mysterious
-
అడవి మధ్యలో రహస్య గుహ.. లోపల కళ్లు బైర్లు కమ్మే దృశ్యం
ప్రతిరోజూ అడవిలోకి వెళ్లి కట్టెలు కొట్టేవారు ఒకరోజు ఒక రహస్య గుహను గమనించారు. వారు ఈ గుహ గురించి అందరికీ చెప్పగానే, అది స్థానికంగా సంచలంగా మారింది. ఆ కట్లెలు కొట్టేవారు ఆ గుహలోని వెళ్లి చూడగా, వారికి అక్కడ కళ్లు బైర్లు కమ్మే దృశ్యం కనిపించింది. బీహార్లోని జముయి జిల్లాలోని బర్హత్ బ్లాక్ ప్రాంతంలో ఈ రహస్య గుహ వెలుగు చూసింది. పంచకుల అడవిలో ఉన్న కొండలలో ఒక రహస్య గుహ ఉందని ఆ ప్రాంతానికి చెందిన కట్టెలు కొట్టేవారు చెప్పడంతో స్థానికులు ఆశ్చర్యపోతూ, ఆ గుహను చూసేందుకు తరలివస్తున్నారు. గుహ లోపల ఒక శివలింగం ఉందని, ధ్యాన స్థితిలో కూర్చున్న ఒక ఋషికి సంబంధించిన ఒక పురాతన విగ్రహం కూడా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. కాగా ఆ గుహలోకి ప్రవేశించే మార్గం చాలా ఇరుకుగా ఉంది. అయినప్పటికీ కొందరు టార్చిలైట్లు చేతబట్టి, గుహలోనికి ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నారు.గ్రామానికి చెందిన హీరా మాంఝీ మీడియాతో మాట్లాడుతూ గ్రామంలోని కొంతమంది కలప సేకరించడానికి అడవిలోకి వెళ్లినప్పుడు ఈ గుహను గమనించారని తెలిపారు. ఆ కట్టెలు కొట్టేవారిలోని ఒక వ్యక్తి సాహసం చేసి, గుహలోకి వెళ్లాడని, అక్కడ అతనికి ఒక శివలింగం, ఒక ఋషి విగ్రహం కనిపించాయని తెలిపారు. ఈ గుహ జిల్లాలోని ప్రసిద్ధ కుకుర్జాప్ ఆనకట్టకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. గుహ పైన పెద్ద బండ రాళ్ళు ఉన్నాయి. ఈ గుహగురించి తెలిసిన అనంతరం స్థానికులు గుహ వెలుపల కూర్చుని భజనలు, పూజలు చేస్తున్నారు. భక్తులు దర్శించుకునేందుకు వీలుగా గుహలోనికి మార్గం ఏర్పాటు చేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. ఇది కూడా చదవండి: కుంభమేళా రైలుపై రాళ్ల దాడి.. పలువురు ప్రయాణికులకు గాయాలు -
బంగ్లా హెర్క్యులస్ రేపిస్టుల పాలిటి యముడు
బంగ్లాదేశ్ ఆశూలియా జిల్లా 2019 జనవరి 7న జరిగిన అత్యాచార సంఘటనతో ఉలిక్కిపడింది. ఆశూలియాలోని ఒక దుస్తుల కర్మాగారంలో పనిచేసే పద్దెనిమిదేళ్ల యువతిపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి తెగబడి, ఆమెను దారుణంగా హత్య చేశారు. ఇరుగు పొరుగులు ఇంట్లో ఆమె మృతదేహం పడి ఉండటం గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఈ సంఘటనపై అశూలియా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. పోలీసులపై అన్ని వర్గాల నుంచి ఒత్తిడి పెరిగింది. మృతురాలితో పాటు అదే దుస్తుల కర్మాగారంలో పనిచేసే రిపొన్, అతడి ఇద్దరు సహచరులను పోలీసులు అనుమానితులుగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని, పోలీస్ స్టేషన్లో విచారణ జరిపారు. సాక్ష్యాధారాలు లేకపోవడంతో విడిచిపెట్టారు.ఈ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. పైగా మరో మలుపు తీసుకుంది. జనవరి 17న అనుమానితుల్లో కీలక వ్యక్తి అయిన రిపొన్ దారుణంగా హత్యకు గురయ్యాడు. అశూలియాకు చేరువలోని ఒక పొలంలో అతడి మృతదేహం పడి ఉండటాన్ని గమనించి, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహం మెడకు తగిలించిన నోట్ను చూసి, దానిని బయటకు తీసి పరిశీలించారు. ఆ నోట్లో ఇలా ఉంది: ‘నా పేరు రిపొన్. నేను (బాధితురాలి పేరు)పై అత్యాచారం చేశాను. నేను రేపిస్టును. నా నేరానికి ఇదే తగిన శిక్ష. నాతో కలసి ఈ నేరానికి ఒడిగట్టిన నా సహచరులకు కూడా ఇదే గతి పడుతుంది. జాగ్రత్త!’– హెర్క్యులస్ అని బెంగాలీలో రాసి ఉంది. పోలీసులు ఆశ్చర్యపోయారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.పట్టుమని పదిరోజులైనా కాలేదు. మరో సంఘటన కలకలం రేపింది. జనవరి 26న అశూలియా జిల్లా బోల్తలా గ్రామంలోని వరి చేనులో ఒక మృతదేహం పడి ఉండటం చూసి, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గ్రామ పంచాయతీ చైర్మన్కు కూడా సంగతి చెప్పారు. అందరూ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి మెడలో నోట్ వేలాడదీసి ఉంది. ఇది కూడా హెర్క్యులస్ పేరుతోనే ఉంది. ఈ సంఘటనలో మృతుడి పేరు సాజల్, న్యాయశాస్త్ర విద్యార్థి. ఇతడు కూడా జనవరి 7న జరిగిన అత్యాచార సంఘటనలో పట్టుబడిన అనుమానితుల్లో ఒకడు. ఒకే హత్యాచారం కేసులో అనుమానితులైన ఇద్దరు వరుసగా హత్యకు గురికావడం, పైగా వారి మృతదేహాలపై ‘హెర్క్యులస్’ పేరుతో హెచ్చరిక నోట్ దొరకడం బంగ్లాదేశ్లో దేశవ్యాప్తంగా కలకలంగా మారింది. పోలీసులకు ఈ హత్యలు సవాలుగా మారాయి. పోలీసులు చేయలేని పనిని ఒక అజ్ఞాతవ్యక్తి చేయడం పట్ల జనాల్లో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చట్టాన్ని ఇలా చేతుల్లోకి తీసుకోవడం తగదని కొందరు మర్యాదస్తులు అభిప్రాయపడితే, న్యాయం చేయడంలో పోలీసులు చేతగాని వాళ్లయినప్పుడు, అజ్ఞాత వ్యక్తి ఎవరో ఇలాంటి న్యాయం చేయడమే సరైన పని అని వ్యాఖ్యానించసాగారు. మరోవైపు పోలీసుల అసమర్థతను దుమ్మెత్తిపోస్తూ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి.అజ్ఞాత ‘హెర్క్యులస్ కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తుండగా, ఫిబ్రవరి 1న మరో సంఘటన జరిగింది. ఈసారి అశూలియా పొరుగు జిల్లా అయిన రాజాపూర్లోని జలాకఠి శివార్లలోని పొలాల్లో మరో మృతదేహం పడి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు, మృతదేహం మెడలో ‘హెర్క్యులస్’ పేరుతో ఉన్న హెచ్చరిక నోట్ దొరికింది. ఈ సంఘటనలో మృతుడి పేరు రకీబ్ ముల్లా. ‘ఈ హెర్క్యులస్. ఎవడోగాని, పోలీసుల కంటే వీడే నయంగా ఉన్నాడు. రేపిస్టులందరినీ ఏరి పారేస్తున్నాడు’ అని అక్కడ మూగిన జనాలు పోలీసుల ముందే అనుకోవడం మొదలుపెట్టారు. తమ సమక్షంలోనే జనాలు అలా మాట్లాడటంతో పోలీసులకు తలకొట్టేసినట్లయింది. వరుస సంఘటనలు జరిగినా, జిల్లా పోలీసులు ఎలాంటి ఆధారాలూ సేకరించలేకపోవడంతో చివరకు బంగ్లాదేశ్ జాతీయ పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. దేశవ్యాప్తంగా హెర్క్యులస్ కోసం గాలింపు ప్రారంభించాయి. ఊహాచిత్రాలతో ఊరూరా పోస్టర్లు వేయించాయి. అయినా, ఎలాంటి ఫలితమూ దక్కలేదు. ఇప్పటికి ఆరేళ్లు గడచిపోయినా, బంగ్లా పోలీసులకు హెర్క్యులస్ ఆచూకీ దొరకలేదు. ఇదే విషయమై, హెర్క్యులస్ కేసుపై మొట్టమొదట దర్యాప్తు జరిపిన ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్, అశూలియా పోలీస్స్టేషన్ ఇన్చార్జ్ జహీదుల్ ఇస్లామ్ను ప్రశ్నిస్తే, ‘మేం కేసును మొదటి నుంచి దర్యాప్తు చేశాం. సంఘటనలు జరిగిన ప్రతిచోటా అణువణువూ గాలించాం. మృతుల మెడల్లో హెచ్చరిక సందేశాలు తప్ప మాకు ఎక్కడా ఎలాంటి ఆధారాలూ దొరకలేదు’ అని చెప్పారు. అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ షోహెల్ రాణా కూడా దాదాపు ఇలాగే చెప్పారు. ‘అప్పటి వరుస హత్యల వెనుక ఎవరు ఉన్నారో ఇప్పటి వరకు తేలలేదు. ఎలాంటి ఆధారాలూ దొరకలేదు. అయినా, హత్యలకు కారకులు ఎవరో కనుక్కోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం’ అని చెప్పారు. పోలీసులు ఇలాంటి పసలేని ప్రకటనలు చేస్తుంటే, బంగ్లా జనాల్లో చాలామంది హెర్క్యులస్ను హీరోగా పరిగణిస్తుండటం విశేషం. -
ప్రియుడితో కొన్నాళ్లు సహజీవనం.. భర్తను నమ్మించి..
పలమనేరు: పట్టణంలో ఇటీవల సంచలనం సృష్టించిన దళిత నేత శివకుమార్ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. తమ వివాహేతర సంవాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య, ఆమె ప్రియుడు షామీర్(30) పథకం ప్రకారం శివకుమార్ను హత్య చేసినట్టు తేల్చారు. ఈ క్రమంలో నిందితుడు షామీర్ను అరెస్ట్ చేశారు. పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ ఆబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య, ఆమె ప్రియుడు షామీర్(30) పథకం ప్రకారం శివకుమార్ను హత్య చేసినట్టు తేల్చారు. ఈ క్రమంలో నిందితుడు షామీర్ను అరెస్ట్ చేశారు. పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ ఆదివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. పలమనేరు మండలంలోని ముసలిమొడుగుకు చెందిన శివకుమార్ భార్య ఉషారాణి గత 8 నెలల నుంచి పలమనేరులోని షామీర్ బిరియాని హోటల్లో పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు షామీర్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న భర్త శివకుమార్ పలుమార్లు భార్యను ప్రశ్నించాడు. ఆమె కొన్నాళ్లు ప్రియుడితో కలిసి బెంగళూరు వెళ్లిపోయింది. దీంతో శివకుమార్ తన భార్య కనిపించలేదని వేలూరులో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇకపై తాను భర్తతోనే కాపురం చేస్తానని ఉషారాణి అందరినీ నమ్మించింది. షామీర్ కూడా తాను ఉషారాణి విషయంలో జోక్యం చేసుకోనని చెప్పాడు. స్నేహితులుగా ఉందామని శివకుమార్ను నమ్మించి ఈ నెల 13న పలమనేరు సమీపంలోని హెచ్పీ పెట్రోల్ బంకు పక్కనున్న వెంచర్లోకి తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాగించి చాతీపై బండరాయితో కొట్టి హత్య చేశారు. ఈ కేసును మూడు రోజుల్లో ఛేదించిన సీఐ నరసింహరాజు, ఎస్ఐ స్వర్ణతేజను డీఎస్పీ అభినందించారు. -
అంతుచిక్కని మరణాలపై దర్యాప్తు.. మెట్ల బావి మూసివేత
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని ఒక మారుమూల గ్రామంలో మూడు కుటుంబాలకు చెందిన 17 మంది స్వల్ప వ్యవధిలో మృత్యువాత పడటం సంచలనంగా మారింది. ఈ మరణాలకు గల కారణాలు ఇంతవరకూ వెల్లడికాలేదు. దీనిపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు అధికారులు మెట్ల బావి సమీప ప్రాంతాన్ని సీల్ చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ బావిలోని నీటిలో పురుగుమందుల ఆనవాళ్లు కనిపించాయి. ఈ నేపధ్యంలో మెట్ల బావి దగ్గర 24 గంటలూ భద్రతా సిబ్బందిని మోహరించారు.రాజౌరి జిల్లాలోని బాధల్ గ్రామంలోని మెట్ల బావికి కంచె ఏర్పాటు చేయాలని, ముగ్గురు భద్రతా సిబ్బందిని 24 గంటలూ అక్కడ మోహరించాలని అదనపు డిప్యూటీ కమిషనర్ దిల్ మీర్ ఆదేశించారు. ఆయన ఒక ఉత్తర్వులో.. ‘బాధల్ గ్రామంలోని బావి నుండి సేకరించిన నీటి నమూనాలలో పురుగుమందుల ఉనికిని నిర్ధారించారు. దీంతో ఆ మెట్ల బావిని మూసివేయాలని నిర్ణయించాం. ఈ మెట్ల బావిలోని నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ వినియోగించకూడదు’ అని పేర్కొన్నారు.బాధల్ గ్రామంలో మరణాలకు గల కారణాన్ని తెలుసుకునేందుకు అంతర్-మంత్రిత్వ బృందాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. కాగా జమ్మూలోని ఎస్ఎంజీఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహ్మద్ అస్లాం కుమార్తె యాస్మిన్ కౌసర్ కూడా అంతుచిక్కని వ్యాధితో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ 7-12 తేదీల మధ్య గ్రామంలోని రెండు కుటుంబాలకు చెందిన తొమ్మిది మంది మృతిచెందారు.ఇటీవల జేకే లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మాట్లాడుతూ జమ్ముకశ్మీర్ ఆరోగ్య శాఖతో పాటు ఇతర విభాగాలు ఈ మరణాలపై దర్యాప్తు చేస్తున్నాయని, అయితే ఈ మరణాలకు ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదన్నారు. బాధితులు తొలుత జ్వరం, తలనొప్పి, వికారం, స్పృహ కోల్పోవడం లాంటి సమస్యలతో ఆస్పత్రికి వచ్చారని, చికిత్స పొందుతూ కొద్ది రోజులకే మృతిచెందారని మనోజ్ సిన్హా వివరించారు.ఇది కూడా చదవండి: Kumbh Mela: ప్రముఖుల రాక.. మరిన్ని మార్గదర్శకాలు జారీ -
ఆ చల్లని సముద్రగర్భంలో... ఆక్సిజన్ పుడుతోంది!!
భూమిపై జీవజాలం,(Biome)మనుగడకు (oxygen)ఆక్సిజన్ ప్రాణావసరం. అది తయారవాలంటే వెలుతురు, సూర్యకాంతి తప్పనిసరి. సూర్యకిరణాలతో కిరణజన్య సంయోగ క్రియ ఫలితంగా మొక్కల్లో ఆక్సిజన్ తయారవుతుందని చిన్నప్పుడే చదువుకున్నాం. అలాంటిది, సముద్రగర్భంలో కొన్ని కిలోమీటర్ల లోతులో కటిక చీకటితో కూడిన ప్రదేశాల్లోనూ తొలిసారిగా ఆక్సిజన్ జాడను కనుగొన్నట్టు శాస్త్రవేత్తలు ప్రకటించడం సంచలనంగా మారింది! అక్కడ కాంతితో పని లేకుండానే ఆక్సిజన్ తయారవుతుందని తొలిసారిగా గుర్తించారు. అది కూడా కఠిన శిలల నుంచి ఉద్భవిస్తుండటం శాస్త్రవేత్తలనే అబ్బురపరుస్తోంది. ఇదెలా సాధ్యమవుతోందో తెలుసుకునేందుకు మరింత లోతైన అధ్యయనానికి వాళ్లు నడుం బిగించారు. అనంత విశ్వంలో కాంతిమయ పదార్థం కంటే చీకటిమయమైన డార్క్మ్యాటరే ఎక్కువన్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో డార్క్మ్యాటర్లో కూడా ఆక్సిజన్ ఉనికి ఉందని, జీవం మనుగడ సాగిస్తోందని ఎంతోకాలంగా సాగుతున్న వాదనలకు కొత్త బలం చేకూరింది. ఎక్కడ కనిపెట్టారు? బంగాళాదుంపల పరిమాణంలోని ముద్దల్లాంటి శిలల నుంచి స్వల్ప పరిమాణంలో ఆక్సిజన్ తయారవడాన్ని పరిశోధనలో గుర్తించారు. పసిఫిక్ మహాసముద్రంలో క్లారియన్–క్లిప్పర్టన్ జోన్ (సీసీజెడ్)లో 13,100 అడుగుల లోతులో సముద్రగర్భంలో వీటిని గుర్తించారు. ఈ శిలలు ఎలక్ట్రాలసిస్ ప్రక్రియ ద్వారా సముద్ర జలాన్ని ఆక్సిజన్, హైడ్రోజన్గా విడగొడుతున్నాయి. కిరణజన్యసంయోగ క్రియ ద్వారా మాత్రమే ఆక్సిజన్ తయారవుతుందన్న సిద్ధాంతాన్ని ఇది పటాపంచలు చేసిందని స్కాటిష్ అసోసియేషన్ ప్రొఫెసర్ ఆండ్రూ స్వీట్మ్యాన్ చెప్పారు. ఇదెలా సాధ్యమవుతోందన్నది తేల్చేందుకు మూడేళ్ల సుదీర్ఘ ప్రాజెక్టుకు తెర తీస్తున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం ఏకంగా 36,089 అడుగుల లోతు దాకా తవ్వే రిగ్గులతో రంగంలోకి దిగుతున్నారు! ‘‘ఈ ‘చీకటి ఆక్సిజన్’ కోసం జరిపే అధ్యయనంలో సమాధానాలు దొరికే కొద్దీ కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సీసీజెడ్ మాదిరే సముద్రగర్భంలో ఇతర చోట్లా ఇలా ఆక్సిజన్ తయారవుతోందేమో కనిపెడతాం’’ అని స్వీట్మ్యాన్ చెప్పారు. భూగర్భంలోనూ ఆక్సిజన్...? సముద్ర గర్భంలోని శిలల్లోనే గాక భూమి లోలోపలి పొరల్లోనూ ఆక్సిజన్ సమృద్ధిగా ఉన్నట్టు అమెరికాలో మసాచుసెట్స్లోని వుడ్స్ హోల్ మెరైన్ బయోలాజికల్ లేబోరేటరీ సూక్ష్మజీవుల శాస్త్రవేత్త ఎమీల్ రఫ్ ప్రకటించడం విశేషం. కెనడా ప్రియరీ భూముల్లోని అత్యంత లోతుల్లోనూ ఆక్సిజన్ ఉందని చెప్పారాయన. కాల్గరీ వర్సిటీకి చెందిన పలువురు ప్రొఫెసర్లు కూడా దీన్ని ధ్రువీకరించారు. ఈ ఆక్సిజన్ 40 వేల ఏళ్ల క్రితమే భూమి పొరల్లోకి చేరి ఉండాలని ఒక నివేదికలో పేర్కొన్నారు. సూక్షజీవులు కూడా ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తున్నట్టు గుర్తించారు. ‘‘కెనడా భూగర్భ శాంపిళ్లను ల్యాబ్లోని ఆక్సిజన్ పాడుచేసింది. అయినా కొత్తగా ఆక్సిజన్ పుట్టుకొచి్చంది. ఎక్కడి నుంచా అని చూస్తే ఆ నీటిలోని సూక్ష్మజీవులు కొత్తగా ఆక్సిజన్ను తయారు చేస్తున్నట్లు గుర్తించాం. అవి తన మనుగడ కావాల్సిన శక్తిని సమకూర్చుకోవడానికి ఒక నైట్రోజన్, రెండు ఆక్సిజన్ అణువులను రసాయనిక చర్యల ద్వారా అణుస్థాయి ఆక్సిజన్గా మారుస్తున్నాయి. భూగర్భ జలాల్లో ఆక్సిజన్పై ఆధారపడి బతికే సూక్ష్మజీవులకు అది ఈ పద్ధతిలోనే అందుతోందని రుజువైంది. మనం అసాధ్యమని అనుకున్నది సుసాధ్యమేనని ప్రకృతి నిరూపిస్తోంది’’ అని రఫ్ అన్నారు.మూడు కి.మీ. లోతులో ‘చీకటి ఆక్సిజన్’ జాడ కనిపెట్టేందుకు రఫ్ బృందం దక్షిణాఫ్రికాలో బంగారం, యురేనియం గనుల్లోకి వెళ్లింది. ఏకంగా 3 కి.మీ. లోతులో 120 కోట్ల ఏళ్ల నాటి శిలల్లో ఆక్సిజన్ను కనుగొన్నారు. రేడియోధారి్మక గుణమున్న యురేనియం అక్కడి నీటితో చర్య జరపడం వల్ల ఆక్సిజన్ తయారై ఉంటుందన్న అంచనాకొచ్చారు. నాసా ఆసక్తి కాంతితో నిమిత్తం లేకుండానే ఆక్సిజన్ ఉత్పత్తి సాధ్యమంటున్న తాజా పరిశోధనపై నాసా ఆసక్తి చూపుతోంది. చంద్రుని ఆవలివైపు కాంతి ప్రసారమే ఉండదు. అలాంటి చోట్ల ఈ ‘శిలాజ ఆక్సిజన్’ ద్వారా వ్యోమగాముల అవసరాలు తీర్చవచ్చని నాసా ఆశ పడుతోంది. మంచుతో కూడుకున్న శని, బృహస్పతి ఉపగ్రహాలు ఎన్సిలాడస్, యూరోపాలపై ఏ మేరకు పీడనం పెంచితే ఆక్సిజన్ ఉత్పత్తి చేయొచ్చా అని ఇప్పటినుంచే లెక్కలు వేస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బాత్రూమ్లో మహిళ అనుమానాస్పద మృతి!
బెంగళూరు: తిరుపతికి చెందిన మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన బెంగళూరులో మంగళవారం జరిగింది. నెలమంగల పోలీసుల కథనం మేరకు.. లక్ష్మీ(25) అనే మహిళ తిరుపతి నుంచి బెంగళూరులోని ఓళపేటెలో ఉన్న బంధువుల ఇంటికి వచ్చింది. మంగళవారం ఉదయం స్నానాల గదిలోకి వెళ్లింది. 25 నిమిషాలైనప్పటికీ బయటికి రాకపోవడంతో భర్త వెళ్లి పరిశీలించగా స్పృహకోల్పోయిన స్థితిలో కనిపించింది. ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ముఖంపై గీతలు కనిపించినట్లు భర్త చెబుతున్నాడు.గ్యాస్ గీసర్తో విషపూరితమైన కార్బన్మోనాక్సైడ్ గ్యాస్తో ఊపిరాడకపోవడంతో మృతి చెందే అవకాశం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేయగా గీసర్ ఆపివేసి ఉందని భర్త తెలిపారు.చదవండి: క్రికెట్ బ్యాట్తో కొట్టి.. భర్తను హతమార్చి భార్య -
Gates of Hell: నరకద్వారం...!
మధ్య ఆసియా దేశం తుర్కెమెనిస్తాన్లోని కారకూమ్ ఎడారి మధ్యలో ఉన్న అగ్ని జ్వాలల గొయ్యి ఇది. ‘దర్వాజా’గా పిలిచే ఈ ప్రాంతం వద్ద 50 ఏళ్ల క్రితం సోవియట్ యూనియన్ జమానాలో సహజవాయు నిక్షేపాల కోసం డ్రిల్లింగ్ చేపట్టారు. ఫలితం లేక వదిలేశారు. తర్వాత అక్కడ ఇలా భారీ గొయ్యి ఏర్పడింది. మీథేన్ వాయువు విడుదలతో 230 అడుగుల వెడల్పు, 100 అడుగుల లోతులో వలయాకారంలో ఇలా నిరంతరాయంగా మంటలు వస్తూనే ఉన్నాయి. దాంతో ఇది ప్రపంచ పర్యాటకులకు ఆకర్షిస్తోంది. ‘గేట్స్ ఆఫ్ హెల్’గా పిలిచే ఈ మండుతున్న గొయ్యికి అతి సమీపంలోకి పర్యాటకులు వెళ్లకుండా రక్షణ కంచె ఏర్పాటు చేశారు. -
వూడూ ఫెస్టివల్! ఈ వేడుకకు దెయ్యాలొచ్చి నృత్యాలు చేస్తాయట!
ప్రపంచవ్యాప్తంగా మతపరమైన ఆచారాల్లోని ఎన్నో వింతలు, విచిత్రాల గురించి విన్నాం, చూశాం. అయితే, ‘హైతియన్ వూడూ’ అనే ప్రాచీనమతానికి చెందిన ఆఫ్రికన్ భక్తులు నిర్వహించే ‘వూడూ ఫెస్టివల్’ ప్రపంచానికే మిస్టరీ. సాధారణంగా సంప్రదాయ వేడుకల్లో.. మనిషిని దేవుడు ఆవహించడం, మనుషులు పూనకాలొచ్చి ఊగడం లాంటివి చూస్తుంటాం. అలాంటి జాతరల్లో.. కొందరు భక్తులు బృందాలుగా విడిపోయి రకరకాల వేషధారణలతో.. డప్పు దరువుల మధ్య గజ్జె కట్టి తాండవమాడటం తెలిసిందే. అయితే ఈ వూడూ వేడుకకు దయ్యాలొస్తాయి. స్వయంగా నాట్యమాడతాయి. ఎంతటివారినైనా నిర్ఘాంతపరుస్తాయి. ‘ఈ బొమ్మ లోపల ఉన్నది మా పూర్వీకుల ఆత్మే’ అని చెబుతుంటారు వూడూ మతస్థులు. ఆశ్చర్యంగా ఉంది కదూ! కానీ ఈ పండుగకు వెళ్లిన వాళ్లంతా.. అక్కడ నోరెళ్లబెట్టి రావాల్సిందే. ఏమిటా కథ? పశ్చిమ ఆఫ్రికాలోని బెనిన్, టోగో, ఘనా వంటి దేశాల్లో కొన్ని నగరాలు.. జనవరి నెలొస్తే ప్రపంచ పర్యాటకులతో కిటకిటలాడు తుంటాయి. జనవరి 7 నుంచి సుమారు 14 రోజుల పాటు ఈ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. రకరకాల వేషధారణలతో భక్తులు.. నిప్పుల గుండాల చుట్టూ తిరుగుతూ.. నృత్యాలు చేస్తూ ఆకట్టుకుంటారు. ఈ మొత్తం వేడుకలో గుర్రం పందాలతో పాటు.. ‘వూడూ ఘోస్ట్ డాన్స్’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ పండుగ ప్రతి ఇంట్లో తమ పూర్వీకుల ఆత్మలకు గౌరవార్థంగా ప్రార్థన చేయడంతో మొదలవుతుంది. తర్వాత చిన్నచిన్న మనిషి ప్రతిమలను పెట్టి.. అందులోకి చనిపోయినవారి ఆత్మలను ఆహ్వానిస్తారట. అనంతరం పూజ చేసి.. మేకను బలిచ్చి, మద్యంతో పాటే.. నైవేద్యంగా పెట్టి.. ఆత్మలకు శాంతి కలిగిస్తారట. గడ్డి, ఎండిన ఆకులు, నల్ల కుండలు, పుర్రెలు, కర్రల సాయంతో ఎత్తైన పెద్ద బొమ్మలను తయారు చేసి.. వాటిని రాత్రి అయ్యేసరికి ప్రదర్శన కోసం తీసుకొస్తుంటారు చాలామంది. అయితే అలా తీసుకెళ్లే ముందు.. ఆ బొమ్మలకు పూర్వీకుల ఆత్మశక్తిని ఆపాదిస్తారట. ప్రత్యేకమైన పూజలు చేసి.. ఆ వూడూ బొమ్మల్లో కనిపించని అదృశ్యశక్తిని నింపుతారట. వాటిని జాతరకు తీసుకుని వెళ్లి ప్రదర్శన ఇస్తున్నప్పుడు.. అవి చూపరులను హడలగొట్టేలా నృత్యాలు చేస్తాయి. అయితే అవేం హాని కలిగించవు. అలా అని వాటిని తాకడానికి ప్రయత్నించకూడదని స్థానికులు హెచ్చరిస్తుంటారు. కొన్ని వూడూ బొమ్మల్లో మనుషులుండి దాన్ని నడిపిస్తారు. అందులోంచే నృత్యం చేస్తుంటారు. కానీ ఇంకొన్ని వూడూ బొమ్మలు మాత్రం.. మనిషి సాయం లేకుండానే ఏదో కనిపించని శక్తి నడిపిస్తున్నట్లుగా కదులుతాయి. ‘ఈ బొమ్మలో మనిషి లేడు.. కేవలం ఇదంతా ఆత్మ కోలాహలమే’ అనే విషయాన్ని తెలియపరచడానికి.. ఆ బొమ్మను మధ్యమధ్యలో ఎత్తి.. చూపిస్తుంటారు ఆ వంశస్థులు. ‘వూడూ మతస్తులు ఆత్మలతో మాట్లాడతారు. చేతబడులు చేస్తారు’ అనే ప్రచారం.. అక్కడ నివసించే ఇతర స్థానికులకు ఓ సూచన. విదేశీయులను అదుపులో ఉంచే ఒక హెచ్చరిక. ఏదిఏమైనా ఈ వూడూ ఫెస్టివల్లో.. ప్రాణంలేని కొన్ని బొమ్మలు మనిషి సాయం లేకుండా ఎలా కదులుతున్నాయి? ఎలా నాట్యం చేస్తున్నాయి? అనేది నేటికీ మిస్టరీనే! ప్రతి ఏటా బెనిన్లోని కోటోనౌ, ఔయిడా, అబోమీ, గాన్వీ, నాటిటింగౌ, పోర్టో నోవో, అల్లదా నగరాల్లో.. టోగోలోని లోమ్, టోగోవిల్ నగరాల్లో.. ఘనాలోని అక్రా, కేప్ కోస్ట్, కుమాసి నగరాల్లో ఈ సంబరాలు జరుగుతుంటాయి. సుమారు ఐదువందల ఏళ్ల క్రితం నుంచే ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు వూడూ మతస్థులు. ఈ మతం 1996లో అధికారికంగా గుర్తింపు పొందింది. పశ్చిమ ఆఫ్రికా దేశంలోని 13 మిలియన్ల జనాభాలో 12% మంది వూడూను అభ్యసిస్తున్నారట. ఈ ఆధ్యాత్మిక మూలాలతో ఆచారాలతో పర్యాటకులను ఆకర్షించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే ఈ జాతరను, పండగను ఆయా దేశాలు ప్రెస్టీజియస్గా నిర్వహిస్తుంటాయి. ---సంహిత నిమ్మన (చదవండి: తవ్వకాల్లో రెండువేల ఏళ్ల నాటి చెయ్యి..దానిపై మిస్టీరియస్..!) -
విస్తరిస్తున్న మిస్టీరియస్ న్యుమోనియా: ఏంటీ వైట్ లంగ్ సిండ్రోమ్?
ప్రపంచవ్యాప్తంగా అంతుచిక్కని బ్యాక్టీరియల్ న్యుమోనియా వ్యాప్తి ప్రపంచ దేశాలను భయపెడుతోంది. ఇటీవల చైనాలో ఆందోళన రేపిన చిన్నపిల్లలో న్యుమోనియా కేసులు తరహాలోనే ముఖ్యంగా అమెరికా మసాచుసెట్స్ ఒహియోలోని కొన్ని ప్రాంతాల్లో పెరుగుతునట్టు నివేదికల ద్వారా తెలుస్తోంది. వైట్ లంగ్ సిండ్రోమ్గా పిలుస్తున్న శ్వాసకోశ వ్యాధి ప్రధానంగా పిల్లల్లో ఎక్కువగా వ్యాపిస్తోంది. మూడునుంచి ఎనిదేళ్ల వయస్సున్న పిల్లల్లోఈ న్యుమోనియా వ్యాపిస్తోంది. దీనికి కచ్చితమైన కారణాలు ఇంకా వెలుగులోకి రానప్పటికీ ఈ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు సాధారణ బాక్టీరియా మైకోప్లాస్మానే కారణం కావచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. వైట్ లంగ్ సిండ్రోమ్ అంటే ఏమిటి? వైట్ లంగ్ సిండ్రోమ్ అనేది ప్రభావితమైన పిల్లలలో ఛాతీ ఎక్స్-కిరణాలపై విలక్షణమైన తెల్లటిపొరలా ఏర్పడుంది. అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, పల్మనరీ అల్వియోలార్ మైక్రోలిథియాసిస్, సిలికా సంబంధిత పరిస్థితులులాంటి పలు శ్వాసకోశ వ్యాధులు ఉన్నాయి.శ్వాస ఆడకపోవడం, దగ్గు, ఛాతీ నొప్పి, జ్వరం , అలసట లాంటివి ప్రధాన లక్షణాలు. అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ARDS) అనేది ఊపిరితిత్తుల్లో నీరు చేరినపుడు సంభవించే తీవ్ర పరిస్థితి. దీంతో శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. న్యుమోనియా, సెప్సిస్ , ట్రామా వంటి అనేక కారణాల వల్ల ARDS సంభవించవచ్చు. ఊపిరితిత్తుల అల్వియోలార్ మైక్రోలిథియాసిస్ (PAM) అనేది ఊపిరితిత్తులలోని గాలి సంచులలో కాల్షియం పేరుకుపోవడం సంభవించే అరుదైన ఊపిరితిత్తుల వ్యాధి. దీనివల్ల ఊపిరి ఆడకపోవడం, దగ్గు, ఛాతీ నొప్పి వస్తుంది. సిలికోసిస్ అనేది సిలికా ధూళిని పీల్చడం వల్ల వచ్చే ఊపిరితిత్తుల వ్యాధి. సిలికా దుమ్ము ఇసుక, రాయి, ఇతర ఇతర పదార్థాలలో కనిపిస్తుంది. సిలికోసిస్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు మరియు ఛాతీ నొప్పికి కారణమవుతుంది. మూల కారణం వైట్ లంగ్ సిండ్రోమ్ మూలకారణాలు ఏంటి అనేది ఇంకా పరిశోధనలోఉంది. అయితే ఇది బాక్టీరియా, వైరల్ , పర్యావరణ కారకాల కలయిక వల్ల వస్తోందనేది అంచనా. ఇన్ఫ్లుఎంజా లేదా COVID-19 వంటి వైరస్లు ఊపిరితిత్తుల గాలి సంచులను దెబ్బతీయడం ద్వారా తెల్ల ఊపిరితిత్తుల సిండ్రోమ్ను కలిగిస్తాయి. మైకోప్లాస్మా న్యుమోనియా వంటి బాక్టీరియా, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కలిగించడం ద్వారా వైట్ లంగ్ సిండ్రోమ్కు కారణం కావచ్చు. సిలికా ధూళి, ఇతర కాలుష్య కారకాలను పీల్చడం వంటి పర్యావరణ కారకాలు, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ద్వారా వైట్ లంగ్ సిండ్రోమ్ వ్యాధి వస్తోంది. దీంతో మరో కోవిడ్-19 మహమ్మారి విస్తరిస్తోందా అనే ఆందోళన నెలకొంది. దీనికి చికిత్స వ్యాధి తీవ్రత, రోగి పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. యాంటీబయాటిక్స్, యాంటీవైరల్, ఆక్సిజన్ థెరపీ, మెకానికల్ వెంటిలేషన్, కార్టికో స్టెరాయిడ్స్ ద్వారా చికిత్సగా భావిస్తున్నారు. చైనాలో శ్వాసకోశ వ్యాధుల వ్యాప్తి ఆందోళన నేపథ్యంలో చైనా పొరుగు దేశాలైన తైవాన్, నేపాల్ , అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా వైట్ లంగ్ సిండ్రోమ్' వ్యాప్తి అమెరికాకు ముందు నెదర్లాండ్స్ , డెన్మార్క్ కూడా న్యుమోనియా కేసులు పెరుగుతున్నాయి. వీటిలో చాలా వరకు మైకోప్లాస్మా కారణంగా భావిస్తున్నారు.ప్రతి లక్షమంది పిల్లలలో 80 మంది న్యుమోనియా సోకింది. నాలుగు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో కేసులు కూడా పెరుగుతున్నాయి. న్యుమోనియా కేసులు 'అంటువ్యాధి' స్థాయికి చేరుకున్నాయని డానిష్ ఆరోగ్య ముఖ్యులు కూడా ప్రకటించారు. గత ఐదు వారాల్లో ఈ సంఖ్య మూడు రెట్లు పెరిగిందని డెన్మార్క్ స్టాటెన్స్ సీరమ్ ఇన్స్టిట్యూట్ (SSI) వెల్లడించింది. -
ఈ కోటలోకి వెళ్లిన వాళ్లెవరూ ఇప్పటివరకు తిరిగి రాలేదు
అదో రహస్య కోట. సూర్యస్తమయం తర్వాత ఆ కోటలోకి వెళ్లడం నిషేధం. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసినా వెళ్లినా తిరిగి వచ్చిన సందర్భాలు లేవు. ఇప్పటివరకు అలా వెళ్లిన వాళ్లెవరూ తిరిగి రాలేదు. మిస్టీరియస్ కోటగా పేరుగాంచిన ఈ ప్రాంతం ఎక్కడ ఉంది? ఏంటీ హిస్టరీ అన్నది తెలుసుకుందాం. మధ్యప్రదేశ్లోని వారసత్వ కోటలలో ఒకటి ఈ గర్కుందర్ ఫోర్ట్. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన ఈ అంతుచిక్కని రహస్యమైన కోట చుట్టూ అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. దీంతో ఇదో మిస్టీరియస్ కోటగా పేరుగాంచింది. మధ్యప్రదేశ్లోని ఝాన్సీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కోటను 11వ శతాబ్దంలో నిర్మించినట్టుగా సమాచారం. చందేలా, బుందేలా, ఖంగర్ వంటి రాజవంశస్థులు ఈ ప్రాంతంలో పాలన సాగించారు. తర్వాత ఈ కోటను తుగ్లక్లు సొంతం చేసుకొని బుందేలాలకు అప్పగించారు. ఈ కోటను ఎప్పుడు, ఎవరు నిర్మించారు అనే దాని గురించి ఖచ్చితమైన సమాచారం లేదు. ఈ కోటలో చాలా నిధి ఉందన్న ప్రచారం కూడా ఉంది. దీంతో కోట లోపల ఏం ఉందో తెలుసుకోవాలని చాలామంది ఉత్సాహం చూపిస్తుంటారు. ఇక్కడ జరిగిన సంఘటనల ఆధారంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియాకు చెందిన అధికారులు ఒక హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. అదేంటంటే.. సూర్యాస్తమయం తర్వాత కోటలోకి ఎవరూ ప్రవేశించకూడదని. కొంతమంది క్యూరియాసిటీతో కోట లోపల రాత్రి ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ వాళ్లు ప్రాణాలతో తిరిగి రాలేదు. ఈ కోట గురించి తెలుసుకోవాలని వెళ్లిన సుమారు 50-60మంది ఆచూకీ ఇప్పటివరకు తెలియరాలేదు. ఈ సంఘటన తర్వాత కోటలోకి వెళ్లే అన్ని తలుపులు మూసివేశారు. ఈ కోట వెనక ఆసక్తికరమైన కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒక తాంత్రికుడు యువరాణి సౌందర్యాన్ని చూసి ఆకర్షితుడై మంత్రించిన నూనెతో వశం చేసుకోవాలని ప్రయత్నించాడు. అది పసిగట్టిన యువరాణి ఆ నూనెల ఓ రాయిపై పడేలా చేసింది. దీంతో ఆ రాయి తాంత్రికుణ్ణి హతమార్చింది. ఆ తాంత్రికుడు చనిపోతూ శపించడం వల్ల ఊరంతా నాశనమైందని చెబుతారు. మొత్తం ఐదు అంతస్తుల్లో ఉండే గర్కుందర్ కోటలో మూడు అంతస్తులు పైన, రెండు అంతస్తులు నేలకింద నిర్మించడం విశేషం. రాత్రిపూట ఇక్కడికి ఎవరైనా ప్రవేశిస్తే మరుసటి రోజుకు కనిపించకుండా పోతారని అంటారు. దీంతో ఇదో మిస్టీరియస్ కోటగా నిలిచింది. -
యురేనస్ మీద ఐదు సెకెన్లు ఉండగలిగితే? వజ్రాల వానలో తడుస్తామా?
వరుణ గ్రహం... ఇంగ్లీషులో యురేనస్ అంటారు. ఈ గ్రహం పేరు మీరు ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు. ఈ గ్రహాన్ని గ్యాస్ జెయింట్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ మట్టి, రాయికి బదులుగా గ్యాస్ అధికంగా ఉంటుంది. ఈ గ్రహం పరిమాణంలో చాలా పెద్దది. ఇటువంటి విచిత్ర వాతావరణం కలిగిన గ్రహంలో మనిషి కనీసం ఐదు నిముషాలైనా ఉండగలడా? ఉంటే ఏమి జరుగుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం. సౌర వ్యవస్థలో టెలిస్కోప్ సాయంతో కనుగొన్న మొదటి గ్రహం యురేనస్. ఇది సౌర వ్యవస్థలోని ఎనిమిది గ్రహాలలో సూర్యుని నుండి దూరం పరంగా చూస్తే ఏడవ సుదూర గ్రహం. యురేనస్ తన అక్షం మీద ఒక పరిభ్రమణాన్ని దాదాపు 17 గంటల్లో పూర్తి చేస్తుంది. అంటే యురేనస్పై ఒక రోజుకు 17 గంటలు మాత్రమే ఉంటుందని అర్థం. అంటే ఇక్కడ ఒక సంవత్సరం భూమిపై 84 సంవత్సరాలకు సమానం. యురేనస్పై రాత్రి 42 సంవత్సరాలు, పగలు 42 సంవత్సరాలు అని తెలిస్తే ఎవరైరా ఆశ్చర్యపోవాల్సిందే. యురేనస్పై రెండు ధృవాలలో ఒకటి సూర్యునికి అభిముఖంగా ఉండడం, మరొకటి 42 ఏళ్లు చీకటిలో ఉండడమే ఇందుకు కారణం. యురేనస్.. సూర్యుని నుండి సుమారు మూడు బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రహం చాలా చల్లగా ఉండటానికి కారణం కూడా ఇదే. ఇక్కడ సగటు ఉష్ణోగ్రత -197 డిగ్రీల సెల్సియస్. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం, యురేనస్పై కనిష్ట ఉష్ణోగ్రత -224 డిగ్రీల సెల్సియస్. ఇక భూమికి ఒకే చంద్రుడు ఉండగా, యురేనస్కు మొత్తం 27 సహజ ఉపగ్రహాలు అంటే చంద్రులు ఉన్నారు. అయితే ఈ చంద్రులు చాలా చిన్నవిగా, అసమతుల్యంగా ఉంటాయి. వాటి బరువు చాలా తక్కువ. యురేనస్ దాని అక్షం మీద 98 డిగ్రీలు వంగి ఉంటుంది. అందుకే ఇక్కడి వాతావరణం అసాధారణంగా ఉంటుంది. ఇక్కడ ఎప్పుడూ తుఫాను లాంటి వాతావరణం ఉంటుంది. గాలులు చాలా వేగంగా వీస్తాయి. ఇవి గరిష్టంగా గంటకు 900 కిలోమీటర్ల వేగం కలిగి ఉంటాయి. యురేనస్ గ్రహంపై మేఘాల అనేక పొరలతో కూడి ఉంటాయి. పైభాగంలో మీథేన్ వాయువు ఉంటుంది. యురేనస్ గ్రహంపై మీథేన్ వాయువు, ఉష్ణోగ్రత, గాలి సమృద్ధిగా ఉండటం వల్ల ఇక్కడ వజ్రాల వర్షం కురుస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సూర్యకిరణాలు ఈ గ్రహాన్ని చేరుకోవడానికి రెండు గంటల 40 నిమిషాల సమయం పడుతుంది. యురేనస్ భూమి కంటే దాదాపు 20 రెట్లు పెద్దది. మరి ఈ గ్రహం గురించి ఇన్ని వివరాలు తెలుసుకున్నాక.. మనిషి ఈ గ్రహంపై ఐదు నిముషాలైనా ఉండగలడా? ఉంటే ఏమవుతుందనేది ఇప్పటికే మీకు సమగ్రంగా అర్థమై ఉండాలి. ఇది కూడా చదవండి: బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం -
వారి ‘నిప్పు కోడి పాదాల’ రహస్యం ఏమిటి? ఈ తెగ ఎక్కడుంది?
ఈ ప్రపంచం మన ఊహకందేటంతటి చిన్నదేమీ కాదు. ఇక్కడ వివిధ రకాల ప్రజలు నివసిస్తున్నారు. వీరిమధ్య మనకు తెలియని వింతలు ఎన్నో దాగివున్నాయి. ప్రపంచంలోని భిన్న సంస్కృతిని ఒకేచోట కూర్చుంటే అర్థం చేసుకోలేమని చాలామంది చెబుతుంటారు. ప్రపంచంలోని ఒక వింత తెగ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ తెగకు ఉన్నది ఒక ప్రత్యేకతనో లేదా లోపమో.. ఏదో ఒకటి అనుకోవచ్చు. ఆ తెగ మొత్తం ఈ వింత సమస్యను ఎదుర్కొంటోంది. వారి రూపురేఖలు మనుషులను పోలి ఉంటాయి. కానీ వారి పాదాలను చూడగానే ఎవరికైనా దిమ్మతిరిగిపోతుంది. వీరి పాదాల తీరు మన పాదాల మాదిరిగా 5 వేళ్లతో ఉండదు. వారికి కేవలం 2 వేళ్లు మాత్రమే ఉంటాయి. ఇది ఎవరినైనా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. డైలీ స్టార్ తెలిపిన వివరాల ప్రకారం డొమా తెగగా పేరొందిన ఈ తెగ ప్రజలను వడోమా లేదా బంట్వానా తెగ అని కూడా పిలుస్తారు. వారి కాళ్లు ఆస్ట్రిచ్( నిప్పు కోడి లేదా ఉష్ట్రపక్షి) కాళ్ల మాదిరిగా ఉంటాయి. అందుకే వారిని ఆస్ట్రిచ్ ప్రజలు అని కూడా పిలుస్తారు. ఈ తెగ జింబాబ్వేలోని కన్యెంబా ప్రాంతంలో కనిపిస్తుంది. ఈ కమ్యూనిటీ అరుదైన జన్యుపరమైన రుగ్మతను ఎదుర్కొంటోంది. వీరు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యను ఎక్ట్రోడాక్టిలీ అని అంటారు. ఈ పరిస్థితి కారణంగా వారి పాదాలకు 5 వేళ్లకు బదులుగా 2 వేళ్లు మాత్రమే ఉంటాయి. ఈ తెగకు చెందిన జనాభాలో ప్రతి నాల్గవ వ్యక్తి ఇటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ఈ తెగకు చెందిన వారు ఇతర వర్గాలలోని వారిని వివాహం చేసుకోలేని పరిస్థితి ఉంది. వారు ఇతర వర్గాలలోనివారిని వివాహం చేసుకోవడంపై చట్టరీత్యా నిషేధం అమలులో ఉంది. ఈ తరహా వ్యక్తులు సరిగా నడవలేరు. బూట్లు ధరించలేరు. కేవలం చెట్లు ఎక్కే విషయంలో మాత్రం చురుకుగా ఉంటారు. ఇది కూడా చదవండి: ఆమె రూ. 6 లక్షలుపెట్టి బొమ్మలను ఎందుకు కొంది? డైపర్లు ఎందుకు మారుస్తుంది? -
ఎండిన బావిలో వేడినీటి కుతకుతలు?.. స్నానాల కోసం క్యూ కడుతున్న జనం!
బీహార్లోని భాగల్పూర్లోని ఒక బావి చర్చనీయాంశంగా మారింది. ఈ బావిని చూసేందుకు దూర ప్రాంతాల నుంచి సైతం జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ బావి గత 20 ఏళ్లుగా పూర్తిగా ఎండిపోయివుంది. అయితే ఉన్నట్టుండి ఈ బావిలో నుంచి నీరు ఉబికివస్తోంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకర విషయమేమంటే బావిలోని నీరు కుతకుతా ఉడుకుతున్నట్లు కనిపిస్తోంది. దీనిని చూసిన జనం హడలెత్తిపోతున్నారు. ఈ నేపధ్యంలో ఈ బావి గురించి రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. భాగల్పూర్ జిల్లాలోని గోరాడీప్ పరిధిలోని హర్చండీ గ్రామంలోని బదరీ బహరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడున్న ఒక ఎండిన బావిలో ఉన్నట్టుండి నీరు ప్రత్యక్షమై, అది వేడికి ఉడుకున్నట్లు కనిపిస్తోంది. అయితే పరిశీలించి చూస్తే ఆ నీరు చల్లగానే ఉండటం విశేషం. గ్రామానికి చెందిన ఒక యువకుడు మెట్ల ద్వారా బావిలోనికి వెళ్లి చూడగా, నీరు ఒక మట్టం వరకేవచ్చి ఆగిపోయివుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఈ బావి 70 ఏళ్ల క్రితం నిర్మితమయ్యింది. గత కొన్నేళ్లుగా ఈ బావి పూర్తిగా ఎండిపోయింది. గ్రామానికి చెందిన ప్రొఫెసర్ ఈ నీటిని డీటీఎస్ పరీక్షలకు పంపారు. ఈ నీరు తాగేందుకు ఏమాత్రం యోగ్యం కాదని తెలిపారు. అయితే ఈ బావి వద్దకు చేరుకుంటున్న గ్రామస్తులు దానిలోని నీటితో స్నానం చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నీటితో స్నానం చేసిన గ్రామానికి చెందిన సునైనాదేవి అనే మహిళ తనకున్న చర్మ సంబంధిత రోగాలు మాయమయ్యాయని తెలిపింది. ఆమె చెబుతున్న మాటల్లో నిజమెంతో తెలియనప్పటికీ, గ్రామానికి చెందిన పలువురు ఈ బావిలోని నీటితో స్నానం చేస్తున్నారు. ఈ నీటి గురించి శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగించాలని స్థానికులు కోరుతున్నారు. ఇది కూడా చదవండి: ఫిరోజ్ ఘంఢీ.. ఫిరోజ్ గాంధీగా ఎలా మారారు? ఇందిరతో పెళ్లిపై కమలా నెహ్రూ ఏమన్నారు? -
వీకెండ్ ట్రిప్కి వెళ్లి తిరిగిరాలేదు..ఆరోజు అడవిలో ఏం జరిగింది?
ఆకస్మిక అదృశ్యాలను, అసహజ మరణాలను తిరగదోడేటప్పుడు.. ప్రతి కోణం ఉత్కంఠగానే ఉంటుంది. కానీ కొన్నింటికి ముగింపే ఉండదు. ఎంత వెతికినా దొరకదు. ఎందుకంటే అవి కల్పితాలు కావు, నిజ జీవిత కథలు. పైశాచికత్వం ముందు ఓడిపోయిన బతుకులు. అలాంటి మరో మిస్టరీనే ఇది.. 48 ఏళ్ల క్రితం.. పిక్నిక్కి వెళ్లిన కూతురు, అల్లుడు, పిల్లలు.. తన ఇంటి దగ్గర ఆగి, డిన్నర్ చేసి వెళ్తారని ఆశపడింది ఆ తల్లి. ఎందుకంటే అమెరికాలోని ఒరెగన్ రాష్ట్రం, కాపర్లోని తనింటికి.. 2 కిలో మీటర్లలోపే ఉన్న సిస్కియో పర్వతాల్లో క్యాంప్గ్రౌండ్కే వాళ్లు వెళ్లింది. రుచికరమైన వంటకాలు సిద్ధం చేసి, ఎదురు చూడసాగింది. ఎంతకూ రాకపోయేసరికి మనసెందుకో కీడు శంకించింది. దగ్గరే కావడంతో ధైర్యం చేసి క్యాంప్గ్రౌండ్కి నడిచేసింది. అక్కడ క్రీక్ రోడ్ సమీపంలోని క్యాంప్గ్రౌండ్కి వెళ్లి, తనవాళ్ల టెంట్ని గుర్తుపట్టింది. తీరా లోపలికి వెళ్తే అందులో ఎవ్వరూ లేరు. చిన్న టేబుల్ మీద సగం ఖాళీ చేసిన పాలడబ్బా, వెహికిల్ తాళం చెవి, అల్లుడు రిచర్డ్ కౌడెన్(28) పర్స్ కనిపించాయి. రిచర్డ్.. కూతురు బెలిండా(22), మనవడు డేవిడ్(5), ఐదు నెలల మనవరాలు మెలిసా సహా ఎవ్వరూ కనిపించలేదు. వాళ్ల వెంటవెళ్లిన పెంపుడు కుక్కలు కూడా కనిపించలేదు. దాంతో ఆ పెద్దావిడకు టెన్షన్ పెరిగిపోయింది. పైగా ఆ టెంట్లో వస్తువులన్నీ చెల్లాచెదురుగా కనిపించాయి. పర్స్లో 21 డాలర్లు సురక్షితంగా ఉన్నాయి. వెంటనే కూతురు, అల్లుడు వచ్చిన వాహనం కోసం వెతకడం మొదలుపెట్టింది బెలిండా తల్లి. క్రీక్ రోడ్పై పార్క్ చేసి ఉన్న ట్రక్కులో బాతింగ్ సూట్లు తప్ప అన్ని బట్టలూ ఉన్నాయి. బహుశా వాగుల్లో స్నానానికి వెళ్లినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగిందా? ఆ ఆలోచనే ఆమెను కుదురుగా ఉండనివ్వలేదు. వెంటనే పోలీస్ స్టేషన్కి పరుగుతీసింది. పాలడబ్బా సాక్ష్యం సంఘటన స్థలానికి అధికారులు వచ్చారు. అక్కడ ఎలాంటి హింసాత్మక వాతావరణం కనిపించకపోవడంతో ఆ రాత్రి విచారణను అశ్రద్ధ చేశారు. మరునాడు వాళ్ల పెంపుడు కుక్కలైన బాసెట్ హౌండ్, డ్రూపీలు ‘కాపర్ జనరల్ స్టోర్’ ముందు తచ్చాడుతూ కనిపించాయి. సెప్టెంబర్ 1న ఉదయం 9 గంటలకు రిచర్డ్, కొడుకు డేవిడ్ కలసి వచ్చి.. తమ స్టోర్లో పాల ప్యాకెట్ కొనుక్కుని వెళ్లారని ఆ స్టోర్ యజమాని చెప్పాడు. దానికి టెంట్లో టేబుల్ మీదున్న సగం పాలడబ్బానే సాక్ష్యం. చరిత్రలోనే.. కౌడెన్ కుటుంబం వైట్ సిటీలో ఉండేవారు. 1974 ఆగస్టు 30న వీకెండ్ ట్రిప్ అంటూ ఓరెగన్ లోని అత్తగారి ఇంటి నుంచే క్యాంప్గ్రౌండ్కి వెళ్లారు. సెప్టెంబర్ 1 సాయంత్రానికల్లా అత్తగారి ఇంటికి చేరుకుని, అటు నుంచి తిరిగి వైట్ సిటీకి వెళ్లాలనేది వారి ప్లాన్. కానీ అలా జరగలేదు. వాళ్లు వెళ్లిన చోటికి పర్యాటకులు వస్తూపోతూ ఉంటారు. రిచర్డ్ ఫ్యామిలీ మిస్ అవడంతో ఆ ప్రాంతం నిఘా నీడలోకి చేరింది. జాతీయ మీడియా దీనిపై కవరేజ్ ఇవ్వడంతో కౌడెన్ కుటుంబం పట్ల సానుభూతి మొదలైంది. హైకర్స్ వల్ల.. స్థానిక వాలంటీర్లు, ఎక్స్ప్లోరర్ స్కౌట్స్, ఫారెస్ట్ సర్వీస్ అధికారులు, ఒరెగన్ నేషనల్ గార్డ్స్ విచారణాధికారులకు గట్టి సహకారమే అందించారు. ఫారెస్ట్ సర్వీస్ క్యాంప్ సైట్ చుట్టూ అణువణువూ గాలించారు అధికారులు. హెలికాప్టర్ల సాయంతో క్షుణ్ణంగా పరిశీలించినా ఫలితం లేదు. 1975 ఏప్రిల్ 12న ఒరెగన్ లోని ఫారెస్ట్ గ్రోవ్ నుంచి ఇద్దరు హైకర్స్ కొండపైన ఓ చెట్టుకు కట్టేసిన వ్యక్తి శవాన్ని చూశారు. అది బాగా కుళ్లిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు సమీపంలోని గుహలో ఒక మహిళ, ఇద్దరు పిల్లల శవాలను గుర్తించారు. ఆ మృతదేహాలు కౌడెన్ కుటుంబానివేనని పరీక్షల్లో తేలింది. నిజానికి ఆ ప్రదేశం వారి క్యాంప్సైట్ నుంచి దాదాపు 11 కిమీ దూరంలో ఉంది. శవపరీక్షల్లో బెలిండా, డేవిడ్లను తుపాకీతో కాల్చి, మెలిసాను బండకు బాది చంపారని తేలింది. చెట్టుకు కట్టిన తర్వాతే రిచర్డ్ చనిపోయాడని, బెలిండాతో పాటు ఇద్దరు పిల్లల్నీ వేరే చోట చంపి, గుహలో పడేశారని వైద్యులు భావించారు. షాకింగ్ విషయం సెప్టెంబర్ 1న క్యాంప్గ్రౌండ్లో ఉన్న పర్యాటకుల్ని విచారించినప్పుడు ‘ఓ లాస్ ఏంజెలెస్ ఫ్యామిలీ ఆ రోజు సాయంత్రం 5 గంటలకు పార్కులో నడుచుకుంటూ వెళుతుండగా ఇద్దరు మగవారు, ఒక మహిళ పికప్ ట్రక్లోంచి దిగడం చూశాం. వారు మమ్మల్ని భయాందోళనకు గురిచేశారు. అక్కడి నుంచి మేమెప్పుడు కదులుతామా అన్నట్లు ప్రవర్తించారు. అందుకే జనావాసం ఉండే చోటికి వెళ్లిపోయాం’ అంటూ చెప్పారు. అప్పుడే ఓ స్థానికుడు మరో షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. ‘సెప్టెంబరులో కౌడెన్ కుటుంబం కోసం శోధించినప్పుడు ఆ గుహ మొత్తం నేను వెతికాను. అప్పుడు అక్కడ ఏ మృతదేహాలు లేవు’ అంటూ. ఈ క్రమంలోనే రూష్కు చెందిన డ్వైన్ లీ లిటిల్(25) అనే ఖైదీని నిందితుడిగా భావించారు. అతడు పదహారేళ్ల వయస్సులో ఓ యువకుడిపై అత్యాచారం, హత్య చేసిన నేరంపై శిక్షను అనుభవిస్తూ, కౌడెన్స్ కుటుంబం అదృశ్యానికి 3 నెలల ముందే పెరోల్ మీద విడుదలయ్యాడు. మిస్ అయిన రోజు అతడు కాపర్లోనే ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. పైగా 1975 జనవరిలో లిటిల్ దగ్గర తుపాకీ ఉందని తేల్చుకున్న పోలీసులు పెరోల్ రద్దు చేశారు. మళ్లీ 1977 ఏప్రిల్లో బయటికి వచ్చిన లిటిల్.. ఓ గర్భవతిపై లైంగికదాడి చేసి, తీవ్రంగా కొట్టాడు. కొంచెంలో ఆ తల్లి, బిడ్డా ప్రాణాలతో బయటపడ్డారు. ఆ కేసులో కోర్టు లిటిల్కి 3 జీవిత ఖైదులను విధించింది. ఇప్పటికీ మిస్టరీనే.. విచారణలో లాస్ ఏంజెలెస్ ఫ్యామిలీ చెప్పినట్లుగా పార్క్ సమీపంలో ట్రక్లో వచ్చిన ఇద్దరు మగవారు, ఒక మహిళ ఎవరో కాదని.. లిటిల్, అతని తల్లిదండ్రులేనని పోలీసులు బలంగా నమ్మారు. కానీ సాక్ష్యాలే లేవు. 1974 సెప్టెంబర్ 2 సోమవారం నాడు లిటిల్ కుటుంబం క్యాంప్ గ్రౌండ్ సమీపంలోనే ఉన్నారని, గెస్ట్ బుక్లో సంతకం కూడా చేశాడని ఓ మైనర్ సాక్ష్యమిచ్చాడు. అయితే లిటిల్ కుటుంబం ఆ ఆరోపణలను అంగీకరించలేదు. మరోవైపు లిటిల్తో సెల్ పంచుకున్న ఓ ఖైదీ.. కౌడెన్ కుటుంబాన్ని చంపింది తనేనని లిటిల్ తన ముందు ఒప్పుకున్నట్లుగా చెప్పాడు. కానీ నేరం రుజువు కాకపోవడంతో కౌడెన్ కుటుంబాన్ని హతమార్చింది ఎవరో? నేటికీ మిస్టరీనే. ∙సంహిత నిమ్మన -
అయ్యయ్యో..దుబాయ్ అతిపెద్ద జెయింట్ వీల్ ఆగిపోయింది
Ain Dubai (Dubai Eye) ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనాలు, రికార్డ్-బ్రేకింగ్ ల్యాండ్మార్క్ నిర్మాణాలకు పుట్టినిల్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ముఖ్యంగా గ్లామ్-హబ్ దుబాయ్పర్యాటకులను ఆకర్షించే అతిపెద్ద ఫెర్రిస్ వీల్ ఐన్ దుబాయ్ (దుబాయ్ఐ) అర్థాంతరంగా నిలిచిపోయింది. దుబాయ్లో రెండేళ్ల కిందట (అక్టోబర్ 21, 2021) అట్టహాసంగా ప్రారంభమైన ఈ ప్రపంచంలోనే అతిపెద్ద జెయింట్ వీల్ హఠాత్తుగా ఆగిపోవడం చర్చకు దారితీసింది. (బంగారం,వెండి ధరలు: ఎలా ఉన్నాయంటే..!) దుబాయ్ అంటే ఆకాశహర్మ్యాలు, షాపింగ్ మాల్స్ షాపింగ్, లగ్జరీ హోటల్స్ తోపాటు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా గుర్తొస్తాయి. వీటన్నింటికి మించి అట్టహాసంగా ప్రారంభమై పర్యాటకులను విశేషంగా ఆకర్షించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఫెర్రిస్ వీల్. ఈ అతిపెద్ద జెయింట్ వీల్ మొరాయిస్తోంది. ప్రస్తుతం ఎల్ఈడీ ఫిక్చర్లు మాత్రమే పనిచేస్తున్నాయట. ఈ విషయాన్ని అధికారిక వెబ్సైట్ స్వయంగా ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఐన్ దుబాయ్ తెరుచుకోదని వెల్లడించింది. గత కొద్ది నెలలుగా జరుగుతున్న పనులను పూర్తి చేయడానికి శరవేగంగా పనిచేస్తున్నామని ప్రకటించింది. దుబాయ్ ఐని ఎపుడు తిరిగి ప్రారంభించేదీ అధికారికంగా వెల్లడించలేదు. (లక్ అంటే ఇదే: ఖరీదైన బ్యాగ్ను ఎయిర్ట్యాగ్ పట్టిచ్చింది!) దుబాయ్ పర్యాటక శాఖ ప్రకారం పుట్టినల్లు దుబాయ్ ఐ 250 మీటర్ల (825 అడుగులు) uత్తులో ఉంది. . ప్రపంచంలోనే అతిపెద్దది. లండన్ ఐ కంటే దాదాపు రెండు రెట్లు ఎత్తు. అంతర్జాతీయ కంపెనీల కన్సార్టియం నిర్మించిన దుబాయ్ఐ, బ్లూవాటర్స్లో ఉంది. ఈఫిల్ టవర్ కంటేఎక్కువ ఉక్కుతో తయారు చేయబడినజెయింట్ వీల్, నామమాత్రంగానే మిగిలిపోవడం పర్యాటక ప్రియులను నిరాశపరుస్తోంది. -
మిస్టీరియస్ డ్రామా
అభిలాష్, రమ్య,ప్రాచీ ఠాకూర్, శివకోన, ప్రభాకర్, నేహా దేశ్΄పాండే ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాజుగారి కోడిపులావ్’. కుటుంబ కథా ‘వి’ చిత్రం అనేది ట్యాగ్లైన్ . శివ కోన దర్శకత్వంలో అనిల్ మోదుగ, శివకోన నిర్మించిన ఈ సినిమాను ఆగస్టు 4న విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా హైదరాబాద్లో చిత్రయూనిట్ నిర్వహించిన విలేకర్ల సమావేశంలో అభిలాష్ మాట్లాడుతూ– ‘‘రాజుగారి కోడిపులావ్’ రోటీన్ సినిమా కాదు.. కొత్తగా మిస్టీరియస్గా ఉంటుంది’’ అన్నారు. ‘‘మా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు శివ. నటీనటులు కునాల్, నేహాదేశ్ పాండే, రమ్య,ప్రాచీ ఠాకూర్ మాట్లాడారు. -
ప్రపంచంలో నీటి అడుగున ఉన్న టాప్ 10 నగరాలు
-
భూగర్భం నుంచి ఏవో వింత శబ్దాలు.. ఏమై ఉండొచ్చు?
కొట్టాయం: భూగర్భం నుంచి ఏవో వింత శబ్దాలు.. ఏమై ఉండొచ్చు? వారం రోజుల వ్యవధిలోనే కేరళలో పలు గ్రామాల్లో భూగర్భం నుంచి గంభీరమైన వింత శబ్దాలు రావడం స్థానిక ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా కొట్టాయం జిల్లాలోని చెనప్పాడి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున భూమిలో నుంచి ఏవో వింత శబ్దాలు వచ్చాయి. ఆ గంభీరమైన శబ్దాలను విని గ్రామ ప్రజలు భయాందోళలకు గురయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున గ్రామంలోని ప్రజలందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో ఏవో గంభీరమైన శబ్దాలు భూగర్భం నుంచి వినిపించాయి. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ గ్రామప్రజలందరూ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. శబ్ధాలు గట్టిగా ఉన్నాయని స్థానికులు అన్నారు. బయట వాతావరణంలో ఎలాంటి మార్పులేవీ కనిపింలేదని చెప్పారు. రెండు సార్లు భీకరంగా శబ్దాలు వచ్చాయని పేర్కొన్నారు. ఆ గ్రామాన్ని పరిశీలిస్తామని కేరళ మైనింగ్, జియాలజీ శాఖ అధికారులు చెప్పారు. గత వారం ఆ జిల్లాలో వినిపించిన శబ్దాలను ఇప్పటికే పరిశీలించామని చెప్పారు. అయినప్పటికీ మళ్లీ ఓ సారి అధికారులను పంపిస్తామని వెల్లడించారు. సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్ శాస్త్రీయ అధ్యయనం మాత్రమే ఈ శబ్దాలకు గల కారణాన్ని శాస్త్రీయంగా తెలపగలదని చెప్పారు. చదవండి:'ముస్లీం లీగ్ లౌకిక పార్టీ' రాహుల్ వ్యాఖ్యలపై.. బీజేపీ ఫైర్.. -
భారతదేశంలోని టాప్ 11 మిస్టీరియస్ టెంపుల్స్
-
ఇదో వింత.. ఢీకొంటున్న కృష్ణబిలాల జంటలు!
కృష్ణబిలం. అనంత శక్తికి ఆలవాలం. దాని ఆకర్షణ పరిధిలోకి వెళ్లిన ఏ వస్తువూ తప్పించుకోవడమంటూ ఉండదు. దానిలో కలిసి శాశ్వతంగా కనుమరుగైపోవాల్సిందే. అలాంటి రెండు అతి భారీ కృష్ణబిలాల జంటలు త్వరలో పరస్పరం ఢీకొననున్నాయట! వీటిలో ఒకటి భూమికి 76 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని ఏ–బెల్133 అనే మరుగుజ్జు తారామండల సమూహంలో ఉండగా, మరొకటి 32 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని ఏ–బెల్1758ఎస్ అనే మరో మరుగుజ్జు గెలాక్సీలో ఉంది. నాసా తాలూకు చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ ఈ కృష్ణబిలాలను గుర్తించింది. అంతరిక్షంలో ఇలా భారీ కృష్ణబిలాలు ఢీకొట్టడానికి సంబంధించి మనకు నిదర్శనం లభించడం ఇదే తొలిసారి కానుంది. దీనిద్వారా తొలినాటి విశ్వంలో కృష్ణబిలాల వృద్ధి, మరుగుజ్జు గెలాక్సీల ఎదుగుదల తదితరాలకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని నాసా భావిస్తోంది. ఆ రెండు మరుగుజ్జు గెలాక్సీల పరిమాణం 3 కోట్ల సూర్యుల సమష్టి ద్రవ్యరాశికి సమానం. అంటే మన పాలపుంత కంటే 20 రెట్లు తక్కువ! ఇలాంటి మరుగుజ్జు గెలాక్సీలు పరస్పరం కలిసిపోయి మనమిప్పుడు చూస్తున్న భారీ గెలాక్సీలుగా రూపొంది ఉంటాయని సైంటిస్టులు భావిస్తున్నారు. శరవేగంగా విస్తరిస్తున్న తొలినాటి కృష్ణబిలం తొలినాటి విశ్వానికి చెందినదిగా భావిస్తున్న ఓ భారీ కృష్ణబిలాన్ని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ సైంటిస్టులు తాజాగా కనిపెట్టారు. ఇది ఊహాతీత వేగంతో విస్తరిస్తోందట. బహుశా అప్పట్లో అత్యంత భారీ కృష్ణబిలం ఇదే కావచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. దీన్ని లోతుగా పరిశోధిస్తే విశ్వావిర్భావపు తొలి నాళ్లలో భారీ నక్షత్ర మండలాలతో పాటు అతి భారీ కృష్ణ బిలాల ఆవిర్భావంపై మరిన్ని కీలక వివరాలు తెలిసే వీలుందని చెబుతున్నారు. ఈ కృష్ణ బిలం సీఓఎస్–87259గా పిలుస్తున్న ఓ గెలాక్సీ తాలూకు కేంద్ర స్థానంలో నెలకొని ఉంది. చిలీలోని అటకామా లార్జ్ మిల్లీమీటర్ అరే (ఏఎల్ఎంఏ) రేడియో అబ్జర్వేటరీ ద్వారా ఈ కృష్ణబిలం జాడ కనిపెట్టారు. ఇది మన పాలపుంత కంటే ఏకంగా వెయ్యి రెట్లు ఎక్కువ వేగంతో నక్షత్రాలకు జన్మనిస్తోందట! సూర్యుని వంటి వంద కోట్ల నక్షత్ర ద్రవ్యరాశులకు ఇది ఆలవాలమట. దీని తాలూకు ప్రకాశం వల్ల సీఓఎస్–87259 గెలాక్సీ అంతరిక్షంలో అత్యంత ప్రకాశవంతంగా వెలిగిపోతూ కనువిందు చేస్తోందట! ఈ అధ్యయన ఫలితాలను రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ తాలూకు జర్నల్ మంత్లీ నోటీసెస్లో ప్రచురించారు. -
గాడ్జిల్లా గుడ్డేం కాదు!
వైరల్: జపాన్ తీరానికి కొట్టుకొచ్చిన వస్తువు ఒకదాని గురించి.. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసే ఉంటుంది. బాగా మట్టికొట్టుకుపోయి.. లేత పసుపురంగులో బంతి ఆకారంలో ఉన్న ఆ వస్తువు ఏంటన్నదానిపై చర్చలు జరిగాయి. స్పై బెలూన్ అని, ఒక అడుగు ముందుకు వేసి కొందరైతే గాడ్జిల్లా గుడ్డు అంటూ చర్చించుకున్నారు కూడా. ఇదిలా ఉంటే.. హమామత్సు ప్రాంతం ఈ పరిణామంతో భయాందోళనకు గురైంది. అయితే.. ఎక్స్రే పరీక్ష ద్వారా ఇదేం పేలుడు పదార్థం కాదని అధికారులు నిర్ధారించారు. అంతేకాదు అది స్క్రాప్ మెటల్ అయ్యి ఉంటుందని భావిస్తున్నారు. బహుశా సముద్రతీరంలో ఉపయోగించే వస్తువు అయ్యి ఉంటుందని ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు అధికారులు. -
మిస్టరీలుగా పుతిన్ వ్యతిరేకుల ఆత్మహత్యలు
మిస్టరీలుగా పుతిన్ వ్యతిరేకుల ఆత్మహత్యలు -
48 ఏళ్లుగా.. అంతుచిక్కని ‘దెయ్యపు’ బొమ్మ!!
ఒక బొమ్మ.. దానిని ఇష్టపడే వ్యక్తులు. కానీ, అన్యాయంగా చనిపోయిన ఓ వ్యక్తి ఆత్మ అందులో దూరి.. అందరికీ వణుకు పుట్టిస్తూ ఉంటుంది. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా.. అన్ని భాషల్లో ఈ స్టోరీ లైన్తో బొమ్మల్ని బేస్ చేసుకుని బోలెడన్ని సినిమాలు వచ్చాయి. అయితే నిజజీవితంలోనూ అమ్మో బొమ్మ తరహా కథలు ప్రచారంలో ఉండడం మీరెప్పుడైనా విన్నారా? రాబర్ట్.. హాంటెడ్ డాల్. అలా ఇలా కాదు.. ప్రపంచంలోనే అత్యంత భయానకమైన బొమ్మ అదట. 1994 నుంచి యూఎస్ స్టేట్ ఫ్లోరిడా కీ వెస్ట్లోని ఫోర్ట్ ఈస్ట్ మార్టెల్లో మ్యూజియంలో అది ఉంటోంది. ఒక చిన్నారికి నావికుడి గెటప్ వేసినట్లు ఉండే ఆ బొమ్మ.. చేతిలో మరో బొమ్మను పట్టుకున్నట్లు ఉంటుంది. అయితే ఈ బొమ్మ వల్లే ఎన్నో అనర్థాలు జరిగాయనే ప్రచారం.. ఇదొక దెయ్యం బొమ్మనే ముద్రను వేశాయి. 1904 సంవత్సరంలో కీ వెస్ట్కి చెందిన రాబర్ట్ ఎయుజెనె ఒట్టో అనే చిన్నారికి బర్త్డే గిఫ్ట్గా.. అతని తాత జర్మనీ నుంచి తీసుకొచ్చి మరీ ఈ బొమ్మను కానుకగా తీసుకొచ్చాడు. రాబర్ట్ ఆ బొమ్మను ఎంతగా ప్రేమించాడంటే.. దానికి కూడా తన పేరే పెట్టుకున్నాడు. పెద్దయ్యాక కూడా దాన్ని అతను వదల్లేదట. చివరికి ప్రాణం పోయే సమయంలోనూ ఆయన హత్తుకుని పడుకున్నాడని ఆ బొమ్మ హిస్టరీ నోట్లో పేర్కొని ఉంటుంది. అయితే.. 118 ఏళ్ల చరిత్ర ఉన్న ఆ బొమ్మ ఆ తర్వాత వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్లింది. కానీ.. రాబర్ట్ బొమ్మ వేరే వాళ్ల పర్యవేక్షణలో ఉన్నప్పుడు.. ఏదో ఒక అపశ్రుతి జరిగేదన్న వాదన ఒకటి ఉంది. ప్రమాదాలు జరగడం, గాయాలు, ఎముకలు విరిగిపోవడాలు, విడాకులు.. ఇలా ఏదో ఒక చెడు జరిగేదన్న నమ్మకం ముద్రపడిపోయింది. 1974లో రాబర్ట్ ఒట్టో కన్నుమూశాడు. రెండేళ్ల తర్వాత అతని భార్య సైతం చనిపోయింది. ఆ తర్వాత కీవెస్ట్ ఈయేటన్ స్ట్రీట్లోని వాళ్ల ఇంట్లో ఆ బొమ్మ అలాగే ఉండిపోయింది. మైర్టెల్ రూటర్ అనే వ్యక్తి 20 ఏళ్ల పాటు ఆ ఇంటిని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఆపై మరొకరికి దానిని అమ్మేయగా.. ప్రస్తుతం ఆ ఇంటిని ఓ గెస్ట్ హౌజ్గా మార్చేశారు. అయితే.. ఇన్నేళ్లలో ఆ ఇంట్లో ఉన్న బొమ్మ.. జనాలకు చుక్కలు చూపించిందట. ఇన్నేళ్లలో ఆ ఇంట్లో ఉన్న బొమ్మ.. జనాలకు చుక్కలు చూపించిందట. రాబర్ట్ మరణం తర్వాతే ఈ అనుభవాలు ఎదురయ్యాయని చాలా మంది అంటున్నారు. అదీ దానిని సరిగ్గా పట్టించుకోని తరుణంలోనేనట. దీంతో దానికి అతీత శక్తులు ఉన్నాయని, దాని వల్ల ఏదో ఒక అనర్థం జరిగేదన్న నమ్మకం బలంగా స్థిరపడింది స్థానికుల్లో. దీంతో 1994లో ఆ బొమ్మను భద్రంగా ఉంచేందుకు కీ వెస్ట్లో ఉన్న మ్యూజియానికి అప్పజెప్పారు. అప్పటి నుంచి అదొక టూరిస్ట్ ఎట్రాక్షన్గా మారిపోయింది. అయితే అక్టోబర్లో మాత్రం దీనికి ఓల్డ్ పోస్టాఫీస్కు తరలిస్తుంటారు ఎందుకనో!. రకరకాల కథలు.. రాబర్ట్ బొమ్మ గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. దానిలో ఏదో శక్తి దాగి ఉందని, అప్పుడప్పుడు ముఖకవళికలు మారుస్తుందని, ఒక్కోసారి విచిత్రమైన శబ్దాలు చేస్తుందని కొందరు చెప్తుంటారు. అంతేకాదు.. గతంలో అది మాయమై .. మరొచోట ప్రత్యక్షమైన సందర్భాలు కూడా ఉన్నాయట. ఏదేమైనా ఆ బొమ్మకు మంచి స్థానం కల్పించకపోతే కోపం వచ్చి ఏదో ఒక చెడు చేస్తుందనే నమ్మకం బలంగా ముద్రపడడంతో.. ఇప్పటికీ దానిని భద్రంగా చూసుకుంటున్నారు. ఈ బొమ్మ కథను ఆసరాగా చేసుకునే రాబర్ట్ సిరీస్లో నాలుగు సినిమాలొచ్చాయి కూడా. అలా ఓ సాధారణ బొమ్మ.. దెయ్యపు బొమ్మగా మ్యూజియంలో సకల మర్యాదలు అందుకుంటోంది. -
భూగర్భంలో వింత శబ్దాలు... భయాందోళనలో గ్రామం
ముంబై: మహారాష్ట్రాలోని లాతూర్ జిల్లాలో ఓ గ్రామంలోని భూగర్భంలో వింతవింత శబ్ధాలు గ్రామం అంతటా వస్తున్నాయి. దీంతో ఆ గ్రామంలోని నివాసితులు భయం గుప్పెట్లో బతుకుతున్నారు. హసోరి గ్రామంలో ఈ భూగర్భ శబ్ధాలు వస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు. ఈ వింత శబ్ధాలకు గల కారణాల గురించి అధ్యయనం చేయమంటూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం నుంచి నిపుణలను అభ్యర్థించినట్లు చెప్పారు. హసోరి గ్రామం కిల్లారి నుంచి 28 కి.మీటర్ల దూరంలో ఉంది. వాస్తవానికి ఈ ప్రాంతంలో 1993లో ఘోరమైన భూకంపం సంభవించింది. దీంతో ఆ ప్రాంతంలో దాదాపు 9700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఎటువంటి భూకంపాలు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. ఆ గ్రామంలో ఈ వింత శబ్దాలు సెప్టెంబర్ 6నుంచి భగర్భం నుంచి బిగ్గరగా వినిపిస్తున్నాయని, గ్రామస్తులంతా భయాందోళనలకు గురవుతున్నారని అధికారులు చెప్పారు. లాతూర్ జిల్లా కలెక్టర్ పృథ్వీరాజ్ఈ గ్రామాన్ని సందర్శించి ప్రజలకు భయందోళనలకు గురవ్వద్దని విజ్ఞప్తి చేశారు. అంతేగాదు మహారాష్ట్రాలోని నాందేడ్లోని స్వామి రామానంద్ తీర్థ మరాఠ్వాడా విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణుల బృందం ఆ గ్రామాన్ని సందర్శించనుందని అధికారులు తెలిపారు. (చదవండి: సెల్ఫీ ఆనందంలో సెల్నే విసిరి ఆ తర్వాత...) -
శాస్త్రవేత్తలను సైతం కలవరపాటుకు గురిచేసిన 'విచిత్ర జీవి': వీడియో వైరల్
సముద్రం ఎన్నో రకాల జీవుల సముదాయం. సమద్రం చీకటి లోతుల్లో నమ్మశక్యంకానీ జీవులను ఎన్నింటినో పరిచయం చేసింది. అలానే ఇప్పుడూ మరో మిస్టీరియస్ జీవిని మనకు పరిచయం చేస్తోందా అన్నట్లు ఉంది ఆ జీవి. ఆ జీవిన చూసి సముద్ర శాస్తవేత్తలు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆ జీవి చూసేందుకు జీవిలా కాకుండా నీటి కుంటలా ఉంటుంది. ఈ జీవి అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది. నేషనల్ ఓషియానిక్ అండ అట్మాస్సియరిక్ అడ్మినిస్ట్రేషన్(ఎన్ఓఏఏ) ఓషన్ ఎక్స్ప్లోరర్ సిబ్బంది అట్లాంటిక్లో చేసిన యాత్రలో ఇది కనిపించింది. ఇది మృదువైన పగడపు స్పాంజ్ లేదా ట్యూనికేట్ కావచ్చు అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది డెనిమ్ బ్లూ కలర్లో ఉంటుంది. కానీ ఇది ఇంకా ఒక అంతు చిక్కని జీవిగా మిస్టరీగానే ఉంది. ఆ విచిత్ర జీవికి సంబంధించిన వీడియోని ఎన్ఓఏఏ ఓషన్ ఎక్స్ప్లోరర్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అంతేకాదు ఈ జీవిన 'బ్లూ గూ'[ జీవిగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. Have you heard about the latest #Okeanos mystery? Seen multiple times during off St. Croix, this "blue #goo" animal stumped scientists, who thought it might be soft coral, sponge, or tunicate (but def not a rock!). More from Voyage to the Ridge 2022: https://t.co/feZj9IgCG3 pic.twitter.com/OM5hMaOr2m — NOAA Ocean Exploration (@oceanexplorer) September 7, 2022 (చదవండి: జిన్పింగ్ పుతిన్, మోదీని కలుస్తారా? నిరాకరించిన చైనా !)