Motorists
-
ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాల్సిందే
సాక్షి, అమరావతి : ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకోవాలన్న తమ ఆదేశాల అమలులో పురోగతి కనిపిస్తోందని హైకోర్టు తెలిపింది. హెల్మెట్ ధరించని వాహనదారులకు పోలీసు లు చలాన్లు వేయడం ఆశ్నింనించదగ్గ పరిణామమని పేర్కొంది. ఈ విధానాన్ని, అవగాహన కార్యక్రమాలను కొనసాగించాలని పోలీసులను ఆదేశించింది. గత 20 రోజుల్లోనే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు వాహనదారుల నుంచి రూ.95 లక్షలు చలాన్ల రూపంలో వసూలు చేయడం పట్ల కూడా హైకోర్టు సంతృప్తిని వ్యక్తం చేసింది. చట్ట నిబంధనలను అత్రికమించే వారిపై కఠినంగా వ్యవహరించాల్సిందేనని తేల్చి చెప్పింది. హెల్మెట్ ధరించకపోవడం వల్ల కలిగే దుష్ప్ర భావాలు, చట్టాన్ని ఉల్లంఘిస్తే తీసుకునే చర్యల గురించి పత్రికలు, టీవీల్లో ప్రముఖంగా ప్రకటనలు ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. చలాన్లు చెల్లించని వారి వివరాలు వెంటనే రవాణా శాఖ అధికారులకు చేరేలా ఓ సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. చలాన్ల వసూలు, హెల్మెట్ ధారణ విషయంలో చేపడుతున్న చర్యలు, చలాన్ల వసూళ్లు పెరిగాయా లేదా తదితర వివరాలను తమ ముందుంచాలని అధికారులను ఆదేశించింది. తదుపరి విచా రణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. చట్ట నిబంధనలు పాటించడం లేదంటూ కేంద్ర మోటారు వాహన సవరణ చట్ట నిబంధనలను అమలు చేయడం లేదని, ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించడంలేదని, దీంతో పెద్ద సంఖ్యలో ప్రమాదాలు, మరణాలు చోటు చేసుకుంటున్నాయంటూ న్యాయవాది తాండవ యోగేష్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ని సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. తమ ఆదేశాల నేపథ్యంలో పోలీసులు కొంత మేర చర్యలు చేపట్టారని ధర్మాసనం తెలిపింది.అయినప్పటికీ ప్రతి 10 మందిలో ఇద్దరు ముగ్గురే హెల్మెట్ ధరిస్తున్నారంది. తన సిబ్బందిలో ఒకరిని రోడ్డుపైకి పంపి ఈ విషయాన్ని రూఢీ చేసుకున్నానని సీజే తెలిపారు. ఈ చర్యలు కొనసాగిస్తారా లేక ఆపేస్తారా అంటూ ప్రశ్నించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) సింగమనేని ప్రణతి స్పందిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. పిటిషనర్ తాండవ యోగేష్ జోక్యం చేసుకుంటూ.. విజయవాడలోనే తనిఖీలు చేస్తున్నారని, చాలా జిల్లాల్లో తనిఖీలు చేయడం లేదని చెప్పారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. చలాన్లు ఎలా వసూలు చేస్తున్నారని ప్రశ్నించింది. ఇప్పటి వరకు భౌతికంగానే వసూలు చేస్తున్నామని, యూపీఐ ద్వారా కూడా వసూలు చేస్తామని ప్రణతి చెప్పారు. గత 20 రోజుల్లో చలాన్ల రూపంలో రూ.95 లక్షలు వసూలు చేశామన్నారు. గతంలో ఈ మొత్తం ఎంత ఉండేదని ధర్మాసనం ప్రశ్నించగా.. రూ. 4 లక్షలు ఉండేదని చెప్పారు. కాగా వచ్చే విచారణలో చలాన్ల మొత్తం పెరిగిందా? తగ్గిందా? అన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. చలాన్లు చెల్లించని వారిపై ఏం చర్యలు తీసుకుంటున్నారని, చట్టం ఏం చెబుతోందని ధర్మాసనం ఆరా తీసింది. పిటిషనర్ యోగేష్ చట్ట నిబంధనలను వివరించారు. నిర్ణీత కాల వ్యవధిలో చలాన్లు చెల్లించకుంటే అధికారులు సంబంధిత మేజి్రస్టేట్ ద్వారా ఆ వాహనాన్ని జప్తు చేయవచ్చన్నారు. -
రాష్ట్ర కోడ్ మార్చేస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: ఒకే నంబర్తో రెండు, మూడు వాహనాలుంటే ఎలా ఉంటుంది? ఏదైనా నేరాలు, అక్రమాలకు పాల్పడే ఉద్దేశంతో కొంత మంది ఇలా చేస్తుంటారు. కానీ కొందరు వాహనదారుల అత్యుత్సాహం, అవగాహన లేమితో ఇప్పుడు భవిష్యత్తులో ఒకే నంబర్ రెండు వాహనాలకు కనిపించే పరిస్థితి ఎదురుకాబోతోంది. దీంతో ఒక వాహనానికి సంబంధించిన వారు ఏదైనా నేరం చేస్తే దానివల్ల అదే నంబర్ ఉన్న రెండో వాహన యజమాని ఇబ్బంది పడే అవకాశం ఉందని అధికారులంటున్నారు. ఇదీ సంగతి..: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వాహనాల రిజిస్ట్రేషన్కు సంబంధించి స్టేట్ కోడ్ ఏపీ నుంచి టీఎస్కు మారింది. దాదాపు పదేళ్లపాటు అదే కొనసాగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని మార్చింది. టీఎస్కు బదులు టీజీని అమల్లోకి తెచ్చింది. అయితే పాత వాహనాలకు టీఎస్ కోడ్ యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. కానీ కొందరు వాహనదారుల అత్యుత్సాహంతో ఇది సమస్యగా మారనుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో తమ వాహనాలకు టీజీ కోడ్ ఉండాలని బలంగా కోరుకున్న కొందరు... ఇప్పుడు టీజీ కోడ్ అమల్లోకి రావడాన్ని స్వాగతిస్తూ తమ పాత వాహనాల నంబర్ ప్లేట్లపై టీఎస్ అక్షరాలను తొలగించి టీజీ అని పెట్టుకుంటున్నారు. సమస్య ఏమిటి? టీజీ కోడ్ కొత్తగా రావడంతో రవాణా శాఖ అధికారులు కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ నంబర్లను మళ్లీ ‘ఎ’ ఆల్ఫాబెట్ నుంచి కేటాయిస్తున్నారు. ప్రస్తుతం ‘సి’ సిరీస్ కొనసాగుతోంది. రాష్ట్రం ఆవిర్భవించిన సమయంలో టీఎస్ కోడ్ను ప్రారంభించినప్పుడు ‘ఇ’ సిరీస్తో మొదలుపెట్టారు. ఇప్పుడు త్వరలోనే టీజీ కోడ్లో కూడా ‘ఇ’ సిరీస్ మొదలవుతుంది. దానికి 0001 నుంచి నంబరింగ్ మొదలవుతుంది. క్రమంగా గతంలో టీఎస్ కింద కేటాయించిన నంబరే ఇప్పుడు టీజీ సిరీస్లో కూడా అలాట్ అవుతుంది. స్టేట్ కోడ్ (టీఎస్, టీజీ) మాత్రమే తేడా ఉంటుంది. అయితే టీఎస్ నంబర్ ప్లేట్ ఉన్న వాహనదారుడు సొంతంగా టీజీ ఏర్పాటు చేసుకుంటే... అధికారికంగా టీజీ కోడ్తో అదే నంబర్ ఉన్న వాహనంతో దాని నంబర్ క్లాష్ అవుతుంది. ఉదా: టీఎస్ ఎ 0001 నంబర్తో ఉన్న పాత వాహనదారుడు దాన్ని టీజీగా మారిస్తే.. ఇప్పుడు టీజీ ఏ 0001 అని ఏదైనా కొత్త వాహనానికి నంబర్ అలాట్ అయితే రెండు వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లు ఒకటిగా మారి సమస్య ఏర్పడుతుందన్నమాట. రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు, నేరాలు జరిగినప్పుడు ఇలా నంబర్లు క్లాష్ అయితే కేసు దర్యాప్తులో చిక్కులు ఏర్పడతాయి. దీంతోపాటు అధికారికంగా సరైన నంబర్ కలిగి ఉన్న వాహనదారుడు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. అలా మార్చడం నేరం టీజీ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కొందరు టీఎస్ కోడ్ వాహనదారులు వచ్చి తమ వాహనాలకు టీజీ కోడ్ అలాట్ చేయాలని కోరుతున్నారు. కానీ అది సాధ్యం కాదని... టీజీ సిరీస్ అమల్లోకి వచ్చిన తర్వాత కొన్న వాహనాలకు మాత్రమే టీజీ కోడ్ వర్తిస్తుందని చెప్తున్నాం. ఎవరైనా సొంతంగా నంబర్ ప్లేట్పై స్టేట్ కోడ్ మారిస్తే దాన్ని ట్యాంపరింగ్గానే భావించి నేరంగా పరిగణించాల్సి ఉంటుంది. అలాంటి వారిపై చర్యలు కూడా ఉంటాయి. వాహనదారులు ఇది తెలుసుకోవాలి. – రమేశ్, జాయింట్ ట్రాన్స్పోర్టు కమిషనర్ -
‘దారి’దోపిడీకి టీడీపీ కూటమి ముఖ్యనేత పన్నాగం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీ ‘దారి దోపిడీ’కి టీడీపీ కూటమి ముఖ్యనేత పన్నాగం పన్నారు. రాబోయే ఐదేళ్లలో ఏకంగా రూ. 8,500 కోట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారు. ప్రతిపక్షంలో ఉన్నన్నాళ్లూ రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటూ గగ్గోలుపెట్టిన ఆయన అధికారంలోకి రాగానే రోడ్ల నిర్మాణం ముసుగులో అడ్డగోలు దోపిడీకి తెరతీశారు. దోపిడీ కోసం పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్(పీపీపీ) విధానాన్ని తెరపైకి తెచ్చారు. తొలుత 27 రాష్ట్ర ప్రధాన రహదారులు, జిల్లా ప్రధాన రహదారులను పీపీపీ విధానంలో నిర్మించేందుకు ఆమోదించారు.తమ బినామీల నిర్మాణ సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టి.. రూ. 4 వేల కోట్లతో రోడ్లను నిర్మించి, ఆపై ఐదేళ్లలో రూ.12,500 కోట్లు టోల్ ఫీజుల వసూలు చేయనున్నారు. నికరంగా రూ. 8,500 కోట్లు కొల్లగొట్టేందుకు కుట్ర పన్నారు. రాష్ట్రంలో వాహనదారులపై భారీగా ఆర్థిక భారం మోపుతూ.. బినామీ కాంట్రాక్టర్ల రూపంలో వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు ముఖ్యనేత పన్నాగం ఇది.రోడ్ల నిర్మాణ బాధ్యత నుంచి తప్పుకున్న ప్రభుత్వంజాతీయ రహదారులను నిర్మించే కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఇప్పటివరకు టోల్ ఫీజులను వసూలు చేస్తోంది. రాష్ట్ర, జిల్లా ప్రధాన రహదారులను అన్ని రాష్ట్రాలు తమ ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్నాయి. ఇప్పుడు ఈ విధానానికి టీడీపీ కూటమి ప్రభుత్వం స్వస్తి పలికింది. పీపీపీ విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమేరకు నిర్ణయించారు. అందుకోసం రాష్ట్రంలోని 27 రహదారులను ఎంపిక చేశారు. కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం నిర్వహించిన సమావేశంలోనూ చంద్రబాబు ఆ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. మొదటగా 14 రోడ్లను నిర్మిస్తామన్నారు. అనంతరం మిగిలిన రోడ్ల నిర్మాణాన్ని చేపడతామన్నారు. ఆరోడ్లపై వాహనదారుల నుంచి టోల్ వసూలు చేస్తామన్నారు. దశలవారీగా రాష్ట్రంలోని అన్ని రహదారులను పీపీపీ విధానంలోనే నిర్మించాలన్నది టీడీపీ కూటమి ప్రభుత్వ ఉద్దేశం. టోలుతో భారీ దోపిడీకి కుట్ర..పీపీపీ విధానంలో 1,778 కి.మీ. ఉన్న 27 రహదారులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నామమాత్రంగా టెండర్ల ప్రక్రియ నిర్వహించి ఆ రోడ్ల నిర్మాణ కాంట్రాక్టులను ముఖ్య నేత బినామీ, సన్నిహిత సంస్థలకే కట్టబెడతారన్నది బహిరంగ రహస్యం. గతేడాది ఆర్ అండ్ బి శాఖ కి.మీ.కు గరిష్టంగా రూ. 2 కోట్లు చొప్పున టెండర్లు ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఆ రేట్ల ప్రకారం చూస్తే మొత్తం 1,778 కి.మీ.కు రూ. 3,556 కోట్లు ఖర్చవుతుంది. ఈ ఏడాదిలో మెటీరియల్ ధరలు కాస్త పెరిగాయని భావించినా మొత్తం మీద రూ. 4 వేల కోట్లకు మించదు.జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) 2023–24లో వసూలు చేసిన టోల్ ఫీజుల నిష్పత్తిలో లెక్కిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న 1,778 కి.మీ. రోడ్ల నుంచి ఏడాదికి రూ. 2,500 కోట్ల వరకు టోల్ ఫీజుల రూపంలో వసూలు అవుతుంది. ఆ ప్రకారం ఐదేళ్లకు రూ. 12,500 కోట్లు టోల్ ఫీజుల రూపంలో వసూలు చేస్తారన్నది సుస్పష్టం. అంటే ముఖ్యనేత బినామీ సంస్థలు కేవలం రూ. 4 వేల కోట్లు వెచ్చించి.. ఐదేళ్ల పాటు టోల్ ద్వారా రూ. 12,500 కోట్లు వాహనదారుల నుంచి కొల్లగొట్టనున్నారు. నికరంగా ఐదేళ్లలో ముఖ్య నేత జేబులోకి రూ. 8,500 కోట్లు చేరనుంది. వాహనదారులపై భారీ ఆర్థికభారంపీపీపీ విధానంలో నిర్మించనున్న ఆ 27 రోడ్లపై ప్రయాణించే వాహనదారులపై భారీ ఆర్థికభారం పడనుంది. ఆ మార్గంలో ప్రయాణించే ఆర్టీసీ బస్సుల నుంచి కూడా టోల్ ఫీజు వసూలు చేస్తారు. దాంతో ఆర్టీసీ చార్జీలు కూడా పెంచుతారు. వాహనదారులు ఆ విధంగా ఐదేళ్లలో ఏకంగా రూ.12,500 కోట్లు భరించాల్సి ఉంటుంది. అదే ఆ 27 రోడ్లను ప్రభుత్వ నిధులతో నిర్మిస్తే ప్రజలపై టోల్ ఫీజుల భారం పడదు. నాబార్డ్ తదితర బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని రోడ్లు నిర్మించవచ్చు. ప్రభుత్వం దశలవారీగా బ్యాంకు రుణాలను తీర్చవచ్చు. అలా చేస్తే ముఖ్యనేతకు ఏం ప్రయోజనం..? పీపీపీ విధానంలో తమ బినామీ కాంట్రాక్టు సంస్థల ద్వారా రోడ్లను నిర్మిస్తేనే కదా ఆయన జేబులు నిండేది.పీపీపీ విధానంలో నిర్మించాలని నిర్ణయించిన రోడ్లు1) కళింగపట్నం నుంచి శ్రీకాకుళం మీదుగా పార్వతీపురం2) గార నుంచి ఆమదాలవలస మీదుగా బత్తిలి3) చిలకపాలెం నుంచి రాజాం మీదుగా అంతర్రాష్ట్ర రాయగడ రోడ్4) భీమునిపట్నం నుంచి చోడవరం మీదుగా తుని 5) విశాఖపట్నం నుంచి ఎస్.కోట మీదుగా అరకు 6) కాకినాడ – జొన్నాడ7) రాజమహేంద్రవరం నుంచి మారేడుమిల్లి మీదుగా భద్రాచలం8) అమలాపురం – బొబ్బర్లంక 9) రాజవరం – పొదలాడ10) ఏలూరు – కైకలూరు11) ఏలూరు నుంచి చింతలపూడి మీదుగా మేడిశెట్టివారిపాలెం12) భీమవరం నుంచి కైకలూరు మీదుగా గుడివాడ13) గుడివాడ – కంకిపాడు (విజయవాడ)14) విజయవాడ నుంచి ఆగిరిపల్లి మీదుగా నూజివీడు15) గుంటూరు – పర్చూరు, 16) నరసరావుపేట – సత్తెనపల్లి17) వాడరేవు నుంచి నరసరావుపేట మీదుగా పిడుగురాళ్ల రోడ్18) కావలి నుంచి ఉదయగిరి మీదుగా సీతారాంపురం రోడ్19) నెల్లూరు – సైదాపురం రోడ్20) గూడూరు నుంచి రాపూరు మీదుగా రాజంపేట రోడ్21) మైదుకూరు – తాటిచెర్ల రోడ్22) పులివెందుల నుంచి ధర్మవరం మీదుగా దమజిపల్లి రోడ్23) చాగలమర్రి నుంచి వేంపల్లి మీదుగా రాయచోటి రోడ్ 24) అనంతపురం నగరంలో రింగ్ రోడ్25) సోమందేపల్లి నుంచి హిందూపూర్ బైపాస్ మీదుగా తుమకుంట 26) అనంతపురం – చెన్నై రహదారిలో కదిరి రింగ్ రోడ్27) కాలవగుంట – పెనుమూరు నెండ్రగుంట రోడ్ -
అవగాహన లేమితోనే రోడ్డు ప్రమాదాలు
సాక్షి, హైదరాబాద్: వాహనదారుల్లో అవగాహన లేమితోనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగు తున్నాయని, అవగాహన పెంచే కార్యక్రమా లపై అధికారులు దృష్టి పెట్టాలని డీజీపీ రవిగుప్తా సూచించారు. రోడ్డు ప్రమాదంలో ఎక్కువగా యువత చనిపోతున్నందున ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్, ఎమర్జెన్సీ, రోడ్ ఇంజనీరింగ్ వ్యూహాలతో రోడ్డు ప్రమాదాలను నియంత్రించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. జనవరి 15వ తేదీ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు రోడ్డు భద్రత మాసంగా కేంద్ర రోడ్డు రవా ణా, జాతీయ రహదారుల శాఖ ప్రకటించిన నేపథ్యంలో రోడ్డు భద్రత మాసం నిర్వహణపై రవిగుప్తా మంగళవారం డీజీపీ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు ఇచ్చారు. ఈ కాన్ఫరెన్స్లో రవాణాశాఖ కమిషనర్ బుద్ధ ప్రకాష్, రోడ్డు భద్రత, రైల్వేల విభాగపు అడిష నల్ డీజీపీ మహేష్భగవత్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీఐజీ రంగనాథ్, రోడ్ సేఫ్టీ ఎస్పీ సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లా డుతూ 2022లో తెలంగాణలో 7,500 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోగా, దేశవ్యాప్తంగా 1,68,000 మంది మృత్యువాత పడినట్టు గణాంకాలు చెబుతున్నాయన్నారు. హెల్మెట్ ధరించకపోవడం, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, ఓవర్ స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్, మొబైల్ ఫోన్ మాట్లా డుతూ డ్రైవింగ్ చేయడం తదితర కారణాలతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నా యన్నారు. ఈ ఉల్లంఘనలపై పోలీస్ ఉన్నతాధి కారులు దృష్టి పెట్టాలని సూచించారు. రహదా రులు ఉండే ప్రాంతాల్లో రోడ్ సేఫ్టీ క్లబ్లు ఏర్పాటు చేయాలని, పోలీస్ కార్యాలయంలో డిస్ట్రిక్ రోడ్ సేఫ్టీ బ్యూరో, కమిషనరేట్ రోడ్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. అవస రమైతే ఈ–చలాన్ నిధుల ద్వారా స్పీడ్ గన్స్ బ్రీత్ అనలైజర్స్ కొనుగోలు చేసే అవకాశాలను పరిశీ లించాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడే వారికి ‘గుడ్ సమారిటన్’ పేరిట సన్మా నం చేయాలని డీజీపీ అన్నారు. ఈ చర్యలు ఈ నెలకే పరిమితం కాకుండా దీర్ఘకాలంలోనూ అనుసరించాలని పోలీసు అధికారులకు డీజీపీ రవిగుప్తా స్పష్టం చేశారు. -
విజయవాడలో రేపు ట్రాఫిక్ మళ్లింపు
విజయవాడ స్పోర్ట్స్: సామాజిక న్యాయ మహాశిల్పం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నెల 19వ తేదీన విజయవాడ నగర పరిసరాల్లో వాహనాల రాకపోకలు దారి మళ్లిస్తున్నట్టు ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ) కె.చక్రవర్తి తెలిపారు. వాహన చోదకుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు బుధవారం వెల్లడించారు. 19న ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం వద్ద 1.35 లక్షల మందితో భారీ బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో బెంజి సర్కిల్ నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ వరకు బందరు రోడ్డుపై, ఐదో నెంబర్ రూట్పై, ఏలూరు రోడ్డు సీతారామపురం జంక్షన్ నుంచి రెడ్ సర్కిల్ వరకు, శిఖామణి సెంటర్ నుంచి వాటర్ ట్యాంక్ రోడ్డు వరకు అంబేడ్కర్ విగ్రహం ప్రారంభోత్సవానికి వచ్చే వాహనాలను మాత్రమే అనుమతిస్తామని, ఇతర వాహనాలను అనుమతించమని స్పష్టం చేశారు. -
పొద్దుపొద్దునే ప్రయాణాలొద్దు!
సాక్షి, హైదరాబాద్: ఈ చలికాలంలో పొగ మంచు ముప్పు పొంచి ఉంటోంది. దట్టమైన పొగమంచు ఎదుటి వాహనాలను కానరాకుండా చేసి వాహనదారులను కాటికి పంపుతోంది. గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా తెల్లవారుజాము సమయంలో పొగ మంచు తీవ్రంగా కురియడంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగింది. దాంతో వీలైనంత వరకు తెల్లవారుజాము నుంచి ఉదయం 7 గంటల వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే ఉత్తమమని రోడ్డు భద్రత నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసరంగా ప్రయాణం చేయాల్సి వస్తే.. తప్పకుండా రోడ్డు భద్రత నియమాలు, జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేస్తున్నారు. పొగ మంచు వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాలు ♦ ఈనెల 5న(శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ) రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కుద్బుల్లాపూర్ గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు కుతాడి కుమార్, ప్రదీప్ బైక్పై వస్తుండగా పాపయ్యగూడ చౌరస్తా వద్ద టిప్పర్ లారీ ఢీకొట్టడంతో మృతి చెందారు. పొగమంచు కారణంగా రోడ్డు మసకబారడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ♦ 25 డిసెంబర్, 2023న నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు వద్ద రాత్రి 10 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 ఏండ్ల యువకుడు రమావత్ శివనాయక్ ద్విచక్రవాహనంతో 55 ఏండ్ల బల్లూరి సైదులు అనే వ్యక్తిని ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరూ మృతి చెందారు. ఈ సమాచారం తెలుసుకున్న మృతుడు శివ నాయక్ బంధువులు టాటాఏస్ వాహనంలో ప్ర మాద ఘటన స్థలానికి బయలుదేరారు. తెల్లవా రుజామున 3 గంటల సమయంలో వారు ప్ర యాణిస్తున్న టాటాఏస్ వాహనాన్ని ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ నిడమనూరు మండలం 3వ నంబర్ కెనాల్ వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. దట్టమైన పొగమంచు కారణంగానే ఈ వరుస ప్ర మాదాలు జరిగినట్టు పోలీసులు పేర్కొన్నారు. ♦ డిసెంబర్ 31న తెల్లవారుజామున జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీసీ బస్సు, డీసీఎం ఎదురెదురుగా వస్తూ ఢీకొన్న ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ చనిపోగా, ఆర్టీసీ బస్ డ్రైవర్తోపాటు ఆ బస్సులోని మరో 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పొగమంచుతో రోడ్డు సరిగా కనిపించకపోవడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలిపారు. ♦ డిసెంబర్ 25న హైదరాబాద్ నుంచి వికారాబాద్ జిల్లా అనంతగిరి ఔటింగ్కు వెళ్లి తిరిగి వస్తున్న మిత్రుల బృందం కారు పొగమంచు కారణంగా రోడ్డు పక్కన ఉన్న శివారెడ్డిపేట్ చెరువులోకి దూ సుకెళ్లింది. కారులో ఉన్న ఒకరు గల్లంతు కాగా, మిగిలిన నలుగురిని స్థానికులు కాపాడారు. ప్రయాణం తప్పనిసరైతే ఇవి మరవొద్దు ♦ పొగమంచు కురుస్తున్నప్పుడు మీకు కేటాయించిన లేన్లోనే వాహనం నడపాలి. వీలైనంత వరకు ఓవర్టేక్ చేయకపోవడమే ఉత్తమం. ♦ సింగిల్ రోడ్డులో వాహనం నడపాల్సి వస్తే.. వీలైనంత వరకు మీ వాహనం ఎడమవైపు ఉండేలా చూసుకోవాలి. ♦ డ్రైవింగ్ సమయంలో ఏ సంశయం ఉన్నా..రోడ్డు పూర్తిగా కనిపించకపోయినా మీ వాహనాన్ని రోడ్డు పక్కకు నిలపడమే ఉత్తమం. మీరు వాహనాన్ని పార్క్ చేసినట్టుగా సూచిస్తూ పార్కింగ్ లైట్లు వేయాలి. ♦ పొగమంచు వాతావరణం ఉన్నప్పుడు వాహన వేగాన్ని వీలైనంత వరకు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఎదుటి వాహనం కనిపించని పరిస్థితుల్లో వేగంగా వెళితే వాహనాన్ని కంట్రోల్ చేయడం కష్టం. అదేవిధంగా ప్రమాద తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. ♦ పొగమంచు కురుస్తున్నప్పడు డ్రైవర్లు సాధారణంగా హైబీంలో లైట్లు పెడతారు. ఇలా చేయడం వల్ల రిప్లెక్షన్ వల్ల డ్రైవర్కు సరిగా కనిపించదు. విజిబిలిటి 100 మీటర్లలోపు ఉన్నట్లయితే హెడ్లైట్లు లోబీంలో ఉంచాలి. మీ వాహనానికి ఫాగ్ ల్యాంప్లు ఉంటే వాటిని తప్పక ఆన్ చేయాలి. ఎదుటి వాహనదారుడిని అప్రమత్తం చేసేలా మీ వాహనానికి ఇండికేటర్లు వేసు కుని వెళ్లడం ఉత్తమం. మీ వాహన అద్దాలు వీలైనంత వరకు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. మీ కారులోని డీఫాగర్ను ఆన్ చేసుకోవాలి. ♦ వీలైనంత వరకు ఎదురుగా ఉన్న రోడ్డు స్పష్టంగా కనిపించేలా అవసరం మేరకు డ్రైవింగ్ సీట్ను సర్దుబాటు చేసుకోవాలి. ♦ పొగమంచు ఉన్నప్పుడు వాహనం ఒక్క క్షణం అదుపు తప్పి పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి డ్రైవింగ్పైనే దృష్టి పెట్టాలి. నిద్రమత్తు లేకుండా జాగ్రత్త పడాలి. ♦ వాహనం పూర్తి కండీషన్లో ఉండేలా చూసుకోవాలి. టైర్లు, బ్రేక్లు ముందుగానే చెక్ చేసుకోవాలి. మీ కారులోని హీటర్ ఆన్ చేయాలి. దీనివల్ల బయటి పొగమంచుతో అద్దంపై ప్రభావం లేకుండా ఉంటుంది. ♦ లేన్ మారుతున్నప్పుడు, మూల మలుపుల వద్ద తప్పకుండా హారన్ మోగించాలి. ♦ మొబైల్ ఫోన్ వాడడం, రేడియోలో ఎఫ్ఎం వినడం, పాటలు వింటూ డ్రైవింగ్ చేయవద్దు. -
పెట్రోల్ బంక్ల ముందు భారీ క్యూలైన్లు.. రెండో రోజు కొనసాగుతున్న రద్దీ
సాక్షి, హైదరాబాద్: రెండో రోజు కూడా ప్రెటోల్ బంక్ల వద్ద వాహనాల రద్దీ కొనసాగుతూనే ఉంది. నిన్న ఒకసారిగా వాహనదారులు బంకుల వద్దకు చేరుకోవడంతో బంకులో పెట్రోల్ నిల్వలు అయిపోయాయి. రాత్రి పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లు చేరుకోవడంతో యథావిధిగా బంకుల వద్ద పెట్రోల్ సరఫరా కొనసాగుతుంది. హైదరాబాద్ పలు పెట్రోల్ బంక్ల వద్ద వాహనదారులు బారులు తీరారు. పెట్రోల్, డీజిల్ దొరుకుతుందో లేదోనని ముందు జాగ్రత్త చర్యగా బుధవారం తెల్లవారుజాము నుంచే పెట్రోల్ బంకుల వద్దకు వాహనదారులు చేరుకుంటున్నారు. బంక్లు ఇంకా ఓపెన్ కాకముందే వాహనాలను వరుసగా కిలోమీటర్ల మేర లైన్లలో ఉంచారు. ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లతో సమ్మెతో రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. సోమవారం( జనవరి 1) నుంచి ఆయిల్ ట్యాంకర్ల యజమానులు సమ్మెకు దిగడంతో బంకులకు పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోయింది. దీంతో హైదరాబాద్ నగరంలో చాలా వరకు పెట్రోల్ బంకులు మూసివేశారు. బంకుల ముందు నో స్టాక్ బోర్డులు పెట్టారు. అయితే తెరచి ఉన్న కొన్ని పెట్రోల్ బంకుల ముందు హైదరాబాద్లో వాహనదారులు పెట్రోల్ కోసం క్యూ కట్టారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా పెట్రోల్ బంకులు మూసివేయడం పట్ల వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో తెరచి ఉన్న కొన్ని పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు క్యాన్లతో బారులు తీరడం పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్లకు దారి తీసింది. కొన్ని చోట్ల పెట్రోల్ బంకులకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదీ చదవండి: అశ్వమెక్కి.. ఆర్డర్ అందించి -
హైవే పెట్రోలింగ్పై అవగాహన లేక ప్రాణాలు పోతున్నాయ్!
గత శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి విజయవాడకు రాజధాని ఏసీ బస్సు బయలు దేరింది. రాత్రి 2.20కి నార్కెట్ పల్లి సమీపంలోని ఏపీ లింగోటం వద్ద ఫ్లైఓవర్ పైకి చేరింది. అంతకు 40 నిమిషాల ముందు ఆ వంతెన దిగే సమయంలో ఓ లారీ ఇంజిన్ ఫెయిల్ అయి సెంట్రల్ మీడియన్ పక్కన నిలిచిపోయింది. ఎలక్ట్రికల్ సిస్టం పనిచేయకపోవటంతో లారీ వెనక రెడ్, బ్లింకర్ లైట్లు వెలగలేదు.. డ్రైవర్ దిగిపోయి విషయాన్ని యాజమానికి చెప్పి పక్కన కూర్చుండిపోయాడు.. ఆ సమయంలో వంతెనపై లైట్లు కూడా వెలగటం లేదు. 80 కి.మీ.వేగంతో వచ్చిన రాజధాని బస్సు ఆ లారీని బలంగా ఢీకొంది. బస్సు డ్రైవర్ అక్కడికక్కడే చనిపోగా, 8 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులపై వాహనదారులకు అవగాహన లేకపోవటంతో భారీ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దానికి ఈ బస్సు ప్రమాదమే తాజా ఉదాహరణ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జాతీయ రహదారులను విస్తరిస్తుండటంతో రోడ్లు విశాలంగా మారుతున్నాయి. ఊళ్లుండే చోట ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా వంతెనలు నిర్మిస్తున్నారు.. పట్టణాలుంటే బైపాస్ రూట్లు ఏర్పాటు చేస్తున్నారు.. దీంతో వాహనాలు వేగంగా దూసుకుపోతున్నాయి. ఏదైనా పెద్ద వాహనం హైవే మీద చెడిపోయి నిలిచిపోయిన సందర్భాల్లో మాత్రం పెను ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాత్రి వేళ, మలుపుల వద్ద వాహనాలు నిలిచిపోయి ఉంటే, వెనక వచ్చే వాహనాలు వాటిని ఢీకొంటున్నాయి. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు హైవే పెట్రోలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసినా, దానిపై అవగాహన లేకపోవటమే ప్రమాదాలకు ప్రధాన కారణమవుతోంది. జాతీయ రహదారి హెల్ప్లైన్ నెంబరుకు ఫోన్ చేసి ఉంటే, సిబ్బంది వచ్చి లారీని తొలగించి ఉండేవారు. కనీసం, అక్కడ లారీ నిలిచిపోయి ఉందని తెలిసే ఏర్పాటయినా చేసి ఉండేవారు. అదే జరిగితే ఈ ప్రమాదం తప్పి ఉండేది. ఏంటా హెల్ప్లైన్ వ్యవస్థ? 1033.. ఇది జాతీయ రహదారులపై కేంద్రం కేటాయించిన హెల్ప్లైన్ నెంబర్. జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదం జరిగినా, ఏదైనా భారీ వాహనం నిలిచిపోయినా.. ఈ నెంబరుకు ఫోన్ చేసి సహాయాన్ని పొందొచ్చు. కానీ, దీనిపై ప్రజల్లో అవగాహనే లేకుండా పోయింది. ఏం సాయం అందుతుందంటే.. ప్రతి 50–60 కి.మీ.కు ఓ సహాయక బృందం అందుబాటులో ఉంటుంది. స్థానిక టోల్ బూత్ కు అనుబంధంగా ఇది వ్యవహరిస్తుంది. ఈ బృందంలో మూడు వాహనాలుంటాయి. అంబులె న్సు, పెట్రోలింగ్ వాహనం, క్రేన్ ఉండే టోయింగ్ వెహికిల్. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు హెల్ప్లైన్కు ఫోన్ చేయగానే ఘటనా స్థలికి హైవే అంబులెన్సు, పెట్రోలింగ్ వాహనాలు చేరుకుంటాయి. గ్రాయపడ్డవారికి ప్రాథమిక చికిత్స అందించి, అంబులెన్సులో స్థానిక ఆసుపత్రికి వెంటనే తరలిస్తారు. ఆసుపత్రికి వెళ్లేలోపు కావాల్సిన సాధారణ వైద్యాన్ని అందించే ఏర్పాటు అంబులెన్సులో ఉంటుంది. ప్రమాద స్థలిలో వాహనాల చుట్టూ బారికేడింగ్ చేస్తారు. ఏదైనా భారీ వాహనం ఫెయిలై రోడ్డుమీద ఆగిపోతే టోయింగ్ వాహనాన్ని తెచ్చి వెంటనే ఆ వాహనాన్ని రోడ్డు పక్కకు తరలిస్తారు. దీనివల్ల వేరే వాహనాలు ఆ చెడిపోయిన వాహనాన్ని ఢీకొనే ప్రమాదం తప్పుతుంది. హెల్ప్లైన్ ఎలా పనిచేస్తుంది..: అవసరమైన వారు 1033 హెల్ప్లైన్కు (ఉచితం) ఫోన్ చేయాలి. ఢిల్లీలో ఉండే సెంటర్ సిబ్బంది వెంటనే స్పందిస్తారు. అవసరమైన భాషల్లో మాట్లాడే సిబ్బంది అక్కడ అందుబాటులో ఉంటారు. ఆ వెంటనే ఫిర్యాదు దారు మొబైల్ ఫోన్కు ఓ లింక్ అందుతుంది. దానిపై క్లిక్ చేయగానే, అక్షాంశరేఖాంశాలతో సహా లొకేషన్ వివరాలు ఢిల్లీ కేంద్రానికి అందుతాయి. వాటి ఆధారంగా ఆ ప్రాంతానికి చెందిన సిబ్బందిని వారు వెంటనే అప్రమత్తం చేస్తారు. ఇవన్నీ నిమిషాల వ్యవధిలో జరుగుతాయి. సమాచారం అందిన వెంటనే అవసరమైన సిబ్బంది ఘటనా స్థలికి బయలుదేరి సహాయ చర్యల్లో పాల్గొంటారు. అవగాహనే లేదు.. జాతీయ రహదారులపై నిర్ధారిత ప్రాంతాల్లో ఈ హెల్ప్లైన్ నెంబరును జనం గుర్తించేలా పెద్ద అంకెలను రాసిన బోర్డులను ఏర్పాటు చేశారు. రోడ్డు భద్రతావారోత్సవాలప్పుడు రవాణాశాఖ కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కానీ, ఇప్పటికీ ఎక్కువ మందిలో దానిపై అవగాహనే లేకుండా పోయింది. జాతీయ రహదారులపై ఏదైనా అవసరం ఏర్పడితే 1033కి ఫోన్ చేయాలన్న సమాచారం ప్రజల్లో ఉండటం లేదు. ఎక్కు వ మంది పోలీసు ఎమర్జెన్సీ (100)కే ఫోన్ చేస్తు న్నారు. 1033కి ఫోన్ చేస్తే, సమాచారం స్థానిక హైవే పెట్రోలింగ్ సిబ్బందితోపాటు లోకల్ పోలీసు స్టేషన్కు కూడా చేరుతుంది. మొక్కుబడి అవగాహన కార్యక్రమాలు కాకుండా, జనానికి బోధపడేలా కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. -
తిరుమల ఘాట్ రోడ్లో జాగ్రత్త..! వాహనదారులకు కీలక సూచనలు..
వేసవి సెలవుల కారణంగా తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి అధిక మొత్తంలో వాహనాలు వస్తున్నాయి. రెండవ ఘాట్ రోడ్డు ద్వారా పది వేల వాహనాలు, మొదటి ఘాట్ రోడ్డులో ఎనిమిది వేల వాహనాలు వస్తున్నాయి. ఘాట్ రోడ్డుపై అవగాహన కలిగిన డ్రైవర్లు మాత్రమే తిరుమలకు రావాలని తిరుమల అడిషనల్ ఎస్పీ మునిరామయ్య సూచించారు. ఫిట్నెస్ ఉండే వాహనాలను మాత్రమే ఘాట్ రోడ్డులో ఉపయోగించాలని ఎస్పీ మునిరామయ్య కోరారు. అవగాహన లేని డ్రైవర్లు ఘాట్ రోడ్లో ముందు వెళ్లే వాహనాలను అధికమించే సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఘాట్ రోడ్లో వాహనాలు పక్కన పెట్టి సెల్ఫీలు దిగే ప్రయత్నం చేయొద్దని కోరారు. దివ్య రామం వద్ద వాహనాలను ఆపి ఉండడం చేత ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. తిరుమలలో టైం లిమిటేషన్ కూడా తిరిగి పునరుద్ధరిస్తున్నామని ఎస్పీ మునిరామయ్య చెప్పారు. రెండవ ఘాట్ రోడ్డులో 28 నిమిషాలు, మొదటి ఘాట్ రోడ్డులో 48 నిమిషాలు నియమించామని తెలిపారు. మొదటి ఘాట్ రోడ్డులో ఒకటో కిలోమీటరు వద్ద వాహనాలు ఆపుతున్నారని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ స్పెషల్ టీంగా ఏర్పడి బ్లాక్ స్పాట్స్ వద్ద వాహనాల డ్రైవర్లకు, భక్తులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. అలిపిరి వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. 15 సంవత్సరాలు దాటిన వాహనాలను ఘాట్ రోడ్డులో నిషేధించడంపై ప్రతిపాదన పంపాం కానీ ఇంకా వాటిపై ఎలాంటి నిర్ణయం రాలేదని తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో ఘాట్ రోడ్డులో నిబంధనలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఇదీ చదవండి: తిరుపతి: టపాసుల నిల్వ కేంద్రంలో అగ్నిప్రమాదం.. ముగ్గురి మృతి -
15 రోజులు.. 1.88కోట్లు.. 30 వేల కేసులు!
సాక్షి, చెన్నై: అమల్లోకి వచ్చిన కొత్త చట్టం మేరకు చెన్నైలో 15 రోజుల్లో రూ.1.88 కోట్లను జరిమానా విధించి, వసూలు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు 30 వేల కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. వివరాలు.. చెన్నై నగరంలో ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించే వారి భరతం పట్టే విధంగా మోటారు వాహనాల చట్టంలో సవరణలు చేసిన విషయం తెలిసిందే. గత నెల ఈ కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకుండా వాహనాలు నడిపేవారు, ట్రిబుల్ రైడింగ్తో దూసుకెళ్లే ద్విచక్ర వాహన చోదకులు, సిగ్నల్స్లో నిబంధనల్ని అనుసరించకుండా దూసుకెళ్లే కుర్రకారు, రాత్రుల్లో మద్యం తాగి వాహనం నడిపే వారి భరతం పట్టే విధంగా పోలీసులు దూసుకెళ్లారు. హెల్మెట్ ధరించకుంటే, రూ. 1000, ఇన్సూరె న్స్ లేని వాహనాలకు రూ. 2 వేలు అంటూ భారీ జరిమానాలు విధించారు. దీంతో గత పక్షం రోజుల్లోనే చెన్నైలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి 30,699 మందిపై కేసులు నమోదు చేశారు. వీరి నుంచి జరిమానా రూపంలో రూ. 1.88 కోట్లు వసూలు చేశారు. ఈసందర్భంగా అధికారులు మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అతివేVýæం ప్రమాదకరమని, కుటుంబాన్ని గుర్తెరిగి వాహ నాలను జాగ్రత్తగా నడపాలని సూచించారు. చదవండి: Bear Attack Video: రెచ్చిపోయిన ఎలుగుబంటి.. బైక్పై వెళ్తున్న వారిపై దాడిచేసి.. -
వాహనాదారులకు బిగ్ షాక్.. అమల్లోకి కొత్త యాక్ట్!
సాక్షి, చెన్నై: కొత్త మోటారు వెహికల్ యాక్ట్ అమల్లోకి రావడంతో ట్రాఫిక్ పోలీసులు బుధవారం నుంచి కొరడా ఝులిపించారు. కొన్ని చోట్ల జరిమానాల మోత మోగించగా, మరికొన్ని చోట్ల వాహన చోదకులకు అవగాహన కల్పించి, హెచ్చరించి పంపివేశారు. రాజధాని నగరం చెన్నై తో పాటుగా రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి భరతం పట్టేలా కొత్త మోటారు వెహికల్ యాక్ట్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకుండా వాహనాలు నడిపేవారు, ట్రిబుల్ రైడింగ్తో దూసుకెళ్లే ద్విచక్ర వాహన చోదకులు, సిగ్నల్స్లో నిబంధనల్ని అనుసరించకుండా దూసుకెళ్లే కుర్ర కారుకు ఇకపై భారీ జరిమానా విధించనున్నారు. అలాగే, రాత్రుల్లో మద్యం తాగి వాహనాలు నడిపే వారి మత్తు దిగేలా కఠిన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ పోలీసులే కాదు, లా అండ్ ఆర్డర్ విభాగంలోని ఎస్ఐ ఆపైస్థాయి అధికారులు సైతం బుధవారం నుంచి వాహన తనిఖీలపై దృష్టి పెట్టారు. పలు చోట్ల నిబంధనలు అతి క్రమించిన వారికి జరిమానాలు విధించారు. చదవండి: హనీట్రాప్: ఆమె ఎవరో తెలియదు.. కానీ, అంతా ఆమె వల్లే జరిగింది! -
హైదరాబాద్లో ఉరుములతో కూడిన భారీ వర్షం.. ఫొటోలు, వీడియోలు
సాక్షి, హైదరాబాద్: సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాజాగా మంగళవారం మధ్యాహ్నం కూడా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, మాదాపూర్, అమీర్పేట, బషీర్ బాగ్, అబిడ్స్, లకిడికాపుల్, నాంపల్లి, కోఠి, సుల్తాన్ బజార్, బేగం బజార్, అల్వాల్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో వాన పడింది. హైదరాబాద్ నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేసింది. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అన్నారు. it's Raining 🌧 @Hyderabadrains #rains #HyderabadRains pic.twitter.com/opYupmA8e9 — Muhammed Dastagir (@Dastagir_Hyd) September 27, 2022 Durgam Cheruvu wants all of this water but the drains were never built only 👍🏾 Madhapur is a disaster every rain with our without city wines#HyderabadRains pic.twitter.com/qKrQwRxqF5 — Donita Jose (@DonitaJose) September 27, 2022 @KTRTRS hyderabad capital city #HyderabadRains #ghmc pic.twitter.com/uqW9MM0JU3 — BalaramRajdoot (@BRd175) September 27, 2022 Rain @hyd mind space#HyderabadRains pic.twitter.com/F5VNSbzf9p — sridhar reddy (@reshusri) September 27, 2022 Rains 🙈😓😓😓#HyderabadRains pic.twitter.com/PMqUrUlUj3 — Hemangi Gala🇮🇳 (@hemangigala) September 27, 2022 #HyderabadRains #Hyderabad #whether #rains pic.twitter.com/wZs3XRZoVs — Satish Shukla🇮🇳 (@Satish_shukla99) September 27, 2022 -
కస్టమర్ల కోసం ఎస్బీఐ సరికొత్త సేవ.. ఒక్క మెసేజ్ పెడితే చాలు..
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(SBI) మరో సేవను తన కస్టమర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం ఒక మెసేజ్తో ఫాస్టాగ్( FASTag) బ్యాలెన్స్ను చెక్ చేసుకునే సర్వీసును లాంచ్ చేసింది. దీని ద్వారా ఎస్బీఐ కస్టమర్లు ఫాస్టాగ్( FASTag) బ్యాలెన్స్ను సెకన్లలో తెలుసుకోగలుగుతారు. అందులో.. ఫాస్ట్ట్యాగ్ని ఉపయోగించే ఎస్బీఐ కస్టమర్లు వారి రిజిస్టర్ అయిన నంబర్ నుంచి 7208820019కి ఎస్ఎంఎస్ (SMS) పంపడం ద్వారా వారి ఫాస్ట్ట్యాగ్ బ్యాలెన్స్ను తెలుసుకోవచ్చని తెలిపింది. అయితే దీని కోసం ఎస్బీఐ కస్టమర్లు తమ మొబైల్ నెంబర్ను బ్యాంకు వద్ద రిజిస్టర్ చేసుకుని ఉండాలి. టోల్ గేట్ల వద్ద వాహనదారుల సమయం వృథా కాకుండా.. వారి సేవింగ్స్ అకౌంట్ల నుంచే నేరుగా నగదు కట్టేలా కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ సర్వీసులను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇలా చేస్తే చాలు సెకనులో.. మీ వాహనంలో ఇన్స్టాల్ చేసిన ఫాస్టాగ్ బ్యాలెన్స్ వివరాలు.., మీరు FTBAL అని వ్రాసి 7208820019 నంబర్కు ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. అదే సమయంలో, మీకు చాలా వాహనాలు ఉంటే అప్పుడు మీరు FTBAL అని వ్రాసి 7208820019కి పంపాలి. Dear SBI FASTag Customer, send an SMS to 7208820019 from your registered mobile number to quickly know your SBI FASTag balance. #SBIFastag #SBI #AmritMahotsav pic.twitter.com/mDQQgDl7Mv — State Bank of India (@TheOfficialSBI) September 10, 2022 చదవండి: టెక్నాలజీ అంటే ఇష్టం.. రూ.13వేల ఖర్చు, పాత ఇనుప సామగ్రితో బైక్! -
ఓ మై గాడ్, మళ్లీ పెరగనున్న ధరలు!
గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారితో పోరాడి, లాక్డౌన్లో ఉపాధిని కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రజలు ఇప్పుడిప్పుడు వాటి నుంచి బయటపడుతున్నారు. అయితే దేశంలో పెట్రోలు, డీజిల్తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు భారం కావడంతో ప్రజల పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఈ తరుణంలో కార్ల ధరలు కూడా పెరుగుతున్నాయన్న వార్త వాహనదారులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. మార్కెట్ నిపుణులు ఏమంటున్నారంటే.. పండుగ సీజన్ లోపు మరోసారి వాహనాలు ధరలను పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. రూపాయి మారక విలువ బలహీనపడడం, పెరిగిన రవాణా వ్యయం, ఇక గతంలో కోల్పోయిన మార్జిన్లను తిరిగి పొందాలన్న ఆలోచనలో కంపెనీలు ఉన్నాయి. వీటితో పాటు టైర్లు,ఇతర ఆటో పరికరాల ధరలను కూడా పెంచేందుకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ రేట్లు పెరిగే అవకాశం ఉందని, దీని వల్ల వాహన ధరలు మరింత పైకి కదిలే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. వీటన్నింటిని పరిశీలిస్తే పండుగ సీజన్ కంటే ముందే రేట్ల పెంపు ఉండొచ్చని తెలుస్తోంది. చదవండి: Tata Power Group Q1 Results: టాటా పవర్ ఫలితాలు: డబుల్ ధమాకా! -
Hyderabad: వాహనదారులకు అలర్ట్.. ట్రాఫిక్ ఆంక్షలు, ఈ రూట్లో వెళ్లకపోవడం బెటర్!
సాక్షి,సనత్నగర్: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించినట్లు నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. మంగళవారం (అమ్మవారి కల్యాణం), బుధవారం (రథోత్సవం) సందర్భంగా ఆయా రోజుల్లో వాహనదారులు ప్రత్యామ్నాయ రహదారులను ఎంచుకుని ప్రయాణించాలని ఆయన కోరారు. ► గ్రీన్ల్యాండ్స్, దుర్గామాత టెంపుల్, సత్యం థియేటర్ వైపు నుంచి ఫతేనగర్ వైపు వెళ్లే వాహ నాలు ఎస్ఆర్నగర్ ‘టీ’ జంక్షన్ వద్ద మళ్లి ఎస్ఆర్నగర్ కమ్యూనిటీ హాల్, అభిలాష టవర్స్, బీకేగూడ ఎక్స్రోడ్డు, శ్రీరామ్నగర్ ఎక్స్రోడ్డు, సనత్నగర్ రోడ్డు మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ► ఫతేనగర్ వైపు నుంచి బల్కంపేట వైపు వచ్చే వాహనాలు బల్కంపేట ప్రధాన రహదారి గుండా అనుమతించరు. వాహనదారులు బల్కంపేట–బేగంపేట లింక్రోడ్డులోకి మళ్లించి కట్టమైసమ్మ టెంపుల్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. ► గ్రీన్ల్యాండ్స్ బకుల్ అపార్ట్మెంట్స్, ఫుడ్వరల్డ్ వైపు నుంచి వచ్చే వాహనాలను బల్కంపేట వైపు అనుమతించరు. వాహనదారులు ఫుడ్వరల్డ్ ఎక్స్రోడ్డు వద్ద మళ్లి సోనాబాయి టెంపుల్, సత్యం థియేటర్, మైత్రివనం, ఎస్ఆర్నగర్ ‘టీ’జంక్షన్ వైపు వెళ్లాల్సి ఉంటంది. ► ఎస్ఆర్నగర్ ‘టీ’జంక్షన్ నుంచి ఫతేగర్ వైపు వెళ్లే బై–లేన్స్, లింక్రోడ్లను మూసివేయడం జరిగిందని, వాహనదారులు గమనించి ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలన్నారు. పార్కింగ్ ఏరియాలు ఇవే.. ఎల్లమ్మ కల్యాణం వీక్షించేందుకు వచ్చే వారి వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ప్రాంతాలను ఎంపిక చేశారు. ఆర్ అండ్ బీ కార్యాలయం, అమీర్పేట జీహెచ్ఎంసీ గ్రౌండ్, నేచర్క్యూర్ హాస్పిటల్ రోడ్డు వైపు పార్కింగ్ ప్రాంతం, పద్మశ్రీ, ఫతేనగర్ ఆర్యూబీ ప్రాంతాల్లో భక్తులు పార్కింగ్ చేసుకోవచ్చని జాయింట్ కమిషనర్ తెలిపారు. చదవండి: JEE Mains 2022 Answer Key: ఆన్సర్ చేసినా ఆనవాలే లేదట.. జేఈఈ అభ్యర్థులకు చేదు అనుభవం -
హైదరాబాద్: అక్కడ ట్రాఫిక్ జామ్.. ఇలా వెళ్లండి
బంజారాహిల్స్కు చెందిన ఓ వాహనదారు అబిడ్స్ వెళ్లడానికి బయలుదేరారు. లక్డీకాపూల్లోని రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద హఠాత్తుగా నిరసనకారులు రోడ్డు దిగ్బధించడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఈ విషయం ఆయనకు నిరంకారి దాటే వరకు తెలియలేదు. దీంతో ప్రత్యామ్నాయం ఎంచుకోలేక ట్రాఫిక్లో చిక్కుకుపోయారు సాక్షి, హైదరాబాద్: నగరంలో అనేక మంది వాహనచోదకుల పరిస్థితి ఇలాగే ఉంటోంది. ప్రధానంగా పీక్ అవర్స్లో కార్యాలయాలకు వెళ్లడానికి, అత్యవసరమైన పనులపై బయటకు వస్తున్న వాళ్లు హఠాత్తుగా తలెత్తే అవాంతరాలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ఇలాంటి హఠాత్పరిణామాలపై వాహన చోదకులను అప్రమత్తం చేయాలని నిర్ణయించారు. ఆ మళ్లింపులపై భారీ కసరత్తు... నగరంలో రహదారి, డ్రైనేజీ, ఫ్లైఓవర్.. ఇలా ఏదో ఒక నిర్మాణం, మరమ్మతులు జరుగుతూనే ఉంటాయి. ఆయా సందర్భాల్లో ఆ దారిలో వెళ్లాల్సిన వాహనాలను నిర్ణీత కాలం వరకు మళ్లిస్తుంటారు. దీనికోసం ట్రాఫిక్ పోలీసులు పెద్ద ఎత్తున కసరత్తు చేసి ప్రత్యామ్నాయ మార్గాలు గుర్తించడంతో పాటు అవసరమైతే మరమ్మతులు చేయిస్తారు. ఈ మళ్లింపులపై మీడియా, సోషల్ మీడియాలో ప్రకటనలు ఇవ్వడంతో పాటు ఆయా మార్గాల్లో ఫెక్సీలు సైతం ఏర్పాటు చేస్తారు. వాహనచోదకులు అడ్డంకులు ఉన్న మార్గంలో వెళ్లి ఇబ్బందులు ఎదుర్కోకూడదన్నదే వీటి వెనుక ఉన్న ఉద్దేశం. హఠాత్తుగా వస్తే ఆగిపోవాల్సిందే... నగరం రాష్ట్ర రాజధాని కూడా కావడంతో అనేక శాఖలు, సంస్థల ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉంటాయి. ఎక్కడి వాళ్లు నిరసనలు తెలపాలన్నా తమ ‘గొంతు అందరికీ వినిపించాలనే’ ఉద్దేశంతో దానికి ఇక్కడి కార్యాలయాలు, ప్రాంతాలనే ఎంచుకుంటారు. నిరసనల్లో కొన్ని అనుమతులు తీసుకుని జరిగితే, మరికొన్ని హఠాత్తుగా తెరపైకి వస్తాయి. మొదటి కేటగిరీకి చెందిన వాటితో ఇబ్బంది లేకున్నా రెండో రకమైన వాటి వల్ల తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు వస్తుంటాయి. భారీ ప్రమాదం లాంటివి జరిగినా పరిస్థితి ఇలానే ఉంటుంది. చదవండి: కలెక్టర్ అవుదామని కలలు కని.. రియల్ ఎస్టేట్ను నమ్ముకుని.. సర్వీస్ ప్రొవైడర్ల సహకారంతో.. ఈ తరహా ట్రాఫిక్ జామ్స్పై ఆయా మార్గాల్లో వచ్చే వాహనచోదకులను నిర్ణీత ప్రాంతాలకు చేరుకోవడానికి ముందే అప్రమత్తం చేయాలని ట్రాఫిక్ విభాగం అధికారులు నిర్ణయించారు. దీనికోసం సెల్ఫోన్ సేవలు అందిస్తున్న సర్వీస్ ప్రొవైడర్ల సహాయం తీసుకోవాలని యోచిస్తున్నారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న, ఆయా మార్గాల్లో ప్రయాణిస్తున్న వాహనచోదకుల ఫోన్ నెంబర్ల డేటా సర్వీస్ ప్రొవైడర్ల వద్ద ఉంటుంది. ఈ సర్వీస్ ప్రొవైడర్లు ఓ ప్రాంతం పిన్కోడ్ నెంబర్ ఆధారంగా అక్కడ రిజిస్టర్ అయి ఉన్న, యాక్టివేషన్లో ఉన్న ఫోన్ నంబర్లను గుర్తించగలుగుతారు. దీని ఆధారంగా ఆ ప్రాంతంలో సెల్ఫోన్లను గుర్తిచడం ద్వారా వారికి ట్రాఫిక్ జామ్పై సమాచారం ఇప్పించడానికి ట్రాఫిక్ విభాగం అధికారులు కసరత్తు చేస్తోంది. ఏ రూపంలో అనే అంశంపై సమాలోచన... ట్రాఫిక్ జామ్లకు సంబంధించిన సమాచారాన్ని ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఉండే సిబ్బంది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. వీరి ద్వారా ఈ వివరాలు ఆయా సర్వీస్ ప్రొవైడర్లకు చేరతాయి. ఈ సమాచారాన్ని వాహన చోదకుడి ఏ రూపంలో పంపాలనే దానిపై అధికారులు సమాలోచన చేస్తున్నారు. సంక్షిప్త సందేశం, ఆడియో క్లిప్, ఐవీఆర్ఎస్ తరహా కాల్... తదితర మార్గాలను పరిశీలిస్తున్నారు. నగరంలోని అనేక కూడళ్లల్లో ఉన్న సైనేజ్ బోర్డుల ద్వారానూ ఈ అడ్డంకుల సమాచారాన్ని వాహనచోదకులకు తెలియజేయనున్నారు. ట్రాఫిక్ జామ్ ఉన్న ప్రాంతానికి దారి తీసే మార్గాల్లోనే ఈ సందేశం కనిపించేలా ఏర్పాటు చేయనున్నారు. బంజారాహిల్స్లో స్తంభించిన ట్రాఫిక్ బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని అగ్రసేన్ చౌరస్తాలో నీటి పైప్లైన్కు లీకేజీలు రావడంతో గత నాలుగు రోజుల నుంచి తవ్వకాలు చేపట్టి కొత్త పైపులు ఏర్పాటు చేస్తున్నారు. ఇరుకైన చౌరస్తాలో తవ్వకాలతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బంజారాహిల్స్ రోడ్ నెం.12 వైపు, తెలంగాణ భవన్ రోడ్డులో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. స్కూల్ బస్సులన్నీ ట్రాఫిక్లో గంటల తరబడిగా చిక్కుకుపోయాయి. -
డ్రైవింగ్ టెస్ట్.. ఇకపై అక్రమాలకు చెక్ పెట్టనున్న ప్రభుత్వం
డ్రైవింగ్ సామర్థ్య పరీక్షలు ఆటోమేటెడ్గా జరగనున్నాయి. మనుషుల ప్రమేయం లేకుండా నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా వాహనదారుల పనితీరును, వినియోగ అర్హతను ధృవీకరించేందుకు ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కోటి రూపాయల ఖర్చుతో పనులు పూర్తిచేశారు. అక్రమాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. కొత్త ట్రాక్లను త్వరలో ప్రారంభించేందుకు ఆర్టీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సాక్షి,చిత్తూరు రూరల్: చిత్తూరు ప్రశాంత్ నగర్ ప్రాంతంలో ఆర్టీఏ కార్యాలయం ఉంది. ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ల కోసం రోజుకు వందల సంఖ్యలో వస్తుంటారు. కానీ ఈ కార్యాలయంలో గతంలో అక్రమంగా లైసెన్స్లు జారీ అయ్యే అవకాశం ఉండేది. అయితే వీటికి చెక్ పెట్టాలని ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఆరు నెలల క్రితం ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ అమల్లోకి తీసుకొచ్చింది. ఈ ఏడాది జనవరిలో పనులను ప్రారంభించారు. ఇందుకు ఒక కోటి రూపాయలు ఖర్చు చేశారు. రెండు రోజుల క్రితమే పనులు పూర్తి చేసి ట్రయల్ నిర్వహిస్తున్నారు. ట్రాక్ నిర్మాణం ఇలా మొత్తం ఇక్కడ 13 ట్రాక్లు ఉన్నాయి. ఎంవీ(మోటార్ వెహికల్)కు సంబంధించి 5 ట్రాక్లు ఉండగా, అందులో 8 ట్రాక్, హెయిర్పిన్ ట్రాక్, బ్యాలన్స్ బ్రిడ్జి ట్రాక్, రఫ్ రోడ్డు ట్రాక్, గ్రేడియంట్ వంటి ట్రాక్లు ఉన్నాయి. ఎల్ఎంవీ(లైట్ మోటార్ వెహికల్)లో కూడా 5 ట్రాక్లు ఉంటాయి. 8 ట్రాక్, పార్కింగ్, హెచ్ ట్రాక్, టీ ట్రాక్, గ్రేడియంట్లు ఉంటాయి. హెచ్ఎంవీ (హెవీ మోటార్ వెహికల్)లో మూడు ట్రాక్లు మాత్రమే ఉండగా, హెచ్ ట్రాక్, గ్రేడియంట్, పార్కింగ్లు ఉన్నాయి. వీటిని కొత్త విధానంలో అమలులో భాగంగా రీ మోడలింగ్ చేశారు. ఈ ట్రాక్ల చుట్టూ 27 సీసీ కెమెరాలను బిగించారు. ప్రతి ట్రాక్లోను బొలెట్స్ (సెన్సర్ను అమర్చిన పోల్స్) అమర్చారు. దీంతో పాటు ఆర్ఎఫ్ రీడర్స్ 26 దాకా ఏర్పాటు చేశారు. డిస్ప్లే బోర్డులు –13, సిగ్నల్ స్తంభాలు 13, కంప్యూటర్ పరికరాలు 15, మానిటర్ 2, ఒక కియోస్క్లు ఉన్నాయి. ఇవి మొత్తం సర్వర్ రూమ్కు అనుసంధానం చేశారు. ఇక్కడ ఇన్స్పెక్టర్, నెట్ వర్కింగ్ ఇంజనీర్ పర్యవేక్షిస్తుంటారు. డ్రైవింగ్ ట్రయల్కు వెళ్లిన వ్యక్తిని ఈ కంట్రోల్ రూమ్ నుంచే చూస్తుంటారు. ఈ పనులను అధికారులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. డ్రైవింగ్ శిక్షణకు ఎలా వెళ్లాలంటే.. ఆటోమెటిక్ పద్ధతి ద్వారా ఎల్ఎల్ఆర్ పొందిన వ్యక్తులు డ్రైవింగ్ ట్రయల్కు ముందుగా కియోస్కీ ద్వారా ఎల్ఎల్ఆర్ నంబరు నమోదు చేసి టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. తరువాత కంట్రోల్ రూమ్లో బయోమెట్రిక్ వేయాలి. అక్కడే శిక్షణకు వెళ్లేందుకు ట్యాగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ట్రాక్లోకి వెళ్లేముందు ఆర్ఎఫ్ రీడర్కు ట్యాగ్ను మ్యాచింగ్కు చేసి గ్రీన్ సిగ్నల్ వచ్చాక ముందుకు వెళ్లాలి. ఎట్టి పరిస్థితుల్లోను రెడ్ సిగ్నల్ను దాటకూడదు. సూచిక బోర్డులో ఉన్న విధంగానే 8, ఇతర ట్రాక్లను పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రతి సిగ్నల్ వద్ద ట్యాగ్ను మ్యాచింగ్ చేసి వెళ్లాల్సి ఉంటుంది. వాహనాలను బట్టి 3 నుంచి 5 ట్రాక్లను పూర్తి చేయాలి. ఇలా శిక్షణ పూర్తి చేసి, వైట్ మార్క్ వద్దకు చేరుకున్న తరువాత స్టాప్ సిగ్నల్ ఇవ్వాలి. ఇక్కడ ఎలాంటి తప్పు జరిగిన సెన్సార్ రూపంలో కంట్రోల్ రూమ్కు సమాచారం వెళ్తోంది. ఆటోమెటిక్ ట్రయల్లో తప్పిదం జరిగినట్లు సమాచారం వస్తుంది. ఈ విధానం ద్వారా అక్రమాలకు, దళారుల వ్యవస్థకూ చెక్ పడనుంది. పనులు పూర్తయ్యాయి ట్రాక్ పనులు గత ఆరు నెలలుగా చేస్తున్నారు. పనులు కూడా పూర్తయ్యాయి. త్వరలో ప్రారంభం అవుతుంది. ఆటోమెటిక్ విధానం ద్వారానే ట్రయల్ ఉంటుంది. సెన్సార్ సాయంతో ఈ పరీక్షలు జరుగుతాయి. దీనిపై డ్రైవింగ్ శిక్షణకు వచ్చే వారు అవగాహన కలిగి ఉండాలి. – బసిరెడ్డి, డీటీసీ, చిత్తూరు -
పంజగుట్ట ఫ్లై ఓవర్.. ప్రమాదం పైనే ఉంది జర జాగ్రత్త
సాక్షి,పంజగుట్ట(హైదరాబాద్): పంజగుట్ట ఫ్లై ఓవర్ కింద ప్రయాణిస్తున్న వారు బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సిన పరిస్థితులు దాపురించాయి. పంజగుట్ట చౌరస్తాలో ఫ్లై ఓవర్ నుంచి కిందికి కేబుల్ వైర్ల ఎన్క్లోజర్ కట్టలు ప్రమాదకరంగా ఉన్నాయి. ఇవి ఏ మాత్రం తెగిపడినా కింద ప్రయాణిస్తున్న వారికి సంకటమే.. సంబంధిత అధికారులు గుర్తించి వీటిని తొలగించడమో లేదా సరిచేయడమే చేయాల్సిన ఎంతైనా ఉంది. -
హలో చలో.. గ్రేటర్లో 71.7 శాతం మంది హ్యాండ్స్ ఫ్రీ మోడ్లో డ్రైవింగ్
సాక్షి, సిటీబ్యూరో (హైదరాబాద్): గ్రేటర్ వాహనదారులు సెల్ఫోన్ డ్రైవింగే కాదు.. ఇయర్ ఫోన్స్, బ్లూ టూత్లలో లేదా హెల్మెట్ లోపల మొబైల్లో మాట్లాడుతూ (హ్యాండ్స్ ఫ్రీ) వాహనాలను నడుపుతున్నారని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఐఐపీహెచ్), కరుణ ట్రస్ట్, యాక్షన్ ఇన్ డిస్ట్రెస్ ఎన్జీఓలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో తేలింది. 11,787 డ్రైవర్లపై అధ్యయనం చేయగా.. 16.5 శాతం మంది సెల్ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారని, ఇందులో 71.7 శాతం మంది హ్యాండ్స్ ఫ్రీ మోడ్లో డ్రైవింగ్ చేస్తున్నారని వెల్లడించింది. ♦మాదాపూర్ ఐటీ కారిడార్, అమీర్పేట బిజినెస్ ఏరియా, మేడ్చల్ హైవే ఇండ్రస్టియల్ ప్రాంతాలలో ఈ అధ్యయనం నిర్వహించాయి. 15 నిమిషాల పాటు వాహనాల రాకపోకలు, వాహనదారుల వీడియోను రికార్డ్ చేశారు. కరుణ ట్రస్ట్కు చెందిన సంధ్య, యాక్షన్ ఇన్ డిస్ట్రెస్కు చెందిన లక్ష్మి అర్చన, ఐఐపీహెచ్ నుంచి మెలిస్సా గ్లెండా లూయిస్, తేటాలి శైలజలు ఈ సర్వే నిర్వహించారు. ఈ అధ్యయాన్ని క్లినికల్ ఎపిడిమియాలజీ, గ్లోబల్ హెల్త్ జర్నల్లో ప్రచురించారు. ♦రోజు, సమయంతో పాటూ రోడ్డు పరిస్థితిని బట్టి సెల్ఫోన్ డ్రైవింగ్లో తేడాలను అధ్యయన బృందం విశ్లేషించింది. సాధారణ రోజులలో కంటే వారాంతాలలో, రద్దీ ఉన్న రోడ్ల మీద కంటే లేని రహదారులలో హ్యాండ్స్ ఫ్రీ మోడ్లో డ్రైవింగ్ ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉంది. ♦డ్రైవింగ్లో హ్యాండ్స్ ఫ్రీ కమ్యూనికేషన్ పరికరాలను వినియోగించడం ప్రమాదకరని జాబితాలో ఉన్నప్పటికీ.. జరిమానాలు విధించడం లేదు. అందుకే ఈ తరహా డ్రైవింగ్లను కూడా ఎంవీ యాక్ట్లో చేర్చాలని పరిశోధకలు సూచించారు. మోటారు వాహనాల చట్టం సెక్షన్–184 ప్రకారం ప్రమాదకరమైన రీతిలో వాహనాలను డ్రైవింగ్ చేసే వారికి రూ.5 వేల జరిమానా, 6– 12 నెలల పాటు జైలు శిక్ష విధిస్తారు. ♦గతేడాది హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 35,425, అంతకు క్రితం ఏడాది 26,984 సెల్ఫోన్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయి. 2021లో రాచకొండ కమిషనరేట్ పరిధిలో 5,788 సెల్ఫోన్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయి. -
హైదరాబాద్లో డీజిల్ కొట్టించగానే ఆగిపోతున్న కార్లు.. ప్రశ్నిస్తే..
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ఇంధనం లేక ఆగిపోయిన వాహనాలకు డీజిల్ కానీ, పెట్రోల్ కానీ పట్టిస్తే యధావిధిగా స్టార్ట్ అవుతాయి. కానీ ఈ పెట్రోల్ బంక్లో డీజిల్, పెట్రోల్ పట్టిస్తే మాత్రం ఈ డబ్బులు వృథాగా పోగొట్టుకోవడమే కాక.. వాహన మరమ్మత్తులకు కూడా జేబు గుల్ల చేసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్ పెద్ద అంబర్ పేట్లో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో భారీ మోసం వెలుగుచూసింది. నీళ్లతో కలిపిన డీజిల్ను వాహనదారులకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఇక్కడ డీజిల్ పోయించకున్న వెంటనే వాహనాలు ఆగిపోయినట్లు చెప్తున్నారు. ఇదేంటని డీజిల్ని పరీక్షిస్తే లీటర్కు మూడొంతుల నీళ్లు కలిపినట్లు తేలింది. ఈ విషయంపై పెట్రోల్ బంక్ సిబ్బందిని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వాహనదారులను మోసం చేస్తున్న ఈ బంక్ను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చదవండి: (గుడ్న్యూస్: ఆర్టీసీ ప్రయాణికులకు కాఫీ,టీ, స్నాక్స్) -
శీతాకాలం వచ్చేసింది.. వాహనదారులు వీటిని తప్పక పాటించాలి.. లేదంటే..
సాక్షి,సీతంపేట(శ్రీకాకుళం): శీతాకాలం ప్రారంభంతోనే పొగమంచు దట్టంగా కరుస్తోంది. దీంతో వాహన చోదకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచులో వాహ నం నడపడం సాహసంతో కూడుకున్నదే. ఎదురుగా వస్తున్న వాహనం దగ్గరకు వచ్చేవరకూ గుర్తించలేం. అలాంటి సమయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదాలా బారిన పడేందుకు అవకాశం ఉంది. వాతావరణ ఎలా ఉన్నా ప్రజలు తమ పనుల నిమిత్తం ప్రయాణించక తప్పదు. ఈ నేపథ్యంలో ఉదయాన్నే పొగమంచులో ప్రయాణించేవారు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పాటించాల్సిన జాగ్రత్తలు ► పొగమంచు కురిసే సమయంలో వీలైనంత వరకు వాహనాలను నడపకపోడం మంచిది ► రహదారిపై మంచు తీవ్రత పెరిగితే సురక్షితమైన ప్రాంతాల్లో పార్కింగ్ చేయాలి ► కార్లు, ద్విచక్రవాహనాలపై సాధ్యమైనంత తక్కువ దూరం ప్రయాణం చేయాలి ► పొగమంచు కమ్ముకున్నపుడు వాహన వేగం తగ్గించాలి ► ఎదురెదురుగా వస్తున్న వారు గమనించేలా హెడ్లైట్స్ ఆన్చేసి ఉంచాలి. కొత్త వాహనాలకు ఆ సమస్య లేదు. ఎల్లపుడు హెడ్లైట్స్ వెలిగే ఉంటాయి ► వాహనాలకు వైపర్స్ పనిచేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి ► డ్రైవర్ పక్కన కూర్చునే వారు డ్రైవింగ్ తీరును ఎప్పటికపుడు పర్యవేక్షించాలి ► వాహనం వెనుక.. ముందు రేడియం స్టిక్కర్లు విధిగా అతికించాలి ► వాహనానికి అమర్చిన రెడ్సిగ్నల్స్, బ్రేక్ సిగ్నల్స్ పనితీరు సరిచూసుకోవాలి ► పొగమంచు ఉన్నపుడు ఎదురుగా వెళ్లున్న వాహనాన్ని అధిగమించే ప్రయత్నం మానుకోవాలి ప్రమాదాలకు ఆస్కారం.. ► రహదారుల పక్కనే వాహనాలు నిలపడం, మలుపులతో కూడిన రహదారులు ఉండడం ► పరిమితం కంటే అధికవేగంతో వాహనాలు నడపడం ► దట్టంగా ఉన్న మంచు వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడం ► రహదారి వెంబడి ఉన్న డివైడర్లను ఢీకోవడం వంటి కారణంగా ఈ సీజన్లో ప్రమాదాలకు ఆస్కారం ఉంది చదవండి: మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రేసులో సిక్కోలు మహిళ -
వాహనం ఒకరిది.. నంబర్ ఇంకొకరిది
పై ఫొటోలో కనిపిస్తున్న ఆటో టేకులపల్లిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు పోలీసులు ఫొటో తీసి, నంబర్ ఆధారంగా ఈ–చలాన్ పంపారు. కానీ అది ఖమ్మంలోని ఓ కారు ఓనర్కు వెళ్లింది. కారు నంబర్ ఆటోపై రాయడంతో ఈ మతలబు జరిగింది. భద్రాచలానికి చెందిన ఓ వ్యక్తి స్కూటీ ఎప్పుడూ ఇతర ప్రాంతాలకు వెళ్లలేదు. అయితే చండ్రుగొండలో హెల్మెట్ పెట్టుకోలేదంటూ ఈ–చలాన్ వచ్చింది. ఫొటోలో మాత్రం ప్యాషన్ బైక్ ఉంది. జరిమానా స్కూటీ ఓనర్కు వచ్చింది. ట్రాఫిక్ జరిమానాలు తప్పించుకునేందుకు కొందరు తమ వాహనాలపై ఇతరుల వాహనాల నంబర్లు రాసుకుంటున్నారు. సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: పోలీసులు నిబంధనలు ఉల్లంఘించేవారి వాహనాల ఫొటోలు తీస్తున్నారు. వాటి ఆధారంగా వాహనం నంబర్ గుర్తించి జరిమానా విధిస్తున్నారు. అయితే కొందరు ఉల్లంఘనులు ఇతరుల వాహనాల నంబర్లను తమ వాహనాలపై రాయించుకుంటున్నారు. యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఈ–చలాన్లు మాత్రం ఇతరులకు వెళ్తున్నాయి. దీంతో వారు లబోదిబోమంటున్నారు. ఒక వాహనం నంబరును మరో వాహనానికి చెందిన వ్యక్తులు ఉపయోగిస్తుండటంతో నిబంధనల ప్రకారం నడుచుకుంటున్న వాహనదారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వేరేవాళ్లు చేస్తున్న తప్పులకు తాము జరిమానా కట్టాల్సి వస్తోందని వాపోతున్నారు. తమ వాహనాల నంబర్లు పెట్టుకుని చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదాయం కోసం పోలీసులకు భారీ లక్ష్యాలు విధించి ఒత్తిడి చేస్తోంది. దీంతో రోజూ అన్ని ఠాణాల పరిధిలోని కానిస్టేబుళ్లు వివిధ కూడళ్లలో నిలబడి ఫొటోలు తీయడమే పనిగా ఉంటున్నారు. ట్రాఫిక్ క్లియరెన్స్ సైతం గాలికి వదలాల్సిన పరిస్థితి నెలకొంది. వాహనాలు తనిఖీలు చేస్తేనే ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్లు, వాహనం నడిపే వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయో లేవో తెలుసుకోవచ్చని పలువురు పేర్కొంటున్నారు. ఏజెన్సీలోనే తనిఖీలు.. మావోయిస్టు పార్టీ కార్యకలాపాల నేపథ్యంలో జిల్లాలోని భద్రాచలం, పినపాక ఏజెన్సీల్లో మాత్రమే పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో గంజాయి అక్రమ రవాణాదారులు పట్టుబడుతున్నారు. పోలీసులు పేలుడు పదార్థాలు, గంజాయి రవాణాపైనే దృష్టి పెడుతున్నారు తప్ప వాహనాలకు పత్రాలు ఉన్నాయా? లేవా? అనే విషయం పట్టించుకోవడంలేదనే విమర్శలు ఉన్నాయి. ఇక ఇతర ప్రాంతాల్లో తనిఖీలు అంతగా చేపట్టడం లేదు. దీంతో ఏ వాహనంలో ఏం తరలిస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. పట్టణ ప్రాంతాలు, మండల కేంద్రాల్లో కేవలం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనుల ఫొటోలను తీసేందుకే కానిస్టేబుళ్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ సమస్యలపై ఎస్పీ సునీల్దత్ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులో లేరు. -
తిరుమలలో చిరుత కలకలం..
సాక్షి, తిరుపతి: తిరుమల క్షేత్రంలో చిరుత భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఘాట్ రోడ్డులో వెళ్లే వాహనదారులపై దాడికి దిగుతుంది. ఒకే రోజు వరుసగా మూడు సార్లు పంజా విసిరింది. ద్విచక్ర వాహనదారులు తృటిలో చిరుత పంజా నుండి తప్పించుకున్నారు. తిరుమల క్షేత్రంలో ఎన్నడు లేని విధంగా చిరుత దాడికి దిగటంతో అటు టీటీడీ అధికారులకు, ఇటు భక్తులు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. శేషాచలం అటవీ ప్రాంతం అంటేనే ఎన్నో క్రూరమృగాలు ఉంటాయి. ముఖ్యంగా చిరుతలు, ఏనుగులు, మిగిలిన జంతువులన్నీ ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. అయితే జనసంచారం పెద్దగా తిరుమలలో లేకపోవడంతో జంతువులన్నీ రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. తాజాగా ఓ చిరుత తిరుమలలోని రెండవ ఘాట్ రోడ్డులో ప్రత్యక్షమైంది. మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వాహనదారుడిపై అలిపిరి టోల్ గేట్ నుంచి సరిగ్గా నాలుగు కిలోమీటర్ల దూరంలో దాడి చేసింది. ఆ తరువాత అక్కడే కూర్చుండి పోయింది. మరో ఇద్దరు వేర్వేరు ద్విచక్రవాహనాల్లో వెళుతుండగా వారి మీద కూడా దాడి చేసింది. వీరిలో ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు కూడా ఉన్నారు. ఎలాగోలా వారు తప్పించుకుని తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి టోల్గేట్ నుంచి సరిగ్గా నాలుగు కిలోమీటర్ల దూరంలో చిరుత ఉందనే సమాచారం టీటీడీతో పాటు అటవీశాఖ అధికారుల దృష్టికి వెళ్ళింది. దీంతో అటవీ శాఖాధికారులు రంగంలోకి దిగారు. చిరుతను అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ వాహనాలను మాత్రం యథావిధిగా ఘాట్ రోడ్డులో పంపించేస్తున్నారు. ఐదు, ఆరు వాహనాలను ఒకేసారి తిరుమలకు అనుమతిస్తున్నారు. మరోసారి చిరుత సంచారం శేషాచలం అటవీ ప్రాంతంలో ఉండడంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. చిరుత దాడి బాధితులు మాత్రం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని తిరుమల కి చేరుకున్నారు. గతంలో అనేకమార్లు చిరుత జనావాసాల మధ్యకు వచ్చిన ఎవ్వుపై దాడికి పాల్పడలేదు. కుక్కలు,పందులు,జింకలు, దుప్పులు లాంటి జంతువుల పై దాడిచేసింది.. చాలా సంవత్సరాల క్రితం నడకదారిలో ఓ ఏడేళ్ల చిన్నారిపై దాడికి పాల్పడింది. మరి నేటి వరకు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. మళ్లి నేడు ఒకే రోజు మూడుసార్లు వాహన దారులపై పంజా విసరటం కలకలం రేపుతుంది. -
లాక్డౌన్ ఉల్లంఘనులపై పోలీసుల కొరడా
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి నివారణకు కట్టుదిట్టంగా ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ను ఉల్లంఘిస్తున్న వారిపై నగర పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ను మే 7 వరకు పొడిగించిన నేపథ్యంలో నిబంధనలను మరింత పటిష్టంగా అమలు చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ఇళ్లకే పరిమితం కావాలనే ఆదేశాలను కొందరు బేఖాతరు చేస్తున్నారు. మంగళవారం హైదరాబాద్లో నిబంధనలు పాటించకుండా బయటకు వచ్చిన వాహనదారులను అదుపు చేసేందుకు పోలీసులు తమ లాఠీలకు పనిచెబుతున్నారు. లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేయాలని పోలీస్ సిబ్బందికి ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అవసరమైతే లాఠీఛార్జ్ చేసైనా సరే లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశాల నేపథ్యంలో పోలీసు సిబ్బంది మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. (వైరస్ ఉగ్రరూపాన్ని చూస్తారు : డబ్ల్యూహెచ్ఓ) రోడ్డెక్కిన వాహనాలు సీజ్.. తనిఖీలు చేస్తూ.. అనవసరంగా రోడ్డెక్కిన వాహనాలను సీజ్ చేస్తూ వాహనదారులపై కేసులు నమోదు చేస్తున్నారు. మహమ్మారి కరోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తున్న తరుణంలో నివారణ కోసం రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. మాస్క్లు లేకుండా ఎవరూ బయట తిరగొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ లేకుండా బయట తిరిగినా, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేసినా కేసులు నమోదు చేయకతప్పదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. (వారంలోనే వీరంగం) పోలీసుల ఓవరాక్షన్ విధి నిర్వహణలో కొందరు పోలీసులు విచక్షణ కోల్పోయి.. ఓవరాక్షన్ చేస్తున్నారు. నగరంలోని చార్మినార్ మదీనా చౌరసా వద్ద జడ్జ్ఖాన నుంచి డెలివరీ అయిన మహిళను ఇంటి వద్ద దింపేందుకు వెళ్తున్న ‘102’ వాహనాన్ని చార్మినార్ ట్రాఫిక్ పోలీసులు నిలిపివేశారు. వాహనంలో మహిళతో పాటు కుటుంబ సభ్యులు ఉండటంతో పోలీసులు అభ్యంతరం తెలిపారు. విషయం తెలిసి ఘటనాస్థలికి మీడియా ప్రతినిధులు చేరుకోవడంతో వెంటనే ‘102’ వాహనాన్ని అధికారులు పంపించివేశారు. -
పోలీసులకు వాహనదారుల ఝలక్
పోలీసులను ద్విచక్రవాహనదారులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. ట్రాఫిక్ చలానా నుంచి తప్పించుకునేందుకు కొందరు నంబర్లు మార్చి రోడ్డుపై తిరుగుతున్నారు. దీంతో ఫొటోలు తీసి చలానా వేస్తుండగా అసలైన యజమాని పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. సాక్షి, పాలకుర్తి(రామగుండం): రహదారిపై భద్రతా నియమాలు పాటించకుండా ట్రాఫిక్రూల్స్ అతిక్రమిస్తున్న వాహనదారులపై ప్రస్తుతం పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. పోలీసులు విధించే ఆన్లైన్ జరిమానాల నుంచి తప్పించుకునేందుకు వాహనదారులు కొత్తమార్గాన్ని ఎంచుకున్నారు. వాహనాలకు ఇతరుల వాహన నంబర్లు రాయించుకొని తిరుగుతున్నారు. పోలీసులకు పట్టుబడినపుడు వారు విధించే జరిమానాకు సంబంధించిన సమాచారం అదేనెంబర్ కలిగిన అసలు వాహనదారులకు వెళ్తుండడంతో వారు ఖంగుతింటున్నారు. దీంతో సంబంధిత వాహన యజమానులు తమ వాహనం ఆ స్టేషన్ పరిధిలో వెళ్లలేదని, తాము ఎలాంటి ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించలేదని పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఇలాంటి ఘటన ఇటీవల బసంత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బసంత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఇటీవల పోలీసుల వాహన తనిఖీల్లో హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తూ కుక్కలగూడుర్కు చెందిన వ్యక్తి చిక్కాడు. పోలీసులు అతడికి జరిమానా విధిస్తూ ఆన్లైన్ రసీదు అందించారు. అయితే పోలీసులు విధించిన జరిమానా సమాచారం హైదరాబాద్కు చెందిన మరోవ్యక్తికి సెల్ఫోన్లో మెసేజ్ వెళ్లింది. దీంతో ఖంగుతిన్న వాహన యజమాని సంబంధిత స్టేషన్కు కాల్చేసి వివరాలు అడిగాడు. తాను హైదరాబాద్లో ఉంటానని, నా వాహనం మీ స్టేషన్ పరిధిలో ఎక్కడికి రాలేదని, తనకు జరిమానా ఎలా విధిస్తారని వాగ్వాదానికి చేశాడు. దీంతో పోలీసులు సీరియస్గా తీసుకొని వాహన నెంబర్ ఎంట్రీ చేయడంలో ఏదైనా పొరపాటు దొర్లిందా అని పునరాలోచనలో పడి వివరాలు సరి చూసుకున్నారు. కానీ వాహన వివరాలు కరెక్ట్గా ఉండడంతో విస్తుపోయారు. వాహనదారుడు అంతటితో ఆగకుండా కమిషనరేట్లో ఫిర్యాదు చేశాడు. కమిషనర్ ఆదేశాల మేరకు పోలీసులు మరోసారి తాము ఎంట్రీ చేసిన వివరాలు పరిశీలించారు. జరిమానా విధించిన వాహనదారుడిని స్టేషన్కు పిలిపించి విచారణ జరపడంతో అసలు విషయం బయటకు వచ్చింది. తన బైక్కు నంబర్లేదని, ఫ్యాన్సీగా ఉంటుందని ఒకనంబర్ తగిలించుకుని తిరుగుతున్నానని, ఇది గత మూడేళ్లుగా చేస్తున్నానని తెలుపడంతో పోలీసులు అవాక్కయ్యారు. అతడి వాహననంబర్ ప్లేటు తొలగించి సదరు వ్యక్తితో జరిమానా కట్టించారు. గతంలో కూడా ఇలాంటి సంఘటన బసంత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని రాణాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి జరిగింది. కరీంనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ట్రాఫిక్రూల్స్ అతిక్రమించినందుకు జరిమానా విధించినట్లు అతడి సెల్కు మేసేజ్ వెళ్లింది. ఈవిధంగా నాలుగైదు సార్లు రావడంతో సంబంధిత వివరాలు పరిశీలించిన వ్యక్తికి అతడి వాహన నెంబర్తో కలిగిన మరో వాహనం ఫొటో కనిపించడంతో అవాక్కయ్యారు. ప్రస్తుతం ట్రాఫిక్ నిబంధనల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో కొంతమంది ఆకతాయిలు ఇలాంటి చర్యలకు పాల్పడుతుండడం అటు పోలీసులను, అసలు వాహనదారులను ఆందోళనకు గురిచేస్తోంది. -
పండుగపూట ఫాస్టాగ్ పరేషాన్
‘సంక్రాంతి పండుగకు సొంత కారులో ఊరు వెళ్తున్నారా..? అయితే ఫాస్టాగ్ తీసుకోవడం మాత్రం మరవకండి. అది లేకుంటే పండుగ వేళ టోల్ ప్లాజాల వద్ద పడిగాపులు కాయాల్సి రావచ్చు. టోల్ గేట్ల వద్ద రుసుము చెల్లించేందుకు గంటల తరబడి క్యూలో ఎదురు చూడాల్సిన దుస్థితి ఎదురుకావచ్చు. పండుగ వేళ ప్రశాంతంగా ఊరెళ్దామని బయలుదేరితే, ఆ రద్దీలో చిక్కుకుని మీ సహనానికి పరీక్ష పెట్టుకుని పరేషాన్ అయ్యే పరిస్థితి రావొచ్చు’ సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి రద్దీ టెన్షన్ ఎన్హెచ్ఏఐ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. సంక్రాంతి వేళ హైదరాబాద్ నుంచి లక్షల మంది సొంతూళ్లకు వెళ్లనుండటంతో వేల సంఖ్యలో వాహనాలు రోడ్డెక్కను న్నాయి. ఫాస్టాగ్ లేని వాహనాల కోసం తక్కువ గేట్లు ఉండటం.. టోల్ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర క్యూలు ఏర్పడే పరిస్థితి రానుండటంతో అధికారులు ఆగమేఘాల మీద పరిస్థితిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న 10 రోజుల్లో వాహనదారులు ఎక్కువ మంది ఫాస్టాగ్లు తీసుకుంటేనే పరిస్థితి సాఫీగా ఉండనుంది. లేని పక్షంలో రోడ్లపై ప్రత్యక్ష నరకం కనిపించటం ఖాయం. ఫాస్టాగ్ విధానం వచ్చిన తొలి వారంలో వాహనాలు బారులుగా ఏర్పడి, టోల్ రుసుము చెల్లించేందుకు గంటల సమయం ఎదురు చూడాల్సి వచ్చింది. అలాంటిది ఒకేసారి వేల సంఖ్యలో వాహనాలు రోడ్డెక్కే సంక్రాంతి వేళ పరిస్థితి పూర్తిగా అదుపు తప్పనుంది. పండుగకు క్యాష్ లేన్ ఒకటే.. ప్రస్తుత విధానాన్ని పొడిగించని పక్షంలో 14వ తేదీ తర్వాత ఒక్క(ఇరువైపులా ఒక్కొక్కటి) లేన్ మాత్రమే క్యాష్ చెల్లింపు విధానానికి వదలనున్నారు. మిగతావన్నీ ఫాస్టాగ్ లేన్లుగా మారనున్నాయి. దీంతో ఎన్హెచ్ఏఐ అధికారులు వీలైనన్ని ఫాస్టాగ్లు విక్రయించేందుకు చర్యలు తీసుకున్నారు. 50 శాతానికి ట్యాగ్లు.. ఫాస్టాగ్ విధానం వచ్చి నెల గడిచినప్పటికీ టోల్ ప్లాజాల గుండా వెళ్తున్న వాహనాల్లో 45 నుంచి 47 శాతం వాహనాలు మాత్రమే ఫాస్టాగ్ గేట్ల నుంచి వెళ్లటం విశేషం. అయితే తొలిసారి వాటి సంఖ్య 50 శాతానికి చేరుకుంది. గురువారం రాష్ట్రంలోని జాతీయ రహదారులపై 17 చోట్ల ఉన్న టోల్ ప్లాజాలను పరిశీలిస్తే 50.50 శాతం వాహనాలు ఫాస్టాగ్ లేన్ల నుంచి దూసుకెళ్లినట్టు నమోదైంది. టోల్ కలెక్షన్లలో 61 శాతం వీటి నుంచే వసూలైంది. సంక్రాంతి నాటికి ఇది ట్యాగ్ వాహనాల సంఖ్య 75 శాతానికి చేర్చాలని అధికారులకు ఎన్హెచ్ఏఐ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్ లక్ష్యంగా నిర్దేశించారు. ఈ మేరకు అధికారులు, బ్యాంకర్లతో గురువారం ఆయన ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గురువారం నాటికి కేవలం 84 వేల ట్యాగ్లు మాత్రమే అమ్ముడయ్యాయి. సంక్రాంతికి ఊళ్లకు వెళ్లే వాహనదారులు వెంటనే మేల్కొనకపోతే పండగ సమయంలో టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్లో చిక్కుకుని ఇబ్బంది పడాల్సి వస్తుందంటూ ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. అధికమైన ఆదాయం.. ఫాస్టాగ్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా టోల్ ఆదాయం భారీగా పెరిగింది. అక్టోబర్లో జాతీయ రహదారులపై ఉన్న 17 టోల్ప్లాజాల ద్వారా టోల్ రుసుము రూపంలో రూ.85.96 కోట్లు వసూలు కాగా, డిసెంబర్లో ఆ మొత్తం రూ.90.51 కోట్లుగా నమోదైంది. అంటే దాదాపు రూ.4.50 కోట్ల మేర ఆదాయం పెరిగింది. అన్ని వాహనాలు ట్యాగ్లు ఏర్పాటు చేసుకుంటే రూ.10 కోట్లకుపైగా అదనపు ఆదాయం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. భారీగా టెండర్లు.. టోల్ గేట్ల ఆదాయం ఎంత పెరిగితే.. తదుపరి టెండర్లలో మూల విలువను అంతమేర పెంచనున్నారు. రాష్ట్రంలోని 17 టోల్ప్లాజాల్లో 9 చోట్ల ఆన్యుటీ విధానం అమలులో ఉంది. అంటే అక్కడ వసూలయ్యే టోల్ మొత్తాన్ని అంచనాగా వేసుకుని దాన్ని బేస్ వ్యాల్యూగా నిర్ధారించి టెండర్లు పిలుస్తారు. టెండర్ దక్కించుకున్న సంస్థ దాన్ని మించి కోట్ చేస్తుంది. ఆ మొత్తాన్ని ఎన్హెచ్ఏఐకి చెల్లించి టోల్ వసూలు చేసుకుంటుంది. ఇప్పుడు ఫాస్టాగ్ వల్ల టోల్ కలెక్షన్లు భారీగా పెరుగుతుండటంతో తదుపరి టెండర్ల్లో భారీ మొత్తాలు నమోదు కానున్నాయి. -
చలానా.. కోట్లు..సాలీనా!
మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్, ఓవర్స్పీడ్ డ్రైవింగ్... ఏదైతేనేమి ఏటా వాహనదారులు వందల కోట్ల రూపాయలు జరిమానాలు చెల్లిస్తున్నారు. అయినా వారిలో మార్పు రావడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఏ జిల్లా చూసినా ట్రాఫిక్ చలాన్ల మోత మోగిపోతోంది. చలాన్లలో ఓవర్స్పీడ్, హెల్మెట్లేని డ్రైవింగ్లే అధికం. నిబంధనలు పాటించని వాహనదారులు రూ.కోట్లు చలాన్లు కడుతున్నారు. ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు గణాంకాలను పరిశీలిస్తే... ఒక్క రంగారెడ్డి జిల్లా నుంచి ఖజానాకు రూ.88 కోట్ల ఆదాయం వచ్చింది. నల్లగొండ నుంచి అత్యల్పంగా రూ.4 కోట్లు వసూలయ్యాయి. ఇక కేసుల విషయానికొస్తే.. రంగారెడ్డి జిల్లా నుంచి ఎక్కువ నమోదు కాగా, ఆదిలాబాద్ నుంచి తక్కువ నమోదయ్యాయి. చలాన్లకు కొత్త చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో టౌన్ స్కాన్... – సాక్షి, నెట్వర్క్ -
మన చలానాలూ.. సదుపాయాలూ తక్కువే
భువనేశ్వర్లో ఓ ఆటో డ్రైవర్కి ట్రాఫిక్ పోలీసులు రూ.45వేలు జరిమానా విధించారు. రోజుకు రూ.500 కిరాయి చెల్లించి నడుపుకుంటున్న ఆటోకి, అంత చలానా ఎక్కడి నుంచి తేవాలంటూ బోరుమన్నాడు. ఢిల్లీలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడని ఓ వాహనదారుడికి రూ.25 వేల జరిమానా పడింది. రూ.13 వేలు పెట్టి సెకండ్ హ్యాండ్లో కొన్న బైకుకు అంత జరిమానా చెల్లించలేనంటూ పోలీసుల వద్దే దాన్ని వదిలిపోయాడు. – సాక్షి, హైదరాబాద్ మోటారు వాహన సవరణ చట్టం– 2019 ప్రస్తుతం తెలంగాణలో అమలు కాకున్నా.. వాహన దారులను మాత్రం బెం బేలెత్తిస్తోంది. అమలులో జాప్యం ఉండ వచ్చు గానీ, అమలు మాత్రం ఖాయమన్న సంగతిని వాహనదారులకు పోలీసులు ప్రచారం ద్వారా తెలియజేస్తూనే ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కమిషనరేట్లు, జిల్లాల పరిధిలో ఇప్పటికే భారీ జరిమా నాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. కానీ, పోలీసులు చెబుతున్న ట్రాఫిక్ జరిమానాలు చాలా మంది నెల వేతనం కంటే అధికంగా ఉండటంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఇక నిజంగానే ఫైన్ కట్టాల్సి వస్తే తమ గతేం కాను అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా డ్రైవింగ్ వృత్తిగా జీవించే ఆటో, క్యాబ్, బస్సు, లారీ డ్రైవర్లు తీవ్ర మథన పడిపోతున్నారు. వీరిలో చాలా మంది బండ్లను ఫైనాన్స్లో తీసుకుని నెల వాయిదాలు కట్టుకుంటున్నారు. కొత్త జరిమానాలు అమలులోకి వస్తే.. తమ ఆదాయం, ఫైనాన్స్ వాయిదాలకంటే అవే అధికంగా ఉంటే తమ బతుకులు రోడ్డు పాలు అవుతాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చాలామంది డ్రైవర్ల కనీస వేతనం రూ.8,000 నుంచి రూ.15 వేల వరకు ఉంది. ఇక నెలలో రెండు ఫైన్లు పడితే రూ.10 వేలు జేబుకు చిల్లు పడుతుం దని వారు ఆందోళన చెందుతున్నారు. ఇలా అయితే ఓనర్లు తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తారని వారు అంటున్నారు. ఫైనాన్స్లో కొని సొంతంగా నడుపుకునే ఆటో, క్యాబ్లలో నెల కిస్తీ రూ.8000 నుంచి రూ.13,500 నుంచి మొదలవుతాయి. రోడ్డు, పార్కింగ్ సదుపాయాలు మెరుగు పరచకుండా ఇష్టానుసారంగా ఫైన్లు విధించడం సబబు కాదంటున్నారు. పోలీసులపై మండిపడుతున్న నెటిజన్లు.. ప్రమాదాల నివారణలో భాగంగా చలానాలు విధించడాన్ని తప్పుబట్టడం లేదు. కానీ, సామాన్యుడి నడ్డి విరిచేలా ఉన్న చలాన్లపై పునరాలోచించుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. అదే సమయంలో చలానాలు విదేశాలతో పోలిస్తే.. మన వద్దే తక్కువ అయితే సంతోషమే. కానీ, ఆయా దేశాల్లో ఉన్నంత అక్షరాస్యత, విశాలమైన, నాణ్యమైన రోడ్లు, మెరుగైన వైద్య సదుపాయాలు, ప్రమాద స్థలానికి నిమిషాల్లో చేరుకోగలిగే హెలికాప్టర్ అంబులెన్సులు, గోల్డెన్ అవర్ ట్రీట్మెంట్లు, ఉచిత వైద్యం తదితర సదు పాయాలు ఇక్కడా ఉండాలి కదా మరి? అని వారు ప్రశ్నిస్తున్నారు. -
భారీ పెనాల్టీల అమలులో జాప్యం?
సాక్షి, హైదరాబాద్: రోడ్డు రవాణా నిబంధనలు అతిక్రమిస్తే అతి భారీ పెనాల్టీలు విధించేందుకు కేంద్రం రంగం సిద్ధం చేయడంతో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వాహనదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న పెనాల్టీలను ఏకంగా పది రెట్లు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసిన విషయం తెలిసిందే. సెపె్టంబర్ ఒకటి నుంచి కొత్త పెనాల్టీలు అమలులోకి రావాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పునరాలోచనలో పడింది. ఒకేసారి ఏకంగా పది రెట్లకు పెనాల్టీలు పెంచటం సబబు కాదన్న అభిప్రాయంతో ఉంది. ఆదివారం నుంచే అమలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా ఉత్తర్వు జారీ చేయాల్సి ఉంటుంది. కానీ శనివారం రాత్రి వరకు ఉత్తర్వు విడుదల కాలేదు. శనివారం సాయంత్రం రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్శర్మ రవాణా శాఖ అధికారులతో భేటీ అయ్యారు. కొత్త పెనాల్టీల సర్క్యులర్ను అధికారులు ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా అతి భారీ పెనాల్టీల పర్యవసానాలపై వారు చర్చించారు. సమావేశం నుంచే ఆయన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల అధికారులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్ట సవరణలోని అంశాలకు కొన్ని సవరణలు కోరుతూ కేంద్రానికి ప్రతిపాదన పంపాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని సునీల్శర్మ రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. వెరసి ఆదివారం నుంచి ఇవి అమలులోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. -
కార్డు స్కాన్ చేస్తేనే బండి స్టార్ట్
సిరిసిల్ల: ఓ ఐడియా బైక్లకు భద్రతను తెచ్చిపెట్టింది. వాహనానికి తాళం వేసి ఉంటే చాలు.. ఏదో ఒక కీతో ఆన్చేసి చోరీ చేసే రోజులివి. బైక్లు, స్కూటీలు, కార్లు సైతం దొంగల బారిన పడకుండా ఉండాలనే లక్ష్యంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు ఆర్సీకార్డు, లేదా డ్రైవింగ్ లైసెన్స్ల్లో ఏదో ఒక కార్డుతో స్కాన్ చేస్తేనే వాహనం స్టార్ట్ అయ్యేలా డివైస్ను రూపొందించాడు. జిల్లా కేంద్రంలోని పద్మనగర్కు చెందిన బుధవారపు మల్లేశం తన బైక్ ఆక్టివాకు ఆర్సీ కార్డు నంబరును స్కాన్ చేశాడు. రేడియో ఫీక్వెన్సీ స్కానర్, మైక్రో కంట్రోల్ ఐసీని ద్విచక్రవాహనానికి అమర్చాడు. వాహనం బ్యాటరీ సాయంతో అది పని చేస్తోంది. బండికి కీస్పెట్టి, ఆర్సీ కార్డు, లేదా లైసెన్స్ కార్డును ఏదో ఒకదానిని స్కాన్ చేస్తేనే బండి ఆన్ అవుతుంది. కార్డు స్కాన్ కాకుండా.. కీస్ ఉన్నా బండి ఇంజిన్ ఆన్ కాదు. ఈ తరహా రేడియో ప్రీక్వెన్సీ డివైస్ను బైక్, కారు, లారీ, బస్సు లాంటి ఇతర వాహనాలకు ఏర్పాటు చేసుకోవచ్చు. బీటెక్ ఈసీఈ చదివిన మల్లేశం కేవలం రూ.1,500 ఖర్చుతో డివైస్ను రూపొందించాడు. ఎవరైనా వాహనదారులు కావాలనుకుంటే లాభాపేక్ష లేకుండా బైక్లు, కార్లకు దీనిని అమర్చుతానని మల్లేశం తెలిపాడు. ఆసక్తి గలవారు 63024 72700 సెల్ నంబరులో సంప్రదించండి. -
ముంబై.. ఇదేం ట్రాఫిక్రా బై..
వాహనదారులు అత్యధికంగా ట్రాఫిక్ జామ్ బారిన పడుతున్న నగరాల్లో ముంబై ప్రపంచంలోనే మొదటిస్థానంలో నిలిచింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై ప్రజానీకం సాధారణ సమయాల్లో కంటే పీక్ అవర్స్లో 65 శాతం కంటే అధికంగా తమ విలువైన సమయాన్ని రోడ్డు పాల్జేసుకుంటున్నట్టు 2018 టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ అధ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ట్రాఫిక్ జామ్స్తో, వాహనరద్దీతో విలవిల్లాడుతోన్న నగరాల్లో కొలంబియా, పెరూ, మాస్కో లాంటి మహానగరాలు కూడా ఉండటం గమనార్హం. అయితే ప్రపంచంలోని అన్ని దేశాల్లోని నగరాలకంటే కూడా మన దేశంలోని ముంబై నగర ప్రజలు తీవ్రమైన ట్రాఫిక్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నట్టు తేలింది. బొగోటా, కొలంబియాల్లో వాహనాల రద్దీ 63 శాతంగానూ, లిమా, పెరూల్లో రద్దీ తీవ్రత 58 శాతంగానూ ఉంటే, న్యూఢిల్లీ 58 శాతం రద్దీతో ప్రపంచంలోనే ట్రాఫిక్ జామ్ తీవ్రతలో టాప్–5లో స్థానం సంపాదించింది. పై నాలుగు నగరాలు కూడా అభివృద్ధి చెందుతోన్న దేశాల్లోనివే కావడం గమనించాల్సిన విషయం. ఇక 56శాతం వాహనరద్దీతో ముప్పుతిప్పలు పడుతూ ఐదో స్థానంలో ఉన్న మాస్కో.. అభివృద్ధి చెందిన దేశాలకంటే కూడా అనేక ప్రమాణాల్లో వెనుకబడి ఉన్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. పదేళ్ల అధ్యయనం.. ప్రపంచవ్యాప్తంగా 400 నగరాల్లో ట్రాఫిక్ రద్దీని జీపీఎస్ ఆధారంగా అధ్యయనం చేసిన ఈ సంస్థ ముంబై మహానగరాన్ని ‘అత్యధిక వాహన రద్దీ ఉన్న నగరం’గా తేల్చింది. అయితే 8 లక్షల జనాభాకు పైబడిన నగరాలనే ఈ అధ్యయనంలో భాగస్వామ్యం చేశారు. వాహనాల రద్దీపై గత పదేళ్లుగా అధ్యయనం చేస్తోన్న ఈ సంస్థ తొలిసారిగా భారతదేశంలోని వాహన రద్దీ స్థాయిని అంచనా వేసింది. ఆనందించాలా.. బాధపడాలా..! ప్రపంచవ్యాప్తంగా ట్రాఫిక్ రద్దీ తీవ్రత పెరుగుతోందని టామ్ టామ్ అధ్యయన సంస్థకి చెందిన ప్రముఖుడు రాల్ఫ్ పీటర్ చెప్పారు. అయితే ఇది ఒకరకంగా ఆనందించాల్సిన విషయమూ, మరో రకంగా బాధపడాల్సిన విషయమూ అని ఆయన అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా బలోపేతమౌతోన్న ఆర్థిక వ్యవస్థను ఇది సూచిస్తోంటే, ట్రాఫిక్ జామ్ కారణంగా విలువైన సమయాన్ని కోల్పోతుండటం బాధాకరమని వ్యాఖ్యానించారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్పై దృష్టి పెట్టాలి.. దురదృష్టవశాత్తూ ప్రపంచమంతా కార్ల చుట్టూనే తిరుగుతోంది. అలాగే కార్ల కొనుగోలు, వాడకానికి సంబంధించిన నియమ నిబంధనలేవీ లేకపోవడం కూడా నష్టం చేకూరుస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ని తగ్గించాల్సిన ఆవశ్యకతను చాటిచెప్పడం సుస్థిర పరిష్కారాలను సూచించగలుగుతుందని టామ్ టామ్ ఇండియా జనరల్ మేనేజర్ బార్బరా బేల్పెయిర్ అభిప్రాయపడుతున్నారు. -
శకటమా.. వీరంతా క్షేమమా..?!
బాపట్లటౌన్: రవాణాశాఖాధికారులు పట్టించుకోకపోవడంతో కొందరు వాహన చోదకులు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వాహనాలను ఉరుకులు పరుగులు పెట్టిస్తూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తత్ఫలితంగా ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు అధికమయ్యాయి. మైనర్లు, లైసెన్స్ లేని వారు వాహనాలు నడుపుతున్నా నియంత్రించడంలో రవాణా, పోలీస్ శాఖలు విఫలమయ్యాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆటోలు, ట్రాక్టర్లలో పరిమితికి మించి మరీ ప్రయాణికులను ఎక్కిస్తూ వాహనాలను నడుపుతున్నారు. ప్రయాణికులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సివస్తోంది. దీంతో అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే ఎంతో విలువైన ప్రాణాలు కోల్పోవడం ఖాయం. పరిమితిని మించిన ప్రయాణాలు అరికడితే ప్రమాదాలను చాలావరకు నియంత్రించవచ్చు. అవగాహన సదస్సులు సరే...ఆచరణేది? ఇటీవల నిర్వహించిన రహదారి భద్రతా వారోత్సవాల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లైసెన్స్లు పొందిన తర్వాతే వాహనాలు నడపాలని, పాఠశాల బస్సులు నడిపే డ్రైవర్లు నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, అధికలోడుతో వాహనాలు నడిపితే సీజ్ చేస్తాం అని చెప్పిన అధికారులు ఆ తర్వాత వాటి గురించి పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడిపే వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. డ్రైవింగ్ పూర్తిగా రాని వారికి కూడా అధికారులు లైసెన్స్లు ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు అధికారులు అక్కడకు చేరుకుని హడావుడి చేయటం తప్ప తగు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. మైనార్టీ తీరని వారు కూడా వాయువేగంగా బైక్లపై దూసుకెళ్తున్నారు. ట్రిపుల్ రైడింగ్ కూడా రోడ్లపై కనిపిస్తూనే ఉంది. చర్యలు తీసుకోవాల్సిన మోటారు వాహనాల తనిఖీ అధికారులు, పోలీస్ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆటోవాలాలు, ట్రాక్టర్ల వాళ్లు సామారŠాధ్యనికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆటోలో వెనుక డోర్పై నిలబడి ప్రయాణిస్తున్నప్రజలు గజిబిజిగా నంబర్ ప్లేట్లు ద్విచక్ర వాహనాలపై నంబర్ ప్లేట్లు ఎవరికిష్టమొచ్చినట్లు వారు వేయించడం వలన ఆ బండి నంబర్ చూసేవారికి అర్ధం కావడం లేదు. మరికొంత మంది నంబర్పై ఉన్న మోజుతో కొన్ని నంబర్లు పెద్దవిగానూ, మరికొన్ని నంబర్లు చిన్నవిగా వేస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు చూసే వారిని తప్పుదోవ పట్టిస్తున్నారు. దీని వలన రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాల వారు నంబర్ను సరిగా గుర్తించని కారణంగా బీమా రాని సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇంకొందరు నంబర్ప్లేట్లపై సినీహీరోల బొమ్మలు వేసి, నంబర్ను చిన్నగా రాయిస్తున్నారు. ఈ విషయాలు రవాణా, పోలీస్ శాఖాధికారులకు తెలియంది కాదు. అయితే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోవడం వలనే అనర్ధాలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. త్వరలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న వాహన చోదకులపై చర్యలు తీసుకుంటూనే ఉన్నాం. గత 20 రోజుల వ్యవధిలో సుమారు 70 వాహనాలను సీజ్ చేశాం. త్వరలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అన్ని ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించి వాహనచోదకులపై చర్యలు తీసుకుంటాం. – జి.రామచంద్రరావు, ఎంవీఐ కేసులు నమోదుచేసి కోర్టుకు పెడుతున్నాం లైసెన్స్ లేకుండా, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుం టున్న వాహనచోదకులపై కేసులు నమోదుచేసి కోర్టుకు పెడుతున్నాం. ఆటోడ్రైవర్లకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని ముమ్మరం చేసి ప్రమాదాలను నివారించేందుకు కృషిచేస్తాం. – జి.రవికృష్ణ, ఎస్ఐ -
మొక్క నాటు.. లైసెన్స్ తీసుకో!
సాక్షి,హైదరాబాద్: వాహనదారుల్లో పర్యావరణ పరిరక్షణను పెంపొందించేందుకు రవాణాశాఖ దృష్టి సారిం చింది. దీనిలో భాగంగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం వచ్చే వారిని ఇంటిదగ్గర ఓ మొక్క నాటి రావాలని కోరుతోంది. వాహనం కొనుగోలు చేసేవారినైతే రెండు మొక్కలు నాటాలని సూచిస్తోంది. వివిధ రకాల పౌరసేవల కోసం ఆర్టీ ఏ కేంద్రాలకు వచ్చేవారిని మొక్కలు నాటేలా ప్రోత్సహించేందుకు రవాణాశాఖ మంగళవారం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన హరితహారంలో జేటీసీ పాండురంగ నాయక్, ఆర్టీవో రమేశ్ మొక్కలు నాటడంతో పాటుగా 200 మంది వాహనదారులకు మొక్కలు పంపిణీ చేశారు. డ్రైవింగ్ లైసెన్సుకు గుర్తుగా ఓ మొక్కను నాటాలని పాండురంగ నాయక్ కోరారు. -
హైటెక్ నంబర్ ప్లేట్ ఉండాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (హెచ్ఎస్ఆర్పీ) లేకుండా తిరిగే వాహనాలపై కొరడా ఝళిపించేందుకు రవాణా శాఖ సన్నద్ధమైంది. ఆర్టీఏలో కొత్తగా వాహనం నమోదైనప్పటికీ చాలామంది వాహనదారులు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లకు బదులు సాధారణ నంబర్ ప్లేట్లనే వినియోగిస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 వేల వాహనాల హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు పెండింగ్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో 2013 డిసెంబర్ తర్వాత రిజిస్టర్ అయిన వాహనాలు తప్పకుండా హైటెక్ నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాలని.. లేకుంటే ఆయా వాహనాలకు సేవలన్నింటినీ నిలిపి వేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. శనివారం రవాణా కమిషనర్ ప్రధాన కార్యాలయంలో సంయుక్త రవాణా కమిషనర్ పాండురంగ్ నాయక్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ మేర కు నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి ఒకటి నుంచే ఇది అమల్లోకి రానుంది. దీంతో హైటెక్ నంబర్ ప్లేట్లు లేని వాహనాల యాజమాన్య బదిలీ, చిరునామా బదిలీ, హైపతికేషన్, పన్ను చెల్లింపులు, పర్మిట్లు వంటి అన్ని రకాల పౌరసేవలు నిలిచిపోనున్నాయి. 2013లో అమల్లోకి.. వాహనాల భద్రత దృష్ట్యా సుప్రీంకోర్టు హెచ్ఎస్ఆర్పీని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 2013 డిసెంబర్లో ఉమ్మడి రాష్ట్రంలో ఇది అమల్లోకి వచ్చింది. అప్పట్లో రవాణా కార్యాలయంలో నమోదైన ప్రతి వాహనం విధిగా హెచ్ఎస్ఆర్పీ బిగించుకోవాలని నిబంధన విధించారు. అయితే హెచ్ఎస్ఆర్పీ ప్లేట్ల కొరత వల్ల ఈ నిబంధన సరిగా అమలు కాలేదు. దీంతో ఈ స్కీమ్ను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు రవాణా శాఖ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త విధానం మేరకు వాహనం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారం, పది రోజుల్లో హెచ్ఎస్ఆర్పీ బిగించుకోవాలి. అలా ఉన్న వాటికే అన్నిరకాల పౌరసేవలు వర్తిస్తాయి. లేకుంటే బ్యాంకు రుణాలపై కొనుగోలు చేసిన వాహనాల హైపతికేషన్ రద్దు, రవాణా రంగానికి చెందిన వాహనాలకు ప్రతి సంవత్సరం ఇచ్చే పర్మిట్లు, త్రైమాసిక పన్ను చెల్లింపులు, వాహనం ఒక చోట నుంచి మరో చోటకు బదిలీ చేయడం, చిరునామా, యాజమాన్య బదిలీ వంటి సేవలు నిలిచిపోనున్నాయి. ఆదివారం సైతం సేవలు... హెచ్ఎస్ఆర్పీ అమలులోని జాప్యాన్ని నివారించేందుకు ఇకనుంచి ఆదివారం కూడా నంబర్ ప్లేట్లను బిగించనున్నట్లు జేటీసీ పాండురంగ్ నాయక్ తెలిపారు. ప్రతి ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సదుపాయం ఉంటుందన్నారు. హెచ్ఎస్ఆర్పీ ఏజెన్సీ నుంచి ఎస్సెమ్మెస్ అందుకున్న వాహనదారులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని చెప్పారు. మొదట ఖైరతాబాద్ ఆర్టీఏలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని, ఆ తరువాత హైదరాబాద్లో పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చి దశలవారీగా రాష్ట్రమంతటా ఆదివారం సేవలను విస్తరిస్తామని ఆయన వివరించారు. హెచ్ఎస్ఆర్పీ నిబంధనను ఉల్లంఘించే వాహనాలపై భవిష్యత్తులో దాడులు చేసి కేసులు నమోదు చేసేందుకు కూడా వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. -
‘సిక్స్’కు ఫిక్స్
అదృష్ట సంఖ్యలుగా భావించే వాహనాల ఫ్యాన్సీ నంబర్లపై సిటీలో క్రేజ్ పెరుగుతోంది. ఇటీవల సిక్స్ సిరీస్ నంబర్లకు మరింత డిమాండ్ ఎక్కువైంది. కోట్లాది రూపాయల విలువైన హైఎండ్ కార్లు కొనుగోలు చేయడంతోపాటు తమ హోదాను ప్రతిబింబించే విధంగా వాహనదారులు లక్కీ నంబర్లను ఎంపిక చేసుకుంటున్నారు. ఒక్క ఆల్నైన్స్, ఆల్ సిక్స్లే కాకుండా తమకు నచ్చిన ఇతర నంబర్ల కోసమూ రూ.లక్షలు చెల్లిస్తున్నారు. ఖరీదైన కార్లకే కాదు, బైక్ల నంబర్ల కోసం కూడా వాహనదారులు పోటీకి దిగుతున్నారు. కొందరు బర్త్డే గిఫ్ట్లుగా వీటిని బంధువులు, మిత్రులకు ఇస్తున్నారు. ఫ్యాన్సీ రూపంలో ఏటా రవాణాశాఖకు సుమారు రూ.50 కోట్ల ఆదాయం లభిస్తోందంటే పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సాక్షి, సిటీబ్యూరో: ‘టీఎస్ 09 ఈడబ్ల్యూ 0999’ నెంబర్కు ఆర్టీఏ నిర్ణయించిన ఫీజు రూ.50 వేలు. వేలంలో ఈ నంబర్ కోసం పోటీపడిన ఓ వాహనదారుడు ఏకంగా రూ.9.30 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నాడు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ‘టీఎస్ 09 ఈడబ్ల్యూ 6666’ నంబర్కు రూ.8.67 లక్షల ఆదాయం లభించింది. వాహనదారులు క్రేజ్గా భావించే మరో నంబర్ ‘టీఎస్ ఈడబ్ల్యూ 1234’ కోసం ఒక వాహనదారుడు రూ.4.50 లక్షలు వేలంలో చెల్లించాడు. టీఎస్ 09 ఈడబ్ల్యూ 5555’ నంబర్కు రూ.2.71 లక్షల డిమాండ్ వాహనదారులు ఎక్కువగా కోరుకొనే మరో నంబర్ ‘టీఎస్ 09 ఈడబ్ల్యూ 2345’ పైన రూ.2.15 లక్షల ఆదాయం లభించింది. గత నెల రోజుల్లోనే వాహనాల నంబర్ల పైన నిర్వహించిన వేలంపాటల్లో ఖైరతాబాద్ ఆర్టీఏకు ఏకంగా రూ.1.37 కోట్ల ఆదాయం లభించింది. అదృష్టసంఖ్యలుగా భావించే వాహనాల ఫ్యాన్సీ నంబర్లపై నగరవాసులకు మోజు పెరుగుతోంది. తమకిష్టమైన నంబర్లకు ఎన్ని లక్షల రూపాయలైనా చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. ఒక్క ఆల్నైన్స్, ఆల్ సిక్స్ వంటి నంబర్లే కాదు..ఇతరత్రా అదృష్ట సంఖ్యలకూ డిమాండ్ పెరుగుతోంది. ఫ్యాన్సీ నంబర్ల వేలంలో ఏటా రవాణా శాఖకు సుమారు రూ.50 కోట్ల ఆదాయం లభిస్తోంది. వాహనదారులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ‘9’ అంకెతో మొదలయ్యే ఖైరతాబాద్ కార్యాలయంలోనే గతేడాది రూ.15 కోట్లకు పైగా ఆదయం లభించగా, ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.20 కోట్ల వరకు ఉండవచ్చునని అంచనా. ఖైరతాబాద్తో పాటు మేడ్చల్, అత్తాపూర్, ఇబ్రహీంపట్నం, ఉప్పల్, మెహదీపట్నం వంటి అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లోనూ ప్రత్యేక నంబర్లకు క్రేజ్ పెరుగుతోంది. ‘ఆల్ సిక్స్’ ఆల్ టైమ్ రికార్డు... ఇటీవల ఖైరతాబాద్ ఆర్టీఏలో నిర్వహించిన వేలం పాటల్లో ఆల్సిక్స్ నంబర్ కోసం ఓ వాహనదారుడు ఏకంగా రూ.8.67 లక్షలు వేలంలో చెల్లించాడు. దీని కోసం ఏడుగురు పోటీకి దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్కు ఇదే నంబర్ ఉండడం, ఆయనకు ఈ నంబర్ అంటే ఎంతో ఇష్టం కావడంతో సహజంగా నగరవాసుల్లోనూ సిక్స్పై మక్కువ ఏర్పడింది. హోదా కోసం... అదృష్ట సంఖ్యలుగా భావించి కొందరు పోటీకి దిగుతుండగా, హోదా, పేరు ప్రతిష్టల కోసం మరికొందరు ఫ్యాన్సీ నంబర్లను దక్కించుకుంటున్నారు. ఉద్యోగం, వ్యాపారం, సినిమాలు, రాజకీయాలు, పరిశ్రమలు వంటి విభిన్నరంగాలకు చెందిన వాహన యజమానులు ‘లక్కీ’ నంబర్ల కోసం రూ.లక్షలు వెచ్చిస్తున్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఆర్టీఏలో కొత్త సీరిస్ ప్రారంభమవుతుంది. మొత్తం నంబర్లలో 2500 వరకు ఫ్యాన్సీ నంబర్లు ఉంటాయి. వీటి కోసం వేలాది మంది పోటీపడుతున్నారు. ఒక్కో నంబర్కు సగటున 5 నుంచి 10 మంది వాహన యజమానులు పోటీకి వస్తుండగా, నచ్చినవి లభించని వాళ్లు నెలల తరబడి వేచి ఉంటున్నారు. అదృష్టం కోసం... కేవలం ఫ్యాన్సీ కోసం కాకుండా కొన్ని నంబర్ల వల్ల అదృష్టం బాగా కలిసి వస్తుందనే నమ్మకం కూడా ఈ క్రేజ్కు కారణం. జ్యోతిష్యులు ఒక్కొక్క నంబర్ను ఒక గ్రహంతో, వాటి కదలికలతో అంచనా వేసి భవిష్యత్తును, మానసిక స్వభావాలను నిర్ధారిస్తారు. అలా తమ స్వభావానికి తగిన నంబర్లను వాహనదారులు ఎంపిక చేసుకుంటున్నారు. ఆ రకంగా 1,2,3,4,5,6,7,8,9 వంటి ప్రతి సింగిల్ నంబర్కు ఒక లక్షణం ఉంటుంది. ఉదాహరణకు ‘1’ నాయకత్వానికి, ‘2’ శాంతస్వభావానాకి నిదర్శనం. గురుగ్రహంతో పోల్చే ‘3’ వల్ల చక్కటి తెలివి తేటలు, జ్ఞానం లభిస్తాయని నమ్మకం. ‘5’ను బుధుడికి ప్రతిబింబంగా భావిస్తారు. ఈ నంబర్ వల్ల వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుందనే నమ్మకం. ఇక ప్రతి ఒక్కరు ఇష్టపడే నంబర్ ‘9’ కుజగ్రహానికి ప్రతీకగా భావిస్తారు. జీవితంలో విజేతలుగా, తిరుగులేని నాయకులుగా ఎదగాలని కోరుకునేవాళ్లు, పోటీ మనస్తత్వం, పోరాడే తత్వం ఉన్నవాళ్లు ఈ నంబర్ను ఇష్టపడతారు. 1980 నుంచే.... సిటీలో 1980 నుంచే ఫ్యాన్సీ నంబర్లపై వాహనదారుల్లో మక్కువ ఉంది. ‘9999’ వంటి నంబర్లు అప్పట్లో కేవలం రూ.500కు లభించేవి. ఎలాంటి పోటీ ఉండేది కాదు. రాజకీయరంగ ప్రవేశం చేసిన ఎన్టీరామారావు వంటి ప్రముఖులు తమ వాహనాలకు నచ్చిన నంబర్లను ఏర్పాటు చేసుకోవడంతో ఈ క్రేజ్ మొదలైంది. అప్పట్లో ఎన్టీరామారావు ‘ 27’, 999’, ‘9999’ వంటి నంబర్లకు ప్రాధాన్యతనిచ్చేవారు. బర్త్డే గిఫ్టుల్లా ఇస్తున్నారు... ఇటీవల కాలంలో చాలామంది వినియోగదారులు తమ కుటుంబ సభ్యులకు వాహనాలను బహుమానంగా అందజేయడమే కాదు...వారి పుట్టిన రోజు కలిసొచ్చేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబర్లను ఎంపిక చేసుకొని పోటీకి వస్తున్నారు. ‘1313’(తేరా తేరా) అంటే పంజాబీలకు ఎంతో ఇష్టం. దీనిని వాళ్లు అదృష్ట సంఖ్యగా భావిస్తారు. ‘5121’ అనే నంబర్ను ఆంగ్ల అక్షరాల్లో ‘సిరి’గా భావిస్తారు.‘143’, ‘214’, ‘8045’ వంటి నంబర్లకూ ఎంతో క్రేజ్ ఉంది. ఏటా క్రేజ్ పెరుగుతోంది గత రెండేళ్లుగా ఫ్యాన్సీ నంబర్లపై అనూహ్యమైన క్రేజ్ కనిపిస్తోంది. ఖైరతాబాద్ కార్యాలయంలో అత్యధిక డిమాండ్ ఉంటోంది. వేలంలో ఈ నెలలోనే ఇక్కడ రూ.కోటికి పైగా ఆదాయం లభించడం ఇందుకు నిదర్శనం. లగ్జరీ వాహనాల వినియోగం బాగా పెరగడం, ద్విచక్ర వాహనదారుల నుంచి కూడా గట్టి పోటీ ఉండడం వల్ల ఫ్యాన్సీ నంబర్లకు డిమాండ్ బాగా పెరిగింది. – సి.రమేష్, ఆర్టీఓ, ఖైరతాబాద్ -
ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే చర్యలు
ఏలూరు అర్బన్ : ట్రాఫిక్ భద్రతపై ప్రతివారూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, రోడ్డు ప్రమాదాలను నివారించాలని జిల్లా ఎస్పీ భాస్కర్భూషణ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘డయల్ యువర్ ఎస్పీ’ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఎస్పీ భాస్కర్భూషణ్ శుక్రవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ప్రజలతో ఫోన్లో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. దానికి ప్రతిగా ప్రజల ఇబ్బందులకు సంబంధించి సంబంధిత అధికారులకు ఫోన్లోనే ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా పలువురు ఎస్పీకి విన్నవించుకున్న సమస్యల్లో కొన్ని ఇలా ఉన్నాయి. వీరవాసరం నుంచి ఫోన్ చేసిన వ్యక్తి గ్రామంలో రౌడీషీటర్ ఆగడాలతో ఇబ్బందులు పడుతున్నామని అతనిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. కొయ్యలగూడెం నుంచి ఫోన్ చేసిన వ్యక్తి గ్రామంలో అనధికారికంగా చిట్స్ నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ఏలూరు నుంచి మాట్లాడిన వ్యక్తి ప్రార్థనాలయాల వద్ద ఆదివారం లౌడ్ స్పీకర్లు పెద్ద శబ్దంతో పెడుతున్నారని వారిని నియంత్రించాలని విన్నవించాడు. -
రవాణా శాఖలో దళారుల దందా
⇒ వాహనదారుల్ని బ్రోకర్ల వద్దకు పంపుతున్న కార్యాలయ సిబ్బంది ⇒ నేరుగా కార్యాలయాల్లో బేర సారాలు సాగిస్తున్న వైనం నగరంపాలెం (గుంటూరు): గుంటూరు రవాణాశాఖ కార్యాలయం దళారుల కనుసన్నల్లో నడుస్తోంది. బ్రోకర్లు కిందిస్థాయి సిబ్బంది మిలాఖత్ అయి దందా నడిపిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వాహనదారుడు కొత్త వాహనం కొన్నదగ్గర్నుండి రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్.. ఇలా అన్ని పనులకు ఒక రేటు నిర్ణయించి సొమ్ము చేసుకుంటున్నారు. సదరు అధికారులే దళారుల్ని పిలిపించి బేరసారాలు చేస్తున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అందుకు చక్కటి ఉదాహరణ శనివారం జరిగిన సంఘటనే. పాత గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి టాక్సు చెల్లించడానికి రాగా సిబ్బంది చుక్కలు చూపించి మూడు చెరువుల నీళ్లు తాగించారు. చివరకు కొంత డబ్బు ఇవ్వాలని పీడించి వసూలు చేసి పని చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. సరాసరి దళారుల వద్దకే.. పాతగుంటూరుకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల కారు కొనుగోలు చేశాడు. సదరు వాహనం రిజిస్ట్రేషన్ ట్యాక్సీ పేరుతో ఉండటంతో నాన్ట్రాన్స్పోర్టు వాహనంగా మార్చుకోవడానికి ఫిబ్రవరి 1న గుంటురు ఉప రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లాడు. వివరాలు ఎవరిని అడగాలో తెలియక గంటల పాటు ఇబ్బంది పడ్డాడు. చివరికి ట్యాక్సీ క్యాబ్లో సెక్షన్ సిబ్బందిని విచారించగా సదరు వ్యక్తులు సరాసరి దళారుల వద్దకు వెళితే పని అవుతుందని సూచించగా వాహనదారుడు అవాక్కయ్యాడు. హెల్ప్ డెస్క్ నుంచే దందా షురూ.. రవాణా శాఖ కార్యాలయం సమాచారం కోసం ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ అధికారులే బ్రోకర్లను ఆశ్రయించాలని సూచిస్తున్నారు. వాహనం కొనుగోలు చేసేటప్పుడు అవగాహన లేక ఎంతో మంది ఇలా మోసపోతూనే ఉన్నారు. గట్టిగా నిలదీస్తే చేయాల్సిన పనిని ఆపి నెలల పాటు కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారు. ఇప్పటికైనా ఆ శాఖ ఉన్నతాధికారులు స్పందించి అవినీతికి అడ్డుకట్ట వేయాలని వాహనదారులు కోరుతున్నారు. ప్రతి పనీ సెప‘రేటు’.. కార్యాలయంలో ఓ దళారి తాను ఎంవీఐ డ్రైవర్నని పరిచయం చేసుకొని లైఫ్ టాక్స్ రూ.23 వేలతో పాటు మరో రూ.5 వేలు లంచం ఇవ్వాలని సూచించాడు. సదరు వాహనదారుడు చేసేందేంలేక అందుకు ఒప్పుకున్నాడు. వాహనాన్ని బ్రేక్ వద్దకు తీసుకెళ్లి దళారే కార్యాలయంలో గుమస్తాలతో దరఖాస్తు పత్రాలపై సంతకాలు చేయించాడు. ఇతర దళారులకు ఇదే పని నెల రోజులు పడుతుందని, తాను మూడు రోజుల్లోనే చెప్పి లైఫ్ ట్యాక్స్ కాక అదనంగా అడిగిన నగదు తీసుకున్నాడు. అప్పటి నుంచి పనిని వాయిదా వేస్తూ 24వ తేదీన ఫోన్లో సంప్రదించగా లైఫ్ టాక్స్ రూ.28 వేలు అని, మరో రూ. 5 వేలు ఇస్తే తప్ప పని జరగదని చెప్పాడని బాధితుడు వాపోయాడు. చివరికి చేసేదేంలేక ఉసూరుమంటూ నగదు చెల్లించాడు. ఇలాంటి ఘటనలు రోజుకు ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. కానీ బయటకు వచ్చేవి మాత్రం కొన్నే..! -
ఈ రోడ్డులో నడక సాగేదెలా.. ?
వర్షకాలంలో పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్లు గాయాలపాలవుతున్న వాహనదారులు పట్టించుకోని అధికారులు, జుక్కల్ : మండలంలోని లింగంపల్లి, విట్టల్వాడి, విట్టల్వాడి తాండా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జుక్కల్ మండలంలోని ఖండేబల్లూర్ నుంచి జిల్లా బార్డరు వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్లు వేసవిలో పనులు చేపట్టాల్సి ఉండగా వర్షాకాలంలో పనులు చేపడుతుండడంతో రోడ్డు అధ్వాన్నంగా మారింది. సావర్గావ్ గ్రామ ప్రాంతంలో కల్వర్టు నిర్మాణానికి అడ్డంగా రోడ్డు తవ్వడంతో రెండు రోజులుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి వాహనాలు వెళ్లేందుకు సౌకర్యం లేక పొవడంతో ఆయా గ్రామాల ప్రజలు కిలోమీటర్ దూరం నడచి ప్రయాణం సాగిస్తున్నారు. రోడ్డుపై వేసిన నల్లమట్టితో బురదగా మారి వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నారు. బురదతో వాహనాలు అదుపు తప్పి పలువురు గాయాల పాలవుతున్నట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల వి«ధ్యార్థులు రోడ్డువెంట నడంలేక ఇంట్లోనే ఉండిపోతున్నారు. రోడ్డుకు మరమ్మత్తు చేపట్టి ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. -
రోడెక్కిన మురుగు..కోర్టుకూ ఎక్కింది
భాకరాపేట: తిరుపతి-బళ్లారి జాతీయు రహదారిపై నిలిచిన మురుగునీటి కథ కోర్టుకు ఎక్కింది. చిన్నగొట్టిగల్లు వుండలం పరిధిలోని టీ చట్టేవారిపాళెం పంచాయుతీలో 71 జాతీయు రహదారిపై చర్చి వద్ద మురుగునీరు నిలిచిపోవడంతో వాహన చోదకులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నారుు. ఇక్కడ కొద్దిపాటి వర్షానికే భారీగా మురుగునీరు చేరడంతో ఈ ప్రాంతమంతా దుర్గంధ భరితంగా తయారై స్థానికులకు భారంగా తయారయింది. భాకరాపేట పంచాయుతీ పరిధిలో జాతీయు రహదారులు శాఖ వుురుగునీటి కాలువ నిర్మాణపు పనులు చేపట్టింది. భాకరాపేట గ్రావుంలోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు వద్ద నుంచి వుురుగునీటి కాలువను తీసుకొచ్చి టీ చట్టేవారిపాళెం పంచాయుతీలోకి వదిలారు. ఈ మురుగు నీరు ప్రస్తుతం టీచట్టేవారిపాళెం రెవెన్యూ గ్రావుంలోని చర్చి ముందు నిలిచి పోయూయి. చర్చి ముందు గతంలో కల్వర్టు ఉన్నా అది వర్షపు నీరు వెళ్లడానికే గాని, మురుగునీటి కోసం కాదనడం తో వివాదం మొదలైంది. పైగా చర్చివారు కల్వర్టు ను పూడ్చేయుడంతో వ్యవహారం వుుదిరి కోర్టుకు చేరింది. పీలేరు కోర్టు చర్చివారి వాదనలు, రెవెన్యూవారి వాదనలు విన్న తరువాత కోర్టు కమిషన్ వేసింది. అయితే శనివారం కోర్టు కమీషన్ వస్తుందని వుండల రెవెన్యూ అధికారులు ఎదురు చూశారు. మధ్యాహ్నం వరకు రాక పోవడంతో రెవెన్యూ అధికారులు వెనుదిరిగారు. కనీసం కోర్టు తీర్పుతోనైనా మురుగునీటి కష్టం తప్పుతుందేమోనని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
ఎక్స్ట్రా ‘ఫిట్టింగ్’
ఆటోమొబైల్ షోరూమ్లలో ‘హ్యాండ్లింగ్’ దోపిడీ తాత్కాలిక, పర్మినెంట్ రిజిస్ట్రేషన్లపై అదనపు వసూళ్లు ఒక్కో వాహనంపై రూ.5000 చొప్పున అ‘ధనం’ పలు షోరూమ్లలో ఆర్టీఏ తనిఖీలు సిటీబ్యూరో: వాహనదారులను ఆటోమొబైల్ షోరూమ్ నిర్వాహకులు అడ్డంగా దోచుకుంటున్నారు. రకరకాల పేర్లతో కొనుగోలుదారుల నుంచి అదనంగా వసూలు చేస్తున్నారు. ‘హ్యాండ్లింగ్ చార్జీలు’, ‘ఎక్స్ట్రా ఫిట్టింగ్స్’ పేరుతో నిబంధనలకు విరుద్దంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. దీనికితోడు తాత్కాలిక రిజిస్ట్రేషన్లు, పర్మినెంట్ రిజిస్ట్రేషన్ ఫీజుల రూపంలో భారీగా దండుకుంటున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కొనుగోలుదారులు ఫిర్యాదు చేయడంతో రవాణా కమిషనర్ ఆదేశాల మేరకు ఆర్టీఏ నిఘా విభాగం పలు షోరూమ్లలో తనిఖీలు నిర్వహించగా, వివిధ రకాల చార్జీలు, సేవలు, అదనపు హంగుల పేరుతో ఒక్కో వాహనం నుంచి రూ.5000 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు వెల్లడయ్యింది. ఇదిలా ఉండగా ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించే అధికారులు ఆ తరువాత ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాహన యజమానులు ఆరోపిస్తున్నారు. దోపిడీ పర్వం ఇలా.... కాచిగూడ ప్రాంతానికి చెందిన ఒక వినియోగదారుడు కొద్ది రోజుల క్రితం స్థానిక షోరూమ్లో బైక్ కొనుగోలు చేశాడు. వాహనం ఖరీదు రూ. 73 వేలు కాగా, హ్యాండ్లింగ్ చార్జీల పేరుతో, ప్రాసెసింగ్ పేరుతో మరో రూ.5000 కలిపి మొత్తం రూ.78 వేలు వసూలు చేశారు. అయితే అతనికి ఇచ్చిన ఇన్వాయీస్ కాపీలో హ్యాండ్లింగ్ చార్జీలు అనే పదం ఎక్కడా కనిపించకపోగా, రిజిస్ట్రేషన్ చార్జీలు తీసుకున్నట్లు రశీదు ఇచ్చారు. కానీ ఆర్టీఏ ఖాతాలో ఆ డబ్బులు జమ కాలేదు. దీంతో రిజిస్ట్రేషన్ కోసం మరోసారి ఫీజు చెల్లించవలసి వచ్చింది. దీనిపై బాధితుడు రవాణా కమిషనర్కు ఫిర్యాదు చేశాడు. నగరంలోని పలు షోరూమ్లు ఈ తరహా దోపిడీకి పాల్పడుతున్నాయి. రూ.60 వేల బైక్ నుంచి రూ. లక్షల ఖరీదు చేసే కార్ల వరకు ‘ హ్యాండ్లింగ్’ దోపిడీ కొనసాగుతూనే ఉంది. మరోవైపు వాహనం తాత్కాలిక, శాశ్వత రిజిస్ట్రేషన్ల పేరుతో రెట్టింపు వసూళ్లకు పాల్పడుతున్నారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్ చార్జీ రూ.వంద లోపే ఉండగా, పర్మినెంట్ రిజిస్ట్రేషన్ ఫీజు మరో రూ.650 ఉంటుంది. అయితే వీటికిగాను రూ.1500లకు పైగా వసూలు చేస్తున్నట్లు వినియోగదారులు పేర్కొంటున్నారు. ఆర్టీఏ ప్రేక్షకపాత్ర.... గ్రేటర్లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రతి రోజు సగటున 600 కొత్త వాహనాలు నమోదవుతున్నాయి. వీటిలో 400 ద్విచక్ర వాహనాలు కాగా, మిగతా 200 కార్లు, ఇతర వాహనాలు. సుమారు 175 షోరూమ్ల ద్వారా ఈ వాహనాల విక్రయాలు జరుగుతున్నాయి. మొదట వాహనం బుకింగ్ కోసం వెళ్లినప్పుడు వాహనం ఆన్రోడ్ ఖరీదు, జీవిత కాల పన్ను వివరాలను మాత్రమే వెల్లడిస్తారు. మాట వరుసకైనా హ్యాండ్లింగ్, ప్రాసెసింగ్ ఊసెత్తరు. వాహనం కొనుగోలు చేసేందుకు సిద్ధపడి డబ్బులు చెల్లించే సమయంలో ఈ చార్జీలు తెర పైకి వస్తాయి.దీంతో గత్యంతరం లేక వారు అడిగినంతా చెల్లించాల్సి వస్తోంది. ద్విచక్ర వాహనాలు, కార్ల పై సగటున రూ.5000 వసూలు చేస్తుండగా, లగ్జరీ కార్లపై ఇంకా ఎక్కువే ఉంటుంది. బాహటంగా ఈ దోపిడీ జరుగుతున్నా ఆర్టీ అధికారులు తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తుండటం గమనార్హం. -
సీటు బెల్టే శ్రీరామ రక్ష
కారు ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడేది అదే.. తేలికపాటి వాహనాల ప్రతి మూడు ప్రమాదాల్లో రెండూ సీటు బెల్ట్ ధరించకపోవడంతోనే.. పిన్నమనేని కారు ప్రమాదమే ఇందుకు తాజా ఉదాహరణ లాల్జాన్ బాషా, శోభానాగిరెడ్డిల మృతికీ సీటు బెల్ట్ ధరించకపోవడమే కారణం సీటు బెల్ట్ విషయంలో వాహన చోదకులు చూపుతున్న చిన్న నిర్లక్ష్యం తమ విలువైన ప్రాణాలను హరిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా తేలికపాటి వాహనాలకు జరుగుతున్న ప్రతి మూడు ప్రమాదాల్లో రెండూ సీటు బెల్ట్ ధరించకపోవడం వల్లేనని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. కార్లు డ్రైవ్ చేస్తున్నప్పుడు, వాటిలో ప్రయాణిస్తున్నప్పుడు సీటు బెల్ట్ ధరిస్తే కలిగే లాభం, ధరించకపోతే కలిగే నష్టాలకు సోమవారం అర్ధరాత్రి ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)పై ఏపీ ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు వాహన ప్రమాదమే ఉదాహరణ. గంటకు 120 కి.మీ పైగా వేగంతో వెళ్తున్న ఆ వాహనం రెయిలింగ్ను (క్రాష్ బారియర్) ఢీకొట్టింది. ఈ ఘటనలో సీటు బెల్ట్ ధరించిన పిన్నమనేని సురక్షితంగా బయటపడగా, సీటు బెల్ట్ ధరించని ఆయన భార్య సాహిత్యవాణి, డ్రైవర్ స్వామిదాసు అక్కడిక్కడే మృతి చెందారు. - సాక్షి, సిటీబ్యూరో ఆ రెండు ఘటనల్లోనూ.. టీడీపీ ఉపాధ్యక్షుడు లాల్జాన్ బాషా, వైఎస్సార్సీపీ నేత శోభానాగిరెడ్డి ఇద్దరూ సీటు బెల్ట్ ధరించకపోవడం వల్లే కారు ప్రమాదాల్లో మృతి చెందారు. 2013 ఆగస్టు 15న హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళ్తున్న లాల్జాన్ బాషా ఇన్నోవా వాహనం 150 కి.మీ వేగంతో వెళ్తూ జాతీయ రహదారి 65పై నార్కెట్పల్లి మండల కేంద్రం సమీపంలోని కామినేని ఆస్పత్రి జంక్షన్ వద్ద డివైడర్ను ఢీకొట్టింది. సీటు బెల్ట్ ధరించకపోవడంతో బాషా ఎగిరి బయటపడ్డారు. తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. 2014 ఏప్రిల్ 24న ఆళ్లగడ్డ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శోభానాగిరెడ్డి మరణించారు. వేగంగా వెళ్తున్న ఈ వాహనం వరికుప్పను తప్పించే ప్రయత్నంలో పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. శోభా సైతం సీటు బెల్ట్ ధరించకపోవడంతో కారులో నుంచి ఎగిరి బయటపడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సీటు బెల్ట్ ఎలా కాపాడుతుంది.? కారులో ప్రయాణిస్తున్న వారు అందులో కూర్చున్నప్పటికీ ఆ వాహన వేగంతో ముందుకు వెళ్తున్నట్లే లెక్క. అలా వేగంగా వెళ్తున్న వాహనం దేనినైనా ఢీకొట్టినా లేదా హఠాత్తుగా వేగం కోల్పోయినా అందులోని ప్రయాణికులు అదే వేగంతో ముందుకు వెళ్తారు. ఫలితంగా ముందు సీట్లో వారు డ్యాష్ బోర్డ్స్ను, వెనుక కూర్చున్న వారు ముందు సీట్లను అత్యంత వేగంగా ఢీకొడతారు. ఒక్కోసారి వాహనం పల్టీలు కొడితే అద్దాల్లోంచి, డోర్ ఊడిపోయి ఎగిరి బయట పడతారు. లాల్జాన్ బాషా విషయంలో కారులో ఉండగానే ఆయన కుడి కాలుకి డివైడర్ రాడ్ గుచ్చుకుంది. పల్టీల ప్రభావంతో ఆయన బయటపడేప్పుడు కాలు తెగిపోయింది కూడా. ఇలా పడటం ఫలితంగానే తల, ముఖం తదితర చోట్ల తీవ్రగాయాలై మృతి చెందారు. సీటు బెల్ట్ ధరిస్తే కేవలం పెద్ద ఎత్తున కుదుపు మాత్రమే ఉండి గాయాలతో బయటపడతారు. ఆరవ్రెడ్డిని కాపాడింది సీటు బెల్టే.. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కుమారుడు ప్రతీక్రెడ్డి సహా నలుగురు ప్రయాణిస్తున్న కారు 2011 డిసెంబర్ 21న మెదక్ జిల్లా కొల్లూర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్పై ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కారు గంటకు 150 కి.మీ వేగంతో ప్రయాణిస్తోంది. ఈ ప్రమాదంలో ప్రతీక్, సుజిత్కుమార్, చంద్రారెడ్డి ఘటనా స్థలిలోనే మరణించారు. వెనుక సీట్లో కూర్చున్న ఆరవ్రెడ్డి సీటు బెల్ట్ ధరించడంతో బతికి బయటపడ్డాడు. ప్రమాదం కారణంగా ఏర్పడిన కుదుపుతో తలభాగం ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చింది. అయితే భుజం పైనుంచి సీట్బెల్ట్ ఉండటంతో ఆ ఒత్తిడి మెడపై పడింది. అందుకే ఆరవ్రెడ్డికి ఆ భాగంలోనే గాయమైంది. కేవలం సీటు బెల్ట్ ధరించడం వలనే అతనికి మరెక్కడా గాయాలు కాలేదు. సీటు బెల్ట్, ఎయిర్బ్యాగ్స్కు లింకు.. కార్ల లాంటి వాహనాల్లోని భద్రతా ప్రమాణాలు సర్వకాల సర్వ వ్యవస్థల్లోనూ చోదకులు, ప్రయాణికులకు రక్షణ కల్పించేవిగా ఉండాలి. దేశంలో ఉన్న కార్లలో 70 శాతం లోఎండ్ మోడల్స్ కావడంతో ఎయిర్బ్యాగ్స్ సౌకర్యం ఉండదు. ఈ నేపథ్యంలో వాహన చోదకులు, అందులోని వారు కచ్చితంగా సీటు బెల్ట్ ధరించాలి. కొన్ని కంపెనీలకు చెందిన హైఎండ్ కార్లలో సీటు బెల్ట్, ఎయిర్బ్యాగ్స్కు మధ్య లింకు ఉంటుంది. డ్రైవర్ సీటు బెల్ట్ పెట్టుకోకపోతే ఎయిర్బ్యాగ్ కంట్రోల్ యూనిట్ యాక్టివేట్ కాదు. ఫలితంగా ప్రమాదం జరిగినా బ్యాగ్స్ ఓపెన్ కావు. ఏదేమైనా సీటు బెల్ట్ నిత్యం వాడటం మంచిది. - ఫెరోజ్, ఆటో కన్సల్టెంట్ -
దిక్కులేని సిగ్నల్స్
నగరంలో పనిచేస్తున్న సిగ్నల్స్ ఆరు 23 చోట్ల పనిచేయని వైనం పట్టించుకోని నగరపాలక సంస్థ అధికారులు సతమతమవుతున్న ట్రాఫిక్ పోలీసులు రాజధాని నగరంలో సిగ్నలింగ్ వ్యవస్థ భ్రష్టుపట్టడంతో ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. నిత్యం ముఖ్యమంత్రి మొదలుకొని కేంద్ర మంత్రుల వరకు అనేకమంది నగరానికి రాకపోకలు సాగిస్తుంటారు. వీరందరి వాహనాలతో ప్రధాన రోడ్లన్నీ బిజీగా ఉంటాయి. తరచూ రూట్ డైవర్షన్లు, ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తుంటారు. ఇంతటి రద్దీ ఉన్నా సౌకర్యాలు మాత్రం మున్సిపాలిటీని తలపిస్తున్నాయి. వాహనచోదకులకు దిక్కులు చూపించాల్సిన ట్రాఫిక్ సిగ్నల్స్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో దిక్కూదివాణం లేనివిగా తయారయ్యాయి. విజయవాడ : రాజధాని అవసరాలకు తగ్గట్లు నగరానికి వసతులు సమకూరడం లేదు. తక్షణ అవసరాల్లో ఒకటైన ట్రాఫిక్ వ్యవస్థను అధునాతనంగా తీర్చిదిద్దడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారు. ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ పూర్తి అధ్వానంగా తయారైంది. నగరంలో అనేక రద్దీ ప్రాంతాలు, ముఖ్య కూడళ్లు, ఇతర ట్రాఫిక్ జంక్షన్లు పదుల సంఖ్యలో ఉన్నాయి. నగరంలో 29 చోట్ల మాత్రమే సిగ్నల్స్ ఏర్పాటుచేశారు. అవి కూడా కొన్నేళ్ల కిందట ఏర్పాటుచేసిన సిగ్నల్స్ కావడంతో పూర్తిగా అటకెక్కాయి. ప్రస్తుతం ఆరు మాత్రమే పనిచేస్తున్నాయి. అవి కూడా అధిక ప్రాధాన్యత లేని ప్రాంతాల్లోని సిగ్నల్స్ కావడం గమనార్హం. విజయవాడలో రోజుకు సగటున 3.5 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రధానమైన బందరు రోడ్డులో కంట్రోల్ రూమ్ నుంచి బెంజిసర్కిల్ వరకు నాలుగు సిగ్నల్స్ పాయింట్లు ఉన్నాయి. వీటిలో ఒక్కటి కూడా పనిచేయడం లేదు. నిర్మల కాన్వెంట్ సెంటర్, రమేష్ హాస్పిటల్ సెంటర్, దీప్తి జంక్షన్ సెంటర్, చుట్టుగుంట సెంటర్, సీతన్నపేట గేటు, వెటర్నరీ కాలనీ రోడ్డులోని సిగ్నల్స్ మినహా మిగిలినవి అన్ని అట్టకెక్కాయి. విఐపి జోన్గా మారిన బందరు రోడ్డులో ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడంతో నిత్యం 35 మంది ట్రాఫిక్ పోలీసులు సిగ్నల్స్ వద్ద ఉండి షిఫ్టులవారీగా విధులు నిర్వహిస్తున్నారు. వారున్నంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత ట్రాఫిక్ గజిబిజి గందరగోళంగా మారుతోంది. దీనికితోడు సీఎం ఈ రూట్లో పర్యటించినప్పుడల్లా గ్రీన్ జోన్ కారిడార్ ఏర్పాటుచేయడంతో ట్రాఫిక్ను నిలిపివేస్తుంటారు. నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో గందరగోళం నగరంలో ట్రాఫిక్కు సంబంధించి సిగ్నల్స్, జంక్షన్ల వద్ద మార్కింగ్ ఇతర సౌకర్యాలు కల్పించాల్సిన నగరపాలక సంస్థ పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించడంతో అటు వాహనదారులు, ఇటు ట్రాఫిక్ పోలీసులకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. కనకదుర్గ ఫ్లైవోవర్ నిర్మాణపనుల వల్ల జాతీయ రహదారి ట్రాఫిక్ మొత్తం చిట్టినగర్, చనుమోలు వెంకట్రావ్ ఫ్లైవోవర్, సొరంగం వైపు మళ్లించారు. ఈ క్రమంలో ఈ ప్రాంతంలో రోడ్డు పూర్తిగా 30 అడుగుల లోపు ఉండటంతో నిత్యం ట్రాఫిక్ జామ్లతో వాహనదారులు సతమతమవుతున్నారు. ముఖ్యంగా నగరంలోని రోడ్డు అవసరమైన చోట్ల విస్తరణ చేయాల్సి ఉన్నా నగరపాలక సంస్థ పట్టించుకోవటం లేదు. సిగ్నల్స్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత నగరపాలక సంస్థ అధికారులదే. మరో నాలుగు నెలల్లో పుష్కరాలు కూడా ప్రారంభం కానున్న తరుణంలో ట్రాఫిక్ సమస్య పెనసవాలుగా మారే అవకాశం ఉంది. జాతీయ రహదారితో అనుసంధానంగా ఉన్న బెంజిసర్కిల్ వద్ద సిగ్నల్స్ వద్ద రెడ్లైట్ వయొషన్ కెమోరా ఉన్నప్పటికి పనిచేయటం లేదు. దీంతో ఈసెంటర్లో ఆరుగురికిపైగా పోలీసులతో పాటు అధికారులు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. -
పన్ను ఎగవేత రూ.2 కోట్లు!
- రవాణా పన్ను చెల్లించని వాహనదారులు - జిల్లాలో రెండేళ్లుగా పేరుకుపోయిన వైనం - జరిమానా విధించాలని అధికారుల నిర్ణయం - ఈ నెల 16 వరకు బకాయిల చెల్లింపునకు గడువు తాండూరు: జిల్లాలో రవాణా పన్ను (ట్రాన్స్పోర్ట్ టాక్స్) ను వాహనదారులు రూ.కోట్లల్లో ఎగవేస్తున్నారు. రెండేళ్లుగా పన్ను బకాయిలు భారీగా పేరుకుపోయాయి. జిల్లా లో అధికారిక లెక్కల ప్రకారం సుమారు 8 వేల రవాణా వాహనాలు తిరుగుతున్నాయి. ఇందులో మూడు చక్రాల ఆటోలతో పాటు వ్యవసాయ ట్రాక్టర్లు, ట్రాలీలకు ప్రభుత్వం రవాణా పన్ను మినహాయించింది. మిగతా రవాణా వాహనాలు పన్ను ఎగవేశాయని అధికారులు గుర్తించారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.2 కోట్ల ఆదాయం సమకూరకుండాపోయింది. ఆలస్యంగా మేల్కొన్న రవాణా శాఖ అధికారులు.. పేరుకుపోయిన పన్ను బకాయిల వసూలుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ సందీప్కుమార్ సుల్తానియా జిల్లా మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ల(ఎంవీఐ)కు ఆదేశాలు జారీ చేశారు. కచ్చితంగా పన్ను బకాయిలను వసూలు చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ నెల 16 వరకు స్వచ్ఛందంగా పన్ను బకాయిల చెల్లింపునకు అధికారులు గడువు ఇచ్చారు. గడువులోపు పన్ను చెల్లించని వాహనదారులకు అసలు పన్నుకు 200శాతం జరిమానా విధింపుతోపాటు వాహనాలను సీజ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. గడువు ముగిసిన తర్వాత పట్టణాలు, గ్రామాల్లోకి వెళ్లి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక తనిఖీ బృందాలను రంగంలోకి దిగనున్నాయి. -
ఎందుకు?ఎలా?
{పమాద సంఘటనలపై శాస్త్రీయ విశ్లేషణ భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు మలేషియాలో ప్రత్యేక శిక్షణ పొందిన ఎంవీఐలు సిటీబ్యూరో: నిత్యం ఎక్కడో ఓ చోట రోడ్డు ప్రమాద సంఘటన లు చోటుచేసుకుంటున్నాయి. చిన్న వాహన చోదకుల తప్పిదాలతో ఇవి సంభవిస్తున్నా...పెద్ద వాహనాల పైనే నేరం మోపడం పరిపాటిగా మారింది. ఈ ప్రమాదం ఎలా? ఎందుకు జరిగింది? తప్పెవరిది? భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై శాస్త్రీయమైన, సమగ్రమైన విశ్లేషణ లోపిస్తోందనే అభిప్రాయం బలంగా ఉంది. ఇలాంటి అశాస్త్రీయ ధోరణుల నుంచి బయట పడేందుకు రవాణా శాఖ కసరత్తు చేస్తోంది. ప్రమాదాలకు కారణాలపై విశ్లేషణ, నియంత్రణకు చేపట్టవలసిన చర్యలపై నూతన ఒరవడికి శ్రీకా రం చుడుతోంది. ఇందులో భాగంగా 10 మంది మోటారు వాహన తనిఖీ అధికారులు మలేషియాలో ప్రత్యేక శిక్షణ పొం దారు. ‘క్రాష్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇంజ్యూరీస్ అనాలిసిస్’ అనే అంశంపై ఇటీవల మలేషియాలో మూడు రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ అవగాహన, శిక్షణ కార్యక్రమంలో ఎంవీఐలు పాల్గొన్నారు. ఏకపక్ష పద్ధతికి స్వస్తి... ప్రమాదాలకు కారణాలను విశ్లేషించడం లో ఎంవీఐలు భాగస్వాములు కావడం లేదు. సంఘటనల అనంతరం వాహనం కండీషన్, బ్రేక్లు, ఇంజన్ నాణ్యత వంటి అంశాలపైన అధ్యయనం చేసి నివేదికలు రూపొందిస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై ఎంవీఐలకు అవగాహన లోపిస్తోంది. ఫలితంగా రోడ్డు ప్రమాదాల నియంత్రణ, రహదారుల నిర్మాణ పద్ధతులు, డ్రైవింగ్ లోపాలు తదితర అంశాలను కచ్చితంగా విశ్లేషించలేకపోతున్నారు. మహబూబ్నగర్ జిల్లా పాలెం వంటి భారీ దుర్ఘటనలు జరిగినప్పుడు మినహా పోలీసు శాఖతో పోల్చితే రవాణా శాఖ ప్రమేయం చాలా తక్కువ. కేవలం వాహనాల సామర్ధ్య విశ్లేషణకే పరిమితం కావడంతో ప్రమాదాలను అరికట్టడంలో ఆశించిన ఫలితాలను సాధించలే మని రవాణా శాఖ గుర్తించింది. ఈ క్రమంలో తెలంగాణ ఎంవీఐ అసోసియేషన్ అధ్యక్షులు పాపారావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ పుప్పాల శ్రీనివాస్ల నేతృత్వంలో పదిమంది ఎం వీఐలు ప్రత్యేక శిక్షణ పొందారు. ప్రమా దం జరిగిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకోవడం... కారణాలను సమగ్రంగా విశ్లేషించి నివేదికలు రూపొందించడంపై స్పష్టమైన అవగాహన పొందినట్లు పుప్పాల శ్రీనివాస్ చెప్పారు. విశ్లేషణ ఇలా... సంఘటన స్థలం, రోడ్డు నిర్మాణంపై అధ్యయనం తప్పనిసరి. భారీ దుర్ఘటనలు మొదలుకొని చిన్న చిన్న ప్రమాదాలపైనా డేటా బేస్ రూపొందించాలి. {పమాద సమయంలో వాహనం ఎంత వేగంతో ఉన్నప్పుడు బ్రేకులు వేశారనే అంశం కీలకం. లభించిన ఆధారాలపై ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో విశ్లేషిస్తారు. నష్టాన్ని విశ్లేషించడం, నమూనా చిత్రాల రూపకల్పన, ప్రమాదాల వర్గీకరణ వంటి అంశాలపై అధ్యయనం. ఔటర్ రింగ్ రోడ్డు, హైవేలలో ప్రమాదాలు జరగకుండా పాటించవలసిన రోడ్డు భద్రత నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించడం. -
దర్జాగా దోచేస్తున్నారు
- జిల్లాలో జోరందుకున్న హెల్మెట్ల వ్యాపారం - ఇప్పటి వరకు 65 వేలకు పైగా అమ్మకాలు - జిల్లాలో మొత్తం ద్విచక్ర వాహనాలు 2.3 లక్షలు మదనపల్లె: జిల్లాలో వాహనదారులను హెల్మెట్ల వ్యాపారులు దోచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా హెల్మెట్ల వ్యాపారం జోరందుకొంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2.30 లక్షల వరకూ ద్విచక్రవాహనాలు ఉన్నట్లు మోటారు వాహనాల శాఖ అధికారుల అంచనా. ద్విచక్ర వాహనదారులకు జూలై ఒకటో తారీఖు నుంచి హెల్మెట్లు తప్పని సరి కావడంతో వాహనదారులు వీటిని కొనుగోలు చేయడంలో నిమగ్నమయ్యారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 2.30 లక్షలకుపైగా ద్విచక్రవాహనాలు, 60 వేలకు పైగా కార్లు ఉన్నాయి. వీరిలో ఇదివరకూ ఏ ఒక్కరో, ఇద్దరో తప్ప హెల్మెట్లు కానీ, సీటు బెల్టులు కానీ కచ్చితంగా వాడుతున్న దాఖలాలు లేవు. అయితే హెల్మెట్ల వాడకం తప్పని సరికాడంతో ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా 67 వేలకుపైగా హెల్మెట్లను వాహనదారులు కొనుగోలు చేసినట్లు ప్రాథమిక అంచనా. కాగా మదనపల్లె మోటారు వెహికల్ శాఖ పరిధిలోని మదనపల్లె, గుర్రంకొండ, తంబళ్లపల్లె, పెద్దమండ్యం, బి.కొత్తకోట, పీటీఎం, పెద్దమండ్యం, వాల్మీకిపురం, కురబలకోట, రా మసముద్రం, నిమ్మనపల్లె, పుంగనూరు, పెద్దపంజాణి, చౌడేపల్లెతో కలిపి మొత్తం 14 మండలాల పరిధిలో దాదాపుగా 70 వేల వరకూ ద్విచక్రవాహనాలు, 25 వేల వరకూ కార్లు, జీపులు ఉన్నాయి. కేవలం డివిజన్ కేంద్రమైన మదనపల్లె పట్టణంలో దాదాపుగా 50 వేల వరకూ ద్విచక్రవాహనాలు, 15 వేలకుపైగా కార్లు, జీపులు ఉన్నాయి. మదనపల్లెలో 10 వేల హెల్మెట్ల అమ్మకాలు డివిజన్ కేంద్రమైన మదనపల్లె పట్టణంలో బెంగళూరు రోడ్డు, కదిరిరోడ్డు, సీటీఎం రోడ్డు, అవెన్యూ రోడ్డు, పుంగనూరు రోడ్డు, నీరుగట్టువారిపల్లె, బెంగళూరు బస్టాండు ప్రాంతాలతో పాటు పలువురు ఆటోమొబైల్ షాపులతో కలిపి మొత్తం 23 చోట్ల అమ్మకాలు సాగిస్తున్నారు. అందుబాటులో లేని హెల్మెట్లు గత నెలతో పోల్చితే ఈ నెలలో కొంత అమ్మకాలు పెరిగాయని, అయితే డిమాం డ్కు తగ్గట్టుగా హెల్మెట్లు అందుబాటులో లేవని వ్యాపారులు అంటున్నారు. ఢిల్లీ, ముంబయి, కలకత్తా తదితర పెద్ద నగరాల నుంచి బెంగళూరు, హైదరాబాదు, చెన్నై వంటి నగరాలకు దిగుమతి చేసుకోవాల్సి ఉందని, అక్కడి నుంచి మన ప్రాంతాలకు తీసుకురావాల్సి ఉందన్నారు. దోచుకుంటున్న వ్యాపారులు జిల్లావ్యాప్తంగా హెల్మెట్ల విక్రయించే కొందరు వ్యాపారులు వాహనదారులను దోచుకొంటున్నారు. రూ.450 విలువ చేసే ఫుల్ హెల్మెట్ రూ.750కి, రూ.200 విలువ చేసే హాఫ్ హెల్మెట్ రూ.300కి విక్రయిస్తున్నారు. వాస్తవానికి ఐఎస్ఐ మార్కువైతే ప్రస్తుతం అధికంగా అందుబాటులో లేకపోవడంతో పోలీసుల బారి నుంచి రక్షించుకునేందుకు ఏదో ఒకటని కొనక తప్పడం లేదు. -
గడువు 3 నెలలు
అమలాపురం టౌన్ : శిరస్త్రాణం నిబంధన నుంచి ద్విచక్ర వాహనదారులకు కాస్త ఊరట లభించింది. హెల్మెట్ ధారణ తప్పనిసరంటూ నిబంధనలు విధించిన ప్రభుత్వం మూడు నెలలపాటు కాస్త చూసీచూడనట్టు వదిలేయాలని భావిస్తోంది. హెల్మెట్ ఆవశ్యకతపై వాహనచోదకులకు తొలుత కౌన్సెలింగ్ ఇవ్వాలని, ఆ తర్వాత జరిమానాలు విధించాలని రాష్ట్ర రవాణా శాఖ నిర్ణయించింది. హెల్మెట్ ధరించడంవల్ల వల్ల ప్రయోజనాలు తెలిసినప్పటికీ చాలామంది ఈ విషయంలో నిర్లక్ష్యం చూపుతున్నారు. హెల్మెట్ కొనుగోలు చేయటం, కాస్త బరువుతో ఉన్న దానిని వెంట తీసుకువెళ్లటం, హెల్మెట్ ధరిస్తే తల, ముఖానికి గాలి ఆడకపోవటంవంటి కొన్ని కారణాలతో వాహనదారులు దీనిపై అంతగా ఆసక్తి చూపడంలేదు. అయితే ఈ నిర్లక్ష్యమే రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు నిండు ప్రాణాలను బలి తీసుకుంటోంది. వేచి చూసే ధోరణిలో.. వాస్తవానికి ఈ నెల ఒకటి నుంచి హెల్మెట్ తప్పనిసరి అని రవాణా అధికారులు, పోలీసులు చెప్పారు. వీటిని ధరించకపోతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అయినప్పటికీ జిల్లాలోని దాదాపు 4 లక్షల మంది ద్విచక్ర వాహనదారుల్లో కేవలం 20 శాతం మంది మాత్రమే హెల్మెట్ సమకూర్చుకున్నారు. మిగిలిన 80 శాతం మందిలో ఇంకా కదలిక మొద లు కాలేదు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో హెల్మెట్ల దుకాణాలు అనేకం వెలిసినా అమ్మకాలు మాత్రం అంతగా లేవు. హెల్మెట్ల ధరలు తెలుసుకుని వెళుతున్నారే తప్ప కొనుగోలు చేయడం తక్కువగానే ఉంటోంది. కౌన్సెలింగ్లతో చైతన్యం వచ్చేనా? హెల్మెట్ల నిబంధన అమలుపై ఓ 15 రోజులపాటు చూసీ చూడనట్టు వదిలేయాలని, తరువాత కొరడా ఝుళిపించాలని జిల్లా పోలీసు యంత్రాగం భావించింది. ఈలోగా పలుచోట్ల పోలీసులు నిఘా వేసి మోటారు సైకిళ్లను ఆపి వాహనదారుల పేరు, వాహనం నంబరు నమోదు చేసుకుంటున్నారు. రెండు వారాల్లో హెల్మెట్ సమకూర్చుకోవాలని సూచిస్తున్నారు. ఈసారి దొరికితే జరిమానా తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా మూడు నెలల పాటు జరిమానాల వంటి చర్యలు లేకుండా హెల్మెట్ ధారణ వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన పెంచాలని రవాణా శాఖ సూచించింది. నవంబర్ ఒకటి నుంచి హెల్మెట్లు ధరించని వారికి జరిమానాలు విధించాలని ఆదేశాలు వచ్చాయి. ఈ మూడు నెలల్లో ద్విచక్ర వాహనదారులందరూ హెల్మెట్లు కొనుగోలు చేసుకునేలా అవగాహన కల్పించనున్నారు. ఇప్పటికే రెండు నెలల నుంచి హెల్మెట్లపై ప్రకటనలు, ప్రచారాలు చేస్తున్నా వాహనదారుల్లో కదలిక లేదు. ఇక మూడు నెలల గడువు, కౌన్సెలింగ్లతో వారిలో చైతన్యం తేవడం సాధ్యమవుతుందా అని కొందరు పోలీసులు ప్రశ్నిస్తున్నారు. జరిమానాలతో తరచూ వాహనాలు తనిఖీ చేస్తుంటే అందరిలో మార్పు రావటానికి కనీసం ఆరు నెలల సమయమైనా పడుతుందని ఓ పోలీసు అధికారి అన్నారు. ఏది ఏమైనా రవాణా, పోలీసు శాఖలు హెల్మెట్లపై ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
నో హెల్మెట్.. నో ఫైన్
‘ఆగాగు.. హెల్మెట్ లేకుండా వెళ్తున్నావ్.. బండాపు. సార్ అక్కడున్నారు. వెళ్లి ఫైన్ కట్టు’ అంటూ హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలపై వచ్చీపోయేవారిని ఏలూరు పోలీసులు శనివారం ఇలా అడ్డుకున్నారు. ఒక్కరోజే నగరంలో 276 కేసులు నమోదు చేసి రూ.32 వేలు జరిమానా వసూలు చేశారు. అయితే, హెల్మెట్ లేకుండా వెళ్లే వారికి జరిమానాలు విధించవద్దని కలెక్టర్ కె.భాస్కర్ ఆదేశాలిచ్చారు. రెండు నెలలపాటు హెల్మెట్ వాడకంపై వాహన చోదకులకు అవగాహన కల్పించాలని.. ఆ తరువాతే జరిమానా వసూలు చేయాలని స్పష్టం చేశారు. ఏలూరు (ఆర్ఆర్ పేట) : హెల్మెట్ ధరించకుండా ప్రయాణించే ద్విచక్ర వాహన చోదకుల నుంచి రెండు నెలలపాటు జరిమానాలు వసూలు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆదేశించారని కలెక్టర్ కె.భాస్కర్ తెలిపారు. కలెక్టర్లు, పోలీస్, రవాణా శాఖ అధికారులతో శనివారం ఆయన వీడియో కాన్ఫెరెన్స్లో మాట్లాడుతూ ఈ మేరకు ఆదేశాలిచ్చారన్నారు. రానున్న రెండు నెలలపాటు ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ వాడేవిధంగా చైతన్యపరచాల్సి ఉంటుందన్నారు. ఆ తరువాత మాత్రమే ఫైన్ వసూలు చేయాలన్నారు. ఈ మేరకు జిల్లాలోని పోలీస్, రవాణా అధికారులకు ఆదేశాలిచ్చినట్టు కలెక్టర్ చెప్పారు. హెల్మెట్ ఎందుకు వాడాలి, దానివల్ల ప్రాణానికి ఎంత మేలు కలుగుతుందనే విషయాలపై ఈ రెండు నెలలపాటు వాహన చోదకులకు అవగాహన కల్పించేందుకు ‘ఫైన్ వద్దు.. చైతన్యం ముద్దు’ అనే కార్యక్రమం నిర్వహించాల్సి ఉందన్నారు. రెండు రోజుల్లో హెల్మెట్లకు సంబంధించి మార్గదర్శక సూత్రాలు పంపిస్తామని ప్రధాన కార్యదర్శి చెప్పారని, ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా.. నిబంధనల మేరకు తయారైన హెల్మెట్లను మాత్రమే మార్కెట్లో విక్రయించేలా చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్కు ఇన్చార్జి జేసీ షరీఫ్, డీఆర్వో కె.ప్రభాకరరావు, డ్వామా పీడీ రమణారెడ్డి, రవాణా శాఖ ఇన్స్పెక్టర్ ఎస్.శ్రీనివాస్, రవాణా శాఖ పరిపాలనాధికారి మాణిక్యాలరావు పాల్గొన్నారు. -
మెట్రో చిక్కులు..నగరవాసికి చుక్కలు!
మెట్రో రూట్లలో ట్రా‘ఫికర్’ ఎక్కువైంది. వర్షాలు..రోడ్లపై గుంతలు, మెట్రో రైలు పనుల కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లు నగరవాసికి చుక్కలు చూపిస్తున్నాయి. పది కిలో మీటర్ల దూరానికి గంటన్నర సమయం పడుతోంది. ఆర్టీసీ బస్సులు సైతం గంటలకొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి. అటు సమయానికి గమ్యం చేరక..ఇటు ఇంధన ఖర్చులు పెరిగి జనం విలవిల్లాడుతున్నారు. బైకులు బైటకు తీయాలంటేనే భయపడుతున్నారు. ఆటోవాలాలు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. మొత్తంగా మెట్రో పనులు నగరవాసికి ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు, చర్యలు చేపట్టినప్పటికీ అవి నామమాత్రంగా మారాయి. ట్రాఫిక్తో నానా అవస్థలు పడుతున్న జనం - పది కిలోమీటర్లు దాటాలంటే గంటన్నరకుపైగా సమయం - రోడ్లపై గుంతలతో వాహనచోదకులకు గుబులు - రోడ్ల విస్తరణను పట్టించుకోని మెట్రో అధికారులు మెట్రో రైలు ఎప్పుడు వస్తుందో దేవుడెరుగు...ఈ ప్రాజెక్టు పనులు మాత్రం నగరవాసులకు ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళ రోడ్డెక్కాలంటేనే వాహనదారులు భయపడుతున్నారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు...ఇలా ప్రతి ఒక్కరూ మెట్రో పనుల వల్ల సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారు. ఇప్పటికే రోడ్లపై గుంతలు, సూదుల్లా మొనదేలిన రాళ్లు, అడుగు తీసి...అడుగు వేసేందుకు హడలెత్తిపోతున్న రహదారుల్లో నానాయాతన పడుతున్న నగరవాసులకు మెట్రో పనులు మరింత నరకం చూపెడుతున్నాయి. బండి ఇంధనం కూడా బాగానే కాలుతోంది. ఖర్చు పెరుగుతోంది. అనుకున్న పనులు సమయానికి కావడం లేదు. మెట్రో పనులు జరుగుతున్న కొన్నిప్రాంతాల్లో రక్షణ చర్యలు కూడా తూతూ మంత్రంగానే ఉన్నాయి. ఇక వర్షాకాలం కావడంతో కొద్దిపాటి వర్షానికే రోడ్లపై ఉన్న గుంతల్లో నీరు వచ్చి చేరడంతో ఎక్కడ ఏ గుంత ఉందో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు. ప్రధానంగా 28.87 కిలోమీటర్ల ఎల్బీనగర్-మియాపూర్ (కారిడార్ 1) రూట్లో, 14.78 కిలోమీటర్ల జేబీఎస్-ఫలక్నుమా (కారిడార్ 2) రూట్ , 27.51 కిలోమీటర్ల నాగోల్-శిల్పరామం (కారిడార్ 3) రూట్లో జరుగుతున్న మెట్రో రైలు పనులు ప్రమాదాలకు, ట్రాఫికర్కు కేరాఫ్గా మారుతున్నాయి. ప్రత్యామ్నాయ రూట్లున్నా ఫలితం సున్నా.. పలు మార్గాల్లో ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించేందుకు జీహెచ్ఎంసీ,హెచ్ఎంఆర్ విభాగాలు ప్రత్యామ్నాయ రూట్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. కానీ ప్రధాన మార్గాల్లో మాత్రం ఆస్తుల సేకరణ ప్రక్రియ పూర్తిస్థాయిలో జరగకపోవడం, మెట్రో పనులు జరిగేందుకు రహదారి మధ్యలో బారికేడ్లు వేయడం అనివార్యమవడంతో రహదారులు కుంచించుకుపోయి ట్రాఫిక్ జంఝాటం తప్పడంలేదు. ట్రాఫిక్ విభాగం అంచనా ప్రకారం అత్యధిక చిక్కులు ఈ ప్రాంతాల్లోనే... - పంజగుట్ట, నాంపల్లి, ఎంజే మార్కెట్, చాదర్ఘాట్ బ్రిడ్జి, లక్డికాపూల్ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తీవ్రంగా ఉంది. ఒకవైపు మెట్రో పనులు..మరోవైపు వేలాది వాహనాలు ఒకేసారి రహదారులను ముంచెత్తుతుండడంతో సగటు వాహన వేగం గణనీయంగా తగ్గుతోంది. - నాగోల్, ఉప్పల్ క్రాస్రోడ్స్, ఎన్జీఆర్ఐ, మెట్టుగూడా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోంది. - నాగోల్- మెట్టుగూడ రూట్లో ఆరులేన్ల రహదారి అందుబాటులో ఉండడంతో పనులకు ఎలాంటి ఆటంకం కలగడంలేదు. కొద్దిమేర సమస్య తీవ్రత తగ్గింది. ఇక ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించేందుకు 97 ఆస్తులను ఇప్పటికే తొలగించారు. కబ్జాలను నిరోధించారు. ఇందుకోసం రూ.29.26 కోట్లు వ్యయం చేసినట్లు హెచ్ఎంఆర్ వర్గాలు తెలిపాయి. నిండా మునిగిన గ్రేటర్ ఆర్టీసీ! సాక్షి, సిటీబ్యూరో : మెట్రో రైలు పనుల వల్ల సిటీలో ప్రతినిత్యం ట్రాఫిక్ జామ్లు సాధారణమయ్యాయి. వాహనదారులు నిత్యం నరకం చూస్తున్నారు. ఇక ఆర్టీసీ సంస్థ ఆర్థికంగా తీవ్ర నష్టాల్లో మునుగుతోంది. ట్రాఫిక్ కారణంగా సిటీ బస్సులన్నీ గంటలకు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ ఆలస్యం ఇటు ప్రయాణికులను, అటు ఆర్టీసీని నష్టపరుస్తోంది. సాధారణంగా ఆర్టీసీ బస్సులు లీటర్ డీజిల్ వినియోగానికి 4.41 కిలోమీటర్ల సగటు దూరం పయనించాలి. కానీ ఏ ఒక్క బస్సు 3 కిలోమీటర్లు దాటి ముందుకు వెళ్లడం లేదు. లీటరుకు 4 కిలోమీటర్ల చొప్పున అయితే ప్రతి రోజు ఒక బస్సు 250 కిలోమీటర్ల దూరం తిరగడానికి 63 లీటర్ల డీజిల్ సరిపోతుంది. కానీ గతుకుల రోడ్లు, ట్రాఫిక్ రద్దీ, మెట్రో గుంతల కారణంగా ఒక బస్సుకు 80 లీటర్లకు పైగా డీజిల్ వినియోగించవలసి వస్తోంది. పడిపోయిన కేఎంపీఎల్ కారణంగా 28 డిపోల పరిధిలో 3850 బస్సులు తిరిగేందుకు ప్రతి రోజు ఇంధన వినియోగం 2.42 లక్షల నుంచి 3.80 లక్షలకు పెరిగింది. మొత్తంగా ఆర్టీసీపైన ఇంధన భారం భారీగానే పెరిగింది. రూ.140 కోట్ల నష్టాలతో నడుస్తున్న గ్రేటర్ ఆర్టీసీకి ఇది మింగుడుపడడం లేదు. ఆటోవాలాలకూ నష్టాలే మిగులుతున్నాయి. భారీగా ట్రిప్పుల రద్దు మెట్రో పనుల కారణంగా సిటీలో ఆర్టీసీ బస్సులు అనుకున్న మేర తిరగడం లేదు. ఆలస్యం అవుతున్నందున అధికారులు భారీగా ట్రిప్పులు రద్దు చేస్తున్నారు. సికింద్రాబాద్-కోఠీ (వయా ఆర్టీసీ క్రాస్రోడ్స్), మార్గంలోనూ, సికింద్రాబాద్-మెహదీపట్నం (వయా పంజగుట్ట), సికింద్రాబాద్-బీహెచ్ఈఎల్ తదితర అన్ని రూట్లలో ప్రతి రోజు వేల సంఖ్యలో ట్రిప్పులు రద్దవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లోని 1050 రూట్లలో సిటీ బస్సులు ప్రతి రోజు 42 వేల ట్రిప్పులు తిరుగుతున్నట్లు అంచనా. కానీ సగటున రోజుకు 5 వేల నుంచి 7 వేల ట్రిప్పులు రకరకాల కారణాల వల్ల రద్దవుతున్నాయి. -
చిన్న తప్పుకు పెద్ద శిక్ష
- హెల్మెట్ ధరించక బలవుతున్న వాహనచోదకులు - తలకు గాయమై చనిపోయే వారే అధికం - జులై 1 నుంచి హెల్మెట్ వాడకం తప్పనిసరి రవి, కృష్ణ ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఒకరోజు ఇద్దరూ ద్విచక్రవాహనంపై బయలుదేరి వేరే ప్రాంతానికి వెళ్తున్నారు. ఇంతలో గాలితో కూడిన వర్షం మొదలైంది. కంటిమీద చినుకులు పడటంతో చేతిని అడ్డుపెట్టుకొని బైక్ నడుపుతున్నాడు రవి. బలంగా చినుకులు తాకడంతో వాహనాన్ని అదుపు చేయలేక రోడ్డు పక్కనే ఉన్న చెట్టుని ఢీకొట్టాడు. ప్రమాదంలో ఇద్దరికి తలకు తప్పించి మిగిలిన ఏ చోటా పెద్దగా గాయాలు కాలేదు. ఇది గమనించిన స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను రక్షించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే స్నేహితులిద్దరూ ఈ లోకాన్ని విడి చిపెట్టారు. శిరస్త్రాణం ధరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో.? - విశాఖపట్నం (తాటిచెట్లపాలెం) ప్రపంచంలోనే అత్యధిక రోడ్డుప్రమాదాలు సంభవిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. దేశవ్యాప్తంగా రోజుకు దాదాపు 381 మంది వాహనచోదకులు ప్రమాదాలకు గురై అశువులు భాస్తున్నారు. ప్రతి చిన్న విషయానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకునే మనిషి, వాహనాన్ని నడిపే సమయానికి ముందు తన ప్రాణాలకు రక్షణ కల్పించే శిరస్త్రాణం ఎందుకు ధరించడో అర్థం కావడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించడంతో పాటు వాహనచోదకులు తమకు తాము జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. హెల్మెట్ ఈ విధంగా రక్షణ కల్పిస్తుంది.. హెల్మెట్ ధరించడం వల్ల 85 శాతం వరకు మెదడుకు రక్షణ ఉంటుంది. ప్రమాదాలన్నీ అకస్మాత్తుగా సంభవిస్తాయి. అటు వంటి సమయంలో మెదడు నుంచి శరీరంలోని వివిధ భాగాలకు సమాచారాన్ని అందజేసే నాడులు అంతే వేగంతో ప్రతి స్పందిచ లేవు. ఆ సమయంలో హెల్మెట్ ధారణ ప్రమాదాల నుంచి రక్షిస్తుంది. ఏ తరహా హెల్మెట్ ధరించాలి.. మన దృష్టిని ఆటంకపరిచే విధంగా ఉండకూడదు. తక్కువ బరువు కలిగినదై ఉండాలి. అలసటను క లిగించనిదై ఉండాలి. చర్మవ్యాధులకు కారణం కానిదై ఉండాలి. స్ట్రాప్ తప్పనిసరిగా ఉండాలి. స్ట్రాప్ లేకుండా ధరించడం అంటే హెల్మెట్ ధరించకపోవడమే.. తెల్లని/ప్రకాశవంతమైన హెల్మెట్ ధరించాలి. హెల్మెట్లు అధికృతమైన వై ఉండాలి. ఇవీ పాటించండి.. సేఫ్టీ కల్చర్ను అలవరుచుకోవడం.. హెల్మెట్ ధారణ చేసినా నియమిత వేగపు హద్దుల్ని పాటించడం.. 60 కిలోమీటర్ల వేగ పరిమితి అయితే 55 కి.మీ వేగాన్ని పాటించడం.. వేగం పరిమితులు లేని చోట 80 కిలోమీటర్ల వేగాన్ని దాటకపోవడం -
గీత దాటితే.. మోతే!
సాక్షి, కర్నూలు: వాహన చోదకులూ.. జర జాగ్రత్త. ట్రాఫిక్ నిబంధనలు బేఖాతరు చేశారో ఇక అంతే సంగతులు. నిఘా కళ్లు మీమ్మల్ని వెంటాడబోతున్నాయి. కెమెరా కన్ను ప్రతిపక్షణం పహారా కాయబోతోంది. అసాంఘిక శక్తుల ఆటకట్టించడమే కాదు.. అక్రమాక్కుల ఆగడాలను కట్టడి చేయడమే ధ్యేయంగా కర్నూలు పోలీసు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే.. వాహనదారుని చిరునామాకే ఈ-చలాన్(జరిమానా) పంపేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపడుతున్నారు. సో.. బీ కేర్ ఫుల్. ఈ-నిఘా ఎలాగంటే! కర్నూలు నగర పరిధిలో పోలీసులు ప్రారంభించిన ఈ-నిఘా వ్యవస్థ సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే నగరంలో ట్రాఫిక్ అనుబంధ సమస్యలను పరిష్కరించేందుకు 30 ప్రాంతాల్లో 120 కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఇకపై నిబంధనలు ఉల్లఘించిన వారిపై కొరడా ఝళిపించేందుకు రంగం సిద్ధమవుతోంది. సిగ్నల్స్ చూడకుండా రయ్.. రయ్మంటూ దూసుకెళ్లే వాహనాలకు ముకుతాడు వేయనున్నారు. నిర్విరామంగా పనిచేసే ఈ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా ఉల్లంఘనులను గుర్తించనున్నారు. ఇంటికే ఈ-చలాన్ ఇప్పటి వరకు ట్రాఫిక్ పోలీసులు రహదారులపై నిలబడి అనుమానం వచ్చిన వాహనాలను ఆపి రికార్డులను పరిశీలించి.. ఏవైనా పత్రాలు సరిగా లేకపోతే ఆ మేరకు జరిమానా విధించి డబ్బులు వసూలు చేసేవారు. అయితే కొందరు అధికారులకు ఈ విధులు వరంగా మారాయి. వాహనదారులకు రసీదులు ఇవ్వకుండా వారి నుంచి వసూలు చేసిన మొత్తాలను తమ జేబుల్లో నింపుకుంటున్నట్లు ఆరోపణలు అనేకం. ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు ఉన్నతాధికారులు నిర్ణయించారు. ట్రాఫిక్ పోలీసుల కళ్లు గప్పి నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులను.. కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాల ద్వారా గుర్తించి వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ల ఆధారంగా వారి చిరునామాలకే ఈ-చలాన్లు పంపడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే అధికారులను ఇకపై కేవలం చలాన్ రాయడానికే పరిమితం చేసి.. జరిమానాను ఆన్లైన్ చెల్లింపుల ద్వారా వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. జిల్లాలో కీలకం కానున్న ఈ-నిఘా వ్యవస్థ ఈ-నిఘాను సమర్థంగా అమలు చేసి కెమెరాల వ్యవస్థను పటిష్టం చేయడానికి ప్రణాళిక సిద్ధమవుతోంది. కర్నూలు జిల్లా పరిధిలో 6 పోలీసు సబ్ డివిజన్లు ఉన్నాయి. వీటి ద్వారా శాంతిభద్రతల పర్యవేక్షణ జరుగుతోంది. దీంతో పాటు ఆంధ్ర-కర్ణాటక సరిహద్దులోని కర్నూలులో ఎప్పటికప్పుడు తనిఖీలు ముమ్మరం చేయడం ద్వారా నిఘా వ్యవస్థను పటిష్టం చేసుకోవాల్సిన బాధ్యత వీరిపై ఉంది. లక్ష్యాలు ఎక్కువగా ఉండడం.. ఉన్న సిబ్బందితోనే అన్ని పనులు చేయాల్సి రావడంతో పోలీసు శాఖపై ఒత్తిడి అధికమవుతోంది. ఇది నేరాల దర్యాప్తు, నియంత్రణపైనా తీవ్ర ప్రభావం చూపుతున్న దృష్ట్యా కర్నూలు పోలీసు ఉన్నత వర్గాలు ప్రత్యేక ప్రణాళికలకు శ్రీకారం చుట్టాయి. నేరాల్లో ఆధారాల సేకరణకు ఎక్కువ సమయం తీసుకుంటుండడం, ఇదే అదునుగా నేరాగాళ్లు తప్పించుకుంటున్నారన్న అపవాదు ఉండడంతో సులభంగా ఆధారాలను సేరకించేందుకు అవసరమైన మార్గాలను ఆన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోనే తొలిసారి జిల్లావ్యాప్తంగా ఈ-నిఘా వ్యవస్థను సంపూర్ణంగా అమలు చేసే దిశగా కసరత్తు ముమ్మరమైంది. -
ఫైన్.. ఇక ఆన్లైన్ !
► వాహనచోదకులకు ఊరట ► అపరాధ రుసుం చెల్లింపు సులభతరం ► తుదిమెరుగులు దిద్దుతున్న అధికారులు ► పక్షం రోజుల్లో అమల్లోకి.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనచోదకులు జరిమానాలు ఇకమీదట ఆన్లైన్లో చెల్లించవచ్చు. ఇందుకు నగర పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ సిటీ : నగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారుల వద్ద పోలీసుల చేతివాటానికి చెక్ పెట్టిన కమిషనరేట్ అధికారులు.. వాహనదారుల అపరాధ రుసుం చెల్లింపు ప్రక్రియను సులభతరం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. వారు సమయం వృథా చేసుకోకుండా ఆన్లైన్లో చెల్లింపు విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇది పక్షం రోజుల్లో అమల్లోకి రానున్నట్టు కమిషనరేట్ అధికారులు చెబుతున్నారు. సిబ్బందికి నేరుగా జరిమానా చెల్లించే అవకాశం లేకుండా చేసేందుకే ఈ విధానాలను రూపొందించారు. ఇప్పుడిలా.. ప్రమాదకర డ్రైవింగ్, వన్వే ఉల్లంఘనలు, సెల్ఫోన్ డ్రైవింగ్ వంటి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి ఫొటోలను చిత్రీకరించి ఈ-చలాన్లు జారీ చేస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో రోజుకు సగటున 500 ఈ-చలాన్లు జారీ అవుతున్నాయి. డ్రైవింగ్ లెసైన్స్, ఆర్సీ పుస్తకాలు, పొల్యూషన్, ఇన్సూరెన్స్ తదితర నిబంధనలు ఉల్లంఘించే వారికి వెహికల్ చెక్ రిపోర్టు (వీసీఆర్) జారీ చేసి వాహనం సీజ్ చేసి మహిళా పోలీసు స్టేషన్ వద్దనున్న డంపింగ్ యార్డ్కు తరలిస్తున్నారు. ఇలా రోజుకు 150 వాహనాలు వస్తున్నాయి. ఈ తరహా నిబంధనలు ఉల్లఘించే వారు ప్రస్తుతం బందరురోడ్డులోని కె.ఎస్.వ్యాస్ కాంప్లెక్స్లోని ట్రాఫిక్ కంట్రోల్ బూత్కి వెళ్లి అపరాధ రుసుం చెల్లించాలి. అక్కడి వరకు వెళ్లి క్యూలో నిలబడి ఈ-చలానా రుసుం చెల్లించాలంటే ఒకరోజు పని మానుకోవాలి. ఇది వీలుపడని స్థితిలో పదేపదే నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడి వాహనం సీజ్ చేసే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. ఇలా సీజ్ చేసిన వాహనానికి సంబంధించిన యజమాని విధిగా అక్కడికి వెళ్లి జరిమానా చెల్లించి బండిని విడిపించుకోవాల్సి వస్తోంది. ఆన్లైన్లో.. మరో పక్షం రోజుల్లో అమల్లోకి రానున్న ఆన్లైన్ విధానంలో వాహనదారులు సమయం వృథా కాకుండానే అపరాధ రుసుం చెల్లించే వెసులుబాటు ఉంటుంది. నగర ట్రాఫిక్ పోలీసులు నిబంధనల ఉల్లంఘనలపై ఈ-చలాన్ల జారీతో పాటు పోలీసు వెబ్సైట్లో కూడా ప్రదర్శిస్తున్నారు. వెబ్సైట్లోని ఈ-చలానా విధానంలోకి వెళ్లి వాహనం నంబరు కొడితే నిబంధనల ఉల్లంఘన తెలిసిపోతుంది. ఆ పక్కనే జరిమానా చెల్లింపు (పేమెంట్) ఆప్షన్ పొందుపరుస్తున్నారు. అక్కడ క్లిక్ చేస్తే నగదు చెల్లింపు విధానాలు ఉంటాయి. ఆన్లైన్, డెబిట్, క్రెడిట్ కార్డుల్లో దేనినైనా ఉపయోగించి జరిమానా చెల్లించొచ్చు. ఇందుకు నామమాత్రపు రుసుం వసూలు చేస్తారు. సీజ్ చేసినవాటికి కూడా ఈ విధంగానే జరిమానా చెల్లించి డంపింగ్ యార్డ్ నుంచి వాహనం సులువుగా పొందే అవకాశం ఉంది. -
నకిలీ రసీదులు.. రెట్టింపు వసూళ్లు!
- ఆశీలు వసూలులో కాంట్రాక్టర్ నిర్వాకం - రాజాం నగర పంచాయతీలో దందా - నిత్య దోపిడీకి గురవుతున్న వ్యాపారులు, వాహనదారులు - కమిషనర్కు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం - దాంతో కలెక్టర్ను ఆశ్రయించిన స్థానికులు రాజాం : కాంట్రాక్టర్ అత్యాశకు పోతున్నాడు. కమిషనర్ స్పందించడం లేదు. ఇంకేముంది.. వ్యాపారులు, వాహనాల యజమానులు నిత్యం దోపిడీకి గురవుతున్నారు. ఇదంతా రాజాం నగర పంచాయతీ పరిధిలో ఆశీలు వసూళ్లలో జరుగుతున్న తంతు. ఆశీలు కాంట్రాక్టర్ నకిలీ బిల్లులు ముద్రించి వాహనాలు, షాపుల నుంచి నిర్ణీత రేట్ల కంటే 100 నుంచి 200 శాతం అధికంగా వసూలు చేస్తున్నారని పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నగర పంచాయతీ కమిషనర్కు, జిల్లా కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేశారు. నగర పంచాయతీ మార్కెట్లలో షాపులు, వాహనాలు, వ్యాపారుల నుంచి రోజువారీ ఆశీలు వసూలుకు ప్రతి ఏటా వేలం పాట నిర్వహిస్తుంటారు. నగర పంచాయతీ ఏర్పాటైనప్పటి నుంచి రూ.6 లక్షల వరకు పాట వెళ్లేది. అయితే ఆదాయం పెంచుకోవాలన్న ఉద్దేశంతో అధికారులు పార్కింగ్, షాపుల ఫీజులను 100 నుంచి 150 శాతం వరకు పెంచి 2015-16 ఆర్థిక సంవత్సరానికి ఆశీలు వేలం నిర్వహించారు. పట్టణానికి చెందిన ముతికి వెంకట్రావు అనే వ్యక్తి రూ.15 లక్షలకు ఆశీలు కాంట్రాక్టు చేజిక్కించుకున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వర్తక, వ్యాపార సముదాయాలు, వాహనదారుల నుంచి ఆశీలు వసూలు ప్రారంభించారు. అయితే నగర పంచాయతీ గెజిట్లో పేర్కొన్న రేట్ల ప్రకారమే వసూలు చేయాల్సి ఉండగా.. నిబంధనలకు విరుద్ధంగా అంతకు రెండుమూడు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. ఇందుకోసం నకిలీ రసీదులు ముద్రించారు. రసీదులపై నగర పంచాయతీ సీలు తప్పనిసరిగా ఉండాలి. కానీ ఈయన ఇస్తున్న రసీదులపై దొంగ ముద్రలు కనిపిస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఒక లారీకి గెజిట్ ప్రకారం రూ.83 ఆశీలు వసూలు చేయాల్సి ఉండగా.. కాంట్రాక్టర్ రూ.200 వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ పలువురు డ్రైవర్లు రసీదులు కూడా చూపించారు. అదేవిధంగా షాపులు, ఇతర తోపుడు బళ్లు, చిరువ్యాపారుల నుంచి నిర్ణీత ఫీజు కంటే 200 శాతం అధికంగా వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమ సంపాదనే తక్కువని.. అందులోనూ దోపిడీకి పాల్పడితే తామెలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ తీరుకు నిరసనగా పారంకోటి సుధ, ఆశపు సూర్యం, పల్ల అప్పలనాయుడు, వంజరాపు రాము తదితరులు ఇటీవల నగర పంచాయతీ కమిషనర్ సింహాచలాన్ని కలిసి పిర్యాదు చేశారు. దీన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటానని కమిషనర్ వారికి చెప్పారు. అయినా వసూళ్లు ఆగకపోవడంతో బాధితులు మంగళవారం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. -
చార్జీల కొరడా
♦ జిల్లా టార్గెట్ రూ. 20 కోట్లు ♦ రెట్టింపైన చార్జీలు ఇప్పటికే అమల్లోకి.. ఖజానాకు దండిగా ఆదాయాన్ని సమకూర్చేందుకు రవాణా శాఖ వాహనదారులకు యూజర్ చార్జీల బాదుడు మొదలుపెట్టింది. రూ. 20 కోట్లు వసూళ్ల లక్ష్యంగా అన్ని రకాల సేవల చార్జీలను అమాంతం నూరు శాతం పెంచేసింది. సాక్షి, విజయవాడ : వాహనదారులకు రవాణా శాఖ గట్టి షాక్ ఇచ్చింది. రవాణా సేవలకు ఉన్న చార్జీలను భారీగా పెంచింది. తద్వారా జిల్లాలో భారీగా ఆదాయం పొందాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా యూజర్ చార్జీలను పెంచి వాహనదారుల నడ్డి విరిచింది. ఇప్పటికే పెరిగిన చార్జీలు అమల్లోకి వచ్చాయి. గత ఏడాది జిల్లాలో యూజర్ చార్జీల ద్వారా వచ్చిన ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం రెట్టింపు కానుంది. రూ. 20 కోట్ల వసూళ్లే లక్ష్యంగా ఈ శాఖ పనిచేయనుంది. 2001లో యూజర్ చార్జీలను నిర్ణయించి ప్రతి సేవకు నామమాత్రంగా ఫీజులు తీసుకునేవారు. ఈ శాఖ ద్వారా సుమారు 20కి పైగా సేవలు అందుబాటులో ఉన్నాయి. డ్రైవింగ్ లెసైన్స్ మొదలుకొని నూతన వాహన రిజిస్ట్రేషన్ వరకు అనేక సేవలను అమలు చేస్తూ నిత్యం రవాణా శాఖ కార్యాలయాలు వినియోగదారులతో కిటకిటలాడుతుంటాయి. నగరంలో ఉన్న డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కార్యాలయంతోపాటు గుడివాడ, నందిగామల్లో ఆర్టీవో కార్యాలయాలు, నాలుగు చోట్ల యూనిట్ ఆఫీసులు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకి ఐదువేల వరకు వివిధ లావాదేవీలు జరుగుతుంటాయి. వీటిలో 50 శాతం నగరంలోని డీటీసీ కార్యాలయంలోనే జరుగుతుంటాయి. జిల్లాలో రోజుకి సగటున 500 కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు, కొత్త లెసైన్స్లు, లెసైన్స్ల రెన్యువల్స్ కలిపి సుమారు 1000 వరకు జరుగుతుంటాయి. వాహన ట్రాన్స్ఫర్స్, చిరునామా మార్పు, సేల్, ఫిట్నెస్ సర్టిఫికెట్, పర్మిట్ల జారీ, ఇతర సేవలు అన్నీ కలిపి 3500 లావాదేవీలు జరుగుతున్నాయి. వీటి ద్వారా రోజుకి సగటున రూ. 3 లక్షల పైనే యూజర్ చార్జీల ద్వారా ఆదాయం వస్తుంది. పెరిగిన చార్జీలతో ఇది రూ. 6 లక్షలు దాటే అవకాశం ఉంది. లెర్నింగ్ లెసైన్స్ (ఎల్ఎల్ఆర్)కు గతంలో ఫీజు రూ. 30 కాగా ఇప్పుడు రూ. 60 చేశారు. ద్విచక్ర వాహనాల లెసైన్స్కు రూ. 100 చార్జీ ఉండగా ఇప్పుడు రూ. 150గా మార్చారు. గతంలో రూ. 100 ఉన్న లారీలు, కార్లు, బస్సుల రిజిస్ట్రేషన్ ఫీజును రూ.150కు పెంచారు. రవాణా శాఖకు వచ్చే ఆదాయంలో యూజర్ చార్జీల ద్వారా వచ్చేది 10 శాతంగా ఉంటుంది. అన్ని సేవలకు సంబంధించి కనీస రుసుము కడితేనే సంబంధిత దరఖాస్తు పరిశీలిస్తారు. నూరు శాతం పెరిగిన చార్జీలు యూజర్ చార్జీల ద్వారా 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.20 కోట్లు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అన్ని రకాల చార్జీలు సగటున 50 నుంచి వంద శాతం పెరిగాయి. ఆదాయం కూడా రెట్టింపయింది. ఏటా రవాణా శాఖ వివిధ రకాల సేవలకు సంబంధించి వచ్చే ఆదాయాన్ని ముందుగానే అంచనా వేసి టార్గెట్లు నిర్దేశిస్తారు. అలా నిర్దేశించిన టార్గెట్లతో 80 శాతం వరకు లక్ష్యం చేరుకుంటున్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ. 6.64 కోట్లు లక్ష్యం కాగా రూ. 5.76 కోట్లు రాబట్టగలిగారు. 2014-15కు రూ. 8.82 కోట్లు లక్ష్యం కాగా రూ. 7.80 కోట్లు రాబట్టగలిగారు. ఈ పరిణామాల క్రమంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రెట్టింపవుతుందని ముందుగానే అంచనా కట్టి దానికి అనుగుణంగా లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నారు. -
రవాణా సేవలకు ఛార్జీల మోత
► జిల్లా ప్రజలపై రూ.10 కోట్లకు పైగా భారం ► ఖజానాకు ఆదాయం పెంపే లక్ష్యం విశాఖపట్నం : వాహనదారులపై మరో భారం పడింది. రవాణా సేవలు పొందే వినియోగదారుల నుంచి సర్వీస్, యూజర్ ఛార్జీల ధరలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాన్స్పోర్ట్, నాన్ ట్రాన్స్పోర్ట్ విభాగాల్లో ఆయా సేవలు బట్టి ధరలు అమాంతంగా పెంచారు. 50 నుంచి 100 శాతం వరకూ ఛార్జీల మోత మోగించారు. దీంతో ఏడాదికి జిల్లా ప్రజలపై రూ.10 కోట్లకు పైగా భారం పడనుంది. డ్రైవింగ్ లెసైన్స్లు, కొత్త వాహనాల రిజస్ట్రేషన్లు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్లు, రోడ్ టాక్స్ చెల్లించే వారికి ధరల భారం ఉంటుంది. 2014-15 ఏడాదిలో ఫీజుల రూపంలో రూ.23.16 కోట్లకు గానూ రూ.20.17 కోట్లు రాబట్టారు. యూజర్ ఛార్జీలు రూ.8.04 కోట్లకు రూ.6.49 కోట్లు వసూలు చేశారు. పన్నులు, ఇతరత్రా సేవలుగా ఫీజులు, యూజర్ ఛార్జీల చెల్లింపులతో సర్వీసు ఛార్జీలు ముడిపడి ఉండగా వాటిని వసూలు చేస్తారు. రవాణా ఆదాయ లక్ష్యం రూ.348 కోట్లు ! రాష్ట్ర ప్రభుత్వం 2015-16 ఏడాదికి సుమారు రూ.348 కోట్ల ఆదాయం లక్ష్యంగా నిర్దేశించినట్టు సమాచారం. గతేడాదితో పోల్చితే దాదాపు 15 శాతం ఆదాయ లక్ష్యాన్ని పెంచినట్టు భోగట్టా. ఆయా జిల్లాలకు ఆదాయ లక్ష్యం 15 నుంచి 20 శాతం పెంచినట్టు తెలిసింది. అయితే సీఎం చైనా పర్యటనలో ఉండటంతో లక్ష్యం పూర్తిగా ఖరారు కాలేదు. సీఎం ఆమోదంతో ఒక్కో జిల్లాకు ఆదాయ లక్ష్యం అధికారికంగా ప్రకటించనున్నారు. 2014-15 ఏడాదికి రూ.302 కోట్ల ఆదాయం నిర్దేశించగా రూ.225.27 కోట్ల ఆదాయం సమకూరింది. ఏడాదిలో 75 శాతం ఫలితాలతో రాష్ట్రంలో విశాఖకు ఐదో స్థానం దక్కింది. ఆదాయం పెంచుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది లక్ష్యాన్ని గణనీయంగా పెంచింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రాకు ఆదాయ వసూళ్లు తగ్గాయని, లక్ష్య సాధన కోసం అధికారులు శక్తి వంచన లేకుండా పనిచేయాలని రవాణశాఖ కమిషనర్ జిల్లాల అధికారులకు బోధించినట్టు సమాచారం. త్రైమాసిక పన్నుల వసూళ్లలో అలసత్వం ప్రదర్శించవద్దని కమిషనర్ ఆదేశించినట్టు తెలిసింది. తనిఖీలు విస్తృతం చేసి పన్నుల ద్వారా ఆదాయం రాబట్టాలని తెలియజేసినట్టు వినికిడి. -
వంతెనపై వసూల్ రాజాలు
- పోలీసుల ‘దారి’ దోపిడీ - వాహనచోదకుల నుంచి - భారీగా గుంజుడు ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రారంభించకపోయినా.. గోదావరిపై నాలుగో వంతెనపై రాకపోకలకు ప్రజలు ఇప్పటికే శ్రీకారం చుట్టారు. అటు రోడ్ కమ్ రైలు వంతెనను మరమ్మతులకోసం మూసివేయడం.. రావులపాలెం, ధవళేశ్వరం బ్యారేజి మీదుగా రాజమండ్రి చేరుకోవడం దూరం కావడంతో.. లారీలు, కార్లు, ఇతర వాహనాలు నాలుగో వంతెన పైనుంచే అనధికారికంగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఇదే అదునుగా పోలీసు శాఖలోని వసూల్ రాజాలు చెలరేగిపోతున్నారు. వాహనానికింత అని రేటు నిర్ణయించి అక్రమంగా వసూళ్లు చేస్తున్నారు. డ్యూటీతో సంబంధం లేకుండా వంతెనపై యథేచ్ఛగా దందా సాగిస్తున్నారు. రాజమండ్రి :గోదావరి నాలుగో వంతెనపై పోలీసుల వసూళ్లదందా పట్టపగ్గాల్లేకుండా సాగుతోంది. అనధికారికంగా వంతెనపై రాకపోకలు సాగిస్తున్న వాహనచోదకులను అడ్డుకుని భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. లారీలు, ద్విచక్ర వాహన చోదకుల నుంచి ప్రతి రోజూ వేలాది రూపాయలు దోపిడీ చేస్తున్నారు. రాజమండ్రి - కొవ్వూరు మధ్య ఉన్న రోడ్డు కమ్ రైలు వంతెనపై మరమ్మతుల కోసం ఈ నెల 2 నుంచి వాహనాల రాకపోకలు నిలిపివేశారు. వంతెన పనులు 45 రోజులపాటు జరిగే అవకాశమున్నందున వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. దీంతో వాహనదారులు ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా రాకపోకలు సాగించాల్సి వస్తోంది. దీనిపై కేవలం ద్విచక్ర, త్రిచక్ర వాహనాలతోపాటు బస్సులను మాత్రమే అనుమతించారు. దీంతో రావులపాలెం మీదుగా లారీలు ప్రయాణించాల్సి వస్తోంది. దీనివల్ల కనీసం 90 కిలోమీటర్లు చుట్టుతిరిగి వెళ్లాల్సి వస్తోంది. ఇదే సమయంలో రాజమండ్రి - కొవ్వూరు మధ్య దాదాపు నిర్మాణం పూర్తవుతున్న నాలుగో వంతెనపై నుంచి వాహనచోదకులు రాకపోకలు ఆరంభించారు. ఈ వంతెనను ప్రభుత్వం ఇంతవరకూ ప్రారంభించలేదు. అయినప్పటికీ దాదాపు నిర్మాణం పూర్తి కావస్తున్న ఈ వంతెన పైనుంచి లారీలు, కార్లు, ద్విచక్ర వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారు. దీనివల్ల వారికి సమయంతోపాటు ఇంధనం ఆదా అవుతోంది. ముఖ్యంగా రావులపాలెం మీదుగాకంటే నాలుగో వంతెన మీద రాకపోకలు చేసేవారికి విశాఖ - విజయవాడ మధ్య సుమారు 45 కిలోమీటర్ల దూరం కలిసివస్తోంది. దీంతో వారు కూడా ఈ వంతెన పైనుంచే రాకపోకలు సాగిస్తున్నారు. రాజమండ్రి - కొవ్వూరు మధ్య వాహనదారులకు ధవళేశ్వరం బ్యారేజికంటే ఈ వంతెన మీదుగానే రాకపోకలు సులువవుతోంది. కాతేరువద్ద అప్రోచ్ రోడ్డు నుంచి కిందకు దిగి అక్కడ నుంచి నేరుగా రాజమండ్రి నగరంలోకి వస్తున్నారు. దీంతో వందలమంది ద్విచక్ర వాహనదారులు ఈ వంతెనమీదుగా రాకపోలు సాగిస్తున్నారు. అనధికారికంగా సాగుతున్న ఈ రాకపోకలే పోలీసులకు కాసుల పంట పండిస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో సంబంధం లేకుండా ఎవరు పడితే వారు రోడ్డుమీద స్వతంత్రంగా బీటు వేసి అక్రమంగా డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారు. ముగ్గురు ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఇక్కడ దందా సాగిస్తున్న పోలీసులు లారీకి రూ.300 నుంచి రూ.500 వరకు, కార్లు, ఇతర చిన్నవాహనదారుల నుంచి రూ.200, ద్విచక్ర వాహనదారుల నుంచి రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారు. రాజమండ్రి, రాజానగరం, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు స్టేషన్లకు చెందిన పోలీసులు వంతుల వారీగా ఎవరికి వారు డ్యూటీలు వేసుకున్నట్టుగా వసూళ్ల దందాకు పాల్పడుతుండడంతో వాహనచోదకులు బెంబేలెత్తుతున్నారు. వెను తిరిగే వీలు లేకుండా వంతెన మొదట్లో కాపు కాయడంతో అడిగినంతా పోలీసుల చేతిలో పెట్టాల్సి వస్తోంది. రాత్రి వేళల్లో అయితే పోలీసుల దోపిడీకి పట్టాపగ్గాల్లేకుండా పోతోంది. నైట్బీట్ వేస్తే నగరంలో గస్తీ తిరగడం మాని ‘చలో నాలుగో వంతెన’ అంటూ పోలీసులు తరలిపోవడం వెనుక ఈ దందాయే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకసారి ఇక్కడ బీటు వేస్తే చాలు రోజుకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ అయాచితంగా వచ్చి పడుతోంది. దీంతో ఇక్కడ అనధికార డ్యూటీ చేసేందుకు పోలీసులు ఎగబడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ దారిదోపిడీని నిలువరించాలని వాహనచోదకులు కోరుతున్నారు. -
పోస్టాఫీసుల్లోనూ...
* ట్రాఫిక్ ఈ-చలాన్ చెల్లించే సదుపాయం * నేటి నుంచి అందుబాటులోకి... సాక్షి, సిటీబ్యూరో: ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడి.. ఈ-చలాన్ బారిన పడిన వాహనదారులు ఇక నుంచి పోస్టాఫీసుల్లోను డబ్బులు చెల్లించవచ్చు. ఈ మేరకు పోస్టల్, ట్రాఫిక్ శాఖ అధికారుల మధ్య ఒప్పందం కుదిరింది. నగరంలోని 250 పోస్టాఫీసుల్లో పెండింగ్ చలాన్ రుసుం చెల్లించే అవకాశాన్ని ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ జితేందర్ కల్పించారు. సోమవారం నుంచి ఈ సదుపాయం అందు బాటులోకి తెస్తున్నారు. నగరంలో సుమారు 40 లక్షల పెండింగ్ చలానాలున్నాయి. వీరి నుంచి సుమారు రూ.80 కోట్ల రూపాయలు వసూలు కావాల్సి ఉంది. ఇటీవలే నగదు రహిత చలాన్ విధానాన్ని ట్రాఫిక్ పోలీసులు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు నగదు చెల్లించనవసరం లేదు. తమకు నగదు చెల్లించమని ట్రా ఫిక్ సిబ్బంది లేదా ఏ అధికారైనా అడిగితే 9010203626 నెంబర్కు ఫిర్యాదు చేయొచ్చు. చలాన్లను సెల్ఫోన్ల ద్వారా చెల్లించేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా యాప్ను సైతం రూపొందించారు. ఈ యాప్ను ప్లేస్టోర్లోకి వెళ్లి ఈ-చలాన్ తెలంగాణ అని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. ఈ యాప్ ద్వారా మీ వాహనంపై ఏమైనా పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉన్నాయా ? అనే విషయాన్ని కూడా చూసుకోవచ్చు. ఇక నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించే వారు ఠీఠీఠీ.జ్టిఞ.జౌఠి.జీ వెబ్సైట్ తెరచి, అందులో ఈ-చలాన్ స్టాటస్పై క్లిక్ చేయాలి. చలాన్ ఇలా కూడా చెల్లించవచ్చు... * డెబిట్, క్రెడిట్ కార్డులు, ఎస్బీహెచ్, ఐసీఐసీఐ,ఆంధ్రబ్యాంక్ ద్వారా. * ఈ-సేవా, మీ-సేవా సెంటర్లు * ఏపీ ఆల్లైన్ సెంటర్లు * పబ్లిక్ గార్డెన్ ఎదురుగా ఉన్న ట్రాఫిక్ * కంపౌండింగ్ బూత్ నెట్ బ్యాంకింగ్ ... -
మూడో విడత ఫ్యాన్సీ నెంబర్ల వేలం
* నేటి నుంచి ప్రారంభం.. నెలాఖరు వరకు గడువు * ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా ఈ వేలంలో పేరు నమోదు న్యూఢిల్లీ : ఫ్యాన్సీ నెంబర్లు అవసరం ఉన్న వాహనదారులకు మరో అవకాశం లభించింది. ఫ్యాన్సీ నెంబర్ల కోసం మొదటి, రెండు దఫాల్లో నిర్వహించిన రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో నెంబర్లు తీసుకోని వారికి ప్రభుత్వం మూడో విడత అవకాశాన్ని కల్పించింది. ఈ సారి ఈ -వేలం విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రభుత్వ తెలిపిన వివరాల ప్రకారం. 0001 రిజిస్ట్రేషన్ నెంబర్ అత్యంత ఆదరణ ఉంది. దీనికి రూ. 5లక్షలుగా ఫిక్స్డ్గా నిర్ణయించారు. రెండో ప్రాధాన్యతా నెంబర్ 0002-0009 రూ. ప్రారంభ ధర రూ. 3 లక్షలు, మూడో కేటగిరిలో 0010 నుంచి 009, 0786, 1000, 1111, 7777, 999 దీని ధరను రూ. 2 లక్షలుగా నిర్ణయించిన రవాణాశాఖాధికారులు పేర్కొన్నారు. ఈ వేలం ద్వారా నెంబర్లను కేటాయించే విధానం డిసెంబర్ 30 వరకు కొనసాగుతోంది. మూడో విడతలో 140 ఫ్యాన్సీ నెంబర్లను కేటాయించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకొన్నామని చెప్పారు. ఈ నెంబర్లను కావల్సి వాహనదారులు ‘ఆన్లైన్’లో రిజిస్ట్రేషన్ చేయించుకొని వేలంలో పాల్గొనవచ్చు. ఇంతకు ముందు నిర్వహించిన ఫ్యాన్సీ నెంబర్ల వేలంలో అత్యధికంగా 0001ను వాహనదారులు సొంత చేసుకొన్నారు. ఇందుకు రూ. 12.5ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. మొత్తం ఫ్యాన్సీ నెంబర్లకు రూ. 74 లక్షల ఆధాయం వచ్చింది. రెండో విడత నిర్వహించిన కార్యక్రమంలో రెండో కేటగిరికి చెందిన ఫ్యాన్సీ నెంబర్కు రూ. 7.5 లక్షల ఆదాయం వచ్చిందని సంబధిత అధికారి పేర్కొన్నారు. -
ప్రత్యక్ష నరకం..
- ‘కృష్ణా’ పనులతో స్తంభిస్తున్న ట్రాఫిక్ - వాహనదారులకు ఇక్కట్లు.. - మంగళవారం మూడు ప్రమాదాలు చాంద్రాయణగుట్ట: చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ప్రాంతంలో కొనసాగుతున్న కృష్ణా మూడోదశ మంచినీటి పైప్లైన్ పనులతో వాహనదారులు తీవ్ర నరకం అనుభవిస్తున్నారు. సరిగ్గా ఫ్లైఓవర్ కింది భాగంలో ప్రస్తుతం పనులు కొనసాగుతుండటంతో చార్మినార్ వైపు నుంచి వచ్చే వాహనాలను చాంద్రాయణగుట్ట చౌరస్తా మీదుగా దారి మళ్లిస్తున్నారు. చాంద్రాయణగుట్ట చౌరస్తా (బంగారు మైసమ్మ ఆలయ ప్రాంతం) నుంచి చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్ రోడ్డు మీదుగా పహాడీషరీఫ్ వైపు వెళ్తున్నాయి. దీంతో ఈ రూట్లో ట్రాఫిక్ పెద్ద ఎత్తున స్తంభించిపోయి వాహనదారులకు ప్రత్యక్ష నరకాన్ని చూపుతోంది. స్తంభించిన ట్రాఫిక్లో కొందరు వాహనదారుల తొందరపాటుతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం మూడు ప్రమాదాలు జరిగాయి. ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొనడంతో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. అదే విధంగా చాంద్రాయణగుట్ట చౌరస్తా ప్రాంతంలో కాంక్రీట్ లారీ కారును ఢీకొట్టింది. ఉమర్ హోటల్ ప్రాంతంలో ర్యాష్గా వచ్చిన వాహనదారుడిని తప్పించే క్రమంలో లోడ్తో వెళ్తున్న లారీ పైప్లైన్ గోతిలో కూరుకుపోయింది. చాంద్రాయణగుట్ట చౌరస్తా నుంచి ఫ్లైఓవర్ వైపు వెళ్లే రూట్ కూడా మూసేసి కేవలం ఫ్లైఓవర్ నుంచి రాకపోకలు సాగించారు. శ్రీశైలం, కల్వకుర్తి నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను కూడా చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్ రోడ్డు నుంచి వెళ్లనీయడంతో ఈ రోడ్డంతా రద్దీగా మారింది. ముఖ్యంగా చాంద్రాయణగుట్ట చౌరస్తా వాహనదారులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. మంగళవారం దినమంతా ఇదే పరిస్థితి నెలకొనడంతో వాహనదారులకు ప్రత్యక్ష నరకం కనిపించింది. కేశవగిరి నుంచి వచ్చే చిన్న వాహనాలను మాత్రమే ఫ్లైఓవర్ కింది నుంచి చార్మినార్, మిధాని వైపు రాకపోకలు సాగనిచ్చారు. -
డ్రంకన్డ్రైవ్లో పోలీసులకు వాహనదారుడికి వాగ్వాదం
హైదరాబాద్: నగరంలో వాహనదారులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటన అర్థరాత్రి బంజారా హిల్స్లో జరిగింది. పోలీసులు రాత్రి సమయంలో డ్రంకన్డ్రైవ్ నిర్వహించారు. వచ్చే పోయే వాహనాలను ఆపి ఆల్కహాల్ టెస్టింగ్ చేశారు. ఈ నేపథ్యంలో ఓ వాహనదారుడిని ఆపి ఆల్కహాల్ టెస్టింగ్ చేయాలని పోలీసులు సూచించారు. కానీ, వాహనదారుడు అందుకు నిరాకరించాడు. పోలీసులపై ఆగ్రహాం వ్యక్తం చేశాడు. ఇది కాస్తా గొడవకు దారితీసింది. గొడవ పడ్డవారితో సహా మరొకరిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. -
బంగారు బాటలు
సాక్షి, మహబూబ్నగర్ జిల్లాలో రహదారులకు మహర్దశ పట్టనుంది. వాహనదారులు ఇక హాయిగా ప్రయాణం చేసుకునే వీలు కలగనుంది. గుంతలతో నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు కూడా అడ్డుకట్టపడినట్టే. రోడ్ల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం వెయ్యికోట్లు కేటాయిస్తున్నట్టు సీఎం ప్రకటించడంతో జిల్లావాసుల్లో ఆనందం వ్యక్తమైంది. సీఎం ప్రకటన రావడంతోనే రోడ్ల పరిస్థితిపై జిల్లా పంచాయతీరాజ్, ఆర్అండ్బీ అధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్శాఖల ఆధ్వర్యంలో 13,558 కి.మీ పొడువు రహదారులున్నాయి. ఆర్ అండ్బీ పరిధిలో మహబూబ్నగర్, వనపర్తి, కల్వకుర్తి డివిజన్లు ఉన్నాయి. మహబూబ్నగర్ డివిజన్ పరిధిలోని మహబూబ్నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్,నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలో 1154.76 కి.మీలను ఆర్అండ్బీ పర్యవేక్షిస్తోంది. అలాగే వనపర్తి డివి జన్లోని నాగర్కర్నూల్, వనపర్తి, కల్వకుర్తి, అలంపూ ర్, గద్వాల నియోజకవర్గాల పరిధిలో 1225.809 కి.మీ, కల్వకుర్తి డివిజన్లోని కల్వకుర్తి, షాద్నగర్, అచ్చంపేట నియోజకవర్గాల పరిధిలో 779. 951 కి.మీ పొడవున్నా యి. అదే మాది రిగా పంచాయతీరాజ్ పరిధిలో అన్ని డివి జన్లలోకలిపి 10,500 కి.మీ మేర మార్గాలున్నాయి. అయితే గత పాల కుల వైఫల్యం, స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధుల పాలన లేకపోవడం చేత రహదారులన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఏళ్ల తరబడి వీటిని పట్టించుకోకపోవడంతో చిన్న పాటి వర్షానికి చెరువులను తలపిస్తున్నాయి. గ్రామాల లింక్ రోడ్లు, మండల కేంద్రాల నుం చి జిల్లా కేంద్రానికి ఉన్న దారులన్నీ దారుణంగా తయారయ్యాయి. ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి నాలుగులేన్ల రహదారులు లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతుండడంతో పాటు తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎమ్మెల్యేల ప్రతిపాదనలకే పెద్దపీట ఇటీవల రహదారుల పరిస్థితిపై సమీక్షించిన సీఎం కేసీఆర్ ప్రతి జిల్లాకు రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు నియమనిబంధనలు రూపొందించి, 15 రోజుల్లోగా టెండర్లు పిలవాలని ఆదేశించారు. అయితే జిల్లాలోని రహదారులకు సంబంధించి గతంలో నిర్వహించిన ‘మన ఊరు-మన ప్రణాళిక’లో వచ్చిన పనులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రభుత్వం కూడా ప్రజాప్రతినిధులకు పెద్దపీట వేసి, వారిచ్చే పనులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో మన ప్రణాళికలో భాగంగా గ్రామ, మండల, జిల్లాస్థాయిలో మొత్తం దాదాపు 3,500 కి.మీ పొడువుకు సంబంధించి వచ్చాయి. ఈ నేపథ్యంలో జిల్లాకు పెద్దఎత్తున రానున్న నిధులను ప్రణాళిక పనులకు ప్రాధాన్యత క్రమంలో త్వరతగతిన చేపట్టేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. -
9999 @ రూ.5.12 లక్షలు
- ఫ్యాన్సీ నంబర్లకు భలే డిమాండ్ - ఒక్క రోజులోనే ఆర్టీయేకు రూ.10.52 లక్షల ఆదాయం సాక్షి, సిటీబ్యూరో: ఫ్యాన్సీ నంబర్లపై వాహనదారులు మరోసారి తమ క్రేజ్ను చాటుకున్నారు.మంగళవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన వేలంలో పలు నంబర్లకు వాహనదారుల నుంచి విశేష స్పందన లభించింది. ‘టీఎస్ 09 ఈఏ 9999’ నంబర్ను టెక్ట్రీ సాఫ్ట్వేర్ సంస్థ 5,12,95 రూపాయలకు దక్కించుకుంది. రూ.75.26 లక్షల ఖరీదైన డైమ్లర్ కారు కోసం ఈ నెంబర్ తీసుకుంది. ఆర్ఎన్ ఎంటర్ప్రైజెస్ లక్షా 760 రూపాయలు చెల్లించి జాగ్వార్ వాహనానికి ‘టీఎస్ 09 ఈఏ 0001’ నంబర్ను కైవసం చేసుకుంది. రాజేశ్వర్రెడ్డి అనే వాహనదారుడు రూ.66 వేలు చెల్లించి ‘టీఎస్09 ఈఏ0666’ నంబర్ను సొంతం చేసుకున్నారు. మొత్తంగా మంగళవారం నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా 10 లక్షల 52 వేల 655 రూపాయల ఆదాయం వచ్చినట్టు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ రఘునాథ్ తెలిపారు. -
పెట్రోలు కావాలా.. సర్టిఫికెట్ చూపించండి!!
మీ వాహనానికి పెట్రోలు గానీ, డీజిల్ గానీ పోయించాలనుకుంటున్నారా? అయితే ఇక మీదట పొల్యూషన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా చూపించాల్సిందే. మీ వాహనం నుంచి వెలువడుతున్న ఉద్గారాలు పరిమితిలోనే ఉన్నాయని ధ్రువీకరించే 'పొల్యూషన్ అండర్ కంట్రోల్' సర్టిఫికెట్ తీసుకొస్తేనే ఇంధనం నింపాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. దేశ రాజధాని నగరంలో కాలుష్యం స్థాయి విపరీతంగా పెరిగిపోవడంతో ఈ నిబంధనను అమలుచేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే శ్రీవాత్సవ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి మరో రెండు నెలల వరకు సమయం పట్టేలా ఉంది. ఈలోపు ముందు విస్తృతంగా ప్రచారం చేసి, ప్రజల్లో అవగాహన పెంచి అప్పుడు అమలుచేయాలని ఢిల్లీ సర్కారు భావిస్తోంది. ఇందుకోసం ముందుగానే అన్ని పెట్రోలు బంకుల వద్ద కూడా కాలుష్య తనిఖీ వాహనాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. అప్పటివరకు పొల్యూషన్ సర్టిఫికెట్ తీసుకోనివాళ్లు ఆ వాహనం వద్ద తనిఖీ చేయించుకోవచ్చు. ఆ తర్వాత మాత్రమే వాళ్లకు పెట్రోలు లేదా డీజిల్ పోస్తారు. -
‘టీఎస్’ రిజిస్ట్రేషన్ షురూ..
పెబ్బేరు: స్థానిక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్(ఎంవీఐ) కార్యాల యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వాహనాల రిజి స్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జి ల్లాలు, ఎంవీఐ కార్యాలయాల వారీగా నెంబర్ సిరీస్ను కేటాయించింది. జిల్లాకు టీఎస్ 06 సిరీస్ను కేటాయించగా పెబ్బేరు ఎంవీఐ కార్యాలయానికి ఈసీ(ఉఇ)ను కేటాయించారు. శని వారం నాటికి సుమారు 150 వావానాలకు రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్లు పెబ్బేరు ఎంవీఐ రాజామహమ్మద్ తెలిపారు. ఇదివరకే రి జిస్ట్రేషన్లు చేయించుకున్న వాహనాల నెంబర్లు మారే అంశంపై ప్రభుత్వం త్వరలోనే ఆదేశాలు జారీచేస్తుందని చెప్పారు. పాతనెంబర్ల మార్పు అంశంపై స్పష్టత రాలేదన్నారు. కొతరాష్ట్రంలో కొత్తనెంబర్లను చూసి వాహనదారులు మురిసిపోతున్నారు. -
లీటరు పెట్రోల్ ధర రూ.220
హైదరాబాద్ : తూనికలు, కొలతల శాఖ అధికారులు తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల యజమానులు నిన్న రాత్రి ఏడు గంటల నుంచి మెరుపు సమ్మెకు దిగారు. బంకులను మూసివేసి అమ్మకాలు నిలిపివేశారు. పెట్రోల్ పోసే పంపుల మోడల్ అప్రూవల్ విషయంలో చమురు కంపెనీలపై చర్యలు తీసుకోకుండా తమపై కేసులు బనాయించటం తగదని యజమానులు ఆందోళనకు దిగారు. దాంతో ముందస్తు సమాచారం లేకుండా పెట్రోల్ బంకులను మూసివేయటంతో వినియోగదారులు చాలా ప్రాంతాల్లో రాత్రి నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్, డీజిల్ కొట్టించుకునేందుకు బంకులకు వెళ్లిన వాహన యజమానులకు చుక్కెదురైంది. పెట్రోల్, డీజిల్ కోసం వేచి చూసినా బంకు యజమానులు స్పందించలేదు. తూనికలు, కొలతల శాఖ అధికారులు తమ సమస్యలను పరిష్కరించేవరకు బంకులు తెరిచేది లేదని బంకు యజమానులు చెబుతున్నారు. అనేక ప్రాంతాల్లో బంకులు మూతపడటంతో వినియోగదారులు ఇక్కట్ల ఎదుర్కొంటున్నారు. కేవలం ప్రభుత్వ బంకులు మాత్రమే పెట్రోలు విక్రయిస్తుండటంతో రాత్రి నుంచి క్యూలైన్లలో నిల్చొని తీవ్ర ఇబ్బందులుపడుతున్నామని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సందట్లో సడేమియాలా బంక్ల బంద్తో ఆసరాగా తీసుకున్న ప్రయివేటు వ్యక్తులు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో లీటరు పెట్రోల్ ధరను రూ.220కి అమ్ముతున్నారు. అవసరం కాబట్టి వాహనదారులు ఎంతకైనా వెచ్చించి కొనాల్సిన పరిస్థితి నెలకొంది. -
పెట్రోలు దొరకక వాహనదారుల ఇబ్బందులు