manohar parikar
-
చిన్న రాష్ట్రంలో పెద్ద పోరు.. గోవా.. ఎవరిది హవా?
బీజేపీలో మనోహరంగా వెలిగిపోయిన పారికర్ లేకుండా జరగబోయే తొలి ఎన్నికల్ని ఆ పార్టీ ఎంతవరకు ఎదుర్కోగలదు? పదేళ్లుగా అధికారంలో ఉన్న కమలదళం అధికార వ్యతిరేకతను ఎదుర్కొని నిలబడగలదా? తృణమూల్ కాంగ్రెస్, ఆప్, శివసేన వంటి పార్టీల సత్తా ఎంత? కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోంది? అతి చిన్న రాష్ట్రమైన గోవాలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా అయిదు నెలలు గడువు ఉన్నప్పటికీ ఎందుకు రాజకీయాలు హీటెక్కుతున్నాయి? పర్యాటక ప్రాంతమైన అతి చిన్న రాష్ట్రం గోవా. ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో దాదాపుగా పదో వంతు ఉంటుంది. 3,702 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన ఈ రాష్ట్ర జనాభా దాదాపుగా 15 లక్షలు. 40 అసెంబ్లీ స్థానాలున్నాయి. వచ్చే ఏడాది మార్చి 15 వరకు అసెంబ్లీకి గడువుంది. ఎన్నికలకి ఇంకా అయిదు నెలలు సమయం ఉన్నప్పటికీ ఆ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్లు గోవా బరిలోకి పూర్తి స్థాయిలో దిగుతూ ఉండడం, శివసేన కూడా 25 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించడంతో ప్రధాన పార్టీలైన అధికార బీజేపీ, కాంగ్రెస్లో ఎవరి ఓటు బ్యాంకుని కొల్లగొడతారన్న చర్చ ఆసక్తికరంగా మారింది. గోవా కాథలిక్కులు కూడా గౌరవించే మనోహర్ పారికర్ కేన్సర్తో 2019లో మరణించడం బీజేపీకి గట్టి ఎదురుదెబ్బే. రాష్ట్రంలో ప్రమోద్ సావంత్ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని రాష్ట్ర మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన ఆరోపణల్ని కాంగ్రెస్ ప్రచారాస్త్రాలుగా మలచుకుంది. ప్రచారం జోరు గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సదానంద గత జులై నుంచి నియోజకవర్గాల వారీగా పర్యటించడం ప్రారంభించారు. కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు ఉన్నప్పటికీ ఈసారి ఎలాగైనా మెజార్టీ సాధించాలని భావిస్తోంది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇప్పటికే గోవాలో పర్యటించి సమర్థవంతులైన నాయకుల్ని ఎన్నుకోవాలంటూ పిలుపునిచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చిదంబరం వంటి జాతీయ స్థాయి నేతలు కూడా ప్రచారం బరిలోకి దిగారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఇటీవల మూడు రోజులు గోవాలో మకాం వేసి బీజేపీకి బెంగాల్లో పట్టించిన గతే ఇక్కడా పట్టిస్తామని ప్రతినబూనారు. ఆప్ గత ఎన్నికల్లో ఒక్క సీటు సాధించకపోయినా 6.3% ఓట్లను సాధించింది . దీంతో ఈసారి ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ దూకుడు పెంచారు. ఆప్ అ«ధికారంలోకి వస్తే ఉద్యోగాల కల్పన, అందరికీ ఉచితంగా తీర్థయాత్రల హామీతో ముందుకు వెళుతున్నారు. చిన్న నియోజకవర్గాలతో పార్టీలకు చింత గోవాలో ప్రతీ నియోజకవర్గంలో 25 వేల నుంచి 30 వేల మంది మాత్రమే ఓటర్లు ఉంటారు. దీంతో స్వల్ప ఓట్లతోనే ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది. బలమైన అభ్యర్థిని దింపడం కూడా కీలకంగా మారింది. గత ఎన్నికల్లో ముగ్గురు స్వతంత్రులు విజయం సాధించడానికి చిన్న నియోజకవర్గాలే కారణం. ఈసారి బీజేపీ, కాంగ్రెస్, ఆప్, తృణమూల్ కాంగ్రెస్, గోవా ఫార్వార్డ్ పార్టీ మహారాష్ట్రవాది గోమాంతక్ పార్టీ, ఎన్సీపీ, శివసేన , స్థానిక పార్టీలు, స్వతంత్రులు ఎన్నికల బరిలో ఉండడంతో అన్ని నియోజకవర్గాల్లో బహుముఖ పోటీ నెలకొని ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లో ఎవరికి కలిసి వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఎన్నికల్లో దొడ్డి దారిలో వచ్చిన బీజేపీ 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 17 స్థానాలు నెగ్గి కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, 13 స్థానాలు గెలుచుకున్న బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పట్లో రక్షణశాఖ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ని గోవా ముఖ్యమంత్రిని చేసి చిన్న పార్టీలతో చేతులు కలిపిన బీజేపీ గద్దెనెక్కింది. కేవలం 13 స్థానాలను గెలుచుకున్న పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచిన అప్పటి గోవా గవర్నర్ మృదుల సిన్హాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా బీజేపీ పారికర్ ఇమేజ్తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సభ్యుల్ని లాగేసి బలం పెంచుకుంది. ప్రస్తుతం గోవా అసెంబ్లీలో బీజేపీకి సభ్యుల బలం 28 ఉంటే కాంగ్రెస్ బలం నాలుగుకి పడిపోయింది. అప్పట్నుంచి గోవా కాంగ్రెస్ తమకు దక్కాల్సిన అధికారాన్ని కొల్లగొట్టిందని బీజేపీపై విమర్శలు గుప్పిస్తూనే ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాలు ►పర్యాటక రంగంపైనే ఆధారపడి మనుగడ సాగిస్తున్న రాష్ట్రంలో కరోనా ప్రభావంతో వచ్చే పర్యాటకుల సంఖ్య బాగా తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.7,200 కోట్లు నష్టం వచ్చినట్టుగా అంచనా. పర్యాటకుల్ని అనుమతిస్తున్నప్పటికీ చాలా హోటల్స్లో ఆక్యుపెన్సీ 20 శాతానికి మించడంలేదు. ప్రజల జీవనోపాధిపై దెబ్బపడింది. ►గోవాలో మైనింగ్ను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో గ్రామీణ ఆర్థిక రంగానికి గట్టి దెబ్బ తగిలింది. జీడీపీలో 30%వాటా, లక్షకు మందికి పైగా ఉద్యోగాలను కల్పించే మైనింగ్ నిలిచిపోవడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది ►కరోనా సమయంలో పర్యాటక రంగంలో 1.22 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతే, మైనింగ్ నిలిచిపోయి లక్ష మంది వరకు ఉపాధి కోల్పోయారు. దీంతో నిరుద్యోగం అంశం రాష్ట్రంలో అతి పెద్ద సమస్యగా మారింది. -
ఆయన ఆరోగ్యానికి ఢోకా లేదు..!
న్యూఢిల్లీ : గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ కోలుకుంటున్నారని ఆ రాష్ట్ర సీఎం కార్యాలయం శనివారం తెలిపింది. ఆయన ఆరోగ్యంపై రకరకాల కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో తాజా ప్రకటనతో బీజేపీ శ్రేణులకు ఊరట లభించినట్లయింది. ‘సీఎం ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయనకు రోజూవారీ వైద్యం అందుతోంది’ అని సీఎంవో వెల్లడించింది. కాగా, మార్చి 4న గోవా మంత్రి విజయ్ సర్దేశాయ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ శ్రేణుల్లో కలకలం రేపాయి. ‘పరీకర్ అడ్వాన్స్డ్ కాన్సర్తో బాధపడుతున్నారు. అయిన్పటికీ ఆయన ప్రజల కోసం పనిచేస్తున్నారు’ అని చెప్పారు. మంత్రి వ్యాఖ్యలతో పాటు పాంక్రియాటిక్ కాన్సర్తో బాధపడుతున్న పరీకర్ బాగా నీరసించిపోయి ప్రభుత్వ కార్యకలాపాల్లో పాలుపంచుకోవడంతో ఆయన ఆరోగ్యం క్షీణించిందనే వార్తలు వెలువడ్డాయి. -
పరామర్శలోనూ రాజకీయాలా?
న్యూఢిల్లీ: అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని పరామర్శించి, దానిని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించడం తగదని గోవా సీఎం మనోహర్ పారికర్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ధ్వజమెత్తారు. మంగళవారం పారికర్ను పరామర్శించిన అనంతరం రాహుల్గాంధీ కోచిలో ఓ సమావేశంలో మాట్లాడుతూ తమ మధ్య రఫేల్ కుంభకోణంపై చర్చ జరిగిందని వెల్లడించిన విషయం విదితమే. అనిల్ అంబానీకి ప్రయోజనం కలిగించేందుకు మోదీ ప్రయత్నించారని, ఈ విషయంలో పారికర్ తనకు సంబం ధం లేదని తెలిపారని రాహుల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై పనాజీలోని గోవా అసెంబ్లీ భవనంలో పారికర్ మాట్లాడుతూ ‘రాహుల్తో నా భేటీ కేవలం అయిదు నిమిషాలు మాత్రమే జరిగింది. ఆ భేటీలో రాహుల్ రఫేల్పై మాట్లాడలేదు. అసలు భేటీలో ఆ అంశమే ప్రస్తావనకు రాలేదు’ అని స్పష్టం చేశారు. తనతో జరిగిన పరామర్శ భేటీని కూడా రాహుల్ అల్పమైన రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్షా కూడా రాహుల్పై మండిపడ్డారు. -
గోవా సీఎం పారికర్తో రాహుల్ భేటీ
పనాజీ : గోవా సీఎం మనోహర్ పారికర్తో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మంగళవారం సమావేశమయ్యారు. వీరి మధ్య ఏయే అంశాలపై చర్చలు జరిగాయనే వివరాలు వెల్లడికాలేదు. పారికర్తో తాను కేవలం మర్యాదపూర్వకంగానే భేటీ అయ్యానని, ఇది వ్యక్తిగత పర్యటనగా రాహుల్ వెల్లడించారు. నేటి ఉదయం గోవా సీఎం మనోహర్ పారికర్ను తాను కలిశానని, ఆయన సత్వరం కోలుకోవాలని ఆకాంక్షించానని రాహుల్ ట్వీట్ చేశారు. గోవా శాసన సభ ప్రాంగణంలోని సీఎం చాంబర్లో పారికర్తో రాహుల్ సమావేశమయ్యారు. పారికర్తో ముచ్చటించిన అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాహుల్ అసెంబ్లీలోని విపక్ష లాబీలో సమావేశమయ్యారు. కాగా రాఫెల్ ఒప్పందానికి సంబంధించిన కీలక పత్రాలు గోవా సీఎం వద్ద ఉన్నాయని కాంగ్రెస్ చీఫ్ ఆరోపించిన మరుసటి రోజే పారికర్తో రాహుల్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు పారికర్తో రాఫెల్ ఒప్పందంపై రాహుల్ ఎలాంటి చర్చలూ జరపలేదని, కేవలం ఆయన ఆరోగ్య పరిస్ధితిని వాకబు చేసేందుకే కలిశారని గోవా విపక్ష నేత చంద్రకాంత్ కవ్లేకర్ వివరణ ఇచ్చారు. పారికర్ను రాహుల్ కేవలం మర్యాదపూర్వకంగానే కలిశారని చెప్పుకొచ్చారు. మనోహర్ పారికర్ పాంక్రియాటిక్ వ్యాధితో బాధపడుతూ 2018 ఫిబ్రవరి నుంచి పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. -
గోవా బీచ్లో మందేస్తే అంతే!
పనాజీ : గోవా బీచ్లో బీరు తాగుతూ ఎంజాయ్ చేయలనుకుంటున్నారా? అయితే మీరు రూ. 2 వేల రూపాయల జరిమానా లేక మూడు నెలలు జైలు శిక్ష అనుభవించడానికి సిద్దంగా ఉండాలి. అదేంటి బీచ్లో బీరు తాగితే ఇంత శిక్షా? అని అంటారా? అవును గోవా ప్రభుత్వం పర్యాటక చట్టంలో మార్పులు తీసుకురాబోతుంది. బీచ్లో మద్యం తాగినా, బహిరంగంగా వంట చేసినా రెండువేల రూపాయలు జరిమానా విధించాలని గోవా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గోవాలో కాలుష్యాన్ని నివారించేందుకు వీలుగా బీచ్ లో మద్యం తాగినా, వంట చేసినా రెండువేల రూపాయలు జరిమానా విధించాలని గోవా మంత్రివర్గ సమావేశం తీర్మానించిందని ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అజ్ గోంకర్ వెల్లడించారు. జరిమానా చెల్లించకపోతే మూడు నెలల జైలు శిక్ష విధిస్తామని మంత్రి పేర్కొన్నారు. ‘ పర్యాటక చట్టంలో మేం రెండు మార్పులు తీసుకొచ్చాం. పర్యాటకశాఖలో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే హోటల్ బుకింగ్ చేసుకునేలా నిబంధనను తీసుకొచ్చాం. ఈ విషయంలో కొన్ని అభ్యంతరాలు మా దృష్టికి వచ్చాయి. చాలా ట్రావెల్స్ కంపెనీలు పర్యాటకశాఖతో సంబంధం లేకుండా హోటల్స్ను బుక్ చేస్తున్నాయి. ఈ తరహా చట్ట వ్యతిరేక పనులను మేం సహించం. ఇక రెండోది.. బహిరంగ ప్రదేశాల్లో, బీచ్లో మద్యం సేవించినా, వంట చేసినా రూ.2 వేలు జరిమానా కట్టాల్సిందే. లేకుంటే మూడు నెలలు జైలు శిక్షఅనుభవించాలి.’ అని పర్యాటక మంత్రి తెలిపారు. బీచ్ల్లో బహిరంగంగా మద్యనిషేధం విధిస్తామని ఇచ్చిన హామీ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ స్పష్టం చేశారు. -
పరీకర్ పడకగదిలో ‘రఫేల్’ ఫైల్స్!
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పంద వివాదం కొత్త మలుపు తిరిగింది. ఈ ఒప్పందానికి సంబంధించిన ఓ దస్త్రం అప్పటి రక్షణ మంత్రి, ప్రస్తుత గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ పడక గదిలో ఉందని, ఆయన సహచర మంత్రి ఒకరు వ్యాఖ్యానిస్తున్న ఆడియోను కాంగ్రెస్ బయటపెట్టింది. అయితే ఈ వీడియో ఎంత వరకు నిజమో తెలియరాలేదు. ఓసారి కేబినెట్ సమావేశంలో పరీకర్ ఈమేరకు వ్యాఖ్యానించినట్లు గోవా మంత్రి విశ్వజిత్ రాణె గుర్తుతెలియని వ్యక్తితో అంటున్నట్లు ఆడియోలో ఉంది. రఫేల్ ఒప్పంద విషయమై మోదీని పరీకర్ బెదిరిస్తున్నారని ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ సంచలన వ్యాఖ్య చేశారు. ఈ ఆడియో టేపులు అబద్ధం, కట్టుకథలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కొట్టిపారేశారు. కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని సుప్రీంకోర్టే ఎండగట్టిందని, నిజాల్ని తారుమారు చేసేందుకు మరే మార్గం లేకపోవడంతో ఆ పార్టీ ఇలా నకిలీ ఆడియోల్ని విడుదలచేస్తోందని పరీకర్ దుయ్యబట్టారు. ఆడియోలో ఉన్నట్లుగా తానెప్పుడూ కేబినెట్ సమావేశంలోగానీ, మరే ఇతర సమావేశంలోగానీ చర్చించలేదని స్పష్టం చేశారు. ‘సీఎం పరీకర్ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. రఫేల్కు సంబంధించిన పూర్తి సమాచారం ఆయన పడకగదిలోనే ఉందట. దీనర్థం.. ఏదో ఆశించే ఆయన ఆ సమాచారాన్నంతా తన వద్ద భద్రపరుచుకున్నారు’ అని రాణెను ఉటంకిస్తూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా వ్యాఖ్యానించారు. ఈ ఆడియో కల్పితమని, దాని విడుదల వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు రాణె అమిత్ షాకు చెప్పారు. పరీకర్కు లైడిటెక్టర్ పరీక్షలు: గోవా కాంగ్రెస్ రఫేల్ ఒప్పంద ఫైల్ను గుర్తించడానికి పరీకర్ నివాసంపై సీబీఐతో సోదాలు నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పరీకర్, ఆయన సహచరులకు లైడిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని కూడా కోరింది. ఈ ఆడియోను వెలుగులోకి తెచ్చిన వేగును గుర్తించి రక్షణ కల్పించాలని, దివంగత జడ్జి లోయా లాంటి పరిస్థితి ఎదురుకాకుండా, పరీకర్కు కూడా భద్రతను పెంచాలని గోవా కాంగ్రెస్ ప్రతినిధి సిద్ధాంత్ బుయావో కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. -
‘అతన్నో సూపర్మ్యాన్లా చూపిస్తోంది’
పణాజి : అనారోగ్యంతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రిని బీజేపీ హీ - మ్యాన్, సూపర్మ్యాన్ లాగా చూపించే ప్రయత్నం చేస్తోందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో బుధవారం (నిన్న) నిర్వహించిన 57వ గోవా లిబరేషన్ డే పరేడ్ కార్యక్రమాలకు సీఎం మనోహర్ పారికర్ హాజరుకాకపోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఉర్ఫాన్ ముల్లా మాట్లాడుతూ.. ‘బీజేపీ గోవా సీఎమ్ను ఫోటో సెషన్ కోసం వాడుతూ.. అతన్ని ఓ హీ - మ్యాన్, సూపర్మ్యాన్గా చూపించే ప్రయత్నం చేస్తోంది. వైద్యులను వెంటబెట్టుకుని వెళ్లి మరి నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనులను పర్యవేక్షించిన పారికర్కు ఇంత ముఖ్యమైన గోవా లిబరేషన్ డే పరేడ్ వేడుకలకు హాజరుకావడానికి మాత్రం ఆరోగ్యం సహకరించలేదా’ అంటూ ప్రశ్నించారు. నిజంగా ఇది చాలా విచారకరమన్నారు. ఇదిలా ఉండగా గోవా లిబరేషన్ డే పరేడ్ వేడుకల్లో గోవా అసెంబ్లీ స్పీకర్ ప్రమోద్ సావంత్, పారికర్ స్థానంలో ఉండి కార్యక్రమాలు నిర్వహించారు. పారికర్ అనారోగ్య కారణాల వల్ల అసెంబ్లీకి హాజరు కాలేకపోయారన్నారు. ఆయన బదుల ఈ ఉపన్యాసాన్ని తాను చదువుతున్నానంటూ సావంత్ చెప్పుకొచ్చారు. -
బీజేపీలో చేరిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
పనాజీ : గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇద్దరు సుభాష్ శిరోడ్కర్, దయానంద్ సోప్టే మంగళవారం బీజేపీలో చేరారు. కాంగ్రెస్ నుంచి మరికొందరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నారని వారు తెలిపారు. తాము బీజేపీలో చేరుతున్నామని, మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు రాబోయే రోజుల్లో బీజేపీలో చేరతారని శిరోడ్కర్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో బీజేపీ చీఫ్ అమిత్ షాతో భేటీ అనంతరం వారు పార్టీలో చేరికపై ప్రకటన చేశారు. కాగా తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను అమిత్ షా బెదిరింపులకు గురిచేసి బీజేపీలో చేర్చుకున్నారని గోవాకు కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ ఇన్ఛార్జ్ చెల్లకుమార్ ఆరోపించారు. గోవా సీఎం మనోహర్ పారికర్ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వైదొలిగితే సభలో కాంగ్రెస్కు సమానంగా సభ్యుల సంఖ్యను పెంచుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. మొత్తం 38 మంది సభ్యులు కలిగిన గోవా అసెంబ్లీలో తాజా బలాబలాలను చూస్తే బీజేపీకి 14 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్కు 14 మంది ఎమ్మెల్యేలుండగా, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీకి ముగ్గురు, గోవా ఫార్వార్డ్ పార్టీకి ముగ్గురు సభ్యులున్నారు. ముగ్గురు ఇండిపెండెంట్లు, ఓ ఎన్సీపీ ఎమ్మెల్యే ఉన్నారు. గత కొద్దివారాలుగా ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న సీఎం మనోహర్ పారికర్ ఆదివారం ఎయిమ్స్ నుంచి డిశ్చార్జి అయిన సంగతి తెలిసిందే. పాంక్రియాటిక్ క్యాన్సర్తో బాధపడుతున్న పారికర్ ప్రస్తుతం గోవాలోని దోనాపౌలాలోని తన ప్రైవేట్ నివాసంలో చికిత్స పొందుతున్నారు. -
ఎయిమ్స్ నుంచి గోవా సీఎం డిశ్చార్జి
సాక్షి, న్యూఢిల్లీ : పాంక్రియాటిక్ క్యాన్సర్తో గత నెల రోజుల నుంచి ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. పారికర్ ఆరోగ్య పరిస్థితి ఆదివారం ఉదయం విషమించగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)కు తరలించి ఆ తర్వాత ఐసీయూ నుంచి వార్డుకు అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశామని ఎయిమ్స్ అధికారి ఒకరు వెల్లడించారు. ఆదివారం రాత్రికి ఆయన గోవా చేరుకుంటారని పారికర్ సన్నిహితులు తెలిపారు. గత ఏడు నెలలుగా పారికర్ గోవా, ముంబై, న్యూయార్క్, న్యూఢిల్లీలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా ఎయిమ్స్లోనే శుక్రవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కేబినెట్ మంత్రులతో సమావేశమయ్యారు. మరోవైపు దీర్ఘకాలంగా అస్వస్ధతతో బాధపడుతున్న పారికర్ సీఎం పదవి నుంచి వైదొలగాలని విపక్ష కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. -
పరీకర్ మంత్రిత్వ శాఖల అప్పగింత?
పణజి: ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో పాంక్రియాటిక్ వ్యాధికి చికిత్స పొందుతున్న గోవా సీఎం మనోహర్ పరీకర్ శుక్రవారం మంత్రులు, బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పరిస్థితులు, పాలనపై మంత్రులతో పరీకర్ చర్చించారు. తన వద్ద ఉన్న మంత్రిత్వశాఖలను మిగతా మంత్రులకు అప్పగించాలని నిర్ణయించారు. ‘గోవాలో పరిపాలనతో పాటు కీలక శాఖల పనితీరుపై పరీకర్ సమీక్ష నిర్వహించారు. పరీకర్ కోలుకుంటున్నారు. ఆయనే సీఎంగా ఉంటారు. దీపావళి కల్లా డిశ్చార్జ్ అవుతారు. తన వద్ద ఉన్న మంత్రిత్వశాఖల్లో కొన్నింటిని మిగతా మంత్రులకు అప్పగించడంపైనా చర్చించాం’ అని కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ తెలిపారు. -
‘ఎన్నికల్లో డబ్బు ఖర్చుపెట్టకపోతే శ్రీరాముడైనా గెలవలేడు’
పనాజీ : ‘ఈ రోజుల్లో రాముడైనా సరే డబ్బులు పంచకపోతే ఎన్నికల్లో గెలవలేడు’ అంటూ గోవా ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ సుభాష్ వెలింకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోవాలో యువతను ఉద్దేశిస్తూ నిర్వహించిన ‘గోవా సురక్ష మంచ్’ కార్యక్రమానికి సుభాష్ వెలింకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ‘ఎన్నికలు వస్తున్నాయి.. ఓటర్లలో ఎక్కువ సంఖ్యలో ఉన్న యువత, మహిళలే నాయకులకు ముఖ్యం. వారిని ఆకట్టుకోవడానికి పార్టీలు ఎంత డబ్బునైనా ఖర్చు పెడతాయి. అయినా ఇప్పటి రాజకీయాలన్ని డబ్బు చూట్టే తిరుగుతున్నాయి. డబ్బు లేకపోతే గెలవడం చాలా కష్టం. ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే స్వయంగా శ్రీరాముడే వచ్చి ఎన్నికల్లో పోటీ చేసినా.. డబ్బు పంచకపోతే ఆయన కూడా గెలవడు’ అన్నారు. ఈ సందర్భంగా ఆయన గోవా ముఖ్యమంత్రిపై, బీజేపీ పార్టీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ పార్టీ తన విలువలను కోల్పొతుంది. అది కూడా తక్కిన పార్టీలతోవలోనే నడుస్తుందని ఆరోపించారు. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ను ఉద్దేశిస్తూ పారికర్ అనారోగ్యంతో ఉన్న ఇద్దరు మంత్రులను తొలగించారు. ఇప్పుడు ఆయన కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మరి ఆయన మాత్రం ఎందుకు తన పదవి నుంచి వైదొలగటం లేదని ప్రశ్నించారు. అంతేకాక నాయకులు చిన్న జబ్బుల చికిత్స కోసం కూడా అమెరికా వెళ్లడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. -
గోవా సీఎం ఆయనే..
న్యూఢిల్లీ : గోవా సీఎంగా మనోహర్ పారికర్ స్ధానంలో మరొకరిని నియమిస్తారని సాగుతున్న ప్రచారాన్ని బీజేపీ చీఫ్ అమిత్ షా తోసిపుచ్చారు. గోవా సీఎంగా పారికర్ కొనసాగుతారని, త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేపడతారని స్పష్టం చేశారు. గోవా బీజేపీ కోర్ గ్రూప్ సభ్యులతో సంప్రదింపులు జరిపిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్టు షా పేర్కొన్నారు. కాగా సీఎం మనోహర్ పారికర్ ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో గోవాలో అనిశ్చిత పరిస్థితి నెలకొందని, రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించాలని విపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ కోరుతుండగా, అసెంబ్లీలో తమకు మెజారిటీ సంఖ్యా బలం ఉందని బీజేపీ స్పష్టం చేసింది. గోవా సీఎం పారికర్ ప్రస్తుతం ఎయిమ్స్లో ప్రాంకియాస్ చికిత్స పొందుతున్నారు. -
సీఎంలు జబ్బు పడితే ఇక అంతేనా!
సాక్షి, న్యూఢిల్లీ : గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ మొదటిసారి అనారోగ్యానికి గురై అప్పుడే ఏడు నెలలు గడచి పోయాయి. ఆయన మొదటి సారి ఫిబ్రవరిలో అనారోగ్యానికి గురైనప్పటి నుంచి సుదీర్ఘ కాలం పాటు ఇటు ముంబై, అటు అమెరికాలో వైద్య చికిత్సలు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం మరోసారి ఆస్పత్రి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. క్లోమగ్రంథి క్యాన్సర్తో బాధ పడుతున్న మనోహర్ పరీకర్ చికిత్స కోసం గత మార్చి నెలలో అమెరికా వెళ్లారు. జూన్ నెలలో తిరిగొచ్చారు. ఆగస్టు 10న మరోసారి అమెరికా వెళ్లి ఆగస్టు 22న తిరిగొచ్చారు. మళ్లీ చెకప్ కోసమని ఆగస్టు 30న అమెరికా వెళ్లారు. సెప్టెంబర్ 6న తిరిగొచ్చారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 13న పరీకర్ స్థానిక ఆస్పత్రిలో చేరారు. ఇప్పుడు ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇలా మాటిమాటికీ ముఖ్యమంత్రి మనోహర్ స్థానికంగా ఉండకుండా.. చికిత్స కోసం వెళ్తుండటంతో రాష్ట్రంలో పాలనా వ్యవస్థ పూర్తిగా స్థంభించి పోయిందని ఆరోపిస్తూ ప్రభుత్వం ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కోరింది. ఎలాంటి భంగం కలగడం లేదు!! గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పాలకపక్ష బీజేపీకన్నా నాలుగు సీట్లు ఎక్కువ వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక పోవడం, నాలుగు సీట్లు తక్కువ వచ్చిన బీజేపీ ఇతర పార్టీల మద్ధతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తెల్సిందే. మనోహర్ పరీకర్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నప్పటికీ పాలనా వ్యవస్థకు ఎలాంటి భంగం కలగడం లేదని పాలకపక్ష బీజేపీ చెబుతోంది. పరీకర్ తాను నిర్వహిస్తున్న హోం, ఆర్థిక, పర్సనల్, సాధారణ పాలన తదితర కీలక శాఖల ఫైళ్లను ఆస్పత్రికి తెప్పించుకొని ఎప్పటికప్పుడు పెండింగ్ అంశాలను క్లియర్ చేస్తున్నారని వాదిస్తోంది. ఇలా జరగడం కొత్తేం కాదు.. కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న రాజకీయ నాయకులు ఇలా అనారోగ్యం పాలైనప్పుడు కూడా బాధ్యతలు నిర్వహించాల్సిన అవసరం ఉందా? నిర్వహిస్తే పాలనా వ్యవస్థ దెబ్బతినదా? అన్న ప్రశ్నలు ఇక్కడ ఉద్భవిస్తాయి. అయితే ఆస్పత్రి పాలైనపుడు కూడా పదవి వదులుకోకుండా బాధ్యతలు నిర్వహించడం ఇప్పుడే కొత్త కాదు. 2016లో, అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి దాదాపు 70 రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉన్నారు. ఆమె చనిపోయే వరకు కూడా యావత్ కేబినెట్ ఆమెతోపాటు ఆస్పత్రిలోనే ఉండి పోయింది. అప్పుడు కూడా పాలనా వ్యవస్థ స్తంభించి పోయినట్లు ప్రతిపక్షం నుంచి ఆరోపణలు వచ్చాయి. 1980వ దశకంలో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లి కొన్ని నెలలపాటు అక్కడే ఉండిపోయారు. ఆయన అక్కడ అస్పత్రి పడకపై ఉండే ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. కేబినెట్ తీసుకునే నిర్ణయాలన్నింటికీ మంత్రులంతా సమష్టి బాధ్యత వహించాల్సి ఉంటుంది కనుక ముఖ్యమంత్రి దూరంగా ఉన్నంత మాత్రాన కొంపలేవి మునిగి పోకపోవచ్చు. కానీ భారత్ లాంటి ప్రజాస్వామిక దేశంలో నిర్ణయాల్లో జాప్యం జరగడం వల్ల పాలనా వ్యవస్థ మందగించి ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సమయం, ప్రజాధనం వృథా అవుతుంది కదా.. ముఖ్యమంత్రి అనే వ్యక్తి షిప్కు కెప్టెన్ లాంటి వ్యక్తి అన్న విషయం తెల్సిందే. ఇప్పుడు ఢిల్లీలో చికిత్స పొందుతున్న మనోహర్ పరీకర్ తన మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అన్ని ఫైళ్లను తెప్పించుకొని ఎప్పటికప్పుడు నిర్ణయాలను తీసుకుంటున్నారని బీజేపీ నాయకులు చెబుతున్నారు. గోవా నుంచి ఈ ఫైళ్లను ఎప్పటికప్పుడు ఢిల్లీకి తీసుకెళ్లాలంటే ఎంత సమయం వృథా అవుతుందో, సమయం ఆదా కోసం విమానంలో తీసుకెళితే ఎంత ప్రజా సొమ్ము వృథా అవుతుందో ఎవరు ఆలోచించాలి? చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది.. ఇలాంటి సమయాల్లో ఆస్పత్రుల్లో చేరిన ముఖ్యమంత్రులు తమ పదవులకు తాత్కాలికంగా రాజీనామా చేసి, ఆ బాధ్యతలను ఇతరులకు అప్పగించవచ్చు. కోలుకున్నాక ఆ బాధ్యతలను తిరిగి తీసుకోవచ్చు. అయితే ఆ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే విషయంలో పార్టీ నాయకుల మధ్య పోటీ పెరిగి కొత్త సమస్యలు ఉత్పన్నం అవుతాయని, లేదా అలా తాత్కాలికంగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తే చుట్టున్న వారిని తనవైపునకు తిప్పుకొని అసలు ముఖ్యమంత్రికే ఎసరు పెట్టవచ్చన్నది పార్టీల భయం. కానీ ఎప్పటికైనా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిందే. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నియామకానికి సంబంధించి పార్లమెంట్ ద్వారా చట్టమైన తీసుకురావాలి. -
ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వండి
పణజి: గోవా రాజకీయం మరో మలుపు తిరిగింది. ప్రభుత్వం ఏర్పాటుకు తాము సిద్ధమంటూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ముఖ్యమంత్రి మనోహర్ పారికర్(62) దీర్ఘకాల అనారోగ్యం, ఆస్పత్రిలో చేరిక.. అనంతర పరిస్థితులను అంచనా వేసేందుకు వచ్చిన ముగ్గురు సభ్యుల బీజేపీ కేంద్ర బృందం ప్రస్తుతం రాష్ట్ర నేతలతో చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావడం గమనార్హం. మొత్తం 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పార్టీ నేత చంద్రకాంత్ కవ్లేకర్ నేతృత్వంలో సోమవారం రాజ్భవన్కు వెళ్లారు. అయితే, గవర్నర్ మృదులా సిన్హా లేకపోవడంతో అధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం కవ్లేకర్ విలేకరులతో మాట్లాడారు. ‘బీజేపీ నాయకత్వం తమాషాలు చేస్తోంది. ఏడాదిన్నరలోనే మరోసారి ఎన్నికలు జరపడం అంటే రాష్ట్ర ఖజానాపై భారం వేయడమే. అందుకే అసెంబ్లీని రద్దు చేయడానికి బదులు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ను కోరాం. మాకు అవకాశమిస్తే అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటామని తెలిపాం’ అని ఆయన అన్నారు. కాగా, సంకీర్ణంలోనే ఉంటామని, సమస్య పరిష్కారం కోసం బీజేపీ తీసుకునే ఎలాంటి నిర్ణయమైనా తమకుఆమోదయోగ్యమేనంటూ భాగస్వామ్య పక్షాలు ప్రకటించాయి. అసెంబ్లీలోని 40 సీట్లకు గాను కాంగ్రెస్కు 16 మంది సభ్యులుండగా ప్రభుత్వం ఏర్పాటుకు మరో ఐదుగురు సభ్యుల మద్దతుంటే సరిపోతుంది. ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వానికి బీజేపీ (14), మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (3), గోవా ఫార్వర్డ్ పార్టీ (3), ఎన్సీపీ (1), స్వతంత్రులు(3) కలుపుకుని 21 మంది సభ్యుల మద్దతుంది. -
మళ్లీ ఆస్పత్రిలో చేరిన పారికర్
న్యూఢిల్లీ: దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోవా సీఎం మనోహర్ పారికర్ (62) శనివారం మరోసారి ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరారు. దీంతో బీజేపీ నాయకత్వం ఇతర మార్గాల అన్వేషణలో పడింది. ప్యాంక్రియాటిక్ వ్యాధితో బాధపడుతున్న పారికర్ వారం పాటు అమెరికాలో చికిత్స పొంది ఈనెల మొదటి వారంలోనే ఆయన తిరిగి వచ్చారు. కొన్ని రోజులకే మరోసారి గోవాలోని కండోలిమ్ ఆస్పత్రిలో చేరారు. అంతకు ముందు ఈ ఏడాది ప్రారంభంలో 3 నెలల పాటు పారికర్ అమెరికాలో సుదీర్ఘ చికిత్స పొందిన విషయం తెలిసిందే. తరచూ ఆయన అనారోగ్యానికి గురికావడం, తదనంతర పరిణామాలపై చర్చించేందుకు ఇద్దరు సభ్యుల బీజేపీ కేంద్ర బృందం సోమవారం గోవా వెళ్లనుంది. పార్టీ కేంద్ర నాయకత్వం ప్రత్యామ్నాయాల మార్గాల అన్వేషణలో ఉందని సమాచారం. నాయకత్వ మార్పిడికి సంబంధించి బీజేపీ అధ్యక్షుడు అమిత్షా పారికర్తో చర్చించినట్లు కూడా తెలుస్తోంది. -
గోవా సీఎం ఆరోగ్యంపై అసత్య వార్తలు..
పణాజీ, గోవా : గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ ఆరోగ్యంపై అసత్య ప్రచారం చేస్తున్న వాస్కో పట్టణానికి చెందిన 35 ఏళ్ల వ్యక్తిని క్రైం బ్రాంచ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ‘అమెరికాలో క్లోమ గ్రంధి సంబంధిత చికిత్స పొందుతున్న పరీకర్ ఆరోగ్యం క్షీణించింది. ఇక ఆయన మనకు లేరు’ అంటూ సదరు వ్యక్తి మంగళవారం తన ఫేస్బుక్లో పోస్టు చేయడం కలకలానికి దారి తీసింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సీఎం ఆరోగ్యం మెరుగు పడుతుందనీ, బహుశా ఆయన వచ్చే నెలలో ఇండియాకు రావొచ్చని గోవా బీజేపీ ప్రధాన కార్యదర్శి సదానంద్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లోగానే పరీకర్ ఆరోగ్యంపై పుకార్లు మొదలు కావడం బాధ కల్గించిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ‘పరీకర్ కోలుకుంటున్నారు. ఆయన వచ్చే నెలలో స్వదేశానికి వస్తారు’ అని కర్కోరం ఎమ్మెల్యే నీలేష్ కాబ్రల్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. సీఎం ఆరోగ్య వివరాలను ప్రభుత్వం వెల్లడించడం లేదంటూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రకటనలు అర్థరహితమని నీలేష్ మండిపడ్డారు. ఆయన ఆరోగ్యంపై ముఖ్యమంత్రి కార్యాలయం ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తోందని వివరణ ఇచ్చారు. కాగా, కడుపు నొప్పితో ఫిబ్రవరి 5న ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరిన పరీకర్ మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లారు. -
ఆ అవమానకర ప్రశ్నే ‘సర్జికల్’కు కారణం
పణాజి: మయన్మార్ సరిహద్దు వెంట ఉగ్రవాదులను ఏరివేసిన తరువాత ఎదురైన ఓ అవమానకరమైన ప్రశ్నే సర్జికల్ దాడులకు దారితీసిందని మాజీ రక్షణ మంత్రి , గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ శుక్రవారం తెలిపారు. 2015, జూన్ 4న ఈశాన్య ప్రాంత మిలిటెంట్ గ్రూప్ ఎన్ఎస్సీఎన్–కే మణిపూర్లో భారత ఆర్మీ వాహనంపై మెరుపుదాడికి దిగి 18 మంది జవాన్లను పొట్టనపెట్టుకుంది. ప్రతీకారం తీర్చుకోవడానికి నాలుగు రోజుల తరువాత అంటే జూన్ 8న మయన్మార్ సరిహద్దులో ఆర్మీ జరిపిన దాడిలో సుమారు 80 మంది మిలిటెంట్లు మరణించారు. ఆ తరువాత జరిగిన ఓ టీవీ కార్యక్రమంలో... పాక్ ఆక్రమిత కశ్మీర్లో కూడా అలాంటి ఆపరేషన్ నిర్వహించే సత్తా భారత ఆర్మీకి ఉందా? అని యాంకర్ కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ను అడగడం తనలో ఆలోచనలు రేకెత్తించిందని పరీకర్ తెలిపారు. 2016 సెప్టెంబర్ 29న పాక్ ఉగ్ర శిబిరాలపై దాడులకు 15 నెలల ముందు అంటే 2015 జూన్ 9 నుంచే ప్రణాళికలు రచించామని పేర్కొన్నారు. డీఆర్డీఓ అభివృద్ధి చేసిన అధునాతన రాడార్తో పాక్ ఆర్మీ ఫైరింగ్ యూనిట్లను గుర్తించి ధ్వంసం చేశామని తెలిపారు. -
జాతీయ క్రీడలు మళ్లీ వాయిదా
పనాజీ: జాతీయ క్రీడల నిర్వహణలో జరుగుతోన్న జాప్యంపై కేంద్ర క్రీడాశాఖ అసంతృప్తిగా ఉన్నప్పటికీ రాష్ట్ర సంఘాలు మాత్రం ఈ అంశాన్ని తేలిగ్గా తీసుకుంటున్నాయి. 2016 సెప్టెంబరులో గోవాలో జరగాల్సిన జాతీయ క్రీడలను వచ్చే ఏడాది నిర్వహిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ బుధవారం వెల్లడించారు. క్రీడల నిర్వహణకు కావాల్సిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశాకే నేషనల్ గేమ్స్ను నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. సాధారణంగా ప్రతీ రెండేళ్లకొకసారి జాతీయ క్రీడలను నిర్వహించాలి. గతేడాది సెప్టెంబర్లోనే ఈ క్రీడలు జరగాల్సి ఉండగా వాటిని ఈ ఏడాది నవంబర్కు వాయిదా వేశారు. అయితే పరీకర్ తాజా నిర్ణయంతో గోవా జాతీయ క్రీడలు మరోసారి వాయిదా పడటం గమనార్హం. -
‘అక్రమ మార్గాల్లో అధికారంలోకి’
న్యూఢిల్లీ: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ శుక్రవారం రాజ్యసభకు హాజరుకావడంపై విపక్ష కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. పార్టీ సభ్యులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్లోకి దూసుకెళ్లారు. జీరో అవర్లో పరీకర్ సభకు రాగానే దిగ్విజయ్ సింగ్, బీకే హరిప్రసాద్ తదితరులు లేచి నిలబడి నిరసన తెలిపారు. గోవా ఎన్నికల్లో మెజారిటీ రాకున్నా బీజేపీ అక్రమ మార్గాల్లో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. బీజేపీ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. గోవా పగ్గాలు చేపట్టేందుకు పరీకర్ రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. సభ్యులు లేకుండా ఎలా కొనసాగిస్తారు? సభలో తగినంత మంది సభ్యులు లేకున్నా ప్రభుత్వం సభా కార్యక్రమాలను కొనసాగిస్తోందని రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ ధ్వజమెత్తారు. శుక్రవారం మధ్యాహ్నం సభలో విపక్ష సభ్యులు లేకపోవడాన్ని సాకుగా తీసుకుని వివాదాస్పద బిల్లులను సర్కారు ముందుకు తీసుకెళ్లడమేమిటని ప్రశ్నించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ స్పందిస్తూ.. విపక్ష సభ్యులు సభలో ఉండేలా చూడడం తన బాధ్యత కాదన్నారు. ప్రైవేటు సభ్యుల కార్యకలాపాలు ముగియగానే శత్రు ఆస్తుల బిల్లును చేపడతామన్నారు. ఏకాభిప్రాయం లేకుండా దీనిపై చర్చ ఉండదని ప్రభుత్వమే చెప్పిందంటూ ఆజాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. లోక్పాల్ నియామకమేదీ? లోక్పాల్ను ఇంతవరకూ ఎందుకు నియమించలేదని రాజ్యసభలో సీపీఎం సభ్యుడు తపన్కుమార్ సిన్హా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం పూనుకుంటే ఆర్డినెన్స్ ద్వారా ఈ పోస్టును భర్తీ చేయొచ్చన్నారు. మంత్రి నక్వీ సమాధానమిస్తూ.. ఈ అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. జనపనార సంచులు వాడండి వరి, కూరగాయలను జనపనార సంచుల్లో ప్యాక్ చేయాల్సిందిగా పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలను కోరతామని జౌళి మంత్రి స్మృతి ఇరానీ రాజ్యసభకు తెలిపారు. జనపనార రైతులకు అధీకృత విత్తనాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రాజ్యసభకు 4 రోజుల సెలవు రాజ్యసభకు శనివారం నుంచి 4 రోజులు సెలవు ప్రకటించారు. శని, ఆది సాధారణ సెలవు రోజులు కాగా మంగళవారం శ్రీరామనవమి కావడంతో ఆరోజు, పండగ సందర్భంగా అదనంగా సోమవారం సెలవుగా ప్రకటించారు. సభ బుధవారం తిరిగి సమావేశమవుతుంది. -
పరీకర్ విధానాలే కొనసాగుతాయి: జైట్లీ
న్యూఢిల్లీ: రక్షణ మంత్రిగా తాను అదనపు బాధ్యతలు చేపట్టినప్పటికీ ఆశాఖ మంత్రిగా మనోహర్ పరీకర్ అమలు చేసిన విధానాలనే కొనసాగిస్తానని ఆర్థికమంత్రి జైట్లీ స్పష్టం చేశారు. రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన మనోహర్ పరీకర్ గోవా ముఖ్యమంత్రిగా వెళ్తున్న నేపథ్యంలో ఆశాఖ బాధ్యతలను మంగళవారం అరుణ్జైట్లీ చేపట్టారు. గతంలోనూ 2014 మే నుంచి నవంబర్ వరకు జైట్లీ రక్షణ మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. పరీకర్ తన విధుల్ని ఎక్కడ విడిచి పెట్టారో అక్కడి నుంచి తాను కొనసాగిస్తానన్నారు. -
నేడే మనోహర్ పరీకర్ ప్రమాణం
-
నేడే పరీకర్ ప్రమాణం
⇒ రక్షణ మంత్రి పదవికి రాజీనామా.. రాష్ట్రపతి ఆమోదం ⇒ జైట్లీకి అదనంగా రక్షణ శాఖ బాధ్యతలు పణజి, సాక్షి, న్యూఢిల్లీ: గోవా సీఎంగా మనోహర్ పరీకర్ మంగళవారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీంతో సోమవారం ఆయన రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రధాని సలహా మేరకు పరీకర్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారని రాష్ట్రపతిభవన్ ఒక ప్రకటనలో పేర్కొంది. పరీకర్తో పాటు 8 లేదా 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గోవాలో మెజార్టీ రాకపోయిన ఇతర చిన్న పార్టీలు, స్వతంత్రుల సాయంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. కేబినెట్లో గోవా ఫార్వర్డ్ పార్టీ(జీఎఫ్పీ)కి రెండు, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ(ఎంజీపీ)కి రెండు మంత్రి పదవులు దక్కనున్నాయి. కాంగ్రెస్ లెక్కకు గడ్కరీ చెక్... గోవాలో బీజేపీ 13 స్థానాలే సాధించినా... జీఎఫ్పీ, ఎంజీపీ, ఇద్దరు స్వతంత్రుల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. అసెంబ్లీలో మొత్తం 40 మంది సభ్యులుండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు 21 మంది అవసరం. కాంగ్రెస్ 17 సీట్లు గెల్చుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినా మెజార్టీ సభ్యుల్ని కూడగట్టడంలో విఫలమైంది. అదే సమయంలో బీజేపీ తరఫున సీనియర్ నేత గడ్కరీ రంగంలోకి పరిస్థితిని బీజేపీకి అనుకూలంగా మార్చేశారు. పరీకరే సీఎం అభ్యర్థి అంటూ గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో జోరుగా ప్రచారం సాగింది. జైట్లీకి రక్షణ శాఖ బాధ్యతలు పరీకర్ రాజీనామాతో రక్షణ శాఖ బాధ్యతల్ని ఆర్ధిక మంత్రి జైట్లీకి అదనంగా అప్పగించారు. ప్రధాని సలహా మేరకు రక్షణ శాఖను జైట్లీకి కేటాయించారని రాష్ట్రపతి భవన్ పేర్కొంది. రక్షణ శాఖ బాధ్యతల్ని జైట్లీ చేపట్టడం ఇది రెండోసారి. సీఎంగా పరీకర్ వెళ్తుండడంతో ... శాసనసభకు పోటీ చేసేందుకు వీలుగా మాపుసా స్థానానికి డిప్యూటీ సీఎం ఫ్రాన్సిస్ రాజీనామా చేశారు. త్వరలో కేబినెట్లో మార్పులు రెండో విడత బడ్జెట్ సమావేశాల తర్వాత కేంద్ర మంత్రివర్గంలో మార్పులు జరగవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని మార్పులు చేస్తారని భావిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంల్లో ఒకరిని కేంద్ర ప్రభుత్వంలో చేర్చుకునే అవకాశాలున్నాయని, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శుల్లో ఒకరిని ఆ రాష్ట్రానికి సీఎంగా చేయవచ్చని చెబుతున్నారు. మమ్మల్ని ఆహ్వానించండి..: కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ గోవా కాంగ్రెస్ శాసనసభా పక్షం సోమవారం రాత్రి రాష్ట్ర గవర్నర్ను కలిసి విజ్ఞప్తి చేసింది. తమ పార్టీకి తగినంత మద్దతు ఉందని, అసెంబ్లీలో బలం నిరూపించుకుంటామని గవర్నర్కు సమర్పించిన విజ్ఞాపన పత్రంలో పేర్కొంది. సుప్రీంను ఆశ్రయించిన కాంగ్రెస్ మనోహర్ పరీకర్ను గోవా సీఎంగా నియమిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ మృదులా సిన్హా తీసుకున్న నిర్ణయాన్ని సవాలుచేస్తూ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. సోమవారం రాత్రి సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ ఖేహర్ నివాసంలో పిటిషన్ దాఖలుచేసింది. మంగళవారం ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి అంగీకరించారు. హోలీ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వారం రోజులు సెలవు కావడంతో కేసును ప్రత్యేక బెంచ్ విచారించనుంది. గోవా సీఎల్పీ నేత చంద్రకాంత్ కవ్లేకర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. గవర్నర్ నిర్ణయాన్ని రద్దు చేయాలని పిటిషన్లో కోరారు. -
దేశీయ 'నేత్ర'
స్వదేశీ సాంకేతికతతో రూపొందిన 'నేత్ర' భారతీయ వాయుదళంలో చేరింది. నేత్రలో వినియోగించిన ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టం(ఏఈడబ్ల్యూ&సీ)ను దేశీయంగా అభివృద్ధి చేశారు. యుద్ధ సమయాల్లో శత్రువుల రాకను దాదాపు 300 కిలోమీటర్లు ముందే నేత్ర గుర్తించగలదు. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఎయిర్ షో ఎరో ఇండియా ప్రారంభ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ నేత్రను ఐఏఎఫ్ స్క్వాడ్రన్కు అప్పగించారు. పంజాబ్లోని భతిండా బేస్ నుంచి నేత్ర తన సేవలను ప్రారంభించనుంది. నేత్రలో ఉపయోగించిన రాడార్ వ్యవస్ధ, మరికొన్ని కీలక విభాగాలు స్వదేశీయంగా అభివృద్ధి చేసినవే. ప్రస్తుతం రెండు నేత్ర విమానాలను ఐఏఎఫ్కు అందిస్తున్నారు. భవిష్యత్తులో నేత్ర సిస్టంను భారత ఇంజనీర్లు మరింత తీర్చిదిద్దుతారని భావిస్తున్నట్లు పరీకర్ చెప్పారు. -
నో డౌట్.. అధికారం మాదే!!
గోవా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు చెందిన అధికార పార్టీలు మళ్లీ తమదే అధికారమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఓటింగ్ సరళీ అధికార పార్టీలకు అనుకూలంగా ఉందని అంచనా వేస్తున్నాయి. కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్ మాట్లాడుతూ.. గోవా ఎన్నికల్లో మరోసారి బీజేపీదే అధికారమని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదని పేర్కొన్నారు. అటు పంజాబ్లో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న అధికార శిరోమణి అకాలీ దళ్ కూడా మరోసారి తమదే గెలుపు అంటూ ధీమా వ్యక్తం చేసింది. పంజాబ్లో తాము మరోసారి గెలిచితీరుతామని అకాలీ దళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ తెలిపారు. కాంగ్రెస్ నేత అమరీందర్ సింగ్ది డ్రామా అని, ఆయనకు డిపాజిట్ కూడా రాదని ఆయన పేర్కొన్నారు. ఆప్ మూడోస్థానానికి పరిమితమవుతుందని బాదల్ జోస్యం చెప్పారు. మరోవైపు పంజాబ్, గోవాలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ప్రజలు, పలువురు రాజకీయ నాయకులు, సినీ, క్రీడా ప్రముఖులు క్యూలో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. -
ఆర్మీ, నేవీలకు కొత్త అధిపతులు
న్యూఢిల్లీ: భారత 27వ సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ శనివారం పదవీ బాధ్యతలు చేపట్టారు. పదవీ విరమణ పొందిన జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు అనూప్ రాహా స్థానంలో వైమానిక దళాధిపతిగా ఎయిర్ మార్షల్ బిరేందర్ సింగ్ ధనోవా బాధ్యతలు స్వీకరించారు. జనరల్ రావత్ కన్నా ప్రవీణ్ భక్షి, పీఎం హరీజ్లు ఎంతో సీనియర్లు కావడం గమనార్హం. అయితే రావత్కు ఈస్ట్రన్ కమాండ్కు అధిపతిగా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ భక్షి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఆర్మీ చీఫ్గా రావత్ నియామకం నేపథ్యంలో భక్షి రాజీనామా చేయవచ్చు లేదా ముందస్తు రిటైర్మెంట్ తీసుకోవచ్చనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఇటీవల రక్షణ మంత్రి మనోహర్ పరీకర్తో కూడా ఆయన భేటీ అయ్యారు. కానీ మీడియాతో పాటు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వదంతులన్నిటికీ స్వస్తి పలకాలని భక్షి విజ్ఞప్తి చేశారు. సైన్యంతో పాటు జాతి ప్రయోజనాలపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని సూచించారు. ఇలావుండగా ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని శనివారం పదవీ విరమణ చేసిన జనరల్ సుహాగ్ చెప్పారు. ఒక ర్యాంకు ఒక పింఛను పథకం అమలు చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మధ్యాహ్నం జనరల్ రావత్కు ఆయన బాధ్యతలు అప్పగించారు. అంతకుముందు జనరల్ సుహాగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ రాహా అమర్ జవాన్ జ్యోతి వద్ద నివాళులర్పించి గౌరవ వందనం స్వీకరించారు. -
ఇంకెంత మంది సైనికులు మరణించాలి?
న్యూఢిల్లీ: ‘దేశంలో పెద్ద నోట్లను రద్దు చేయడంతో టెర్రరిస్టులకు, మిలిటెంట్లకు నిధులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక మన దేశ సరిహద్దులన్నీ పూర్తిగా సురక్షితం’ అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ నవంబర్ 27వ తేదీ నాడు వ్యాఖ్యానించారు. ‘ఒక్కసారి నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎవరు కూడా భారత్లోకి అడుగు పెట్టేందుకు సాహసించరు’ అని 2014, ఏప్రిల్ నెలలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఓ ఎన్నికల సభలో వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ భూభాగంలోకి మన సైనికులు చొచ్చుకుపోయి ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ దాడులు సూపర్గా చేశారని ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీలో కిందిస్థాయి నుంచి పైస్థాయి నాయకత్వం వరకు చంకలు గుద్దుకున్నారు. ఈ వ్యాఖ్యలన్నీ నేడు నిజమే అయితే మంగళవారం నాడు జమ్మూకు సరిగ్గా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగ్రోటాలోని భద్రతా బలగాల స్థావరంపై సరిహద్దులు దాటి వచ్చిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఎలా దాడి చేశారు? సర్జికల్ దాడులతోపాటు పెద్ద నోట్ల రద్దు వ్యవహారం కేవలం ప్రచార అస్త్రాలుగానే మిగిలిపోతున్నాయా? నగ్రోటాలో భద్రతా బలగాల స్థావరంపై సైనిక దళాలు జరిపిన దాడుల్లో ఇద్దరు అధికారులు, ఐదుగురు సైనికులు మరణించిన విషయం తెల్సిందే. ఈ ఒక్క నెలలోనే 11 మంది మరణించగా, గడిచిన మూడు నెలల్లో టెర్రరిస్టుల దాడులకు 40 మంది సైనికులు మరణించారు. పంజాబ్లోని గురుదాస్పూర్తో మొదలైన ఈ దాడులు పఠాన్కోట్, ఊడికి విస్తరించి, ఇప్పుడు నగ్రోటాకు పాకాయి. ఈ అన్ని దాడులు సూచిస్తున్న ఓ కామన్ పాయింట్నన్నా కేంద్ర ప్రభుత్వం పట్టుకుందా? అదే సైనికులను మాత్రమే లక్ష్యంగా చేసుకొని టెర్రరిస్టులు దాడులను నిర్వహించడం. ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ.... నగ్రోటాలోని 16వ పటాలానికి కమాండింగ్ జనరల్ ఆఫీసర్గా గత అక్టోబర్ నెలలోనే బాధ్యతలు స్వీకరించిన లెఫ్ట్నెంట్ జనరల్ ఏకే శర్మకు వారం రోజుల క్రితమే పటాలంపై పెద్ద దాడి జరగబోతోందని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం అందిందట. వాస్తవానికి రెండో సిక్కు రిజిమెంట్ బెటాలియన్కు చెందిన శర్మకు తిరుగుబాటు కార్యకలాపాలను ఎదుర్కోవడంలో అపారమైన అనుభవం ఉందట. అందుకనే ఈకొత్త విధులు అప్పగించారట. అయినా ఆయన తనకందిన సమాచారం ప్రకారం తన కిందిస్థాయి అధికారులందరికి అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారట. అయినా అన్ని చోట్ల లోపాలు.... నగ్రోట స్థావరంలోకి వచ్చిన తమిళ పటాలంకు అసలు ఆయుధాలే ఇవ్వలేదట. భోజన శాలకు సమీపంలో టెంటుల్లో పడుకున్న సైనికుల వద్ద ఎదురు కాల్పులు జరపడానికి ఆయుధాలే లేవట. ఎదురుకాల్పుల్లో చనిపోయింది ముగ్గురు ఉగ్రవాదులని, మరో ముగ్గురు ఉగ్రవాదులు తప్పించుకుపోయారని కొందరు అధికారులు చెబుతుండగా, మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు చనిపోయారని మరికొందరు అధికారులు చెబుతున్నారు. ఎందుకీ సమన్వయ లోపం, లోపాలకు ఎవరు బాధ్యలు? పక్కా ప్రణాళిక ఎప్పుడు? పఠాన్కోట్ నుంచి ఊడి వరకు టెర్రరిస్టులు దాడులు జరిపినా, 40 మంది వీరులు మరణించినా పాలకులు ఎందుకు మేల్కోవడం లేదు? ఇలాంటి దాడులు పునరావతం కాకుండా పక్కా ప్రణాళికను ఎందుకు రచించడం లేదు ? సైన్యానికి, ప్రభుత్వానికే కాకుండా, ప్రభుత్వం పెద్దల మధ్యనే సమన్వయలోపం ఉందనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. పఠాన్కోట్ దాడిలో ఆరుగురు టెర్రరిస్టులు మరణించారని సాక్షాత్తు కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించగా, ప్రభుత్వం నలుగురే దాడి చేశారని, ఆ నలుగురు మరణించారని నవంబర్ 29న పార్లమెంట్లో ప్రకటించింది. పాలకులు కేవలం ప్రచారానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా, చిత్తశుద్ధితో పక్కావ్యూహంతో ముందుకు వెళ్లనంతా కాలం మన సైనిక వీరులు అన్యాయంగా మరణిస్తూనే ఉంటారు. పాలకులు నివాళులర్పించడం మినహా చేయగలిగిందీ ఏమీ ఉండదు. -ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
సరిహద్దులో గన్తో కనిపిస్తే కాల్చేయడమే: పరీకర్
పనాజీ: ఎవరైనా మెషీన్ గన్ లేక పిస్టల్తో కనిపిస్తే కాల్చిపడేయాలని కశ్మీర్లోని జవాన్లకు పూర్తి అధికారాలు ఇచ్చినట్లు రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ వెల్లడించారు. ఉగ్రవాదుల చేతుల్లో అమరులయ్యే వరకు వేచి చూడక వారిని అంతం చేయాలని సైన్యానికి సూచించినట్లు పేర్కొన్నారు. వాస్కోలో ఆదివారం రాత్రి బీజేపీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న పరీకర్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ పాల్పడుతున్న కాల్పుల ఉల్లంఘనలకు ధీటైన సమాధానమివ్వాలంటూ మన సైన్యానికి సూచించినట్లు తెలిపారు. శత్రువును అంతం చేసేందుకు ఇప్పుడు రక్షణ శాఖ నుంచి ఎలాంటి అనుమతి అక్కర్లేదని స్పష్టం చేశారు. అలాగే ముంబైలో విధ్వంసక నౌక ‘ఐఎన్ఎస్ చెన్నై’ను జాతికి అంకితమిస్తూ.. ఇటీవల భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ దాడులు దూకుడుతో చేసినవి కావని, అలాగని వెనక్కుతగ్గబోమని పేర్కొన్నారు. -
సర్జికల్ స్ట్రయిక్స్ క్రెడిట్ మోదిదే
-
‘సర్జికల్’ షాక్లోనే పాకిస్తాన్
ఆపరేషన్ మత్తు నుంచి ఇంకా కోలుకోలేదు - హనుమంతుడి లా జవాన్లకు తమ శక్తేంటో తెలిసింది: పరీకర్ - ఎల్వోసీ వెంట మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్ బలగాలు - సర్జికల్ దాడుల నేపథ్యంలో రాష్ట్రపతితో ప్రధాని భేటీ డెహ్రాడూన్: భారత సర్జికల్ దాడుల షాక్ నుంచి పాకిస్తాన్ ఇంకా తేరుకోలేదని, ఆపరేషన్ పూర్తయినా పాకిస్తాన్ ఇంకా మత్తులోనే ఉందని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ అన్నారు. హనుమంతుడు తన శక్తిని గుర్తించినట్లు ఈ దాడులతో భారత సైన్యం తమ సామర్థ్యాన్ని తెలుసుకుందని పేర్కొన్నారు. శనివారం ఉత్తరాఖండ్లో స్వాతంత్య్ర సమరయోధుడు వీర్చంద్రసింగ్ గర్వాల్ విగ్రహావిష్కరణ సభలో పరీకర్ మాట్లాడుతూ... దాడులు పూర్తయిన రెండ్రోజుల అనంతరం కూడా ఏం జరిగిందో తెలియని పరిస్థితిలో పాక్ ఉందన్నారు. అనస్తీసియా(మత్తు)లో ఉన్న రోగికి ఆపరేషన్ పూర్తయ్యాక కూడా ఆ విషయం తెలియట్లే... సర్జికల్ దాడుల అనంతరం పాక్ పరిస్థితి అలా ఉందని చమత్కరించారు. భారత్ శాంతినే కోరుకుంటుందని, రెచ్చగొట్టకుండా దాడులు చేయదని అన్నారు. ‘ప్రతీకారం తీర్చుకునే సత్తా భారత దళాలకు ఉందన్న విషయాన్ని పాక్కు చెప్పడానికే దాడులు చేశారు. హనుమంతుడి శక్తుల గురించి జాంబవంతుడు చెప్పాక ఒక్క అంగలో సముద్రాన్ని దూకిన విషయం మన సైనికులకూ వర్తిస్తుంది. సర్జికల్ దాడులకు ముందు హనుమంతుడి వలే తమ సామర్థ్యం గురించి సైనికులకు తెలియదు’ అని పేర్కొన్నారు. దాడుల అనంతరం పాక్ గందరగోళంలో ఉందని, ఎలా స్పందించాలో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. కాగా, ఈ దాడుల నేపథ్యంలో ప్రధాని మోదీ... శనివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని ట్వీట్ చేశారు. వారి మధ్య ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయో మాత్రం తెలియలేదు. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన భారత సైనిక శిబిరాలు, జనావాసాలే ల క్ష్యంగా పాక్ దళాలు శనివారం కాల్పులకు తెగబడ్డాయి. మోర్టార్ బాంబులు, భారీ మెషిన్ గన్స్తో జమ్మూ కశ్మీర్లోని అక్నూర్ తాలుకాలో ఎల్వోసీ వెంట 3 గంటలకు పైగా కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఎలాంటి నష్టం జరగలేదని ఆర్మీ పేర్కొంది. తెల్లవారుజాము 3.30 గంటలకు ప్రారంభమైన కాల్పులు 6 గంటల వరకూ కొనసాగాయంది. అక్నూర్ తాలూకా పల్లాన్వాలా సెక్టార్, చాంబ్ ప్రాంతాల్లో విచక్షణారహితంగా కాల్పులు జరిపారని, బడూ, చనూ గ్రామాలపై కూడా కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. సరిహద్దు ప్రాంతాల గ్రామస్తులు పశువులు, ఇళ్లను చూసుకునేందుకు తిరిగి రాగా... వారిని లక్ష్యంగా చేసుకుని భారీ ఎత్తున కాల్పులు జరిపారని పోలీసులు వెల్లడించారు. గత నాలుగు రోజుల వ్యవధిలో ఐదో సారి పాక్ కాల్పుల విర మణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత్ నిజాన్ని దాస్తోంది: పాకిస్తాన్ పీవోకేలో భారత్ దాడుల సందర్భంగా ఆ దేశ సైనికులు మరణించారని పాక్ మళ్లీ పేర్కొంది. నష్టాన్ని భారత్ దాస్తోందని పాక్ ఆర్మీ ప్రతినిధి అసిమ్ సలీం బజ్వా ఆరోపించారు. భారత దాడుల్ని తమ దళాలు తిప్పికొట్టాయన్నారు. సరిహద్దుల్లో దల్బీర్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ ఉత్తర, పశ్చిమ కమాండ్ బేస్ల్ని శనివారం సందర్శించారు. నార్తర్న్ కమాండ్ ప్రధాన కార్యాలయంలో శనివారం ఉన్నతస్థాయి భేటీ నిర్వహించారు. సరిహద్దు వెంట యుద్ధ సన్నద్ధతను సమీక్షించారు. పీవోకేలోని ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు చేసిన సైనికులు, అధికారుల్ని వ్యక్తిగతంగా అభినందించారు. -
అందుకే కేజ్రీవాల్ నాలుక పెరిగింది : పరీకర్
పనాజీ: ఇటీవల నాలుకకు శస్త్రచికిత్స చే యించుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ వ్యంగాస్త్రాలు సంధించారు. ప్రధాని మోదీ, తనపై విమర్శలు చేయడం వల్లే కేజ్రీవాల్ నాలుక పొడవైందని, ఇప్పుడు దాన్ని శస్త్రచికిత్సలో తగ్గించారని శనివారం అన్నారు. అయినా అనారోగ్యంతో సెలవులో ఉన్న కేజ్రీవాల్పై పరీకర్ సానుభూతి చూపారు. శనివారం గోవాలో జరిగిన ఓ కార్యక్రమంలో రక్షణ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. -
కొనసాగుతున్న ‘ఆపరేషన్ తలాష్’
ఐదో రోజూ కనిపించని విమానం చెన్నై/న్యూఢిల్లీ : ఐదురోజులుగా ముమ్మర గాలింపు చేపడుతున్నా.. అదృశ్యమైన వాయుసేన ఏఎన్32 విమానం జాడ దొరకలేదు. నౌకా, వైమానిక, తీరరక్షక దళాలకు తోడు ఇస్రో రంగంలోకి దిగినా పురోగతి కనిపించలేదు. గాలింపు చర్యలకు అధికారులు ‘ఆపరేషన్ తలాష్’ పేరు పెట్టారు. మారిషస్కు వెళ్లిన సాగర్ నిధి అనే అత్యాధునిక నౌక మంగళవారం చెన్నై చేరుకుంది. దీని సాయంతో నేవీ లోతైన సముద్ర ప్రాంతానికి వెళ్లి గాలింపు పనుల్లో నిమగ్నమైంది. ‘ఇప్పటిదాకా చేసిన ప్రయత్నాలు ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ ఢిల్లీలో చెప్పారు. విమానం అదృశ్యంపై రాజ్యసభలో విపక్షాలు ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించాయి. -
16న బీజేపీ వికాస్ పర్వ్
► టీడీపీ విమర్శలకు పారికర సమాధానం నెల్లూరు: నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో రాష్ట్రానికి చేసిన ప్రయోజనాలను వివరించేందుకు ఈ నెల 16న ఆ పార్టీ నెల్లూరులో సభ నిర్వహించనుంది. రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ సభలో రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం నేతల విమర్శలు, ఆరోపణలకు గట్టిగా సమాధానం చెప్పేందుకు కమలనాథులు సిద్ధమవుతున్నారు. ప్రత్యేక హోదా, రాజధాని నిర్మా ణం, రెవెన్యూలోటు భర్తీ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నామమాత్రపు సాయం చేసిందని సీఎం చంద్రబాబు సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కొంత కాలం నుంచి విమర్శల దాడి పెంచారు. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ నిధులు సాధిస్తామని ఓ వైపు చెబుతూనే మరో వైపు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పట్ల సవతి ప్రేమ చూపుతోందనే భావనను ప్రజల్లో కల్పించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల నెల్లూరులో నిర్వహించిన తెలుగుదేశం మినీ మహానాడులో మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డితో పాటు ఇతర నేతలు బీజేపీ ప్రభుత్వంపై గట్టిగా విమర్శలు గుప్పించారు. బీజేపీ జిల్లా నేతలు వీటికి సమాధానం ఇచ్చినా జనంలోకి పెద్దగా వెళ్లలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 16న మోదీ రెండేళ్ల పాలనపై నిర్వహించే సభలో కేంద్ర మంత్రుల ద్వారా సమాధానం చెప్పించాలని జిల్లా నాయకత్వం నిర్ణయించింది. ఇందుకోసం రక్షణ మంత్రి మనోహర్ పారికర్, సహాయ మంత్రి విజయ్ సంప్ల, రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు, జాతీయ ఉపాధ్యక్షుడు దినేష్ శర్మను సభకు రప్పిస్తున్నారు. పారిశ్రామిక వేత్త పొన్నలూరి సీతారామిరెడ్డి అధ్యక్షతన టౌన్ హాల్లో సాయంత్రం 5 గంటలకు సభ ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రుల రాక సందర్భంగా నగరంలో పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. -
‘అనుసంధానిత భద్రత’పై పరీకర్-కార్టర్ చర్చ
సింగపూర్: ప్రపంచవ్యాప్తంగా ‘అనుసంధానిత భద్రత వ్యవస్థ నిర్మాణం’(నెట్వర్క్డ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్)పై భారత, అమెరికా రక్షణ మంత్రులు మనోహర్ పరీకర్, అష్టన్ కార్టర్ మధ్య శనివారం చర్చలు జరిగాయి. సింగపూర్లో ‘15వ షాంఘ్రి-లా డైలాగ్’ సందర్భంగా జరిగిన సమావేశంలో వీరిద్దరూ పలు అంశాలపై చర్చించినట్లు పెంటగాన్ ఓ ప్రకటనలో తెలిపింది. భారత-అమెరికా రక్షణ రంగంలో పరస్పర సహకారంతోపాటు ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో శాంతి నెలకొల్పేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా వీరు చర్చించారు. దీంతోపాటు భారత-అమెరికా మధ్య రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారం గురించి, ఈ సంబంధాల్లో ఇంతవరకు జరిగిన అభివృద్ధిపై విస్తృతస్థాయి చర్చలు జరిగాయని వెల్లడించింది. జపాన్ రక్షణ మంత్రితోనూ కార్టర్ సమావేశమై పలు ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నారు. మలేషియా రక్షణ మంత్రి హిషాముద్దీన్తో చర్చలు జరిపారు. దక్షిణ చైనా సముద్రంలో నెలకొన్న సమస్యలకు అంతర్జాతీయ చట్టాల ద్వారా శాంతి నెలకొనేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
కొన్ని తీర్పులు అర్థరహితం
రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ పణజి: న్యాయవ్యవస్థ ఇచ్చిన కొన్ని ఆదేశాలు అర్థరహితమైనవని.. వాటికి శాస్త్రీయ ప్రాతిపదిక ఏదీ లేదని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ విమర్శించారు. ఆయన సోమవారం పణజిలో ఘన వ్యర్థ నిర్వహణ కేంద్రాన్ని ప్రారంభించి, అనంతరం మాట్లాడారు. ‘‘ఎటువంటి శాస్త్రీయ ప్రాతిపదికా లేకుండా అర్థరహిత ఆదేశాలు ఇవ్వటం జరుగుతోంది. శాస్త్రాన్ని అర్థం చేసుకోని కొందరు మనుషులు దానికి భాష్యం చెప్పటం మొదలుపెట్టారు. భారత్లో కొందరు పెట్టుబడులు పెట్టడం ఆపివేశారు.. ఎందుకంటే కోర్టు నిర్ణయాలు తాము అర్థం చేసుకోగల పరిధిని దాటిపోయి ఉన్నాయని అంటున్నారు. ‘‘కాలుష్యం కలిగిస్తున్న డీజిల్ వాహనాలను నిషేధించవచ్చని మేం అర్థం చేసుకోగలం. కానీ.. కాలుష్యం కలిగించని లేదా పెట్రోల్ వాహనం కన్నా తక్కువ కాలుష్యకారకమైన వాహనాలను నిషేధించటంలో అర్థం ఏమిటి?’’ అని వ్యాఖ్యానించారు. -
సియాచిన్లో 41 మంది..
న్యూఢిల్లీ: సియాచిన్ గ్లేసియర్ విషాదంపై కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ పార్లమెంటులో ఒక ప్రకటన చేశారు. సభ్యులు విశ్వంభర్ ప్రసాద్ నిషద్, కనకలతా సింగ్ రాజ్యసభలో అడిగిన లిఖిత పూర్వక ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. సైనికుల సంక్షేమం కోసం భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. సియాచిన్ పర్వత ప్రాంతంలో భారత సైన్యం అత్యాధునిక టెక్నాలజీ వినియోగిస్తున్నట్టు తెలిపారు. ముఖ్యంగా మానవరహిత ఏరియల్ వాహనాలు, వివిధ రకాల రాడార్లు తదితర ఆధునిక టెక్నాలజీని ఉపయెగిస్తున్నామన్నారు. ఇకముందు సరిహద్దులో భద్రతా కారణాలు, అక్కడి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అవసరమైన మేరకు సైనిక బలగాలను తరలిస్తామన్నారు. దీంతోపాటు తాజా ఘటన సహా, గత మూడేళ్లుగా సియాచిన్ పర్వత ప్రాంతాల్లో అమరులైన సైనికుల వివరాలు అందజేశారు. 2016 ఫిబ్రవరి 18 వరకు ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 2013 - 10 2014 - 8 2015 - 9 2016- 14 కాగా సియాచిన్ గ్లేసియర్లో సంభవించిన మంచుతుఫానులో చిక్కుకొని ఫిబ్రవరి 3న 10 మంది సైనికులు అసువులు బాసిన సంగతి తెలిసిందే. -
వన్ ర్యాంక్ వన్ పెన్షన్కు కట్టుబడి ఉన్నాం
రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల సందర్భంలో బీజేపీ ఇచ్చిన ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ హామీకి కట్టుబడి ఉన్నామని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. ఆయన ఆదివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ పథకం ఆర్థికంగా ప్రభుత్వానికి భారమైనప్పటికీ అమలు చేస్తామని పేర్కొన్నారు. దీని కోసం బడ్జెట్లో ఏడాదికి రూ.7,483 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. గత యూపీఏ ప్రభుత్వం ఈ పథకానికి రూ.500 కోట్లు మాత్రమే కేటాయించిందని, తమ ప్రభుత్వం 21 శాతం ఎక్కువ కేటాయించిందని వివరించారు. ఇదే కాకుండా రూ.10,500 కోట్ల బకాయిలను నాలుగు విడతల్లో అందజేస్తామని తెలిపారు. పాకిస్తాన్ను ఐఎఫ్ఆర్కు ఆహ్వానించామని, ఎందుకు రాలేదో తెలియదని ఆయన చెప్పారు. సర్క్రీక్ వివాదం మినహా పాకిస్తాన్తో ఎలాంటి సమస్యలు ప్రస్తుతానికి లేవన్నారు. సియాచిన్ ఘటన అత్యంత బాధాకరమన్నారు. ఇంతవరకూ అక్కడ వెయ్యిమంది సైనికుల్ని కోల్పోయామన్నారు. ఇకమీదట ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. సముద్ర వివాదాల పరిష్కారానికి ఓ ఏజెన్సీ ఉండాలన్నారు. ఐఎఫ్ఆర్కు బాలీవుడ్ నటులు అక్షయ్కుమార్, కంగనా రనౌత్లను ఆహ్వానించడం నేవీ తీసుకున్న నిర్ణయమని ఓ ప్రశ్నకు సమాధానంగా పారికర్ చెప్పారు. ఐఎఫ్ఆర్కు వారిని బ్రాండ్ అంబాసిడర్లుగా నియమిస్తూ రక్షణ శాఖ ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని స్పష్టం చేశారు. వారు కేవలం నేవీ ఆహ్వానం మేరకు అతిథులుగానే వచ్చినట్లు భావిస్తున్నానన్నారు. సముద్ర వివాదాలు సమసిపోవాలి ప్రపంచ దేశాల మధ్య సముద్ర వివాదాలు సమసిపోవాలని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ ఆకాంక్షించారు. విశాఖలో రెండు రోజులపాటు జరిగే ఇంటర్నేషనల్ మారిటైమ్ సదస్సు ఆదివారం ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా హాజరైన పారికర్ దేశ, విదేశ నేవీ అధికారులనుద్దేశించి ప్రసంగించారు. సముద్ర సరిహద్దులు మనుషులు పెట్టుకున్నవేనని, గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు కరిగి సముద్ర మట్టాలు పెరిగి, సరిహద్దులు మారుతున్నాయని అన్నారు. ఆర్థిక ముఖచిత్రం కూడా మారుతోందన్నారు. ఈ నేపథ్యంలో సముద్ర వనరుల్ని సమగ్రంగా వినియోగించుకోవాలని, వివాదాల్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. పెరిగిపోతున్న సముద్ర దొంగల బెడద, ఉగ్రవాదాన్ని నౌకాదళాలు ఒంటరిగా ఎదుర్కోవడం కష్టమని నేవీ చీఫ్ ఆర్కే ధోవన్ అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో నౌకాదళాలన్నీ సమష్టిగా వాటిని ఎదుర్కోవాలన్నారు. ఇందులో భాగంగా నౌకాదళాలు సమాచారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలన్నారు. భారత్ ఇప్పటికే అనేక దేశాలతో సమాచార మార్పిడి ప్రక్రియ కొనసాగిస్తోందని గుర్తుచేశారు. భవిష్యత్లో మరిన్ని దేశాలతో సమాచార మార్పిడి సంబంధాలు ఏర్పరచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. -
రాజ్ నాథ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం
కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో శుక్రవారం మధ్యాహ్నం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. పఠాన్ కోట్ దాడి.. ఎన్ఐఏ విచారణల నేపథ్యంలో రక్షణ మంత్రి మనోహర్ పారికర్, జాతీయ భద్రతా సలహాదారు దోవల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.పార్లమెంట్ నార్త్ బ్లాక్ లో జరిగిన ఈ సమావేశంలో పఠాన్ కోట్ దాడి, ఎన్ఐఏ విచారణ తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మరో వైపు.. పఠాన్ కోట్ దాడికి బాధ్యులుగా భావిస్తున్న మోస్ట్ వాండెట్ ఉగ్రవాది, జైషే మహ మ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ ను కస్టడీలోకి మాత్రమే తీసుకున్నామని పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన మంత్రి తెలిపారు. పఠాన్ కోట్ దాడి వెనక మసూద్ హస్తం ఉందని తేలితేనే.. అతడిని అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు. -
వారికీ ఆ నొప్పి చూపించాలి..
దేశానికి హాని చేసే వ్యక్తులు, సంస్థలకు ఆ భాషలోనే బదులివ్వాలి: పరీకర్ ♦ అది ఎలా, ఎప్పుడు, ఎక్కడ అనేది భారతదేశం నిర్ణయించుకోవాలి ♦ ఇతరులను బాధించే వారు ఆ బాధను అనుభవించే వరకూ మారరు న్యూఢిల్లీ: హాని చేసే వారికి అదే భాష అర్థమవుతుందని.. భారతదేశాన్ని ఏ వ్యక్తి లేదా సంస్థ గాయపరచినా వారికి అదే బాధను రుచిచూపించాలని, అది ఎలా, ఎప్పుడు, ఎక్కడ ఇవ్వాలనేది భారత్ నిర్ణయించుకోవాలని రక్షణమంత్రి మనోహర్ పరీకర్ వ్యాఖ్యానించారు. ఇతరులను బాధించే వారు.. ఆ బాధను స్వయంగా అనుభవించే వరకూ మారరని చరిత్ర చెప్తోందని పఠాన్కోట్ ఉగ్రదాడి నేపథ్యంలో అన్నారు. పరీకర్ సోమవారం ఢిల్లీలో సైనిక దళాధిపతి జనరల్ దల్బీర్సింగ్సుహాగ్ సహా సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్న సైనిక సదస్సులో మాట్లాడారు. ‘‘ఇది నా అభిప్రాయం.. ప్రభుత్వ ఆలోచనగా తీసుకోరాదు. ఎవరైనా మనకు హాని చేస్తే.. వారికి అదే భాష అర్థమవుతుందని నేను ఎప్పుడూ నమ్ముతాను. అది ఎలా, ఎప్పుడు, ఎక్కడ అనేది మనం నిర్ణయించుకోవాలి. అలాగే ఎవరైనా దేశానికి హాని చేస్తున్నపుడు.. ఆ నిర్దిష్ట వ్యక్తి లేదా సంస్థలకు కూడా - నేను కావాలనే వ్యక్తి లేదా సంస్థ అనే పదాలు వాడాను - అటువంటి చర్యల నొప్పిని ఇవ్వాలి’’ అని పేర్కొన్నారు. ఆ తర్వాత ఈ వ్యాఖ్యల గురించి మీడియా ప్రతినిధులు వివరణ అడగగా.. ‘‘మనం వారికి బాధ కలిగించే వరకూ - వారు ఎవరైనా సరే - ఇటువంటి చర్యలు తగ్గవు’’ అని స్పందించారు. ఉగ్రదాడిలో తమ ప్రాణాలను త్యాగం చేసిన జవాన్ల పట్ల దేశం గర్విస్తోందన్నారు. అయితే.. తమ ప్రాణాలను త్యాగం చేయటానికి బదులుగా.. మన శత్రువు, దేశానికి శత్రువుల ప్రాణాలను తీసుకునే కోణంలో ఆలోచించాలని మన సైనికులకు చెప్పాలని పేర్కొన్నారు. హోంమంత్రి రాజ్నాథ్తో సుష్మా భేటీ భారత్ - పాక్ విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలపై అనిశ్చితి నేపథ్యంలో.. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ సోమవారం హోంమంత్రి రాజ్నాథ్ను కలిశారు. దాదాపు 20 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో ఏ అంశాలపై చర్చించారన్న దానిపై ఇద్దరి కార్యాలయాలూ స్పందించలేదు. అయితే పఠాన్కోట్ ఉగ్రదాడి అంశంపై చర్చించి ఉండొచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ద్వైపాక్షిక అంశాలపై చర్చించేందుకు ఇరు దేశాల మధ్య ఎప్పుడు సమావేశం జరిగినా.. ఉగ్రవాదానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని, పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థల వివరాలను కేంద్ర హోంశాఖ విదేశీ వ్యవహారాల శాఖకు అందిస్తుంది. ఇటీవల భారత్ - పాక్లు చర్చల ప్రక్రియను పునరుద్ధరించాలని తీసుకున్న నిర్ణయం మేరకు.. ఈ నెల 15వ తేదీన పాక్ రాజధాని ఇస్లామాబాద్లో ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులు సమావేశం కావాల్సి ఉంది. అయితే.. ఉగ్రవాదులు దాడికి పాల్పడిన నేపథ్యంలో.. ఈ దాడికి బాధ్యులైన వారిపై తక్షణం నిర్ణయాత్మక చర్యలు చేపట్టటంపై విదేశాంగ కార్యదర్శుల చర్చల భవితవ్యం ఆధారపడి ఉంటుందని భారత్ స్పష్టంచేసిన విషయం తెలిసిందే. సరిహద్దులో రక్షణ స్థావరాలన్నిటా హై-అలర్ట్...: ఉగ్రసంస్థలకు సరిహద్దులోని భారత భద్రతా స్థావరాలు లక్ష్యంగా ఉండటంతో స్థావరాల్లో హై-అలర్ట్ను కొనసాగిస్తున్నారు. రాజ్నాథ్ సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి అంతర్గత భద్రత, దాడులను తిప్పికొట్టే సన్నద్ధత మీద సమీక్ష నిర్వహించారు. ఎన్ఐఏ ముందుకు పంజాబ్ ఎస్పీ పఠాన్కోట్పై దాడికి ముందు ఉగ్రవాదులు తనను కిడ్నాప్ చేశారని పేర్కొన్న పంజాబ్ ఎస్పీ సల్వీందర్సింగ్ సోమవారం ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) ఎదుట హాజరయ్యారు. కిడ్నాప్కు ముందు, తర్వాత జరిగిన ఘటనలపై ఆయన చెప్తున్న కథనాల్లో పొంతన లేని అంశాలు ఉండటంతో ఆయనను లోతుగా ప్రశ్నించేందుకు తన ఎదుట హాజరు కావాల్సిందిగా ఎన్ఐఏ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పంజాబ్ సాయుధ పోలీసు 75వ బెటాలియన్కు అసిస్టెంట్ కమాండెంట్గా ఉన్న సల్వీందర్ ఈ మేరకు ఢిల్లీలో ఎన్ఐఏ ప్రధాన కార్యాలయానికి వెళ్లి దర్యాప్తు అధికారుల ఎదుట హాజరయ్యారు. వారు ఆయనను 8గంటలపాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. సల్వీందర్ వంటమనిషి మదన్గోపాల్ను కూడా ప్రశ్నించటానికి ఎన్ఐఏ సమన్లు జారీ చేసింది. అవసరమైతే.. ఎస్పీని, వంట మనిషిని కలిపి ప్రశ్నిస్తామని దర్యాప్తు సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. తాము పాక్ సరిహద్దులోని మందిరాన్ని సందర్శించి తిరిగి వస్తుండగా ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారని ఎస్పీ చెప్పటంతో.. ఆ మందిరం బాధ్యుడి వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. కాగా, హతమార్చిన ఉగ్రవాదుల్లో నలుగురిని గుర్తించేందుకు భారత్ ఇంటర్పోల్ సాయం కోరింది. -
అవును.. లోపాలున్నాయ్!
-
అవును.. లోపాలున్నాయ్!
పఠాన్కోట్పై ఉగ్రదాడికి అవి తోడ్పడ్డాయి: పరీకర్ ♦ అక్కడ ఉగ్రవాదులెవరూ లేరు.. అయినా కూంబింగ్ కొనసాగుతోంది ♦ ఉగ్రవాదులు భారీగా ఆయుధాలతో వచ్చారు.. ఆపరేషన్ కష్టమైంది ♦ పఠాన్కోట్ను సందర్శించాక మీడియాతో రక్షణమంత్రి వెల్లడి పఠాన్కోట్: పంజాబ్లోని పఠాన్కోట్ భారత వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడికి కొన్ని లోపాలు దోహదం చేశాయని రక్షణమంత్రి మనోహర్ పరీకర్ అంగీకరించారు. సుదీర్ఘ రక్షణగోడ ఉన్న ఎయిర్బేస్ లోపలికి ఉగ్రవాదులు ఎలా చొరబడగలిగారన్నది ఆందోళన కలిగిస్తున్న అంశమన్నారు. అయితే భద్రతకు సంబంధించిన ప్రతి విషయాన్నీ బాహాటంగా చర్చించలేమన్నారు. పరీకర్ మంగళవారం ఎయిర్బేస్ను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైమానిక స్థావరంపై దాడికి దిగిన ఉగ్రవాదులందరినీ నిర్మూలించటం జరిగిందని.. అయితే స్థావరంలో కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. ‘ఇప్పుడు లోపల అనుమానిత ఉగ్రవాది ఎవరూ లేరు. అయితే.. కూంబింగ్ ఆపరేషన్లు పూర్తయ్యే వరకూ దీనిని నిర్ధారణగా చెప్పను. ఈ ఆపరేషన్లు బుధవారం పూర్తికావచ్చు’ అని పలు ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. ఉగ్రదాడిలో చనిపోయిన ఏడుగురు సైనిక సిబ్బందిలో.. డిఫెన్స్ సెక్యూరిటీ కోర్కు చెందిన ఫతేసింగ్, కుల్వంత్సింగ్ల కుటుంబ సభ్యులను కూడా ఆయన మంగళవారం కలిశారు. పరీకర్ ఏమన్నారంటే.. ► శనివారం ఉదయం 3:30 గంటలకు ఉగ్రవాదులతో ఎదురుకాల్పులు మొదలయ్యాయి. సోమవారం రాత్రి 7:30 గంటలకు ఆ ముష్కరులు చివరిసారిగా తారసపడ్డారు. ఆ తర్వాత కొనసాగుతున్న ఆపరేషన్లు కూంబింగ్ కోసమే. ఆ ప్రాంతంలో చాలా బాంబులున్నాయి.. దీంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవటంలో జాప్యం జరుగుతోంది. చివరి ఉగ్రవాది మృతదేహం బూబీ ట్రాప్(బాంబుల వల) కావచ్చని భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. దీంతో ఆ మృతదేహాన్ని ఇంకా స్వాధీనం చేసుకోలేదు. తొందరపడాల్సిన అవసరం లేదని చెప్పాను. ఇప్పటికే ఒకరిని బూబీ ట్రాప్లో కోల్పోయాం.. మరింత మందిని కోల్పోరాదు. రిస్కు తీసుకోలేం. ► ఉగ్రవాదులు ఏకే47 రైఫిల్లు, మోడిఫైడ్ అండర్ గ్రెనేడ్ బారెల్ లాంచర్లు, పిస్టళ్లు, స్విస్, కమాండో కత్తులు, -50 కిలోల బుల్లెట్లు, డజన్లకొద్దీ మేగజీన్లు, మోర్టార్ల వెంట తెచ్చారు. వారిపై ఆపరేషన్ చాలా కష్టంతో కూడుకున్నది. మూడు వేల మంది కుటుంబాలు, ఐదారు దేశాలకు చెందిన విదేశీ ట్రైనీలు (శిక్షణ కోసం వచ్చిన వారు) ఉన్న ఈ స్థావరంలోని ఆస్తులన్నిటినీ సురక్షితంగా ఉంచుకోవటంపైనే తొలుత దృష్టి కేంద్రీకరించటం జరిగింది. స్థావరంలోని అన్ని ఆస్తులూ.. వ్యూహాత్మక ఆస్తులు, భవనాలు, సిబ్బంది కుటుంబాలను రక్షించుకోవటం జరిగింది. ఉగ్రవాదులు దాక్కున్న భవనం ఒక్కటే దెబ్బతిన్నది. ► ఉగ్రవాదులతో ఎదురు కాల్పుల్లో చనిపోయిన ఏడుగురు భద్రతా సిబ్బందినీ అమరులుగా పరిగణిస్తాం. యుద్ధ పరిస్థితుల్లో చనిపోయిన సైనిక మృతులకు లభించే అన్ని ప్రయోజనాలూ వారికి వర్తిస్తాయి. మృతుల్లో గరుడ్ కమాం డో మినహా ఎవరూ ఆపరేషన్లో చనిపోలేదు. ఐదుగురు ఢిఫెన్స్ సెక్యూరిటీ కోర్ సిబ్బంది దురదృష్టవశాత్తూ చనిపోయారు. వారిలో జగదీశ్చంద్ర ఒక ఉగ్రవాదితో ప్రత్యక్షంగా కలబడి అతడిని హతమార్చాడు. వీరు అత్యుత్తమ త్యాగం చేసిన అమరులు. ► భద్రతకు సంబంధించి కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. కానీ.. భద్రత విషయంలో రాజీపడటం జరిగిందని నేననుకోను. దర్యాప్తులు పూర్తయ్యాక అన్ని అంశాలూ స్పష్టమవుతాయి. భద్రతకు సంబంధించిన ప్రతి వివరాన్నీ బహిరంగంగా చర్చించలేం. ఈ దాడికి పాకిస్తాన్తో లింకు ఉందా అంటే.. ఉగ్రవాదులు ఉపయోగించిన కొన్ని పరికరాలు పాక్లో తయారయినట్లు తెలుస్తోంది. ఎన్ఐఏ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఇది దర్యాప్తులో ఉన్న అంశం కనుక దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించటం సరికాదు. ► సైన్యం, వాయుసేన, ఎన్ఎస్జీలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ను విజయవంతం చేశాయి. ఈ మూడు విభాగాలు భవిష్యత్తులో సంయుక్త శిక్షణ చేపట్టాలి. ఉగ్రవాదులపై దాడికి సైన్యానికి చెందిన ప్రత్యేక బలగాలను కాకుండా ఎన్ఎస్జీని ఎంచుకోవటంపై విమర్శలు సరికాదు. ఎన్ఎస్జీలో సగం మంది సైన్యం నుంచే ఉన్నారు. అన్ని ఆయుధాలనూ ఆర్మీయే అందించింది. వారు కలసి సజావుగా పనిచేశారు. హతులైన ఉగ్రవాదుల్లో నలుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకోగా.. రెండు మృతదేహాలు గుర్తుపట్టటానికి వీలు లేనంతగా కాలిపోయాయి. శరీరభాగాలు రెండు ప్రాంతాల నుంచి లభించాయి. కాగా, ఆపరేషన్ పూర్తవటంతో మంగళవారం రాత్రి ఎయిర్బేస్లోకి మీడియా ప్రతినిధులను అనుమతించారు. ఆ ప్రాంత దృశ్యాలు పోరాటానికి అద్దంపట్టాయి. మూగబోయిన తుపాకులు ఉగ్రదాడి నేపథ్యంలో 3 రోజుల పాటు తుపాకీ కాల్పులు, పేలుళ్లతో నాలుగో రోజు మంగళవారం ఎట్టకేలకు శాంతించింది. సైనిక చర్య.. సోమవారం రాత్రి ఆరో ఉగ్రవాదిని ఎదురు కాల్పుల్లో హతమార్చినట్లు భావిస్తున్నప్పటికీ.. భద్రతా బలగాలు ఈ స్థావరం పూర్తిగా సురక్షితమని నిర్ధారించుకునేందుకు అణువణువూ గాలిస్తూ కూంబింగ్ చేస్తున్నాయి. . శనివారం తెల్లవారుజామున ఎయిర్బేస్పై ఉగ్రవాదులు దాడికి తెగబడటం.. అప్రమత్తంగా ఉన్న భద్రతా బలగాలు వారిని నిలువరించి ఎదురు దాడికి దిగటం తెలిసిందే. శనివారమే నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టగా.. ఆదివారం, సోమవారమూ కొనసాగిన సైనిక చర్యలో మరో ఇద్దరు ఉగ్రవాదులను హతవుర్చారు. అయితే.. ఎయిర్బేస్లోకి చొరబడ్డ ఉగ్రవాదులు ఎంతమంది అనేది కచ్చితంగా తెలియటం లేదు. ఈ నేపథ్యంలో స్థావరంలో కూంబింగ్ ఆపరేషన్లను కొనసాగిస్తున్నారు. -
అమెరికాతో కీలక ‘రక్షణ’ బంధం
-
అమెరికాతో కీలక ‘రక్షణ’ బంధం
‘గ్యాస్ టర్బైన్ టెక్నాలజీ’ ఇచ్చేందుకు యూఎస్ సుముఖత ♦ ద్వైపాక్షిక చర్చల్లో కీలకమలుపు: పారికర్ ♦ అన్ని రంగాల్లో భారత్కు సాయం: కార్టర్ వాషింగ్టన్: రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారత్-అమెరికాల మధ్య ఒప్పందం కుదిరింది. అమెరికాలో పర్యటిస్తున్న భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్.. ఆ దేశ రక్షణ మంత్రి ఆష్టన్ కార్టర్తో జరిపిన భేటీలో.. కీలక అంశాలపై అవగాహన కుదిరింది. సెన్సిటివ్ జెట్ ఇంజన్ రూపకల్పనలో భారత్కు ‘గ్యాస్ టర్బైన్ ఇంజన్’ సాంకేతికతను బదిలీ చేసేందుకు వీలుగా అమెరికా తన విధానపరమైన నిర్ణయాల్లో మార్పు చేసుకుంది. భారత-అమెరికా రక్షణ భాగస్వామ్యంలో కీలకమైన ప్రతిష్ఠాత్మక ‘రక్షణ సాంకేతికత, వ్యాపార సంబంధం’(డీటీటీఐ)కి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం రెండు దేశాల సంబంధాలకు మైలురాయిగా నిలుస్తుందని కార్టర్ తెలిపారు. రక్షణ రంగంలో సాంకేతిక సహకారం పెంపొందించుకోవటంతోపాటు వ్యాపార అవకాశాల గుర్తింపునకు కూడా ఇది దోహద పడుతుంది. భేటీ తర్వాత పారికర్, కార్టర్ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. రెండు దేశాలు రక్షణ రంగంలో పరస్పర సహకారానికి వ్యూహాత్మక భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు పారికర్ తెలిపారు. ప్రపంచ భద్రతకు భారత్-అమెరికా రక్షణ భాగస్వామ్యమే కీలకం కానుందన్నారు. రెండు దేశాల రక్షణ శాఖల మధ్య మరింత సహకారానికి బీజం పడిందన్నారు. కాగా, భారత్కు అన్ని రంగాల్లో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని కార్టర్ తెలిపారు. అంతకుముందు.. యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ కార్యక్రమంలో పారికర్.. అమెరికా రక్షణ రంగ పరిశ్రమలతో సమావేశమయ్యారు. పరిశ్రమల ఏర్పాటుకోసం భారత్ నిబంధనల మార్పుకు చేస్తున్న ప్రయత్నాన్ని రక్షణ రంగ పరిశ్రమ ప్రముఖులు హర్షించారు. భారత్తో సంయుక్తంగా ఏహెచ్-64 అపాచి హెలికాప్టర్ల తయారీకి సిద్ధమని ఇటీవలే బోయింగ్ సంస్థ ప్రకటించింది. భారత్లో ఫైటర్ జెట్ల తయారీ కేంద్రానికి అమెరికా కంపెనీలు ఆసక్తి కనబరుస్తుండటంతో.. ఇందుకోసం సదరు కంపెనీలకు ముందస్తు అనుమతి ఇచ్చేందుకు పెంటగాన్ సానుకూలంగా స్పందించింది. -
రిటైర్మేంట్పై హాట్ కామెంట్ చేసిన మనోహర్
-
మాజీ సైనికుల ‘మెడల్స్ నిరసన’
♦ తిరిగిచ్చేసిన 2 వేల మంది ♦ ఓఆర్ఓపీ నోటిఫికేషన్పై నిరసన చండీగఢ్/వాస్కోడాగామా: ఒకే ర్యాంకు-ఒకే పింఛన్ (ఓఆర్ఓపీ)పై ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనను నిరసిస్తూ చాలామంది మాజీ సైనికులు మంగళవారం తమ మెడల్స్ను తిరిగి ఇచ్చేశారు. దేశానికి తాము అందించిన వీరోచిత సేవలకు గుర్తుగా ఇచ్చిన మెడల్స్ను ఢిల్లీ, హరియాణా, పంజాబ్లలో మాజీ సైనికులు తిరిగి ఇచ్చేశారు. ఓఆర్ఓపీ పథకంపై ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఎన్డీఏ ప్రభుత్వం వెనక్కి తగ్గడాన్ని నిరసిస్తూ ‘బ్లాక్ దివాళీ’ని పాటిస్తామని మాజీ సైనికులు చెప్పారు. గతవారం ఓఆర్ఓపీపై ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ను వ్యతిరేకిస్తూ పలుచోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మంగళవారం అంబాలా, మోగ, జలంధర్, గురుదాస్పూర్లలో మాజీ సైనికులు మెడల్స్ను ఇచ్చేశారని, తదుపరి ముంబై, పుణే, బెంగళూరు, వడోదరాలలో ఇచ్చేస్తారని నిరసనకారుల ప్రతినిధి కల్నల్ అనిల్ కౌల్ ఢిల్లీలో చెప్పారు. ఢిల్లీలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మెడల్స్ను వాపస్ చేశారు. మెడల్స్ను వెనక్కితీసుకోకుంటే రోడ్డుపైనే వదిలేస్తామని చెప్పారని, అందుకే వాటిని తీసుకోవాల్సి వచ్చిందని కలెక్టర్ సంజయ్ కుమార్ విలేకరులకు చెప్పారు. ఈ వ్యవహారంపై రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ తీవ్రంగా స్పందించారు. వీరి చర్య సైనికుల మాదిరి లేదని మండిపడ్డారు. మాజీ సైనికులు ఇలాంటి చర్యలకు దిగడం కలచివేసిందన్నారు. వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆర్థికపరమైన డిమాండ్లకు మెడల్స్కు ముడిపెట్టవద్దని వాస్కోడాగామాలో సూచించారు. సైనికుల మాదిరి ప్రవర్తించలేదన్న పరీకర్ వ్యాఖ్యలపై కల్నల్ అనిల్ కౌల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన శైలి రక్షణ మంత్రి మాదిరి లేదని నిప్పులు చెరిగారు. ఓఆర్ఓపీపై ప్రభుత్వం రాజకీయం చేస్తోందంటూ కాంగ్రెస్ మండిపడింది. -
మనోహర్ పారికర్ రాయని డైరీ
కాంటే సే కాంటా నికల్నా. ముల్లును ముల్లుతోనే తీయాలి. డి.ఆర్.డి.ఒ. డైరెక్టర్స్ కాన్ఫరెన్స్కు వెళ్లినప్పుడు ఆ కాంపౌండ్లో నా కాలికి ముల్లు గుచ్చుకుంది. ముల్లును ముల్లుతోనే తీయాలన్న మాట అప్పుడు గుర్తుకు రాలేదు. చేత్తో తీయబోతే లోపలికి వెళ్లిపోయింది! ఇప్పుడు నొప్పెడుతోంది. పాపం అప్పటికీ పరుగెత్తుకొచ్చాడు క్రిస్టఫర్... ‘క్యా హువా మంత్రీజీ’ అంటూ. కాల్లో ముల్లు దిగింది, దాన్ని తీయడానికి మంచి ముల్లు ఏదైనా దొరుకుతుందేమో చూడమన్నాను. ‘ముల్లెందుకు మంత్రీజీ, ల్యాబ్లో ఫోర్సెప్స్ ఉంటుంది పట్రమ్మంటారా’ అన్నాడు. ‘ముల్లును ముల్లుతోనే తియ్యాలని కదయ్యా నా ఉద్దేశం. అర్థం చేసుకోలేకపోతే ఎలా అంత పెద్ద డి.ఆర్.డి.ఒ. కి హెడ్డుగా ఉండి’ అన్నాను. హర్ట్ అయినట్లున్నాడు! ఈ మనుషులు ఇంత ఫ్రీక్వెంట్గా ఎందుకు హర్ట్ అవుతుంటారో అర్థంకాదు. ఒకసారి, రెండుసార్లు! మాటిమాటికీ హర్ట్ అవుతూపోతుంటే ఎలా? హర్ట్ కానివాళ్లను కూడా హర్ట్ చేయగల చిదంబరంలాంటి వాళ్లను ఇక వీళ్లెలా తట్టుకుంటారో మరి. ఆ మధ్య నన్ను హర్ట్ చెయ్యాలని చూశాడు చిదంబరం. టైస్టుల్ని టైస్టులతోనే ఏరిపారేయాలి అన్నందుకు! టెరిబుల్ స్టేట్మెంట్ ఇచ్చానట! దాన్ని వెనక్కి తీసుకోమంటాడు. ఇచ్చేది తీసుకోడానికా! డిఫెన్స్ మినిస్ట్రీని తీసుకెళ్లి డిఫెన్స్లో పడేసుకోడానికా? అవతలివాడు టైస్టును పంపుతుంటే వాడి మీద పోరాటానికి నేను నా సైనికుడిని ఎందుకు పంపుతాను? టైస్టునే పంపుతాను. సింపుల్ లాజిక్ కదా! పవర్ పోయాక కాంగ్రెస్ వాళ్లకి విల్ పవర్ కూడా పోయినట్లుంది. ఏదేదో మాట్లాడేస్తున్నారు. క్రిస్టఫర్, నేను నడుస్తున్నాం. ‘ఇక్కడ ముల్లు దొరకడం కష్టం మంత్రీజీ’ అంటున్నాడు క్రిస్టఫర్! ప్రకృతిలో ముళ్లే లేవా అన్నాన్నేను. మీరు వస్తున్నారని చెప్పి ప్రకృతినంతా నిన్ననే క్లీన్ చేశాం మంత్రీజీ అన్నాడు క్రిస్టఫర్. క్లీన్ చేశాకే కదా నాకు ముల్లు గుచ్చుకుంది. గుచ్చుకోడానికి ముల్లు ఉండి, గుచ్చుకున్న ముల్లును తీయడానికి ముల్లు లేకపోవడం ఏమిటి?! క్రిస్టఫర్ చేతులు నలుపుకుంటున్నాడు. ‘నీకేమైంది? చేతికి ముల్లు గుచ్చుకుందా.. ప్రకృతిని క్లీన్ చేయిస్తుంటే?’ అన్నాను. ‘లేదు మంత్రీజీ’ అన్నాడు. మరి! ‘బడ్జెట్ లేదు మంత్రీజీ’ అన్నాడు. చైనా ట్వంటీ పర్సెంట్ ఖర్చుపెడుతుంటే, మనం ఫైవ్ పర్సెంటే ఖర్చుపెడుతున్నామట. ‘సరే, చూద్దాం. ఉన్న బడ్జెట్తోనే కాంపౌండ్లో అక్కడక్కడా ముళ్ల చెట్లను పెంచండి’ అని చెప్పి వచ్చేశాను. ముల్లును తీస్తేనేగానీ నాకీ రాత్రి నిద్రపట్టేలా లేదు. రామ్దేవ్బాబాకి లైన్ కలపమన్నాను. గోవాలో ఉన్నాట్ట. గోవాలో బాబాకేం పని! నాకు తెలియని బాబానా? నాకు తెలియని గోవానా? లైన్లోకి వచ్చాడు. ‘బాబాజీ.. ముల్లుని ముల్లుతో కాకుండా ఇంకెలా తీయొచ్చు’ అని అడిగాను. రుగ్వేదాన్ని తిరగేసి చెప్తానన్నాడు. ‘అందులో ఉంటుందా’ అని అడిగాను. ‘లేకున్నా నష్టం లేదు. నా దగ్గర ఎలాగూ ఆయుర్వేదం ఉంది’ అన్నాడు. గ్రేట్ గురూజీ! - మాధవ్ శింగరాజు -
నేపాల్ కు అన్నివిధాల సాయం చేస్తాం: పారికర్
న్యూఢిల్లీ : నేపాల్ కు అన్ని విధాల సహాయం చేయడానికి భారత్ సిద్ధమని కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. అవసరమైతే దేశ ఆర్మీ బలగాలను సహాయ నిమిత్తం అక్కడికి పంపిస్తామని శనివారం ఆయన తెలిపారు. భారత ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ నేపాల్ సర్కారుతో టచ్ లో ఉన్నారని పారికర్ పేర్కొన్నారు. నేపాల్ లో సంభవించిన భూకంపంలో 700మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. బీహార్ కు చెందిన 25 మంది, యూపీకి చెందిన 9 మంది మృతిచెందారు. -
'మా కార్యాలయానికి కోతుల బెడద'
పనాజి: రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయంపై కోతులు దాడి చేస్తున్నాయని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చెప్పారు. ఆదివారమిక్కడ జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యాలయం ముందు ఉన్న భద్రతా సిబ్బంది పని కోతులను లోపలికి రాకుండా చూడటమేనని చెప్పారు. అయితే అవి నిజమైన రామసేన కోతులని, కర్ణాటకకు చెందిన రామసేన కోతులు కాదని మంత్రి హాస్యమాడారు. పారికర్ గోవా సీఎంగా ఉన్నప్పుడు హిందూ మతసంస్థ రామసేనపై నిషేధం విధించారు. -
అది ఉగ్రవాద కుట్రే!
పాక్ మరపడవ పేలుడుపై రక్షణ మంత్రి పారికర్ న్యూఢిల్లీ: గుజరాత్ తీరంలో దేశ సముద్ర జలాల్లోకి మరపడవలో చొరబడిన వ్యక్తులు ఉగ్రవాదులేనని అనుమానిస్తున్నట్లు రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. వారు పాక్ సైన్యంతో సంబంధాలు నెరిపినట్లు సాక్ష్యాధారాలను బట్టి తెలుస్తోందన్నారు. 2008లో ముంబైలో చోటుచేసుకున్న ఉగ్ర దాడుల తరహా ప్రయత్నాన్ని కోస్టుగార్డులు తాజాగా అరేబియా సముద్రంలో డిసెంబర్ 31న అర్ధరాత్రి అడ్డుకున్నారని వస్తున్న కథనాల నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ రాత్రి తీర రక్షక దళం చేపట్టిన ఆపరేషన్లో పడవతో పాటు మునిగిన నలుగురు వ్యక్తులను అక్రమ సరుకు రవాణాదారులుగా పేర్కొనడాన్ని తోసిపుచ్చారు. ఘటన జరిగిన చోటు చేపలు పట్టే ప్రాంతం కాదని, అలాగే సులభంగా తప్పించుకునేందుకు స్మగ్లర్లు సాధారణంగా వినియోగించే రద్దీ జలమార్గం కూడా కాదన్నారు. దుండగులు తమ పడవను తామే తగులబెట్టుకొని ఆత్మాహుతికి పాల్పడడాన్ని బట్టి వారికి ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని చెప్పవచ్చన్నారు. వారికి పాక్ నేవీ, సైన్యంతో పాటు ఇతర అంతర్జాతీయ సంబంధాలు ఉన్నట్లు వెల్లడించారు. మామూలు స్మగ్లర్లయితే లొంగిపోతారని, తమ ప్రాణాలను తీసుకోరని చెప్పారు. ఆ పడవలో పేలుడు పదార్థాలు ఉన్న విషయాన్ని ఊహించి చెప్పలేమని, అయితే వారి ఉద్దేశం మరేదో ఉందని అర్థమవుతోందన్నారు. ఈ పడవ కు సంబంధించిన పూర్తి విశ్లేషణలను మూడు నాలుగు రోజుల్లో విడుదల చేస్తామన్నారు. పాక్ కాల్పుల ఉల్లంఘనలపై స్పందిస్తూ చొరబాటుదారులకు అండగా నిలిచేందుకే పాక్ ఈ పని చేస్తోందన్నారు. రక్షణ మంత్రి పీఎస్గా కృష్ణమూర్తి పారికర్ ప్రైవేట్ సెక్రటరీగా ఐఏఎస్ అధికారి పి.కృష్ణమూర్తి నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం గోవా సదన్ రెసిడెంట్ కమిషనర్గా పనిచేస్తున్నారు. ఆయన గతంలోనూ పారికర్ గోవా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఆయనకు కార్యదర్శిగా పనిచేశారు. -
'బంకర్లో దాగిన ఉగ్రవాదులను ఏరివేస్తాం'
శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో బారాముల్లా జిల్లా యూరీ సెక్టార్లో జరిగిన ఎన్కౌంటర్పై కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ప్రకటన చేశారు. దాడికి పాల్పడ్డ ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చామని, బంకర్లో ఉన్న మిగిలినవారిని కూడా ఏరివేస్తామని పారికర్ చెప్పారు. తీవ్రవాదుల దాడిలో ఏడుగురు జవాన్లు, ముగ్గురు పోలీసులు మరణించినట్టు తెలిపారు. శుక్రవారం ఉదయం ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరుపుతూ, యూరీ సెక్టార్లోని ఓ బంకర్లోకి చొరబడ్డారు. వారిని బయటకు రప్పించడానికి సైనికులు రంగంలోకి దిగారు. బంకర్లో భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఎంతమంది ఉన్నారన్న విషయాన్ని అధికార్లు వెల్లడించలేకపోతున్నారు. ఉగ్రవాదులు ఉన్న బంకర్ను దిగ్బంధం చేసినట్లు చెప్పారు. -
కేంద్ర మంత్రిగా మనోహర్ పరికర్ ప్రమాణం
-
యూపీఏను సాగనంపాలి: గోవా సీఎం పారికర్
హైదరాబాద్, న్యూస్లైన్: దేశంలో ఎమర్జెన్సీ కాలం నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయని, అన్ని విధాలా భ్రష్టుపట్టిన యూపీఏ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పేర్కొన్నారు. శుక్రవారం బేగంపేట పర్యాటక భవన్లోని హరితా హోటల్లో ‘ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ’ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలోను, అంతకు ముందు మీడియాతో ఆయన మాట్లాడారు. టీడీపీతో పొత్తు ఇరుపార్టీలకు మేలు చేస్తుందన్నారు. సీమాంధ్రలో బీజేపీ-టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని, తెలంగాణలో ఆశించిన స్థాయిలో స్థానాలు కైవసం చేసుకుంటుందని తెలిపారు. దేశవ్యాప్తంగా మోడీ గాలి వీస్తోందని, స్పష్టమైన మెజార్టీతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తంచేశారు.