలినది అమ్మేస్తున్నాడు. ఆ డబ్బుతో పిల్లలకు కొత్త బట్టలు కొనుగోలు చేశాడు. పండగ పూట పిండి వంటలు చేసుకుని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేందుకు సిద్ధమయ్యాడు. ఆనంద లోగిళ్లు.. గుంటూరు జిల్లా తెనాలి మండలం కొల్లపర గ్రామం నుంచి వచ్చిన కుటుంబ రెడ్డి, కాంతమ్మ దంపతులు నంద్యాల మండలం పాండురంగాపురం గ్రామంలో స్థిరపడ్డారు. ఆయన కుమారుడు శివారెడ్డి, కోడులు సీతామహాలక్ష్మి వ్యాపార రీత్యా హైదరాబాద్ లో ఉంటున్నారు. కుటుంబీకుల మధ్య సంక్రాంతిని జరుపుకునేందుకు ఆయన కుమారుడు బసవ పున్నారెడ్డి, కోడలు దుర్గాలక్ష్మి, మనుమళ్లతో భువనేశ్వర్ రెడ్డి, సాయి రుత్విక్ రెడ్డితో కలసి ఇక్కడికి చేరుకున్నాడు. ప్రతి ఏటా జరుపుకునే పండుగ విశేషాలను ‘న్యూస్లైన్’తో పంచుకున్నారు. ‘ పండుగ గ్రామానికి వచ్చినప్పుడల్లా చిన్నానాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. తోటి మిత్రులతో కలసి ఇంటిలోని పాత వస్తువులను బోగిరోజు కాల్చడం, కాల్వలో ఈత కొట్టడం, పసందైన పిండి వంటలు తినడం ఎంతో ఇష్టం. మా అక్క రాములమ్మ చేసే పిండి వంటలు చాలా బాగుంటాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరం హాయిగా గడుపుతాం’. అన్నారు. అనంతరం అందరూ గ్రామంలో దేవాలయానికి ట్రాక్టర్లతో బయలుదేరారు. సంబరాల సంక్రాంతి ఈ ఏడాది పత్తి పంట బాగా పండటంతో ఆదోని ప్రాంత వాసులు సంక్రాంతిని రెట్టింపు ఉత్సాహంతో చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆడబిడ్డలను, బంధువులను పండుగకు ఆహ్వానించారు. ఉద్యోగ రీత్యా ఆదోనిలో నివాసముంటున్న చంద్రశేఖర్ ఇద్దరు కుమార్తెలు. పండుగకు వారిద్దరూ భర్తలు, పిల్లలతో పండగకు వచ్చేశారు. ఇళ్లంతా సందడి సందడిగా ఉంది. ఈ సందర్భంగా చంద్రశేఖర్ ‘న్యూస్లైన్’తో మాట్లాడారు. ‘శూన్య మాసం కావడంతో కొత్త బట్టలు పెట్టం. అయితే మూడు రోజుల పాటు పండుగకు ప్రత్యేక వంటకాలు తయారు చేస్తాం. ముఖ్యంగా నువ్వులు అద్దిన సద్ద రొట్టెలు, గుమ్మడికాయ, ఇతర కాయగూరలతో చేసిన తీపి పచ్చడి, గుగ్గిళ్లు, పిండి వంటలు, మరుసటి రోజు భక్ష్యాలు వండుతాం. అందరం కలిపి కబుర్లు చెపుతూ రుచికరమైన వంటకాలు ఆరగిస్తాం. ఉద్యోగం రిత్యా మేము పట్టణంలో నివాసం ఉంటున్నప్పటికీ కుటుంబానిది పల్లె నేపథ్యమే’. అని చెప్పారు.