managing director
-
ఎవరీ 'రిషి పార్టి'.. ఏకంగా రూ.190 కోట్ల ప్లాట్ కొన్నాడు
హర్యానాలోని గురుగ్రామ్ ఇప్పుడు లగ్జరీ ప్రాపర్టీ మార్కెట్ విభాగంలో.. ముంబై, బెంగళూరులతో పోటీ పడుతోంది. అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్ ది కామెలియాస్లో వ్యాపారవేత్త 'రిషి పార్టి' (Rishi Parti) ఏకంగా రూ. 190 కోట్లు చెల్లించి.. 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్ను కొనుగోలు చేశారు. ఇంతకీ రిషి పార్టీ ఎవరు? ఆయనకు సంబంధించిన కంపెనీలు ఏవి? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.ఎవరీ రిషి పార్టి?ఇన్ఫో-ఎక్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, ఫైండ్ మై స్టే ప్రైవేట్ లిమిటెడ్, ఇంటిగ్రేటర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్తో సహా నాలుగు కంపెనీలకు 'రిషి పార్టి' డైరెక్టర్. అయితే ఎక్కువగా ఇన్ఫో-ఎక్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్పై ద్రుష్టి సారిస్తున్నారు. అంతే కాకుండా ఈయన ఏంజెల్ ఇన్వెస్టర్గా ఉన్నారు.ఇన్ఫో-ఎక్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ఇన్ఫో-ఎక్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది లాజిస్టిక్స్కు సంబంధించిన కంపెనీ. ఇది 2001లో ప్రారంభమైనట్లు సమాచారం. ఈ సంస్థ లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి లాజిస్టిక్స్ కంపెనీలలో కొత్తదనానికి మార్గం వేస్తోంది. రిషి పార్టి దీనిని 24ఏళ్ల వయసులో మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి ప్రారభించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ కంపెనీలో 150 ఉద్యోగులు పనిచేస్తున్నట్లు సమాచారం. -
ఐఆర్సీటీసీ సీఎండీగా సంజయ్ కుమార్
న్యూఢిల్లీ: ఐఆర్సీటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా సంజయ్ కుమార్ జైన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన నియామకం తక్షణం అమల్లోకి వచ్చినట్టు స్టాక్ ఎక్సే్ఛంజ్లకు ఐఆర్సీటీసీ తెలిపింది. ఇప్పటి వరకు సంజయ్ కుమార్ జైన్ నార్తర్న్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్గా సేవలు అందించారు. ‘‘సీఎండీగా సంజయ్ కుమార్ జైన్ తక్షణ నియామకానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. పదవీ విరమణ తేదీ 2026 డిసెంబర్ 31 వరకు లేదంటే తదుపరి ఆదేశాలు వెలవరించేంత వరకు.. వీటిల్లో ఏది ముందు అయితే అది అమలవుతుందని తెలిపింది. ఈ నెల 13న నార్తర్న్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ బాధ్యతల నుంచి తప్పుకున్న జైన్, మరుసటి రోజు ఐఆర్సీటీసీ సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సరీ్వసెస్, 1990 బ్యాచ్ అధికారి అయిన జైన్, చార్టర్ అకౌంటెంట్ ఉత్తీర్ణులు. లోగడ భారత ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థల వాణిజ్య వెంచర్లు, విధానాల రూపకల్పనలో పాలుపంచుకున్నారు. -
ఆమె సక్సెస్ మంత్రా... వ్యూహ చతురత వృత్తి నిబద్ధత
అనుభవం నేర్పిన పాఠాలు అద్భుత విజయాలను సొంతం చేస్తాయి. రెండు దశాబ్దాలకు పైగా ఎన్నో కార్పొరేట్ కంపెనీలలో పని చేసిన ఇప్సితా దాస్గుప్తా ఎన్నో విలువైన పాఠాలను నేర్చుకుంది. అమెరికాలో యాపిల్ సర్వీసెస్లో సీనియర్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్గా విధులు నిర్వహించి మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా... అమెరికన్ మల్టీ నేషనల్ ఐటీ కార్పోరేషన్ ‘హెచ్పీ ఇండియా’ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఎస్వీపీ), మేనేజింగ్ డైరెక్టర్గా నియామకం అయింది... పనిలోని కష్టమే ఇష్టమైతే అంతకంటే సుఖం ఏమున్నది? కొలంబియా యూనివర్శిటీలో మ్యాథ్స్, ఎకనామిక్స్లో డిగ్రీ, హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చేసిన ఈప్సితా ఎన్నో మల్టీ నేషనల్ కంపెనీలలో పనిచేసింది. ముంబై రోడ్లపై ఉరుకులు, పరుగులు, పని భారంతో నిద్రలేని రాత్రులు ఆమెకు కొత్తేమీ కాదు. కుటుంబ జీవితాన్ని, వృత్తి జీవితాన్ని సమన్వయం చేసుకోడంలో సమస్యలు తలెత్తాయి. ‘నాకు కష్టంగా ఉంది’ అని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. ఎన్నో కంపెనీలలో మార్కెటింగ్, స్ట్రాటజీ విభాగాలకు నేతృత్వం వహించి మన దేశంతో సహా బంగ్లాదేశ్, శ్రీలంకలలో పనిచేసింది ఈప్సితా. ఆఫీస్ గదికే పరిమితం కాకుండా జనాల్లోకి వెళ్లి క్లయింట్స్ అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండేది. వాటికి అనుగుణంగా వ్యూహాలను రూ΄÷ందించుకునేది. యాపిల్కు ముందు స్టార్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ కార్పొరేట్ స్ట్రాటజీ, జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ దక్షిణ ఆసియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్గా పని చేసిన ఈప్సితా వృత్తికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరితో చర్చిస్తుంది. ‘తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకోవచ్చునేమోగానీ, ఆ నిర్ణయం ఫలితంగా ఉత్పన్నమయ్యే పరిస్థితులను వెనక్కి తీసుకోలేదు. అందుకే ఒక నిర్ణయం తీసుకునే ముందు వంద కోణాల్లో ఆలోచిస్తాను’ అంటుంది ఈప్సితా. ఉద్యోగంలోకి అప్పుడే వచ్చిన రోజుల్లో ఈప్సితాలాంటి కొత్త ఉద్యోగులకు సీనియర్ల నుంచి వినిపించిన మాట ‘ఇలా ఎవరైనా ఆలోచిస్తారా?’ అందరిలాగే ఈప్సితా ఆలోచించినట్లయితే ఆమెకు ఇంత పేరు వచ్చేది కాదేమో. ‘ఇలా కూడా చేయవచ్చు... అంటూ సంప్రదాయ విధానాలకు భిన్నంగా ఆలోచించేదాన్ని. ఇది సీనియర్లకు రుచించేది కాదు. అయితే నా ఆలోచనల్లో సత్తా ఉందని ఆ తరువాత నిరూపణ అయింది’ అంటుంది ఈప్సితా. వృత్తిరీత్యా ఈప్సితా దాస్గు΄్తా ఒక సమస్యకు పరిష్కారం వెదకగానే పని అక్కడితో ఆగి΄ోదు. ‘మేమున్నాం’ అంటూ కొత్త సమస్యలు పుట్టుకొస్తుంటాయి. గత సమస్యలతో వీటికి ΄ోలిక ఉండక΄ోవచ్చు. కొన్నిసార్లు పరిష్కారం దుర్భేద్యంగా అనిపించవచ్చు. ఇలాంటి సమయంలోనే వ్యూహకర్తలు చురుగ్గా ఆలోచించాలి. వ్యూహకర్తగా ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిన ఈప్సితా దాస్గుప్తాఎంతోమందికి రోల్ మోడల్గా నిలిచింది. ‘మీకు ఇన్స్పిరేషన్ ఎవరు?’ అనే ప్రశ్నకు ఈప్సితా చెప్పే జవాబు... ‘వీరు వారు అని కాదు. నేను మాట్లాడే ప్రతి వ్యక్తి నుంచి ఎంతో కొంత ఇన్స్పైర్ అవుతుంటాను. సా«ధారణ ప్రజల నుంచి ఇన్వెస్టర్లు, లీడర్లు, ఆర్టిస్టుల వరకు నాకు ఎంతోమంది రోల్ మోడల్స్ కనిపిస్తారు’ -
ఆహార ధరలే ఆందోళనకరం
న్యూఢిల్లీ: ధరల పెరుగుదలను అరికట్టేందుకు ప్ర భుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ ఆహార ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తోందని నెస్లే ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ నారాయణన్ పేర్కొన్నారు. దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాల ను ఎదుర్కొనడానికి నిత్యావసర వస్తువుల ధరల కదలికను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఇక్కడ జరిగిన ఒక మీడియా రౌండ్ టేబుల్ సమావేశంలో తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ► బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే.. రుతుపవనంలో 30 శాతం లోటు ఉన్నప్పటికీ ఖరీఫ్ పంటపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ► ఎల్నినో ప్రభావం పూర్తిగా తగ్గకపోవడంతో ఆహార ద్రవ్యోల్బణం అంశాన్ని మనం ఇంకా జాగరూకతతో పరిశీలించాల్సి ఉంటుంది. ► ఇక ఇతర ఉత్పత్తుల విషయానికి వస్తే.. ఖరీఫ్, రబీ పంటలు ఎలా ఉంటాయన్న అంశంపై ఇది ఆధారపడి ఉంటుంది. ఆయా అంశాలపై ఇప్పటికీ అనిశ్చితి నెలకొంది. ► గ్రామీణ డిమాండ్ భవిష్యత్ ఇప్పటికీ ఊహాజనితమైన అంశమే. అయితే వర్షాభావం వల్ల గ్రామీణ రంగం తీవ్రంగా ప్రభావితమైతే, అది డిమాండ్పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ► ప్రముఖ మ్యాగీ ఇన్స్టంట్ నూడుల్స్, కిట్కాట్ చాక్లెట్లు, నెస్కేఫ్ల ఉత్పత్తి దారైన నెస్లే ఇండియా... భారీ ఆఫర్లతో తన గ్రామీణ మార్కెట్ను విస్తరించుకోడానికి ప్రయతి్నస్తోంది. గ్రామీణ మార్కెట్ మొత్తం విక్రయాల్లో ఐదవ వంతు స్థానాన్ని సాధించింది. ఇది చిన్నదిగా కనిపిస్తున్నప్పటికీ, గణనీయమైన సానుకూల అంశం. స్థిర పురోగతిని సంస్థ సాధిస్తుందని భావిస్తున్నాం. జూన్ త్రైమాసికంలో సంస్థ మంచి గ్రామీణ డిమాండ్ను సంపాదించింది. ► అయితే పరిస్థితులు క్లిష్టంగా మారితే మా గ్రామీ ణ డిమాండ్పై సైతం ప్రతికూల ప్రభావం పడుతుంది. ► 2 నుంచి 6వ అంచె పట్టణాల్లో డిమాండ్ ఇప్పటికి సానుకూలంగా ఉంది. తీవ్ర ప్రతికూల పరిస్థితులు కనబడ్డం లేదు. ► సమస్యకు సంబంధించి చూస్తూ కూర్చోవడం ఎంతమాత్రం సమంజసం కాదు. సవాళ్లను ఎదుర్కొనడానికి నిరంతర చర్యలు కొనసాగాలి. డెయిరీపై దీర్ఘకాలిక ప్రభావం... డెయిరీ రంగంలో ధరల విషయాన్ని తీసుకుంటే.. తక్షణం ఏదో జరిగిపోతోందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ఈ విషయాన్ని, ప్రభావాలను పరిశీలించాలి. భవిష్యత్ ప్రభావాలు, పరిణామాల గురించి అధ్యయనం చేయాలి. సవాళ్లు ఇదే విధంగా కొనసాగితే, తక్షణ ప్రభావం చూపకపోయినా, 2024 నాటికి నిజంగా ఈ రంగంలో తీవ్ర సవాళ్లు ఉంటాయి. డెయిరీ రంగానికి సంబంధించి కోవిడ్ అనంతర ప్రభావాలపై మాట్లాడాలి. చర్మ వ్యాధులుసహా అనేక ఇతర సవాళ్లు ఉన్నాయి. ఈ సమస్యలకు ఇంకా పరిష్కారం కనుగొనాలి. అలాగే ఉత్పత్తి వ్యయం బాగా పెరిగింది. దాణా ధరలో 40 శాతం పెరుగుదల కనబడుతోంది. పరిశ్రమ ఇంతటి క్లిష్ట స్థితిని భవిష్యత్తులో ఎలా ఎదుర్కొంటుందో చూడాల్సి ఉంది. పాల విషయంలో అనుకూల ప్రతికూల అంశాలు ఉంటాయి. ఒక్కొక్కసారి నిల్వలు భారీగా అందుబాటులో ఉంటాయి. మరోసారి తగ్గిపోతాయి. ఆయా అంశాలన్నింటిపై అధ్యయనం చేసి తగిన నిర్ణయాలు తీసుకోవాలి. -
ఎల్ఐసీ కొత్త ఎండీగా ఆర్ దొరైస్వామి
LIC appointed MD R Doraiswamy ఎల్ఐసీ మేనేజింగ్ డైరెక్టర్గా ఆర్ దొరైస్వామి నియమితులయ్యారు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసి) కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా ఆర్ దొరైస్వామిని నియమించినట్లు ప్రకటించింది.సెప్టెంబర్ 1, 2023 నుండి అమలులోకి రానున్నట్టు ఎల్ఐసీ ప్రకటించింది. 2026 ఆగస్టు చివరివరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. దొరైస్వామి ప్రస్తుతం ముంబైలోని కేంద్ర కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా ఆర్ దొరైస్వామిని ఆఫీస్ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి లేదా అతని పదవీ విరమణ తేదీ వరకు (అంటే 31.08.2026) వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు, ఏది ముందైతే అది అమలులోకి వస్తుందని అని రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. గతంలో ఎల్ఐసీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా సత్పాల్ భానూను నియమించింది. ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థల డైరెక్టర్ల కోసం హెడ్హంటర్ అయిన ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూషన్స్ బ్యూరో (FSIB), ఎల్ఐసీ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి సత్ పాల్ భానూ పేరును సిఫార్సు చేసింది. కాగా జూన్ 2023తో ముగిసిన త్రైమాసికంలో ఎల్ఐసీ భారీ లాభాలను ఆర్జించింది. గత ఏడాదితో ఇదే క్వార్టర్ రూ. 602.79 కోట్లతో పోలిస్తే ఈ కాలంలో లాభం 1498.4 శాతం పెరిగి రూ. 9634.98 కోట్ల లాభాలునమోదు చేసింది. అయితే నికర ఆదాయం మాత్రం స్వల్పంగా తగ్గి రూ. 98,755 కోట్లుగా ఉంది. త్రైమాసికంలో స్థూల నిరర్థక ఆస్తులు (జిఎన్పిఎ) 2.48 శాతంగా ఉంది, ఇది క్రితం సంవత్సరం కాలంలో 5.84 శాతంగా ఉంది. -
యూనియన్ బ్యాంక్ రికార్డు డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ రికార్డు స్థాయి లో రూ. 1,712 కోట్ల డివిడెండ్ను ప్రభుత్వానికి అందజేసింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ మేరకు ఒక డివిడెండ్ చెక్కును కేంద్రానికి సమరి్పంచినట్లు బ్యాంక్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ స్థాయిలో డివిడెండ్ను యూనియన్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరాల్లో ఎన్నడూ సమరి్పంచలేదని కూడా ప్రకటన వివరించింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఎ మణిమేఖలై డివిడెండ్ చెక్కును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు అందజేశారు. జాయింట్ సెక్రటరీ (బ్యాంకింగ్) సమీర్ శుక్లా తదితర అధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. -
Bangalore: టెక్ కంపెనీ సీఈఓ, ఎండీను హత్య చేసిన మాజీ ఉద్యోగి..
బెంగళూరు: బెంగళూరులో దారుణం జరిగింది. ఓ మాజీ ఉద్యోగి తన పాత కంపెనీకి చెందిన సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ను హత్య చేశాడు. నిందితుడు సంస్థలోకి చొరబడి కత్తితో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితులను ఫణీంద్ర సుబ్రహ్మణ్యం, విను కమార్లుగా గుర్తించారు. ఫణీంద్ర, విను కుమార్లు ఏడాది క్రితం ఏయిరోనిక్స్ ఇంటర్నెట్ అనే సంస్థను స్థాపించారు. దానికి ఫణీంద్ర సీఈఓ, విను కుమార్ ఎండీగా పనిచేస్తున్నారు. అయితే.. నిందితుడు వీరు కంపెనీలో క్రితం ఏడాది ఉద్యోగిగా పనిచేశాడు. అనంతరం బయటకు వెళ్లి అదే రంగంలో వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఈ క్రమంలో ఫణీంద్ర, విను కుమార్లు నిందితుని వ్యాపారంలో కలగజేసుకున్నారని పోలీసుల ప్రాథమిక సమాచారం. ఈ క్రమంలోనే కక్ష పెంచుకున్న నిందితుడు ఫణీంద్ర, విను కుమార్లను కత్తితో కిరాతకంగా హత్య చేశాడని పోలీసులు తెలిపారు. బాధితులు ఆస్పత్రికి తీసుకువెళ్లే క్రమంలో మార్గమధ్యలో మృతి చెందినట్లు వెల్లడించారు. నిందితుడు పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదీ చదవండి: హనుమాన్ టెంపుల్లో చోరి.. రూ.10 సమర్పించి.. రూ.5000 దోపిడి.. -
జిందాల్ స్టెయిన్లెస్ డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్(జేఎస్ఎల్) ఎండీగా అభ్యుదయ్ జిందాల్ను కొనసాగించేందుకు బోర్డు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా వాటాదారులకు రూ. 2 ముఖ విలువగల షేరుకి రూ. 1 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లించేందుకు బోర్డు అనుమతించినట్లు జేఎస్ఎల్ తెలియజేసింది. ఇందుకు ఈ నెల 26 రికార్డ్ డేట్గా ప్రకటించింది. మే నెల 17కల్లా డివిడెండ్ చెల్లించనున్నట్లు వెల్లడించింది. కంపెనీతో జిందాల్ స్టెయిన్లెస్(హిస్సార్) విలీనం తదుపరి ఇది తొలి డివిడెండుగా పేర్కొంది. 2023 మే 1 నుంచి అభ్యుదయ్ జిందాల్ మరో ఐదేళ్లపాటు ఎండీగా బాధ్యతలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. తాజా ప్రతిపాదనకు బోర్డు ఆమోదముద్ర వేసినట్లు తెలియజేసింది. కాగా.. మొత్తం డివిడెండు చెల్లింపునకు రూ. 82 కోట్లకుపైగా వెచ్చించనున్నట్లు వివరించింది. -
ఎల్ఐసీ ఎండీగా తబ్లేష్ పాండేకు పదోన్నతి
న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) తబ్లేష్ పాండే మేనేజింగ్ డైరెక్టర్గా (ఎండీ) పదోన్నతి పొందారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆయన నియామకం అమల్లోకి వస్తుందని ఒక రెగ్యులేటరీ ఫైలింగ్లో కంపెనీ తెలిపింది. ప్రస్తుత ఎండీ బీసీ పట్నాయక్ స్థానంలో పాండే నియమకం జరిగింది. ఎల్ఐసీలో ప్రస్తుతం నలుగురు ఎండీలు ఉన్నారు. ఇదీ చదవండి:రిలయన్స్ ‘మెట్రో’ డీల్ ఓకే, రూ.2,850 కోట్లతో కొనుగోలు -
పూర్తిగా మహిళా సిబ్బందితో 90 విమాన సర్వీసులు
న్యూఢిల్లీ: ఆకాశంలో సగం అనే నారీశక్తి నినాదానికి మరింత మద్దతు పలికింది ఎయిర్ఇండియా. మార్చి ఒకటోతేదీ నుంచి 90 జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను పూర్తి మహిళా సిబ్బందితోనే నడిపింది! బుధవారం సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. తమ మొత్తం 1,825 మంది పైలెట్లలో 15 శాతం మంది అంటే 275 మంది పైలెట్లు మహిళలేనని పేర్కొంది. ఎయిర్ఇండియా మొత్తం సిబ్బందిలో 40 శాతానికిపైగా నారీమణులే ఉండటం విశేషం. కాక్పిట్ క్రూలో 15 శాతం అతివలే. ‘ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది కమర్షియల్ ఉమెన్ పైలెట్లు ఉన్న దేశం భారత్’ అని ఎయిర్ ఇండియా సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ క్యాంప్బెల్ విల్సన్ చెప్పారు. ‘ వైమానిక రంగ సంబంధ వృత్తులను ఎంచుకుంటున్న భారతీయ మహిళల సంఖ్య పెరుగుతోంది. అందుకే ఈ రంగంలో లింగ సమానత్వాన్ని సాధించగలిగే అవకాశం వచ్చింది’ అని ఆయన అన్నారు. -
ఆమ్రపాలి సంస్థ ఎండీపై మర్డర్ కేసు
కేంద్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆమ్రపాలి గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ శర్మపై హత్య కేసు నమోదు చేసింది. బీహార్లోని లఖిసరాయ్లోని బాలికా విద్యాపీఠం కార్యదర్శి డాక్టర్ శరద్ చంద్ర ఆగష్టు 8, 2014 సాయంత్రం తన నివాసంలోని బాల్కనీలో వార్తాపత్రిక చదువుతుండగా హత్య గురయ్యారు. బాలికా విద్యాపీఠ్, లఖిసరాయ్ భూములు, ఆస్తులను లాక్కోవడానికి కుట్రలో భాగంగా ఈ హత్య చేశారని అనిల్ శర్మతో పాటు మరి కొందరిపై చంద్ర భార్య ఉమా శర్మ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. పాట్నా హైకోర్టు ఆదేశంతో దర్యాప్తు చేపట్టిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విద్యా సంస్థకు చెందిన భూమి, ఆస్తులను స్వాధీనం చేసుకోవడమే ఈ కుట్ర వెనుక ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొంది. అనిల్ శర్మ మరికొందరి సహాయంతో సంస్థ భూమి, ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో చంద్రను అతని పదవి నుంచి కూడా తొలగినట్లు పేర్కొంది. చదవండి: టాలెంట్ కోసం విప్రో కీలక నిర్ణయం: ఉద్యోగులకు బంపర్ ఆఫర్ -
అమూల్ ఎండీగా సోధి రాజీనామా
సాక్షి,ముంబై: అమూల్ బ్రాండ్తో తమ ఉత్పత్తులను మార్కెట్ చేస్తున్న గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (GCMMF) మేనేజింగ్ డైరెక్టర్ పదవికి రూపిందర్ సింగ్ సోధి సోధి సోమవారం రాజీనామా చేశారు. గతంలో గుజరాత్లో మాత్రమే పరిమితమైన అమూల్ సోధి నాయకత్వంలో ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర , రాజస్థాన్ నుండి పాల సహకార సంఘాలను ఒకే గొడుగు కిందకు తీసుకు వచ్చారు. అమూల్ కోసం 50కి పైగా కొత్త ఉత్పత్తులను పరిచయం చేసిన విజయవంతమయ్యారు. సోమవారం (జనవరి 9) జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 40 ఏళ్ల సర్వీసు తర్వాత ఆయన ఈ పదవిని వీడారు. గత రెండేళ్లుగా ఎక్స్టెన్షన్ మీద ఉన్నాననీ, తన రాజీనామాను బోర్డు ఆమోదించిందని సోధి ప్రకటించారు. ప్రస్తుత ఆపరేటింగ్ ఆఫీసర్ జయన్ మెహతాకు తాత్కాలికంగా బాధ్యతలను నిర్వహించనున్నారు. ఇండియన్ డారీ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా అయిన సోధి 2010. జూన్ నుండి అమూల్ ఎండీగా పని చేస్తున్నారు. 1982లో అమూల్లో సీనియర్ సేల్స్ ఆఫీసర్గా చేరాడు. 2000 నుండి 2004 మధ్య, అమూల్ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్)గా పనిచేసిన , ఆతరువాత జూన్ 2010లో ఎండీగా ప్రమోట్ అయ్యారు. -
సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: రియల్ ఎస్టేట్ పేరుతో మోసాలు చేశారనే అభియోగాలపై సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీఎస్లో నమోదైన కేసులో లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకున్నారు. అమీన్పూర్లో ఫ్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో సాహితీ ఇన్ఫ్రా మోసాలు చేసిందని కేసు నమోదైంది. 1700 మంది బాధితుల నుంచి రూ.530 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు రాగా, 38 అంతస్తుల అపార్ట్మెంట్ నిర్మాణం పేరుతో భారీ మోసానికి తెరతీసినట్లు కేసు ఫైల్ అయ్యింది. ప్రాజెక్టు మొదలు పెట్టకముందే కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేశారని, మరో ప్రాజెక్టులో రూ. 900 కోట్లు సాహితీఇన్ఫ్రా వసూలు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. -
స్టీల్ మ్యాన్, టాటా స్టీల్ మాజీ ఎండీ జేజే ఇరానీ ఇక లేరు
సాక్షి, ముంబై: భారత స్టీల్ మ్యాన్, టాటా స్టీల్ మాజీ ఎండీ జేజే ఇరానీ (86) ఇకలేరు. భారత ఉక్కు మనిషిగా పేరొందిన ఇరానీ సోమవారం అర్థరాత్రి జంషెడ్పూర్లో టాటా హాస్పిటల్లో మరణించారని టాటా స్టీల్ తెలిపింది. భారతదేశపు ఉక్కు మనిషి పద్మభూషణ్ డాక్టర్ జంషెడ్ జె ఇరానీ కన్నుమూతపై టాటా స్టీల్ ప్రగాఢ సంతాపం తెలుపుతూ టాటా స్టీల్ ఒక ప్రకటన జారీ చేసింది. 1990ల ప్రారంభంలో భారతదేశ ఆర్థిక సరళీకరణ సమయంలో టాటా స్టీల్ను ముందంజలో నడిపించడమే కాకుండా, భారతదేశంలో ఉక్కు పరిశ్రమ అభివృద్ధికి ఎనలేని సేవ చేసిన దార్శనికుడిని ఎన్నటికీ మరువలేమంటూ టాటా స్టీల్ తెలిపింది. ఇరానీ జూన్ 2011లో టాటా స్టీల్ బోర్డు నుండి పదవీ విరమణ చేశారు, 43 సంవత్సరాలపాటు విశిష్ట సేవలందించి పలువురి ప్రశంసలందుకున్నారు. తద్వారా కంపెనీకి కూడా అంతర్జాతీయ ఖ్యాతి, ప్రశంసలు, లభించాయి. 1979లో టాటా స్టీల్కు జనరల్ మేనేజర్గా, 1985లో ప్రెసిడెంట్గా పనిచేశారు. 1988లో టాటా స్టీల్కు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా, 1992లో మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసి 2001లో పదవీ విరమణ చేశారు. జూన్ 2, 1936న నాగ్పూర్లో జన్మించిన డాక్టర్ ఇరానీ 1956లో నాగ్పూర్లోని సైన్స్ కాలేజీ నుండి బీఎస్ఈ, 1958లో నాగ్పూర్ విశ్వవిద్యాలయం నుండి జియాలజీలో ఎంఎస్సీ పూర్తి చేసారు.యూకేలోని షెఫీల్డ్ విశ్వవిద్యాలయానికి జేఎన్ టాటా స్కాలర్గా వెళ్ళారు. అక్కడ 1960లో మెటలర్జీలో మాస్టర్స్ 1963లో మెటలర్జీలో పీహెచ్డీ పట్టా పొందారు. 1968లో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ (ప్రస్తుత టాటా స్టీల్)లో చేరడానికి భారతదేశానికి తిరిగి వచ్చారు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్కు అసిస్టెంట్గా పనిచేశారు. 1981లో బోర్డ్ ఆఫ్ టాటా స్టీల్లో చేరిన తరువాత 2001 నుండి ఒక దశాబ్దం పాటు నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కూడా ఉన్నారు. టాటా స్టీల్, టాటా సన్స్తో పాటు, డాక్టర్ ఇరానీ టాటా మోటార్స్ , టాటా టెలిసర్వీసెస్తో సహా పలు టాటా గ్రూప్ కంపెనీలకు డైరెక్టర్గా కూడా పనిచేశారు. 1963లో షెఫీల్డ్లోని బ్రిటీష్ ఐరన్ అండ్ స్టీల్ రీసెర్చ్ అసోసియేషన్తో కరియర్ ప్రారంభించారు. పరిశ్రమకు ఆయన సేవలకుగాను 2007లో విశిష్ట పురస్కారం పద్మభూషణ్ వరించింది. డాక్టర్ ఇరానీ మెటలర్జీ రంగంలో తన సేవలకు గుర్తింపుగా 2008లో భారత ప్రభుత్వంచే లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డును కూడా అందుకున్నారు. 1992-93కి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) జాతీయ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అతను డాక్టర్ ఇరానీకి భార్య డైసీ ఇరానీ, అతని ముగ్గురు పిల్లలు జుబిన్, నీలోఫర్, తనాజ్ ఉన్నారు. -
అవినీతి ఆరోపణలు: బుల్లెట్ ట్రైన్ బాస్పై వేటు
న్యూఢిల్లీ: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ అగ్నిహోత్రిని విధులనుంచి తొలగించింది కేంద్రం. నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్) ఎండీ సతీష్ సేవలను రైల్వే శాఖ రద్దు చేసినట్లు సీనియర్ అధికారులు నిన్న( గురువారం) తెలిపారు. అలాగే ప్రాజెక్ట్స్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్కు మూడు నెలల పాటు ఈ బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు. అధికార దుర్వినియోగం, నిధులను అక్రమంగా ప్రైవేట్ కంపెనీకి మళ్లించడం లాంటి అనేక ఆరోపణల నేపథ్యంలో అగ్నిహోత్రిపై ఈ చర్య తీసుకున్నట్టు చెప్పారు. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ సీఎండీగా తొమ్మిదేళ్ల పదవీకాలంలో ఒక ప్రైవేట్ కంపెనీతో కుదుర్చుకున్న "క్విడ్ ప్రోకో" డీల్ ఆరోపణలువెల్లువెత్తాయి. దీనిపై జూన్ 2న లోక్పాల్ కోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన నేపథ్యంలో ఆయననను తొలగించేందుకు నిర్ణయించినట్లు వారు తెలిపారు. అవినీతి నిరోధక చట్టం, 1988 కింద నేరం జరిగిందో లేదో నిర్ధారించుకోవడంతోపాటు, విచారణ నివేదికను ఆరు నెలల్లోగా లేదా డిసెంబర్ 12, 2022 లోపు సమర్పించాలని లోక్పాల్ సీబీఐని ఆదేశించింది. అలాగే అగ్నిహోత్రి పదవీ విరమణ చేసిన ఒక సంవత్సరంలోనే ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం తీసుకున్నారని కూడా అధికారులు ఆరోపించారు. రిటైర్డ్ అధికారులు కేంద్రం ఆమోదం లేకుండా పదవీ విరమణ తరువాత ఏడాది దాకా ఎలాంటి వాణిజ్య ఉద్యోగాలను స్వీకరించకూడదన్న ప్రభుత్వ నిబంధనను ఉల్లంఘించారని పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలపై అగ్నిహోత్రి అధికారికంగా స్పందించాల్సి ఉంది. మరోవైపు ఈ అరోపణలను అతని సన్నిహితులు తీవ్రంగా ఖండించారు. 1982 బ్యాచ్ ఐఆర్ఎస్ఈ అధికారి, అగ్నిహోత్రి 2021జూలై లో ముంబై, అహ్మదాబాద్ మధ్య ప్రతిష్టాత్మక బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ ఎన్హెచ్ఎస్ఆర్సిసీఎల్లో చేరారు. అంతకుముందు ఆర్వీఎన్ఎల్ సీఎండీగా ఉన్నారు. -
ఎస్బీఐ ఎండీగా అలోక్ చౌదరి
ముంబై: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రిటైల్ బిజినెస్, ఆపరేషన్స్ ఎండీగా అలోక్ చౌదరి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆయన ఎస్బీఐ ఫైనాన్స్ విభాగం డిప్యూటీ ఎండీగా పనిచేశారు. మానవ వనరుల విభాగం డిప్యూటీ ఎండీ, కార్పొరేట్ డెవలప్మెంట్ ఆఫీసర్గానూ గతంలో విధులు నిర్వర్తించారు. ఢిల్లీ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్గానూ పనిచేశారు. ప్రస్తుతం ఎస్బీఐ చైర్మన్గా దినేష్ ఖరా వ్యవహరిస్తున్నారు. అలోక్ చౌదరితోపాటు ఎండీలుగా సి.ఎస్.శెట్టి, జె.స్వామినాథన్, అశ్విని కుమార్ తివారి ఉన్నారు. చదవండి: SBI Life: గిల్ట్ ఫ్రీ మామ్స్.. ప్రత్యేకతలు ఇవే! -
సుందరం క్లేటాన్ ఎండీగా లక్ష్మి వేణు
న్యూఢిల్లీ: వాహన విడిభాగాల తయారీలో ఉన్న సుందరం క్లేటాన్ ఎండీగా లక్ష్మి వేణు నియమితులయ్యారు. కంపెనీలో ఇప్పటి వరకు ఆమె జాయింట్ ఎండీగా ఉన్నారు. అంతర్జాతీయంగా సంస్థ విస్తరణలో లక్ష్మి వేణు కీలక పాత్ర పోషించారు. కమిన్స్, హ్యుండాయ్, వోల్వో, ప్యాకర్, దైమ్లర్ తదితర కంపెనీలు సుందరం క్లేటాన్ క్లయింట్లుగా ఉన్నాయి. -
ఆర్బీఎల్ బ్యాంక్ తాత్కాలిక చీఫ్ బాధ్యతల పొడిగింపు
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగంలోని ఆర్బీఎల్ బ్యాంక్ తాత్కాలిక మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా (సీఈఓ) బాధ్యతలు నిర్వహిస్తున్న రాజీవ్ అహూజా పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 25వ తేదీ నుంచి మూడు నెలలు లేదా రెగ్యులర్ ఎండీ అండ్ సీఈఓ నియామకం జరిగే వరకూ ఏది ముందయితే దానికి వర్తించేలా ఆదేశాలు ఇస్తున్నట్లు బ్యాంకింగ్ రెగ్యులేటర్ పేర్కొంది. గత ఏడాది డిసెంబర్లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓ విశ్వవీర్ అహూజాను లీవ్పై పంపుతూ బ్యాంక్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది. అలాగే బ్యాంక్ రోజూవారీ కార్యకలపాల నిర్వహణకు తాత్కాలిక చీఫ్గా రాజీవ్ అహూజాకి పదోన్నతి ఇచ్చి, ఇందుకు ఆర్బీఐ ఆమోదాన్ని కోరింది. డిసెంబర్ 25 నుంచి మూడు నెలలు ఆయన బాధ్యతల్లో ఉండేలా ఆర్బీఐ ఆమోదం లభించింది. తన చీఫ్ జనరల్ మేనేజర్ యోగేష్ కే దయాల్ను ఆర్బీఐ బ్యాంక్ బోర్డ్లో నియమించినట్లు ఆర్బీఐ 2021 డిసెంబర్ 24 ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో అప్పటి ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్యాంక్ చీఫ్గా తన నియామకం తర్వాత డిసెంబర్ 26వ తేదీన మీడియా, ఇన్వెస్టర్లతో రాజీవ్ అహూజా మొట్టమొదటిసారి మాట్లాడుతూ, బ్యాంక్ ఆర్థికంగా పటిష్టంగా ఉందని తెలిపారు. డైరెక్టర్ల బోర్డు, ఆర్బీఐ నుంచి బ్యాంకుకు సంపూర్ణ మద్దతు ఉందని చెప్పారు. -
ఎవరెడీకి చైర్మన్, ఎండీలు బైబై
న్యూఢిల్లీ: డ్రై సెల్ బ్యాటరీలు, ఫ్లాష్లైట్ల తయారీ కంపెనీ ఎవరెడీ ఇండస్ట్రీస్ నాన్ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అదిత్య ఖైతాన్, ఎండీ అమృతాన్షు ఖైతాన్ తమ పదవులకు రాజీనామా చేశారు. ఎవరెడీ వాటాదారుల నుంచి 26 శాతం వాటా కొనుగోలుకి ఎఫ్ఎంసీజీ దిగ్గజం డాబర్ ప్రమోటర్లు బర్మన్ గ్రూప్ ఓపెన్ ఆఫర్ ప్రకటించిన నేపథ్యంలో వీరిరువురూ పదవులకు గుడ్బై చెప్పినట్లు కంపెనీ పేర్కొంది. షేరుకి రూ. 320 ధరలో 1.89 కోట్ల ఎవరెడీ షేర్ల కొనుగోలుకి వివిధ సంస్థల ద్వారా సోమవారం నుంచి బర్మన్ గ్రూప్ ఓపెన్ ఆఫర్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నేటి(3) నుంచి అమల్లోకి వచ్చే విధంగా ఆదిత్య, అమృతాన్షు బోర్డుకి రాజీనామాలు సమర్పించినట్లు ఎవరెడీ ఇండస్ట్రీస్ వెల్లడించింది. తద్వారా కొత్త యాజమాన్యం నేతృత్వంలో కంపెనీ లబ్ధి్ద పొందేందుకు వీలు కల్పించాలని వీరిరువురూ నిర్ణయించుకున్నట్లు తెలియజేసింది. తాత్కాలిక ఎండీగా.. ఆదిత్య, అమృతాన్షు ఖైతాన్ల రాజీనామాలను ఆమోదించిన బోర్డు కంపెనీ జేఎండీగా వ్యవహరిస్తున్న సువమాయ్ సాహాకు మధ్యంతర ఎండీగా బాధ్యతలు అప్పగించినట్లు ఎవరెడీ వెల్లడించింది. వివిధ సంస్థల ద్వారా ఎవరెడీలో 19.84 శాతం వాటా కలిగిన బర్మన్ గ్రూప్ గత వారం 5.26 శాతం అదనపు వాటాను సొంతం చేసుకోవడం ద్వారా సోమవారం ఓపెన్ ఆఫర్ను ప్రకటించిన విషయం విదితమే. బీఎం ఖైతాన్ గ్రూప్ నిర్వహణలోని ఎవరెడీ కొనుగోలుకి డాబర్ ప్రమోటర్లు బర్మన్ కుటుంబం ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎవరెడీలో బర్మన్ కుటుంబ వాటా 25.11 శాతానికి చేరింది. దీంతో నిబంధనల ప్రకారం ఓపెన్ ఆఫర్కు డాబర్ తెరతీసింది. ప్రస్తుతం ఎవరెడీలో ఖైతాన్ కుటుంబానికి 4.84 శాతం వాటా మాత్రమే ఉంది. ఈ వార్తల నేపథ్యంలో ఎవరెడీ షేరు ఎన్ఎస్ఈలో 2.2% బలపడి రూ. 357 వద్ద ముగిసింది. -
‘ఇది నా కంపెనీ.. నేనెందుకు బయటికి పోవాలి’
BharatPe MD Ashneer Grover Huge Demand Before Investors For Leaving Company: ఫిన్టెక్ కంపెనీ భారత్పేలో అవినీతి ఆరోపణలతో పాటు ప్రవర్తన తీరు సరిగా లేదన్న వ్యవహారంపై మేనేజింగ్ డైరెక్టర్ అష్నీర్ గ్రోవర్ మీద దర్యాప్తు నడుస్తోంది. లావాదేవీల్లో మోసాలు, ఆరోపణలపై సొంత టీంతో కాకుండా.. స్వతంత్ర విభాగాన్ని నియమించింది భారత్పే. ఈ తరుణంలో ఆయన్ను గద్దె దించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. అయితే.. తాను కంపెనీని వీడాలంటే.. 4 వేల కోట్ల రూపాయలు తన ముందు పెట్టాలని ఆయన ఇన్వెస్టర్లను డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఓ బిజినెస్ వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఆయన సంకేతాలు పంపించారు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ కొట్టిపారేసిన గ్రోవర్.. తనను ఇన్వెస్టర్లు గనుక బయటకు పంపాలనుకుంటే తన డిమాండ్లను నెరవేర్చాల్సిందేనని పట్టుబడుతున్నారు. భారత్పేలో గ్రోవర్కి 9.5 శాతం వాటా ఉంది. ప్రస్తుతం ఆయన సంపద విలువ 21 వేల కోట్ల రూపాయాలకు పైనే. ఇక భారత్పే కంపెనీ విలువ 6 బిలియన్ డాలర్లకు పైనే ఉంటుందన్నది ఒక అంచనా. ‘‘రాజీనామా చేసేంత తప్పు నేనేం చేశా?. నేను ఈ కంపెనీ ఎండీని. కంపెనీని నడిపిస్తోంది నేనే. ఒకవేళ బోర్డు గనుక నా అవసరం లేదనుకుంటే.. నన్ను ఎండీగా కొనసాగించడం ఇష్టం లేదనుకుంటే.. నాకు రావాల్సిన 4 వేల కోట్ల రూపాయలను టేబుల్ మీద పెట్టి.. తాళాలు తీసుకోవచ్చు. ఒకటి కంపెనీని నేనే నడిపించడమా? లేదా నాకు సెటిల్ మెంట్ చేసి బయటకు పంపించడమా? అంతేతప్ప.. మూడో ఆప్షన్ బోర్డు దగ్గర లేదు అని స్పష్టం చేశాడాయన. మరోవైపు ఆయన న్యాయపోరాటానికి సైతం సిద్ధమయ్యారు. ప్రస్తుతం సీఈవోగా ఉన్న సుహాయిల్ సమీర్ను పదవి నుంచి తప్పించాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నాడు కూడా. ఇదిలా ఉంటే.. నైకా ఐపీవోకి సంబంధించిన పెట్టుబడుల విషయంలో కొటాక్ మహీంద్ర బ్యాంక్తో భారత్పే ఎండీ అష్నీర్ గ్రోవర్కి వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో బ్యాంకుకు లీగల్ నోటీసులు పంపిన కొద్దిరోజులకే.. కొటక్ ఎంప్లాయి ఒకరిని ఫోన్లో బండబూతులు తిట్టాడు అష్నీర్. అందుకు సంబంధించిన క్లిప్ ఒకటి బయటకు రాగా.. ఈ వ్యవహారానికి సంబంధించి కొటక్ బ్యాంకు లీగల్ నోటీసులు పంపింది భారత్పేకు. ఈ పరిణామాలతో అష్నీర్ గ్రోవర్ కొన్నాళ్లపాటు సెలవుల మీద బయటకు వెళ్లగా.. తాజాగా ఆయన సెలవులను మార్చి 31 వరకు పొడిగించింది భారత్పే. దీంతో ఆయన ఉద్వాసన ఖాయమని అంతా భావించగా.. అలాంటిదేం లేదని కంపెనీ ప్రకటన ఇచ్చింది. ఆ కొద్దిరోజులకే ఆయన భార్య మాధురిని సైతం సెలవుల మీద పంపింది. ఈ గ్యాప్లో భారత్పే సీఈవో సుహాయిల్ సమీర్కు బాధ్యతలు అప్పజెప్పిన బోర్డు.. అష్నీర్ ఆయన భార్య మాధురి ఇద్దరూ ఫేక్ ఇన్వాయిస్లతో భారీ అవకతవకలకు పాల్పడ్డాడంటూ ఫోరెన్సిక్ అడిట్ కోసం అల్వరెజ్& మార్షల్, పీడబ్ల్యూసీలను నియమించి.. దాదాపుగా ఆయన ఉద్వాసనను ఖరారు చేసింది. -
భారత్పే ఎండీకి ఉద్వాసన! అసలేం జరుగుతోందంటే..
ఫిన్టెక్ కంపెనీ భారత్పే ఎండీ, సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్కు ఉద్వాసన దిశగా కంపెనీ నిర్ణయం తీసుకోనుందా? తాజా పరిణామాలు అవుననే సంకేతాలు ఇస్తున్నప్పటికీ.. తెర వెనుక వ్యవహారం మరోలా ఉందని తెలుస్తోంది. కొటక్ మహీంద్రా బ్యాంక్ ఉద్యోగిని ఫోన్కాల్లో దుర్భాషలాడుతూ.. అష్నీర్ గ్రోవర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక క్లిప్ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో న్యాయపరమైన చర్యలకు దిగిన కొటాక్ మహీంద్రా, భారత్పే ఎండీకి నోటీసులు సైతం పంపింది. దీంతో కంపెనీ అష్నీర్ను హడావిడిగా సెలవుల మీద బయటికి పంపింది. తాజాగా మార్చి చివరినాటి వరకు ఆయన సెలవుల్ని పొడిగిస్తున్నట్లు భారత్పే ఒక ప్రకటనలో పేర్కొంది. శాశ్వతంగా..? ‘ఇది పూర్తిగా అష్నీర్ తీసుకున్న నిర్ణయం.. కంపెనీ, ఉద్యోగులు, ఇన్వెస్టర్లు, కస్టమర్ల ప్రయోజనాల దృష్ట్యా అష్నీర్ నిర్ణయంతో మేం ఏకీభవిస్తున్నాం’ అని ప్రకటనలో పేర్కొంది కంపెనీ. అయితే అష్నీర్ లాంగ్ లీవ్ వెనుక బోర్డు ఒత్తిడి ఉన్నట్లు ఓ ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం అష్నీర్ స్థానంలో సీఈవో సుహాయిల్ సమీర్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా శక్తివంతమైన మేనేజ్మెంట్ టీంతో ముందుకు వెళ్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటన విడుదల చేయడం ఆసక్తిని రేకెత్తించింది. మరోవైపు సెలవుల పరిణామంపై స్పందించేందుకు అష్నీర్ విముఖత వ్యక్తం చేయడంతో.. భారత్పే ఎండీ ఉద్వాసన దాదాపు ఖరారైనట్లేనని జోరుగా ప్రచారం సాగుతోంది. అలాంటిదేం లేదు! 3 బిలియన్ డాలర్ల విలువ ఉన్న భారత్పేలో ఇలాంటి విషపూరిత సంప్రదాయం మంచిది కాదనే ఉద్దేశానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చినట్లు సమాచారం. బోర్డు సభ్యులతో పాటు ఇన్వెస్టర్లుగా సెకోయియా ఇండియా, రిబ్బిట్ క్యాపిటల్, కోవాట్యు మేనేజ్మెంట్తో పాటు పలువురు బ్యాంకింగ్ దిగ్గజాలు ఉన్నారు. వీళ్లంతా ప్రతిపాదించినందునే.. అష్నీర్ లాంగ్ లీవ్ మీద వెళ్లాడే తప్ప.. ఉద్వాసన లాంటి పరిణామం ఏం లేదని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపినట్లు ఓ ప్రముఖ మీడియాహౌజ్ కథనం ప్రచురించింది. ‘బోర్డుకు ఆయన్ని తొలగించే ఉద్దేశం లేదు. కానీ, మీడియా ఊహాగానాల్ని దూరం చేయాలన్న ఉద్దేశంతో మాత్రం ఉంది. ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత వ్యవహారం. ప్రొఫెషనల్కి సంబంధించింది కాదు’.. అంటూ బోర్డులోని ఓ కీలక సభ్యుడు వెల్లడించాడు. నైకా ఐపీవో సంబంధిత షేర్ల కేటాయింపులో కొటక్ మహీంద్రా బ్యాంక్ విఫలమైందని అష్నీర్ గ్రోవర్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఆపై 500 కోట్ల రూపాయలకు కొటక్ మహీంద్రా మీద దావా వేశారు. అంతటితో ఆగకుండా అష్నీర్, ఆయన భార్య మాధురి.. కాల్లో బ్యాంక్ ప్రతినిధిని అసభ్యంగా దూషించడంతో.. కొటక్ మహీంద్రా బ్యాంక్ లీగల్ నోటీసులు పంపింది. సంబంధిత వార్త: 500 కోట్ల పరిహారం.. ఆపై భార్యతో ఫోన్లో బండబూతులు! -
ఆర్థిక శాఖ అధికారులతో ఇన్ఫోసిస్ చీఫ్ భేటీ
న్యూఢిల్లీ: కొత్త ఆదాయపు పన్ను పోర్టల్ పనితీరు ఎలా ఉందన్న అంశంపై రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ ఇతర సీనియర్ అధికారులు ఇన్ఫోసిస్ మేనేజింగ్ డైరెక్టర్ సలీల్ పరేఖ్తో గురువారం ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పోర్టల్ ద్వారా 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ 3.5 కోట్ల మందికిపైగా పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేసినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఇన్ఫోసిస్ అభివృద్ధి చెందిన పోర్టల్’ www.incometax.gov.in పనితీరులో తొలినాళ్లలో తీవ్ర అవాంతరాలు నెలకొనడం తీవ్ర విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. పోర్టల్ అభివృద్ధికి 2019లో ఇన్ఫోసిస్కు కేంద్ర రూ.4,242 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చింది. 2019 జనవరి నుంచి 2021 జూన్ మధ్య రూ.164.5 కోట్లు చెల్లించింది. కాగా, 2020– 21 ఐటీఆర్ ఫైలింగ్కు తుది గడువు డిసెంబర్ 31. -
Gita Gopinath: అనూహ్య పరిణామం.. అంతర్జాతీయ వేదికపై మన ‘గీత’
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)లో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన గీతా గోపినాథ్కు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు గురువారం ప్రకటించారు. అంతర్జాతీయ సంస్థ ఐఎంఎఫ్కు ఇంతకుముందు తొలి ఉమెన్ ఛీఫ్ ఎకనమిస్ట్గా చరిత్ర సృష్టించిన గీతా గోపినాథ్.. ఇప్పుడు మరో ఘనత దక్కించుకున్నారు. ఏకంగా ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టబోతున్నారామె. ప్రస్తుతం ఈ అంతర్జాతీయ ఆర్థిక సంస్థకు నెంబర్ 2గా ఉన్నజియోఫ్రె విలియమ్ సెయిజి ఒకమోటో( ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్).. వచ్చే ఏడాది మొదట్లో బాధత్యల నుంచి తప్పుకోనున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆ స్థానాన్ని గీతా గోపినాథ్తో భర్త చేయనుంది ఐఎంఎఫ్. నిజానికి ఆమె వచ్చే ఏడాది జనవరిలో ఐఎంఎఫ్ను వీడి.. హర్వార్డ్ యూనివర్సిటీలో చేరతానని ప్రకటించుకున్నారు. కానీ, అనూహ్యంగా ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించింది ఐఎంఎఫ్. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కు మేనేజింగ్ డైరెక్టర్ పదవిలో 68 ఏళ్ల క్రిస్టలీనా జార్జియేవా(బల్గేరియా) కొనసాగుతోంది. ఇక ఇప్పుడు రెండో పొజిషన్లో గీతా గోపినాథ్(49) నియమితురాలయ్యింది. దీంతో కీలకమైన ఒక అంతర్జాతీయ ఆర్థిక విభాగపు కీలక బాధ్యతల్ని ఇద్దరు మహిళలు చూసుకోబోతున్నారన్నమాట. మైసూర్ టు వాషింగ్టన్ గీతా గోపినాథ్.. పుట్టింది డిసెంబర్ 8, 1971 కోల్కతా(కలకత్తా)లో. అయితే ఆమె చదువు మొత్తం మైసూర్ (కర్ణాటక)లో సాగింది. చిన్నతనంలో గీతాకు చదువంటే ఆసక్తే ఉండేది కాదట. ముఖ్యంగా ఎక్కాల్లో ఆమె సుద్దమొద్దుగా ఉండేదని గీత తల్లి విజయలక్క్క్ష్మి ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు కూడా. ఇక ఏడో తరగతి నుంచి చదువులో మెరుగైన ప్రతిభ కనబరుస్తూ వచ్చిన గీత.. ఫ్లస్ టు సైన్స్లో విద్యను పూర్తి చేసింది. అయితే డిగ్రీకొచ్చేసరికి తనకు ఏమాత్రం సంబంధం లేని ఎకనమిక్స్ను ఎంచుకుని పేరెంట్స్ను సైతం ఆశ్చర్యపరిచిందామె. ఢిల్లీలోనే బీఏ, ఎంఏ ఎకనమిక్స్ పూర్తి చేసి.. ఆపై వాషింగ్టన్లో మరో పీజీ, ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా అందుకుంది. ఈ రీసెర్చ్కి గానూ ఆమెకు ప్రిన్స్టన్ వుడ్రో విల్సన్ ఫెలోషిప్ రీసెర్చ్ అవార్డు అందుకుంది. ఆపై చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేశారామె. కీలక బాధ్యతలెన్నో.. 2018, అక్టోబర్లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కు ఛీఫ్ ఎకనమిస్ట్గా గీతా గోపీనాథ్ నియమించబడింది. అంతేకాదు ఐఎంఎఫ్లో కీలక బాధ్యతలు చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తి కూడా ఆమెనే!. ఇక ఆ పదవిలో కొనసాగుతూనే.. ఇంటర్నేషనల్ ఫైనాన్స్కు కో డైరెక్టర్గా, నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనమిక్ రీసెర్చ్లో మాక్రోఎకనమిక్స్ ప్రొగ్రామ్ను నిర్వహించారామె. ఇంతేకాదు ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్లో ఎకనమిక్ అడ్వైజరీ ప్యానెల్లో సభ్యురాలిగా, కేరళ ముఖ్యమంత్రికి ఆర్థిక సలహాదారుగా, ఈ ఏడాది జూన్లో వరల్డ్ బ్యాంక్-ఐఎంఎఫ్ హైలెవల్ అడ్వైజరీ గ్రూపులో కీలక సభ్యురాలిగా వ్యవహరించారు. గౌరవాలు 2011లో యంగ్ గ్లోబల్ లీడర్గా వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ నుంచి అవార్డుతో పాటు 2019లో భారత సంతతి వ్యక్తి హోదాలో ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారం అందుకున్నారామె. కరోనా సంక్షోభంలో ఐఎంఎఫ్ తరపున ఆమె అందించిన సలహాలు, కార్యనిర్వహణ తీరు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. వ్యక్తిగత జీవితం గీతా గోపీనాథ్ భర్త ఇక్బాల్ సింగ్ ధాలివాల్.. మాజీ ఐఏఎస్ ఈయన. 1995 ఏడాది సివిల్స్ పరీక్షల్లో ఫస్ట్ ర్యాంకర్ ఆయన. కొంతకాలం విధులు నిర్వహించి.. ఆపై ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈయన కూడా ఆర్థిక మేధావే. ప్రస్తుతం మస్సాచుషెట్స్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్, జే-పాల్లో ఎకనమిక్స్ విభాగంలో గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ జంటకు ఒక బాబు.. పేరు రోహిల్. గీతా గోపినాథ్కు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియాతో పాటు అమెరికన్ పౌరసత్వం కూడా ఉంది. -సాక్షి, వెబ్స్పెషల్ -
భారత్ ఫైనాన్షియల్ ఎండీ, ఈడీల రాజీనామా
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఇండస్ఇండ్ బ్యాంక్లో భాగమైన భారత్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ (బీఎఫ్ఐఎల్) మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), సీఈవో శలభ్ సక్సేనా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.. సీఎఫ్వో ఆశీష్ దమానీ తమ పదవులకు రాజీనామా చేశారు. పోటీ కంపెనీ అయిన సూక్ష్మ రుణాల సంస్థ స్పందన స్ఫూర్తిలో (ఎస్ఎస్ఎఫ్ఎల్) వారు చేరనున్నట్లు సమాచారం. సక్సేనా, దమానీ నవంబర్ 25న తమ తమ పదవులకు రాజీనామా చేసినట్లు ఎక్సే్చంజీలకు బీఎఫ్ఐఎల్ సోమవారం తెలియజేసింది. తాత్కాలికంగా ఈడీ హోదాలో జే శ్రీధరన్ను, రోజు వారీ కార్యకలాపాల పర్యవేక్షణకు శ్రీనివాస్ బోనం ను నియమించినట్లు పేర్కొంది. సక్సేనా, దమానీల విషయంలో కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతోంది. సక్సేనాను ఎండీ–సీఈవోగా, దమానీని ప్రెసిడెంట్–సీఎఫ్వోగా నియమించినట్లు ఎస్ఎఫ్ఎఫ్ఎల్ నవంబర్ 22న ప్రకటించింది. అయితే, వారు తమ సంస్థలో రాజీనామా చెయ్యలేదంటూ ఆ మరుసటి రోజైన నవంబర్ 23న బీఎఫ్ఐఎల్ తెలిపింది. ఒకవేళ చేస్తే.. నిర్దిష్ట షరతులకు అనుగుణం గా వారు వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొంది. నోటీసు పీరియడ్, పోటీ సంస్థలో చేరకూడదు వంటి నిబంధనలు పాటించాల్సి ఉంటుందని వివరించింది. అప్పటికైతే మాత్రం వారిద్దరూ తమ సంస్థలోనే కొనసాగుతున్నారని బీఎఫ్ఐఎల్ స్పష్టం చేసింది. కస్టమర్ల సమ్మతి లేకుండా సాంకేతిక లోపం వల్ల 84,000 రుణాలు మంజూరైన అంశంపై సమీక్షలో సహకరిస్తామంటూ వారు చెప్పినట్లు పేర్కొంది. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో సక్సేనా, దమానీకి వర్తింపచేసే నిబంధనల అమలుపై బీఎఫ్ఐఎల్ వివరణ ఇవ్వలేదు. -
అశోక్ లేలాండ్ ఎండీ రాజీనామా
న్యూఢిల్లీ: హిందూజా గ్రూప్నకు చెందిన వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ ఎండీ, సీఈవో విపిన్ సోంధి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తన పదవి నుంచి తప్పుకున్నట్టు ఆయన తెలిపారు. డిసెంబర్ 31 వరకు ఆయన పదవీ కాలం కొనసాగనుంది. ధీరజ్ హిందూజా కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా బాధ్యతలను చేపట్టారు. ప్రస్తుతం ఆయన నాన్–ఎగ్జిక్యూటివ్, నాన్–ఇండిపెండెంట్ డైరెక్టర్–చైర్పర్సన్గా ఉన్నారు. తదుపరి ఎండీ, సీఈవో ఎంపిక కోసం బోర్డు త్వరలో సమావేశం కానుందని అశోక్ లేలాండ్ వెల్లడించింది. -
చైనాకు ఊడిగం.. ఆమెకు పదవీగండం
డబ్ల్యూటీవో రూల్స్ను విస్మరించి.. ప్రపంచ మార్కెట్ను శాసించాలనే చైనా అత్యాశ వాళ్ల పీకకే చుట్టుకుంది. డూయింగ్ బిజినెస్ ర్యాకింగ్లో పైరవీల ద్వారా మెరుగైన ర్యాంక్ సంపాందించిన వ్యవహారం బట్టబయలు కావడంతో చైనా నవ్వుల పాలైన విషయం తెలిసిందే. ఈ తరుణంలో.. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలీనా జార్జియేవా(68)కు పదవీగండం పట్టుకుంది. గతంలో చైనాకు ఊడిగం చేశారన్న ఆరోపణలపై చేపట్టిన దర్యాప్తులో ఆమె పాత్ర దాదాపు ఖరారైనట్లే!. దీంతో ఆమెను కొనసాగించడమా? తీసేయడమా? అనే నిర్ణయం ఇప్పుడు ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ బోర్డు చేతుల్లో ఉంది. చైనాకు మెరుగైన ర్యాంకింగ్ లభించేలా వరల్డ్ బ్యాంక్ సిబ్బందిపై ఒత్తిడి తెచ్చారని, డేటాను మార్చేశారని క్రిస్టలీనా (ఆ టైంలో ఆమె సీఈవోగా ఉన్నారు) ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో అప్పటి వరల్డ్ బ్యాంక్ మాజీ ప్రెసిడెంట్ జిమ్ యోంగ్ కిమ్ హస్తం ఉందని తేలింది. డూయింగ్ బిజినెస్ ర్యాకింగ్లో చైనా పైరవీల వ్యవహారం ఆరోపణలపై వరల్డ్ బ్యాంక్ ఎథిక్స్ కమిటీ దర్యాప్తు చేసింది. మరోవైపు విల్మెర్హేల్ లీగల్ సంస్థ దర్యాప్తులోనూ ఆమెపై ఆరోపణలు నిజమని నిరూపితంకాగా, గురువారం ఆ ఆరోపణల్ని ఖండిస్తూ ఐఎంఎఫ్ బోర్డ్ మెంబర్స్కు లేఖ రాసింది క్రిస్టలీనా. పైగా ఫ్రాన్స్, యూరోపియన్ దేశాల నుంచి ఆమెకు మద్దతు లభిస్తోంది. ఈ తరుణంలో తొందరపాటు నిర్ణయంగా కాకుండా.. ఆమెను పదవిలో కొనసాగించాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకునేందుకు సోమవారం నుంచి వరుస భేటీలు కానున్నాయి వరల్డ్బ్యాంక్, ఐఎంఎఫ్ బోర్డులు. డూయింగ్ బిజినెస్ ర్యాకింగ్స్లో.. చైనా 2018 ఏడాదికి(హాంకాంగ్తో కలిసి ఐదవ స్థానం-వ్యక్తిగతంగా 78వ స్థానం, 2020లో హాంకాంగ్తో కలిసి మూడవ స్థానం-వ్యక్తిగతంగా 31వ స్థానానికి ఎగబాకింది. అయితే 2018, 2020తో పాటు మధ్యలో 2019లోనూ చైనా ఫేక్ ర్యాంకులు దక్కించుకుందనేది ప్రపంచ బ్యాంక్ అంతర్గత దర్యాప్తు సంస్థ వెల్లడించిన అంశం. చదవండి: చైనా మెడకు బిగుస్తున్న ఉచ్చు.. పాక్ పాత్ర కూడా! -
ఆర్టీసీ ఉద్యోగులకు 1నే జీతాలు!
సాక్షి, హైదరాబాద్: ఇక నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తారీఖునే జీతాలు అందేలా సంస్థ ఆర్థిక స్థితిని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తానని ఆర్టీసీ కొత్త ఎండీ వీసీ సజ్జనార్ భరోసా ఇచ్చారు. ప్రస్తుతం సంస్థ ఆర్థిక పరిస్థితి సరిగా లేక రాష్ట్ర ప్రభుత్వ సాయంపై ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు. వీలైనంత త్వరలో ప్రభుత్వంపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా స్వయం సమృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆర్టీసీకి ఎండీగా నియమితులైన సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్, బస్భవన్లోని తన చాంబర్లో శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. తర్వాత ఖైరతాబాద్లోని ట్రాన్స్పోర్టు భవన్లో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ను మర్యాద పూర్వకంగా కలిశారు. బస్భవన్కు తిరిగొచ్చి మీడియాతో మాట్లాడారు. డీజిల్ ధరల పెరుగుదలతో పెనుభారం ‘గత రెండేళ్ల కాలంలో లీటరు డీజిల్పై రూ.22 పెరుగుదల నమోదైంది. ఇది ఆర్టీసీపై పెనుభారాన్ని మోపింది. అలాగే బస్సులకు వాడే విడిభాగాల ధరలు కూడా పెరిగాయి. రోజువారీ ఆదాయ వ్యయాల్లో రూ.8 కోట్ల వ్యత్యాసం కనిపిస్తోంది. దీన్ని వెంటనే సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ఇది జరగాలంటే సంస్థ ఆదాయం పెరగాలి. అది టికెట్ ద్వారా సాధించాలా, లేదా కార్గో విభాగం లాంటి ప్రత్యామ్నాయాల ద్వారా పొందాలా అన్నది ఆలోచిస్తాం. ఆర్టీసీ ఆదాయం ఎలా పెంచుకోవాలన్న దానిపై శాస్త్రీయ అధ్యయనం జరిపేందుకు ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ అధ్యయనంలో తేలిన అంశాల ఆధారంగా చర్యలు తీసుకుంటాం’అని సజ్జనార్ తెలిపారు. మూడు లక్ష్యాలు సాధించేలా.. ‘ప్రజలు ఆర్టీసీ బస్సులను ఆదరించి దాని ఆదా యం పెరిగేందుకు సహకరించాలి. సురక్షితమైన ప్రయాణం చేయాలి. స్వయం సమృద్ధి సాధించ టం, ప్రయాణికులు సంతృప్తి చెందేలా సేవలందించటం, ఉద్యోగుల సంక్షేమం.. ఈ మూడు లక్ష్యాలు సాధించేలా పని ప్రారంభిస్తున్నాం. ఆర్టీసీని సంస్కరించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో మాజీ అధికారులతో కూడా మాట్లాడుతున్నాం. వారి సూచనలు కూడా పరిగణనలోకి తీసుకుంటాం..’అని చెప్పారు. సంక్షేమ మండళ్ల వైపే మొగ్గు గతంలో ఆర్టీసీ సమ్మె సమయంలో కార్మిక సంఘాల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రెండేళ్లపాటు వాటిని దూరం పెట్టిన విషయం తెలిసిందే. రెండేళ్లు గడిచినా మళ్లీ కార్మిక సంఘాలను గుర్తించలేదు. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల దిశగా చర్యలు తీసుకోలేదు. కార్మిక సంఘాలకు ఉద్యోగులు దూరంగా ఉండేలా చూస్తోంది. అందులో భా గంగా డిపో స్థాయిలో ఉద్యోగులకు సంక్షేమ మండళ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సజ్జనార్ కూడా సంక్షేమ మండళ్లవైపే మొగ్గు చూపు తున్నారు. కార్మిక సంఘాల గురించి ప్రశ్నించగా, ప్రస్తుతం డిపోల్లో సంక్షేమ మండళ్లు అందుబాటులో ఉన్నందున వాటితోనే కార్మికుల సంక్షేమంపై చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే బస్సుల వివరాలు ప్రయాణికులకు తెలిసేలా జీపీఎస్ ఆధారిత ఆధునిక సాంకేతిక వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఎర్ర తివాచీ స్వాగతం సజ్జనార్కు అధికారులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. బస్భవన్ ప్రాంగణమంతా ఆయన మినీ కటౌట్లు, పూల అలంకరణలతో ముస్తాబు చేశారు. ప్రధాన ద్వారం నుంచి లోపలివరకు ఎర్ర తివాచీ పరిచి దాని మీదుగా నడిచివచ్చేలా ఏర్పాటు చేశారు. దారికి రెండువైపులా ఉద్యోగులు నిలబడి పూలను చల్లుతూ ఆహ్వానం పలికారు. కాగా అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల ప్రతినిధులతో సజ్జనార్ విడివిడిగా భేటీ అయ్యారు. ఉదయం నుంచి రాత్రి వరకు బస్భవన్లోనే గడిపిన ఆయన.. రాత్రి తన కార్యాలయానికి వచ్చిన కుటుంబసభ్యులను అధికారులకు పరిచయం చేశారు. -
అరెస్ట్ చేయనంటేనే పోలీసుల ఎదుటకు వస్తాను: ట్విట్టర్ ఎండీ
బెంగళూరు: తనను అరెస్ట్ చేయరని గ్యారంటీ ఇస్తే.. ఉత్తరప్రదేశ్ పోలీసుల ఎదుటకు వస్తానని సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ ఇండియా ఎండీ మనీశ్ మహేశ్వరి మంగళవారం కర్ణాటక హైకోర్టుకు తెలిపారు. ఘజియాబాద్లో ఓ ముస్లిం వృద్ధుడిపై దాడి చేసిన వీడియో వైరల్ కావడంతో మనిష్ మహేశ్వర్పై యూపీ ఘజియాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మనిష్ మహేశ్వర్ ఈ నోటీసులకు వ్యతిరేకంగా కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా మనిష్ మహేశ్వర్ ‘‘వారు(యూపీ పోలీసులు) నాపై చేయి వేయబోమని కోర్టుకు అండర్టేకింగ్ ఇస్తే.. నేను వ్యక్తిగతంగా పోలీసులు ఎదుట హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని తెలిపారు. ఇక ముస్లిం వృద్ధుడిపై దాడి చేసిన వీడియో మత ఘర్షణలను ప్రేరేపించేలా ఉందంటూ ట్విట్టర్ ఎండీ మనీశ్కు ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ పోలీసులు కొద్ది రోజుల క్రితం నోటీసులిచ్చారు. తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయితే, తాను వర్చువల్ పద్ధతిలో హాజరవుతానని మనీశ్ జవాబివ్వగా అందుకు ఘజియాబాద్ పోలీసులు నిరాకరించారు. -
మారుతి మాజీ ఎండీ కన్నుమూత: ఇండస్ట్రీ దిగ్భ్రాంతి
సాక్షి,ముంబై: ఆటోమోటివ్ సేల్స్ అండ్ సర్వీస్ కంపెనీ కార్నోషన్ వ్యవస్థాపకుడు, మారుతి సుజుకి మాజీ మేనేజింగ్ డైరెక్టర్ జగదీష్ ఖత్తర్ (78) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా సోమవారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. 1993-2007 కాలంలోఖత్తర్ మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఖత్తర్ పనిచేశారు. తరువాత 1999లో తొలుత ప్రభుత్వ నామినీగా, అనంతరం మే 2002 లో సుజుకి మోటార్ కార్పొరేషన్ నామినీ ఎండీ గా పనిచేశారు.ఖత్తర్ ఆటోమొబైల్ రంగంలో స్వతంత్ర మల్టీ-బ్రాండ్ పాన్ ఇండియా సేల్స్ అండ్ సర్వీస్ నెట్వర్క్ను కార్నేషన్ ఆటోను 2008 లో ప్రారంభించారు. దీనికి ముందు దాదాపు 37 సంవత్సరాల పాటు ఐఎఎస్ అధికారిగా పనిచేశారు. ఖత్తర్ మరణ వార్తను మారుతి సుజుకి చైర్మన్ ఆర్.సి.భార్గవ ధృవీకరించారు. ఆయన హఠాన్మరణంవ్యక్తిగతంగా తనకు తీరని నష్టమని వ్యాఖ్యానించారురు. ఖత్తర్ అకాలమరణంటో ఆటో పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. చదవండి: కోవిడ్ సంక్షోభం: సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల సాయం ప్రపంచంలో ఎనిమిదో అద్భుతం.. కాంపౌండింగ్ -
‘మాతృభూమి’ వీరేంద్రకుమార్ మృతి
కోజికోడ్/వయనాడ్: రాజ్యసభ సభ్యుడు, మలయాళ దిన పత్రిక ‘మాతృభూమి’మేనేజింగ్ డైరెక్టర్ ఎం.పి. వీరేంద్ర కుమార్(83) గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన మృతికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తదితర ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయనకు భార్య ఉష, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వయనాడ్ జిల్లా కల్పెట్టలో శుక్రవారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పీటీఐ)కు మూడు పర్యాయాలు చైర్మన్గా పనిచేసిన వీరేంద్రకుమార్ ప్రస్తుతం పీటీఐ బోర్డు డైరెక్టర్గా కొనసాగుతున్నారు. 2003–2004 కాలంలో ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీకి ప్రెసిడెంట్గా కూడా ఆయన వ్యవహరించారు. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డుకు ఎంపికైన ‘హైమవతభువిల్’వంటి 15కు పైగా పుస్తకాలను వీరేంద్ర రచించారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన ఆయన 1987లో ఈకే నయనార్ మంత్రి వర్గంలో విద్యుత్ మంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలోని అడవుల్లో చెట్ల నరికివేతపై నిషేధం విధిస్తూ తొలి ఉత్తర్వులు జారీ చేశారు. అవి వివాదమవడంతో రాజీనామా చేశారు. కోజికోడ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎన్నికై ఐకే గుజ్రాల్, హెచ్డీ దేవెగౌడ కేబినెట్లలో బాధ్యతలు నిర్వహించారు. -
మరో రెండేళ్లు పొడిగింపు
న్యూఢిల్లీ: లిస్టైన కంపెనీల సీఎమ్డీ (చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్) పదవి విభజన గడువును మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ మరో రెండేళ్లు పొడిగించింది. ఈ మేరకు కంపెనీల నుంచి వచ్చిన వినతులను సెబీ మన్నించింది. సెబీ నిబంధనల ప్రకారం, మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా అగ్రశ్రేణి 500 లిస్టెడ్ కంపెనీలు సీఎమ్డీ పదవిని చైర్మన్గా, ఎమ్డీగా విభజించాల్సి ఉంది. దీనికి గడువును ఈ ఏడాది ఏప్రిల్ 1గా నిర్ణయించింది. లిస్టెడ్ కంపెనీల్లో కార్పొరేట్ గవర్నెన్స్ను మెరుగుపరచడం లక్ష్యంగా, కోటక్ కమిటీ సూచనల మేరకు సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ గడువును మరో రెండేళ్లపాటు పొడిగించాలని తాజాగా సెబీ నిర్ణయించింది. గడువు పొడిగింపునకు సంబంధించిన కారణాలను సెబీ వెల్లడించలేదు. అయితే ప్రస్తుత ఆర్థిక మందగమన కాలంలో సీఎమ్డీ పదవిని రెండుగా విభజించడం ఒకింత భారంతో కూడుకున్నదని, ఈ గడువును పొడిగించాలని పలు కంపెనీలు విన్నవించడంతో సెబీ గడువును పొడిగించిందని సమాచారం. ప్రస్తుతం టాప్ 500 లిస్టెడ్ కంపెనీల్లో సగం మాత్రమే సీఎమ్డీ పదవిని రెండుగా విభజించాయని స్టాక్ ఎక్సే్చంజ్ల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పలు కంపెనీలు ఈ రెండు పదవులను కలిపేశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీసీఎల్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, విప్రో, హీరో మోటోకార్ప్, తదితర కంపెనీల్లో ఈ రెండు బాధ్యతలను ఒక్క వ్యక్తే నిర్వహిస్తున్నారు. -
రూ.500 కోట్లు దాటిన ‘పెప్స్’ వ్యాపారం
సాక్షి బెంగళూరు: వ్యాపారంలో ఎంతమందికి చేరువయ్యామన్నదే ప్రధానమని పెప్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ కె.మాధవన్ చెప్పారు. సంస్థ 14వ వార్షికోత్సవం సందర్భంగా గురువారమిక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... శరీరానికి నిద్ర ప్రధానం కాబట్టి ఎలాంటి పరుపు కొనాలనే దానిపై ప్రస్తుతం ఎందరినో సంప్రదించాల్సి వస్తోందని చెప్పారు. గత 14 ఏళ్లలో దేశ వ్యాప్తంగా లక్షల మంది పెప్స్ పరుపులు కొన్నారని తెలియజేశారు. రూ.4 కోట్లతో వ్యాపారం ప్రారంభించగా.. 14 ఏళ్లలో రూ.500 కోట్లకు చేరామని చెప్పారాయన. ‘‘కొత్త పరుపు కొనడంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. పరుపు ఎత్తు కీలకం. నేలమట్టం నుంచి 24 అంగుళాల ఎత్తులో ఉండటం శ్రేయస్కరం’’ అని వివరించారు. పరుపులు పాతబడిన వెంటనే మార్చుకోవాలని.. పదేళ్లకు మించి వినియోగించరాదని సూచించారు. భారతదేశంలో కోల్కతా, కోయంబత్తూరు, ఢిల్లీ, పుణేలో ఉత్పత్తి కేంద్రాలున్నాయని తెలియజేశారు. గ్రామ స్థాయి వరకు చేరవేయడమే లక్ష్యం పెప్స్ పరుపులను పట్టణాల నుంచి గ్రామ స్థాయి వరకు చేరవేయడమే లక్ష్యమని పెప్స్ ఇండస్ట్రీస్ జేఎండీ జి.శంకర్రామ్ చెప్పారు. తెలంగాణలో హైదరాబాద్తో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో పెప్స్ శాఖలు ప్రాచుర్యం పొందాయని, ఏపీలో కోస్తా ప్రాంతంలో వ్యాపారం బాగుందని చెప్పారు. రాయలసీమలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రస్తుతం విదేశీ మెటీరియల్పై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నా.. పెప్స్ పరుపులకు మాత్రం ఆదరణ తగ్గలేదని చెప్పారాయన. -
ప్రభుత్వ రంగ బ్యాంకులకు కొత్త సీఈఓలు
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు కొత్తగా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లను (ఎండీ–సీఈఓ) బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో (బీబీబీ) బుధవారం సిఫారసు చేసింది. ఈ మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులకూ వరుసగా సంజీవ్ చద్దా, ఎల్.వి.ప్రభాకర్, అతనూ కుమార్ దాస్ పేర్లను సూచించింది. మంగళవారం జరిగిన ఇంటర్వ్యూల్లో వీరి పేర్లను ఖరారు చేశామని, ప్రతిభ ఆధారంగా తుది జాబితాను రూపొందించామని వెల్లడించింది. చద్దా ప్రస్తుతం ఎస్బీఐ కాపిటల్ మార్కెట్స్ ఎండీ – సీఈఓగా ఉండగా.. ప్రభాకర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈడీగా, దాస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈడీగా ఉన్నారు. ఇక రిజర్వ్ జాబితాలో.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు ఎండీ–సీఈఓగా ఎ.ఎస్.రాజీవ్, కరూర్ వైశ్య బ్యాంక్కు పీ ఆర్ శేషాద్రి పేర్లను ప్రకటించింది. -
శాప్ సింధు
సింధు కోసం అంతమంది జర్మన్ ఉద్యోగులు ఇంగ్లిష్ మాట్లాడ్డం నేర్చుకున్నారంటే సింధులో తప్పకుండా ఏదో ప్రత్యేకత ఉండి ఉండాలి. ఏమిటది? ‘‘రాస్కో సాంబా’’ అంటుంటాడు పవన్ కల్యాణ్.. ‘గబ్బర్సింగ్’ సినిమాలో. సాంబా ఎవరంటే అలీ. రాస్కోవడం ఏంటంటే.. పవన్ టక్కున ప్రవచనం లాంటిదేదో మాట వదులుతాడు. దాన్ని నోట్ చేసుకోవాలి.. ‘రాస్కో సాంబా’ అనగానే అలీ. ఫన్నీగా ఉంటుంది సినిమా మొత్తం రిపీట్ అవుతూ ఉండే ఆ సీన్. సింధూ గంగాధరన్కీ ఒక సాంబా ఉన్నాడు. ఆ సాంబా.. మనిషి కాదు. చిన్న పుస్తకం. అధాటున తనకు వచ్చిన ఆలోచనల్ని.. చేస్తున్న పని ఆపి మరీ.. అందులో నోట్ చేసుకుంటుంటారు సింధు! అదొక అలవాటు ఆమెకు. అవన్నీ కలిపి ఎప్పటికో పుస్తకం వేస్తారట. అలాగని సింధు రైటర్ కాదు. మొన్నటివరకు ‘శాప్ ల్యాబ్స్ ఇండియా’ ఉద్యోగి. ఇప్పుడు అదే సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్. ‘శాప్’ అంటే.. సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రాడక్ట్స్. జర్మన్ కంపెనీ. శాప్ ఇండియా హెడ్డాఫీస్ బెంగళూరులో ఉంది. అందులోనే సింధు ఇప్పుడు ఎండీ. 8000 మందిని ఆమె లీడ్ చెయ్యాలి! జర్మన్ టెక్ జెయింట్ కంపెనీ ‘శాప్’ ఎండీ అయిన తొలి మహిళ ఆమె. బెంగళూరు యూనివర్సిటీ నుంచి బయటికి వచ్చీ రాగానే 1999లో బెంగళూరులోని ‘శాప్ లాబ్స్’లో చేరిపోయారు సింధు. కొన్నాళ్లకే కంపెనీ ఆమెను జర్మనీలోకి లాగేసుకుంది. పెద్ద పొజిషన్, పెద్ద జీతం. పద్దెనిమిదేళ్లు అక్కడే పనిచేసి ఈ ఏడాదే ఇండియాకు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఈ సెప్టెంబర్లో ఎం.డి.గా చార్జి తీసుకున్నారు. సింధుకు ఇద్దరు పిల్లలు. ఇలాంటి వాళ్లకు ఎప్పుడూ ఎదురయ్యే ఒక ప్రశ్న ఉంటుంది కదా.. ‘కుటుంబాన్నీ, వర్క్ లైఫ్నీ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు?’ అని! ఈ మాటకు పెద్దగా నవ్వేస్తారు సింధు. ‘‘ఎప్పటి మాట!’’ అంటారు. ‘‘దేని దారి దానిదే, దేని గోల్ దానిదే’’ అనేస్తారు. ‘ఆఫీస్లో ఒక ఉమన్ లీడ్ చేస్తోందే అనే ఫీలింగ్ మగ ఉద్యోగులలో కనిపిస్తుందా?’’ అని ఆటోమేటిక్గా ఇంకో ప్రశ్న. దీనికీ సింధు దగ్గర చక్కటి సమాధానమే ఉంది. ‘‘లీడర్ లేడీ అయినా, పురుషుడైనా.. వాళ్లేం మాట్లాడుతున్నారో వాళ్లకు పూర్తిగా తెలుసు అనే భావన టీమ్ సభ్యులలో కలిగితే కనుక.. పైన ఉన్నది ఆడా, మగా అనేది పోయి వాళ్ల కళ్లల్లో ‘లీడర్’ ఒక్కరే మిగులుతారు’’ అంటారు సింధు. అది ఆమె అనుభవం కూడా. జర్మనీలోనే సింధుకు ఇంకో అనుభవం ఎదురైంది. జర్మన్లు జర్మన్ భాషను మాత్రమే మాట్లాడతారు. ఇంగ్లిష్ మాట్లాడ్డం తక్కువ. అంత పెద్ద శాప్ కంపెనీలోనూ అదే వరస. సింధుకు జర్మనీ రాదు. టీమ్లో సభ్యులు చాలామందికి ఇంగ్లిష్ రాదు. ఎలా బండి నడవడం! ‘యు మస్ట్..’ అంటూ ఇంగ్లిష్ మాట్లాడ్డం నేర్చుకొమ్మని సింధు వాళ్లకేమీ ఆర్డర్ వేయలేదు. తనే జర్మన్ని నేర్చుకోవడం మొదలు పెట్టారు. ఈ మధ్యలో చిన్న బ్రేక్ వచ్చింది. మెటర్నిటీ బ్రేక్. సింధు ఇండియా వచ్చి వెళ్లే లోగా టీమ్లో అంతా ఇంగ్లిష్ మాట్లాడ్డం మొదలు పెట్టారు! కేవలం తమ బాస్ కోసం (అప్పటికే చిన్నపాటి బాస్ అయిపోయారు సింధు) స్పోకెన్ ఇంగ్లిష్లో కసరత్తు చేశారు. అది చాలా బాగా అనిపించింది సింధుకు. సంస్కృతులు ఎంత వేరైనా, కలుపుకునే మనుషులుంటే ప్రపంచమంతటా ఒకే సంస్కృతిలా అనిపిస్తుంది. సింధును వాళ్లు కలుపుకున్నారు. ఆఫీస్లో కొంతమంది అడిగేవారట.. ‘‘మేడమ్.. ఇండియాలో ఆడపిల్లగా పెరగడం వల్ల ప్రత్యేక పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు మీకు అనిపిస్తుంటుందా?!’’ అని. అలాంటిదేమీ లేదని అంటారు సింధు. సింధుకు ఇద్దరు అన్నదమ్ములు. వాళ్లను ఏ ఆశలతోనైతే పెంచారో సింధునూ అవే ఆశలతో పెంచారు ఆమె తల్లిదండ్రులు. సింధు ఇప్పుడు ఇంత పెద్ద పొజిషన్లో ఉండటానికి అది కూడా ఒక కారణం. అన్నట్లు.. సింధులోని ప్రత్యేకత ఏమిటని కదా అనుకున్నాం! ఏ కల్చర్లోనికైనా వెంటనే ఆమె తనని తాను మలుచుకుంటారు. అలాగని తన కల్చర్ని రూపుమాసిపోనివ్వరు. -
ఏపీఎస్ఆర్టీసీ నూతన ఎండీగా సురేంద్ర
-
ఎస్బీహెచ్ కొత్త ఎండీగా మణి పల్వేశన్
సాక్షి, హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా మణి పల్వేశన్ బాధ్యతలు స్వీకరించారు. శనివారంనాడే ఆయన బాధ్యతలు స్వీకరించినట్లు సోమవారం బ్యాంకు ఒక ప్రకటనలో తెలియజేసింది. మణి పల్వేశన్ 1982లో ఎస్బీఐహెచ్లో ప్రొబేషనరీ అధికారిగా చేరారు. అప్పటి నుంచి బ్యాంకులోని వివిధ విభాగాల్లో పనిచేశారు. ఈ బాధ్యతలు చేపట్టకముందు ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హాంకాంగ్ బ్రాంచ్కు అక్కడే సీఈఓగా పనిచేశారు. అంతకుముందు ఎస్బీఐ క్యాప్ సెక్యూరిటీస్ ఎండీగా, ముంబయిలోని డీఎండీ కార్యాలయంలో చీఫ్ జనరల్ మేనేజరుగా కూడా పనిచేశారు. -
మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తపై చీటింగ్ కేసు
నంద్యాల: అనంతపురం జిల్లా గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే, నంద్యాల చక్కెర ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ మధుసూదన్గుప్తపై కర్నూలు జిల్లా నంద్యాలలో చీటింగ్ కేసు నమోదయింది. రూరల్ ఎస్ఐ గోపాల్రెడ్డి తెలిపిన వివరాలివీ.. మధుసూదన్ గుప్త నంద్యాలలోని చక్కెర ఫ్యాక్టరీని ఏడాదిన్నర క్రితం మూసివేశారు. ప్రకాశం జిల్లా ముళ్లమారు మండలం శరికరాపురం గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ రామాంజనేయులు, అతని స్నేహితులు చక్కెర ఫ్యాక్టరీ ఇనుము, తుప్పును రూ.10కోట్లకు కొనుగోలు చేయడానికి గుప్తతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు రూ.52లక్షల నగదును, రూ.2కోట్ల చెక్కులను అందజేశారు. అయితే నిబంధనలను ఉల్లంఘించి ఇనుము, తుప్పును గుజరాత్కు చెందిన మరో సంస్థకు విక్రయించారు. దీంతో రామాంజనేయులు, అతని స్నేహితులు మధుసూదన్ గుప్తను నిలదీయగా అగ్రిమెంట్తో సంబంధం లేదని, అడ్వాన్స్ తిరిగిచ్చేది లేదని తేల్చి చెప్పాడు. ఈ నేపథ్యంలో బాధితులు సోమవారం స్థానిక చెరువు రైతులు బంగారురెడ్డి, నాగేశ్వరరెడ్డి, పాములేటి, శ్రీనివాసులుతో కలిసి ఫ్యాక్టరీ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం వీరిచ్చిన ఫిర్యాదు మేరకు మధుసూదన్ గుప్తపై పోలీసులు 420, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
ఎస్బీఐ ఎండీగా దినేశ్కుమార్ ఖార..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మేనేజింగ్ డెరైక్టర్గా దినేశ్కుమార్ ఖార నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారు. ఈయన ఎస్బీఐ ఎండీగా మూడేళ్ల కాలంపాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. దినేశ్ నియామకానికి అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కమిటీ మరికొన్ని బ్యాంకుల నియామకాలను చూస్తే... ♦ బ్యాంక్ ఆఫ్ బరోడా ఈడీగా అశోక్ జార్జ్ ఎంపికయ్యారు. ♦ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈడీగా రాజ్ కమల్ వర్మ నియమితులయ్యారు. ♦ కార్పొరేషన్ బ్యాంక్ ఈడీగా గోపాల్ మురళీ భగత్ వ్యవహరించనున్నారు. ♦ ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఈడీగా హిమాంశు జోషి బాధ్యతలు నిర్వర్తిస్తారు. ♦ యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈవోగా పవన్ కుమార్ బజాజ్ ఎంపికయ్యారు. ఈయన ప్రస్తుతం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్గా ఉన్నారు. ♦ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎండీ, సీఈవోగా రవీంద్ర ప్రభాకర్ మరాఠే నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్గా ఉన్నారు. రవీంద్ర అక్టోబర్ 1 నుంచి కానీ తర్వాత కానీ బాధ్యతలు చేపట్టవచ్చు. -
స్టాక్ మార్కెట్ పాఠాలకు గేమింగ్ యాప్
కొచ్చి : మొబైల్ వినియోగం పెరుగుతున్నా కొద్దీ యాప్ ల ఆవిష్కరణలు దూసుకెళ్తున్నాయి. ప్రతి చిన్న పనికోసం, సమాచారం తెలుసుకోవడం కోసం యూజర్లకు యాప్ లు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఇప్పుడు మరో కొత్త యాప్ యూజర్ల ముందుకు వచ్చింది. స్టాక్ మార్కెట్ల ప్రయాణంలో మార్గదర్శి కావలనుకునే యూజర్లకు పాఠాలు నేర్పడానికి టోరో ఈ ఓర్సో(బుల్ అండ్ బేర్) అనే మొబైల్ గేమ్ యాప్ ను ప్రముఖ ఫైనాన్సియల్ కంపెనీ హెడ్జ్ ఈక్విటీస్ ఆవిష్కరించింది. చాలామంది యువత మార్కెట్లో పెట్టుబడులు పెడదామనకుని, అవి ఎలా వర్క్ చేస్తున్నాయో తెలియక సతమతమవుతుంటారని ప్రముఖ ఫైనాన్సియల్ సర్వీసు కంపెనీ హెడ్జ్ ఈక్విటీస్ మేనేజింగ్ డైరెక్టర్ అలెక్స్ కె. బాబు తెలిపారు. స్టాక్ ట్రేడింగ్ ల గురించి సులభంగా తెలుసుకునేలా ఈ యాప్ ను రూపొందించినట్టు పేర్కొన్నారు. షేర్ ట్రేడింగ్ లో బేసిక్స్ గురించి యువతకు తెలపడానికి యాప్ లు, గేమ్ లే ఉత్తమ మార్గమని అలెక్స్ అన్నారు. గేమ్స్ ద్వారా మార్కెట్ల గురించి యువత చాలా త్వరగా అర్థం చేసుకోగలుగుతారని పేర్కొన్నారు. ఆండ్రాయిడ్ ఆధారిత ఈ గేమ్, బిగినెర్, అమాట్యూర్, ప్రొఫెసినల్ అనే మూడు లెవల్స్ ను కలిగి ఉంటుంది. బిగినెర్ లెవల్ లో 10 రౌండ్లు, అమాట్యూర్ లెవల్ లో 20, ప్రొఫెసినల్ లెవల్ లో 40 రౌండ్లు ఉంటాయి. ఈ గేమ్ లో యూజర్లు వర్చువల్ గా రూ.5వేల మొత్తాన్ని పొందుతారు. ఆ మొత్తాన్ని ఆయిల్, గ్యాస్, టెలికాం, ఎఫ్ఎమ్సీజీ, ఆటోమొబైల్, రియాల్టీ, ఫార్మా, పవర్, ఐటీ, మెటల్, బ్యాంకింగ్ వంటి దేనిలోనైనా పెట్టుబడి పెట్టొచ్చు. రాట్నంలో ఉన్న ఓ సెక్టార్ ను మార్క్ చేయాల్సి ఉంటుంది. ఈ రాట్నంలో ఉన్న చాన్స్ కార్డ్స్ లు, సెక్టార్లలో పాజిటివ్ గాని , నెగిటివ్ గా గాని ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఉదా..ఒకవేళ ఎఫ్ఎమ్ సీజీ సెక్టార్ లో ప్లేయర్ పెట్టుబడి పెట్టి, లోటు రుతుపవనాల్లో చాన్స్ కార్డ్ ను కలిగిఉంటే, ప్లేయర్ 100 పాయింట్లు నష్టపోవాల్సి ఉంటుంది. ప్రతి చాన్స్ కార్డ్ అనంతరం స్కోర్లు డిస్ ప్లే చేస్తుంది. ప్రతి లెవల్ తర్వాత మాక్రో కార్డ్ ను వస్తుంటుంది. ఇలా అన్ని రౌండ్లు ముగించుకున్నాక లాభాలకు, నష్టాలకు మధ్య తేడాను స్కోర్ బోర్డు చూపిస్తుంది. ఇలా గేమింగ్ విధానం ద్వారా స్టాక్ మార్కెట్లు ఎలా పెట్టుబడులు పెట్టాలో నేర్పుతామని అలెక్స్ పేర్కొన్నారు. -
బీఆర్ఎల్ ఎండీగా కిషోర్ బియానీ
ముంబై : ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కిషోర్ బియానీని భారతీ రిటైల్ లిమిటెడ్ (బీఆర్ఎల్) మేనేజింగ్ డైరెక్టర్ గా నియమిస్తున్నట్టు ఫ్యూచర్ గ్రూప్ తెలిపింది. భారతీ గ్రూప్స్ రిటైల్ బిజినెస్ తో పునర్ వ్యవస్థీకరణ పూర్తి అయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. అయితే ఎఫ్ఆర్ఎల్ బోర్డు సభ్యుడిగా బియానీ కొనసాగుతారని కంపెనీ తెలిపింది. బీఆర్ఎల్ తో వ్యాపార పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ కు జాయింట్ డైరెక్టర్ గా ఉన్న రాకేష్ బియానీ కూడా బీఆర్ఎల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. భారతీ ఎంటర్ ప్రైజెస్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ మిట్టల్ కంపెనీ బోర్డు డైరెక్టర్లలో సభ్యుడిగా కొనసాగనున్నారు. -
నాలుగు పీఎస్యూ బ్యాంకులకు కొత్త చీఫ్లు...
ఆంధ్రాబ్యాంక్, ఇండియన్ బ్యాంక్ చీఫ్లుగా ఇప్పటికే బాధ్యతల స్వీకారం న్యూఢిల్లీ: ఆంధ్రాబ్యాంక్సహా నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వం మేనేజింగ్ డెరైక్టర్లను నియమించింది. వివరాల్లోకి వెళితే... ఆంధ్రాబ్యాంక్: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఆంధ్రాబ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్గా సురేష్ ఎన్ పటేల్ నియమితులయ్యారు. ఇప్పటివరకూ ఆయన ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఎండీగా పనిచేశారు. ఇప్పటికే ఆయన బాధ్యతలు స్వీకరించారు.యూకో బ్యాంక్: దేనా బ్యాంక్ ఈడీ ఆర్కే టాకూర్ ఇకపై కోల్కతా కేంద్రంగా పనిచేస్తున్న యుకో బ్యాంక్ ఎండీగా బాధ్యతలు చేపట్టనున్నారు. కార్పొరేషన్ బ్యాంక్: ఈ బ్యాంక్ ఎండీగా జేకే గార్గ్ నియమితులయ్యారు. ప్రస్తుతం సీఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్ఆర్ బన్సల్ జనవరిలో పదవీ విరమణ చేస్తారు. ఇండియన్ బ్యాంక్: ప్రస్తుతం బ్యాంక్ ఈడీగా పనిచేస్తున్న మహేశ్ కుమార్ జైన్ ఎండీ, సీఈఓగా పదోన్నతి పొందారు. బాధ్యతలు స్వీకరించే నాటి నుంచీ మూడేళ్లు లేదా పదవీ విరమణ లేదా తదుపరి ఉత్తర్వుల వరకూ (ఏది ముందయితే అది) ఆయన ఈ బాధ్యతలు నిర్వహిస్తారని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. నవంబర్ 2వ తేదీన ఆయన బ్యాంక్ ఎండీగా బాధ్యతలు స్వీకరించినట్లు పేర్కొంది. -
ఎయిర్ ఇండియా సీఎండీగా అశ్వని లొహాని
న్యూఢిల్లీ: రైల్వే సర్వీస్ అధికారి అశ్వని లొహాని దేశీ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈయన 1980 బ్యాచ్కు చెందిన ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ మెకానికల్ ఇంజినీర్స్ అధికారి. అశ్వని లొహాని మూడేళ్లపాటు ఎయిర్ ఇండియా సీఎండీగా కొనసాగనున్నారు. ఈయనకు ముందు ఎయిర్ ఇండియా సీఎండీగా ఉన్న రోహిత్ నందన్ ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. -
ఉద్యోగినిపై దాడికి పాల్పడిన యజమాని అరెస్టు
గచ్చిబౌలి (హైదరాబాద్) : ఉద్యోగినిపై దాడికి పాల్పడిన ఓ కంపెనీ యజమానిని అరెస్ట్ చేసిన సంఘటన రాయదుర్గం పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ బాబ్యానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లిలో నివాసం ఉండే ఓ యువతి(22) గచ్చిబౌలి టెలికాంనగర్లో గల బ్రిక్మోర్ ఇన్ఫ్రాలో మూడు నెలలుగా కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తోంది. కాగా బుధవారం కంపెనీ ఎండీ శ్రీనివాస్రెడ్డి క్యాబిన్లోకి వెళ్లి తనకు పెళ్లి నిశ్చయమైందని, ఉద్యోగం మానేస్తానని చెప్పింది. వెంటనే ఎండీ శ్రీనివాస్రెడ్డి ఆగ్రహంతో.. ఇలా వచ్చి అలా వెళ్లిపోతారంటూ ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఆమెను కొట్టి బలవంతంగా 'కంపెనీ ఇచ్చిన జీతం తిరిగి ఇచ్చేస్తాను' అని రాయించుకున్నాడు. భయంతో ఇంటికి వెళ్లిన యువతి కుటుంబ సభ్యులకు జరిగిన విషయం తెలుపగా వారు శుక్రవారం రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా నిందితుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. -
టీఎస్ ఆర్టీసీ ఎండీగా రమణారావు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ జేఎండీగా విదులు నిర్వహిస్తున్న రమణారావుకు పదోన్నతి లభించింది. ఆయనను మేనేజింగ్ డైరెక్టర్గా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రమణారావు రెండేళ్లపాటు టీఎస్ ఆర్టీసీ ఎండీగా కొనసాగనున్నారు. -
'రుణాల చెల్లింపులో తెలంగాణ ముందు'
-
ఆర్టీసీ ఎండీగా సాంబశివరావు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి నండూరి సాంబశివరావును నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆర్టీసీకి ఎండీగా వ్యవహరించిన జె.పూర్ణచందర్రావు అఖిల భారత సర్వీసు అధికారుల పంపకంలో తెలంగాణ రాష్ట్రానికి వెళ్లారు. దీంతో ఏపీకి ప్రత్యేకంగా అధికారిని నియమించాలనే ఉద్దేశంతో అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న సాంబశివరావుకు బాధ్యతలు అప్పగించారు -
ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఎండీ వాన్కు ప్రతిష్టాత్మక అవార్డు
ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ సూన్ వాన్కు ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేష న్ (సీఈఏఎంఏ) ఆయనను ‘మ్యాన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్’గా సత్కరించింది. న్యూ ఢిల్లీలో జరిగిన సీఈఏఎంఏ 35వ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రణాళిక , రక్షణ శాఖ సహాయమంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ ఈ అవార్డును సూన్వాన్కు ప్రదానం చేశారు. వినియోగ ఎలక్ట్రానిక్స్ రంగం పురోగతికి చేసిన కృషికిగాను ఆయనకు ఈ గుర్తింపు లభించింది. -
ఆంధ్రజ్యోతి ఎండీకి నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్
ఖమ్మం లీగల్: ఆంధ్రజ్యోతి దినపత్రిక మేనేజింగ్ డెరైక్టర్ (ఎండీ) వేమూరి రాధాకృష్ణపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ ఖమ్మం రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎ.సునీతారాణి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా ఆంధ్రజ్యోతి పత్రికలో వార్త ప్రచురితమైందంటూ ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన పూసా నరేందర్ 2010 సంవత్సరంలో కోర్టులో కేసు దాఖలు చేశాడు. ఖమ్మం కోర్టుకు బుధవారం రాధాకృష్ణ హాజరు కావాల్సి ఉంది. కానీ, ఆయన రాకుండా ఇద్దరు న్యాయవాదుల ద్వారా ఇద్దరు పూచీదారులను హాజరుపరిచారు. దీంతో, ఆయనపై నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ.. వచ్చే నెల 10వ తేదీకి కేసును కోర్టు వాయిదా వేసింది. వేమూరి రాధాకృష్ణపై పరువు నష్టం దావా వరంగల్ లీగల్: అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమి లక్ష్యంగా తప్పుడు ప్రకటనలు ప్రచురించి ఆంధ్రజ్యోతి దినపత్రిక యాజమాన్యం.. సమాజంలో తన గౌరవ మర్యాదలకు నష్టం కలిగించిందని మాజీ ఎమ్మెల్యే, వర్దన్నపేట నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కొండేటి శ్రీధర్ కోర్టుకు విన్నవించారు. ఈ మేరకు బుధవారం మున్సిఫ్ మెజిస్ట్రేట్కోర్టు జడ్జి నసీమ్సుల్తానా ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. అనం తరం సంబంధిత సాక్షుల విచారణ కోసం ఈ కేసును కోర్టు 20కి వాయిదా వేసింది. -
ఎన్ఎండీసీ సీఎండీగా నరేంద్ర కొఠారి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ ఎన్ఎండీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్గా నరేంద్ర కొఠారి సోమవారం బాధ్యతలు స్వీకరిం చారు. సెయిల్లో వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం ఉన్న కొఠారి ఈ పదవి చేపట్టకుముందు సెయిల్కి చెందిన ఇస్కో స్టీల్ ప్లాంట్ సీఈవోగా అక్టోబర్, 2012 వరకు బాధ్యతలు నిర్వహించారు. ఉక్కు, బొగ్గు దిగుమతి రంగాల్లో మంచి అనుభవం ఉన్న కొఠారి సీఎండీగా ఏప్రిల్, 21న పదవీ బాధ్యతలు స్వీకరించినట్లు ఎన్ఎండీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. కొఠారి నాయకత్వంలో ఎన్ఎండీసీ మరింత ఉన్నత శిఖరాలకు ఎదుగుతుందన్న ఆశాభావాన్ని ఉద్యోగులు వ్యక్తం చేశారు. -
ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్లుగా శ్రీనివాస్, ప్రవీణ్ రావు
బెంగళూరు: దేశీయు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ లిమిటెడ్ డెరైక్టర్లుగా ఉన్న బీజీ శ్రీనివాస్, యుూబీ ప్రవీణ్ రావులను సంస్థ ప్రెసిడెంట్లుగా నియుమించారు. ఈ మేరకు వీరి బిజినెస్ పోర్ట్ఫోలియోలను సవరించారు. వీరి నియూవుకం తక్షణమే అవుల్లోకి వచ్చిందని సంస్థ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. వీరిరువురూ ఇక నుంచి సంస్థ సీఈఓ ఎస్డీ శిబూలాల్కు రిపోర్ట్ చే యూల్సి ఉంటుంది. శ్రీనివాస్ ఇక గ్లోబల్ వూర్కెట్లపై దృష్టి సారిస్తారు. గ్లోబల్ డెలివరీ, సర్వీస్ ఇన్నోవేషన్ రంగాలను ప్రవీణ్ రావు పర్యవేక్షిస్తారు. ఖాతాదారులతో సంబంధాలు, వూ ర్కెట్ వాటా పెంపునకు తాజా నియూవుకాలు దోహదపడతాయుని శిబూలాల్ పేర్కొన్నారు. -
గుంటూరు టు వైజాగ్ స్టీల్
విశాఖపట్నం, న్యూస్లైన్: నవరత్న క్యాటగరీలో ఉన్న ప్రభుత్వరంగ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(విశాఖ ఉక్కు) తొమ్మిదో చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ)గా పి.మధుసూదన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్లాంట్ ప్రారంభం తరువాత మొదటి తెలుగు సీఎండీగావై.శివసాగరరావు బాధ్యతలు నిర్వహించగా ఈ నియామకంతో రెండో తెలుగు వ్యక్తిగా మధుసూదన్కు ఖ్యాతి దక్కింది. ఇప్పటిదాకా ఈ పదవిలో కొనసాగిన ఏపీ చౌదరి డిసెంబర్ 31న పదవీవిరమణ చేయడంతో ఆ పోస్టుకు డెరైక్టర్ (ఫైనాన్స్)గా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్ను కేంద్రం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మధుసూదన్, ఉన్నతాధికారులనుద్దేశించి మాట్లాడుతూ వారికి ప్లాంట్ భవిష్యత్పై దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది విస్తరణ యూనిట్లయిన బ్లాస్ట్ఫర్నేస్, స్టీల్ మెల్ట్షాప్ రోలింగ్మిల్స్ను ఉత్పత్తి ప్రక్రియలో తేవడం వంటి కీలక బాధ్యతలు ఉద్యోగులపై ఉందన్నారు. గోదావరి బ్లాస్ట్ఫర్నేస్, కృష్ణా బ్లాస్ట్ఫర్నేస్, మొదటి స్టీల్ మెల్ట్షాప్ ఆధునీకరణ పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. మొదటి సింటర్ప్లాంట్, ఐదో కోక్ఓవెన్ బ్యాటరీ పనులకు సంబంధించి ఆర్డర్లు ఇచ్చామన్నారు. విస్తృత అనుభవం గుంటూరు జిల్లా ఆరేపల్లిలో 1958, మే 9న జన్మించిన మధుసూదన్ జన్మించారు. 1975-78లో ఆయన ఆంధ్రాయూనివర్సిటీ నుంచి బీకామ్ పట్టా పొందారు. 1982లో సీఏ, 1984లో ఐసీడబ్ల్యూఏఐ, 1986లో కంపెనీ సెక్రటరీ కోర్సులు పూర్తి చేసి బిలాయ్ స్టీల్ప్లాంట్లో జూనియర్ మేనేజర్గా చేరారు. అక్కడ 24ఏళ్ళు వివిధ హోదాల్లో పనిచేశారు. బర్క్ఫూర్ ఇస్కో స్టీల్ప్లాంట్ జనరల్ మేనేజర్గా బాధ్యతలు నిర్వహించిన అనంతరం ఆయన 2009 నవంబర్ 2న ఉక్కు ఫైనాన్స్ డెరైక్టర్గా విశాఖ ఉక్కులో చేరారు. బిలాయ్ స్టీల్ప్లాంట్లో అతి ముఖ్యమైన ప్రూడెంట్ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్, వ్యయ నియంత్రణ, ఈఆర్పీ ప్రాజెక్ట్ డెవలప్మెంట్, ట్యాక్స్ ప్లానింగ్ తదితర అంశాల్లో కీలకపాత్ర వహించారు. ఉక్కు డెరైక్టర్ (ఫైనాన్స్)గా మధుసూదన్ సుమారు రూ.12వేల కోట్ల వ్యయంతో 6.3 మిలియన్ టన్నుల విస్తరణ పనుల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. అనేక సవాళ్ళు సీఎండీగా మధుసూదన్ 2018 వరకు బాధ్యతలు నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన ఎం వోయూ లక్ష్యాలను సాధించాల్సి ఉంటుంది. అరకొరగా ప్రారంభమైన 6.3 మిలియన్ టన్నుల విస్తరణ పనులను ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేసి ఉత్పత్తి ప్రక్రియలోకి తేవాల్సి ఉంటుంది. 7.3 మిలియన్ టన్నుల విస్తరణ పనులు పూర్తి చేయాలి. విశాఖ ఉక్కుకు సొంత గనులు లేకపోవడంతో ఉత్పత్తి వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో లాభాలు తగ్గుతున్నాయి. తద్వారా విస్తరణ పనులకు నిధులు సమీకరించాల్సి వస్తోంది. -
ర్యాపిడ్ మెట్రో ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: సైబర్సిటీ గుర్గావ్ను ఢిల్లీ మెట్రో నెట్వర్క్తో అనుసంధానించే రాపిడ్మెట్రో రైలు సేవలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో ఉద్యోగ, వ్యాపారాల కోసం ఢిల్లీ-గుర్గావ్ల మధ్య ప్రయాణించేవారి ఇబ్బందులు ఇక దూరమైనట్లే. అంతేగాకుండా ఈ రెండు నగరాల మధ్య ట్రాఫిక్ సమస్య కూడా కనుమరుగవనుంది. దేశంలోనే ఇది మొట్టమొదటి ప్రైవేట్ మెట్రో . దీనిని ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థ నడుపుతోంది. గురువారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్కూలు పిల్లలకు ర్యాపిడ్ మెట్రోలో ఉచిత ప్రయాణాన్ని కానుకగా అందించారు. ట్రయల్ రన్ తర్వాత గతవారం తుది తనిఖీ నిర్వహించిన రైల్వే భద్రతా కమిషనర్ ర్యాపిడ్ మెట్రో నడపడానికి అనుమతించడంతో 5.1 కిలోమీటర్ల తొలిదశ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మెట్రో మార్గంలో సికిందర్పూర్, డీఎల్ఎఫ్ ఫేజ్-2, బెల్వర్డేర్ టవర్, మోల్సారీ ఎవెన్యూ, డీఎల్ఎఫ్ ఫేజ్-3 స్టేషన్లు ఉన్నాయి. ర్యాపిడ్ మెట్రోను సికిందర్పూర్ మెట్రో స్టేషన్ వద్ద ఢిల్లీ మెట్రోతో అనుసంధానం చేశారు. ర్యాపిడ్ మెట్రో వేళలు ఢిల్లీ మెట్రో వేళలతో సమన్వయం చేస్తారు. దీంతో ప్రయాణికులు ర్యాపిడ్ మెట్రో కోసం వేచిచూడవలసిన అవసరముండదు. ర్యాపిడ్ మెట్రో కోసం 12 రూపాయల టికెట్గా నిర్ధారించారు.