Mohammad Hafeez
-
అందరికీ పది నిమిషాలు.. అతడికి ఇరవై: పాక్ మాజీ కెప్టెన్ ఫైర్
పాకిస్తాన్ యువ క్రికెటర్ ఆజం ఖాన్ను ఉద్దేశించి మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ సంచనల వ్యాఖ్యలు చేశాడు. అతడికి ఫిట్నెస్పై ఏమాత్రం ఆసక్తి లేదని.. ఆజం ఖాన్ను మార్చాలని తాము చేసిన ప్రయత్నం విఫలమైందని పేర్కొన్నాడు.లావుగా ఉండటం సమస్య కాదని.. కానీ ఫిట్నెస్పై శ్రద్ధ లేకపోవడమే అసలైన సమస్య అని ఆజం ఖాన్ను హఫీజ్ ఘాటుగా విమర్శించాడు. కాగా పాక్ మాజీ కెప్టెన్ మెయిన్ ఖాన్ కుమారుడైన ఆజం ఖాన్ 2021లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.పూర్తిగా విఫలంకుడిచేతి వాటం కలిగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్కు అడపాదడపా పాక్ జట్టులో అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అయినప్పటికీ టీ20 ప్రపంచకప్-2024 సన్నాహకాల్లో భాగంగా.. ఇటీవల ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో ఆడే ఛాన్స్ ఇచ్చినప్పటికీ పూర్తిగా విఫలమయ్యాడు.రెండు మ్యాచ్లు ఆడి కేవలం 11 పరుగులే చేయడంతో పాటు.. వికెట్ కీపర్గానూ కీలక సమయంలో క్యాచ్లు మిస్ చేసి పాక్ పరాజయాలకు పరోక్ష కారకుడయ్యాడు. ఫలితంగా ఆజం ఖాన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగి అయినప్పటికీ అతడిపై నమ్మకం ఉంచిన మేనేజ్మెంట్ టీ20 ప్రపంచకప్-2024లో పాకిస్తాన్ ఆరంభ మ్యాచ్లో తుదిజట్టులో చోటు కల్పించింది. అమెరికాతో జరిగిన ఈ మ్యాచ్లో ఆజం ఖాన్ గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగి మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డాడు. ఆ తర్వాతి మ్యాచ్లలో అతడిని పక్కనపెట్టింది యాజమాన్యం. లావుగా ఉండటం సమస్య కాదుఈ నేపథ్యంలో మాజీ సెలక్టర్, పాక్ జట్టు మాజీ డైరెక్టర్ హఫీజ్ ఖాన్ ఆజం ఖాన్ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘పాకిస్తాన్ క్రికెట్ జట్టులోని ఆటగాళ్లంతా పది నిమిషాల్లో రెండు కిలోమీటర్లు నడిస్తే.. ఆజం ఖాన్ మాత్రం అందుకోసం 20 నిమిషాల సమయం తీసుకుంటాడు.నిజానికి అతడు అంతర్జాతీయ క్రికెట్ను సీరియస్గా తీసుకోకపోవడం విషాదకరం. సన్నగా.. లేదంటే లావుగా ఉండటం అనేది నా దృష్టిలో అసలు సమస్యే కాదు.అయితే, ఆటకు తగ్గట్లుగా మన శరీరాన్ని మలచుకోవడం ముఖ్యం. నిర్దేశిత ఫిట్నెస్ లెవల్స్ సాధించాల్సి ఉంటుంది. గతంలో మేము అతడికి ఫిట్నెస్ ప్లాన్ ఇచ్చాం.టాలెంట్ ఉంటే సరిపోదుకానీ ఆజం ఖాన్ ఏమాత్రం మెరుగుపడలేదు. టాలెంట్ ఉంది కాబట్టి జట్టులో అవకాశాలు రావచ్చు. అలాంటపుడు ఫిట్నెస్ కాపాడుకుంటే మంచిది కదా.జట్టులో అతడు తప్ప ఎవరూ ఫిట్నెస్ విషయంలో కాంప్రమైజ్ కారు’’ అంటూ ఆజం ఖాన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు మహ్మద్ హఫీజ్. ఇదిలా ఉంటే ప్రపంచకప్-2024 టోర్నీలో పాకిస్తాన్ గ్రూప్ దశలోనే ఎలిమినేట్ కావడం దాదాపుగా ఖరారైపోయింది. కాగా.. ఇప్పటిదాకా పాక్ తరఫున 13 మ్యాచ్లు ఆడిన ఆజం ఖాన్.. 135.38 స్ట్రైక్రేటుతో 88 పరుగులు మాత్రమే చేశాడు.చదవండి: T20 WC AFG Vs PNG: అదరగొట్టిన ఆఫ్గనిస్తాన్.. న్యూజిలాండ్ ఎలిమినేట్ -
కొవ్వు పేరుకుపోయింది: బాబర్పై మండిపడ్డ హఫీజ్
When the fat levels Checked Skin fold of all of them was high: పాకిస్తాన్ మాజీ కెప్టెన్, ప్రస్తుత బ్యాటర్ బాబర్ ఆజం తీరును హెడ్కోచ్ మహ్మద్ హఫీజ్ విమర్శించాడు. మాజీ కోచ్ మిక్కీ ఆర్థర్తో కలిసి జట్టును భ్రష్టుపట్టించాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆటగాళ్లు క్రమశిక్షణ లేకుండా తయారు కావడానికి బాబర్, మిక్కీ కారణమని హఫీజ్ మండిపడ్డాడు. వరల్డ్కప్లో వైఫల్యం కాగా మిక్కీ ఆర్థర్ మార్గదర్శనంలో బాబర్ ఆజం కెప్టెన్సీలో పాకిస్తాన్ జట్టు వన్డే వరల్డ్కప్-2023లో దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. భారత్ వేదికగా జరిగిన ఈ మెగా ఈవెంట్లో కనీసం సెమీస్ కూడా చేరుకుండానే నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీ నుంచి వైదొలగగా.. హెడ్కోచ్ మిక్కీ ఆర్థర్పై వేటు పడింది. ఈ క్రమంలో మహ్మద్ హఫీజ్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డైరెక్టర్గా నియమితుడయ్యాడు. అంతేకాదు హెడ్కోచ్ బాధ్యతలనూ తానే చేపట్టాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో చేదు అనుభవం ఇక బాబర్ స్థానంలో టెస్టులకు షాన్ మసూద్, టీ20లకు షాహిన్ ఆఫ్రిది సారథులుగా ఎంపికయ్యారు. ఈ క్రమంలో కొత్త నాయకత్వంలో ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్లో వైట్వాష్కు గురైన పాక్.. న్యూజిలాండ్ టూర్లో టీ20 సిరీస్ను కోల్పోయింది. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సమయంలో తనకు ఓ విచిత్రమైన విషయం తెలిసిందంటూ మహ్మద్ హఫీజ్ తాజాగా వెల్లడించాడు. బాబర్ ఆజం, మిక్కీ ఆర్థర్ కలిసి ఫిట్నెస్ విలువలు గాలికొదిలేసిన తీరు తెలిసి ఆశ్చర్యపోయానన్నాడు. ఈ మేరకు.. ‘‘ఆస్ట్రేలియాకు వెళ్లినపుడు ఫిట్నెస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆటగాళ్లకు చెప్పాను. ట్రైనర్తో కూడా ఇదే మాట అన్నాడు. కానీ అప్పుడతడు నాకో షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఆర్నెళ్ల క్రితం అప్పటి కెప్టెన్, డైరెక్టర్.. ఆటగాళ్ల ఫిట్నెస్ లెవల్స్ చెక్ చేయొద్దని చెప్పారన్నాడు. వారి శరీరాల్లో కొవ్వు పేరుకుపోయింది ఆటగాళ్లను స్వేచ్ఛగా వదిలేయాలని వాళ్లిద్దరు తనను ఆదేశించారన్నాడు. ఈ విషయం తెలిసిన తర్వాత ఆటగాళ్ల ఫిట్నెస్ లెవల్స్ చెక్ చేయిస్తే.. ఉండాల్సిన దాని కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ కొవ్వు వారి శరీరాల్లో పేరుకుపోయినట్లు తెలిసింది. చాలా మంది అన్ఫిట్గా ఉన్నారు. కొంతమంది కనీసం 2 కిలోమీటర్ల ట్రయల్ రన్ కూడా పూర్తిచేయలేకపోయారు. ఆర్నెళ్ల క్రితం వాళ్లు తీసుకున్న నిర్ణయాన్ని నేను తారుమారు చేశాను. ఫిట్గా లేకుంటే ఓడిపోతూనే ఉంటారని ఆటగాళ్లను హెచ్చరించాను’’ అని మహ్మద్ హఫీజ్ ‘ఏ’ స్పోర్ట్స్తో వ్యాఖ్యానించాడు. కాగా ప్రస్తుతం పాక్ ప్రధాన ఆటగాళ్లంతా పాకిస్తాన్ సూపర్ లీగ్తో బిజీగా ఉన్నారు. చదవండి: Ind Vs Eng 4th Test: బుమ్రాను రిలీజ్ చేసిన బీసీసీఐ.. అతడికి గ్రీన్ సిగ్నల్! -
ధన్యవాదాలు.. పాక్ క్రికెట్తో ప్రయాణం ముగిసిపోయింది
Pakistan Cricket Team: పాకిస్తాన్ హై పర్ఫామెన్స్ కోచ్ గ్రాంట్ బ్రాడ్బర్న్ తన పదవికి రాజీనామా చేశాడు. పాకిస్తాన్ క్రికెట్తో తన ప్రయాణం ముగిసిందని వెల్లడించాడు. ఐదేళ్లకు పైగా మూడు భిన్న పాత్రలు పోషించానన్న బ్రాడ్బర్న్.. ఇక తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. కాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు న్యూజిలాండ్ మాజీ బ్యాటర్ గ్రాంట్ బ్రాడ్బర్న్ను రెండేళ్ల కాలానికి గానూ తొలుత హెడ్కోచ్గా నియమించుకుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. మే, 2023లో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే, భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023లో పాక్ జట్టు కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించిన విషయం తెలిసిందే. తన మార్కు చూపిస్తున్న హఫీజ్ ఈ నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ ప్రక్షాళన చర్యలకు పూనుకున్నాడు. ఇందులో భాగంగా కోచింగ్ సిబ్బంది ఫోర్ట్పోలియోలు మార్చాడు. ఈ క్రమంలో బ్రాడ్బర్న్ హై పర్ఫామెన్స్ కోచ్గా బాధ్యతలు స్వీకరించగా.. ఇటీవల అతడి స్థానంలో పాక్ మాజీ ఆల్రౌండర్ యాసిర్ అరాఫత్ను నియమించాడు. పాక్తో ప్రయాణం ముగిసిపోయింది ఈ నేపథ్యంలో న్యూజిలాండ్తో పాకిస్తాన్ టీ20 సిరీస్ నుంచి యాసిర్ సేవలను వినియోగించుకోనున్నట్లు పీసీబీ తెలిపింది. దీంతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు బ్రాడ్బర్న్ తాజాగా ప్రకటన విడుదల చేశాడు. ‘‘చాలా చాలా ధన్యవాదాలు. పాకిస్తాన్ క్రికెట్తో అద్భుతమైన అధ్యాయం ముగిసిపోయింది. అద్భుతమైన ఆటగాళ్లు, కోచ్లు, సిబ్బందితో పనిచేసినందుకు గర్వంగా ఉంది. పాకిస్తాన్ క్రికెట్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా’’ అని గ్రాంట్ బ్రాడ్బర్న్ ఎక్స్ వేదికగా నోట్ షేర్ చేశాడు. అతడు ఇంగ్లండ్ కౌంటీ జట్టు గ్లామోర్గాన్ హెడ్కోచ్గా నియమితుడైనట్లు సమాచారం. కాగా ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం పాకిస్తాన్ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఈ టూర్తో కెప్టెన్గా షాహిన్ ఆఫ్రిది బాధ్యతలు స్వీకరించనుండగా.. వైస్ కెప్టెన్గా మహ్మద్ రిజ్వాన్ నియమితుడయ్యాడు. Bohat Bohat Shukriya 🇵🇰 pic.twitter.com/n0k0pagdtb — Grant Bradburn (@Beagleboy172) January 7, 2024 -
మహ్మద్ హఫీజ్ను వదలట్లేదు.. మొన్న అలా.. ఇప్పుడిలా సెటైర్!
Australia vs Pakistan, 3rd Test: పాకిస్తాన్ క్రికెట్ జట్టు డైరెక్టర్ మహ్మద్ హఫీజ్ను ఐస్లాండ్ క్రికెట్ మరోసారి ట్రోల్ చేసింది. ఆస్ట్రేలియా జట్టు మాత్రమే కాదు.. ఆస్ట్రేలియన్ ఎయిర్లైన్స్ కూడా హఫీజ్ను ఇబ్బంది పెడుతున్నాయంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కాగా పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు అక్కడికి వెళ్లిన షాన్ మసూద్ బృందం.. తొలి రెండింటిలో ఓడిపోయింది. పెర్త్లో ఏకంగా 360 పరుగుల భారీ తేడాతో ఓడిన పాక్.. మెల్బోర్న్ టెస్టులో పోరాడగలిగింది. అయితే, ఈ మ్యాచ్లో మహ్మద్ రిజ్వాన్ అవుటైన తీరుపై పాక్ బృందం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రిజ్వాన్ అవుటైన తీరుపై రచ్చ ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో బంతి రిజ్వాన్ రిస్ట్బ్యాండ్ను తాకినట్లుగా కనిపించడంతో అతడు అప్పీలు చేయగా.. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అయితే, కాన్ఫిడెంట్గా ఉన్న కమిన్స్ రివ్యూకు వెళ్లగా థర్డ్ అంపైర్ రిజ్వాన్ అవుటైనట్లు ప్రకటించాడు. దీంతో ఆసీస్ శిబిరంలో సంబరాలు మొదలుకాగా.. పాకిస్తాన్ కీలక సమయంలో కీలక వికెట్ కోల్పోయి 79 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ఈ విషయంపై స్పందిస్తూ.. సాంకేతిక లోపాలు, అంపైర్ల తప్పిదాల వల్లే తాము ఓడిపోయామంటూ పాక్ మాజీ క్రికెటర్, జట్టు డైరెక్టర్ మహ్మద్ హఫీజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. నిజానికి మెల్బోర్న్లో తాము ఆస్ట్రేలియా కంటే మెరుగైన ప్రదర్శన ఇచ్చామంటూ ప్రత్యర్థి జట్టు ఆట తీరును విమర్శించాడు. అప్పుడు ఆస్ట్రేలియా జట్టు.. ఇప్పుడు ఆసీస్ ఎయిర్లైన్స్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఐస్లాండ్ క్రికెట్ హఫీజ్పై సెటైరికల్ ట్వీట్ చేసింది. పాకిస్తాన్ అత్యంత ప్రతిభావంతమైన జట్టు అయినందుకే.. ఆస్ట్రేలియా గడ్డ మీద వరుసగా 16 టెస్టులు ఓడిపోయిందా అని ఎక్స్ వేదికగా ఎద్దేవా చేసింది. తాజాగా సిడ్నీ టెస్టు కోసం.. మహ్మద్ హఫీజ్ తాను ఎక్కాల్సిన విమానం మిస్ కావడంతో మరోసారి ట్రోల్ చేసింది. ‘‘అయ్యో అందరూ ప్రతిభావంతులే ఉన్న జట్టు అది. కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా ఎయిర్లైన్స్ కూడా అతడిని వదిలేసి వెళ్లిందా?’’ అని సెటైర్ వేసింది. సిరీస్ సమర్పయామి.. ఆఖరి టెస్టులో ఆఫ్రిది లేకుండానే కాగా ఇప్పటికే 2-0తో టెస్టు సిరీస్ను ఆతిథ్య ఆస్ట్రేలియాకు సమర్పించుకున్న పాకిస్తాన్.. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగనున్న మూడో మ్యాచ్కు సన్నద్ధమవుతోంది. బుధవారం నుంచి ఆరంభం కానున్న ఈ టెస్టుకు ఎంపిక చేసిన పాక్ జట్టులో షాహిన్ ఆఫ్రిదికి చోటు దక్కలేదు. పనిభారాన్ని తగ్గించుకునే క్రమంలో అతడికి విశ్రాంతినిచ్చిన పీసీబీ.. సయీమ్ ఆయుబ్తో అరంగేట్రం చేయించేందుకు సిద్ధమైంది. ఇక మ్యాచ్ కోసం మెల్బోర్న్ నుంచి సిడ్నీకి విమానంలో వెళ్లాల్సి ఉండగా.. మహ్మద్ హఫీజ్ ఎయిర్పోర్టుకు ఆలస్యంగా రావడంతో ఫ్లైట్ మిస్సయ్యాడు. చదవండి: Aus Vs Pak: నా రికార్డు బ్రేక్ చేసే సత్తా అతడికే ఉంది: ఆసీస్ దిగ్గజ బౌలర్ All that talent, and now even the Aussie airlines are out to get him! https://t.co/gtF1rXqOit — Iceland Cricket (@icelandcricket) January 1, 2024 -
Aus vs Pak: అద్భుతం.. అందుకే వరుసగా 16 టెస్టులు ఓడిపోయారా?
పాకిస్తాన్ క్రికెట్ టీమ్ డైరెక్టర్ మహ్మద్ హఫీజ్పై ఐస్లాండ్ క్రికెట్ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఆస్ట్రేలియా ఇకపై తన అదృష్టాన్ని కాలదన్నుకుని పాక్కు గెలిచే అవకాశం ఇస్తుందేమో అంటూ అతడిని దారుణంగా ట్రోల్ చేసింది. కాగా మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ వరుసగా రెండింట ఓడింది. దీంతో సిరీస్ 2-0 తేడాతో ఆతిథ్య జట్టు కైవసం అయింది. అయితే, తొలి టెస్టులో 360 పరుగుల భారీ తేడాతో ఓడిన పాక్.. రెండో టెస్టులో మెరుగ్గానే ఆడింది. కానీ.. కీలక సమయంలో ఫీల్డింగ్ తప్పిదాలు, బ్యాటింగ్ వైఫల్యాలతో మ్యాచ్ను చేజార్చుకుంది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్లో నిలకడగా ఆడుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ అవుట్ కావడంతో పాక్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ప్యాట్ కమిన్స్ విసిరిన బంతి రిజ్వాన్ రిస్ట్బ్యాండ్ను తాకి వికెట్ కీపర్ చేతుల్లో పడినట్లు కనిపించగా.. అప్పీలు చేశాడు. అయితే, ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో.. ఆసీస్ రివ్యూకు వెళ్లగా థర్డ్ అంపైర్ రిజ్వాన్ను అవుట్గా ప్రకటించాడు. దీంతో రిజ్వాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మైదానం వీడాడు. ఈ నేపథ్యంలో.. ఓటమి అనంతరం మహ్మద్ హఫీజ్ స్పందిస్తూ.. తమ జట్టు గొప్పగా ఆడినా.. సాంకేతిక లోపాలు, అంపైరింగ్ తప్పిదాల వల్లే ఓడిపోయిందని ఆసీస్ ఆట తీరును విమర్శించాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా సారథి కమిన్స్ ఇప్పటికే అతడికి కౌంటర్ ఇచ్చాడు. ఆఖరి వరకు బాగా ఆడిన జట్టునే విజయం వరిస్తుందని హఫీజ్ వ్యాఖ్యలకు బదులిచ్చాడు. తాజాగా ఐస్లాండ్ క్రికెట్ సైతం.. ‘‘నిజంగా ఇదొక అద్భుతం. అత్యంత ప్రతిభావంతమైన, సుపీరియర్ టాలెంట్ ఉన్న జట్టు ఆస్ట్రేలియాతో వరుసగా 16 టెస్టులు ఎలా ఓడిపోయింది? ఇక నుంచి ఆస్ట్రేలియా జట్టు తాము అదృష్టవంతులుగా ఉండటం ఆపేస్తే బాగుంటుంది’’ అంటూ మహ్మద్ హఫీజ్ను ట్రోల్ చేసింది. కాగా ఆస్ట్రేలియాలో టెస్టుల్లో పాకిస్తాన్ ఇప్పటి వరకు వరుసగా పదహారు ఓడిపోవడం గమనార్హం. ఆసీస్ గడ్డపై ఇంత వరకు ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవలేదు. It's amazing. How can the more talented and superior team have lost 16 matches in a row in Australia? Surely those lucky Aussies will stop being lucky soon. https://t.co/118gmMCe2K — Iceland Cricket (@icelandcricket) December 29, 2023 -
Aus Vs Pak: అంతిమ విజయం మాదే.. హఫీజ్కు కమిన్స్ కౌంటర్
పాకిస్తాన్ క్రికెట్ డైరెక్టర్ మహ్మద్ హఫీజ్ వ్యాఖ్యలకు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కౌంటర్ ఇచ్చాడు. అత్యుత్తంగా ఆడిన జట్టుకే అంతిమంగా విజయం లభిస్తుందని.. తాము విమర్శలను పెద్దగా పట్టించుకోమంటూ చురకలు అంటించాడు. పాకిస్తాన్తో రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. బాక్సింగ్ డే టెస్టును నాలుగు రోజుల్లోనే ముగించి.. 79 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. అయితే, మెల్బోర్న్లో జరిగిన ఈ టెస్టులో పాక్ ఓటమి అనంతరం ఆ జట్టు డైరెక్టర్ మహ్మద్ హఫీజ్ స్పందిస్తూ.. ఆస్ట్రేలియా ఆట తీరును విమర్శించాడు. ‘‘జట్టుగా మేము కొన్ని తప్పిదాలు చేసిన మాట వాస్తవమే. కూర్చుని చర్చిస్తే వాటిని అధిగమించగలం. కానీ.. మా ఓటమికి కేవలం మా ప్రదర్శన ఒక్కటే కారణం కాదు. అంపైరింగ్ తప్పిదాలు, సాంకేతిక లోపాల వల్ల కూడా మేము నష్టపోయాం’’ అని పేర్కొన్నాడు. మహ్మద్ రిజ్వాన్ అవుటైన తీరును ప్రస్తావిస్తూ.. ‘‘ఒకవేళ అలా గనుక జరిగి ఉండకపోతే ఫలితం వేరేలా ఉండేది. కొన్నిసార్లు టెక్నాలజీ చేసే చమత్కారాలు మనుషులమైన మనం అర్థం చేసుకోలేం. ఒకవేళ బాల్ స్టంప్స్ను హిట్ చేస్తే కచ్చితంగా అది అవుటే కదా!అలాంటపుడు అంపైర్స్ కాల్తో పనేం ఉంటుంది? అయితే, కొన్నిసార్లు టెక్నాలజీ వల్ల మ్యాచ్లు చేజారిపోయే పరిస్థితులు కూడా వస్తాయి’’ అని మహ్మద్ హఫీజ్ పేర్కొన్నాడు. రిజ్వాన్ అవుట్ విషయంలో తప్పు జరిగిందంటూ పరోక్షంగా థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. ఈ నేపథ్యంలో విజయానంతరం మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్కు హఫీజ్ వ్యాఖ్యల గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘కూల్.. వాళ్లు బాగానే ఆడారు. అయితే, మేము గెలిచాం. ఇప్పుడిక మాటలు అనవసరం. నిజంగా బాగా ఆడిన జట్టే కదా అంతిమంగా విజయం సాధిస్తుంది’’ అంటూ కమిన్స్.. హఫీజ్పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా ఈ మ్యాచ్లో పది వికెట్లు పడగొట్టిన కమిన్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. కమిన్స్ బౌలింగ్లో రిజ్వాన్ రిస్ట్బ్యాండ్ను తాకిన బంతిని కీపర్ అలెక్స్ క్యారీ క్యాచ్ అందుకోగా.. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అయితే, కమిన్స్ రివ్యూకు వెళ్లడంతో థర్డ్ అంపైర్ అతడిని అవుట్గా ప్రకటించాడు. ఈ నిర్ణయం తమ విజయావకాశాలపై ప్రభావం చూపిందని హఫీజ్ వ్యాఖ్యానించగా.. కమిన్స్ ఇలా కౌంటర్ వేశాడు. చదవండి: Ind A Vs SA A: ఐదు వికెట్లు తీసిన ఆవేశ్.. తిలక్, అక్షర్ అర్ధ శతకాలు! టాప్ స్కోరర్ అతడే -
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం.. మహ్మద్ హఫీజ్కు ప్రమోషన్
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్కు ఆ దేశ క్రికెట్ బోర్డు కీలక బాధ్యతలు అప్పగించింది. పాకిస్తాన్ పురుషుల క్రికెట్ జట్టు డైరెక్టర్గా హాఫీజ్ను పీసీబీ నియమించింది. ఇప్పటివరకు ఆ జట్టు డైరెక్టర్గా పనిచేసిన మిక్కీ ఆర్థర్ స్ధానాన్ని హాఫీజ్ భర్తీ చేయనున్నాడు. కాగా ప్రపంచకప్లో ఘోర వైఫల్యంతో విదేశీ కోచింగ్ స్టాఫ్ మొత్తాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తొలిగించింది. ఇప్పటికే మోర్నీ మోర్కెల్ బౌలింగ్ కోచ్ పదవికి రాజీనామా చేయగా.. తాజాగా మిక్కీ ఆర్థర్పై పీసీబీ వేటు వేసింది. ఈ క్రమంలోనే టెక్నికల్ కమిటీలో సభ్యునిగా ఉన్న హాఫీజ్కు టీమ్ డైరెక్టర్గా పీసీబీ ప్రమోషన్ ఇచ్చింది. అదేవిధంగా కొత్త కోచింగ్ స్టాప్ను పీసీబీ త్వరలోనే ప్రకటించనుంది. మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ పాకిస్తాన్ పురుషుల క్రికెట్ జట్టు డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టాడు. పాకిస్తాన్ కోచింగ్ స్టాఫ్ పోర్ట్ఫోలియోను పీసీబీ మార్చింది. ప్రస్తుతం ఉన్న కోచ్లు అందరూ కూడా నేషనల్ క్రికెట్ అకాడమీలో పనిచేస్తారు. వారిలో కొంతమందిని జట్టు కోసం ఎంపిక చేస్తుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్లకు త్వరలోనే మా కొత్త కోచింగ్ స్టాప్ను ప్రకటించనున్నామని పీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది. పాకిస్తాన్ తరఫున హఫీజ్ 55 టెస్టులు, 218 వన్డేలు, 119 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్ల్లో కలిపి 12,780 పరుగులు చేయడంతోపాటు 253 వికెట్లు కూడా సాధించాడు. కాగా ఇప్పటికే పాకిస్తాన్ కెప్టెన్సీకి బాబర్ ఆజం గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. టీ20ల్లో పాకిస్తాన్ కొత్త కెప్టెన్గా షాహీన్ అఫ్రిది ఎంపిక కాగా.. టెస్టు సారథిగా షాన్ మసూద్ నియమితుడయ్యాడు. కాగా ఈ ఏడాది డిసెంబర్లో పాకిస్తాన్ టెస్టు సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అయితే హెడ్కోచ్ లేకుండానే ఆసీస్ పర్యటను పాక్ జట్టు వెళ్లనుంది. ఈ క్రమంలో జట్టు డైరక్టర్గా ఉన్న హఫీజ్ హెడ్కోచ్గా వ్యవహరించనున్నాడు. చదవండి: World Cup 2023: ఇదేమి బ్యాటింగ్ రా బాబు.. అందుకే 'చోకర్స్' ట్యాగ్ లైన్ -
కోహ్లి నిన్ను బౌల్డ్ చేశాడు కదా: పాక్ మాజీ కెప్టెన్కు గట్టి కౌంటర్
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి విషయంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్కు ఇంగ్లండ్ మాజీ సారథి మైకేల్ వాన్ దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చాడు. కోహ్లి బౌలింగ్లో హఫీజ్ అవుట్ చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ అతడిని ట్రోల్ చేశాడు. కాగా సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్-2023లో విరాట్ కోహ్లి అద్భుత ఇన్నింగ్స్తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్లలో నాలుగు అర్ధ శతకాలు సహా రెండు సెంచరీలు సాధించి జోష్లో ఉన్నాడు. చివరగా సౌతాఫ్రికాతో మ్యాచ్లో శతకం ద్వారా వన్డేల్లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న సెంచరీల రికార్డు(49)ను సమం చేసి చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో రన్మెషీన్ కోహ్లిపై ప్రశంసల వర్షం కురుస్తుండగా... పాక్ మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ మాత్రం భిన్నంగా స్పందించాడు. ‘‘కోల్కతాలో విరాట్ కోహ్లి బ్యాటింగ్ చేస్తున్నపుడు స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నాడని నాకు అనిపించింది. ఈ వరల్డ్కప్లో ఇప్పటికిది మూడోసారి. సింగిల్తో అతడు 49వ వన్డే శతకాన్ని అందుకున్న తీరు చూస్తే.. జట్టుకోసం కాకుండా కేవలం తన సెంచరీ కోసం మాత్రమే ఆడినట్లు అనిపించింది’’ అని హఫీజ్ వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో కోహ్లి అభిమానులతో పాటు వెంకటేశ్ ప్రసాద్, మైకేల్ వాన్ వంటి మాజీ క్రికెటర్ల నుంచి హఫీజ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ మరోసారి పరోక్షంగా కోహ్లి పేరును ప్రస్తావిస్తూ ట్వీట్ చేశాడు. ఇంగ్లండ్ ఆల్రౌండర్ బెన్స్టోక్స్ను ప్రశంసించే క్రమంలో మరోసారి ‘సెల్ఫిష్’ కామెంట్స్ చేశాడు. View this post on Instagram A post shared by ICC (@icc) ప్రపంచకప్-2023లో నెదర్లాండ్స్తో బుధవారం నాటి మ్యాచ్లో స్టోక్స్ సెంచరీని ప్రశంసిస్తూ.. ‘‘జట్టును గట్టెక్కించే రక్షకుడు. తీవ్ర ఒత్తిడిలోనూ దూకుడైన ఆట తీరుతో కావాల్సినన్ని పరుగులు రాబట్టి చివరికి జట్టును గెలిపించాడు. స్వార్థపూరిత, స్వార్థ రహిత ఇన్నింగ్స్కు తేడా ఇదే’’ అంటూ హఫీజ్.. మైకేల్ వాన్ను ట్యాగ్ చేశాడు. ఇందుకు బదులుగా.. ‘‘స్టోక్సీ గొప్ప ఇన్నింగ్స్ ఆడాడనడంలో ఎలాంటి సందేహం లేదు హఫీజ్.. అయితే, కోల్కతా వంటి కఠినతర పిచ్పై విరాట్ ఇంకాస్త మెరుగ్గా అటాకింగ్ చేశాడు. విరాట్ కోహ్లి నిన్ను బౌల్డ్ చేసిన విషయాన్ని మనసులో పెట్టుకుని ప్రతిసారి అతడి పేరును ఇలా ప్రస్తావిస్తున్నావేమో అనిపిస్తోంది’’ అని మైకేల్ వాన్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. కాగా 2012లో ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా కోహ్లి(రైటార్మ్ పేసర్) హఫీజ్ను బౌల్డ్ చేశాడు. Seems to me @MHafeez22 you were bowled by @imVkohli !!! Is this the reason you constantly have a pop at him .. 😜😜 #CWC2023 #India #Pakistan pic.twitter.com/m3BOaCxOB7 — Michael Vaughan (@MichaelVaughan) November 8, 2023 Great innings from Stokesy @MHafeez22 .. As was Virats on a difficult pitch in Kolkata against a better attack .. 👍 https://t.co/KFpNIafgVK — Michael Vaughan (@MichaelVaughan) November 8, 2023 View this post on Instagram A post shared by ICC (@icc) -
నిప్పులు చెరిగిన పాక్ పేసర్.. మ్యాచ్ టై.. సూపర్ ఓవర్తో ఫలితం
యూఎస్ మాస్టర్స్ టీ10 లీగ్ 2023 ఎడిషన్ విజేతగా టెక్సస్ ఛార్జర్స్ అవతరించింది. న్యూయార్క్ వారియర్స్తో నిన్న (ఆగస్ట్ 27) జరిగిన ఫైనల్లో ఛార్జర్స్ సూపర్ ఓవర్ ద్వారా విజేతగా నిలిచింది. నిర్ణీత ఓవర్ల అనంతరం ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ ద్వారా విజేతను తేల్చాల్సి వచ్చింది. రాణించిన కార్టర్.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూయార్క్ వారియర్స్.. టెయిలెండర్ జోనాథన్ కార్టర్ (17 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. న్యూయార్క్ ఇన్నింగ్స్లో కార్టర్ మినహా అందరూ తేలిపోయారు. దిల్షన్ (18), రిచర్డ్ లెవి (17) రెండంకెల స్కోర్లు చేయగా.. మిస్బా ఉల్ హాక్ (5), షాహిద్ అఫ్రిది (1), కమ్రాన్ అక్మల్ (0), అబ్దుల్ రజాక్ (3) తస్సుమన్నారు. టెక్సస్ బౌలర్లలో ఎహసాన్ ఆదిల్ 3, ఫిడేల్ ఎడ్వర్డ్స్, ఇమ్రాన్ ఖాన్, తిసార పెరీరా తలో వికెట్ పడగొట్టారు. నిప్పులు చెరిగిన సోహైల్ ఖాన్.. 93 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టెక్సస్ ఛార్జర్స్.. సోహైల్ ఖాన్ (2-0-15-5), షాహిద్ అఫ్రిది (1-0-8-2), ఉమైద్ ఆసిఫ్ (2-0-14-2), జెరోమ్ టేలర్ (2-0-24-1) ధాటికి 10 ఓవర్లలో 92 పరుగులకు ఆలౌటైంది. ఛార్జర్స్ ఇన్నింగ్స్లో మహ్మద్ హఫీజ్ (46), బెన్ డంక్ (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. స్కోర్లు సమం కావడంతో ఫలితాన్ని సూపర్ ఓవర్ ద్వారా నిర్ణయించారు. స్కోర్లు సమం.. సూపర్ ఓవర్లో ఫలితం సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఛార్జర్స్.. వికెట్ నష్టపోయి 15 పరుగులు చేసింది. డంక్, ముక్తర్ చెరో సిక్సర్ బాది, ఈ స్కోర్ చేసేందుకు దోహదపడ్డారు. ఛేదనలో వారియర్స్ 13 పరుగులకే పరిమతం కావడంతో టెక్సస్ ఛార్జర్స్ విజేతగా ఆవిర్భవించింది. కార్టర్ సిక్సర్, బౌండరీ బాదినా ప్రయోజనం లేకుండాపోయింది. సోహైల్ తన్వీర్ వారియర్స్ను కట్టడి చేశాడు. -
మహ్మద్ హాఫీజ్ ఊచకోత.. కేవలం 17 బంతుల్లోనే!
యూఎస్ మాస్టర్స్ టీ10 లీగ్-2023లో టెక్సాస్ ఛార్జర్స్ ఫైనల్కు చేరింది. ఫ్లోరిడా వేదికగా కాలిఫోర్నియా నైట్స్తో జరిగిన క్వాలిఫియర్-2లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన టెక్సాస్ ఫైనల్లో అడుగుపెట్టింది. టెక్సాస్ ఫైనల్కు చేరడంలో ఆ జట్టు ఆల్రౌండర్, పాక్ మాజీ కెప్టెన్ మహ్మద్ హాఫీజ్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కాలిఫోర్నియా నైట్స్ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 139 పరుగుల భారీ స్కోర్ చేసింది. కాలిఫోర్నియా ఇన్నింగ్స్లో కల్లిస్(56 నాటౌట్), మిలాంద్ కుమార్(41) పరుగులతో అద్భుతంగా రాణించారు. టెక్సాస్ బౌలర్లలో మహ్మద్ హాఫీజ్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఇమ్రాన్ ఖాన్ ఒక్క వికెట్ సాధించాడు. హాఫీజ్ విధ్వంసం.. 140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టెక్సాస్ ఛార్జర్స్ కేవలం 8.5 ఓవర్లలోనే ఛేదించింది. టెక్సాస్ ఛార్జర్స్ బ్యాటర్లలో హాఫీజ్ విధ్వంసం సృష్టించాడు. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 17 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను ఈ పాకిస్తానీ ఆటగాడు అందుకున్నాడు. ఓవరాల్గా 24 బంతులు ఎదుర్కొన్న హాఫీజ్ 7 సిక్స్లు, 3 ఫోర్లతో 68 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు ముక్తార్ అహ్మద్(40) కూడా రాణించాడు. ఆదివారం జరగనున్న ఫైనల్లో న్యూయార్క్ వారియర్స్తో టెక్సాస్ ఛార్జర్స్ తాడోపేడో తెల్చుకోనుంది. చదవండి: PAK vs AFG: చరిత్ర సృష్టించిన ఆఫ్గాన్ ఆటగాడు.. వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ! 40 ఏళ్ల రికార్డు బద్దలు -
రెచ్చిపోయిన రాబిన్ ఉతప్ప.. సరిపోని ఫ్లెచర్ మెరుపులు
జింబాబ్వే టీ10 లీగ్లో టీమిండియా వెటరన్ ఆటగాడు, హరారే హరికేన్స్ ఓపెనర్ రాబిన్ ఉతప్ప తొలి అర్ధశతకం బాదాడు. డర్బన్ ఖలందర్స్తో నిన్న (జులై 26) జరిగిన మ్యాచ్లో రెచ్చిపోయిన ఉతప్ప.. 23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. అతనితో పాటు చకబ్వా (23 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), డొనవాన్ ఫెరియెరా (12 బంతుల్లో 24 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) రాణించడంతో హరికేన్స్ నిర్ణీత 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 134 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఖలందర్స్ బౌలర్లలో బ్రాడ్ ఈవాన్స్, అజ్మతుల్లా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 135 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఖలందర్స్.. నిర్ణీత ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 110 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా హరికేన్స్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆండ్రీ ఫ్లెచర్ (25 బంతుల్లో 50 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), హజ్రతుల్లా జజాయ్ (28 బంతుల్లో 49; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఖలందర్స్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. హరికేన్స్ బౌలర్ లూక్ జాంగ్వే 2 వికెట్లు పడగొట్టాడు. మెరిసిన కాలా.. నిన్ననే జరిగిన మరో రెండు మ్యాచ్ల్లో కేప్టౌన్ సాంప్ ఆర్మీపై బులవాయో బ్రేవ్స్.. జోబర్గ్ బఫెలోస్పై కేప్టౌన్ విజయాలు సాధించాయి. కేప్టౌన్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రేవ్స్.. ఇన్నోసెంట్ కాలా (52 నాటౌట్), వెబ్స్టర్ (23 నాటౌట్) రాణించడంతో 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేయగా, ఛేదనలో గట్టి పోటీ ఇచ్చిన కేప్టౌన్ లక్ష్యానికి 4 పరుగుల దూరంలో (122/4) నిలిచిపోయింది. రాణించిన హఫీజ్, బొపారా.. కేప్టౌన్తో జరిగిన మ్యాచ్లో మహ్మద్ హఫీజ్ (40 నాటౌట్), రవి బొపారా (30 నాటౌట్) రాణించడంతో జోబర్గ్ బఫెలోస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేప్టౌన్.. ముజరబాని (3/7), న్యాయుచి (2/11), డాలా (1/17) ధాటికి 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 89 పరుగులు మాత్రమే చేయగా.. హఫీజ్, బొపారా రాణించడంతో బఫెలోస్ టీమ్ 6.5 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. -
చరిత్ర సృష్టించిన పాక్ బౌలర్.. పొట్టి క్రికెట్లో అత్యుత్తమ గణాంకాలు
పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ మహ్మద్ హఫీజ్ టీ10 క్రికెట్లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ పాక్ మాజీ పొట్టి ఫార్మాట్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. జింబాబ్వే ఆఫ్రో టీ10 లీగ్లో భాగంగా బులవాయో బ్రేవ్స్తో నిన్న (జులై 21) జరిగిన మ్యాచ్లో 2 ఓవర్లు బౌల్ చేసిన హఫీజ్ (జోబర్గ్ బఫెలోస్).. కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ ట్రిపుల్ వికెట్ మొయిడిన్ ఓవర్ ఉంది. హఫీజ్ వేసిన 12 బంతుల్లో కేవలం ఒకే ఒక బౌండరీ ఇచ్చి 11 డాట్ బాల్స్ వేశాడు. గుర్తింపు పొందిన టీ10 క్రికెట్లో హాఫీజ్వే అత్యుత్తమ గణాంకాలు. అంతర్జాతీయ క్రికెట్లో దాదాపు 400 మ్యాచ్లు ఆడిన హఫీజ్ 250కిపైగా వికెట్లు తీసినప్పటికీ, ఒక్కసారి కూడా 5 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టలేకపోయాడు. టెస్ట్ల్లో 4/16, వన్డేల్లో 4/41, టీ20ల్లో 4/10 హఫీజ్ అత్యుత్తమ గణాంకాలు. Pakistan Chief Selector Got Six Wickets for four runs in his two overs T10 Match. Professor Mohammad Hafeez at his Best🔥♥️.#MohammadHafeez #ZimAfroT10 pic.twitter.com/bOzfgQyguE — Shaharyar Ejaz 🏏 (@SharyOfficial) July 21, 2023 ఇదిలా ఉంటే, బులవాయో బ్రేవ్స్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జోబర్గ్ బఫెలోస్ నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీం (23 బంతుల్లో 46 నాటౌట్; 8 ఫోర్లు) చెలరేగగా.. ఓపెనర్ టామ్ బాంటన్ (18 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. బ్రేవ్స్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా.. ఫరాజ్, వెబ్స్టర్, సికందర్ రజా తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం బరిలోకి దిగిన బ్రేవ్స్.. మహ్మద్ హఫీజ్ (2-1-4-6) ధాటికి 10 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 95 పరుగులు మాత్రమే చేయగలిగింది. హఫీజ్ బ్రేవ్స్ పతనాన్ని శాశిస్తే.. వెల్లింగ్టన్ మసకద్జ (2-0-11-3) మరో ఎండ్ నుంచి అతనికి సహకరించాడు. బ్రేవ్స్ ఇన్నింగ్స్లో వెబ్స్టర్ (22 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్గా నిలువగా.. బెన్ మెక్డెర్మాట్ (13), ర్యాన్ బర్ల్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. బ్రేవ్స్ ఇన్నింగ్స్లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. వారిలో ముగ్గురు గోల్డన్ డకౌట్లు కావడం విశేషం. -
మాజీ క్రికెటర్ ఇంట్లో దొంగతనం.. 2 కోట్ల విలువైన సొత్తు చోరీ
పాకిస్థాన్ మాజీ ఆల్రౌండర్ మహమ్మద్ హఫీజ్ ఇంట్లో దొంగలు పడ్డారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లాహోర్లోని హఫీజ్ ఇంట్లోకి మార్చి 5న(ఆదివారం) రాత్రి దొంగలు చొరబడ్డారు. రూ.25 వేల డాలర్ల (పాకిస్థాన్ రూపాయిలో 25 డాలర్ల విలువ దాదాపు రూ.2 కోట్లు)లతో పాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారని పోలీసులు వెల్లడించారు. దొంగతనం జరిగే సమయంలో సమయంలో హఫీజ్, అతని భార్య ఇంట్లో లేరు. ఈ ఆల్రౌండర్ ఇంట్లో దొంగలు చొరబడి భారీగా విదేశీ కరెన్సీ, విలువైన సొత్తు ఎత్తుకెళ్లారని గురించి వాళ్ల అంకుల్ షాహిద్ ఇక్బాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో, పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆల్రౌండర్గా విశేష సేవలందించిన హఫీజ్ 2022 జనవరి 3న అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. దాదాపు 18 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన మహ్మద్ హఫీజ్ పాకిస్థాన్ తరఫున అన్ని ఫార్మాట్లు కలిపి 392 మ్యాచ్లు ఆడి 12,780 రన్స్ చేశాడు. 253 వికెట్లు తీశాడు. 2018లో టెస్టు క్రికెట్కు గుడ్ బై చెప్పేశాడు. ఆ తర్వాత వన్డేలు, టి20ల్లో కొనసాగాడు. హఫీజ్ 2019 వరల్డ్ కప్లో ఆఖరి వన్డే మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం హఫీజ్ పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. -
అఫ్రిది అప్పుడు అలా బాదడం వల్లే అశ్విన్ను తుది జట్టులోకి తీసుకోవడం లేదు..!
Asia Cup 2022: టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ మహ్మద్ హఫీజ్ అవాక్కులు చవాక్కులు పేలాడు. 2014 ఆసియా కప్ తర్వాత భారత్-పాక్ మ్యాచ్ల్లో అశ్విన్ను ఎందుకు తీసుకోవడం లేదనే చర్చలో పాల్గొంటూ వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేశాడు. 2014 ఆసియా కప్లో భారత్-పాక్ మ్యాచ్ సందర్బంగా అశ్విన్ వేసిన చివరి ఓవర్లో షాహిద్ అఫ్రిది వరుసగా రెండు సిక్సర్లు బాది పాక్ను గెలిపించడమే ఇందుకు కారణమని గొప్పలు పోయాడు. అఫ్రిది అప్పుడు అలా బాదడం వల్లే అశ్విన్ను నేటికీ భారత్-పాక్ మ్యాచ్ల్లో ఆడించడం లేదని పిచ్చి కూతలు కూశాడు. పీటీవీలో జరిగిన చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ.. హఫీజ్ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై భారత అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇలా అనుకుంటూ పోతే భారత బ్యాటర్ల ధాటికి చాలామంది పాక్ బౌలర్ల కెరీర్లే అర్ధంతరంగా ముగిసిపోయాయని కౌంటర్ అటాక్ చేస్తున్నారు. Why Ashwin not playing regularly in recent past #PAKvIND matches. Credit to @SAfridiOfficial Boom Boom master strokes in #AsiaCup2014 pic.twitter.com/0MjjUFJ4ia — Mohammad Hafeez (@MHafeez22) September 5, 2022 వాస్తవానికి అశ్విన్ను టీ20ల్లో ఆడించకపోవడానికి వేరే కారణాలు ఉన్నాయని, యువ స్పిన్నర్లు చహల్, కుల్దీప్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్లు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుండమే ఇందుకు ప్రధాన కారణమని వివరిస్తున్నారు. మరికొందరైతే.. ప్రత్యర్ధికి తమ జట్టు కూర్పుతో పని ఏంటని, ఆటగాళ్ల ఎంపికలో తమ వ్యూహాలు తమకు ఉంటాయని అంటున్నారు. అశ్విన్ జట్టులో ఉన్నా లేకపోయిన ఈ మధ్యకాలంలో పాక్ పొడించిందేమీ లేదని, కేవలం 2 మ్యాచ్ల్లో మాత్రమే వారు గెలుపొందారన్న విషయం గుర్తుపెట్టుకోవాలని హఫీజ్ పైత్యం వదిలించారు. కాగా, వన్డే ఫార్మాట్లో జరిగిన 2014 ఆసియా కప్ మ్యాచ్లో (భారత్-పాక్) పాక్ విజయానికి చివరి ఓవర్లో 10 పరుగులు చేయాల్సి ఉండింది. కెప్టెన్ ధోని అశ్విన్పై నమ్మకంతో అతనికి బంతినందించాడు. ఆ ఓవర్ తొలి బంతికే అజ్మల్ను ఔట్ చేసిన అశ్విన్.. ఆ తర్వాతి బంతికి సింగిల్ను ఇచ్చాడు. అప్పుడే స్ట్రయిక్లోకి వచ్చిన షాహిద్ అఫ్రిది.. వరుసగా రెండు సిక్సర్లు బాది మరో రెండు బంతులు మిగిలుండగానే పాక్కు విజయతీరాలకు చేర్చాడు. -
టీమిండియాపై పొగడ్తలు.. పాక్ క్రికెటర్పై భారత్ ఫ్యాన్స్ తిట్ల దండకం
మాములుగానే భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఇరుదేశాల అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లతో రెచ్చిపోతారు. అయితే ఇవన్నీ క్రీడాస్పూర్తి పరిధిలోని ఉంటాయి. తాజాగా టీమిండియాపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ పొగడ్తల వర్షం కురిపించాడు. పొగడ్తలు కురిపించినప్పటికి టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. మరి హఫీజ్ చేసిన వ్యాఖ్యలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ''నాకు ఎక్కువ విషయాలు తెలియవు. ఒకటి మాత్రం బాగా తెలుసు. సమాజంలో ఎవరు డబ్బు బాగా సంపాదిస్తే వారిని ప్రేమించేవాళ్లు ఎక్కువగా ఉంటారు. ఇది బీసీసీఐకి అక్షరాలా సరిగ్గా తూగుతుంది. ఎందుకంటే టీమిండియాను రెవెన్యూ సృష్టించే దేశం. ప్రపంచంలో ఎక్కడ ద్వైపాక్షిక సిరీస్ జరిగినా.. అక్కడ టీమిండియా స్పాన్సర్ చేస్తే జాక్పాట్ కొట్టినట్లే. ఇలాంటి విషయాలు ఎవరు కాదనలేరు. అందుకే టీమిండియాను ''లాడ్లాస్''గా అభివర్ణిస్తా. ఎందుకంటే సంపదను వృద్ధి చేయడంలో బీసీసీఐకి ఎవరు సాటి రారు అని చెప్పుకొచ్చాడు. మహ్మద్ హఫీజ్ కోణంలో వినడానికి బాగున్నా.. అసలు చిక్కు ఇక్కడే వచ్చి పడింది. టీమిండియాను పొగిడినప్పటికి భారత్ అభిమానులు అతనిపై తిట్ల దండకం అందుకున్నారు. '' బీసీసీఐ సంపన్న బోర్డు అని చెప్పుకొచ్చాడు.. కానీ టీమిండియా ఆడిన క్రికెట్ గురించి ఎక్కడా ప్రస్తావన రాలేదు. అంటే టీమిండియా మంచి క్రికెట్ ఆడకున్నా బీసీసీఐకి కాసుల వర్షం కురుస్తుందా.. టీమిండియా మంచి క్రికెట్ ఆడుతుంది కాబట్టే బీసీసీఐకి డబ్బులు వస్తున్నాయి. 1983లో టీమిండియా ప్రపంచకప్ గెలిచిన తర్వాతే బీసీసీఐ అనే పేరు వినిపించింది. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇవాళ సంపన్న బోర్డుగా అవతరించింది. మరి దీని వెనుక ఉన్న కారణం.. ఇన్నేళ్లలో టీమిండియా మంచి క్రికెట్ ఆడడమే కదా. బీసీసీఐని సంపన్న బోర్డు అంటూనే టీమిండియాను తక్కువ చేసి మాట్లాడాడంటూ'' అభిమానులు గరం అయ్యారు. ఇక ఆసియాకప్లో భాగంగా టీమిండియా, పాకిస్తాన్లు ఆదివారం(సెప్టెంబర్ 4న) మరోసారి తలపడనున్నాయి. సూపర్-4లో భాగంగా జరగనున్న మ్యాచ్లో టీమిండియా మరో విజయం సాధిస్తుందా లేక పాక్ ప్రతీకారం తీర్చుకుంటుందా అన్నది చూడాలి. కాగా లీగ్ దశలో పాకిస్తాన్ను టీమిండియా 5 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. Laadla 😍 pic.twitter.com/V48JqojFmc — Mohammad Hafeez (@MHafeez22) September 2, 2022 Kitna doglapan karte he log 🤡🤡 Pahele hamari cricket ki tarrif Abhi paiso ki kar raha Retirement ke baad 2 waqt ki roti ke liya india ka name lo Kya strategy he😂😂 pic.twitter.com/l03nq1yDdd — Borish_81🇮🇳 (@Borish81) September 2, 2022 Laadla Bowler of Pakistan 😍 A Man who can't even bowl properly is an Expert on Cricket for Pakistan. As usual Cheap Pakistani showing his HATE for India because they can't compete on Field and on Economy. Professor Check World Cup Records and Latest Bheek from IMF of $1.17 Bn.😂 pic.twitter.com/kKU1a1qlwr — Knight Rider (@iKnightRider19) September 2, 2022 India is team who proved with their performance that they are one of the best team . Even we being Pakistani knows that how good is their team . You just trying to me in limelight by passing such comments. Shame — Jahangir Ahmed 🫐 (@Jahangi13967996) September 2, 2022 చదవండి: Asia Cup 2022 Super 4: పాక్తో మ్యాచ్.. మూడు మార్పులతో బరిలోకి దిగనున్న టీమిండియా..! AUS Vs ZIM: టీమిండియాపై చేయలేనిది ఆసీస్తో చేసి చూపించారు -
'రోహిత్ శర్మ భయపడుతున్నాడు.. ఎక్కువ కాలం కెప్టెన్గా ఉండడు'
ఆసియాకప్-2022లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశపరుస్తున్నాడు. రోహిత్ కెప్టెన్గా సఫలం అవుతున్నప్పటికీ.. వ్యక్తిగత ప్రదర్శనలో మాత్రం విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు ఈ మెగా టోర్నీలో రెండు మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ కేవలం 33 పరుగులు మాత్రమే చేశాడు. పాకిస్తాన్తో జరిగిన తొలి మ్యాచ్లో 12 పరుగులు చేసిన రోహిత్.. హాంగ్ కాంగ్తో జరిగిన మ్యాచ్లోనూ కేవలం 21 పరుగులు మాత్రమే చేశాడు. కాగా సారథ్య బాధ్యతలు చేపట్టాక హిట్మ్యాన్ దూకుడు తగ్గింది అనే చేప్పుకోవాలి. ఈ ఏడాది ఐపీఎల్లోనూ రోహిత్ అంతగా రాణించలేకపోయాడు. అదే విధంగా ఇంగ్లండ్, విండీస్ టీ20 సిరీస్లోనూ చేప్పుకోదగ్గ ఇన్నింగ్స్ కూడా లేవు. ఇక రోహిత్ ఇదే ఫామ్ను కోనసాగిస్తే రానున్న రోజుల్లో జట్టుపై ఒత్తిడి పెరగడం ఖాయం. ఈ నేపథ్యంలో రోహిత్పై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ సంచలన వాఖ్యలు చేశాడు. బుధవారం జరిగిన హాంకాంగ్-భారత్ మధ్య మ్యాచ్ అనంతరం పీటీవీ స్పోర్ట్స్లో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో హఫీజ్ పాల్గొన్నాడు. ఎక్కువ కాలం కెప్టన్గా ఉండకపోవచ్చు ఈ క్రమంలో హఫీజ్ మాట్లాడూతూ.. "హాంగ్ కాంగ్ భారత్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయినప్పటికీ రోహిత్ ముఖంలో మ్యాచ్ గెలిచిన ఆనందం కనిపించలేదు. రోహిత్ ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడు. కెప్టెన్సీ అతడికి భారంగా మారింది. అతడు హాంగ్కాంగ్ మ్యాచ్లో టాస్కు వచ్చిన సమయంలో రోహిత్ భయపడుతున్నట్లు, ఆయోమయంలో ఉన్నట్లు కన్పించాడు. గతంలో రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడాడు. అటువంటి హిట్ మ్యాన్ను నేను ప్రస్తుతం చూడలేకపోతున్నాను. అతడు రోజు రోజుకి తన ఫామ్ను మరింత కోల్పోతున్నాడు. అదే విధంగా ఐపీఎల్లోనూ దారుణంగా విఫలమయ్యాడు. అతడు క్రికెట్ బ్రాండ్, మ్యాచ్లలో సానుకూలంగా ఆడటం కోసం మాట్లాడాతున్నాడు. అయితే అటువంటివి మాట్లాడటం తేలికే కానీ సాధ్యం చేసుకోవడం చాలా కష్టం. నా అభిప్రాయం ప్రకారం ఇదే ఫామ్ను అతడు కొనసాగిస్తే.. ఎక్కువ రోజులు భారత కెప్టెన్గా కొనసాగలేడు అని హాఫీజ్ పేర్కొన్నాడు. చదవండి: Rohit Sharma: కొత్త అవతారంలో రోహిత్ శర్మ.. సెప్టెంబర్ 4న డబుల్ ధమాకా! -
'కోహ్లి, హసన్ అలీ ఒకేలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు'
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, పాక్ పేసర్ హసన్ అలీ ఒకేలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ అభిప్రాయపడ్డాడు. కోహ్లి గత కొన్నాళ్లుగా తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవతున్నాడని హఫీజ్ తెలిపాడు. కోహ్లి కొద్ది రోజులు పాటు క్రికెట్కు దూరంగా ఉన్నట్టే అలీ కూడా విశ్రాంతి తీసుకుంటే బాగుటుందని హఫీజ్ అన్నాడు. 'గత 10 ఏళ్లలో అత్యుత్తమ ఆటగాళ్లలో విరాట్ కోహ్లి ఒకడు. కోహ్లి ప్రస్తుతం తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నాడు. అతడికి ప్రస్తుతం విశ్రాంతి అవసరం. విండీస్ పర్యటనకు కోహ్లికి విశ్రాంతి ఇచ్చి బీసీసీఐ మంచి నిర్ణయం తీసుకుంది. ప్రతి ఆటగాడికి రెస్టు అవసరం. ఈ విరామం కోహ్లి తిరిగి ఫామ్లోకి రావడానికి సహాయపడుతుంది. విరాట్ కోహ్లి భారత జట్టులో కీలక ఆటగాడు. కానీ గత మూడేళ్ల నుంచి అతడు అంతగా రాణించలేకపోతున్నాడు. గతేడాది టీ20 ప్రపంచకప్లో పాకిస్తాన్పై కోహ్లి అర్దసెంచరీ సాధించినప్పటికీ.. అది అతడు స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ కాదు" అని హఫీజ్ పేర్కొన్నాడు. హాసన్ అలీ గురించి మాట్లాడుతూ.. విరాట్ కోహ్లి లాంటి సమస్యనే హాసన్ అలీ కూడా ఎదుర్కొంటున్నాడు. అతడు కూడా చాలా మానసిక ఒత్తిడికి గురయ్యాడు. హాసన్ అలీ సుదీర్ఘ విరామం తీసుకోని తిరిగి మళ్లీ క్రికెట్లో అడుగు పెట్టాలని హఫీజ్ తెలిపాడు. చదవండి: CWG 2022 Ind W Vs Eng W: క్రికెట్లో పతకం ఖాయం చేసిన టీమిండియా -
చెత్త రాజకీయాలకు సామాన్యులు బలవ్వాలా?.. మాజీ క్రికెటర్ ఆగ్రహం
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్.. దేశ ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. ప్రస్తుత పాకిస్తాన్ ప్రభుత్వం స్వార్థపూరిత రాజకీయాలకు సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హఫీజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ట్విటర్ వేదికగా పంచుకున్న మహ్మద్ హఫీజ్ పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్తో పాటు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సహా పలు రాజకీయ నాయకులను ట్యాగ్ చేశాడు. ''లాహోర్లోని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ అందుబాటులో లేదు.. ఏటీఎంలో డబ్బులు రావడం లేదు.. మీ చెత్త రాజకీయ నిర్ణయాలతో సామాన్య ప్రజలు ఎందుకు ఇబ్బంది పడాలి.. ఈ దేశ ప్రభుత్వం నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి'' అంటూ ట్వీట్ చేశాడు. కాగా అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయిన ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత ఏప్రిల్లో పాక్ 23వ కొత్త ప్రధానిగా షాబాజ్ షరీఫ్ బాధ్యతలు చేపట్టారు. మహ్మద్ హఫీజ్కు ఇది కొత్త కాదు. ఇంతకముందు క్రికెటర్గా ఉన్నంతకాలం తప్పు చేసిన ప్రతీసారి పీసీబీని ప్రశ్నిస్తూ వచ్చాడు. పీసీబీకి ఎన్నోసార్లు ఎదురెళ్లి రెబల్గా పేరు పొందినప్పటికి తనదైన ఆటతీరుతో జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా కొనసాగాడు. మంచి ఆల్రౌండర్గా పేరు పొందిన మహ్మద్ హఫీజ్ అన్ని ఫార్మాట్లలో పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్గా పనిచేశాడు. అతని కెప్టెన్సీలోనే పాకిస్తాన్ 2017 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఫైనల్లో టీమిండియాపై హఫీజ్ సేన విజయం సాధించి కప్ ఎగురేసుకుపోయింది. ఇక అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్ తరపున 218 వన్డేలు, 55 టెస్టులు, 119 టి20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లు కలిపి 12వేలకు పైగా పరుగులు చేసిన హఫీజ్ 250కి పైగా వికెట్లు తీశాడు. చదవండి: డెబ్యూ మ్యాచ్లోనే ఇరగదీసింది.. టి20 క్రికెట్లో పాక్ బౌలర్ కొత్త చరిత్ర No Petrol available in any petrol station in Lahore??? No cash available in ATM machines?? Why a common man have to suffer from political decisions. @ImranKhanPTI @CMShehbaz @MaryamNSharif @BBhuttoZardari — Mohammad Hafeez (@MHafeez22) May 24, 2022 -
T20 WC 2022: "ఈ సారి కూడా విజయం పాకిస్తాన్దే.. కోహ్లి, రోహిత్ తప్ప..."
India to struggle against Pakistan in T20 WC 2022: ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2022 షెడ్యూల్ను ఐసీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 23న మెల్బోర్న్ వేదికగా టీమిండియా తమ తొలి మ్యాచ్లో దాయాది దేశం పాకిస్తాన్తో తలపడనుంది. దీంతో మరోసారి ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ వీక్షించేందుకు అభిమానులు అతృతగా ఎదురుచూస్తున్నారు.. కాగా ఇండియా-పాకిస్తాన్ హైవోల్టేజ్ మ్యాచ్కు ఇంకా తొమ్మిది నెలల సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే ఈ మ్యాచ్పై అనేక అంచనాలు మెదలయ్యాయి. ఈ క్రమంలో పాక్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. "ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు రోజు రోజుకి ఎదుగుతోంది. ఈ సారి కూడా భారత్పై కచ్చితంగా గెలుస్తాం. టీమిండియాకు సంబంధించినంతవరకు విరాట్, రోహిత్ చాలా ముఖ్యమైన ఆటగాళ్లని నేను భావిస్తున్నాను. పాకిస్తాన్ వంటి మెరుగైన జట్టులతో ఆడినప్పుడు.. ఈ ఇద్దరూ పరుగులు చేయకపోతే, ఇతర ఆటగాళ్లకు ఆడడం చాలా కష్టం. ఇక ప్రపంచకప్లో భారత్పై పాకిస్తాన్ గెలిస్తే అందులో నేనూ భాగమవ్వాలనే కోరిక నాకు ఎప్పుడూ ఉండేది. నా కోరిక టీ20 ప్రపంచకప్-2021లో నేరవేరినందుకు, నేను గర్వపడుతున్నాను" అని మహ్మద్ హఫీజ్ పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2021లో భారత్పై 10 వికెట్ల తేడాతో పాక్ గెలిపొందిన సంగతి తెలిసిందే. -
'ఓడిపోయామని బాధపడకండి.. బాగా ఆడారు'
Pakistan Win Hearts Visiting Namibia Dressing Room After Win Match.. టి20 ప్రపంచకప్ 2021లో పాకిస్తాన్ దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. నమీబియాతో జరిగిన మ్యాచ్లో 45 పరుగుల తేడాతో గెలిచిన పాకిస్తాన్ ఐదోసారి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. ఓపెనర్లు బాబర్ అజమ్(70), మహ్మద్ రిజ్వాన్(79 నాటౌట్) వీరవిహారంతో 189 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన నమీబియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. పాకిస్తాన్ కట్టుదిట్టమైన బౌలింగ్ను ఎదుర్కొని నమీబియా ఆడిన తీరును క్రికెట్ అభిమానులు ప్రశంసించారు. చదవండి: T20 WC 2021 PAK Vs NAM: దుమ్మురేపిన ఓపెనర్లు.. ఐదోసారి సెమీస్కు పాకిస్తాన్ తాజాగా పాకిస్తాన్ జట్టు కూడా మ్యాచ్ ముగిసిన అనంతరం బాధలో ఉన్న నమీబియాను వారి డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లి ఓదార్చి క్రీడాస్పూర్తి ప్రదర్శించి అభిమానుల మనసు గెలుచుకున్నారు. సెలక్షన్ మేనేజర్ సహా మహ్మద్ హపీజ్, హసన్ అలీ, షాహిన్ అఫ్రిది, షాబాద్ ఖాన్, ఫఖర్ జమాన్లు కలిసి నమీబియా డ్రెస్సింగ్రూమ్కు వచ్చి వారిని అభినందించారు. '' మ్యాచ్లో ఓడిపోయామని బాధపడకండి.. చాలా మంచి ప్రదర్శన ఇచ్చారు. మాకు పోటీగా పరుగులు సాధిస్తూ మమ్మల్ని కాసేపు ఆందోళన పడేలా చేశారు. అయితే మ్యాచ్లో గెలుపోటములు సహజం. మ్యాచ్లో డేవిడ్ వీస్ ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మిగతా మ్యాచ్ల్లో గెలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.. ఆల్ ది బెస్ట్'' అంటూ చెప్పుకొచ్చారు. అనంతరం పాక్ క్రికెటర్లు నమీబియా క్రికెటర్లను హగ్ చేసుకొని అభినందించారు. చదవండి: IND VS NZ: వార్నీ ఇది ధోని ఐడియానా.. అందుకే రవిశాస్త్రి?! కాగా ఈ వీడియోనూ పీసీబీ ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్గా మారింది. ఇక పాకిస్తాన్ క్రీడాస్పూర్తిని ప్రదర్శించిన తీరుకు క్రికెట్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. ''ఓడిన జట్టు బాధలో ఉన్నప్పుడు వారికి ధైర్యం చెప్పడం ధర్మం.. ఈరోజు పాకిస్తాన్ దానిని చేసి చూపించింది'' అంటూ కామెంట్స్ చేశారు. #SpiritofCricket - Pakistan team visited Namibia dressing room to congratulate them on their journey in the @T20WorldCup#WeHaveWeWill | #T20WorldCup pic.twitter.com/4PQwfn3PII — Pakistan Cricket (@TheRealPCB) November 2, 2021 -
IND Vs Pak: ఆ ప్లేయర్స్ ఇద్దరికి కలిపి 80 ఏళ్లు.. ఆడించొద్దు
T20 WC 2021 IND Vs PAK.. టి20 ప్రపంచకప్లో భాగంగా మరికొన్ని గంటల్లో టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్ మొదలుకానుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టీమిండియాతో ఆడే జట్టును పాకిస్తాన్ ప్రకటించేసింది. ఆ జట్టులో సీనియర్ ఆటగాళ్లు షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్ కూడా ఉన్నారు. కాగా ఈ ఇద్దరికి జట్టులో చోటు కల్పించడంపై న్యూజిలాండ్ మాజీ ఆటగాడు సైమన్ డౌల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బాబర్ అజమ్.. మహ్మద్ రిజ్వాన్లు ఓపెనర్లుగా వస్తారు.. ఇక వన్డౌన్లో ఫఖర్ జమాన్ ఉంటాడు. నాలుగు, ఐదు స్థానాల్లో మహ్మద్ హఫీజ్ , హైదర అలీ వస్తే బాగుంటుంది. షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్లు ఒకేసారి ఆడకూడదు. చదవండి: T20 WC 2021: భారత్-పాక్ మ్యాచ్పై రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు వయసు రిత్యా మాలిక్కు 39, హఫీజ్కు 41.. ఇద్దరికి కలిపి 80 ఏళ్లు ఉంటాయి. వాళ్లిద్దరు కలిసి ఆడితే నాకు 80 ఏళ్ల ముసలోడు కనిపిస్తాడు. అందుకే షోయబ్ మాలిక్ స్థానంలో హైదర్ అలీని ఆడించాలి. హఫీజ్ ప్రస్తుతం పాక్ మిడిలార్డర్లో బలమైన బ్యాటర్గా ఉన్నాడు. అతనికి జతగా హైదర్ అలీ అయితేనే కరెక్ట్గా ఉంటుంది. అప్పుడే టీమ్ బ్యాలెన్సింగ్గా ఉంటుంది. ఇక ఆరు, ఏడు స్థానాల్లో ఆసిఫ్ అలీ, ఇమాద్ వసీమ్లు.. 8,9,10 స్థానాల్లో షాదాబ్ ఖాన్, హసన్ అలీ, హారిస్ రౌఫ్.. చివరగా షాహిన్ అఫ్రిది ఉంటారు. అని చెప్పుకొచ్చాడు. ఇక మహ్మద్ హఫీజ్ కొన్నేళ్లుగా పాకిస్తాన్ జట్టులో మిడిలార్డర్లో స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. 116 టి20ల్లో 2429 పరుగులు చేశాడు. ఇక మాలిక్ గత రెండేళ్లుగా పాకిస్తాన్ తరపున ఎక్కువ మ్యాచ్లు ఆడలేదు. ఓవరాల్గా పాక్ తరపున 116 టి20లు ఆడిన మాలిక్ 2335 పరుగులు సాధించాడు. చదవండి: Babar Azam: మా బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉంది.. ఇమ్రాన్తో మాట్లాడాము -
2007 టి20 వరల్డ్కప్ ఫైనల్ గుర్తుందిగా.. తాజాగా ముగ్గురు మాత్రమే
T20 WC 2021... 2007 టి 20 ప్రపంచకప్ జరిగి దాదాపు 14 సంవత్సరాలు కావొస్తుంది. ఆ వరల్డ్కప్లో టీమిండియా ఫైనల్లో తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై చారిత్రక విజయం సాధించి తొలి టి20 వరల్డ్ చాంపియన్గా నిలిచింది. ఇక తాజాగా 2021 టి20 ప్రపంచకప్లో టీమిండియా పాకిస్తాన్తో తొలి మ్యాచ్ ఆడనుంది. కాగా 2007 టి20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్, టీమిండియా జట్టులో ఉన్న ఆటగాళ్లలో ప్రస్తుతం ముగ్గురు మాత్రమే ఆడనున్నారు. అందులో టీమిండియా నుంచి రోహిత్ శర్మ ఉంటే.. పాకిస్తాన్ నుంచి మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్లు మాత్రమే ప్రస్తుతం జట్టులో ఉన్నారు. టీమిండియా- పాకిస్తాన్ మధ్య అక్టోబర్ 24న మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో మరోసారి ఈ ముగ్గురి గురించి చర్చించుకుందాం. చదవండి: T20 WC 2021: చరిత్ర సృష్టించిన నమీబియా; ఆటగాళ్ల సంబరం మాములుగా లేదు రోహిత్ శర్మ: 14 సంవత్సరాల తర్వాత రోహిత్ శర్మ ప్రస్తుతం టీమిండియాకు వైస్ కెప్టెన్గా.. స్టార్ ఓపెనర్గా ఉన్నాడు. వాస్తవానికి రోహిత్ శర్మ టి20ల్లో అరంగేట్రం చేసింది 2007 టి20 ప్రపంచకప్ ద్వారానే. అప్పటికి రోహిత్కు పెద్దగా అనుభవం లేదు. పాకిస్తాన్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో యువరాజ్, ధోనిలు ఔటైన తర్వాత ఆరో స్థానంలో వచ్చిన రోహిత్ 16 బంతుల్లో 30 పరుగులు సాధించాడు. టీమిండియా 157 పరుగులు చేయడంలో రోహిత్ పాత్ర కూడా ఉంది. అతని ఇన్నింగ్స్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. టీమిండియా 5 పరుగుల తేడాతో విజయం సాధించడంలో రోహిత్ది కూడా కీలకపాత్ర. మరి ఆదివారం పాక్తో జరగనున్న మ్యాచ్లో రోహిత్ శర్మ మెరుపులు చూస్తామా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మహ్మద్ హఫీజ్: పాకిస్తాన్ వెటరన్ ఆల్రౌండర్ మహ్మద్ హఫీజ్ 2007 టి20 ప్రపంచకప్ ఫైనల్లో ఓపెనింగ్ స్థానంలో ఆడాడు. ఆ మ్యాచ్లో ఆర్పీ సింగ్ బౌలింగ్ తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. అంతకముందు బౌలింగ్లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. మూడు ఓవర్లు వేసిన హఫీజ్ 25 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కానీ 14 సంవత్సరాలు గడిచేసరికి హఫీజ్ పాక్ జట్టులో కీలక బ్యాట్స్మన్గా ఎదిగాడు. మరి ఆదివారం జరగబోయే మ్యాచ్లో హఫీజ్ ప్రభావం చూపిస్తాడా అనేది వేచి చూడాలి. షోయబ్ మాలిక్: 2007 టి20 ప్రపంచకప్కు పాకిస్తాన్ కెప్టెన్గా షోయబ్ మాలిక్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జట్టును విజయవంతంగా ఫైనల్ చేర్చిన అతను టీమిండియాతో జరిగిన ఫైనల్లో మాత్రం విఫలమయ్యాడు. బ్యాటింగ్లో 17 బంతులాడి పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక బౌలింగ్లో ఒక్క ఓవర్ కూడా వేయలేదు. 14 సంవత్సరాలు గడిచేసరికి షోయబ్ మాలిక్ పాక్ టి20 జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. వాస్తవానికి ముందు ప్రకటించిన జట్టులో షోయబ్ మాలిక్ పేరు లేదు. చివరి నిమిషంలో సోహైబ్ మక్సూద్ గాయంతో వైదొలగొడంతో కెప్టెన్ నిర్ణయం మేరకు షోయబ్ను జట్టులోకి తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృశ్యా మాలిక్కు చోటు దక్కడం కష్టంగానే ఉన్నప్పటికి కెప్టెన్ బాబర్ మద్దతు ఉండడంతో టీమిండియాతో మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. చదవండి: T20 World Cup 2021: పొట్టి ప్రపంచకప్ చరిత్రలో నెదర్లాండ్స్ అత్యంత చెత్త రికార్డు -
టీ20 ప్రపంచ కప్కు ముందు అతడు రిటైర్మెంట్ ప్రకటించవచ్చు...
Mohammad Hafeez Might Not Play T20 World Cup: పాకిస్తాన్ స్టార్ ఆల్రౌండర్ మహ్మద్ హఫీజ్ టీ20 ప్రపంచ కప్కు ముందు తన అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించవచ్చని ఆ జట్టు వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ సంచలన వాఖ్యలు చేశాడు. ప్రస్తుతం కరీబియన్ ప్రీమియర్ లీగ్లో ఆడుతున్న హఫీజ్ను త్వరగా స్వదేశానికి రావాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. కాగా సెప్టెంబర్ 18 వరకు కొనసాగుతున్న సీపీల్లో పాల్గొనడానికి హఫీజ్కు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మంజూరు చేయబడింది. అయితే, న్యూజిలాండ్తో జరగబోయే హోమ్ సిరీస్ కోసం సెప్టెంబర్ 16లోపు హఫీజ్ను జట్టులో పీసీబీ చేరమంది. ఇందుకోసం రెండు రోజులు గడువు ఇవ్వాలన్న హఫీజ్ అభ్యర్థనను కూడా బోర్డు తిరస్కరించింది. దీంతో హఫీజ్ న్యూజిలాండ్తో జరిగే సిరీస్కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో పీసీబీ తీసుకున్న నిర్ణయంపై హఫీజ్ మండిపడుతున్నాడని సమాచారం. ఈ విషయం పై స్పందించిన అక్మల్ తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లడతూ.. హఫీజ్ వంటి సీనియర్ ఆటగాడి పట్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ దురుసుగా ప్రవర్తించడంపై తీవ్ర విమర్శలు చేశాడు. హఫీజ్తో ఈ విధంగా ప్రవర్తించడం ఇదేమి మొదటిసారి కాదని అక్మల్ అన్నాడు. "నేను మొహమ్మద్ హఫీజ్తో మాట్లాడలేదు కానీ అతడు చాలా బాధపడ్డాడని.. టీ20 ప్రపంచకప్ ఆడకపోవచ్చని నేను అనుకుంటున్నాను. పీసీబీ అతడితో సంప్రదింపులు జరపకపోతే , అతడు ప్రపంచకప్కు ముందు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది" అని అక్మల్ అభిప్రాయపడ్డాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ కొత్త ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన రమీజ్ రాజాను.. భవిష్యత్తులో హఫీజ్ లాంటి సీనియర్ ఆటగాళ్లకు ఈ విధంగా జరగకుండా చూసుకోవాలని అక్మల్ అభ్యర్థించాడు. తమ మధ్య ఉన్న వ్యక్తిగత సమస్యలను పక్కనపెట్టి హఫీజ్కి మద్దతు ఇవ్వాలని అక్మల్ కోరాడు. కాగా రమీజ్ రాజా కంటే పన్నెండేళ్ల వయస్సున్న తన కొడుకుకే క్రికెట్ గురించి ఎక్కువ తెలుసంటూ హఫీజ్ గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. చదవండి: బ్లూ కలర్ జెర్సీలో కనిపించనున్న ఆర్సీబీ.. ఎందుకంటే? -
హఫీజ్ మెరుపులు..థ్రిల్లింగ్ విక్టరీ
మాంచెస్టర్: టెస్టు సిరీస్ కోల్పోయి రెండో టి20లో పరాజయం పాలైన పాకిస్తాన్ ఎట్టకేలకు ఇంగ్లండ్ గడ్డపై ఒక విజయంతో తిరుగు ముఖం పట్టింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన చివరి టి20 మ్యాచ్లో పాక్ 5 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం, రెండో మ్యాచ్లో ఇంగ్లండ్ నెగ్గడంతో సిరీస్ 1–1తో సమంగా ముగిసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన పాక్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ మొహమ్మద్ హఫీజ్ (52 బంతుల్లో 86 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగి ఆడగా... హైదర్ అలీ (33 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అరంగేట్ర మ్యాచ్లో అర్ధ సెంచరీ సాధించిన తొలి పాకిస్తాన్ ఆటగాడిగా నిలిచాడు. (చదవండి: ‘మాది తండ్రీ కొడుకుల బంధం’) అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 185 పరుగులు చేసి ఓడిపోయింది. మొయిన్ అలీ (33 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీకి తోడు టామ్ బాంటన్ (31 బంతుల్లో 46; 8 ఫోర్లు) రాణించాడు. చివరి ఓవర్లో విజయానికి 17 పరుగులు కావాల్సి ఉండగా... ఐదు బంతుల్లో 11 పరుగులు వచ్చాయి. ఐదో బంతికి భారీ సిక్సర్ బాదిన టామ్ కరన్ చివరి బంతిని షాట్ ఆడటంలో విఫలమయ్యాడు. దాంతో పాక్ గెలుపు ఖాయమైంది. ఈ టూర్లో తొలి టెస్టులో గెలిచే స్థితి నుంచి ఓటమి పాలైన పాక్... తొలి టి20లో దాదాపు ఇంతే స్కోరు చేసి కూడా పరాజయాన్ని ఎదుర్కొంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఇంగ్లండ్ వేదికగా ‘బయో బబుల్’ సెక్యూర్ వాతావరణంలో వరుసగా రెండో విదేశీ జట్టు పర్యటన విజయవంతంగా ముగియడం విశేషం. (చదవండి: కొంత భయమైతే ఉంది: విలియమ్సన్ ) -
‘ఆ పది మంది’ లేకుండా...
కరాచీ: ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై స్పష్టత వచ్చింది. తొలిసారి నిర్వహించిన కరోనా టెస్టులో పాజిటివ్గా తేలిన 10 మంది క్రికెటర్లను పక్కన పెట్టి మిగతా 18 మంది ఆటగాళ్లు, 11 మంది సహాయక సిబ్బందితో పాక్ జట్టు నేడు ప్రత్యేక విమానంలో ఇంగ్లండ్ వెళ్లనుంది. వీరితో పాటు రిజర్వ్గా ఎంపిక చేసిన ఇద్దరు ఆటగాళ్లు కూడా అదనం. ఈ సిరీస్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) 28 మంది ఆటగాళ్లతో జట్టును ఎంపిక చేసింది. వీరిలో పది మంది కరోనా పాజిటివ్గా తేలారు. వీరికి శనివారం మరో సారి కోవిడ్–19 పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఆరుగురు ఆటగాళ్లు మొహమ్మద్ హఫీజ్, వహాబ్ రియాజ్, ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ హస్నైన్ ‘నెగెటివ్’గా తేలారు. అయినా సరే వీరిని మాత్రం అప్పుడే ఇంగ్లండ్కు పంపరాదని పీసీబీ నిర్ణయించింది. ‘నిబంధనల ప్రకారం వరుసగా రెండోసారి వారి టెస్టులు నెగెటివ్గా రావాలి. అప్పుడే ఆ ఆరుగురికి ఇంగ్లండ్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తాం. 18 మంది రెగ్యులర్ ఆటగాళ్లతో పాటు రిజర్వ్గా ఎంపికై నెగెటివ్ వచ్చిన మూసా ఖాన్, రొహైల్ నజీర్ కూడా జట్టుతో పాటు వెళుతున్నారు’ అని పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీం ఖాన్ వెల్లడించారు. మరో నలుగురు క్రికెటర్లు హైదర్ అలీ, హారిస్ రవూఫ్, కాశిఫ్ భట్టీ, ఇమ్రాన్ ఖాన్ మాత్రం వరుసగా రెండోసారి కరోనా పాజిటివ్గా బయట పడ్డారు. ఈ టూర్లో భాగంగా ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య 3 టెస్టులు, 3 టి20 మ్యాచ్లు జరుగుతాయి. పాక్ జట్టు ముందుగా మాంచెస్టర్ చేరుకొని అక్కడి నుంచి వస్టర్షైర్కు వెళుతుంది. అక్కడ ఇంగ్లండ్ దేశపు నిబంధనల ప్రకారం కరోనా టెస్టులు జరుగుతాయి. ఆపై 14 రోజుల క్వారంటైన్ మొదలవుతుంది. జూలై 30 నుంచి ఇరు జట్ల మధ్య లార్డ్స్లో తొలి టెస్టు జరుగుతుంది. పాక్ జట్టు ప్రయాణం కోసం ఇంగ్లండ్ బోర్డే ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడం విశేషం. -
'అల్లా దయ.. నాకు కరోనా సోకలేదు'
లాహోర్ : పాక్ జట్టులో 10 మంది ఆటగాళ్లకు కరోనా సోకినట్లు పీసీబీ మంగళవారం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆ పది మందిలో పాక్ ఆల్రౌండర్ మొహమ్మద్ హఫీజ్ కూడా ఉన్నట్లు పాక్ క్రికెట్ బోర్డు పేర్కొంది. ఈ విషయంపై పీసీబీ ప్రకటించి ఒక్కరోజు గడవకుండానే హఫీజ్ స్పందించాడు. తనకు కరోనా సోకలేదంటూ హఫీజ్ ట్విటర్ ద్వారా తాను పర్సనల్గా చేయించుకున్న కరోనా పరీక్ష రిపోర్టును షేర్ చేసుకున్నాడు. 'రిపోర్ట్స్లో నాకు కరోనా పాజిటివ్ వచ్చిందని పీసీబీ బోర్డు మంగళవారం స్పష్టం చేసింది. అయితే ఈ విషయాన్ని మరోసారి దృవీకరించుకోవాలని కుటుంబసభ్యులతో కలిసి నేను మళ్లీ కోవిడ్-19 పరీక్షలు చేయించుకున్నా. కాగా రిపోర్ట్స్లో నాతో పాటు కుటుంబసభ్యులకు కూడా నెగెటివ్ వచ్చింది. అల్లానే మా కుటుంబాన్ని కాపాడాడు.. ఆయనే మా అందరిని సురక్షితంగా ఉంచుతాడు' అని క్యాప్షన్ జత చేశాడు. ('ఆసియా కప్ కచ్చితంగా జరుగుతుంది') After Tested positive COVID-19 acc to PCB testing Report yesterday,as 2nd opinion & for satisfaction I personally went to Test it again along with my family and here I along with my all family members are reported Negetive Alham du Lillah. May Allah keep us all safe 🤲🏼 pic.twitter.com/qy0QgUvte0 — Mohammad Hafeez (@MHafeez22) June 24, 2020 కాగా ఇంగ్లండ్ పర్యటన కోసమని ఎంపిక చేసిన 29 మంది క్రికెటర్లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ముందస్తుగా కరోనా పరీక్షలు నిర్వహించింది. ఇందులో భాగంగానే సోమవారం ముగ్గురు పాక్ క్రికెటర్లు కరోనా బారిన పడగా, మిగతా ఏడుగురికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. వారిలోషాదాబ్ ఖాన్, హైదర్ అలీ, హారిస్ రవూఫ్, మొహమ్మద్ హఫీజ్, వహాబ్ రియాజ్, ఫఖర్ జమాన్, మొహమ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ హస్నైన్, కాశిఫ్ భట్టీ, ఇమ్రాన్ ఖాన్లు ఉన్నారు. ఇంగ్లండ్తో జరిగే 3 టెస్టులు, 3 టి20ల కోసం పాక్ జట్టు ఆడాల్సి ఉండగా.. ఇప్పుడు దాదాపు మూడోవంతు మంది కరోనా బారిన పడ్డారు. అయినా సరే షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న పాకిస్తాన్ జట్టు ఇంగ్లండ్ బయల్దేరుతుందని పీసీబీ ప్రకటించడం విశేషం. అయితే ప్రస్తుతం హఫీజ్కు కరోనా పరీక్షల్లో నెగెటివ్గా రావడంతో ఇంగ్లండ్ పర్యటనరు వెళ్లే అవకాశం ఉంది. కాగా కరోనా పాజిటివ్ వచ్చిన ఆటగాళ్లకు జూన్ 25న మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు తేలింది. (నేనైతే ఆమెతో డేట్కు వెళతా: దాదా) 'పాజిటివ్గా తేలినవారిలో ఒక్క వికెట్ కీపర్ రిజ్వాన్ మాత్రమే టెస్టు స్పెషలిస్ట్. అతనికి మాత్రమే తుది జట్టులోకి ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. మిగతా వారికి టి20ల కోసం కోలుకునేందుకు తగినంత సమయం ఉందని బోర్డు భావిస్తోంది. రిజ్వాన్ గైర్హాజరులో మాజీ కెప్టెన్ సర్ఫరాజ్కు అవకాశం దక్కవచ్చు. ముందు జాగ్రత్తగా నలుగురు రిజర్వ్ ఆటగాళ్లు బిలాల్ ఆసిఫ్, ఇమ్రాన్ బట్, మూసా ఖాన్, మొహమ్మన్ నవాజ్లను ఎంపిక చేశాము. పీసీబీ వారిని కూడా కరోనా టెస్టుల కోసం పంపించింది.' అంటూ పీసీబీ సీఈవో వసీం ఖాన్ పేర్కొన్నాడు. -
పాక్ జట్టులో 10 మందికి కరోనా పాజిటివ్
లాహోర్ : ఎప్పుడు వివాదాలతో సతమతమయ్యే పాక్ క్రికెట్ జట్టుకు కరోనా సెగ తగిలింది. జట్టులోని ఆటగాళ్లంతా వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే జట్టులోని ముగ్గరు ఆటగాళ్లకు కరోనా సోకగా తాజాగా మరో ఏడుగురు పాక్ క్రికెటర్లకు కరోనా పాజిటివ్గా తేలింది. సోమవారం పాక్ యువ ఆటగాడు హైదర్ అలీతో పాటు షాదాబ్ ఖాన్, హారిస్ రవూఫ్లు కోవిడ్-19 పాజిటివ్గా తేలింది. తాజాగా ఫఖర్ జమాన్, ఇమ్రాన్ ఖాన్, కాశీఫ్ భట్టి, మహ్మద్ హఫీజ్, మహ్మద్ హస్నైన్, మహ్మద్ రిజ్వాన్, వహాబ్ రియాజ్లు కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. కరోనా సంక్షోభంతో భారీ విరామం తర్వాత మరో వారం రోజుల్లో ఇంగ్లండ్ పర్యటన కోసం బయలుదేరాల్సిన పాక్ క్రికెట్ జట్టుకు పెద్దదెబ్బే తగిలింది. ఈ సిరీస్ కోసం ఎంపికైన 29 మంది పాక్ క్రికెటర్లకు కోవిడ్-19 టెస్టులు నిర్వహించారు.(టెన్నిస్ స్టార్ జొకోవిచ్కు కరోనా పాజిటివ్) కాగా పాక్ సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్తో పాటు పాక్ జట్టు ప్రధాన కోచ్ వకార్ యూనిస్, ఫిజియోథెరపిస్ట్ క్లిఫ్ డెకాన్ ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. దీంతో పీసీబీలో ఆందోళన నెలకొంది. ఇంగ్లండ్ పర్యటన కోసమే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆదివారం నుంచి రావల్పిండిలో కరోనా పరీక్షలు నిర్వహించడంతో ఒక్కొక్కరిగా 10 మందికి కరోనా సోకడంతో క్రికెటర్లంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. వీరిని పీసీబీ వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. ఇప్పటికే పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.('కోచ్ పదవి నాకు సవాల్గా కనిపిస్తుంది') -
‘వీడ్కోలు చెప్పి లీగ్లు ఆడుకుంటా’
కరాచీ: తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు ఈ ఏడాదే ముగింపు పలుకుతానని పాకిస్తాన్ ఆల్ రౌండర్ మొహ్మద్ హఫీజ్ మరోసారి స్పష్టం చేశాడు. గత జనవరిలో తన వీడ్కోలు నిర్ణయంపై మనసులో మాట చెప్పిన హఫీజ్.. తన అంతర్జాతీయ కెరీర్లో చివరి కోరిక ఒకటుందని పేర్కొన్నాడు. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్లో జరిగే టీ20 ప్రపంచకప్లో పాకిస్తాన్ తరఫున ఆడటమే తన ప్రధాన కోరికన్నాడు. ఆపై అంతర్జాతీయ క్రికెట్ నుంచి దర్జాగా తప్పుకుంటానన్నాడు. కాగా, మొత్తం క్రికెట్ కెరీర్కు వీడ్కోలు చెప్పనని, కేవలం అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లకు మాత్రమే దూరం అవుతానని తెలిపాడు. తాను లీగ్లు ఆడుకుంటా క్రికెట్ను ఆస్వాదిస్తానన్నాడు. 2003లో ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా అరంగేట్రం చేసిన హఫీజ్ పాక్ టాపార్డర్ బ్యాట్స్మన్గా కీలకపాత్ర పోషించాడు. కొన్ని సందర్భాల్లో స్పిన్నర్గాను ఆకట్టుకున్నాడు. అయితే 2015లో అతని బౌలింగ్ శైలి సందేహాస్పదంగా ఉందని 12 నెలలు బౌలింగ్ వేయకుండా నిషేధం విధించారు. పాకిస్తాన్ టి20 జట్టుకు సారథ్యం కూడా వహించాడు. అతని కెప్టెన్సీలో పాక్ 29 మ్యాచ్లు ఆడగా... 17 గెలిచి, 11 మ్యాచ్ల్లో ఓడింది. ఒకటి టైగా ముగిసింది. ఇప్పటి వరకూ 55 టెస్టుమ్యాచ్లు ఆడిన హఫీజ్.. 218 వన్డేలు ఆడాడు. ఇక 91 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లకు ప్రాతినిథ్యం వహించాడు. కాగా, గతేడాది జరిగిన వన్డే వరల్డ్కప్ తర్వాత హఫీజ్ను పీసీబీ పెద్దలు పక్కన పెట్టేశారు. ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ టీ20 సిరీస్కు హాఫీజ్ను తిరిగి జట్టులో అవకాశం కల్పించారు. -
టి20 ప్రపంచకప్ తర్వాత వీడ్కోలు
లాహోర్: పాకిస్తాన్ ఆల్రౌండర్ మొహమ్మద్ హఫీజ్ ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పనున్నట్లు ప్రకటించాడు. 38 ఏళ్ల ఈ మాజీ కెప్టెన్ను బంగ్లాదేశ్తో టి20 సిరీస్ కోసం జట్టులోకి తీసుకున్నారు. ఈ ఏడాది అక్టోబర్–నవంబర్లో ఆసీస్లో జరిగే టి20 ప్రపంచకప్ తర్వాత క్రికెట్కు వీడ్కోలు పలుకుతానని అతను చెప్పాడు. 2003లో ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా అరంగేట్రం చేసిన హఫీజ్ పాక్ టాపార్డర్ బ్యాట్స్మన్గా కీలకపాత్ర పోషించాడు. స్పిన్నర్గాను రాణించాడు. అయితే 2015లో అతని బౌలింగ్ శైలి సందేహాస్పదంగా ఉందని 12 నెలలు బౌలింగ్ వేయకుండా నిషేధం విధించారు. హఫీజ్ పాకిస్తాన్ టి20 జట్టుకు సారథ్యం కూడా వహించాడు. అతని కెప్టెన్సీలో పాక్ 29 మ్యాచ్లు ఆడగా... 17 గెలిచి, 11 మ్యాచ్ల్లో ఓడింది. ఒకటి టైగా ముగిసింది. , , -
వావ్ ఇట్స్ అమేజింగ్.. మాలిక్ వచ్చేశాడు!
పాకిస్తాన్ మాజీ సారథి, ఆల్రౌండర్ షోయబ్ మాలిక్ అనూహ్యంగా పాకిస్తాన్ టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. మూడు టీ20ల సిరీస్లో భాగంగా బంగ్లాదేశ్తో తలపడబోయే పాకిస్తాన్ జట్టును ఆ దేశ సెలక్లర్లు ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన పాక్ జట్టులో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్లను సెలక్టర్లు ఎంపిక చేశారు. అంతేకాకుండా అన్క్యాప్డ్ ప్లేయర్స్ హారిస్ రౌఫ్, అహ్సన్ అలీలను కూడా ఎంపిక చేశారు. అయితే సీనియర్ బౌలర్లు మహ్మద్ అమిర్, వాహబ్ రియాజ్లను జట్టు నుంచి తప్పించడం గమనార్హం. గత కొంత కాలంగా ఫామ్లో లేక తంటాలు పడుతున్న మాలిక్ పాక్ జట్టులో స్థానం కోల్పోయాడు. ఈ క్రమంలోనే వన్డేలకు గుడ్బై చెప్పిన మాలిక్ టీ20ల్లో కొనసాగుతానని ప్రకటించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ క్రికెట్ను గాడిన పెట్టేందుకు చర్యలు ప్రారంభించామని, దీనిలో భాగంగానే జట్టులో మార్పులు చేపట్టామని ఆ దేశ ప్రధాన కోచ్, చీఫ్ సెలక్టర్ మిస్బావుల్ హక్ పేర్కొన్నాడు. తామి ఆడిని చివరి 9 టీ20 సిరీస్ల్లో 8 ఓడిపోయామని గుర్తు చేసిన ఆయన ఇక ఓటముల పరంపరకు చెక్ పెట్టబోతున్నట్లు విశ్వాసం వ్యక్తం చేశాడు. ఆసియా కప్, ప్రపంచకప్ గెలిచే పాక్ జట్టును తయారు చేస్తున్నామన్నాడు. మాలిక్, హపీజ్లు తమ అనుభవంతో పాక్ జట్టుకు పునర్వైభవం తీసుకొస్తారనే ధీమా వ్యక్తం చేశాడు. ఇక మాలిక్ ఎంపిక పట్ల పాక్ అభిమానులు సంభ్రమాశ్చర్యాలకు గురువుతున్నారు. ‘ఏంటి మాలిక్ను ఎంపిక చేశారా?’, ‘వావ్ ఇట్స్ అమేజింగ్.. మాలిక్ పాక్ జట్టులోకి వచ్చాడా!’అంటూ పాక్ ఫ్యాన్స్ సరదాగా కామెంట్ చేస్తున్నారు. పాకిస్తాన్ టీ20 జట్టు: బాబర్ అజమ్(సారథి), అహ్సన్ అలీ, అమద్ బట్, హారీస్ రౌఫ్, ఇఫ్తికార్ అహ్మద్, ఇమాద్ వసీమ్, కౌష్దిల్ షా, మహ్మద్ హఫీజ్, మహ్మద్ హస్నైన్, మహ్మద్ రిజ్వాన్, ముసా ఖాన్, షాదాబ్ ఖాన్, షహీన్ షా ఆఫ్రిది, షోయబ్ మాలిక్, ఉస్మాన్ ఖాదిర్. -
ఆ క్రికెటర్ను వరల్డ్కప్కు పంపించొద్దు..
కరాచీ: ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో పాకిస్తాన్ జాతీయ క్రికెట్ తరఫున అరంగేట్రం చేసిన నసీమ్ షాను అండర్-19 వరల్డ్కప్ జట్టులో సైతం ఎంపిక చేస్తూ ఆ దేశ జూనియర్ క్రికెట్ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అయితే అండర్-19 వరల్డ్కప్కు నసీమ్ను పంపించవద్దని అంటున్నాడు మరో క్రికెటర్ మహ్మద్ హఫీజ్. పాక్ జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేసిన నసీమ్ మానసింకంగా, ధృఢంగా మారాలంటే మరింత సాధన అవసరమని, దాంతో జూనియర్ స్థాయిలో మ్యాచ్లకు ఎంపిక చేయొద్దని పీసీబీకి సూచించాడు. ‘ పీసీబీకి, మా జూనియర్ సెలక్షన్ కమిటీ ఇది నేను మర్యాద పూర్వకంగా విన్నవిస్తున్నా. అండర్-19 వరల్డ్కప్కు నసీమ్ను పంపవద్దు. అతను ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి మ్యాచ్లు ఆడేశాడు. ఆ స్థాయిలో టెక్నికల్గా, శారీరకంగా మరింత పరిణితి సాధించాలంటే ఎక్కువ శ్రమించాలి. నసీమ్ స్థానంలో మరొకర్ని ఎంపిక చేయండి. మిగతా పేస్ బౌలర్ ఎవరైనా ఉంటే అతనికి అవకాశం ఇవ్వండి’ అని హఫీజ్ కోరాడు. శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్ 263 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. 2009 తర్వాత స్వదేశంలో శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ఆడిన పాకిస్తాన్.. తొలి టెస్టును డ్రా చేసుకోగా, రెండో టెస్టులో ఘన విజయం సాధించింది. ప్రధానంగా పాకిస్తాన్ టీనేజ్ క్రికెటర్ నసీమ్ షా విజృంభించాడు.రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు సాధించి శ్రీలంక పతనాన్ని శాసించాడు. తద్వారా ఒక టెస్టు మ్యాచ్ ఒక ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు సాధించిన అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డు సాధించాడు. ప్రస్తుతం పీసీబీ లెక్కల ప్రకారం నసీమ్ షా 16 ఏళ్ల 307 రోజుల వయసు కల్గి ఉన్నాడు. -
జీవనోపాధి కోసం వ్యాన్ డ్రైవర్గా మారిన క్రికెటర్..
-
జీవనోపాధి కోసం వ్యాన్ డ్రైవర్గా మారిన క్రికెటర్..
కరాచీ: జీవనోపాధి కోసం ఒక క్రికెటర్ కాస్తా వ్యాన్ డ్రైవర్గా మారాడు. పాకిస్తాన్ దేశవాళీల్లో ఆడిన మాజీ క్రికెటర్ ఫజాల్ షుబాన్ తన కుటుంబాన్ని పోషించుకునేందుకు వేరే గత్యంతరం లేక వ్యాన్ నడుపుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. పాకిస్తాన్ క్రికెట్లో తీసుకొచ్చిన నూతన విధానం వల్ల డిపార్ట్మెంటల్ క్రికెట్కు చరమగీతం పాడారని, దాంతోనే తాను ఇలా రోడ్డున పడ్డానని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ పాకిస్తాన్ క్రికెట్ జట్టు తరఫున ఆడటానికి చాలా శ్రమించా. దేశవాళీ క్రికెట్లో భాగంగా ఉన్న డిపార్ట్మెంటల్ క్రికెట్లో ఆడా. దాంతో రూ. లక్ష వరకూ జీతంగా వచ్చేది. కానీ వాటిని మూసేయడంతో ఇప్పుడు వ్యాన్ డ్రైవర్గా మారాల్సి వచ్చింది. ఇప్పుడు నా సంపాదన 30 వేల నుంచి 35 వేల వరకూ మాత్రమే ఉంది. దీంతో కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా ఉంది. అయినా సంతోషంగానే ఉన్నా’ అని ఫజాల్ పేర్కొన్నాడు. కాగా, ఈ వీడియో వైరల్ అయిన తర్వాత తన ట్వీటర్ అకౌంట్లో షేర్ చేశాడు పాకిస్తాన్ క్రికెటర్ మహ్మద్ హఫీజ్. పాకిస్తాన్ క్రికెట్ తీసుకొచ్చిన కొత్త పాలసీ వల్ల చాలా మంది ఇలా వీదిన పడ్డారు. ఇది చాలా బాధాకరం. ఈ పాలసీ వల్ల 200 మంది మాత్రమే లబ్ది పొందే అవకాశం ఉండగా వేల సంఖ్యలో దేశవాళీ క్రికెటర్లు ఉద్యోగాలు లేకుండా పోయారు. దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు అనేది అయితే నాకు కచ్చితంగా తెలియదు. ఇలా క్రికెటర్లు ఉద్యోగాలు లేకండా బాధితులుగా మారిపోయారు’ అంటూ పేర్కొన్నాడు. -
‘హలో.. కోహ్లిని కాపీ కొట్టకు’
కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న పాక్ క్రికెటర్ మహ్మద్ హఫీజ్పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని కాపీ కొట్టడం అంటే అతడిలా ఫొటోలు దిగడం కాదని... కోహ్లిలా పరుగులు వరద పారించాలని కామెంట్లు చేస్తున్నారు. కొన్నాళ్లుగా ఫామ్లేమితో ఇబ్బంది పడుతున్న హఫీజ్ను శ్రీలంక-పాకిస్తాన్ సిరీస్కు సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ప్రపంచకప్లో కూడా చెత్త ప్రదర్శన కనబరచడంతో మేజర్ కాంట్రాక్టుల విషయంలో పీసీబీ అతడిని పక్కన పెట్టింది. ఈ క్రమంలో ప్రస్తుతం కరేబియన్ లీగ్లో భాగంగా హఫీజ్ మైదానంలో దిగాడు. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ తరఫున అతడు ఆడుతున్నాడు. ఇందులో భాగంగా తాను బస చేస్తున్న హోటల్లోని స్మిమ్మింగ్పూల్లో హఫీజ్ ఫొటోలు దిగాడు. సెయింట్ లూయీస్ వద్ద అందమైన సూర్యాస్తమయం అనే క్యాప్షన్తో వాటిని ట్విటర్లో షేర్ చేశాడు. అయితే విరాట్ కోహ్లి మాదిరి హఫీజ్ కూడా షర్ట్లెస్ ఫొటోలకు ఫోజులివ్వడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘హలో కోహ్లిని కాపీ కొట్టాలంటే అతడి లాగా ఆటలో విజృంభించు. ఇలా ఫొటోలు కాపీ కొట్టకు. అయినా టీమ్ నుంచి తప్పించారన్న బాధే లేదు నీకు. పోనీ ఓ పని చెయ్. రిటైర్మెంట్ తీసుకో. హాయిగా లీగ్ మ్యాచ్లు ఆడుకుంటూ కాలం వెళ్లదీయ్’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. Sunset view in Beautiful St Lucia 😍 pic.twitter.com/5zECepAoJd — Mohammad Hafeez (@MHafeez22) September 21, 2019 -
ప్రపంచకప్ ఎఫెక్ట్.. సీనియర్లపై వేటు
కరాచీ: ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్లో పాకిస్తాన్ చెత్త ప్రదర్శనతో సెమీస్కు చేరకుండానే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రపంచకప్లో పాక్ సారథి, సీనియర్ ఆటగాళ్ల చెత్త ప్రదర్శనపై అన్ని వైపులా విమర్శలు వచ్చాయి. దీంతో సారథి సర్ఫరాజ్ అహ్మద్తో పాటు సీనియర్ ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందిపై వేటు వేయాలని ఫ్యాన్స్తో పాటు పాక్ మాజీ క్రికెటర్లు డిమాండ్ చేశారు. అంతేకాకుండా పాక్ క్రికెట్ జట్టును ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చిందని వారు పాక్ క్రికెట్ బోర్డుకు సూచించారు. దీనిలో భాగంగా కోచ్పై వేటు వేసి మిస్బావుల్ హక్ను ప్రధాన కోచ్గా, చీఫ్ సెలక్టర్గా నియమించింది. చీఫ్ సెలక్టర్గా నియమించాకపడ్డాక మిస్బావుల్ తన మార్క్ను చూపించాడు. శ్రీలంక, ఆస్ట్రేలియాలతో జరగబోయే వన్డే, టీ20 సిరీస్ల కోసం పీసీబీ ఓ ట్రైనింగ్ క్యాంప్ను ఏర్పాటు చేసింది. ఈ ట్రైనింగ్ క్యాంప్ కోసం 20 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఈ జాబితాలో సీనియర్ ఆటగాళ్లు మహ్మద్ హఫీజ్, షోయాబ్ మాలిక్లను ఎంపిక చేయలేదు. అయితే సర్ఫరాజ్ అహ్మద్ను సారథిగా కొనసాగించారు. బాబర్ అజమ్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ప్రపంచకప్ అనంతరం మాలిక్ వన్డేలకు గుడ్ బై చెప్పినప్పటికీ టీ20ల్లో కొనసాగుతున్నాడు. అయితే శ్రీలంకతో జరగబోయే టీ20 సిరీస్కు మాలిక్ను ఎంపిక చేయకపోవడంతో అతడి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. శ్రీలంకతో 27 నుంచి స్వదేశంలో వన్డే, టీ20 సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. -
మా కెప్టెన్ నిర్ణయం సరైందే : పాక్ క్రికెటర్
న్యూఢిల్లీ : భారత్తో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ నిర్ణయాన్ని ఆ జట్టు ఆల్రౌండర్ మహ్మద్ హఫీజ్ సమర్థించాడు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సమిష్టిగా విఫలమైనందునే ఓడిపోయామని అభిప్రాయపడ్డాడు. ఓ పాక్ చానెల్కు ఇచ్చిన ఇంటర్యూలో హఫీజ్ మాట్లాడుతూ.. ' టాస్ నిర్ణయం మేం జట్టుగా కలిసి తీసుకున్నది. మ్యాచ్లో బౌలింగ్, బ్యాటింగ్ సరిగా చేయకపోవడం వల్లే ఓటమి చవి చూశాం. ఈ పరాజయంలో జట్టుగా అందరి బాధ్యత ఉంది. ఒక్క సర్ఫరాజ్నే నిందించడం సరికాదు. మా సెమీస్ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. భారత్ మ్యాచ్ అనంతరం మాకు తగినంత సమయం దొరికింది. నూతనోత్సాహంతో మిగతా మ్యాచ్లను గెలుస్తాం’ అని హఫీజ్ ధీమా వ్యక్తం చేశాడు. ఇక పాక్ తమ తర్వాతి మ్యాచ్ను ఆదివారం దక్షిణాప్రికాతో ఆడనుంది. పాక్ ప్రధాని, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ సైతం టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవాలని మ్యాచ్కు ముందు సర్ఫరాజ్కు సూచించారు. కానీ సర్ఫరాజ్ ఆయన మాటను లెక్క చేయకుండా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో సర్ఫరాజ్ అహ్మద్ తీవ్ర ట్రోలింగ్కు గురయ్యాడు. ఈ నిర్ణయమే పాకిస్తాన్ విజయాలను దెబ్బతీసిందని, చాంపియన్స్ ట్రోఫి ఫైనల్లో భారత్ చేసిన తప్పునే ఇప్పుడు పాక్ చేసిందని అభిమానులు, ఆ దేశ మాజీ క్రికెటర్లు సర్ఫరాజ్పై మండిపడ్డారు. పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ అయితే సర్ఫరాజ్కు బుద్ధిలేదని ఘాటుగా వ్యాఖ్యానించాడు. -
‘గెలుపైనా, ఓటమైనా అందరిదీ’
లండన్: ప్రపంచకప్లో వరుస ఓటములతో పాకిస్తాన్ పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే అనధికారికంగా సెమీస్ పోరు నుంచి తప్పుకున్న పాక్ కనీసం గౌరవం కాపాడుకోవాలని భావిస్తోంది. అయితే ముఖ్యంగా టీమిండియా చేతిలో ఘోర పరాజయం తర్వాత పాక్ ఆటగాళ్లపై ఆ జట్టు అభిమానులు, మాజీ క్రికెటర్లు దుమ్మెత్తిపోస్తున్నారు. భారత్పై ఓటమికి సారథి సర్ఫరాజ్ అహ్మదే కారణమంటూ టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అయితే పాక్ సీనియర్ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ మాత్రం సర్ఫరాజ్కు మద్దతుగా నిలిచాడు. ‘ఆటలో గెలుపోటములు సహజం. ఎవరూ కావాలని ఓడిపోరు. ప్రపంచకప్లో భాగంగా భారత్తో జరిగిన మ్యాచ్లో టీమ్ వ్యూహంలో భాగంగానే సర్ఫరాజ్ టాస్ గెలిచాక తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. కానీ మేము బౌలింగ్ అనుకున్న విధంగా చేయలేదు. కొన్ని సార్లు మేము అనుకున్న వ్యూహాలు విఫలమవుతాయి. అంతమాత్రాన ఎవరినీ నింధించాల్సిన అవసరం లేదు. గెలుపైనా, ఓటమైనా జట్టు సభ్యులందరదీ. కేవలం ఒక్కరిని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేయడం సరికాదు. ఇప్పటికీ పాక్కు సెమీస్ అవకాశాలు ఉన్నాయి. మిగతా మ్యాచ్లు కచ్చితంగా గెలవాలనే పట్టుదలతో ఉన్నాం’అంటూ హఫీజ్ పేర్కొన్నాడు. చదవండి: నీకో దండం..నువ్వు కొట్టకురా నాయనా! పాక్ జట్టును రద్దు చేయాలంటూ పిటిషన్! -
చివరి ఓవర్లో అద్భుతం
అబుదాబి: ఆస్ట్రేలియాను వైట్వాష్ చేసి జోరు మీదున్న పాకిస్తాన్ మరోసారి అద్భుతం చేసింది. ఓడిపోతుందనుకున్న మ్యాచ్లో పోరాడి గెలిచింది. హఫీజ్, హసన్ పోరాట పటిమతో విజయాన్ని అందుకుంది. న్యూజిలాండ్తో బుధవారం జరిగిన ఉత్కంఠభరిత టీ20 మ్యాచ్లో రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఒత్తిడికిలోనై గెలిచే మ్యాచ్ను చేజార్చుకుంది కివీస్. 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. (ఆసీస్ను వైట్వాష్ చేశారు..) టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 10 పరుగులకే ఓపెనర్లు పెవిలియన్కు చేరారు. ఆసిఫ్ అలీ(24), మహ్మద్ హఫీజ్(45), సర్ఫరాజ్ అహ్మద్(34) సమయోచిత బ్యాటింగ్తో పాక్ కోలుకుంది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించేలా కనిపించింది. 79/2 స్కోరుతో పటిష్ట స్థితిలో ఉన్న కివీస్.. పాక్ బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. మున్రో (58), టేలర్ (42) రాణించినా మిగతా ఆటగాళ్లు విఫలం కావడంతో కివీస్ ఓటమి పాలైంది. పాక్ బౌలర్ హసన్ అలీ 3 వికెట్లు పడగొట్టాడు. చివరి ఓవర్ టెన్షన్! కివీస్ విజయం సాధించాలంటే చివరి ఓవర్లో 17 పరుగులు చేయాలి. ఈ దశలో 18 ఏళ్ల షహీన్ ఆఫ్రిదికి హఫీజ్ బంతి ఇచ్చాడు. మొదటి బంతికి సింగిల్ మాత్రమే ఇచ్చాడు. రెండో బంతిని సౌతీ బౌండరికీ పంపాడు. తర్వాతి బంతికి సింగిల్.. నాలుగు, ఐదో బాల్స్కు రెండేసి పరుగులు వచ్చాయి. చివరి బంతికి సిక్సర్ కొడితే మ్యాచ్ టై అవుతుంది. అందరిలోనూ ఒక్కటే టెన్షన్. ఏదైనా అద్బుతం జరిగితే తప్పా కివీస్ గెలిచే ఛాన్స్ లేదు. కానీ బ్యాటింగ్ చేస్తున్నది సీనియర్ బ్యాట్స్మన్ టేలర్ కావడంతో ప్రేక్షకులంతా ఉత్కంఠగా వీక్షించారు. అయితే చివరి బాల్కు ఫోర్ రావడంతో పాకిస్తాన్ ఊపిరి పీల్చుకుంది. రెండు పరుగుల తేడాతో సత్తా చాటింది. తనపై కెప్టెన్ ఉంచిన నమ్మకాన్ని షహీన్ వమ్ముచేయకుండా మ్యాచ్ను గెలిపించాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్ల సిరీస్లో పాక్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. హఫీజ్ ‘మ్యాన్ ది మ్యాచ్’ అందుకున్నాడు. -
‘నేను ఐసీసీని విమర్శించలేదు’
కరాచీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిబంధనల్ని తాను తప్పుబట్టినట్లు వచ్చిన వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని పాకిస్తాన్ ఆల్రౌండర్ మహమ్మద్ హఫీజ్ తాజాగా స్పష్టం చేశాడు. కేవలం బౌలింగ్ యాక్షన్ పరీక్షకు సంబంధించి ఐసీసీ ప్రమాణాలు పెంచుకోవాలని మాత్రమే సూచించడం జరిగిందని హఫీజ్ తెలిపాడు. ఈ మేరకు ముగ్గురు సభ్యులతో కూడిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు క్రమశిక్షణా కమిటీకి హఫీజ్ వివరణ ఇచ్చాడు. ఇటీవల ఐసీసీ నిబంధనలపై హఫీజ్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బీబీసీ ఉర్దూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హఫీజ్.. ఐసీసీ బౌలింగ్ యాక్షన్ నిబంధనల్ని తప్పబట్టాడు. బౌలింగ్ యాక్షన్ వ్యవహారంలో ఐసీసీ పక్షపాతంగా వ్యవహరిస్తుందని, ఐసీసీతో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్న బోర్డు క్రికెటర్లపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించాడు. అనుమానస్పద బౌలింగ్ యాక్షన్ కలిగి ఉన్న బౌలర్లను పరీక్షించడానికి ఓ విధానాన్ని రూపొందించాలని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు ఐసీసీకి వ్యతిరేకంగా ఉండటంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వివరణ కోరింది. కాగా, తన వ్యాఖ్యాలను సరిదిద్దుకునే క్రమంలో హఫీజ్.. ఐసీసీకి కేవలం సూచన మాత్రమే ఇచ్చానన్నాడు. బౌలింగ్ యాక్షన్కు సంబంధించి ఐసీసీ ప్రమాణాలను పెంచుకుంటే క్రికెట్ అభిమానులకు కొన్ని అనుమానాలు నివృత్తి అయ్యే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే సలహా ఇచ్చానన్నాడు. అంతేకానీ ఐసీసీ ప్రొటోకాల్స్ని అతిక్రమించే పని ఎప్పటికీ చేయనన్నాడు. హఫీజ్ వివరణపై పీసీబీ క్షమశిక్షణా కమిటీ సంతృప్తి చెందడంతో ఎటువంటి జరిమానా విధించలేదు. -
ఐసీసీపై ఆగ్రహం.. క్రికెటర్కు నోటీసులు
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ జట్టు మాజీ కెప్టెన్, ఆల్రౌండర్ మహమ్మద్ హఫీజ్కు ఆ దేశ క్రికెట్ బోర్డు షాకిచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిబంధనలపై ఆగ్రహం వ్యక్తంచేసినందుకుగానూ వివరణ ఇవ్వాల్సిందిగా శనివారం నోటీసులు జారీచేసింది. బీబీసీ ఉర్దూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హఫీజ్.. ఐసీసీ బౌలింగ్ యాక్షన్ నిబంధనలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. బౌలింగ్ యాక్షన్ వ్యవహారంలో ఐసీసీ పక్షపాతంగా వ్యవహరిస్తుందని, ఐసీసీతో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్న బోర్డు క్రికెటర్లపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అందరి బౌలర్లకు ఒకే నిబంధనలను అమలు చేయాలని సూచించాడు. అనుమానస్పద బౌలింగ్ యాక్షన్ కలిగి ఉన్న బౌలర్లను పరీక్షించడానికి ఓ విధానాన్ని రూపోందించాలని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు ఐసీసీకి వ్యతిరేకంగా ఉండటంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వివరణ కోరింది. ఈ నోటీసుల వ్యవహారంపై హాఫిజ్ స్పందిస్తూ.. తాను పీసీబీ అనుమతితోనే ఇంటర్వూలో పాల్గొన్నానని తెలిపాడు. తాను గంటపాటు ఇంటర్వూ ఇస్తే అందులో కేవలం 15 సెకన్ల గురించి మాట్లాడుతున్నారని, మొత్తం ఇంటర్వ్యూ చూసి తను ఏ సందర్భంలో మాట్లాడానో తెలుసుకోవాలన్నాడు. బౌలింగ్ వేసేటప్పుడు మోచేతిని 15 డిగ్రీల వరకు వంచేందుకు ఐసీసీ అనుమతిస్తుంది. ఈ విషయంలో మూడుసార్లు నిబంధనల కంటే ఎక్కువగా మోచేతిని వంచిన హఫీజ్ బౌలింగ్ యాక్షన్పై ఐసీసీ అనుమానం వ్యక్తం చేస్తూ నిషేధం విధించింది. 2017లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో అనుమానాస్పద బౌలింగ్ కారణంగా ఐసీసీ అతడిని సస్పెండ్ చేసింది. ఏప్రిల్ 17న లాబోరో యూనివర్సిటీలో జరిగిన పరీక్షల్లో హఫీజ్ ఐసీసీ అనుమతించిన 15 డిగ్రీల్లోపే మోచేతిని వంచుతున్నట్టు తేలింది. దీంతో మే 1న తిరిగి అతడిపై ఉన్న నిషేదాన్ని ఎత్తేసింది. -
పాక్ బౌలర్కు ఐసీసీ ఊరట
దుబాయ్ : నిబందనలకు విరుద్దంగా ఉన్న బౌలింగ్ యాక్షన్తో నిషేదం ఎదుర్కుంటున్న పాకిస్తాన్ ఆఫ్ స్పిన్నర్,ఆల్రౌండర్ మహ్మద్ హఫీజ్కు ఊరట లభించింది. బౌలింగ్ యాక్షన్ మార్చుకున్న హఫీజ్పై ఐసీసీ తాజాగా నిషేదం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. నిబందనలకు విరుద్దంగా బౌలింగ్ చేస్తున్నాడని ఈ పాక్ స్పిన్నర్పై ఐసీసీ గతంలో మూడు సార్లు నిషేదం విధించిన విషయం తెలిసిందే. హఫీజ్ బంతులను వేసే సమయంలో తన మోచేతిని 15 డిగ్రీలకన్నా ఎక్కువగా వంచుతున్నాడని ఇది ఐసీసీ బౌలింగ్ నిబంధనలకు విరుద్దమని అతనిపై చర్యలు తీసుకుంది. తాజాగా తన బౌలింగ్ శైలిని మార్చుకున్న హఫీజ్ ఇటీవల ఐసీసీ ముందు హాజరయ్యాడు. అతని బౌలింగ్ యాక్షన్ను పరీక్షించిన అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తూ నిషేదం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. హఫీజ్ తన బౌలింగ్ యాక్షన్ను భవిష్యత్తులో మార్చడని అధికారులు విశ్వాసం వ్యక్తం చేసినట్లు ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. దీనికి హఫీజ్ తాజా బౌలింగ్ యాక్షన్కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సైతం జోడించింది. -
అశ్విన్, జాదవ్లపై నిషేదం విధించండి?
సాక్షి, హైదరాబాద్: భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, కేదార్ జాదవ్, హర్భజన్ సింగ్ల బౌలింగ్పై నిషేదం విధించాలని పాకిస్థాన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఐసీసీని డిమాండ్ చేస్తున్నారు. దీనికి కారణం పాక్ ఆల్రౌండర్ మొహమ్మద్ హఫీజ్ అనుమానస్పద బౌలింగ్పై మరోసారి నిషేదం విధించడమే. ఇక అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ చేయడానికి అతడిని గురువారం ఐసీసీ అనర్హుడిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల అబుదాబి వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో హఫీజ్ బౌలింగ్ యాక్షన్పై అంపైర్లు సందేహం వ్యక్తం చేశారు. హఫీజ్ బంతులను వేసే సమయంలో తన మోచేతిని నిబంధనలు విరుద్దంగా వంచుతున్నాడని ఐసీసీ పేర్కొంది. ఇలా హఫీజ్ ఆఫ్స్పిన్ బౌలింగ్పై నిషేధం విధించడం ఇది మూడోసారి. 2014 డిసెంబర్లో తొలిసారి ఐదు నెలల నిషేధం ఎదుర్కొన్న హఫీజ్ తర్వాత 2015 జూన్లో వివాదాస్పద బౌలింగ్ యాక్షన్తో నిషేధం కారణంగా 12 నెలల పాటు బౌలింగ్ చేయలేదు. ఈ వార్త విన్న హఫీజ్ ట్విట్టర్ వేదికగా తన బాధను వ్యక్త పరిచాడు. ‘తన బౌలింగ్ శైలిని పూర్తిగా మార్చుకున్న తర్వాత కూడా ఐసీసీ నిషేదించడం బాధగా ఉంది. ఇది నన్ను ఎప్పటికి వెనుకడుగేయనివ్వదు. దేశం కోసం ఆడటానికి రెండు సార్లు ఎంతో కష్టపడి నా శైలిని మార్చుకున్నాను.ఇలానే మరింత కష్టపడి దేశం కోసం ఆడుతా’అని ట్వీట్ చేశాడు. ఇక పాక్ అభిమానులు హఫీజ్ను ప్రశంసిస్తూ త్వరలో ఐసీసీ నుంచి క్లీన్చీట్ అందుతోందని ఈ ఆల్రౌండర్కు మద్దతుగా నిలుస్తున్నారు. మరి కొందరు భారత బౌలర్ల యాక్షన్ కూడా నిబద్దనలకు విరుద్దంగా ఉందని వారిపై కూడా నిషేదం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేగాకుండా జాదవ్, అశ్విన్, హర్భజన్ బౌలింగ్ యాక్షన్ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఐసీసీని ప్రశ్నిస్తున్నారు. I don't know kyn icc ko ya nazar nhe ata pic.twitter.com/Ubw6MecWGI — Amir Khan (@Amirkh3456) November 17, 2017 -
హఫీజ్ ఎట్టకేలకు పాసయ్యాడు!
కరాచీ: పాకిస్తాన్ బ్యాటింగ్ ఆల్ రౌండర్ మొహ్మద్ హఫీజ్ బౌలింగ్ యాక్షన్పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నుంచి క్లియరెన్స్ లభించింది. గత కొంతకాలంగా బౌలింగ్ పరీక్షల్లో విఫలమవుతున్న హఫీజ్.. తాజాగా నిర్వహించిన బౌలింగ్ టెస్టులో పాసయ్యాడు. ఇటీవల తన బౌలింగ్ శైలిని సరిచేసుకున్న హాఫీజ్.. నవంబర్ 17వ తేదీన ఐసీసీ నిర్వహించిన పరీక్షలకు హాజరయ్యాడు. హఫీజ్ బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు లోబడే ఉన్నట్టు ఐసీసీ నివేదికలో పేర్కొంది. దాంతో త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే పాక్ జట్టులో హఫీజ్కు చోటు దక్కే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియాకు వెళ్లే పాక్ ప్రాబబుల్స్ జట్టును ప్రకటించినా హఫీజ్ను ఆలస్యంగా అక్కడకు పంపే అవకాశాలు కనబడుతున్నాయి. గతేడాది జూన్లో శ్రీలంకతో గాలేలో జరిగిన మ్యాచ్లో హాఫీజ్ బౌలింగ్ శైలిపై ఫిర్యాదు నమోదైంది. హాఫీజ్ బౌలింగ్ పై ఫీల్డ్ అంపైర్లు అభ్యంతరం వ్యక్తం చేసి ఐసీసీకి ఫిర్యాదు చేశారు. ఆ క్రమంలోనే హాఫీజ్ బౌలింగ్ పై ఏడాదిపాటు నిషేధం పడింది. కాగా, ఆ తరువాత పలుమార్లు బౌలింగ్ పరీక్షలకు హాఫీజ్ హాజరైనా అందులో సఫలం కాలేదు. అయితే హాఫీజ్ తాజా పరీక్షల్లో పాస్ కావడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. ఇది నిజంగా తనకు ఒక శుభవార్త అని స్సష్టం చేశాడు. బౌలర్గా, బ్యాట్స్మన్గా జట్టుకు సేవలందించాలని తాను ఎప్పుడూ కోరుకుంటానన్నాడు. -
కోహ్లీ ఆదాయం ఎంతో తెలుసా?
కరాచీ: పాకిస్తాన్ క్రికెటర్లకు గత రెండేళ్లుగా మ్యాచ్ ఫీజులు ఎక్కువగా అందుతున్నాయి. అయితే పాక్ క్రికెటర్ల సంపాదన టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సంపాదనతో పోల్చిచూస్తే లెక్కలోకి కూడా వచ్చేలా కనిపించడం లేదు. బోర్డు కాంట్రాక్ట్ తో పాటు కొన్ని ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్గా, యాడ్స్ ద్వారా కోహ్లీ గతేడాది దాదాపు 308 కోట్ల రూపాయలు ఆర్జించాడు. పాక్ నుంచి మహమ్మద్ హఫీజ్ (రూ.2.49 కోట్లు) సంపాదనలో టాప్ లో ఉన్నాడు. ఈ లెక్కన కోహ్లీ, పాక్ బోర్డు నుంచి అత్యధిక మొత్తం అందుకుంటున్న హఫీజ్ కు మధ్య వ్యత్యాసం 305 కోట్లకు పైమాటే. మరోవైపు పాక్ బోర్డు తమ ఆటగాళ్లు 46 మందికి కలిపి దాదాపు రూ.351 కోట్లు చెల్లిస్తుంది. 2015-16 ఏడాదికి గానూ పాక్ టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో ఏవైనా రెండు ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లకు పీసీబీ చెల్లిస్తున్న మొత్తం(మ్యాచ్ ఫీజులు, ఇతర అలవెన్సులు కలిపి) కంటే కూడా విరాట్ ఒక్కడి ఆదాయం కంటే చాలా తక్కువే. వారు వాణిజ్య ఉత్పత్తులకు బ్రాండింగ్ చేయడం లాంటి ఇతర సౌకర్యాలు వారికి లేకపోవడంతో బోర్డు నుంచి అందుకునేది వారికి మొత్తం ఆదాయం. సీనియర్ ప్లేయర్ మహమ్మద్ హఫీజ్ (రూ.2.49 కోట్లు) సంపాదనలో టాప్ లో ఉన్నాడు. సర్ఫరాజ్ అహ్మద్ (రూ.2.1 కోట్లు), పాక్ వన్డే కెప్టెన్ అజహర్ అలీ(రూ.1.91 కోట్లు), వహాబ్ రియాజ్ (రూ.1.85 కోట్లు), అహ్మద్ షెహజాద్ (రూ.1.79 కోట్లు), షోయబ్ మాలిక్ (రూ.1.66 కోట్లు), పాక్ టెస్ట్ కెప్టెన్ మిస్బాఉల్ హక్(రూ. 1.53 కోట్లు) 2015-16 సీజన్లో పాక్ బోర్డు నుంచి అందుకున్నారు. -
ఆ క్రికెటర్ గాయాన్ని దాచిపెట్టాడు!
ఆఫ్రిది సీరియస్గా తీసుకోలేదు దుమారం రేపుతున్న వకార్ నివేదిక కరాచీ: ఆసియా కప్లోగానీ, టీ20 వరల్డ్ కప్లోగానీ పాకిస్థాన్ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది సీరియస్గా ఆడలేదని ఆ జట్టు ప్రధాన కోచ్ వకార్ యూనిస్ ఆరోపించాడు. సీనియర్ బ్యాట్స్మన్ మహ్మద్ హఫీజ్ తనకు మోకాలి గాయమైనా.. ఆ విషయాన్ని దాచిపెట్టి టోర్నమెంటులో ఆడాడని వెల్లడించాడు. ఈ మేరకు వకార్ యూనిస్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఇచ్చిన నివేదిక లీక్ అవ్వడం దుమారం రేపుతున్నది. తన నివేదికలోని కీలక అంశాలు లీకవ్వడంపై వకార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిజానికి లెజండరీ బౌలర్ అయిన వకార్ యూనిస్కు కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదికి సయోధ్య లేదు. 2011లో కోచ్గా వకార్ మొదటి పర్యాయంలోనే ఈ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. తాజాగా బుధవారం లీకైన నివేదికలో వకార్ విస్మయం కలిగించే విషయాలు వెల్లడించాడు. ఆఫ్రిది సీరియస్గా కనిపించలేదని, ఆసియాకప్, వరల్డ్ కప్లో జట్టు ప్రదర్శనపై అతను ఏమాత్రం శ్రద్ధ చూపలేదని పేర్కొన్నాడు. ఆఫ్రిది రెగ్యులర్గా ప్రాక్టీస్ సెషన్లకు, జట్టు సమావేశాలకు డుమ్మా కొట్టాడని తెలిపాడు. ఇక సీనియర్ ఆటగాడు హఫీజ్ తనకు గాయముందనే విషయాన్ని టీమ్ మేనేజ్మెంట్కు చెప్పలేదని, ఆ గాయం తిరగదోడడంతో ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్లతో కీలక మ్యాచులకు ముందు అతను జట్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని, ఇది జట్టుపై ప్రభావం చూపిందని వకార్ వెల్లడించాడు. అయితే తాను అధికారికంగా ఇచ్చిన నివేదికలోని వివరాలు వెల్లడవ్వడంపై వకార్ యూనిస్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. నివేదిక లీక్ కావడానికి కారణమెవరో గుర్తించి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ)ని అతను కోరాడు. -
పాక్కు ఈ జట్టు సరిపోతుంది
సంజయ్ మంజ్రేకర్ చిరకాల ప్రత్యర్థి భారత్తో మ్యాచ్కు ముందు పాకిస్తాన్కు నిజంగా ఇది తీపి కబురే. బ్యాటింగ్ విభాగంలో తంటాలు పడుతున్న ఈ జట్టు బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో పూర్తి స్థాయిలో విజృంభించింది. మొహమ్మద్ హఫీజ్, అహ్మద్ షహజాద్ రాణింపుతో గతంలోకన్నా వీరి బ్యాటింగ్ మెరుగైనట్టే. బౌలింగ్లో ఎలాగూ దూకుడు ఉంది. దీంతో ఇటీవలి ఆసియా కప్లా కాకుండా ఈసారి భారత్కు తగిన హెచ్చరిక జారీ చేసినట్టుగానే భావించాలి. అయితే ధోని సేనను ఇప్పటికీ ఫేవరెట్గానే భావించాల్సి ఉంటుంది. తమ చివరి 11 మ్యాచ్ల్లో పదింట్లో గెలిచిన భారత జట్టు ఒక్క ఓటమితో తేడాగా కనిపిస్తోంది. ఈ టోర్నీలో ఇప్పటిదాకా ఈ జట్టు ప్రమాదకరంగా కనిపించలేదు. ఆసియా కప్లో కనిపించిన జోరు ఇప్పుడు లేదు. ఒక్క టి20 మ్యాచ్లో ఓడిపోవడం పెద్ద విషయం కాదు. కానీ మరీ 47 పరుగుల తేడాతో ఓడడం.. అదీ సొంతగడ్డపై అంటే దారుణమే. నిజానికి తమ బ్యాట్స్మెన్ ఆటతీరును క్షుణ్ణంగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా సమీప భవిష్యత్లో మాత్రం తప్పదు. నైపుణ్యత కలిగిన బ్యాట్స్మెన్ను గుర్తించాలి. అప్పుడే ఏ పిచ్పైనైనా భారత్ ప్రమాదకారిగా కనిపిస్తుంది. అయితే ఇప్పటికి మాత్రం పాకిస్తాన్ను ఓడించేందుకు ప్రస్తుత జట్టు సరిపోతుంది. -
దేశం పరువు తీసిన వారితో ఆడను!
కరాచీ: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో ఆడేందుకు భారీ మొత్తానికి వచ్చిన ఆఫర్ను పాకిస్తాన్ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ తిరస్కరించాడు. ఆ జట్టులో గతంలో నిషేధానికి గురైన మొహమ్మద్ ఆమిర్ ఉండటమే అందుకు కారణం. దేశం పరువు తీసిన ఆటగాడితో తాను డ్రెస్సింగ్ రూమ్ పంచుకోనని అతను ప్రకటిం చాడు. పాకిస్తాన్ ప్రధాన ఆటగాడు ఒకరు ఆమిర్ను ఇలా బహిరంగంగా విమర్శించడం ఇదే మొదటిసారి. ఐసీసీ నిషేధం ఎత్తివేయడంతో ఇటీవలే ఆమిర్ పోటీ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. -
హఫీజ్ సెంచరీ
పాకిస్తాన్ విజయం ఇంగ్లండ్తో తొలి వన్డే అబుదాబి: మొహమ్మద్ హఫీజ్ (130 బంతుల్లో 102; 10 ఫోర్లు; 1 సిక్స్) వీరోచిత సెంచరీతో ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో పాకిస్తాన్ 6 వికెట్లతో నెగ్గింది. దీంతో నాలుగు వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. నేడు (శుక్రవారం) రెండో మ్యాచ్ జరుగుతుంది. బుధవారం జరిగిన ఈ డే అండ్ నైట్ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 49.4 ఓవర ్లలో 216 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇయాన్ మోర్గాన్ (96 బంతుల్లో 76; 11 ఫోర్లు), జేమ్స్ టేలర్ (82 బంతుల్లో 60; 3 ఫోర్లు; 2 సిక్సర్లు) మినహా మిగిలిన వారు విఫలమయ్యారు. ఇర్ఫాన్, షోయబ్, అన్వర్లకు రెండేసి వికెట్లు దక్కాయి. స్వల్ప లక్ష్యానికి బరిలోకి దిగిన పాక్ 43.4 ఓవర్లలో 4 వికెట్లకు 217 పరుగులు చేసి నెగ్గింది. అయితే 41 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో హఫీజ్ కీలక ఇన్నింగ్స్తో ఆదుకున్నాడు. టోప్లేకు మూడు వికెట్లు దక్కాయి. -
బౌలింగ్ పరీక్షలో హఫీజ్ మళ్లీ విఫలం
ఏడాది నిషేధం కరాచీ: పాకిస్తాన్ క్రికెట్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆల్రౌండర్ మహ్మద్ హఫీజ్ రెం డోసారి బౌలింగ్ పరీక్ష (బయోమెకానికల్ టెస్టు)లో విఫలమయ్యాడు. దీంతో అతనిపై ఐసీసీ ఏడాది పాటు బౌలింగ్ చేయకుండా నిషేధం విధించింది. ఈనెల 6న చెన్నైలోని రామచంద్ర యూనివర్సిటీలో నిర్వహించిన బయోమెకానికల్ పరీక్షలో హఫీజ్ మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచుతున్నట్లు గుర్తించారు. బౌలింగ్ నిబంధనల ప్రకా రం మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచకూడదు. దీంతో అతని బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు అనుగుణంగా లేదని తేల్చారు. హఫీజ్ పరీక్షలో విఫలం కావడం తమ భవిష్యత్ ప్రణాళికలను దెబ్బతీసిందని పాకిస్తాన్ చీఫ్ సెలక్టర్ హరూన్ రషీద్ అన్నారు. ‘మా వ్యూహాల్లో హఫీజ్ బౌలింగ్ చాలా కీలకం. 12 నెలల నిషేధం పడింది కాబట్టి మా వ్యూహాలను పునరాలోచించుకోవాలి’ అని రషీద్ పేర్కొన్నారు. బ్యాట్స్మన్గా హఫీజ్ జట్టులో కొనసాగే అవకాశం ఉంది. -
హఫీజ్ ఆల్రౌండ్ షో
తొలి వన్డేలో శ్రీలంకపై పాక్ విజయం దంబుల్లా: మొహమ్మద్ హఫీజ్ శతకం (95 బంతుల్లో 103; 10 ఫోర్లు; 4 సిక్సర్లు)తో పాటు బౌలింగ్లోనూ నాలుగు వికెట్లు తీయడంతో శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్లో పాకిస్తాన్ శుభారంభం చేసింది. శనివారం రణ్గిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ వన్డేలో పాక్ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన లంక 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 255 పరుగులు చేసింది. చండిమాల్ (68 బంతుల్లో 65 నాటౌట్; 5 ఫోర్లు; 1 సిక్స్) రాణించాడు. అనంతరం పాక్ 45.2 ఓవర్లలో నాలుగు వికెట్లకు 259 పరుగులు చేసి గెలిచింది. షోయబ్ మాలిక్ (45 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు; 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. హ ఫీజ్కు కెరీర్లో ఇది పదో సెంచరీ. ఈనెల 15న ఇరు జట్ల మధ్య పల్లెకెలెలో రెండో వన్డే జరుగుతుంది. -
హఫీజ్ డబుల్ సెంచరీ
పాక్ తొలి ఇన్నింగ్స్లో 537/5 బంగ్లాతో తొలి టెస్టు కుల్నా: బంగ్లాదేశ్తో వన్డే, టి20 సిరీస్లో పేలవ ప్రదర్శన చేసిన పాకిస్తాన్ జట్టు టెస్టు సిరీస్లో మాత్రం నిలకడగా ఆడుతోంది. తొలి టెస్టులో బంగ్లాదేశ్ స్కోరుకు పాక్ జట్టు భారీస్కోరుతోనే దీటైన జవాబు ఇచ్చింది. ఓపెనర్ మహ్మద్ హఫీజ్ (332 బంతుల్లో 224; 23 ఫోర్లు, 3 సిక్సర్లు) కెరీర్లో తొలి డబుల్ సెంచరీ చేయడంతోపాటు మరో నలుగురు బ్యాట్స్మెన్ అర్ధ సెంచరీలు సాధించడంతో... మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ తొలి ఇన్నింగ్స్లో 148 ఓవర్లలో 5 వికెట్లకు 537 పరుగులు చేసి 205 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. అసద్ షఫీక్ (51 బ్యాటింగ్; 5 ఫోర్లు), సర్ఫరాజ్ అహ్మద్ (51 బ్యాటింగ్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) క్రీజులో ఉన్నారు. ఓవర్నైట్ స్కోరు 227/1తో ఆట కొనసాగించిన పాక్ ఇన్నింగ్స్లో హఫీజ్ కీలక భాగస్వామ్యాలతో చెలరేగాడు. బంగ్లా బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ పరుగుల వరద పారించాడు. అజహర్ అలీ (83; 4 ఫోర్లు, సిక్సర్)తో కలిసి రెండో వికెట్కు 227; యూనిస్ ఖాన్ (33)తో కలిసి మూడో వికెట్కు 62; మిస్బా (59; 4 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి నాలుగో వికెట్కు 63 పరుగులు జోడించి అవుటయ్యాడు. తర్వాత వచ్చిన అసద్ షఫీక్ కూడా సమయోచితంగా రాణించాడు. మిస్బాతో కలిసి ఐదో వికెట్కు 66; సర్ఫరాజ్తో కలిసి ఆరో వికెట్కు అజేయంగా 69 పరుగులు జోడించడంతో పాక్ భారీ స్కోరు ఖాయమైంది. బంగ్లాదేశ్ బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ 3, షివుగటా 2 వికెట్లు తీశారు. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 332 పరుగులకు ఆలౌటైంది. -
వచ్చే నెల 4న హఫీజ్కు బౌలింగ్ పరీక్ష!
కరాచీ: కీలకమైన ప్రపంచకప్కు ముందే తమ ఆల్రౌండర్ మహ్మద్ హఫీజ్ను బయోమెకానిక్ పరీక్ష నుంచి గట్టెక్కించాలని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రయత్నిస్తోంది. ఇందుకోసం హఫీజ్ బౌలింగ్ను మరోసారి అంచనా వేయాలని అధికారికంగా ఐసీసీని కోరింది. దీంతో ఫిబ్రవరి 4న ఆల్రౌండర్ బ్రిస్బేన్లో పరీక్షకు హాజరయ్యే అవకాశాలున్నాయని పీసీబీ అధికారి ఒకరు తెలిపారు. పరీక్షకు హాజరయ్యే కంటే ముందు కివీస్లో తన బౌలింగ్పై మరిన్ని కసరత్తులు చేసుకునేందుకు హఫీజ్కు అవకాశం ఇవ్వాలని పాక్ టీమ్ మేనేజ్మెంట్ పీసీబీకి సూచించింది. మరోవైపు ఐసీసీ నుంచి క్లియరెన్స్ రాకపోతే హఫీజ్ తుది జట్టులో ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఇంగ్లండ్, చెన్నైల్లో జరిగిన అనధికారి పరీక్షల్లో బౌలర్ విఫలమయ్యాడు. అయితే ఈ రెండు టెస్టుల్లో హఫీజ్ విఫలమైనా... అతని బౌలింగ్ మాత్రం ఆశించిన స్థాయిలో మెరుగుదల ఉందని సదరు అధికారి వెల్లడించారు. స్పిన్నర్ సయీద్ అజ్మల్ ఐసీసీ అధికారిక బయోమెకానిక్ పరీక్ష కోసం శుక్రవారం చెన్నైకి వెళ్లనున్నాడు. జెర్సీ నంబర్లలో మార్పులు వరల్డ్కప్లో రాణించేందుకు వీలుగా కొంత మంది పాక్ ఆటగాళ్ల జెర్సీ నంబర్లలో మార్పులు చేసుకుంటున్నారు. ఆధ్యాత్మిక గురువులను సంప్రదించిన తర్వాత ఉమర్ అక్మల్ తన జెర్సీ నంబర్ 96 స్థానంలో 3ను ఎంచుకున్నాడు. హరిస్ సోహైల్ 80 స్థానంలో 89వ నంబర్ను తీసుకున్నాడు. బౌలర్లందరూ డబుల్ డిజిట్ నంబర్లను ఎంచుకున్నారు. వహబ్ రియాజ్ 47, ఎహ్సాన్ అదిల్ 91, యాసిర్ షా 86ను ధరించనున్నారు. ఆఫ్రిది 10, మిస్బా 22, యూనిస్ 75 నంబర్లతోనే కొనసాగుతున్నారు. గతంలో ఇంజమామ్ ధరించిన 8వ నంబర్ను హఫీజ్కు పాక్ బోర్డు కేటాయించింది. -
చెన్నైకి పాకిస్థాన్ స్పిన్నర్లు
కరాచీ: సందేహాస్పద బౌలింగ్ శైలి కారణంగా నిషేధం ఎదుర్కొంటున్న పాకిస్తాన్ క్రికెట్ స్పిన్నర్లు సయీద్ అజ్మల్, మొహమ్మద్ హఫీజ్ చెన్నైకి వెళ్లనున్నారు. ఐసీసీ గుర్తింపు పొందిన చెన్నై బౌలింగ్ సెంటర్ లో తమ బౌలింగ్ యాక్షన్ ను వారు పరీక్షించుకోనున్నారు. అజ్మల్, హఫీజ్ అభ్యర్థన మేరకు వారిని చెన్నై పంపుతున్నట్టు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తెలిపింది. వారి పర్యటన ఖరారైందని వెల్లడించింది. భారత హైకమిషన్, తమ విదేశాంగ శాఖ అనుమతి కూడా లభించిందని తెలిపింది. రెండు, మూడు రోజుల్లో అజ్మల్, హఫీజ్ చెన్నైకి బయలుదేరతారని పేర్కొంది. -
హఫీజ్పై ఐసీసీ వేటు
దుబాయ్: పాకిస్తాన్ క్రికెట్కు మరో ఎదురుదెబ్బ. తమ స్టార్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ సస్పెన్షన్ ఇంకా కొనసాగుతుండగానే తాజాగా ఆల్రౌండర్ మొహమ్మద్ హఫీజ్బౌలింగ్పైనా వేటు పడింది. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని ఐసీసీ తెలిపింది. అతడి బౌలింగ్ శైలి వివాదాస్పదంగా ఉండడమే దీనికి కారణం. ‘హఫీజ్ బౌలింగ్ వేస్తున్నప్పుడు నిర్ణీత 15 డిగ్రీల స్థాయి కన్నా ఎక్కువగా మోచేతిని వంచుతున్నట్టు స్వతంత్ర విచారణలో తేలింది. ఇది నిబంధనల ప్రకారం అనైతికం. అందుకే అంతర్జాతీయ క్రికెట్ బౌ లింగ్ నుంచి తక్షణం సస్పెండ్ చేస్తున్నాం’ అని ఐసీసీ ప్రకటించింది. -
పాకిస్థాన్ క్రికెట్కు మరో ఎదురుదెబ్బ
దుబాయ్: వన్డే ప్రపంచ కప్ ముందు పాకిస్థాన్ క్రికెట్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. పాక్ ఆల్రౌండర్ మహ్మద్ హఫీజ్పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సస్పెన్షన్ వేటు వేసింది. హఫీజ్ బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని బయో మెట్రిక్ పరీక్షలో తేలడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ తక్షణం అమల్లోకి వస్తుందని ఐసీసీ ప్రకటించింది. హఫీజ్ బౌలింగ్ శైలిని గత నెలలో పరీక్షించారు. త్వరలో జరిగే వన్డే ప్రపంచ కప్ కోసం శనివారం పాకిస్థాన్ ప్రాబబుల్స్కు హఫీజ్ను ఎంపిక చేశారు. మరుసటి రోజే అతనిపై వేటు పడటం పాక్ క్రికెట్కు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టే. ఇదే కారణంతో మరో పాక్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ను ఐసీసీ సస్పెండ్ చేసింది. ప్రపంచ కప్ ముందు ఇద్దరు కీలక బౌలర్లపై వేటుపడటం పాక్ క్రికెట్ను కలవరపెడుతోంది. -
దుమ్మురేపిన హఫీజ్
షార్జా: న్యూజిలాండ్తో బుధవారం ప్రారంభమైన మూడో టెస్టులో పాకిస్థాన్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. మహ్మద్ హఫీజ్ (262 బంతుల్లో 178 బ్యాటింగ్; 23 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి పాక్ తొలి ఇన్నింగ్స్లో 90 ఓవర్లలో 3 వికెట్లకు 281 పరుగులు చేసింది. హఫీజ్తో పాటు మిస్బా (38 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. షార్జా క్రికెట్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో... మిస్బా సేన టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లలో షాన్ మసూద్ (12) విఫలమైనా.. హఫీజ్ నిలకడగా ఆడాడు. వన్డౌన్లో వచ్చిన అజహర్ అలీ (39) మెరుగ్గా ఆడినా భారీ స్కోరు చేయలేకపోయాడు. హఫీజ్తో కలిసి రెండో వికెట్కు 87 పరుగులు జోడించి అవుటయ్యాడు. తర్వాత వచ్చిన యూనిస్ ఖాన్ (5) నిరాశపర్చడంతో పాక్ 160 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. అయితే ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన కెప్టెన్ మిస్బా ఎక్కువ భాగం హఫీజ్కు స్ట్రయిక్ ఇస్తూ ఇన్నింగ్స్ను కొనసాగించాడు. ఈ క్రమంలో హఫీజ్ కెరీర్లో ఏడో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరు నాలుగో వికెట్కు అజేయంగా 121 పరుగుల భాగస్వామ్యం జోడించారు. -
పాకిస్థాన్ టి20 కెప్టెన్ గా ఆఫ్రిది
లాహోర్: పాకిస్థాన్ టి20 కెప్టెన్ గా డాషింగ్ ఆల్రౌండర్ షాహిద్ ఆఫ్రిది నియమితులయ్యాడు. 2016లో జరగనున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్ వరకు అతడు కెప్టెన్ గా కొనసాగుతాడని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఒక ప్రకటనలో తెలిపింది. కోచ్ వకార్ యూనిస్, క్రికెట్ బోర్డుతో గొడవ కారణంగా జట్టులో స్థానం కోల్పోయిన మూడేళ్ల తర్వాత టీమ్ నాయకత్వ పగ్గాలు అతడికి అప్పగించడం విశేషం. మహ్మద్ హఫీజ్ కెప్టెన్సీ వదులుకోవడంతో ఆఫ్రిదికి అవకాశం దక్కింది. ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన టి20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ మొదటి రౌండ్ నుంచి వెనుదిరగడంతో హఫీజ్ కెప్టెన్సీ వదులుకున్నాడు. కాగా మిస్బా-వుల్-హక్ కు ఊరట లభించింది. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ వరకు అతడు టెస్టు, వన్డే కెప్టెన్ గా కొనసాగుతాడని పీసీబీ ప్రకటించింది. -
వారెవ్వా హఫీజ్!
అబుదాబీ: పాకిస్థాన్ బ్యాట్స్మన్ మహమ్మద్ హఫీజ్ (119 బంతుల్లో 113 నాటౌట్, 12 ఫోర్లు, 2 సిక్సర్లు) సిరీస్లో ముచ్చటగా మూడో సెంచరీ సాధించాడు. దీంతో శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డేలో పాక్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మరో వన్డే మిగిలుండగానే ఐదు వన్డేల సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంది. నాలుగు వన్డేల్లో హఫీజ్ మూడు సెంచరీలు చేయగా... ఈ మూడు మ్యాచ్ల్లోనూ పాక్ గెలిచింది. సిరీస్లో మూడు సెంచరీలు చేసిన ఆరో బ్యాట్స్మన్గా హఫీజ్ రికార్డుల్లోకెక్కాడు. బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్లో తొలుత శ్రీలంక 48.5 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. ప్రియాంజన్ (74), సంగక్కర (51) అర్ధసెంచరీలు చేశారు. అజ్మల్ 4, ఉమర్ గుల్ 3 వికెట్లు తీశారు. పాకిస్థాన్ 41.1 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. -
మూడో వన్డేలో పాక్ విజయం
113 పరుగులతో లంక చిత్తు షార్జా: మొహమ్మద్ హఫీజ్ (136 బంతుల్లో 140 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్స్లు ) సెంచరీతో చెలరేగడంతో శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో పాకిస్థాన్ 113 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత పాక్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. హఫీజ్, షెహజాద్ (89 బంతుల్లో 81; 6 ఫోర్లు, 2 సిక్స్లు) రెండో వికెట్కు 160 పరుగులు జోడించి భారీ స్కోరులో కీలక పాత్ర పోషించారు. అనంతరం లంక 44.4 ఓవర్లలో 213 పరుగులకే ఆలౌటైంది. దిల్షాన్ (62 బంతుల్లో 59; 10 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా, కెప్టెన్ మాథ్యూస్ (51 బంతుల్లో 44; 1 ఫోర్, 3 సిక్స్లు) చివర్లో కొద్ది సేపు పోరాడాడు. పాక్ బౌలర్లలో గుల్ 3 వికెట్లు తీయగా, అజ్మల్, హఫీజ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఈ ఫలితంతో ఐదు వన్డేల సిరీస్లో పాక్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. నాలుగో వన్డే 25న జరుగుతుంది. -
పోరాడి ఓడిన లంక
షార్జా: పాకిస్థాన్తో జరిగిన తొలి వన్డేలో శ్రీలంక పోరాడి ఓడింది. లోయర్ ఆర్డర్లో సేనానాయకే (24 బంతుల్లో 42; 7 ఫోర్లు, 1 సిక్సర్), ప్రసన్న (25 బంతుల్లో 42; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరవిహారం చేసినా వరుస విరామాల్లో ఈ ఇద్దరు అవుట్ కావడంతో 11 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో పాక్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ మ్యాచ్లో... మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 322 పరుగుల భారీ స్కోరు చేసింది. మహ్మద్ హఫీజ్ (129 బంతుల్లో 122; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. తర్వాత బ్యాటింగ్కు దిగిన లంక 49.4 ఓవర్లలో 311 పరుగులకు పరిమితమైంది. కుశాల్ పెరీరా (68 బంతుల్లో 64; 5 ఫోర్లు, 1 సిక్సర్) రాణించాడు. ఓ దశలో లంక 221 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. అయితే సేనానాయకే, ప్రసన్నలు ఎనిమిదో వికెట్కు 87 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్ను ఉత్కంఠభరితంగా మార్చారు.