nagulapalli srikanth
-
ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై పరువు నష్టం కేసు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ సరఫరాపై దురుద్దేశపూర్వకంగా అసత్య కథనాలు ప్రచురిస్తూ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి తెలుగు దినపత్రికలపై పరువు నష్టం కేసు వేస్తున్నట్లు ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ శాఖ కార్యదర్శిగా పలుమార్లు విలేకరుల సమావేశాలు, పత్రికా ప్రకటనల ద్వారా రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని తెలియజేస్తున్నప్పటికీ, ప్రజల్లో గందరగోళం సృష్టించడంతోపాటు ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేలా వార్తలు ప్రచురిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులందరికీ 24 గంటలపాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ను అందిస్తున్నామని చెప్పారు. రైతులందరికీ 9 గంటలపాటు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. అయినా, కల్పిత వార్తలు ప్రచురించడం పట్ల విస్మయం వ్యక్తంచేశారు. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచురించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని శ్రీకాంత్ హెచ్చరించారు. (చదవండి: అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుది) -
‘అపోహలు సృష్టిస్తున్నారు.. వారిపై పరువు నష్టం కేసు వేస్తాం’
అమరావతి: విద్యుత్ సరఫరాపై తప్పుడు ప్రచారం చేస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతిపై పరువు నష్టం కేసు వేస్తామని ఏపీ ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ స్పష్టం చేశారు. ఏపీలో విద్యుత్ కోతలు లేవని చెప్పినా, ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని, ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసే విధంగా వార్తలు ప్రచురిస్తున్నారన్నారు. అలాంటి వారిపై ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుందన్నారు. ఏపీలో 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ను అందిస్తున్నామని, రైతులకు 9 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నా కల్పిత వార్తలు రాస్తున్నారని, తప్పుడు వార్తలు ప్రచురించే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
పుష్కలంగా విద్యుత్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ పుష్కలంగా అందుబాటులో ఉందని, మూడు రోజులుగా ఎటువంటి విద్యుత్ కోతలు లేవని ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ స్పష్టం చేశారు. వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. శనివారం ఆయన ఏపీ జెన్కో ఎండీ బి.శ్రీధర్తో కలిసి సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ను రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల వ్యవసాయ సర్వీసులకు 6,663 ఫీడర్ల ద్వారా అందిస్తున్నామని చెప్పారు. సాంకేతిక కారణాల వల్ల ఎక్కడైనా కొద్ది సేపు అంతరాయం ఏర్పడితే ఆ సమయాన్ని అదే రోజు సర్ధుబాటు చేసి విద్యుత్ సరఫరా చేస్తున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.9,717 కోట్లు సబ్సిడీ రూపంలో విడుదల చేసిందన్నారు. ఏడాదిలోగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ మీటర్లు బిగిస్తామని, తొలుత శ్రీకాకుళంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఆయన ఇంకా ఏమన్నారంటే.. కోతలు లేకుండా చూస్తున్నాం ► పరిశ్రమలకు, గృహ, వాణిజ్య అవసరాలకు ఎటువంటి అవాంతరాలు లేకుండా చవక ధరలకు నాణ్యమైన విద్యుత్ను అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. 2020లో 4,36,837 అంతరాయాలుంటే 2021లో వాటిని 2,02,496కు తగ్గించాం. ► రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ వినియోగం 204 మిలియన్ యూనిట్లుగా ఉంది. గతేడాది ఇదే సమయంలో 198 యూనిట్లు ఉండింది. ప్రస్తుత డిమాండ్లో 170 మిలియన్ యూనిట్ల వరకు ఏపీజెన్కో, కేంద్ర విద్యుత్ సంస్థలైన ఎన్టీపీసీ, నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్, న్యుక్లియర్ పవర్ ప్లాంట్స్, ప్రైవేటు పవర్ ప్లాంట్లతో ఉన్న దీర్ఘకాలిక ఒప్పందాల ద్వారా వస్తోంది. ► మిగతా 34 మిలియన్ యూనిట్ల విద్యుత్ను బహిరంగ మార్కెట్ నుంచి రోజు, వారం, నెల వారీ బిడ్డింగ్ల ద్వారా తీసుకుంటున్నాం. ఈ మూడు మాసాల్లో మాత్రమే అదనపు డిమాండ్ ఉంటుంది. దీనికోసం దీర్ఘకాలిక ఒప్పందాలు అవసరం లేదు. ► 700 నుండి 2000 మెగావాట్ల వరకు ప్రతి పావుగంటకు మార్కెట్లో ఆక్షన్ ద్వారా అన్ని రాష్ట్రాలతో పాటు మనం కూడా పాల్గొని నిర్ధారణ అయిన రేట్ల ప్రకారం కొనుగోలు చేస్తున్నాం. విద్యుత్ వినియోగించే సమయాలను బట్టి రేట్లలో మార్పులు ఉంటాయి. అన్ని జాగ్రత్తలు తీసుకుని రైతుల పంపు సెట్లకు, గృహ, పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు నిరంతరాయంగా విద్యుత్ను సరఫరా చేస్తున్నాం. ► విద్యుత్ కొనుగోలు చెల్లింపులకు సంబంధించి గత ఏడాది నుంచి కేంద్రం నిబంధనలను కఠిన తరం చేసినందున అడ్వాన్సుగా చెల్సించాల్సి వస్తోంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండేళ్ల నుండి పెద్ద ఎత్తున నిధులను విద్యుత్ అవసరాలకు కేటాయిస్తోంది. ఎన్టీపీసీ విషయంలో లెటర్ ఆఫ్ క్రెడిట్ సమస్య ఉత్పన్నమైతే రాష్ట్ర ప్రభుత్వం, ఆర్థిక శాఖ ఆ సమస్యను పరిష్కరించాయి. ► ఈ సమావేశంలో రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ సీఈఓ ఎ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. బొగ్గు సమస్య లేదు ఏపీ జెన్కోకు సంబంధించి విజయవాడ, కృష్ణపట్నం, రాయసీమలో మూడు థర్మల్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి. వీటి ద్వారా సుమారు 5,010 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఇందులోని మొత్తం 15 యూనిట్లు ఫంక్షనింగ్లో ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు 80 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఇందుకోసం రోజుకు 60 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు వినియోగించాల్సి ఉంటుంది. బొగ్గు సమస్య రాకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. – బి.శ్రీధర్, ఏపీ జెన్కో ఎండీ -
జెన్కోకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీజెన్కో)ను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోందని ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ చెప్పారు. సాంకేతిక కారణాల వల్ల ఉద్యోగులకు ఈ నెల జీతాల చెల్లింపు ఆలస్యం అయినప్పటికీ మంగళవారం అందరికీ చెల్లించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చెల్లింపుల వివరాలను ఆయన ‘సాక్షి’కి వివరించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పుడిలా.. 2019–20 ఆర్థిక ఏడాదిలో ప్రభుత్వ విభాగాల విద్యుత్ బిల్లులు, వివిధ వర్గాలకు ఇవ్వాల్సిన సబ్సిడీ కలిపి మొత్తం రూ.12,388.93 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.16,849.27 కోట్లు అందాయి. 2020–21లో రూ.15,299.67 కోట్లు రావాల్సి ఉండగా రూ.12,989.81 కోట్లు ఇచ్చింది. 2021–22లో జనవరి నాటికి రూ.12,632.78 కోట్లు చెల్లించాల్సి ఉండగా, రూ.11,947.76 కోట్లు జమచేసింది. అప్పుడలా.. గత ప్రభుత్వ హయాంలో 2014–15లో రూ.4,099.60 కోట్లు కట్టాల్సి వస్తే రూ.3,953.52 కోట్లు, 2015–16లో రూ.5,302.54 కోట్లకు రూ.4589.96 కోట్లు ఇచ్చారు. 2016–17 నుంచి చెల్లింపులు తగ్గిస్తూ వచ్చారు. ఆ ఆర్థిక సంవత్సరంలో రూ.6,176 కోట్లకుగాను రూ.4,022.57 కోట్లు, 2017–18లో రూ.6,578.81 కోట్లకుగాను రూ.4,141.96 కోట్లు, 2018–19లో రూ.9,641 కోట్లకుగాను రూ.3,458.85 కోట్లు ఇచ్చారు. దీంతో పాత బకాయిలే చాలావరకు మిగిలిపోయాయి. వాటిని కూడా ప్రస్తుత ప్రభుత్వం చెల్లిస్తోంది. జెన్కో నుంచి రోజుకు 57 మిలియన్ యూనిట్లు ఏపీ జెన్కో నుంచి రాష్ట్రానికి 2014–15లో 16,285.4 మిలియన్ యూనిట్లు (ఎంయూ), 2015–16లో 22,044.4 ఎంయూల విద్యుత్ వినియోగించారు. 2016–17లో 24,728.8 ఎంయూ, 2017–18లో 20,562 ఎంయూ, 2018–19లో 22,362.2 ఎంయూ, 2019–20లో 22,470 మిలియన్ యూనిట్లు, 2020–21లో 16,430 ఎంయూ, 2021–22 జనవరి నాటికి 17,539.4 మిలియన్ యూనిట్ల విద్యుత్ను జెన్కో నుంచి తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో రోజుకి సగటున 57.3 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఏపీజెన్కో అందిస్తోంది. -
ప్రభుత్వ సహకారంతో నష్టాలను అధిగమిస్తున్నాం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం 2021–22లో విద్యుత్ పంపిణీ సంస్థలకు వివిధ రకాల సబ్సిడీల కింద రూ.9,717 కోట్లు విడుదల చేసిందని ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ తెలిపారు. ఏపీ సీపీడీసీఎల్ అమలు చేస్తున్న వివిధ నూతన ప్రాజెక్టులు, ప్రగతిపై టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఆదివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర విద్యుత్ సంస్థల బలోపేతానికి సీఎం వైఎస్ జగన్, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంపూర్ణ సహకారం అందిస్తున్నారని తెలిపారు. అలాగే నష్టాలను తగ్గించడంలో డిస్కంలు మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయని అభినందించారు. వినియోగదారులకు మరింత నాణ్యమైన సేవలందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. సీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మజనార్దనరెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే అత్యుత్తమ డిస్కంలలో ఒకటిగా నిలిచే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. పవర్ ఫర్ ఆల్ పథకం కింద రూ.517 కోట్ల అంచనా వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. స్కాడా కింద విజయవాడ, గుంటూరులలో సబ్స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. విజయవాడ, గుంటూరు నగరాల్లో 16 ఇండోర్ సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. విజయవాడలో కంటైనర్ సబ్స్టేషన్ నిర్మాణాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని తెలిపారు. అగ్రికల్చర్ డీబీటీ పథకం కింద స్మార్ట్ ఎనర్జీ మీటర్ల ఏర్పాటుకు టెండర్లు పూర్తయ్యాయన్నారు. 5వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలకు 3 ఫేజ్ విద్యుత్ను అందుబాటులోకి తెచ్చామన్నారు. -
విద్యుత్ ఉద్యోగులకు ‘పీఆర్సీ’ ఏర్పాటు
సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థల ఉద్యోగుల కోసం వేతన సవరణ సంఘాన్ని(పీఆర్సీ) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ మన్మోహన్సింగ్కు ఈ బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర విద్యుత్ బోర్డు(ఏపీఎస్ఈబీ) కింద నియమితులై ఆంధ్రప్రదేశ్ దక్షిణ, మధ్య, తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు, ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కోలలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలు, అలవెన్సులు, ఇతర ప్రయోజనాలను సవరించేందుకు గానూ అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ బుధవారం ఉత్తర్వులిచ్చారు. కమిషన్ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి 2 నెలల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
విద్యుత్ కొనుగోళ్లలో రూ.4,925 కోట్లు ఆదా
సాక్షి, అమరావతి: బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేయడం ద్వారా రాష్ట్ర విద్యుత్ సంస్థలు 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.4,925 కోట్లను ఆదా చేశాయని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ తెలిపారు. విద్యుత్ సౌధలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలుకు ఏపీఈఆర్సీ రూ.31,346 కోట్ల వ్యయానికి అనుమతి ఇవ్వగా మన డిస్కంలు రూ.26,421 కోట్లను మాత్రమే ఖర్చు చేశాయని చెప్పారు. ఆదా అయిన రూ.4,925 కోట్లలో రూ.3,373 కోట్లను వినియోగదారులకు బదిలీ చేసేందుకు వీలుగా ట్రూ డౌన్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్సీ) నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయడం వల్ల్ల దాదాపు 18.50 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతోందని తెలిపారు. ఉచిత విద్యుత్ పథకానికి ప్రభుత్వం రూ.7,714.21 కోట్ల సబ్సిడీ అందించడంతోపాటు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ) నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ను 2024 నుంచి దశలవారీగా కొనుగోలు చేయాలని భావిస్తోందని చెప్పారు. దేశంలోనే తొలి సాంకేతికత విద్యుత్ డిమాండ్ను ఒకరోజు ముందుగానే అంచనా వేసేందుకు ‘డే ఎ హెడ్ ఎలక్ట్రిసిటీ ఫోర్ కాస్టింగ్ మోడల్’ను మన విద్యుత్ సంస్థలు రూపొందించాయని శ్రీకాంత్ తెలిపారు. ఆర్టి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో పనిచేసే ఈ వ్యవస్థ దేశంలోనే మొదటిదని, దీనివల్ల విద్యుత్ సరఫరా, గ్రిడ్ నిర్వహణ వంటి అంశాల్లో కచ్చితమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. విద్యుత్ పంపిణీ నష్టాలు గత ఏడాది 7.50 శాతం ఉండగా, 2021–22లో ఇప్పటివరకు 5 శాతానికి తగ్గాయని చెప్పారు. సాంకేతిక, వాణిజ్య (ఏటీ అండ్ సీ) నష్టాలు 2020–21లో 16.36 శాతం ఉండగా.. 2021–22 నవంబర్ నాటికి 11 శాతానికి తగ్గించగలిగామన్నారు. కాగా, విద్యుత్ సౌధలో బుధవారం 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీ ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్లు ఐ.పృధ్వీతేజ్, బి.మల్లారెడ్డి, ట్రాన్స్కో, జెన్కో డైరెక్టర్లు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
విద్యుత్ ఉద్యోగులూ.. ఆందోళనొద్దు
సాక్షి, అమరావతి: ట్రాన్స్కో, జెన్కో, డిస్కంలలో ఉద్యోగుల జీతాలు తగ్గనున్నాయనే ప్రచారాన్ని విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు కొట్టిపడేశారు. విద్యుత్ ఉద్యోగులకు పే రివిజన్ కమిటీ(పీఆర్సీ) వేశాక జీతాలు తగ్గిస్తారనేది కేవలం అపోహ మాత్రమేనని వారు స్పష్టం చేశారు. ట్రాన్స్కో సీఎండీ నాగులపల్లి శ్రీకాంత్, జెన్కో ఎండీ శ్రీథర్, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మాజనార్దనరెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్.హరనాథరావు, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావులతో పాటు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బుధవారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం వివరాలను సీఎండీలు, జేఏసీ నేతలు ‘సాక్షి’కి వివరించారు. పీఆర్సీ వచ్చే వరకూ ఇవే జీతాలు.. విద్యుత్ సంస్థల్లో ఉద్యోగులు అనవసర భయాలతో వీఆర్ఎస్ తీసుకోవాల్సిన అవసరం లేదని సీఎండీలు తెలిపారు. పీఆర్సీ వచ్చే వరకూ ఇవే జీతాలు కొనసాగుతాయని, ఆ కమిటీ అధ్యయనం తర్వాత తన నివేదికను ప్రభుత్వానికి ఇస్తుందని, ఆపై ప్రభుత్వ నిర్ణయం మేరకు జీతాలుంటాయని వారు వెల్లడించారు. అలాగే కొత్తగా తీసుకొస్తున్న సర్వీస్ రెగ్యులేషన్స్ వల్ల కూడా జీతాలు తగ్గుతాయనే అనుమానాలున్నాయని, అది పూర్తిగా అవాస్తవమన్నారు. రెగ్యులేషన్స్ ఎప్పుడు అమల్లోకొస్తే ఆ రోజు నుంచి నియమితులైన ఉద్యోగులకే ఆ నిబంధనలు వర్తిస్తాయని, అవి రావడానికి ముందు ఉన్న ఉద్యోగులెవరికీ వాటి వల్ల ఎలాంటి ఇబ్బందులుండవన్నారు. సెక్షన్ 79సీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లయి యాక్ట్ 1948 ప్రకా>రం 1967లో రెగ్యులేషన్స్ రూపొందించారని, ఆపై దాని స్థానంలో ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 వచ్చిందన్నారు. దీనివల్ల పాతది వాడుకునేందుకు వీల్లేదని, ఒక బోర్డు రెగ్యులేషన్లను మరో బోర్డు మార్చేందుకూ అవకాశం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో కొత్తగా రెగ్యులేషన్స్ రూపొందిస్తున్నారని వివరించారు. కేసులను ఎత్తివేస్తామన్నారు.. ఉద్యోగుల సంక్షేమమే తమకు తొలి ప్రాధాన్యమని బాలినేని, సజ్జల స్పష్టం చేసినట్టు ఏపీ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) చైర్మన్ చంద్రశేఖర్ తెలిపారు. ఉద్యోగ సంఘాల నేతలపై ఉన్న దాదాపు 32 కేసులను తక్షణమే ఎత్తివేస్తామని వారు హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. డీఏ, ఇతర అంశాలపై చర్చించేందుకు వారంలో మరోసారి సమావేశం నిర్వహిస్తామన్నారని చంద్రశేఖర్ వివరించారు. మీటర్ రీడర్లకు పీస్ రేటు(విద్యుత్ బిల్లులపై ఇచ్చే కమీషన్)ను త్వరలో పెంచేందుకు చర్యలు చేపడతామని బాలినేని, సజ్జల హామీ ఇచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్ల రాష్ట్ర కార్యాచరణ కమిటీ(జేఏసీ) గౌరవాధ్యక్షుడు బాలకాశి, యూనియన్ నేతలు తెలిపారు. సచివాలయంలో వారిని కలిసి తమ సమస్యలను విన్నవించగా సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. మూడు కంపెనీల సీఎండీలు చర్చించి రేటుపై నిర్ణయం తీసుకోవాలని బాలినేని, సజ్జల ఆదేశించినట్టు జేఏసీ నేతలు చెప్పారు. డిస్కంల పరిధిలో ఉన్న దాదాపు 4,600 మంది రీడర్లకు డిస్కం పరిధిలోనే ఇతర ఉపాధి అవకాశాలు కల్పించే అంశాన్ని కూడా పరిశీలించాల్సిందిగా సీఎండీలకు వారు సూచించినట్టు వివరించారు. -
15వేల మి.యూ. విద్యుత్ ఆదా లక్ష్యం
సాక్షి, అమరావతి: భవిష్యత్లో 15 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ను రాష్ట్రంలో ఆదా చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఇంధన శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లు, విద్యుత్ శాఖ సమన్వయంతో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. స్టార్ రేటెడ్ ఎలక్ట్రికల్ ఉపకరణాలను ఇళ్లలో ఉపయోగించడంవల్ల సగటున 40 శాతం విద్యుత్ ఆదా అవుతుందని, విద్యుత్ బిల్లులూ తగ్గుతాయి కాబట్టి వాటిని ఉపయోగించాలని ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ రాష్ట్ర ప్రజలకు సూచించారు. కృష్ణాజిల్లా కలెక్టర్ జె. నివాస్తో కలిసి విజయవాడలో మంగళవారం ఆయన జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాలను ప్రారంభించారు. ఏపీఎస్ఈసీఎం, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఎస్పీడీసీఎల్) ఆధ్వర్యంలో విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలతో ర్యాలీ నిర్వహించారు. ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ. చంద్రశేఖరరెడ్డి, ఏపీ ట్రాన్స్కో విజిలెన్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ బి. మల్లారెడ్డి, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె పద్మజనార్ధనరెడ్డి, విజయవాడ ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శివప్రసాద్రెడ్డి పాల్గొన్నారు. -
పేదలపై విద్యుత్ చార్జీల భారం వేయం
సాక్షి, అమరావతి: పేద ప్రజలపై ఎటువంటి భారం లేకుండా, విద్యుత్ చార్జీలను స్వల్పంగా పెంచేందుకు అవకాశం కల్పించాలని రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)ని కోరాయి. 2022–23 ఆర్థిక సంవత్సరానికి అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్ (ఎఆర్ఆర్), రిటైల్ సప్లై బిజినెస్ (ఆర్ఎస్బీ)ను సోమవారం ఏపీఈఆర్సీకి సమర్పించాయి. ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ సమక్షంలో తూర్పు, దక్షిణ, మధ్య ప్రాంతాల విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్)ల సీఎండీలు కె.సంతోషరావు, హెచ్. హరనాధరావు, జె.పద్మాజనార్ధనరెడ్డిలు ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, సభ్యులు పి.రాజగోపాలరెడ్డి, ఠాకూర్ రామసింగ్లకు సమగ్ర ఆదాయ ఆవశ్యకత (ఏఆర్ఆర్) నివేదికలను అందజేశారు. ప్రస్తుతం ఉన్న శ్లాబుల్లో ఈ సారి మార్పులు చేశారు. ఇకపై గృహ విద్యుత్ 0–30 యూనిట్ల లోపు వినియోగానికి యూనిట్కు రూ.1.45 పైసలు వసూలు చేయాలని డిస్కంలు ప్రతిపాదించాయి. 31–75 వరకు రూ.2.80 పైసలు, 0–100 వరకు రూ.4, 101–200 వరకు రూ.5, 201–300 వరకు రూ.7, 300 యూనిట్ల పైన రూ.7.50 పైసలు చొప్పున వసూలుకు అనుమతి కోరారు. ప్రస్తుతం 301–400 యూనిట్లు వినియోగిస్తే రూ.7.95 పైసలు, 401 నుంచి 500 వరకూ రూ.8.50 పైసలు, ఆ పైన రూ.9.95 పైసలు చొప్పున చార్జీలు విధిస్తున్నారు. తాజా ప్రతిపాదనల్లో ఇవి కొంతవరకూ తగ్గించడం ఊరట కలిగిస్తోంది. అదే విధంగా వాణిజ్య విద్యుత్ టారిఫ్లను కూడా తగ్గించాలని ప్రతిపాదించారు. 0–50 యూనిట్లు వాడే వారికి యూనిట్ రూ.6.90 పైసల నుంచి రూ.5.40 పైసలకు తగ్గించారు. హైటెన్షన్ విద్యుత్ సర్వీసులకు 11 కెవీ, 33 కేవీ, ఈహెచ్టీల టారిఫ్లలో మార్పు లేదు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కొనసాగిస్తామన్నారు. హార్స్ పవర్ పెరిగే కొద్దీ విధించే చార్జీలను పెంచాలని అడగలేదు. పరిశ్రమలకు విధించే టారిఫ్లపైనా మార్పు లేదు. ఇలా అన్ని వర్గాల వారిపైనా భారం లేకుండా నామమాత్రంగా చార్జీలను పెంచేందుకు అనుమతించాలని డిస్కంలు విజ్ఞప్తి చేశాయి. సరాసరి విద్యుత్ సరఫరా వ్యయం రూ.6.58 పైసలుగా తేల్చాయి. కొత్త టారిఫ్ల ప్రకారం విద్యుత్ చార్జీలను వచ్చే ఏడాది ఆగస్టు 1 నుంచి అమలులోకి తేవాలనుకుంటున్నట్లు డిస్కంలు మండలికి తెలిపాయి. 2022–23 ఆర్ధిక సంవత్సరానికి వివిధ మార్గాల ద్వారా 74,815 మిలియన్ యూనిట్ల విద్యుత్ను కొనాల్సి ఉంటుందని డిస్కంలు అంచనా వేశాయి. 2021–22 ఆర్థిక సంవత్సరంలో డిస్కంల ఆదాయం రూ.40,962.4 కోట్లు ఉంటే ఖర్చు రూ.41,220.99 కోట్లు ఉంది. రూ.258.59 కోట్ల వ్యత్యాసం ఉంది. 2022–23లో మొత్తం ఖర్చులు రూ.45,398.58 కోట్లుగా అంచనా వేయగా లోటు వచ్చే అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తోందని చెబుతూ నికర ఆర్థిక లోటును 0 గా చూపించాయి. అయితే 2014 నుంచి ఈ ఏడాది మార్చి 31 నాటికి డిస్కంలు రూ.28,599 కోట్ల నష్టాల్లో ఉన్నాయని తెలిపాయి. ఇవి కాకుండా రూ.37,465 కోట్ల అప్పులున్నట్లు వెల్లడించాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2021–22లో ఇప్పటి వరకూ రూ.13,560 కోట్ల రుణాలు తీసుకున్నట్లు వివరించాయి. విద్యుత్ కొనుగోలు, సరఫరా ఖర్చులు గడిచిన ఏడేళ్లలో రూ.25,595 కోట్లకు చేరాయని తెలిపారు. గత ఆగస్టులో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) నివేదిక ప్రకారం 100 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగంపై దేశంలోనే అత్యంత తక్కువ చార్జీ ఏపీలో ఉందనే విషయాన్ని గుర్తు చేశాయి. మిగిలితే వినియోగదారులకు ఇస్తున్నాం 2014–15 నుంచి 2018–19 వరకూ ఆమోదించిన ట్రూఅప్ చార్జీలను ఏపీఈఆర్సీ నిలిపివేసింది. తిరిగి వాటి వసూలుకు అనుమతించాలని డిస్కంలు కోరాయి. చార్జీలు వసూలు చేయడమే కాకుండా మిగిలితే తిరిగి వినియోగదారులకు ఇస్తున్నామని, ఈ విధంగా 2022లో ట్రూ డౌన్ రూ.3,373 కోట్లుగా ఇప్పటికే నిర్ధారించామని తెలిపారు. విద్యుత్ కొనుగోలు ఖర్చుల ట్రూ డౌన్ రూ.4,761 కోట్లు, ఆదాయ లోటు రూ.3,685 కోట్లు, అదనపు ఖర్చు రూ.183 కోట్లు, 2021కి అదనపు ఆదాయ లోటు ట్రూ అప్ రూ.2,480 కోట్లు చొప్పున లెక్క గట్టాయి. ఈ అంశాలన్నింటిపైనా ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ (పబ్లిక్ హియరింగ్) నిర్వహించి, తగిన నిర్ణయాన్ని వెలువరిస్తుంది. -
ఇంధన పొదుపుతో ఖర్చుల అదుపు
సాక్షి, అమరావతి: ఇంధన సామర్థ్యం, పొదుపు చర్యలపై ప్రజలు, ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ సంస్థలకు పెద్దఎత్తున అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ దృష్ట్యా అందరూ ఇంధన పరిరక్షణ వారోత్సవాలలో భాగస్వాములు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంధన సంరక్షక మిషన్ (ఏపీఎస్ఈసీఎం) చైర్మన్ సమీర్శర్మ కోరారు. రాష్ట్రంలో ఈ నెల 14 నుంచి మొదలయ్యే ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా అందించనున్న స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ (సెక) 2021పై ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్, ఇతర అధికారులతో ఆయన ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. పెరుగుతున్న ఇంధన డిమాండ్ను అందుకోవడానికి, ఇంధన భద్రత, ఆర్థికాభివృద్ధి సాధించేందుకు, ఇంధనంపై వ్యయాన్ని తగ్గించేందుకు ఇంధన సామర్థ్య చర్యలు దోహదపడతాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇంధన పరిరక్షణ అవార్డుల కార్యక్రమంలో ఎక్కువ మంది పాల్గొనేలా సహకరించాల్సిందిగా అన్ని ప్రభుత్వ శాఖలకు ఇప్పటికే విజ్ఞప్తి చేసినట్లు ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ సీఎస్కు వివరించారు. వివిధ రంగాల్లో ఇంధన సామర్థ్య కార్యక్రమాలు అమలు చేయడం ద్వారా ఏటా 15 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఆదా చేసే అవకాశముందని పేర్కొన్నారు. ‘సెక’ పోటీలో ఎక్కువ మంది పాల్గొనేందుకు వీలు కల్పిస్తూ దరఖాస్తు గడువును ఈ నెల 8వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి తెలిపారు. కేటగిరీల వారీగా అవార్డులకు అర్హతలు ఇలా.. పరిశ్రమలు, భవన నిర్మాణం, మునిసిపల్ రంగానికి సంబంధించిన వివిధ సంస్థల మధ్య నిర్విహిస్తున్న సెక–2021 అవార్డుల పోటీకి సంబంధించిన అర్హత ప్రమాణాలను ఏపీఎస్ఈసీఎం ఆదివారం ప్రకటించింది. పారిశ్రామిక రంగం కింద, మొత్తం వార్షిక ఇంధన వినియోగం 3000 టీన్ ఆఫ్ ఆయిల్ ఈక్వలెంట్ (టీఓఈ) లేదా అంతకంటే ఎక్కువ కలిగిన సిమెంట్ పరిశ్రమలు, 1500 టీఓఈ లేదా అంతకంటే ఎక్కువ మొత్తం వార్షిక ఇంధన వినియోగం కలిగిన టెక్స్టైల్ పరిశ్రమలు, 1000 కేవీఏ, అంతకంటే ఎక్కువ డిమాండ్ ఉన్న ఎంఎస్ఎంఈ సంస్థలు ఈ అవార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు. భవనాల విభాగం కింద, వాణిజ్య భవనాలు, హోటళ్లు, ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్, ప్లాజాలు, యూనివర్సిటీలు, 100 కిలోవాట్, 120 కిలోవాట్ లేదా అంతకంటే ఎక్కువ కాంట్రాక్ట్ డిమాండ్ ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలు, 50 కిలోవాట్ కంటే ఎక్కువ లోడ్ ఉన్న విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్ కళాశాలలు దరఖాస్తుకు అర్హులు. మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, మురుగు నీటి పంపింగ్ బోర్డులు, తాగునీటి సరఫరా బోర్డులు కూడా పోటీలో పాల్గొనవచ్చు. దరఖాస్తు వివరాలు ఏపీఎస్ఈసీఎం, డిస్కంల వెబ్సైట్లలో అందుబాటులో ఉన్నాయి. పూరించిన దరఖాస్తును seca.apsecm.gmail.com ద్వారా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు సమర్పించాలి. -
విద్యుత్ రేట్లు ఎప్పుడూ ఒకేలా ఉండవు
-
Andhra Pradesh: ఖజానాకు ఆదా..ఉచితానికి భరోసా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వ్యవసాయానికి పగటిపూటే 9 గంటలపాటు ఉచిత విద్యుత్ను వచ్చే 25 ఏళ్లపాటు నిరాటంకంగా అందించేందుకే కేంద్ర ప్రభుత్వం సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో ఒప్పందం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. ఆదివారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా దీర్ఘకాలం నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, ఇది రైతులకు పూర్తి భరోసానిస్తుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న ధర కంటే తక్కువకే కొంటున్నందున ఏడాదికి రూ.2,400 కోట్లు ఆదా అవుతుందని తెలిపారు. ఇవాక్యులేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యయం మరో రూ.2,260 కోట్లు కూడా ఆదా అవుతాయని వెల్లడించారు. సెకీతో విద్యుత్ ఒప్పందం రాష్ట్రానికి ప్రయోజనకరమని అంశాలవారీగా వివరించారు... యూనిట్కు రూ.1.87 ఆదా.. 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ను కలుపుకొని వ్యవసాయానికి పగటి పూట 9 గంటలు నిరాటంకంగా నాణ్యమైన విద్యుత్ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రస్తుతం వ్యవసాయానికి అందించే విద్యుత్ను యూనిట్ సగటున రూ.4.36 చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు ఉచితంగా అందిస్తోంది. సెకీతో ఒప్పందం వల్ల ఈ విద్యుత్ యూనిట్ రూ.2.49కే వస్తుంది. ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ద్వారా పిలిచిన టెండర్లలో కనీస బిడ్ యూనిట్కు రూ.2.49కు కోట్ చేశారు. తద్వారా యూనిట్కు దాదాపు రూ.1.87 ఆదా అవుతుంది. ఆ ప్రకారం ఏడాదికి రూ.2,400 కోట్ల వరకూ ప్రజాధనాన్ని ఆదా చేయొచ్చు. మనకు మరింత చౌకగా.. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ చట్టం ప్రకారమే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆప్ ఇండియా (సెకీ) యూనిట్ రూ.2.49 చొప్పున ప్రతిపాదించగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. తమిళనాడు ప్రభుత్వం సెప్టెంబర్ లోనే సెకీ నుంచి యూనిట్ రూ.2.61చొప్పున సోలార్ విద్యుత్ను కొనుగోలు చేసింది. ఏపీ ప్రభుత్వం అంతకంటే తక్కువకే రూ.2.49కే సెకీ సంస్థ నుంచి కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకోనుంది. 2014 నుంచి ఆంధ్రప్రదేశ్ చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలలో ప్రస్తుతం సెకీ ప్రతిపాదించిందే అతి తక్కువ ధర. అలాగే ఐఎస్టీఎస్ ఛార్జీల నుంచి కేంద్రం మినహాయింపు ఇచ్చింది. కేంద్ర చట్టాల ప్రకారమే.. డిస్కంలపై పడే నెట్ వర్క్ ఛార్జీల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నాం కాబట్టి కేంద్ర విద్యుత్ చట్టాన్ని అనుసరించాల్సి ఉంటుంది. విద్యుత్ కొనుగోళ్లపై ముందుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాతే విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్(ఈఆర్సీ) కు ప్రతిపాదిస్తుంది. ఈఆర్సీ ఆమోదించిన తరువాతే సెకీతో ఒప్పందం కుదుర్చుకుంటుంది. 2014 నుంచి పీపీఏ ఒప్పందాలలో భాగంగా చేంజ్ ఆఫ్ లా ప్రకారం విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు మీద పన్నులు పెరిగినా, తగ్గినా కొనుగోలుదారుడే (ప్రభుత్వం, డిస్కంలు) భరిస్తాయి. కేంద్ర విద్యుత్ చట్టంలో దీన్నొక నిబంధనంగా నోటిఫై చేశారు. ప్రస్తుతం దేశంలో అన్ని టెండర్లలో ఈ నిబంధన అమల్లో ఉంది. దీన్ని మార్చడానికి అవకాశం లేదు. లైన్ల ఖర్చుండదు.. ఇతర అవసరాలకు భూములు సెకీ నుంచి సౌర విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల ఇవాక్యులేషన్ లైన్ల ఖర్చు భారం ఉండదు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే ప్లాంట్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలంటే ప్రభుత్వం రూ.2,260 కోట్లు ఖర్చు పెట్టి ఇవాక్యులేషన్ లైన్లు నిర్మించాల్సి ఉంటుంది. సెకీతో ఒప్పందంతో ఆమేరకు భారీగా ప్రజాధనం ఆదా అవుతుంది. రాష్ట్రంలో ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే జీఎస్టీ ఆదాయాన్ని పరిగణలోకి తీసుకున్నాసరే అది ఒకసారికే పరిమితమవుతుంది. కానీ కేంద్ర గ్రిడ్కు ఛార్జీలు 25 ఏళ్లపాటు కట్టాల్సి ఉంటుంది. దాంతో రాష్ట్రం చాలా ఆర్థిక భారాన్ని భరించాల్సి వస్తుంది. మరోవైపు సెకీ విద్యుత్ వల్ల మనం భూములు ఇవ్వాల్సిన అవసరం లేదు. అవసరమైతే వేరే ప్రాజెక్టుల కోసం ఈ భూమి ఉపయోగించుకోవచ్చు. తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ కంటే రాజస్థాన్లో సూర్యుడు ఎక్కవ సేపు ప్రకాశిస్తాడు. మన రాష్ట్రంలో కంటే అక్కడ గంటన్నర సేపు అధికంగా సూర్యరశ్మి ఉండటంతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల డిమాండ్ అధికంగా ఉండే పీక్ అవర్స్లో సెకీ విద్యుత్ బాగా ఉపయోగపడుతుంది. అదే ఎక్సే్చజీ నుంచి కొనుగోలు చేస్తే పీక్ అవర్లో కరెంట్ ధరలు అధికంగా ఉంటాయి. ఐదేళ్లలో అస్తవ్యస్థం గత సర్కారు హయాంలో డిస్కంలపై తీవ్ర ఒత్తిడి తెచ్చి 25 ఏళ్లకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవడంతో 2014– 2019 మధ్య రాష్ట్ర విద్యుత్ రంగం పూర్తిగా దివాళా తీసింది. కొనుగోలు నష్టాలు కొండలా పేరుకుపోయాయి. అప్పులు గుదిబండల్లా మారాయి. చౌక విద్యుత్తు కొనుగోళ్లకు ప్రాధాన్యమివ్వకుండా దీర్ఘకాలిక ఒప్పందాలపై గత సర్కారు మొగ్గు చూపడంతో డిస్కమ్లు నష్టాల భారంతో దివాళా స్థితికి చేరుకున్నాయి. నోట్: ‘సెకీ’ 2017 డిసెంబర్లో నిర్వహించిన వేలంలో ధరలు, గత సర్కారు కొన్న ధరల్లో వ్యత్యాసం వివరాలు ఇవీ. చదవండి: 'పల్లె..' ఇవేం నీతిమాలిన పనులు?.. ఆడియో వైరల్ -
‘సెకీ’ విద్యుత్ లాభమే
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) ఏర్పాటుచేసే 9 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కుదుర్చుకోవడం లాభదాయకమేనని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ స్పష్టం చేశారు. ‘సెకీ నుంచి విద్యుత్ కొంటే నష్టమే’ శీర్షికతో ఈనాడు ప్రచురించిన కథనంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రాజెక్టు ఏర్పాటుకు ఇచ్చే నిధులు మౌలిక సదుపాయాలు కల్పించే నిమిత్తం పార్క్ డెవలపర్కు చెల్లించేవేనని, బిడ్డింగ్ ధరలో ఈ అంశం కూడా ఉంటుందన్నారు. అలాగే.. జీఎస్టీ పన్నును విద్యుత్ ఉత్పత్తి ధరలో భాగంగా పరిగణించకూడదన్నారు. ‘సెకీ’ నుంచి విద్యుత్ తీసుకోవడంవల్ల ప్రస్తుతం రాష్ట్రంలో అందుబాటులో ఉన్న భూమి కూడా భవిష్యత్తులో ఇతర ప్రాజెక్టులు చేపట్టడానికి పనికొస్తుందని ఆయన పేర్కొన్నారు. యూనిట్ రూ.2.49 పైసలకు తీసుకుంటే 3% అంతర్రాష్ట్ర విద్యుత్ ప్రసార నష్టాలు 7.5 పైసలు మాత్రమే వస్తుందని.. 27 పైసలు కాదని శ్రీకాంత్ తెలిపారు. అంతేకాక.. రాష్ట్రంలో సౌర ప్రాజెక్టులు చేపట్టినప్పుడు వాటికి కావలసిన విద్యుత్ లైన్లు, అంతర్గతంగా విద్యుత్ ప్రసార వ్యవస్థ బలోపేతానికి అయ్యే ఖర్చు.. బయటి రాష్ట్రం నుంచి నేరుగా సౌర విద్యుత్ తీసుకున్నప్పుడు అంతర్గత వ్యవస్థకు అయ్యే ఖర్చుల మధ్య కూడా తేడా ఉంటుందని వివరించారు. ప్రాథమికంగా ఇప్పుడున్న అంతర్రాష్ట్ర, అంతర్గత రాష్ట్ర విద్యుత్ ప్రసార వ్యవస్థల సామర్థ్యాన్ని బేరీజు వేసుకుంటే.. బయటి రాష్ట్రాల నుంచి సౌర విద్యుత్ తీసుకున్నప్పుడే ఖర్చు తక్కువవుతుందని శ్రీకాంత్ స్పష్టంచేశారు. యూనిట్కు రూ.1.87 పైసల ఆదా ప్రస్తుతం రూ.4.36 పైసల చొప్పున ఒక యూనిట్ విద్యుత్ను కొనుగోలు చేస్తున్నామని.. అయితే, ‘సెకీ’ నుండి దీర్ఘకాలిక ఒప్పందం ద్వారా అదే ఒక యూనిట్ విద్యుత్ను 2.49 పైసలకు కొనుగోలు చేయడంవల్ల యూనిట్కు రూ.1.87 పైసల వరకు ఆదా అవుతుందని శ్రీకాంత్ తెలిపారు. ఈ లెక్కన ఏటా దాదాపు రూ 3,060 కోట్లు ఆదా అవుతుందని ఆయన వివరించారు. ఉచిత వ్యవసాయ విద్యుత్ కోసమే.. ఇక సీఎం వైఎస్ జగన్ సత్సంకల్పంతో రానున్న 25 ఏళ్లకు రాష్ట్రంలోని రైతుల ఉచిత వ్యవసాయ విద్యుత్ అవసరాల కోసమే ‘సెకీ’ నుంచి విద్యుత్ తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఒక సుస్థిరమైన, ప్రత్యేక ఫీడర్లు కల్గిన, అదనపు లోడ్ గుర్తించే సామర్థ్యమున్న మీటర్లతో ఒక స్వతంత్ర విద్యుత్ వ్యవస్థను తీర్చిదిద్దే క్రమంలో భాగంగా ఈ తక్కువ ధర సౌర విద్యుత్ను కొనుగోలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమలులో వున్న సౌర పీపీఏల సగటు యూనిట్ ధర దాదాపు రూ.4.50 ఉందన్నారు. ఈ నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్కి ఎన్టీపీసీ సరఫరా చేస్తున్న సౌర విద్యుత్ ధర యూనిట్ రూ.2.79 పైసల (ట్రేడింగ్–మార్జిన్ కలిపి) కన్నా ‘సెకీ’ ప్రతిపాదించిన యూనిట్ రూ.2.49పై. (ట్రేడింగ్–మార్జిన్ కలిపి) ధర తక్కువని శ్రీకాంత్ స్పష్టంచేశారు. కాబట్టి.. అనవసరంగా లేనిపోని అభూత కల్పనలతో అవాస్తవాలను ప్రచారం చేయవద్దని ఆయన హితవు పలికారు. -
Andhra Pradesh: ఫుల్గా ‘పవర్’
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా బొగ్గు కొరత నేపథ్యంలో రాష్ట్రానికి కావాల్సిన విద్యుత్ను సమీకరించుకోవాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో కరెంట్ పరిస్థితులతో పాటు బొగ్గు సరఫరా, విద్యుత్ కొరత రాకుండా అమలు చేస్తున్న అత్యవసర ప్రణాళికలు, దీర్ఘకాలిక వ్యూహాలపై సీఎం సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, జెన్కో ఎండీ శ్రీధర్ సహా పలువురు అధికారులతో దీనికి హాజరయ్యారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా చూడాలని సీఎం ఆదేశించారు. సింగరేణి సహా కోల్ ఇండియా తదితర సంస్థలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. బొగ్గు తెప్పించేందుకు సరుకు రవాణా ఓడల వినియోగం లాంటి ప్రత్యామ్నాయాలపై కూడా ఆలోచన చేయాలని, దీనివల్ల రవాణా ఖర్చులు కలసి వస్తాయన్నారు. అవసరమైతే షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో మాట్లాడాలని సూచించారు. దీనికోసం సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకోవాలన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలే లక్ష్యంగా.. తాత్కాలిక చర్యలతో పాటు దీర్ఘకాలిక విద్యుదుత్పత్తి వ్యూహాలపైనా దృష్టి సారించాలని సీఎం జగన్ ఆదేశించారు. 6,300 మెగావాట్ల రివర్స్ పంపింగ్ విద్యుదుత్పత్తి ప్రాజెక్టు నిర్మాణంపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టి వేగంగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని, ఇలాంటి ప్రాజెక్టుల వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయని సీఎం పేర్కొన్నారు. సీలేరులో ప్రతిపాదిత 1,350 మెగావాట్ల రివర్స్ పంపింగ్ ప్రాజెక్టుపైనా దృష్టిపెట్టాలన్నారు. ఈ ప్రాజెక్టులు సాకారమయ్యేలా వెంటనే చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. నాన్ పీక్ అవర్స్లో నీటిని వెనక్కి పంపేందుకు (రివర్స్ పంపింగ్) సౌర విద్యుత్ వాడుకుని అనంతరం ఆ నీటినే వినియోగించి విద్యుదుత్పత్తి చేసే ప్రతిపాదిత ప్రాజెక్టు తొలిదశలో 6,300 మెగావాట్ల ఉత్పత్తికి డీపీఆర్లు ఇప్పటికే తయారయ్యాయి. సోలార్తో రివర్స్ పంపింగ్కు యూనిట్ రూ.2.49 దాకా ఖర్చు కానుంది. అనంతరం డిమాండ్, అవసరాన్ని బట్టి పీక్ అవర్స్లో అదే నీటితో జలవిద్యుదుత్పత్తి చేస్తారు. దీనికి రూ.3 వరకు వ్యయం అవుతుంది. దీన్ని పీకింగ్ ప్లాంట్ అని వ్యవహరిస్తారు. పీక్ అవర్స్లో డిమాండ్ అధికంగా ఉండటంతో విద్యుత్తు కొనుగోలుకు యూనిట్కు రూ.10 నుంచి రూ.12 వరకు వెచ్చించాల్సి వస్తోంది. అలాంటి పరిస్థితి లేకుండా రివర్స్ పంపింగ్ వల్ల అవసరాన్ని బట్టి చౌకగా విద్యుదుత్పత్తి చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. అవాంతరాలు లేకుండా సరఫరా రాష్ట్రంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా నిరంతరం విద్యుత్తు సరఫరా చేస్తున్నామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను బేరీజు వేసుకుంటూ తగిన చర్యలతో ముందుకు వెళ్తున్నామని వివరించారు. మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి 2 ర్యాక్ల బొగ్గు అదనంగా వచ్చిందని, రాష్ట్రంలో జెన్కో ఆధ్వర్యంలో థర్మల్ విద్యుదుత్పత్తిని 50 మిలియన్ యూనిట్ల నుంచి 69 మిలియన్ యూనిట్లకు పెంచామని అధికారులు తెలిపారు. పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ నుంచి 170 మెగావాట్ల విద్యుత్ కూడా అందుబాటులోకి వస్తోందని చెప్పారు. -
ఇంధన పొదుపుపై కసరత్తు
సాక్షి, అమరావతి: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)ల్లో భారీ స్థాయిలో ఇంధన పొదుపునకు అవకాశం ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ భావిస్తోంది. ఇంధన సామర్థ్య చర్యలను ప్రోత్సహించడం, అత్యాధునిక ఇంధన సామర్థ్య సాంకేతికతలను ప్రవేశపెట్టడం ద్వారా పెద్దఎత్తున ఇంధనాన్ని ఆదా చేయడానికి అవకాశం ఉందని నమ్ముతోంది. ఈ దృష్ట్యా ఇంధన ఆడిట్ నిర్వహించేలా ఎంఎస్ఎంఈ యజమానులను ప్రోత్సహించాలని రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులను ఆదేశించింది. రూ.1,200 కోట్ల విలువైన విద్యుత్ ఆదా పరిశ్రమల్లో ఇంధన వినియోగం ఏటా 17,000 మిలియన్ యూనిట్లు ఉండగా..ఇందులో ఎంఎస్ఎంఈలు 5,000 మిలియన్ యూనిట్లు వినియోగించుకుంటున్నాయి. కనీసం 10 శాతం పొదుపు చేస్తే 500 మిలియన్ యూనిట్లు ఆదా అయినట్టే. ఎంఎస్ఎంఈల్లో పూర్తిస్థాయిలో ఇంధన సామర్థ్య చర్యలు చేపడితే దాదాపు 2,000 మిలియన్ యూనిట్ల విద్యుత్ను పొదుపు చేయవచ్చని, ఇది రూ.1,200 కోట్లకు సమానమని పరిశ్రమల శాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రానికి బీఈఈ ఆడిటర్లు భారీ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈల్లో ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఎనర్జీ ఆడిట్ (ఐజీఈఏ) నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన సామర్థ్య అభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్కో) సేవలను వినియోగించుకోవాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ సంచాలకులు, జిల్లాల్లోని జనరల్ మేనేజర్లను తాజాగా ఆదేశించారు. ఈ క్రమంలోనే ఎంఎస్ఎంఈల్లో ఇంధన ఆడిట్ నిర్వహించేందుకు సాంకేతిక సాయం అందించడంతో పాటు గుర్తింపు పొందిన ఇంధన ఆడిటర్లను రాష్ట్రానికి పంపేందుకు బీఈఈ (బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ) అంగీకరించింది. ది ఎనర్జీ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ (టీఈఆర్ఐ) సమర్పించిన ఇంధన ఆడిట్ నివేదిక ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఫిషరీస్ క్లస్టర్లో 43 ఎంఎస్ఎంఈలు 455 మిలియన్ యూనిట్లు వినియోగిస్తున్నాయి. వీటి విద్యుత్ బిల్లు రూ.296 కోట్లు వస్తోంది. పైలట్ ప్రాజెక్టు కింద ఏపీఎస్ఈసీఎం రెండు ఫిషరీస్ ఎంఎస్ఎంఈలు ఆనంద ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, కదెర్ ఎక్స్పోర్ట్స్ సంస్థల్లో ఇంధన ఆడిట్ చేసింది. రూ.1.37 కోట్ల పెట్టుబడితో 1.45 మిలియన్ యూనిట్ల విద్యుత్ను పొదుపు చేయవచ్చని, 1,306 టన్నుల కార్బన్ డయాౖఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించవచ్చని ఈ ఆడిట్ లో తేల్చింది. పరిశ్రమల శాఖ మద్దతు హర్షణీయం టీఈఆర్ఐ సంస్థ ద్వారా రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ ఇప్పటికే ఇంధన ఆడిట్ నిర్వహించి ఫిషరీస్ విభాగంలో ఇంధన పొదుపునకు భారీగా అవకాశాలు ఉన్నట్టు గుర్తించింది. ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలులో పరిశ్రమల శాఖ సంపూర్ణ మద్దతు ఇస్తుండటం హర్షించదగ్గ విషయం. – నాగులాపల్లి శ్రీకాంత్, కార్యదర్శి, ఇంధన శాఖ బీఈఈ సంస్థలతోనే ఆడిట్ పరిశ్రమల్లో ఇంధన పొదుపు తద్వారా ఆర్థిక పొదుపు అవకాశాలను గుర్తించేందుకు ఇంధన శాఖకు చెందిన ఏపీ సీడ్కో ఐజీఈఏ (ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఎనర్జీ ఆడిట్ ) కార్యక్రమాన్ని చేపడతాయి. ఐజీఈఏను బీఈఈకి చెందిన ఇంధన ఆడిట్ సంస్థలే నిర్వహించనున్నాయి. ఐజీఈఏ ఖర్చు పరిశ్రమను బట్టి ఉంటుంది. – కరికాల వలవన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పరిశ్రమల శాఖ ఆడిట్ తో అనేక ప్రయోజనాలు ఆడిట్ తో అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇంధన ఖర్చును, ఉత్పత్తి ఖర్చును, విదేశీ ఇంధన వనరులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చు. పర్యావరణం దెబ్బతినకుండా, కాలుష్యం పెరగకుండా చూసుకోవచ్చు. గ్రీన్ హౌస్ వాయువుల ప్రభావాన్ని తగ్గించడంతో పాటు పోటీతత్వం, ఇంధన సరఫరాను మెరుగుపర్చుకోవచ్చు. –జేవీఎన్ సుబ్రహ్మణ్యం, కమిషనర్, పరిశ్రమల శాఖ -
బొగ్గు.. భగ్గు!
సాక్షి, అమరావతి, సాక్షి, హైదరాబాద్: ఎడతెరిపి లేని వర్షాలు.. ఉత్పత్తి, సరఫరాలో అంతరాయాలు, కరోనా నుంచి కోలుకుని పరిశ్రమల్లో వినియోగం పెరగడం, వ్యవసాయ సీజన్ కావడం, విదేశీ బొగ్గు ధరలు ఎగబాకడంతో కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోని బొగ్గుకు దేశవ్యాప్తంగా తీవ్ర కొరత ఏర్పడింది. కొరత కారణంగా పలు రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలోని విద్యుదుత్పత్తి కేంద్రాల్లోనూ బొగ్గు నిల్వలు నిండుకున్నాయి. థర్మల్ కేంద్రాల్లో బొగ్గు సంక్షోభంతో సోమవారం నాటికి దేశంలోని దాదాపు 13 రాష్ట్రాల్లో విద్యుత్ లోటు ఏర్పడింది. ఫలితంగా విద్యుత్ కోతలు అనివార్యమవుతున్నాయి. అంతర్జాతీయ, దేశీయ విపణిలో బొగ్గు కొరత తీరే వరకు మరికొన్ని రోజుల పాటు కోతలు కొనసాగే అవకా>శాలున్నాయి. జాతీయ స్థాయిలో గ్రిడ్ నిర్వహణను నియంత్రించే ‘పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్’(పోసోకో) నివేదికలను విశ్లేషిస్తే వారం పది రోజులుగా పంజాబ్, రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్, హర్యాణా, బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో కోతలు తీవ్ర స్థాయిలో పెరిగిపోయాయి. బిహార్, ఝార్ఖండ్లోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం రోజుకు 8 – 7 గంటలకు మించి విద్యుత్ సరఫరా ఉండడం లేదని జాతీయ మీడియా పేర్కొంటోంది. దక్షిణాదిన కేరళలో విద్యుత్ కొరత గణనీయంగా ఉండగా కర్ణాటక, ఏపీలో స్వల్పంగా కొరత నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా.. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. చైనా లాంటి దేశాలు కూడా బొగ్గు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. విద్యుత్ కోతలతో చైనాలోని పరిశ్రమలు అల్లాడుతున్నాయి. మన దేశంలోనూ విద్యుత్తు డిమాండ్ గణనీయంగా పెరిగింది. మరోవైపు గత ఏడాది కాలంలో విదేశీ బొగ్గు ధరలు దాదాపు రెట్టింపు కావడంతో బొగ్గు దిగుమతులపై ఆధారపడ్డ థర్మల్ ప్లాంట్లపై ఆర్థిక భారం పెరిగిపోయింది. దీంతో దేశీయ కోల్ ఇండియా, సింగరేణి బొగ్గుకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. వీటి నుంచి సరఫరాను క్రమంగా పెంచడం ద్వారా సంక్షోభాన్ని అధిగమిస్తామని కేంద్రం పేర్కొంటోంది. రోజూ 80 – 110 ఎంయూల కొరత దేశంలో ఈ ఏడాది తలెత్తిన కొరతలో ప్రస్తుత అక్టోబర్ నెల తొలి వారం రోజుల్లోనే ఏకంగా 11.2 శాతం కొరత నమోదు కావడం గమనార్హం. గతేడాది అక్టోబర్ తొలి వారంలో తలెత్తిన కొరతతో పోల్చితే ఇప్పుడు ఈ నెల తొలివారంలో 21 రెట్లు పెరిగినట్లు కేంద్ర గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత వారం రోజులుగా దేశంలో సగటున రోజుకు 3,880 మిలియన్ యూనిట్ల (ఎంయూ) వినియోగం ఉండగా 80 – 110 ఎంయూల వరకు కొరత నెలకొంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ(సీఈఏ) తాజా నివేదిక ప్రకారం దేశంలోని 1,65,066 మెగావాట్ల స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన 135 థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సగటున కేవలం నాలుగు రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. సాధారణంగా విద్యుత్ ప్లాంట్లలో 15 – 30 రోజుల ఉత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు ఉండాల్సినా 115 విద్యుత్ కేంద్రాల్లో ఆరు రోజులకు సరిపడే నిల్వలు మాత్రమే ఉన్నాయి. బొగ్గు కొరత నేపథ్యంలో పలు రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు స్థాపిత సామర్థ్యం కన్నా తక్కువ సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. రాష్ట్రంలో ఇదీ పరిస్థితి.. ఏపీలో 8,075 మెగావాట్ల ఉత్పత్తి కోసం సౌర, పవన విద్యుత్ వనరుల మీద ఆధారపడాల్సి వస్తోంది. అయితే వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వీటి నుంచి పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి జరగటం లేదు. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ కెపాసిటీ 5,010 మెగావాట్లు కాగా వీటికి అవసరమైన బొగ్గు సమకూర్చేందుకు కోల్ ఇండియా, సింగరేణి సంస్థలతో పాటు విదేశాల నుంచి దిగుమతులే ఆధారం. జెన్కో బొగ్గు ప్లాంట్లకు రోజుకు ఇంచుమించు 70,000 టన్నుల బొగ్గు అవసరం కాగా సెప్టెంబరు చివరిలో 24,000 టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతో ప్రస్తుతం రోజుకు 40,000 టన్నులకు పెరిగింది. దొరకని గ్యాస్ రాష్ట్రంలో గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 908 మెగావాట్లు ఉన్నప్పటికీ కేవలం 100 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేయటానికి మాత్రమే గ్యాస్ అందుబాటులో ఉంది. గ్యాస్ ప్లాంట్ల నుంచి పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి చేయటానికి గ్యాస్ లభ్యత లేదు. రాష్ట్రంలోని డిస్కంలలో 63,070 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉండగా బొగ్గు, జల, పవన విద్యుత్, సౌర విద్యుత్ అన్ని కలిపి 50 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే లభ్యం అవుతోంది. బొగ్గు సంక్షోభం లేకుంటే.. రాష్ట్రంలో 20130 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉండగా 1600 మెగావాట్లు కృష్ణపట్నం నుంచి, 600 మెగావాట్లు ఆర్టీపీపీ నుంచి, 1,040 మెగావాట్లు హెచ్ఎన్పీసీఎల్ నుంచి, 400 మెగావాట్లు కేఎస్కే నుంచి, 7,000 మెగావాట్లు సౌర పవన ఇతర విద్యుత్ వనరుల నుంచి లభ్యమవుతోంది. బొగ్గు సంక్షోభం లేకుంటే ఈ విద్యుత్ ఉత్పత్తి వనరులు రాష్ట్ర అవసరాలను తీర్చగలుగుతాయి. నిజానికి రాష్ట్రంలో 2018 అక్టోబర్లో కూడా బొగ్గు కొరత సంక్షోభం ఏర్పడింది. అప్పుడు రాష్ట్రంలో కొన్ని చోట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో డిస్కంలు బయట నుంచి ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేశాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో జెన్కో కేంద్రాల చర వ్యయం కంటే తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించడం కోసం మార్కెట్ వేలం నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు. గ్రామాల్లో పీక్ అవర్స్లో మాత్రమే ‘రాష్ట్రంలో ప్రస్తుతం నగరాలు, పట్టణాల్లో విద్యుత్ కోతలు విధించడం లేదు. నిర్వహణ కోసం మాత్రమే అక్కడక్కడా సరఫరా ఆపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పీక్ అవర్స్లో కొంత వరకూ పవర్ కట్స్ ఉంటున్నాయి. అది కూడా సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య ఒకటి రెండు గంటలు మాత్రమే’ – నాగులపల్లి శ్రీకాంత్, ఇంధన శాఖ కార్యదర్శి తెలంగాణాలో పరిస్థితి భిన్నం తెలంగాణలో సహజసిద్ధంగా బొగ్గు గనులు ఉండటం వల్ల అక్కడ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకు నిరంతరాయంగా బొగ్గు సరఫరా జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం తమ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందువల్ల సింగరేణి గనుల నుంచి ఏపీ జెన్కో థర్మల్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా జరగటం లేదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తీవ్ర బొగ్గు కొరత ఎదుర్కొంటున్నప్పటికీ తెలంగాణలో మాత్రమే 5 నుంచి 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండటానికి ఇదే కారణం. -
విద్యుత్ను పొదుపుగా వాడండి
సాక్షి, అమరావతి: దేశంలో బొగ్గు సంక్షోభం నెలకొన్న కారణంగా మన రాష్ట్రంపైన కూడా ఆ ప్రభావం తీవ్రంగా ఉండే ప్రమాదముందని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. ఈ విపత్కర పరిస్థితిలో విద్యుత్ సంస్థలకు సహకరించాల్సిందిగా వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రతి వినియోగదారుడు విద్యుత్ పొదుపుపై శ్రద్ధ తీసుకోవాలని కోరారు. పీక్ అవర్స్గా పిలుచుకునే ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, రాత్రి 6 గంటల నుంచి 10 గంటల వరకు ఏసీల వంటి పరికరాల వాడకం తగ్గించుకోవాలన్నారు. ఈ మేరకు విజయవాడలో శనివారం శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. కేంద్రం సహకారమందించాలి.. బొగ్గు కొరత సంక్షోభాన్ని అధిగమించేందుకు తగిన సహకారం అందించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం జగన్ ఇప్పటికే లేఖ రాశారు. ఆ లేఖలో రాష్ట్రంలో 2,300 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లు పనిచేయడం లేదని తెలిపారు. వాటికి ఓఎన్జీసీ, రిలయెన్స్ నుంచి గ్యాస్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని సీఎం కోరారు. అలాగే బొగ్గు కొనుగోలు ధరలు, విద్యుత్ మార్కెట్ ధరలు విపరీతంగా పెరిగినందున రాష్ట్ర విద్యుత్ సంస్థలు బొగ్గు కొనుగోలు చేయడానికి రుణాలు మంజూరు చేసేలా బ్యాంకులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. పడిపోయిన జెన్కో ఉత్పత్తి.. కోవిడ్ తర్వాత విద్యుత్ వినియోగం 2019తో పోలిస్తే 2021లో దేశవ్యాప్తంగా 18 శాతం, ఏపీలో 20 శాతం పెరిగింది. ఒకవేళ కోవిడ్ లేకపోతే జరిగే వినియోగం కంటే ఇది 8 శాతం ఎక్కువ. రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకి వినియోగిస్తున్న 190 మిలియన్ యూనిట్లలో 80 మి.యూనిట్ల విద్యుత్ ఏపీ జెన్కో ద్వారా అందుతోంది. ప్రస్తుతం జెన్కో ఉత్పత్తి 50 శాతం (40 మి.యూ)కి పడిపోయింది. కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి రోజుకు 40 మి.యూ విద్యుత్ ఉత్పత్తి అవ్వాల్సి ఉండగా అందులో 75 శాతం (30 మి.యూ) మించి ఉత్పత్తి అవ్వట్లేదు. జల విద్యుత్ ఉత్పత్తి 25 మిలియన్ యూనిట్ల వరకే చేయగలం. రోజుకి 15 మి.యూ సౌర విద్యుత్ వస్తోంది. 30 మి.యూ పవన విద్యుత్ ఉత్పత్తి అవ్వాల్సి ఉండగా.. కేవలం 5 నుంచి 10 మి.యూనిట్లకే పరిమితమవుతోంది. బహిరంగ మార్కెట్లో ధరలు పెరిగాయి.. రాష్ట్రంలో 40 మిలియన్ యూనిట్ల విద్యుత్ను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేస్తుండగా ఈ నెల 8 నుంచి యూనిట్ సగటు ధర రూ.15కు పెరిగింది. ఇండోనేషియా నుంచి సరఫరా అయ్యే బొగ్గు ఏప్రిల్లో టన్ను 86.68 డాలర్లుండగా ఇప్పుడు 162 డాలర్లు అయ్యింది. మనరాష్ట్రంలో ఉన్న 5 వేల మెగావాట్ల థర్మల్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. జెన్కో ప్లాంట్లకి రోజుకు 70,000 టన్నుల బొగ్గు అవసరం. గత నెలలో 24,000 టన్నులు మాత్రమే బొగ్గు అందుబాటులో ఉంది. కేంద్రాన్ని కోరాక అది ప్రస్తుతం రోజుకు 40,000 టన్నులకు చేరింది. 20 బొగ్గు ర్యాక్స్ కేటాయించాలని విజ్ఞప్తి చేశాం.. బొగ్గు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏటా అక్టోబర్ నుంచి జనవరి వరకు రాబోయే వేసవి కోసం నిల్వలు పెంచుతాయి. ఈ నేపథ్యంలో 2022 కోసం రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు 20 బొగ్గు ర్యాక్స్ కేటాయించాల్సిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేశాం. అలాగే దేశంలో విద్యుత్ ఉత్పత్తి ఒప్పందాలు, బొగ్గు సరఫరా ఒప్పందాలు లేని కారణంగా విద్యుత్ ఉత్పత్తి నిలిపేసిన కొన్ని ప్లాంట్లలో వెంటనే తాత్కాలికంగా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని అభ్యర్థించాం. విద్యుత్ సంస్థలను ఆదుకోవడానికి గత రెండేళ్లలో ప్రభుత్వం చేయగలిగినంత సహాయం చేసింది. దాదాపు రూ.34,340 కోట్ల ఆర్థిక సహాయం చేసి ఆదుకుంది. కృష్ణపట్నం విద్యుత్ ప్లాంటుకే రూ.9,165 కోట్లు చెల్లించింది. మార్చి 2019 నాటికి రూ.27,239 కోట్లు ఉన్న విద్యుత్ సంస్థల మొత్తం నష్టాన్ని మార్చి 2021 నాటికి రూ.27,552 కోట్ల వద్దనే నిలువరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ నాటికి చెల్లించాల్సిన విద్యుత్ సబ్సిడీని ప్రభుత్వం చెల్లించేసింది. బొగ్గు కొరత సంక్షోభం ప్రభావం విద్యుత్ రంగంపై తాత్కాలికమేనని భావిస్తున్నాం. అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేయడానికి విద్యుత్ పంపిణీ సంస్థలు కృషి చేస్తాయి. -
దేశవ్యాప్తంగా బొగ్గు కొరత: నాగులపల్లి శ్రీకాంత్
సాక్షి, విజయవాడ: దేశవ్యాప్తంగా బొగ్గు కొరత ఉందని ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశంలోని 135 విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత ఉందన్నారు. ఏపీ జెన్కోకు రావాల్సిన బొగ్గు ఇంకా రాలేదని తెలిపారు. 190 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్ అవసరం అవుతోందన్నారు.(చదవండి: సంక్షేమాన్ని అడ్డుకోవడానికే టీడీపీ కేసులు: మంత్రి బొత్స) కోల్ ప్లాంట్లకు బకాయిలు లేకుండా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోందన్నారు. సోలార్ విండ్ ప్లాంట్లను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. బొగ్గు ఆధారిత ప్లాంట్లకు ప్రాధాన్యత తగ్గిస్తూ వస్తున్నామన్నారు. అంతర్జాతీయంగా బొగ్గు రేట్లు పెరిగాయన్నారు. డిమాండ్ ఎక్కవ కావడం వల్లే సమస్యలు పెరుగుతున్నాయని శ్రీకాంత్ అన్నారు. చదవండి: తనయుడి కోసం డిక్షనరీ రాసిన కలెక్టర్ -
విద్యుత్ కొనుగోళ్లలో రూ.126 కోట్లు ఆదా
సాక్షి, అమరావతి: ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం గత రెండేళ్లుగా అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలు సత్ఫలితాలనిస్తున్నాయని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. 2021–22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో చేసిన విద్యుత్ కొనుగోళ్లలో డిస్కంలు రూ.126.15 కోట్లు ఆదా చేశాయన్నారు. ఈ పొదుపు ప్రయోజనాలను తిరిగి వినియోగదారుల కోసమే ఉపయోగించాలని ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు భావిస్తున్నాయని తెలిపారు. బాపూజీ జయంతి సందర్భంగా శనివారం విద్యుత్ సౌధలోని గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ ఏపీఎస్పీడీసీఎల్ 6,013 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఏపీఈఆర్సీ నిర్ణయించిన ధర కంటే 15 పైసలు తక్కువకే కొనుగోలు చేసిందన్నారు. తద్వారా రూ.89.23 కోట్లు ఆదా అయ్యిందని తెలిపారు. ఏపీíసీపీడీసీఎల్ రూ.33.25 కోట్లు, ఏపీఈపీడీసీఎల్ రూ.3.67 కోట్లు ఆదా చేశాయన్నారు. ఏపీ ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కె.వెంకటేశ్వరరావు, గ్రిడ్ ట్రాన్స్మిషన్ డైరెక్టర్ కె.ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
సర్దుబాటు చార్జీలు శాశ్వతం కాదు
సాక్షి, అమరావతి: సర్దుబాటు చార్జీలు శాశ్వత ప్రాతిపదికగా విద్యుత్ బిల్లులలో విధించరని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. ట్రూ అప్ చార్జీలనేవి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) నిర్ధేశించిన కాలానికి మాత్రమే బిల్లులలో ప్రత్యేకంగా వేస్తారని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత నిర్దేశిత సర్దుబాటు చార్జీలు ఏపీఈఆర్సీ ఉత్తర్వుల ప్రకారం 2022 మార్చి నెల వరకు మాత్రమే వసూలు చేస్తారని, ఈ ఎనిమిది నెలల తర్వాత ఉండవని శ్రీకాంత్ వెల్లడించారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే.. ► ఇంధన – విద్యుత్ సేకరణ వ్యయ సర్దుబాటు చార్జీ (త్రైమాసిక సర్దుబాటు చార్జీ) ప్రతి త్రైమాసికానికి వేర్వేరుగా మదింపు చేస్తారు. క్రిందటి త్రైమాసికంలో వేసిన చార్జీ మరుసటి త్రైమాసికానికి కలపరు. ► త్రైమాసికం–1లో అదనపు ఖర్చు రూ.100 కోట్లు అయ్యి, విద్యుత్ వినియోగం 12,000 మిలియన్ యూనిట్లు ఉంటే, సర్దుబాటు చార్జీ యూనిట్కు 8 పైసలు అవుతుంది. తర్వాతి త్రైమాసికంలో అదనపు వ్యయం రూ.200 కోట్లు ఉంటే అదే వినియోగానికి సర్దుబాటు చార్జీ యూనిట్కు 16 పైసలు అవుతుంది. ఈ లెక్కన మొదటి త్రైమాసికం చార్జీ 8 పైసలు కలుపుకుని 24 పైసలు అవ్వదు. ► విద్యుత్ సంస్థలకు మూడు నెలలకొకసారి సర్దుబాటు చేసే వెసులుబాటు 2012 వరకు (త్రైమాసిక ఇంధన సర్ చార్జీ నియమావళి) అమలులో ఉండేది. ఆ తర్వాత వార్షిక విద్యుత్ కొనుగోలు వ్యయం సర్దుబాటు నియమావళి అందుబాటులోకి వచ్చింది. ► విద్యుత్ పంపిణీ సంస్థలు 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటైల్ సరఫరా కోసం చేసిన వాస్తవ అదనపు ఖర్చులకు రూ.2,500 కోట్లు సర్దుబాటు చేసుకునేందుకు అనుమతించాల్సిందిగా గతేడాది డిసెంబర్లోనే ప్రతిపాదనలను సమర్పించారు. ఆ సంవత్సరాలకు ఇప్పుడు కొత్తగా ఎలాంటి ప్రతిపాదన పంపలేదు. ► 2019–20లో సర్దుబాటు ప్రతిపాదనలకు 2019 ఫిబ్రవరిలో, విద్యుత్ కేంద్రాల వారీగా అంచనా వేసిన ఇంధన (బొగ్గు, గ్యాస్) చార్జీలు పెరిగిపోవటమే ప్రాథమిక కారణం. ఈ వ్యయం పెరుగుదల 2019–20 ఆర్థిక సంవత్సరానికి ఏపీ జెన్కో థర్మల్ కేంద్రాలకు దాదాపు రూ.0.77/యూనిట్, కృష్ణపట్నంకు రూ 0.46/యూనిట్, కేంద్ర ప్రభుత్వ విద్యుత్ కేంద్రాలకు రూ.0.84/యూనిట్, స్వతంత్ర విద్యుత్ కేంద్రాలకు రూ .0.69/యూనిట్, గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలకు రూ. 0.56/యూనిట్ గా ఉంది. -
విద్యుత్ రంగం బలోపేతం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ రంగ సమగ్రాభివృద్ధి కోసం త్వరలో సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. ట్రాన్స్కో విజిలెన్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (జేఎండీ) కె.వెంకటేశ్వరరావు, డిస్కంల సీఎండీలు జె.పద్మజనార్దనరెడ్డి (ఏపీసీపీడీసీఎల్), హెచ్.హరనాథరావు (ఏపీఎస్పీడీసీఎల్), కె.సంతోషరావు (ఏపీఈపీడీసీఎల్), ట్రాన్స్కో డైరెక్టర్లు కె.ప్రవీణ్కుమార్, కె.ముత్తు పాండియన్, ఇతర అధికారులతో ఆదివారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ఇంధన పర్యవేక్షక మిషన్ సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి వెల్లడించిన ఈ సమావేశం వివరాలు ఇలా ఉన్నాయి. ► చౌక విద్యుత్ ఆలోచనను అమలు చేయడం, సరికొత్త రికార్డులను నెలకొల్పడం ద్వారా దేశ వ్యాప్తంగా మన విద్యుత్ రంగానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. రాష్ట్ర విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ► ఈ క్రమంలో సామర్థ్యం పెంపు, సరఫరా, పంపిణీ నెట్వర్క్ బలోపేతం చేయడం, వినియోగదారులే ఆధారంగా కార్యక్రమాలను చేపట్టడంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని ప్రభుత్వం సూచించింది. ► 2019–20లో 3 లక్షలు ఉన్న అంతరాయాలను 2020–21 నాటికి 1.77 లక్షలకు తగ్గించింది. 2019–20లో యూనిట్కు రూ.7.23గా ఉన్న సగటు సర్వీసు వ్యయాన్ని 2020–21 నాటికి రూ.7.18కి తగ్గించగలిగింది. ► విద్యుత్ సంస్థలు 2019–21 మధ్య విద్యుత్ కొనుగోళ్ల కోసం విద్యుదుత్పత్తి సంస్థలకు రూ.64,007 కోట్లు చెల్లించాయి. మార్చి 31, 2019 నాటికి విద్యుత్ సబ్సిడీ బకాయిలు రూ.13,388 కోట్లు ఉండగా ప్రభుత్వం రూ.11,442 కోట్లు ఇచ్చింది. 2019–21 సంవత్సరాల్లో విద్యుత్ సబ్సిడీ, ఇతర చార్జీల కింద మరో రూ.16,724 కోట్లు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు రూ.28,166 కోట్లు విడుదల చేసింది. ► 30 ఏళ్లపాటు పగటి పూట వ్యవసాయానికి ఉచిత విద్యుత్ను అందించేందుకు 10 వేల మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ కేంద్రాలను నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. ► విద్యుత్ సంస్థలు కార్యనిర్వహణ, ఆర్థిక సుస్థిరత సాధిస్తేనే వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ను అందించగలుగుతాం. డిస్కంల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రూ.3,669 కోట్ల ట్రూ అఫ్ చార్జీలను వసూలు చేసుకునేందుకు ఏపీఈఆర్సీ అనుమతించింది. -
విద్యుత్ పంపిణీ సంస్థలకు.. టీడీపీ ఒక్క రూపాయీ ఇవ్వలేదు
సాక్షి, అమరావతి: ట్రూ–అప్ సర్దుబాటు కోసం 2014 నుండి 2019 మధ్య ఒక్క రూపాయి కూడా విద్యుత్ పంపిణీ సంస్థలకి నాటి తెలుగుదేశం ప్రభుత్వం విడుదల చేయలేదని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. విద్యుత్ పంపిణీ సంస్థలు ఒక్క ఏడాదిలోనే రూ.6,000 కోట్లు అదనంగా వసూలుచేస్తున్నాయని వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ.. అవి పూర్తిగా అవాస్తవమన్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుండి విద్యుత్ వాడకపోయినా కట్టవలసి వచ్చే నెలవారీ కనీస చార్జీలు రద్దుచేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అలాగే, 2014 నుండి 2019 వరకూ ట్రూ–అప్ నివేదికలు దాఖలు చేయవద్దని అప్పటి టీడీపీ ప్రభుత్వం విధాన నిర్ణయమేదీ తీసుకోలేదని, అంతేకాక.. ఇందుకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు కూడా జారీచేయలేదని శ్రీకాంత్ వెల్లడించారు. ఇక ప్రభుత్వ విద్యుత్ పంపిణీ సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని, అందువల్లే ఈ సర్దుబాటు చార్జీలు వసూలుచేయడానికి అనుమతించాలని కమిషన్ నిర్ణయించిందని విద్యుత్ నియంత్రణ మండలి తన ఉత్తర్వుల్లో పేర్కొంది. 2019 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) రూ.12,539 కోట్లు నష్టంలోనూ, ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ రూ.7,745 కోట్ల నష్టంలోనూ ఉన్నాయని తెలిపింది. మరోవైపు.. 2014లో రాష్ట్ర విభజన జరిగిన నాటికి రూ.12,500 కోట్లు వున్న కొనుగోలు బకాయిలు, నిర్వహణ వ్యయ రుణాలు 2019 ఏప్రిల్ 1 నాటికి రూ.32,000 కోట్లకు చేరుకున్నాయి. -
‘సర్దుబాటు’ పాపం గత సర్కారుదే
సాక్షి, అమరావతి: గత సర్కారు హయాంలో విద్యుత్ పంపిణీ సంస్థల బాగోగులను పట్టించుకోకపోవడం వల్ల వాటిపై అదనపు ఖర్చుల భారం భారీగా పెరిగింది. ఐదేళ్లలో విద్యుత్ రంగం అప్పులు రెట్టింపై రూ.31,648 కోట్ల నుంచి రూ.62,463 కోట్లకి ఎగబాకాయి. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో పొదుపు చర్యలు, విద్యుత్తు కొనుగోళ్లలో ఆదా ద్వారా ఖర్చులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అయితే గత సర్కారు నిర్వాకాల కారణంగా జరిగిన అప్పుల నుంచి బయటపడేందుకు ‘సర్దుబాటు’ చేసుకోక తప్పని పరిస్థితి డిస్కంలకు ఏర్పడింది. కానీ అవి నివేదించిన వ్యయంలో దాదాపు సగానికి మాత్రమే అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆమోదం తెలిపింది. ప్రజలపై పెనుభారం పడరాదని.. 2014 ఏప్రిల్ 1 నుంచి 2019 మార్చి 31 మధ్య కాలానికి విద్యుత్ పంపిణీ వ్యవస్థ నిర్వహణ, ఆదాయ అవసరాలను వాస్తవ ఖర్చుల ఆధారంగా సర్దుబాటు చేయాల్సి ఉన్నా గత ప్రభుత్వం చేయలేదు. దీంతో రూ.7,224 కోట్లను అదనపు వ్యయంగా నిర్ధారించాలని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్), ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్)లు ఏపీఈఆర్సీని కోరాయి. నిజానికి ఇదేమీ వాటి వాస్తవ ఖర్చు కాదు. రెండు డిస్కంల వాస్తవ ఖర్చు రూ.25,952 కోట్లుగా ఉన్నప్పటికీ అవి రూ.7,224 కోట్లు మాత్రమే అడిగాయి. అయితే అంత మొత్తాన్ని అనుమతిస్తే ప్రజలపై ఒకేసారి భారం పడుతుందనే ఉద్దేశంతో ఏపీఈఆర్సీ అందులో సగం మొత్తాన్ని తిరస్కరించింది. పీఆర్సీ, వడ్డీలు, ఇతర ఖర్చులు.. డిస్కంల వినతిపై కొద్ది నెలలుగా ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. ఆడిట్ పద్దుల ఆధారంగా డిస్కంలు కోరిన దానిలో దాదాపు సగం అంటే రూ.3,669 కోట్లు వసూలుకు మాత్రమే ఉత్తర్వులు ఇచ్చింది. నిజానికి ఈ మొత్తంలో రూ.3,100 కోట్లు పే రివిజన్ కమిషన్(పీఆర్సీ) వల్ల అదనపు ఖర్చులు కాగా వడ్డీలు, ఇతర ఖర్చులు కలిపి మరో రూ.569 కోట్లు ఉన్నాయి. ఈ మొత్తం అదనపు వ్యయాన్ని సెప్టెంబర్ విద్యుత్ బిల్లు నుంచి ప్రారంభించి ఎనిమిది నెలల పాటు ఏపీఈపీడీసీఎల్లో యూనిట్కు 45 పైసలు, ఏపీఎస్పీడీసీఎల్లో యూనిట్కు రూ.1.27 చొప్పున ట్రూఅప్ పేరిట సర్దుబాటు చేయనున్నారు. 2019 ఏప్రిల్ 1 తరువాత కనెక్షన్ తీసుకున్న వినియోగదారులకు ట్రూ అప్ వర్తించదు ఐదేళ్లలో సర్దుబాటు చేయకపోవడంతో... ‘సర్దుబాటు వ్యయం అనేది ఏటా జరగాలి. ఎప్పటికప్పుడు జరిగితే ప్రజలపై పడే భారం చాలా తక్కువ. కానీ 2014 నుంచి 2019 వరకూ అలా జరగకపోవడంతో డిస్కంల అప్పులు భారీగా పెరిగిపోయాయి. ఇప్పటికైనా సర్దుబాటు చేయకపోతే వాటి మనుగడ కష్టమవుతుంది. ఇందులో వ్యవసాయ ఉచిత విద్యుత్ వినియోగదారులపై ఎటువంటి భారం పడకుండా రూ.913 కోట్ల అదనపు సర్దుబాటు వ్యయాన్ని అప్పటి సబ్సిడీ విధానాల ప్రకారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది’ – నాగులపల్లి శ్రీకాంత్, ఇంధనశాఖ కార్యదర్శి అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా ► 2014 నుంచి 2019 వరకూ విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలు రూ.4,110 కోట్ల నుంచి రూ.27,240 కోట్లకు చేరాయి. ప్రస్తుతం రూ.27,551 కోట్లుగా ఉన్నాయి. అంటే రెండున్నరేళ్లలో కేవలం రూ.311 కోట్లు మాత్రమే పెరిగాయి. ► 2014 నుంచి 2019 వరకూ విద్యుత్ పంపిణీ సంస్థల వార్షిక సరఫరా ఖర్చు రూ.24,211 కోట్ల నుంచి రూ.46,404 కోట్లకు చేరుకుంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇది తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రూ.39,324 కోట్లుగా ఉంది. ► 2014 నుంచి 2019 వరకూ విద్యుత్ రంగం అప్పులు రూ.31,648 కోట్ల నుంచి రెట్టింపై రూ.62,463 కోట్లకి పెరిగాయి. -
ఇంధన ఆదా రూ. 2,350 కోట్లు!
సాక్షి, అమరావతి: ఇంధనాన్ని సమర్థవంతంగా వినియోగించడం, పొదుపు చేయడంలో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన పనితీరును ప్రదర్శించింది. పారిశ్రామిక రంగంలో అమలు చేస్తున్న పాట్ (పెర్ఫార్మ్, అచీవ్, ట్రేడ్) పథకంలో భాగంగా సైకిల్–2లో 3,430 మిలియన్ యూనిట్ల విద్యుత్కు సమానమైన (0.295 మిలియన్ టన్స్ ఆఫ్ ఆయిల్ ఈక్వలెంట్ – ఏంటీవోఈ) ఇంధనాన్ని ఆదా చేసింది. దీని విలువ సుమారు రూ.2,350 కోట్లు ఉంటుంది. 1.38 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదలను తగ్గించగలిగింది. కేంద్ర విద్యుత్ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) ఈ వివరాలను అధికారికంగా ప్రకటించింది. పాట్ మొదటి దశతో పోల్చితే మన రాష్ట్రం పాట్ సైకిల్–2లో 40 శాతం ఎక్కువ ఇంధనాన్ని ఆదా చేసినట్లు బీఈఈ తెలిపింది. మొదటి దశలో ఏపీ 0.205 ఎంటీవోఈ ఇంధనాన్ని పొదుపు చేసింది. పారిశ్రామిక ఇంధన వినియోగంలో ఆధునిక విధానాలను అవలంబించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఈ ఘనత సాధించిందని బీఈఈ ప్రశంసించింది. ఈ మేరకు నిర్వహించిన వెబినార్లో ఇంధన పొదుపు సర్టిఫికెట్లను కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి అలోక్కుమార్ విడుదల చేసినట్లు రాష్ట్ర ఇంధన పర్యవేక్షణ మిషన్ సీఈవో ఎ.చంద్రశేఖర్రెడ్డి సోమవారం తెలిపారు. ఇంధన సామర్థ్య సాంకేతికతను అభివృద్ధి చేసి విస్తృతంగా వినియోగంలోకి తెస్తే భారీ పరిశ్రమలే కాకుండా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కూడా ప్రయోజనం పొందుతాయని వెబినార్లో అలోక్కుమార్ అన్నారు. బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే మాట్లాడుతూ.. పాట్ అమలుకు రాష్ట్రాలకు సహకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్ర పరిశ్రమల శాఖతో కలిసి ప్రత్యేక పాట్ సెల్ ద్వారా పథకాన్ని పకడ్బందీగా అమలు చేసిన ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ను ఈ సందర్భంగా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంధన సామర్థ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని శ్రీకాంత్ వివరించారు. దీనివల్ల రాష్ట్రంలో ప్రతి కుటుంబం ప్రయోజనం పొందుతోందన్నారు. దేశవ్యాప్తంగా 542 పరిశ్రమల ఎంపిక దేశవ్యాప్తంగా పరిశ్రమల రంగంలో 11 సెక్టార్లకు సంబంధించిన 542 పరిశ్రమలను పాట్ సైకిల్–2లో ఎంపిక చేశారు. వాటిలో 349 పరిశ్రమలు ఇంధన పొదుపు లక్ష్యాలను సాధించాయి. వీటికి 57.38 లక్షల ఎనర్జీ సేవింగ్ సర్టిఫికెట్లను అందజేశారు. లక్ష్యాలు చేరుకోని 193 పరిశ్రమలు 36.67 లక్షల సర్టిఫికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంది. దేశవ్యాప్తంగా పాట్ సైకిల్–1లో 8.8 ఏంటీవోఈ ఇంధనం ఆదా చేయగా.. పాట్ సైకిల్–2లో 14.08 ఏంటీవోఈ ఆదా అయ్యింది.ఆయా పరిశ్రమలు పవర్ ఎక్సే్ఛంజీల్లో సర్టిఫికెట్లను విక్రయించడం ద్వారా లాభాలు ఆర్జించవచ్చు. పాట్ సైకిల్–2 ట్రేడింగ్ సెప్టెంబర్ చివరి నాటికి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. -
నగదు బదిలీతో.. హక్కుగా నాణ్యమైన ఉచిత విద్యుత్తు
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణల్లో భాగంగా అమలు చేస్తున్న వ్యవసాయ ఉచిత విద్యుత్తుకు నగదు బదిలీ పథకానికి రైతుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. వైఎస్సార్ ఉచిత విద్యుత్తు పథకానికి నగదు బదిలీ అమలు పురోగతిపై ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఆదివారం విద్యుత్తు శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి వివరాలు తెలియచేశారు. నగదు బదిలీ పథకం కింద రైతులపై ఒక్క పైసా కూడా భారం పడకుండా విద్యుత్తు బిల్లుల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించి వారి ఖాతాలకు జమ చేయనుంది. ప్రభుత్వం ఇచ్చిన మొత్తాన్ని రైతులే నేరుగా విద్యుత్తు సంస్థలకు బిల్లుల రూపంలో ల్లించనున్నారు. రైతులే బిల్లులు చెల్లించి విద్యుత్తు తీసుకుంటారు కాబట్టి నాణ్యమైన కరెంట్ సరఫరాను తమ హక్కుగా ప్రశ్నించే వీలుంది. మరోవైపు తమకు బిల్లులు చెల్లిస్తున్న అన్నదాతల పట్ల విద్యుత్తు పంపిణీ సంస్థలు మరింత బాధ్యతాయుతంగా జవాబుదారీతనంతో వ్యవహరిస్తాయి. వ్యవసాయ విద్యుత్తు మోటార్లకు మీటర్లను బిగించడం వల్ల లోడ్ ఎంతనేది ముందే స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం లాంటి సమస్యలు ఉత్పన్నం కావు. తగినంత విద్యుత్తు సరఫరా జరుగుతుంది కాబట్టి మోటార్లు కాలిపోవు. లో వోల్జేజీ సమస్య అనేది ఎక్కడా ఉండదు. తద్వారా రైతులకు నాణ్యమైన విద్యుత్తు అందుతుంది. పైసా కూడా భారం పడకుండా.. రైతన్నల అనుమతితోనే నగదు బదిలీ పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలన్న లక్ష్యం నెరవేరుతోంది. పథకం అమలుకు అంగీకరిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 92 శాతం మంది రైతులు విద్యుత్ సంస్థలతో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. వ్యవసాయ విద్యుత్ ధరను యూనిట్ సరాసరి రూ.5.73గా ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయించినప్పటికీ రైతులపై ఒక్క పైసా భారం పడకుండా ఆ వ్యయాన్నంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. రైతుల ఖాతాలకు నేరుగా నగదును బదిలీ చేస్తుంది. పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో అమలు చేస్తున్న ఈ పథకానికి 98.6 శాతం మంది రైతులు అంగీకారం తెలిపారు. సామర్థ్యం పెంపు... లో ఓల్టేజీ పరిష్కారం మీటర్ల ఏర్పాటు వల్ల విద్యుత్ లోడు ఎక్కడ ఎక్కువ ఉంది? ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్ల సామర్ధ్యం ఎక్కడ, ఎంత పెంచాలి? అనే అంశాలను డిస్కమ్లు కచ్చితంగా తెలుసుకునే వీలుంది. లో ఓల్టేజి సమస్యలను గుర్తించి పరిష్కరించవచ్చు. ఇబ్బందులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమైన వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ పగటి పూటే 9 గంటల పాటు సరఫరా చేసే అవకాశం కలుగుతుంది. వ్యవసాయ ఉత్పాదకత పెరిగి ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరుతుంది. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో వ్యవసాయ లోడ్ను కచ్చితంగా లెక్కించవచ్చు. ఇప్పటివరకూ ఈ విధానం లేదు. మరో 30 ఏళ్ల పాటు ఇబ్బంది లేకుండా.. నాణ్యమైన కరెంట్ కోసం విద్యుత్ సంస్థలను ప్రశ్నించే హక్కు రైతులకు కల్పిస్తున్న ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని ఇంధన శాఖ కార్యదర్శికి మంత్రి బాలినేని సూచించారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, ఉత్పాదకతను పెంచడం, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ, రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఉచిత విద్యుత్కు నగదు బదిలీ పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు పథకం అమలులో రాష్ట్ర్రంలోని ఏ ఒక్క రైతుకూ ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. ఉచిత విద్యుత్కు ఎంత ఖర్చైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాబోయే 30 ఏళ్ల పాటు రైతులంతా నాణ్యమైన ఉచిత విద్యుత్తును నిరాటంకంగా పొందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. -
విపత్తుల్లోనూ 'పవర్'ఫుల్
సాక్షి, అమరావతి: ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా ఏపీ విద్యుత్ సంస్థలు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నాయి. భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్)తో విద్యుత్ శాఖ సమగ్ర సమాచారాన్ని క్రోడీకరించడం ద్వారా దక్షిణాది పవర్ గ్రిడ్కు అనుసంధానం చేసే దిశగా అడుగులు పడతున్నాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని కేంద్ర పవర్ గ్రిడ్ పర్యవేక్షిస్తోంది. దీనిపై ఇటీవల కేంద్రంతో రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లితో కలిసి రాష్ట్ర అధికారులు చర్చించారు. ఈ వివరాలను రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్రెడ్డి ఆదివారం మీడియాకు వివరించారు. రియల్ టైమ్ పద్ధతిలో పర్యవేక్షించేలా.. రాష్ట్రంలో వేలాది కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లు విస్తరించి ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా సబ్ స్టేషన్లతో విద్యుత్ నెట్వర్క్ ఉంది. ఇది ఇతర రాష్ట్రాలకు అనుసంధానమై ఉంటుంది. అవసరమైనప్పుడు మనం విద్యుత్ ఇవ్వడం, తీసుకోవడానికి ఈ లైన్లు ఉపయోగపడతాయి. అయితే, అటవీ ప్రాంతాలు, జలాశయాలు, కొండల్లో విద్యుత్ నెట్వర్క్ విస్తరించి ఉంది. ఈ సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపరుస్తారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎక్కడ ఏ లైన్కు ఇబ్బంది ఉంది? ఆ ప్రాంతంలో ఎన్ని సర్వీసులకు సమస్య రావచ్చు? ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్ అందించడం ఎలా? వరదలొస్తే ఏ సబ్ స్టేషన్లకు ముప్పు ఉంటుంది? ఇలా అనేక రకాల సమాచారాన్ని భౌగోళిక సమాచార వ్యవస్థ ద్వారా అందిస్తారు. అవసరమైనప్పుడు కేవలం మౌస్ క్లిక్ ద్వారా క్షేత్రస్థాయి సమాచారం తేలికగా తెలుసుకునే వీలుంది. ఓవర్ లోడింగ్ సహా అన్ని అంశాలను రియల్ టైం పద్ధతిలో పర్యవేక్షించేందుకు పవర్ గ్రిడ్లకు ఇది తోడ్పడుతుంది. ఈ నేపథ్యంలో విద్యుత్ నెట్వర్క్ను మ్యాపింగ్ చేసే కార్యక్రమానికి ట్రాన్స్కో శ్రీకారం చుట్టింది. సదరన్ గ్రిడ్లో అమలు చేసేలా.. ఈ విధానానికి సంబంధించిన సమగ్ర వివరాలను అందించాలని బెంగళూరులోని సదరన్ రీజినల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఆర్ఎల్డీసీ), కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ సిస్టం ఆపరేషన్స్ కార్పొరేషన్ (పీవోఎస్వోసీవో)లు ఏపీ ట్రాన్స్కోను కోరాయి. దీన్ని మరో ఐదు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కలిపే సదరన్ గ్రిడ్లో అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. గత ఏడాది ఫిబ్రవరిలోనే ఏపీ ట్రాన్స్కో ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. సబ్ స్టేషన్ల జియో ట్యాగింగ్, సరఫరా లైన్లు, డిస్ట్రిబ్యూషన్ లైన్ల భౌతిక పరిస్థితి, ఏపీ ట్రాన్స్కో, డిస్కంలకు సంబంధించిన సరఫరా, పంపిణీ నెట్వర్క్ వెరసి ఏపీ గ్రిడ్ మొత్తాన్ని రియల్ టైం పద్ధతిలో పర్యవేక్షించవచ్చు. ఏపీ నెట్వర్క్ మొత్తాన్ని సదరన్ గ్రిడ్ మ్యాపింగ్ చేస్తుంది. దీనివల్ల రియల్ టైం పద్ధతిలో లైన్ల ఓవర్ లోడింగ్, అండర్ లోడింగ్తో పాటు వాతావరణం, లోడ్ షెడ్యూలింగ్ను ముందుగానే అంచనా వేయడం, ప్రకృతి విపత్తుల సమయంలో బాధిత ప్రాంతాలను పరిశీలించడం, రియల్ టైం పద్ధతిలో లైన్లను తనిఖీ చేయడం వంటి అనేక ఉపయోగాలు ఉంటాయి. -
అసత్య కథనాలతో దుష్ప్రచారం: ఆదా.. కానరాదా?
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోళ్లపై కొన్ని పత్రికలు వాస్తవాలను వక్రీకరిస్తూ అసత్య కథనాలు ప్రచురించడాన్ని ఇంధనశాఖ తీవ్రంగా తప్పుబట్టింది. పీపీఏలున్న విద్యుత్ సంస్థలు కరెంట్ సరఫరాలో కోత పెట్టినప్పటికీ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేసి నెల రోజుల్లో రూ.22.7 కోట్లు లాభం చేకూర్చామని స్పష్టం చేసింది. వాస్తవాలు ఇలా ఉండగా డిస్కమ్లకు రూ.48 కోట్లు నష్టం వాటిల్లిందంటూ వాస్తవ విరుద్ధ కథనాలు ప్రచురించారని ఇంధనశాఖ పేర్కొంది. విద్యుత్ కొనుగోళ్లను కట్టడి చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉందని, దీన్ని నీతి అయోగ్ కూడా ప్రశంసించిందని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి గుర్తు చేశారు. ఏపీఈఆర్సీ నిరంతర పర్యవేక్షణ.. నిజానికి విద్యుత్ కొనుగోళ్లపై గత రెండేళ్లుగా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మరీ ముఖ్యంగా చౌక విద్యుత్నే సాధ్యమైనంత వరకూ కొనుగోలు చేస్తోంది. దీనికోసం ప్రత్యేక యంత్రాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) నిరంతరం పర్యవేక్షిస్తోంది. గతేడాది డిసెంబర్ 17 నుంచి జనవరి 15వ తేదీ వరకూ జరిగిన విద్యుత్ కొనుగోళ్ల వివరాలను ఇటీవల ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి విశ్లేషించింది. బొగ్గు కొరత, కోవిడ్, ఇతర కారణాలు.. ఈ నెల రోజుల వ్యవధిలో ఏపీ విద్యుత్ సంస్థలు 894.1 మిలియన్ యూనిట్ల విద్యుత్ను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేశాయి. రాష్ట్ర డిస్కమ్లు కొన్ని చౌకగా విద్యుత్ అందించే ఉత్పత్తి కేంద్రాలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కలిగి ఉన్నాయి. ఈ ప్రకారం వీటి ద్వారా డిసెంబర్ 17 నుంచి జనవరి 15 వరకూ 3,289.3 మిలియన్ యూనిట్ల విద్యుత్ యూనిట్ రూ.3.13 చొప్పున డిస్కమ్లకు అందాలి. అయితే ఆయా కేంద్రాల్లో బొగ్గు కొరత, కోవిడ్ ప్రభావం, ఇతర కారణాల వల్ల ముందు రోజు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 2,470.79 మిలియన్ యూనిట్లే విద్యుత్ ఇస్తామని ఉత్పత్తి సంస్థలు తెలిపాయి. కానీ వాస్తవంగా విద్యుత్ అందించే రోజుకు రీ షెడ్యూల్ చేసుకుని చివరకు 2,253.27 ఎంయూలే ఇచ్చాయి. 818.5 ఎంయూల విద్యుత్ను అందించలేకపోయాయి. లేని విద్యుత్ ఎలా కొంటారు? పీపీఏల ప్రకారం 818.5 ఎంయూల కొరత ఏర్పడటంతో పీపీఏలున్న ఇతర ఉత్పత్తిదారుల నుంచి అదనంగా విద్యుత్ తీసుకోవాలి. అయితే వాటి దగ్గర ఆ సమయంలో విద్యుత్ ధర యూనిట్ రూ. 3.68 ఉంది. కానీ మార్కెట్లో విద్యుత్ ధర యూనిట్ రూ. 3.38 చొప్పున మాత్రమే ఉంది. అంటే ప్రతీ యూనిట్కు సంస్థ 30 పైసల చొప్పున, మొత్తం రూ. 24.6 కోట్లు ఆదా చేసింది. ఇందులో గ్రిడ్ బ్యాలన్స్ కోసం రూ.1.9 కోట్లు తీసివేసినా... రూ.22.7 కోట్లు ఈ నెలలోనే విద్యుత్ కొనుగోళ్లలో ఆదా అయింది. కానీ ఒక వర్గం మీడియా మాత్రం పీపీఏ సంస్థల నుంచే ఈ విద్యుత్ కొంటే నష్టం రాదని అసత్యాలు ప్రచారం చేసింది. అసలు వాళ్ల దగ్గర విద్యుత్ లేనప్పుడు ఎలా కొనుగోలు చేస్తామని విద్యుత్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. దేశానికి ఆదర్శంగా ఏపీ.. – శ్రీకాంత్ నాగులాపల్లి (ఇంధనశాఖ కార్యదర్శి) ఒప్పందం చేసుకున్న సంస్థలు విద్యుత్ ఇవ్వకపోతే మార్కెట్లో విద్యుత్ కొనక తప్పదు. లేకపోతే రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఏర్పడతాయి. కొనే విద్యుత్ను పీపీఏ సంస్థల నుంచే తీసుకోవాలనే వాదన సత్యదూరం. అసలు తమ దగ్గర విద్యుత్ లేదని వారే ప్రకటించినప్పుడు ఇక తక్కువ ధరకు వాళ్లు ఎలా ఇస్తారు? విద్యుత్ కొనగోళ్లను దారికి తేవడంలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచింది. నష్టమని మేం చెప్పలేదే? – జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి, ఏపీఈఆర్సీ ఛైర్మన్ విద్యుత్ కొనుగోళ్లు మరింత పారదర్శంగా ఉండాలని కమిషన్ కోరుకుంటోంది. ఇందులో భాగంగానే వాస్తవాలు తెలుసుకునేందుకు డిస్కమ్ల నుంచి వివరణ కోరాం. అంతేతప్ప మార్కెట్ నుంచి విద్యుత్ కొనడం వల్ల డిస్కమ్లకు నష్టం వచ్చిందని మేం ఎక్కడా చెప్పలేదు. డిస్కమ్లు పంపే వివరాలను కమిషన్ పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవడం ఆనవాయితీగా జరిగే వ్యవహారం. -
విత్తుకు ముందే.. విద్యుత్ సిద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా నూటికి నూరు శాతం ఫీడర్ల పరిధిలో ఈ ఖరీఫ్ నుంచి వ్యవసాయ అవసరాలకు పగటిపూటే 9 గంటలు ఉచిత విద్యుత్ అందించేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీజన్ ప్రారంభం కాకముందే విద్యుత్ శాఖ ఈ మేరకు ఏర్పాట్లు చేసింది. నమ్మకమైన, నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా కోసం పక్కా ప్రణాళిక రూపొందించినట్లు ఇంధనశాఖ ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సేకరించిన వివరాల ప్రకారం 2021–22లో 12,232 మిలియన్ యూనిట్ల మేర వ్యవసాయ విద్యుత్ డిమాండ్ ఉండవచ్చని అంచనా వేశారు. సాంకేతిక సమస్యలు తలెత్తినా సరఫరాకు ఆటంకం కలగకుండా మిగులు విద్యుత్నూ సిద్ధం చేశారు. సెప్టెంబర్, అక్టోబర్లో పునరుత్పాదక ఇంధన వనరుల లభ్యత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ మార్కెట్లో కొనుగోలు చేసి రైతన్నలకు ఇచ్చిన మాట ప్రకారం కరెంట్ ఇవ్వాలని నిర్ణయించారు. వంద శాతం ఫీడర్లు రెడీ రాష్ట్రంలో 6,616 వ్యవసాయ ఫీడర్లు ఉండగా పగటి పూటే 9 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వాలని 2019లో భావించినప్పుడు 58 శాతం ఫీడర్లకు అందుకు తగ్గ సామర్థ్యం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పటికప్పుడు రూ.1,700 కోట్లు మంజూరు చేయడంతో విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగుపరిచారు. కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. లైన్లు, సబ్ స్టేషన్ల శక్తి పెంచారు. 515 ఫీడర్ల స్థాయిని సమూలంగా మార్చారు. ఫలితంగా వంద శాతం ఫీడర్ల పరిధిలో రైతులు వినియోగించే ఉచిత విద్యుత్ సామర్థ్యాన్ని తట్టుకునే వ్యవస్థ అందుబాటులోకొచ్చింది. ప్రతి రైతుకు రూ.35 వేలపైనే ఉచితం కొన్నేళ్లుగా అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా కృత్రిమ మేధోశక్తి (ఏఐ) ద్వారా 2021–22లో వ్యవసాయ విద్యుత్ వాడకం ఏ సీజన్లో ఎంత ఉంటుందనేది శాస్త్రీయంగా అంచనా వేశారు. ప్రతి హెచ్పీకి వార్షిక విద్యుత్ వినియోగం 1,059 యూనిట్లు ఉంటుందని అంచనా. అంటే ఒక రైతు తన వ్యవసాయ క్షేత్రంలో 5 హెచ్పీ మోటార్ అమర్చుకుంటే ఏడాదికి 5,295 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. యూనిట్ ధర రూ.6.65 చొప్పున ఐదు హెచ్పీ మోటార్ ఉన్న ప్రతీ రైతు కోసం ఉచిత విద్యుత్ కింద ప్రభుత్వం కనిష్టంగా రూ. 35,212 దాకా చెల్లిస్తోంది. కొంతమంది రైతులు గరిష్టంగా 10 హెచ్పీపైనే వాడుతున్నారు. వారికి రెట్టింపు మొత్తం ప్రభుత్వం చెల్లిస్తోంది. ఏటా రూ.8 వేల కోట్లకుపైనే సబ్సిడీ.. రాష్ట్రంలో ప్రస్తుతం 17.55 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉండగా వీటి మొత్తం సామర్థ్యం 116 లక్షల హెచ్పీ ఉంటుంది. ఇవి ఏటా దాదాపు 12,232 మిలియన్ యూనిట్లకుపైగా విద్యుత్ వినియోగిస్తున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.8 వేల కోట్లకు పైగా సబ్సిడీగా రైతుల ఉచిత విద్యుత్ కోసం వెచ్చిస్తోంది. సీజన్ల వారీగా విద్యుత్ వాడకం ఇలా ఖరీఫ్ (జూన్ నుంచి అక్టోబర్).. 4,744.44 మిలియన్ యూనిట్ల (39 శాతం) వ్యవసాయ విద్యుత్ వినియోగం ఉంటుంది. ఈ సీజన్లో రైతులు సగటున 2.20 గంటల పాటు మోటార్ ఆన్ చేస్తున్నారు. రబీ (నవంబర్ నుంచి మార్చి).. 6,192 మిలియన్ యూనిట్ల (51 శాతం) విద్యుత్ వినియోగం ఉంటోంది. రైతులు సగటున రోజుకు 4.30 గంటల పాటు పంపుసెట్ వినియోగిస్తున్నారు. అన్ సీజన్ (ఏప్రిల్ నుంచి మే).. 1,296 మిలియన్ యూనిట్ల (11 శాతం) వ్యవసాయ విద్యుత్ వినియోగం ఉన్నట్టు లెక్క తేలింది. ఈ సీజన్లో రైతులు సగటున 1.80 గంటల పాటు మోటార్ ఆన్ చేస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం విద్యుత్ లభ్యతపై అధికారులు దృష్టి పెట్టారు. ఒక్క పంప్సెట్కూ ఇబ్బంది లేకుండా... ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్కు అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. నాణ్యమైన సరఫరా కోసం పంపిణీ సంస్థలను నిలదీసే అధికారం కల్పించేలా వ్యవసాయ విద్యుత్ సబ్సిడీని రైతుల ఖాతాల్లోనే వేస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏడాది పొడవునా ఏ ఒక్క రోజూ ఏ ఒక్క పంపుసెట్కూ విద్యుత్ సరఫరాలో ఇబ్బంది లేకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించాం. అన్ని స్థాయిల్లో విద్యుత్ సిబ్బందిని అప్రమత్తం చేశాం. ఈ ఏడాది మరింత మెరుగ్గా రైతులకు ఉచిత విద్యుత్ అందబోతోంది. – శ్రీకాంత్ నాగులాపల్లి, ఇంధనశాఖ కార్యదర్శి -
Andhra Pradesh: రూ. 2,342.45 కోట్లు ఆదా
సాక్షి, అమరావతి: గత సర్కారు హయాంలో అప్పుల పాలై దివాలా దశకు చేరిన విద్యుత్ సంస్థలు ఇప్పుడు పొదుపు చర్యలు పాటించడం ద్వారా ప్రజాధనాన్ని కాపాడుతున్నాయి. విద్యుత్ కొనుగోళ్లలో గత రెండేళ్లలో ఏకంగా రూ.2,342.45 కోట్లు ఆదా చేసి దేశంలోనే రికార్డు సృష్టించాయి. ఆంధ్రప్రదేశ్ను ఆదర్శంగా తీసుకోవాలని కేంద్రం సైతం ప్రశంసించింది. పూర్తి పారదర్శకంగా, చౌక విద్యుత్ కొనుగోళ్లకే ప్రాధాన్యం ఇవ్వడం వల్లే దీన్ని సాధించినట్లు ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి వెల్లడించారు. సరికొత్త మైలురాయిని చేరుకోవడంపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్రెడ్డి ఆదివారం ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. యూనిట్ రూ.3.12కే కొనుగోలు ఇంధనశాఖలో విద్యుత్ కొనుగోళ్లు అత్యంత కీలకం. పైసా తేడా వచ్చినా భారం రూ.కోట్లల్లో ఉంటుంది. గత సర్కారు దీన్ని గుర్తించకపోవడం వల్లే డిస్కమ్లు నష్టాల బాట పట్టాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) మొట్టికాయలేసింది. ఈ తరహా పొరపాట్లు జరగకూడదన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. గత రెండేళ్లుగా చౌక విద్యుత్ కొనుగోళ్లపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. దీని ద్వారా రూ.2,342.45 కోట్లు ఆదా అయింది. 2019–20లో 3,393 మిలియన్ యూనిట్లు, 2020–21లో 8,890 మిలియన్ యూనిట్ల విద్యుత్తును బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేశారు. సరఫరా చార్జీలు కలిపి సగటున యూనిట్ రూ.3.12 చొప్పున వెచ్చించారు. నిజానికి ఈ విద్యుత్ కొనడానికి యూనిట్కు రూ.4.55 వరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతించినా అంతకన్నా తక్కువకే విద్యుత్ సంస్థలు కొనుగోలు చేయడం గమనార్హం. మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీతో.. చౌక విద్యుత్ కొనుగోలుకు ఏపీ ట్రాన్స్కో, గ్రిడ్ నిర్వహణ విభాగం దేశంలోనే తొలిసారిగా మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) టెక్నాలజీని అందిపుచ్చుకుంది. గతంలో 24 గంటల ముందు కొనాల్సిన విద్యుత్కు ఆర్డర్లు ఇచ్చారు. సరికొత్త టెక్నాలజీ వల్ల కేవలం 15 నిమిషాల్లోనే డిమాండ్ను పసిగట్టి అవసరమైన మేరకు ఆర్డర్ ఇవ్వగలిగారు. మరోవైపు కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వ్యవస్థను ట్రాన్స్కో ఏర్పాటు చేసింది. గత కొన్నేళ్లుగా విద్యుత్ డిమాండ్, లభ్యతను సాఫ్ట్వేర్కు అనుసంధానించి వాస్తవ డిమాండ్, లభ్యతను అంచనా వేశారు. దీనివల్ల విద్యుత్ వృథాను అరికట్టడంతోపాటు ఎక్కువ ధరకు కొనుగోళ్లను నియంత్రించగలిగారు. ఖరీదైన విద్యుత్కు కత్తెర.. 625 మెగావాట్ల ఖరీదైన విద్యుత్ను నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) ద్వారా తీసుకుంటుండగా దీన్ని కేంద్రానికి అప్పగించారు. ఫలితంగా డిస్కమ్లపై రూ. 1,007 కోట్ల భారం తగ్గింది. గతంలో కేంద్ర విద్యుత్తు గ్రిడ్ మూడు నెలలకు ఒకసారి ఏపీ డిస్కంల నుంచి సీటీయూ (సెంట్రల్ ట్రాన్స్మిషన్ యుటిలిటీ), పీవోసీ (పాయింట్ ఆఫ్ కనెక్షన్) చార్జీలు వసూలు చేసేది. రాష్ట్ర ఇంధన శాఖ ఒత్తిడి మేరకు కేంద్రం మార్పులు చేసింది. ఫలితంగా రాష్ట్ర విద్యుత్ సంస్థలకు రూ.350 కోట్లు ఆదా అయింది. ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ – కేంద్ర విద్యుత్తు శాఖ కార్యదర్శి అలోక్ కుమార్ ‘విద్యుత్తు కొనుగోళ్లలో భారీ మొత్తంలో ప్రజల సొమ్మును ఆదా చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కోవిడ్ సంక్షోభంలోనూ రాష్ట్ర ప్రభుత్వ చర్యలు అభినందనీయం. ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలిచింది’ విద్యుత్ శాఖ బలోపేతమే లక్ష్యం – బాలినేని శ్రీనివాసరెడ్డి, విద్యుత్తు శాఖ మంత్రి ‘ఆంధప్రదేశ్ సాధించిన విజయం ప్రశంసనీయం. విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఈ దిశగా ముందుకెళ్లాలి’ -
ప్రాణ వాయువుకు ఫుల్‘పవర్’
సాక్షి, అమరావతి: కరోనా రోగులకు ప్రాణ వాయువు అందించే ఆక్సిజన్ తయారీ యూనిట్లకు నిరంతర విద్యుత్ ఇచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ స్పష్టం చేసింది. ఇందుకోసం తమ సిబ్బంది రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. ఆస్పత్రులు, ఆక్సిజన్ ప్లాంట్లు, ఇళ్లకు, మంచినీటి సరఫరా పథకాలకు విద్యుత్ సరఫరాపై ఆయన శుక్రవారం క్షేత్రస్థాయి అధికారులతో సమీక్ష జరిపారు. ఆ వివరాలను ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్రెడ్డి మీడియాకు వివరించారు. ఒక్కో ఆక్సిజన్ కేంద్రానికి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ను నోడల్ అధికారిగా నియమించారు. రాష్ట్రంలోని మూడు విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలో 22 ఆక్సిజన్ ప్లాంట్లు ఉన్నాయి. వాటికి 2,49,196 కేవీఏ(కిలో వోల్ట్ ఎంపియర్) మేర విద్యుత్ డిమాండ్ ఉంది. విద్యుత్ సిబ్బందికీ వ్యాక్సినేషన్ నిరంతర విద్యుత్ కోసం వేలాది మంది ఇంజినీర్లు, సిబ్బంది, ప్రత్యేకించి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సిబ్బంది అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. విద్యుత్ సరఫరా, ఇతర నిర్వహణ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు సీఎండీ నుంచి సీఈల వరకు పలువురు ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా జిల్లా, మండల కార్యాలయాలను సందర్శిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా రోజూ క్షేత్ర స్థాయిలో విద్యుత్ సరఫరాపై సమీక్షించుకోవాలని సిబ్బందికి సూచిస్తున్నారు. విద్యుత్ సిబ్బందికి దశల వారీగా ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కె.శ్రీధర్రెడ్డి తెలిపారు. -
కరోనాతో కరెంటుకు డిమాండ్
సాక్షి, అమరావతి: కరోనా కారణంగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుతోంది. నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి. రోజూ 228 మిలియన్ యూనిట్ (ఎంయూ)ల విద్యుత్ డిమాండ్ ఉంటోంది. సగటు విద్యుత్ వినియోగం 160 ఎంయూలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం, కోవిడ్ ప్రభావం దీనికి కారణమని విద్యుత్ ఉన్నతాధికారులు తెలిపారు. కరోనా రోగులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్న నేపథ్యంలో వినియోగం ఎక్కువవుతోంది. మే మొదటి వారానికి డిమాండ్ రోజుకు 235 ఎంయూలు దాటొచ్చని భావిస్తున్నారు. ఆ డిమాండ్ మేరకు విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆ రెండు నగరాలే కీలకం! విజయవాడ, గుంటూరు నగరాలు, సీఆర్డీఏ పరిధిలో 2019 ఏప్రిల్లో 267.53 ఎంయూల విద్యుత్ డిమాండ్ రికార్డయితే.. 2020 ఏప్రిల్లో ఇది 388.38 ఎంయూలకు చేరింది. 2021 మేలో ఇది 450 ఎంయూలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. తర్వాత స్థానంలో తూర్పుగోదావరి జిల్లా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి కోవిడ్ కేసులు విజయవాడ, గుంటూరు నగరాల్లోని ఆస్పత్రులకే వస్తున్నాయి. ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రుల్లోను ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఎక్కువ విద్యుత్ వినియోగం అనివార్యమవుతోంది. అన్నిచోట్ల 24 గంటలూ ఏసీలు వినియోగిస్తున్నారు. పగటి వేళల్లో డిమాండ్ పెరిగి విద్యుత్ లోడ్ అత్యధికంగా ఉంటోంది. దీనికితోడు కార్యాలయాల సిబ్బంది ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు. ప్రజలూ ఇల్లు దాటడం లేదు. ఫలితంగా గృహవిద్యుత్ వినియోగం 2019 కన్నా 20 శాతం ఎక్కువగా ఉందని సీపీడీసీఎల్ సీఎండీ పద్మా జనార్దన్రెడ్డి తెలిపారు. విద్యుత్ అంతరాయాల్లేకుండా ఏర్పాట్లు రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా విద్యుత్శాఖ అప్రమత్తమైంది. ఎలాంటి విద్యుత్ అంతరాయాలు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం. ముఖ్యంగా కోవిడ్ సెంటర్లు, ఆస్పత్రులకు విద్యుత్ అంతరాయాలు లేకుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. డిమాండ్కు తగ్గట్టుగా ఉత్పత్తి పెంచాం. అవసరమైతే మార్కెట్లో విద్యుత్ కొంటాం. ఎట్టి పరిస్థితుల్లోను వైద్యసేవలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని క్షేత్రస్థాయి సిబ్బందికి కచ్చితమైన ఆదేశాలు జారీచేశాం. – శ్రీకాంత్ నాగులాపల్లి, ఇంధనశాఖ కార్యదర్శి ఆ రెండు నగరాలపై దృష్టి విజయవాడ, గుంటూరు నగరాల్లో వైద్యసేవలను దృష్టిలో ఉంచుకుని సిబ్బంది నిరంతర సేవలు అందించేందుకు సిద్ధమయ్యారు. ఉన్నతస్థాయిలో పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. జోన్ల వారీగా పర్యవేక్షక బృందాలను ఏర్పాటు చేశాం. లోడ్ పెరిగినా విద్యుత్ సరఫరాకు ఆటకం రావడం లేదు. మేలో మరింత అప్రమత్తంగా ఉంటాం. – పద్మా జనార్దన్రెడ్డి, సీఎండీ, సీపీడీసీఎల్ -
కావాల్సినంత 'కరెంట్'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ ఏడాది పొడవునా విద్యుత్కు ఢోకా ఉండదు. కోతల్లేని సరఫరా కోసం ఇప్పటికే విద్యుత్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి వరకు విద్యుత్ లభ్యత, డిమాండ్ అంచనాలను డిస్కంలు.. విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 68,368.43 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరముండగా.. 71,380.95 మిలియన్ యూనిట్లు లభిస్తుందని అంచనా వేశారు. ఈసారి మొత్తంగా 3,012.52 మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్ ఉండబోతోంది. అక్టోబర్, నవంబర్లలో మాత్రం డిమాండ్ కన్నా 392.81 మిలియన్ యూనిట్ల తక్కువ విద్యుత్ లభిస్తోంది. ఈ రెండు నెలల్లో పవన, సౌర విద్యుదుత్పత్తి తగ్గడమే ఇందుకు కారణంగా అధికారులు భావిస్తున్నారు. పక్కాగా లెక్క.. అంచనాల రూపకల్పనకు విద్యుత్ సంస్థలు సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాయి. గత ఐదేళ్ల డిమాండ్, లభ్యతను ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్వేర్కు అనుసంధానం చేశారు. దీని ఆధారంగా ఏ నెలలో.. ఏ ఉత్పత్తి సంస్థ ద్వారా ఎంత విద్యుత్ లభిస్తుంది? ఏ ప్రాంతంలో ఎంత మేర విద్యుత్ వాడకం ఉంటుందనే దానిపై శాస్త్రీయ కోణంలో అంచనాలు తయారు చేశారు. ఉచిత వ్యవసాయ విద్యుత్ విషయంలో మరింత పక్కాగా లెక్కలేశామని కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ పద్మా జనార్థన్రెడ్డి తెలిపారు. ఏ సామర్థ్యంతో వాడినా పంపుసెట్లకు నాణ్యమైన విద్యుత్ అందించే ఏర్పాట్లు చేశామని వివరించారు. విద్యుత్ లోటు ఉండే అక్టోబర్, నవంబర్ నెలల కోసం మార్కెట్లో విద్యుత్ కొనుగోలుకు ముందుస్తు వ్యూహాన్ని రూపొందిస్తున్నామని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడాది పొడవునా కోతల్లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పారు. -
పెరుగుతున్న గృహ విద్యుత్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గృహ విద్యుత్ వినియోగం శరవేగంగా పెరుగుతోంది. ఏటా 20 శాతం వరకు అదనపు వాడకం ఉంటోంది. రాష్ట్ర ఇంధన ఆడిట్ విభాగం జరిపిన సర్వేలో ఈ అంశం వెల్లడైంది. 2015–16లో 11,356 మిలియన్ యూనిట్లున్న గృహ విద్యుత్ వినియోగం 2020–21 నాటికి 16,143 మిలియన్ యూనిట్లకు చేరింది. ఈ ఐదేళ్లలోనే 4,787 మిలియన్ యూనిట్లు పెరిగింది. 2018–19 తర్వాత ఏకంగా 3 వేల మిలియన్ యూనిట్ల వార్షిక పెరుగుదల నమోదైంది. మధ్యతరగతితోపాటు పేద వర్గాల్లోనూ విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, తదితరాలతో కుటుంబాల్లో ఆదాయం పెరగడంతో విద్యుత్ ఉపకరణాల కొనుగోలుపై దృష్టి పెడుతున్నారు. రెండేళ్లలో 16 శాతం పెరిగిన ఫ్రిజ్లు, ఏసీలు ► 2015లో రాష్ట్ర విద్యుత్ వినియోగం మొత్తం 41,191 మిలియన్ యూనిట్లు. 2021 నాటికి ఇది 57,065 మిలియన్ యూనిట్లకు చేరింది. ఆరేళ్ల కాలంలో 15,874 మిలియన్ యూనిట్లు పెరిగింది. ఇందులో దాదాపు మూడో వంతు (4,787 మిలియన్ యూనిట్లు) గృహ విద్యుత్ వినియోగమే ఉంది. ► పేద, మధ్యతరగతి వర్గాల విద్యుత్ లోడ్ కనిష్టంగా 2 కిలోవాట్ల వరకు పెరిగిందని అధికారులు చెబుతున్నారు. టన్ను ఏసీ వినియోగిస్తే ఒక కిలోవాట్ లోడ్ పెరుగుతుంది. ► ఏసీలు, ఫ్రిజ్ల వినియోగం గత రెండేళ్లలో 16 శాతం పెరిగినట్టు మార్కెట్ సర్వేలు చెబుతున్నాయి. ఆ తర్వాత స్థానంలో వాషింగ్ మెషిన్లు, ఇతర గృహోపకరణాలున్నాయి. ► వినియోగదారులు ఎక్కువగా స్టార్ రేటెడ్ విద్యుత్ ఉపకరణాలపైనే దృష్టి పెడుతున్నారు. ఇంధన పొదుపుపై అవగాహన పెరగడం, ఉత్పత్తిదారులు కూడా స్టార్ రేటెడ్ ఉపకరణాల ఉత్పత్తికే ప్రాధాన్యం ఇవ్వడం వీటి పెరుగుదలకు కారణాలు. చేరువలో సులభ వాయిదాలు.. ► పేద, మధ్యతరగతి వర్గాలను ఆకర్షించడంలో పలు సంస్థలు పోటీ పడుతున్నాయి. ముందుగా కొద్ది మొత్తాన్ని చెల్లించి, మిగతాది నెలనెలా సులభ వాయిదాలు కట్టుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి. ► ఇలా ఈఎంఐల ద్వారా ఎక్కువగా విద్యుత్ ఉపకరణాలే కొనుగోలు చేస్తున్నట్టు ఇటీవల సర్వేల ద్వారా వెల్లడైంది. ఆరేళ్ల వ్యవధిలో రాష్ట్రంలో లక్షకుపైగా ఏసీల కొనుగోలు జరిగితే ఇందులో 85 శాతం సులభ వాయిదాలపై తీసుకున్నవే ఉన్నాయని విజయవాడలోని ఓ ఎలక్ట్రానిక్ సంస్థ నిర్వాహకుడు తెలిపారు. ► స్టార్ రేటెడ్ ఫ్యాన్లు, ఏసీలు, నీటి పంపుల ద్వారా విద్యుత్ పొదుపు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర విద్యుత్ పొదుపు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఈ దిశగా ప్రభుత్వ రంగ సంస్థలు కూడా సులభ వాయిదాలతో ఉపకరణాలు అందిస్తున్నాయి. దీంతో గృహ విద్యుత్ వినియోగం పెరుగుతోంది. నాణ్యమైన విద్యుత్ అందిస్తాం.. అన్ని వర్గాలు విద్యుత్ ఉపకరణాల వినియోగంపై దృష్టి పెట్టాయి. ఫలితంగా విద్యుత్ వాడకం పెరిగింది. ఆరేళ్లలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. విద్యుత్ డిమాండ్ పెరిగిన నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా విద్యుత్ వ్యవస్థలు బలోపేతంపై దృష్టి పెడుతున్నాయి. నాణ్యమైన విద్యుత్ అందించే దిశగా చర్యలు చేపట్టాం. – శ్రీకాంత్ నాగులాపల్లి,ఇంధన శాఖ కార్యదర్శి -
ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్ (ముందే బిల్లు చెల్లించే) విద్యుత్ మీటర్లు బిగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భర అభయాన్ పథకంలో భాగంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల్లో వచ్చే ఏడాది మార్చి కల్లా ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుత మీటర్ల స్థానంలో ప్రీపెయిడ్ మీటర్లను డిస్కమ్లు ఏర్పాటు చేసి వాటి వ్యయాన్ని ప్రతినెలా రెండు శాతం చొప్పున విద్యుత్ బిల్లు నుంచి వసూలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. -
విద్యుత్ రంగంపై డ్రాగన్ ఆగడాలకు చెక్
సాక్షి, అమరావతి: చైనా కేంద్రంగా విద్యుత్ నెట్వర్క్పై సైబర్ దాడికి అవకాశాలున్నాయని రాష్ట్ర విద్యుత్ సంస్థలను కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో రాష్ట్ర విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. ఈ వ్యవహారంపై ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి నేతృత్వంలో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్, ట్రాన్స్కో, నెట్వర్క్ విభాగాల ఉన్నతాధికారులు తాజా పరిస్థితిపై చర్చించారు. విద్యుత్ సరఫరాలో కీలక భూమిక పోషిస్తున్న ఏపీ ట్రాన్స్కోకు చెందిన 400 కేవీ సబ్ స్టేషన్లలో సాంకేతిక అంశాలపై నిశితంగా దృష్టి పెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. గత ఏడాది ముంబై విద్యుత్ సంస్థలపై చైనా ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న హ్యాకింగ్ గ్రూప్లు సైబర్ అటాక్ చేశాయని, దీనివల్ల కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడిందని అమెరికాకు చెందిన ఓ సంస్థ అధ్యయనంలో వెల్లడించింది. కేంద్రానికి చెందిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీజీసీఎల్)తో విద్యుత్ సరఫరా వ్యవస్థ అనుసంధానమై ఉండటం వల్ల ఏపీలోనూ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థతి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. ఏ తరహా దాడి జరగొచ్చు! రాష్ట్రంలో 400 కేవీ సబ్ స్టేషన్లు, లోడ్ డిస్పాచ్ సెంటర్ పూర్తిగా ఇంటర్నెట్తో అనుసంధానమై ఉన్నాయి. వీటిలో వాడే ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలన్నీ ఎక్కువగా చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నారు. ఇందులో వాడే సాఫ్ట్వేర్ మొత్తం తయారీ సంస్థలకు తెలిసే వీలుంది. 400 కేవీ సబ్ స్టేషన్ను చైనా హ్యాకర్లు కమాండ్ ద్వారా నియంత్రించి విద్యుత్ సరఫరాను అడ్డుకునే వీలుంది. ఇదే జరిగితే పారిశ్రామిక, రైల్వే, వాణిజ్య వ్యవస్థలతో పాటు అత్యంత కీలకమైన వైద్య రంగానికి విద్యుత్ నిలిచిపోతుంది. సమాచార వ్యవస్థ కుప్పకూలి, గ్రిడ్ ఇబ్బందుల్లో పడుతుంది. దీనివల్ల పెద్దఎత్తున ఆర్ధిక నష్టం కలగడమే కాకుండా, గందరగోళానికి ఆస్కారం ఉంటుంది. కౌంటర్ అటాక్ సబ్ స్టేషన్లలో మాడ్యూల్స్ను నడిపించే సాఫ్ట్వేర్ భాష ఆయా ఉపకరణాల బ్లాక్ బాక్స్లో నిక్షిప్తమై ఉంటుంది. ఇది ఆంగ్లంలో ఉంటే తెలుసుకునే వీలుంటుంది. కానీ చైనా నుంచి దిగుమతి అయ్యే వాటిల్లో చైనా లిపినే వాడుతున్నారు. దీన్ని పూర్తిగా డీకోడ్ చేయడం సాధ్యం కావడం లేదని శ్రీకాంత్ నాగులాపల్లి చెబుతున్నారు. చైనా సాఫ్ట్వేర్ను వీలైనంత వరకూ డీకోడ్ చేయాలని అధికారులు ఆదేశించారు. మరీ కష్టంగా ఉన్న సబ్ స్టేషన్లలో ప్రత్యామ్నాయ సమాచార వ్యవస్థపై ఆధారపడాలని సూచించారు. కేంద్ర మార్గదర్శకాల నేపథ్యంలో గడచిన కొన్ని నెలలుగా చైనా నుంచి దిగుమతి అయ్యే ప్రతీ ఉపకరణాన్ని కేంద్ర సంస్థలు పరిశీలిస్తున్నాయి. అంతకు ముందు దిగుమతి చేసుకున్న ఉపకరణాలను నిశితంగా తనిఖీ చేసేందుకు ట్రాన్స్కో ఐటీ విభాగంతో ప్రత్యేక బృందాలను సిద్ధం చేశామని ట్రాన్స్ సీఎండీ శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. ఎస్ఎల్డీసీలోనూ ఐటీ పరంగా పటిష్టమైన తనిఖీ చేస్తున్నామని లోడ్ డిస్పాచ్ సెంటర్ ఇంజనీర్ భాస్కర్ తెలిపారు. సైబర్ నేరాలను ముందే పసిగట్టే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తున్నామని అధికార వర్గాలు తెలిపాయి. -
రైతుల ఖాతాల్లోకి రూ.4.23 కోట్లు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకం కింద రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం రూ.4,23,10,183 జమ చేసింది. వ్యవసాయ సబ్సిడీని రైతుల ఖాతాల్లోకి ప్రత్యక్షంగా బదిలీ చేసి, అక్కడి నుంచి విద్యుత్ పంపిణీ సంస్థకు పంపనున్నారు. ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లాలో అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నవంబర్ నెల వ్యవసాయ విద్యుత్ బిల్లుల మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి మళ్లించారు. ఈ మేరకు ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి శుక్రవారం జీవో జారీ చేశారు. -
ఉచిత విద్యుత్.. మరింత పకడ్బందీగా..
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకం ఇక నుంచి మరింత సమర్థవంతంగా పనిచేయనుంది. క్షేత్రస్థాయి నివేదికల తర్వాత విద్యుత్ సంస్థలు కచ్చితమైన ప్రణాళికలతో ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే 6,663 వ్యవసాయ ఫీడర్లను బలోపేతం చేశారు. గృహ, వ్యవసాయ విద్యుత్ ఫీడర్లను విడగొట్టి లోవోల్టేజీ సమస్య రాకుండా చేశారు. రూ.6610.5 కోట్లతో చేపట్టిన కొత్త ప్రాజెక్టులూ దాదాపు పూర్తికావచ్చాయి. ఈ రబీ నుంచే వంద శాతం ఫీడర్ల ద్వారా విద్యుత్ ఇస్తున్న విద్యుత్ శాఖ.. వచ్చే ఖరీఫ్ నుంచి మరింత సమర్థవంతంగా ఫీడర్లను పనిచేయించే లక్ష్యంతో ఉంది. పెరుగుతున్న డిమాండ్ అధికారిక అంచనాల ప్రకారం.. రాష్ట్రంలో ఏటా 20 శాతం విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. వ్యవసాయానికి 9 గంటల పగటి విద్యుత్ ఇస్తున్న నేపథ్యంలో పీక్ అవర్స్లో గ్రిడ్పై ఎక్కువ డిమాండ్ ఉంటోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త సబ్స్టేషన్లు, లైన్ల విస్తరణ చేపట్టారు. విద్యుత్ సంస్థలు రూ.6,610.5 కోట్లతో మొత్తం 85 కొత్త ప్రాజెక్టులు దాదాపు పూర్తికానున్నాయి. ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, విద్యుత్ లైన్ల పొడిగింపు, అత్యధిక సామర్థ్యంగల హైపవర్ కండక్టర్ల ఏర్పాటు ఇందులో ముఖ్యమైనవి. ట్రాన్స్కో, తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు (ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్), డిజాస్టర్ రికవరీ ప్రాజెక్టు (ప్రకృతి వైపరీత్యాలప్పుడు ఉపయోగపడేది), విశాఖ, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (వీసీఐసీ), గ్రీన్ ఎనర్జీ కారిడార్ (జీఈసీ) కొత్త ప్రాజెక్టుల్లో ప్రధానంగా ఉన్నాయి. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ (ఐబీఆర్డీ), ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ), ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఈ ప్రాజెక్టులకు రుణ సదుపాయం కల్పిస్తున్నాయి. వ్యవసాయ విద్యుత్ కోసమే ప్రభుత్వం 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పుతోంది. ఈ విద్యుత్ను రైతుకు చేరవేసే దిశగా గ్రిడ్ను బలోపేతం చేస్తున్నారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా నాణ్యమైన ఉచిత విద్యుత్ అందుతుందని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. నెట్వర్క్ బలోపేతం తర్వాత క్షేత్రస్థాయి పరిశీలన కూడా చేశామని ఆయన వివరించారు. -
ప్రైవేటీకరణ మాటే లేదు
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా ఇప్పటికే అనేకసార్లు స్పష్టం చేసిందన్నారు. అనేక ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఈ రంగాన్ని ఆదుకుందని గుర్తు చేశారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించకూడదని డిమాండ్ చేస్తూ ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులతో అధికారులు సోమవారం మరోదఫా సంప్రదింపులు జరిపారు. విద్యుత్ సంస్థల పరిస్థితిని గణాంకాలతో సహా వారి ముందుంచారు. అర్ధం చేసుకుని ఆందోళన మానుకోవాలని హితవు పలికారు. ఆ వివరాలతో నాగులాపల్లి ప్రజలకు ఓ లేఖ రాశారు. లేఖలో ఏముందంటే.. అసాంఘిక శక్తుల ప్రమేయం..! విద్యుత్ ఉద్యోగులు అనవసరంగా ఆందోళన పడుతున్నారు. ప్రైవేటీకరణ చేస్తున్నారనే తప్పుడు ప్రచారానికి ప్రభావితులవుతున్నారు. కొందరు పనికట్టుకుని చేస్తున్న తప్పుడు ప్రచారం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. అయితే అసలా ఆలోచనే లేదని ప్రభుత్వం ఇప్పటికే అనేకసార్లు స్పష్టం చేసింది. ఇటీవల విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఉద్యోగులకు ఈ విషయం నిక్కచ్చిగా చెప్పారు. అయినప్పటికీ ఈ అంశాన్ని తెరపైకి రావడం వెనుక కొన్ని అసాంఘిక శక్తుల ప్రమేయం ఉందనే అనుమానాలు బలపడే అవకాశం ఉంది. అదే నిజమైతే వేల కోట్లు ఎందుకిస్తారు? 2019 మార్చి నాటికి విద్యుత్ రంగం పరిస్థితి దారుణంగా ఉంది. డిస్కమ్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.13,391 కోట్లు ఉన్నాయి. వీటికోసం 2019–20లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఆర్థిక కష్టాలేవీ పరిగణనలోకి తీసుకోకుండా రూ.8,654.95 కోట్లు విడుదల చేసింది. 2020 మార్చి 31 నాటికి ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం బకాయిలు రూ.28,731.87 కోట్లు ఉంటే, ఇప్పటికే రూ.17,904 కోట్లు చెల్లించింది. ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోగా మిగతా మొత్తాన్నీ చెల్లించే ఏర్పాట్లు చేస్తోంది. ప్రైవేటీకరించే ఆలోచనే ఉంటే ప్రభుత్వం ఈ రంగానికి ఇన్ని వేల కోట్ల డబ్బులు ఇస్తుందా? గత ఐదేళ్ళుగా పేరుకుపోయిన బకాయిలను విడుదల చేస్తుందా? ఉద్యోగులు, ప్రజలు ఈ విషయాన్ని నిశితంగా గమనించాలి. విద్యుత్ సంస్థలను గట్టెక్కించేందుకు జగన్ సర్కారు ప్రయత్నం 2014–15 నాటికి విద్యుత్ సంస్థలు రూ.7,069.25 కోట్ల నష్టాల్లో ఉన్నాయి. 2019–20లో ప్రస్తుత ప్రభుత్వం వచ్చే నాటికే ఆ నష్టాలు రూ.35,700.97 కోట్లకు చేరాయి. ఏటా నాలుగైదు వేల కోట్ల చొప్పున నష్టాల ఊబిలో కూరుకుపోతున్న విద్యుత్ సంస్థలను గట్టెక్కించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. నిర్వహణ ఖర్చును ఒక్క ఏడాదిలోనే రూ.5 వేల కోట్ల వరకు తగ్గించేలా ప్రణాళికను రూపొందించింది. నిజంగా ప్రైవేటీకరణ ఆలోచనే ఉంటే ప్రభుత్వం ఇంత శ్రద్ధ తీసుకుంటుందా? ఇవన్నీ గమనించి, తప్పుడు ప్రచారానికి ప్రభావితం కాకుండా, సంస్థను బలోపేతం చేసేందుకు ఉద్యోగులు సహకరించాలి. -
కరెంట్.. ఇక దైవాధీనం కాదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ సబ్స్టేషన్ల ఆటోమేషన్ ప్రక్రియ వేగవంతమవుతోంది. రూ.వెయ్యికోట్ల కాంట్రాక్టు పనులకు అధికారులు టెండర్ నిబంధనలు రూపొందించి న్యాయసమీక్షకు పంపారు. అక్కడి నుంచి గ్రీన్సిగ్నల్ రాగానే పనుల్లో మరింత వేగం పుంజుకుంటుంది. సబ్స్టేషన్ల ఆటోమేషన్ పూర్తయితే తొమ్మిది గంటల పగటి విద్యుత్కు మరింత భరోసా లభిస్తుంది. చెప్పినవేళకు ఆటోమేటిక్గా వ్యవసాయ విద్యుత్ సరఫరా అవుతుంది. ► సబ్స్టేషన్లో వ్యవసాయ ఫీడర్లను ఇప్పటివరకు విద్యుత్ సిబ్బంది ఆన్, ఆఫ్ చేసేవాళ్లు. నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతుందా? లేదా? అనేదానికి శాస్త్రీయతా కనిపించడంలేదు. ఈ విధానాన్ని సమూలంగా మారుస్తూ సబ్స్టేషన్ల ఆటోమేషన్కు విద్యుత్శాఖ శ్రీకారం చుట్టింది. ► మూడు విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలోనూ కొన్ని సబ్స్టేషన్లలో ప్రయోగాత్మకంగా ఆటోమేషన్ చేపట్టారు. ఇవి మంచి ఫలితాలిచ్చాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కడి నుంచైనా విద్యుత్ సరఫరాను పరిశీలించగలిగారు. వ్యవసాయ విద్యుత్ లోడ్ను శాస్త్రీయంగా తెలుసుకున్నారు. రిమోట్ ద్వారా విజయవాడ నుంచి కూడా ఆపరేట్ చేయగలమని నిరూపించారు. ► ప్రయోగం విజయవంతమవడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని సబ్స్టేషన్లను ఆటోమేషన్ చేయాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,616 విద్యుత్ ఫీడర్ల ద్వారా 17,54,906 వ్యవసాయ పంపుసెట్లకు ఏటా 12,232 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా అవుతోంది. ప్రస్తుతం 1,068 సబ్స్టేషన్లలో పూర్తి ఆటోమేషన్ చేపడతారు. మిగిలిన వాటిని తరువాత దశలో ఆటోమేషన్ చేస్తారు. ప్రపంచబ్యాంకు రుణం ఆటోమేషన్ ప్రక్రియకు వెయ్యికోట్ల వ్యయం అవుతుంది. ఈ మొత్తాన్ని రుణంగా ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు అంగీకరించింది. ఇంటలెక్చువల్ ఎల్రక్టానిక్ డివైజ్ ద్వారా పనిచేసే ఈ సాంకేతికత రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది. విద్యుత్ సరఫరా దైవా«దీనం అనే గత అనుభవాలను పూర్తిగా మారుస్తుంది. ఎవరి ప్రమేయం లేకుండానే ఫీడర్లు ఆన్ అవుతాయి. తొమ్మిది గంటల సమయం పూర్తవ్వగానే విద్యుత్ సరఫరా ఆగిపోతుంది. పైలెట్ ప్రాజెక్టు ద్వారా అన్ని అనుమానాలు నివృత్తి చేసుకున్నాం. వందశాతం పారదర్శకంగా టెండర్ ప్రక్రియ చేపట్టబోతున్నాం. – శ్రీకాంత్ నాగులాపల్లి, ఇంధనశాఖ కార్యదర్శి నాణ్యత పెరుగుతుంది విద్యుత్ లోడ్ను సాంకేతికంగా తెలుసుకోవచ్చు. దీంతో సబ్స్టేషన్ పరిధిలో కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. ఫలితంగా విద్యుత్ సరఫరా నాణ్యత మరింత పెరుగుతుంది. – పద్మా జనార్దన్రెడ్డి, సీఎండీ, సీపీడీసీఎల్ -
ప్రభుత్వం దృష్టికి విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లు
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. వారి డిమాండ్లను ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్–19 కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో అందరికీ తెలుసని, ఇలాంటి సమయంలో సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు. 1999 నుంచి 2004 వరకూ ఉద్యోగాల్లో చేరిన వారికి పెన్షన్ ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్ నెరవేర్చేందుకు దాదాపు రూ.2 వేల కోట్లు ఖర్చవుతుందన్నారు. డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి గత నెల 28న యాజమాన్యానికి నోటీసు ఇచ్చి.. ఈ నెల 19 నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టింది. కచ్చితమైన హామీ ఇవ్వాలి వర్షాలు, కోవిడ్–19 కారణంగా ఆందోళన విరమించాలన్న ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ విజ్ఞప్తిపై విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేత చంద్రశేఖర్ స్పందించారు. కనీసం వారం రోజుల ముందైనా ఈ విజ్ఞప్తి చేసి ఉంటే పునరాలోచించుకునే వీలుండేదన్నారు. ఆందోళనకు వెళ్తున్న సమయంలో ఎలా ఆపగలమని ఓ ప్రకటనలో ప్రశ్నించారు. కచ్చితమైన హామీ ఇస్తే ఉద్యోగుల్లో నమ్మకం పెరుగుతుందన్నారు. -
వరద ప్రాంతాల్లో వంద శాతం విద్యుత్ పునరుద్ధరణ
సాక్షి, అమరావతి: వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న ఫీడర్ల పరిధిలో వంద శాతం విద్యుత్ పునరుద్ధరణ జరిగినట్టు విద్యుత్ ఉన్నతాధికారులు తెలిపారు. ఉభయగోదావరి జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరుగుతోందని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) సీఎండీ నాగలక్ష్మి చెప్పారు. ఇంత త్వరగా విద్యుత్ సరఫరా చేయడం రికార్డు అని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో రెండు రోజులుగా విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. ఈ నెల 13న 134 మిలియన్ యూనిట్ల వాడకం ఉంటే... 15న 150.9 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. అంటే రెండు రోజుల్లోనే 16 ఎంయూలు పెరిగింది. రానురాను ఇంకా డిమాండ్ పెరగొచ్చని డిస్కమ్ల సీఎండీలు హరినాథ్రావు, నాగలక్ష్మి, పద్మా జనార్దన్రెడ్డి నివేదిక పంపారు. జెన్కో అలెర్ట్ డిస్కమ్లు ఇచ్చిన క్షేత్రస్థాయి నివేదికపై లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) రాబోయే పరిస్థితిని అంచనా వేసింది. ఈ నెలాఖరుకు రోజుకు 160 ఎంయూల విద్యుత్ డిమాండ్ ఉండే వీలుందని లెక్కగట్టింది. ఈ నేపథ్యంలో ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రస్తుతం 800 మెగావాట్ల సామర్థ్యం గల ఒక యూనిట్ పనిచేస్తోంది. మరో యూనిట్ను ఉత్పత్తిలోకి తేవడానికి అవసరమైన బొగ్గు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మహానది కోల్ ఫీల్డ్స్ (ఎంసీఎల్)తో అధికారులు చర్చించారు. -
యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ
సాక్షి, అమరావతి: యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టాలని విద్యుత్ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్త పడాలన్నారు. ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, వరదల సమయంలో విద్యుత్ అంతరాయాలు లేకుండా తగిన ప్రణాళిక రూపొందించాలని సూచించారు. తుపాను, వరదల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో విద్యుత్ సరఫరా పరిస్థితిపై సీఎం విద్యుత్ ఉన్నతాధికారులతో బుధవారం సమీక్షించారు. ఈ వివరాలను ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి మీడియాకు వెల్లడించారు. ముందస్తు వ్యూహంతో తప్పిన ముప్పు ► విద్యుత్ పునరుద్ధరణ పనులపై సమగ్ర సమాచారాన్ని అధికారులు సీఎం ముందుంచారు. రాష్ట్రంలో 13,648 ఫీడర్లున్నాయి. తుపాను కారణంగా 170 ఫీడర్ల పరిధిలో బ్రేక్ డౌన్స్ వచ్చాయి. ఇప్పటి వరకు 165 ఫీడర్లలో విద్యుత్ను పునరుద్ధరించారు. ► పశ్చిమగోదావరి జిల్లాలో విద్యుత్ అంతరాయాలు ఎక్కువగా చోటు చేసుకున్నాయి. వీటిని కూడా చాలా వరకు పరిష్కరించారు. మొత్తం 1,263 ఫీడర్లలో 23 బ్రేక్ డౌన్ అయ్యాయి. ప్రస్తుతం 22 ఫీడర్లు విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. ► తాత్కాలిక సిబ్బందిని సిద్ధంగా ఉంచుకున్నామని, అత్యవసర పరిస్థితుల్లో జనరేటర్ల ద్వారా విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టే ఏర్పాట్లు చేశామని ఇంధనశాఖ ఉన్నతాధికారి శ్రీకాంత్ తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల్లో సాధ్యమైనంత వరకు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టి, బ్రేక్డౌన్స్ రాకుండా చూడగలిగామని ఈపీడీసీఎల్ సీఎండీ నాగలక్ష్మి తెలిపారు. -
ఉచిత విద్యుత్కు నిధులు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం కింద నగదు బదిలీ అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద వ్యవసాయ విద్యుత్ సరఫరాకు సంబంధించి సెప్టెంబర్ నెలకయ్యే రూ.6.05 కోట్లు మంజూరు చేస్తూ పాలనాపరమైన అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. శుభారంభం: కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలు తీసుకురాగా.. ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీని నేరుగా రైతు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతుపై ఏమాత్రం భారం పడకుండా ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. రైతు ఖాతాల్లో ప్రభుత్వ సొమ్ము చేరిన తర్వాతే దాన్ని విద్యుత్ సంస్థకు పంపుతామని స్పష్టం చేసింది. పక్కా లెక్క: ఉచిత వ్యవసాయ విద్యుత్కు గత ప్రభుత్వం ఏటా రూ.4 వేల కోట్లు మాత్రమే సబ్సిడీగా ఇచ్చేది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2020–21లో వ్యవసాయ విద్యుత్ సబ్సిడీకి రూ.8,353.70 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్ లోడ్, కనెక్షన్లను బట్టి నగదు బదిలీకి అయ్యే వ్యయాన్ని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ లెక్కగట్టింది. ఆ జిల్లాలో మొత్తం 25,971 వ్యవసాయ పంపుసెట్లు ఉండగా.. వీటి వినియోగ సామర్థ్యం 1,02,963 హార్స్పవర్ (హెచ్పీ). ఏపీఈఆర్సీ నిర్ణయించిన ప్రకారం ఒక్కో యూనిట్ ధర రూ.6.58. ఈ లెక్కన సెప్టెంబర్ నెలలో విద్యుత్ సబ్సిడీ రూ.6.05 కోట్లు ఉంటుందని ఈపీడీసీఎల్ లెక్కగట్టింది. ఈ మొత్తం రైతు ఖాతాల్లోకే వెళుతుంది. -
ఇక అంతా ఆటోమేటిక్
సాక్షి, అమరావతి: వ్యవసాయ విద్యుత్ సరఫరాలో వినూత్న విప్లవం రాబోతోంది. పూర్తి సాంకేతికతతో వ్యవసాయ విద్యుత్ ఫీడర్లు పనిచేయబోతున్నాయి. విద్యుత్ సబ్స్టేషన్లన్నింటినీ ‘ఆటోమేషన్’ చేసేందుకు ప్రభుత్వ సహకారంతో ప్రపంచ బ్యాంకు అవసరమైన నిధులు సమకూర్చనుంది. ఆటోమేషన్ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. కృష్ణా జిల్లా వల్లూరుపాలెంలో ఏర్పాటు చేసిన పైలట్ ప్రాజెక్టును ‘సాక్షి’ బృందం పరిశీలించింది. రైతన్నకు ఇది చేయబోయే మేలుపై సమగ్ర సమాచారం సేకరించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 6,616 విద్యుత్ ఫీడర్ల ద్వారా 17,54,906 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఏటా 12,232 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా అవుతోంది. గతంలో అర్ధరాత్రి అపరాత్రి అతి కష్టం మీద ఏడు గంటల విద్యుత్ ఇవ్వగా నవరత్నాల్లో భాగంగా పగటిపూటే 9 గంటల విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఫీడర్ల బలోపేతానికి రూ.1,700 కోట్లు వెచ్చిస్తోంది. ఇప్పుడేం చేయబోతున్నారంటే.. గతంలో వ్యవసాయ క్షేత్రానికి మూడు వైర్లు (త్రీ ఫేజ్) ద్వారా విద్యుత్ అందించాల్సి ఉండేది. అంటే.. 9 గంటల పాటు త్రీఫేజ్ ఆన్ చేయాలి. ఏబీ స్విచ్లు, ఫీడర్ బ్రేకర్లను అక్కడ ఉండే షిప్ట్ ఆపరేటర్ పనిచేయించాల్సి ఉంటుంది. అతడు ఏమాత్రం అశ్రద్ధ చేసినా.. ఆ సమయంలో సబ్స్టేషన్కు వెళ్లలేకపోయినా రైతులకు త్రీఫేజ్ విద్యుత్ అందదు. ఈ ఇబ్బందులు లేకుండా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 3 వేలకు పైగా ఉన్న సబ్స్టేషన్లలో మొదటి దశలో 1,068 స్టేషన్లను రూ.900 కోట్లతో ఆటోమేషన్ పరిధిలోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేసింది. ఆటోమేషన్ స్టేషన్లు పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తాయి. విద్యుత్ను ఎంతసేపు ఇవ్వాలో ప్రోగ్రామింగ్ ద్వారా నిర్ణయిస్తే చాలు. క్షణం ఆలస్యం కాకుండా నిర్దేశిత సమయానికి త్రీ ఫేజ్ ఆన్ అవుతుంది. 9 గంటల తర్వాత ఆగిపోతుంది. మానవరహితంగా పనిచేసే ఈ టెక్నాలజీ దేశంలోనే తొలిసారి. సబ్ స్టేషన్లో నాలుగు ఫీడర్లుంటాయి. ఒక్కో ఫీడర్ పరిధిలో 300 వరకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లుంటాయి. త్రీఫేజ్ విద్యుత్ వైర్లను, స్విచ్ బ్రేకర్స్ను తిప్పడం ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతుంది. ఈ ప్రక్రియను ఇంటలెక్చువల్ ఎలక్ట్రానిక్ డివైజ్ ద్వారా సబ్స్టేషన్ పరిధిలోనే రిలే కంట్రోల్ ప్యానల్కు కనెక్ట్ చేస్తారు. ఇందులోనే ఎలక్ట్రానిక్ పరికరం ఉంటుంది. దీనిద్వారా ఏ సమయంలో విద్యుత్ సరఫరా జరగాలి? ఎప్పుడు ఆగిపోవాలనే సమయాన్ని కమాండ్గా ఇస్తారు. ఆ సమయానికి సిగ్నల్ వెళ్లి ఆయస్కాంతీకరణ ద్వారా స్విచ్ బ్రేకర్స్ను తిప్పుతాయి. దీంతో త్రీఫేజ్ విద్యుత్ సరఫరా అవుతుంది. సబ్ స్టేషన్లో ఉండే “మోడెమ్’ ద్వారా వల్లూరుపాలెం సబ్స్టేషన్లోని ఫీడర్లను విజయవాడ విద్యుత్ సౌధ నుంచి ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. ఇందుకు సంబంధించిన పాస్వర్డ్లన్నీ పూర్తి భద్రంగా ఉంచుతారు. జవాబుదారీతనం పెరుగుతుంది ఆటోమేషన్ వల్ల అంతరాయం లేకుండా పగటిపూట 9 గంటల విద్యుత్ రైతులకు అందించవచ్చు. దీనివల్ల జవాబుదారీతనం పెరుగుతుంది. రాష్ట్రంలో రెండు కంపెనీలు పైలెట్ ప్రాజెక్టులు పూర్తి చేశాయి. మంచి ఫలితాలు వచ్చాయి. – పద్మా జనార్దన్ రెడ్డి, సీఎండీ, కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థ రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలన్నదే లక్ష్యం రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలన్న లక్ష్యంతోనే ఆటోమేషన్ చేపట్టాం. పైలెట్ ప్రాజెక్టు ఫలితాలు, ప్రాజెక్టు సమగ్ర నివేదికను ప్రపంచబ్యాంకుకు పంపించాం. ఒక్కో సబ్ స్టేషన్కు రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షలు వరకు ఖర్చు కావచ్చు. బహిరంగ టెండర్లు పిలిచి పోటీ ద్వారా ధర తగ్గించేలా కృషి చేస్తున్నాం. – శ్రీకాంత్ నాగులాపల్లి, ఇంధన శాఖ కార్యదర్శి వ్యవసాయ విద్యుత్ ఇలా.. రాష్ట్రంలో పంపుసెట్లు: 17,54,906 ఫీడర్లు: 6,616 లోడ్ (మెగావాట్లు): 1,15,55,552 సాగుకు విద్యుత్ సరఫరా సీజన్ వారీగా మిలియన్ యూనిట్లలో.. ఖరీఫ్ (జూన్–సెప్టెంబర్) 4,744.44 (39 శాతం) రబీ (సెప్టెంబర్–మార్చి) 6,192 (51 శాతం) అన్ సీజన్ (ఏప్రిల్–మే) 1,296 (11 శాతం) మొత్తం (ఏప్రిల్–మార్చి) 12,232.44 (100 శాతం) – నోట్: ప్రతి హెచ్పీకి వార్షిక వినియోగం 1,059 (మిలియన్ యూనిట్లు) -
పుంజుకుంటున్న పారిశ్రామిక విద్యుత్
సాక్షి, అమరావతి: పారిశ్రామిక విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతోంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమల్లో పురోగతి కనిపిస్తున్నా.. ఎగుమతులు, దిగుమతులపై ఆధారపడే భారీ పరిశ్రమలు ఇంకా పుంజుకోవాల్సి ఉంది. ఫెర్రో అల్లాయిస్ పారిశ్రామిక వేత్తలు ఇటీవల ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లిని కలిశారు. ఆ రంగానికి విద్యుత్ రాయితీ ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో పారిశ్రామిక విద్యుత్ వినియోగం పురోగతిని ఇంధన శాఖ సమీక్షించింది. ఆ వివరాలివీ.. అది గడ్డుకాలమే! రాష్ట్రంలో 2019 ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో పారిశ్రామిక విద్యుత్ వినియోగం 3,975.66 మిలియన్ యూనిట్లు ఉంటే.. ఈ ఏడాది అదే త్రైమాసికంలో 2,754.14 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. దాదాపు 31 శాతం డిమాండ్ తగ్గింది. ఈ కాలంలో పారిశ్రామిక విద్యుత్ రెవెన్యూ వసూళ్లు 32 శాతం తగ్గి విద్యుత్ రంగం గడ్డుకాలాన్ని ఎదుర్కొంది. జూలై, ఆగస్టు నెలల్లో విద్యుత్ వినియోగం తిరిగి వేగం పుంజుకుని 1,444.75 మిలియన్ యూనిట్లకు చేరింది. పరిశ్రమలకు ప్రభుత్వ అండ కోవిడ్ సమయంలోనూ పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం అండగా నిలిచింది. ఫెర్రో అల్లాయిస్ పారిశ్రామిక వేత్తలు రాయితీలు కోరుతున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. – శ్రీకాంత్ నాగులాపల్లి, ఇంధన శాఖ కార్యదర్శి -
వాళ్లుండాల్సింది ఫీల్డ్లోనే.. సచివాలయాల్లో కాదు..
సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తర్వాత విద్యుత్ అంతరాయాలు 37.44% మేర తగ్గాయని ఇంధనశాఖ తెలిపింది. గ్రామ సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న జూనియర్ లైన్మెన్లు రాష్ట్ర విద్యుత్ సంస్థల ఉద్యోగులేనని, వారికి డిస్కమ్లే వేతనాలు చెల్లిస్తున్నాయని స్పష్టం చేశారు. వాళ్లంతా సచివాలయాల్లో అందుబాటులో ఉండటం లేదన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. వాళ్లు ఫీల్డ్కు వెళ్లి పనిచేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నియమించిన 7 వేల మంది జూనియర్ లైన్మెన్ల పనితీరుపై వదంతుల నేపథ్యంలో ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ గురువారం మీడియాకు వాస్తవాలను వివరించారు. కరెంట్ పోతే క్షణాల్లో... ►జూనియర్ లైన్మెన్లకు గ్రామ సచివాలయంతో సంబంధం ఉన్నా.. విధివిధానాలన్నీ విద్యుత్ సంస్థల నిబంధనల మేరకే ఉంటాయి. ►ఒక్కో జూనియర్ లైన్మెన్కు 1500 విద్యుత్ కనెక్షన్ల నిర్వహణ బాధ్యత అప్పగించాం. 30 నుంచి 40 ట్రాన్స్ఫార్మర్లు పర్యవేక్షించాలి. 10 కి.మీ. పరిధి వరకు లైన్పై చెట్లు పడ్డా, జంపర్లు తెగిపోయినా వాళ్లే బాగుచేస్తారు. ►ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా, చెడిపోయినా, వినియోగదారుల మీటర్లు ఆగిపోయినా కొత్తవి బిగించడం వారి విధుల్లో భాగం. ►ఫీల్డ్లో పనిచేయడంతో గ్రామ సచివాలయానికి హాజరు కాలేకపోతున్నారు. ఈ కారణంగా వాళ్లు పనిచేయడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఇది వాస్తవం కాదు. ►విద్యుత్కు సంబంధించిన ఏ సమస్య గ్రామ సచివాలయానికి వచ్చినా అధికారులు ఫోన్లో జూనియర్ లైన్మెన్ను సంప్రదిస్తారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే కరెంట్ సమస్యలను పరిష్కరించాలి. దారికొచ్చిన అంతరాయాలు ►గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఎక్కువ గంటలు కరెంట్ పోయిందనే ఫిర్యాదులు క్రమంగా తగ్గుతున్నాయి. 2018–19లో 6,98,189 విద్యుత్ అంతరాయాల ఫిర్యాదులొస్తే 2019–20లో వీటి సంఖ్య 4,36,781గా నమోదైంది. అంటే.. దాదాపు 2.60 లక్షల ఫిర్యాదులు తగ్గాయి. ప్రజలకు అందుబాటులో ఉంటున్నా.. ఐటీఐ పూర్తిచేసి ఎల్రక్టీషియన్గా ప్రైవేట్ పనులు చేసేవాడిని. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసిన తర్వాత జూనియర్ లైన్మన్గా ఉద్యోగం వచ్చింది. విద్యుత్ సమస్య వస్తే గ్రామ సచివాలయం నుంచి ఫోన్లో మెసేజ్ వస్తోంది. వెంటనే ఫీల్డ్కు వెళ్లి విద్యుత్ అంతరాయాలు లేకుండా చూస్తున్నా. ఎక్కువ సమయం ఫీల్డ్లోనే ఉంటున్నా. గ్రామ సచివాలయానికి వెళ్లలేకపోతున్నా. –అజయ్కుమార్, జూనియర్ లైన్మన్, గోపినేనిపాలెం, వత్సవాయి మండలం, కృష్ణా జిల్లా -
నగదు బదిలీతో అన్నదాతకే అధికారం
సాక్షి, అమరావతి: నగదు బదిలీతో సరికొత్తగా అమలు కానున్న వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకం అన్నదాతలకు నిజమైన అధికారాన్ని కల్పిస్తుందని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ సౌరబ్ కుమార్ పేర్కొన్నారు. ఇది డిస్కమ్లను బలోపేతం చేసి రైతులకు సాధికారత తెస్తుందన్నారు. ఈ పథకాన్ని అమలు చేయడం ద్వారా ఏపీ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కితాబిచ్చారు. ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లితో సమావేశం సందర్భంగా సౌరబ్ కుమార్ ఈ మేరకు అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో చంద్రశేఖర్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని అంశాల్లో సహకారం అందిస్తాం.. ► పంపుసెట్లకు మీటర్లు లేకపోవడం వల్ల వ్యవసాయ వినియోగంపై కచ్చితమైన లెక్కలు అందుబాటులో లేక రైతులకు నాణ్యమైన సేవలు అందడం లేదని సౌరబ్ కుమార్ పేర్కొన్నారు. డిస్కమ్ల సాంకేతిక, వాణిజ్య నష్టాలను వాస్తవంగా చూపించకుండా కొంత మొత్తాన్ని వ్యవసాయ విద్యుత్ వినియోగంలో కలుపుతున్నారన్నారు. నగదు బదిలీ పథకం అమలుతో విద్యుత్ సంస్థల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో సౌర విద్యుత్, స్మార్ట్ మీటరింగ్తో పాటు అన్ని అంశాల్లోనూ ఈఈఎస్ఎల్ పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఉచితానికి రూ.8 వేల కోట్లు ► రైతులపై పైసా భారం లేకుండా, లోవోల్టేజీ లేకుండా ఉచిత విద్యుత్ అందించే ప్రణాళికను ఇంధనశాఖ అధికారులు సౌరబ్ కుమార్కు వివరించారు. బిల్లుల మొత్తాన్ని ప్రభుత్వమే వారి ఖాతాల్లో జమ చేస్తుందన్నారు. మీటర్లు అమర్చటం వల్ల విద్యుత్ లోడు నిర్వహణ సులభతరం అవుతుందన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.8 వేల కోట్లు కేటాయించిందన్నారు. పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని, మరో 30 ఏళ్లు ఈ పథకానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పుతున్నట్టు చెప్పారు. అక్రమ విద్యుత్ కనెక్షన్లు, అదనపు లోడు వ్యవసాయ కనెక్షన్లను క్రమబద్ధీకరిస్తామని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. రూ.1,700 కోట్లతో ఫీడర్ల బలోపేతం ► పగటి పూటే 9 గంటల ఉచిత విద్యుత్ అందించేందుకు ఫీడర్ల బలోపేతానికి ప్రభుత్వం రూ.1,700 కోట్లు మంజూరు చేసిందని సౌరబ్కుమార్కు ఇంధనశాఖ కార్యదర్శి వివరించారు. 2019 మార్చి 31 నాటికి డిస్కమ్లకు పెండింగ్లో ఉన్న రూ.8,655 కోట్ల సబ్సిడీ బకాయిలను ప్రభుత్వం చెల్లించిందని, అప్పటివరకు విద్యుదుత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన రూ.14,036 కోట్లను కూడా ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. -
అవినీతి ఫైలు అటకెక్కించేశారు
సాక్షి, అమరావతి: గోదావరి పుష్కరాల సందర్భంగా హాలోజన్ బల్బుల పేరుతో జరిగిన గోల్మాల్ను గత టీడీపీ ప్రభుత్వం విచారణ దశలోనే అటకెక్కించినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అప్పటి ప్రభుత్వ పెద్దల అవినీతి వెలుగులోకి రాకుండా ఈ పనిచేశారని ప్రస్తుత ప్రభుత్వానికి ఇప్పుడు ఓ ఫిర్యాదు అందింది. దీంతో ఏపీ విజిలెన్స్ అధికారులు ఈ వ్యవహారంపై తిరిగి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయని ట్రాన్స్కో విజిలెన్స్ జేఎండీ వెంకటేశ్వరరావు వివరించారు. అప్పుడేం జరిగిందంటే? ► పుష్కరాల సమయంలో రాజమండ్రిలోని గోదావరి పుష్కర ఘాట్ వద్ద హాలోజన్, రంగుల విద్యుద్దీపాలు అమర్చాలని 2015లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించి రూ.1,71,82,836లను మంజూరు చేసింది. నిజానికి రూ.5 లక్షలు దాటిన ప్రతీ కాంట్రాక్టుకు టెండర్ పిలవాలి. ఇదేమీ లేకుండా ఈ మొత్తాన్ని ఇష్టానుసారం ఖర్చుచేశారు. ► రూ.99 లక్షలతో హాలోజన్ ల్యాంపులు, డెకరేషన్ బల్బులు అద్దెకు తెచ్చినట్లు రూ.72 లక్షలతో హాలోజన్ ల్యాంపులు, కేబుల్, జీఐ వైర్, ఇన్సులేషన్ టేపులు, పిన్స్, ఎంసీబీలు, బల్బులు, ల్యాంపులు, హోల్డర్లు కొనుగోలు చేసినట్లు లెక్కల్లో చూపించారు. ► అలాగే, ఒక్కో ల్యాంపు రూ.824 చొప్పున 654 ల్యాంపులు కొన్నామని, వీటి విలువ దాదాపు రూ.5.4 లక్షలని, మరో 500 వాట్స్ హాలోజన్ ల్యాంపులు ఒక్కొక్కటీ రూ.588 చొప్పున.. 553 కొనుగోలు చేశామని, వీటి విలువ రూ.3.25 లక్షలని అధికారులు లెక్కలు చెప్పారు. లేబర్ ఛార్జీల కోసం రూ.10,32,500 ఖర్చు చేసినట్లు బిల్లులు పెట్టారు. ► కానీ, రికార్డుల్లో చూపించిన షాపులన్నీ హాలోజన్ బల్బులు అద్దెకిచ్చే పరిస్థితే లేదని, బల్బుల నాణ్యతా ప్రమాణాలు కూడా ఏమాత్రం లేవని ఆరోపణలు వచ్చాయి. అసలు కొనుగోలు చేసిన హాలోజన్ బల్బులు ఆ తర్వాత మాయమవ్వడం, ఆ తర్వాత తుక్కుగా చూపించడం అనేక అనుమానాలకు తావిచ్చింది. వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ ► ఈ నేపథ్యంలో.. ‘సాక్షి’ 21–8–2015న ఈ బాగోతంపై ‘హలోజన్ హాంఫట్’ పేరుతో అక్రమాలను వెలుగులోకి తెచ్చింది. అప్పటి ప్రభుత్వ పెద్దల ప్రమేయాన్ని, అవినీతినీ ఆధారాలతో బయటపెట్టింది. దీంతో తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముత్యాలరాజు ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. ► మాయమైన బల్బులు, కొనుగోలులో అక్రమాలు, అద్దెకు తేవడం బూటకమని ప్రాథమిక ఆధారాలు లభించడంతో అప్పట్లోనే పదిమంది అధికారులకు సీఎండీ నోటీసులు జారీచేసి సమగ్ర విచారణకు ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. ► కానీ, ఆ తర్వాత 2016లో ఈపీడీసీఎల్ సీఎండీగా వచ్చిన ఎంఎం నాయక్పై ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నుంచి ఒత్తిళ్లు వచ్చాయి. దీంతో 2016 ఏప్రిల్లో విచారణలో ఉన్న ఈ కేసును మూసేశారు. ► ట్రాన్స్కో విజిలెన్స్ అప్పట్లో ఈ కేసుపై విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఈపీడీసీఎల్కు సిఫార్సు చేసింది. అయితే, ఈ ఆదేశాలు డిస్కమ్ సీఎండీ పక్కనపెట్టారు. ఇప్పుడా ఫైలే కన్పించకుండా పోయిందని అధికారులు చెబుతున్నారు. లోతుగా దర్యాప్తు చేస్తున్నాం అవినీతికి పాల్పడిన వారిపై చర్యలే లేకుండా ఫైలు మూసేయడం ఆశ్చర్యంగా ఉంది. ట్రాన్స్కో సిఫార్సుల ఫైలే ఈపీడీసీఎల్లో లేకపోవడం మరో విడ్డూరం. అందుకే లోతుగా దర్యాప్తు చేస్తున్నాం. త్వరలో వివరాలు తెలుస్తాయి. – కె. వెంకటేశ్వరరావు (ట్రాన్స్కో విజిలెన్స్ జేఎండీ) దోషులకు శిక్ష తప్పదు హాలోజన్ బల్బుల కొనుగోళ్లలో అనేక అనుమానాలు వస్తున్నాయి. అవినీతి జరిగిందనే తెలుస్తోంది. అందుకే తిరిగి విచారణ చేపట్టాం. దోషులను శిక్షించి తీరుతాం. – శ్రీకాంత్ నాగులాపల్లి (ట్రాన్స్కో సీఎండీ) -
స్మార్ట్గా సబ్ స్టేషన్..!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 3 వేలకుపైగా ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్లను ఆటోమేషన్ చేయబోతున్నారు. ఇందులో భాగంగా వీలైనంత ఎక్కువగా స్మార్ట్ మీటర్లు బిగించేందుకు విద్యుత్ శాఖ సన్నద్ధమైంది. త్వరలో ఈ ప్రక్రియ కార్యరూపం దాల్చబోతోందని ట్రాన్స్కో సీఎండీ శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. ప్రతి సబ్ స్టేషన్ ఆన్లైన్తో అనుసంధానం ► వైర్లు తెగినా, సబ్స్టేషన్ ఉపకరణాలు కాలిపోయినా వాటిని గుర్తించడానికే ఒక రోజు పడుతోంది. అప్పటి వరకూ విద్యుత్ సరఫరా ఆగిపోవాల్సిందే. ► ఆటోమేషన్ ప్రక్రియతో ప్రతీ సబ్స్టేషన్ ఆన్లైన్తో అనుసంధానమై ఉంటుంది. కేంద్ర కార్యాలయానికీ ఇది కనెక్ట్ అవుతుంది. ► విద్యుత్ సరఫరా ఆగిపోతే వెంటనే అదెక్కడ జరిగిందో తెలుసుకోవచ్చు. సిబ్బంది సకాలంలో స్పందించకపోతే కారణాలు తెలియజేయాల్సి ఉంటుంది. దీనివల్ల జవాబుదారీ తనం పెరుగుతుంది. ఆటోమేషన్ ఎలా? ► ప్రస్తుతం ఉన్న ప్రతీ 30 సబ్స్టేషన్లను కలిపి ఒక కేంద్ర సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తారు. ప్రతీ సబ్స్టేషన్లోనూ రిమోట్ టెర్మినాలజీ యూనిట్ను ఏర్పాటు చేస్తారు. దీని ద్వారానే కేంద్ర కార్యాలయానికి, క్షేత్రస్థాయి సిబ్బందికి సంకేతాలు వెళ్తాయి. ఎక్కడన్నా లైన్కు ఇబ్బంది వచ్చినప్పుడు కొన్ని క్షణాల్లోనే దీనిద్వారా గుర్తిస్తారు. ► ప్రతీ బ్రేకర్ వద్ద ఏర్పాటు చేసిన ఇంటెలిజెన్స్ ఎలక్ట్రానిక్ డివైస్ వల్ల దానంతట అదే సమస్య ఏంటో తెలుసుకుని, కేంద్ర సబ్ స్టేషన్కు చేరవేస్తుంది. ► ఈ టెక్నాలజీ ద్వారా గంటలోపే ఎలాంటి సమస్యనైనా గుర్తించి, కేంద్ర సబ్స్టేషన్ పరిధిలోని సిబ్బంది ఆన్లైన్ ద్వారా క్షేత్రస్థాయి సిబ్బందితో పనిచేయించే వీలుంది. ఫలితంగా మానవ వనరుల వాడకం తగ్గుతుంది. నిర్వహణ వ్యయం భారీగా తగ్గుతుంది. దీంతో విద్యుత్ ధర తక్కువగా ఉండే వీలుంది. డిమాండ్కు తగ్గ టెక్నాలజీ శ్రీకాంత్ నాగులాపల్లి, ట్రాన్స్కో సీఎండీ రాష్ట్ర ప్రభుత్వం 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు చేపట్టింది. దీని డిమాండ్ మేనేజ్మెంట్కు సబ్స్టేషన్ల ఆటోమేషన్ తప్పనిసరి అని గుర్తించింది. అందుకే దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దీనివల్ల నిర్వహణ వ్యయం చాలా వరకు తగ్గుతుంది. నాణ్యమైన సేవలు అందుతాయి. -
పదేళ్లలో 6 వేల మెగావాట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే పదేళ్లలో మరో 6 వేల మెగావాట్ల జల విద్యుదుత్పత్తి చేయాలని ఇంధనశాఖ లక్ష్యంగా నిర్ణయించింది. స్థిర విద్యుత్ ఇవ్వాలన్న కేంద్రం సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. పంప్డ్ స్టోరేజీలకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. 2030 జల విద్యుదుత్పత్తి ప్రణాళికను ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి వివరించారు. ► ప్రస్తుతం రాష్ట్రంలో 1,700 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా 2030 నాటికి 7,700 మెగావాట్లకు పెరగనుంది. ఫలితంగా చౌక విద్యుత్ లభిస్తుంది. మాచ్ఖండ్ కేంద్రం నుంచి మనకు యూనిట్ 90 పైసలకే లభిస్తోంది. ► పునరుత్పాదక ఇంధన వనరుల పీపీఏలు చేసుకోవాలంటే 30 శాతం వరకూ స్థిర విద్యుత్ (24 గంటలూ ఉత్పత్తి చేయగల విద్యుత్) అందుబాటులో ఉండాలని కేంద్రం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు నెలకొల్పుతున్నారు. మరో 10 వేల మెగావాట్లకుపైగా సౌర, పవన విద్యుత్ ఉత్పత్తికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 6 వేల మెగావాట్ల జల విద్యుత్ అవసరం. ► ఆన్ రివర్ పంప్డ్ స్టోరేజీ, ఆఫ్ రివర్ పద్ధతుల్లో పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ ప్రాజెక్టులకు నెడ్క్యాప్ ప్రణాళికలు సిద్ధం చేసింది. 29 ప్రాంతాలను గుర్తించి డీపీఆర్లు సిద్ధం చేస్తున్నారు. 2030 నాటికి 6 వేల మెగావాట్ల జల విద్యుత్ అందుబాటులోకి వచ్చే వీలుందని నెడ్క్యాప్ ఎండీ రమణారెడ్డి వివరించారు. -
భరోసా ఉంటేనే.. పవన, సౌర విద్యుత్ ఒప్పందాలు
సాక్షి, అమరావతి: పవన, సౌర విద్యుత్ కొనుగోళ్లపై డిస్కమ్లకు మరింత భద్రత కల్పిస్తూ కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఒప్పందం ప్రకారం అవసరమైన విద్యుత్ ఇవ్వగలిగే శక్తి ఉన్న సంస్థతోనే ఒప్పందాలు చేసుకోవాలని స్పష్టం చేసింది. భవిష్యత్లో జరిగే పీపీఏలన్నింటికీ మార్గదర్శకాలు వర్తిస్తాయని వెల్లడించింది. ఏపీతో పాటు అన్ని రాష్ట్రాలకు పంపిన ఈ మార్గదర్శకాలను ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి ఆదివారం మీడియాకు వివరించారు. ఇవీ నిబంధనలు! ► పునరుత్పాదక ఇంధన వనరులైన పవన, సౌర విద్యుత్ను పోటీ బిడ్డింగ్ ద్వారానే డిస్కమ్లు తీసుకోవాలి. వీటితో 25 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వరకూ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవచ్చు. ► పవన, సౌర విద్యుత్నే డిస్కమ్లు పూర్తిగా నమ్ముకుంటే గాలి తగ్గినప్పుడు, సూర్యరశ్మి లేనపుడు సమస్యలొస్తున్నాయి. ఉత్పత్తి తగ్గి షెడ్యూల్ ప్రకారం విద్యుత్ అందకపోతే అప్పటికప్పుడు మార్కెట్లో విద్యుత్ కొనుగోలు సవాల్గా మారుతోంది. ► పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి లభ్యతను శాస్త్రీయంగా అంచనా వేయలేకపోతున్నారు. అందువల్ల వీటి మీదే నమ్మకం పెట్టుకోవద్దని కేంద్రం సూచించింది. పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థలు పీపీఏ ప్రకారం 85 శాతం విద్యుత్ ఉత్పత్తిని కచ్చితంగా చేయాల్సిందే. పీక్ అవర్స్లో కూడా విద్యుత్ ఇవ్వాలి. ఈ నేపథ్యంలో 49 శాతం సంప్రదాయ విద్యుత్ను అందించాలి. ► 51 శాతం పునరుత్పాదక ఇంధనం, 49 శాతం «థర్మల్, జల, ఇతరాలు విద్యుత్ ఇస్తామన్న భరోసా ఇస్తేనే పీపీఏ చేసుకోవాలి. ► ఎక్కడి నుంచి సంప్రదాయ విద్యుత్ తీసుకుంటున్నారో పీపీఏ సమయంలో అంగీకారంతో పొందుపర్చాలి. ఇలాంటి పీపీఏలకు లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్సీ) కూడా డిస్కమ్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే...? ► గ్రీన్ ఎనర్జీలో భాగంగా సంప్రదాయేతర, పునరుత్పాదక ఇంధన వనరులను విధిగా తీసుకోవాలని కేంద్రం 2015లోనే అన్ని రాష్ట్రాలకూ షరతులు పెట్టింది. ఈ టార్గెట్ను ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే దాటింది. ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ లభ్యతలో పవన, సౌర విద్యుత్ వాటా 50 శాతం వరకూ ఉంటోంది. ► అయితే, ప్రకృతి అనుకూలించకపోవడంతో ఒక్కసారిగా విద్యుత్ ఉత్పత్తి పడిపోతోంది. అప్పటికప్పుడు థర్మల్ విద్యుత్ను అందుబాటులోకి తేలేకపోతున్నారు. ఈ సమయంలో మార్కెట్లో ఎక్కువ ధరకు విద్యుత్ తీసుకోవడంతో డిస్కమ్లపై అధిక భారం పడుతోంది. ఇక మీదట పీపీఏ చేసుకుంటే ఇలాంటి సమస్యల నుంచి విద్యుత్ సంస్థలు బయటపడొచ్చు. -
జోరువానల్లోనూ విద్యుత్ వెలుగులు
సాక్షి, అమరావతి: వర్షాకాలంలోనూ ఎలాంటి అంతరాయాలు లేకుండా కరెంట్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి ఆదేశించారు. విద్యుత్ లైన్లు, టవర్లు, సబ్ స్టేషన్లను తరచూ పరిశీలించాలని సూచించారు. క్షేత్రస్థాయి విద్యుత్తు అధికారులతో శ్రీకాంత్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు, వరదల నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలను విద్యుత్శాఖ శుక్రవారం మీడియాకు వెల్లడించింది. ఏఈలు అప్రమత్తం కావాలి... ► గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు తలెత్తే ప్రాంతాల్లో అసిస్టెంట్ ఇంజనీర్లు తక్షణమే అప్రమత్తం కావాలి. ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు, కండక్టర్లు తెప్పించుకోవాలి. ఏఈల పనితీరును ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ► ఉత్తరాంధ్రలో వాగులు వంకలు ఉప్పొంగే అవకాశం ఉన్నందున లైన్ మెటీరియల్స్, టవర్ భాగాలు, కండక్టర్లు, ఇన్సులేటర్లను అదనంగా సమకూరుస్తున్నారు. ► డీజిల్ జనరేటర్లు, శాటిలైట్ ఫోన్లు, వాకీటాకీలు సిద్ధంగా ఉంచారు. ► ప్రతి సర్కిల్లోనూ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వ్యవసాయ విద్యుత్కు అత్యధిక ప్రాధాన్యం: మంత్రి బాలినేని పొలం పనులు ప్రారంభమైన నేపథ్యంలో వ్యవసాయ విద్యుత్కు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి సరఫరాలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా చూడాలని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. రబీ నాటికి నూటికి నూరుశాతం ఫీడర్ల ద్వారా 9 గంటల విద్యుత్ అందించాలన్నారు. ఈ దిశగా జరుగుతున్న చర్యలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ తీసుకుంటున్న చర్యలపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. -
విద్యుత్ పంపిణీ సంస్థల పటిష్టానికి రోడ్మ్యాప్
సాక్షి, అమరావతి: విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక, నిర్వహణ సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు రోడ్మ్యాప్ తయారు చేసినట్టు ఇంధనశాఖ ప్రకటించింది. నిధులు సమకూర్చుకోవడం, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే దీని ముఖ్యోద్దేశమని తెలిపింది. ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి నేతృత్వంలో రూపొందించిన రోడ్మ్యాప్ వివరాలను రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ చంద్రశేఖర్రెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. నష్టాలకు బ్రేక్ ► సాంకేతిక నష్టాలను కనిష్టంగా 12 శాతానికి తగ్గించాలని ఇంధనశాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 2019–20లో ఇవి 13. 36 శాతానికి తగ్గించటం ద్వారా చెప్పుకోదగ్గ పురోగతి సాధించినట్లు తెలిపారు. నిజానికి 2018–19లో 16.36 శాతంమేర సాంకేతిక నష్టాలు ఉన్నట్టు వివరించారు. ► 2024–25 నాటికి ఏపీఈఆర్సీకి సమర్పించే వార్షిక ఆదాయ అవసర నివేదికకు, వాస్తవ ఖర్చుకు తేడా లేకుండా చూడాలని నిర్ణయించారు. ఈ గ్యాప్ 2019 లో యూనిట్ కు రూ.2.26 ఉండగా, 2020లో రూ.1.45కి తగ్గించారు. దీనివల్ల రూ 4,783 కోట్లు ఆదా చేయగలిగారు. ఫీడర్ల విభజన ► గృహ, వ్యవసాయ ఫీడర్ల విభజన ద్వారా విద్యుత్ సరఫరాలో మరింత నాణ్యత పెంచనున్నారు. వ్యవసాయ విద్యుత్ లోడ్ ను గ్రీన్ ఎనర్జీ కిందకు తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం సోలార్ విద్యుత్తో వ్యవసాయ ఫీడర్లను అనుసంధానం చేయాలని విద్యుత్ శాఖ భావిస్తోంది. ► మౌలిక సదుపాయాల పెంపులో భాగంగా డిస్కమ్లు ఇప్పటికే 77 నూతన సబ్ స్టేషన్లు, 19,502. 57 కిలోమీటర్ల పొడవైన 33 కే వీ, 11 కే వీ ఎల్టీ లైన్లను పూర్తి చేశాయి. దీనికోసం రూ.524.11 కోట్లు ఖర్చు చేశాయి. ► విద్యుత్ ప్రసార పంపిణీ వ్యవస్థను ఆధునీకరించే లక్ష్యంలో భాగంగా ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ సేవల నిర్వహణకు ప్రత్యేకంగా ఐటీ క్యాడర్ ను ఏర్పాటు చేయనున్నారు. సూపర్వైజరి కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్, డిస్ట్రిబ్యూటెడ్ మేనేజ్మెంట్ సిస్టంను అన్ని స్థాయిల్లోనూ తీసుకురాబోతున్నారు. -
చర్చించాకే విద్యుత్ చట్టంలో మార్పులు
సాక్షి, అమరావతి: రాష్ట్రాలతో మరోదఫా సంప్రదించిన తర్వాతే విద్యుత్ చట్టంలో మార్పులు తెస్తామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. రాష్ట్రాల నుంచి అందిన అభ్యంతరాలపై లోతుగా చర్చిస్తామన్నారు. రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రులతో ఆయన శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి, నెడ్క్యాప్ ఎండీ రమణారెడ్డి ఇందులో పాల్గొన్నారు. అభిప్రాయాలు స్వీకరించాం విద్యుత్ పంపిణీ సంస్థల్లో ప్రైవేట్ పోటీ, నియంత్రణ మండలి చైర్మన్, సభ్యుల నియామకాన్ని కేంద్ర పరిధిలోకి తేవడం, విద్యుత్ సబ్సిడీలను నేరుగా లబ్ధిదారులకే అందించే పలు సంస్కరణలపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం విద్యుత్ చట్ట సవరణను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దీనివల్ల రాష్ట్ర ప్రాధాన్యతలకు ఇబ్బందులు తలెత్తుతాయని ఏపీతో పాటు పలు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ అంశంపై కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రులతో సుదీర్ఘంగా వీడియో కాన్పరెన్స్ ద్వారా చర్చించారు. ఇప్పటికే ఫీడ్ బ్యాక్ అందిందని, అందరి ఆమోదం తీసుకున్నాకే ముందుకెళ్తామని చెప్పారు. ఫీడర్లవారీగా సోలార్ ప్లాంట్లు ఫీడర్ల వారీగా సోలార్ ప్లాంట్లు నెలకొల్పే రాష్ట్రాలకు వ్యయంలో 30 శాతం సబ్సిడీ అందిస్తామని తెలిపారు. ఏపీలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు గల అవకాశాలను నెడ్క్యాప్ ఎండీ రమణారెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. డిస్కమ్లను బలోపేతం చేయాలి కోవిడ్–19 నేపథ్యంలో నష్టపోయిన రాష్ట్రాలకు ఆత్మ నిర్భర్ భారత్ కింద సాయం అందిస్తున్నామని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ చెప్పారు. విద్యుత్ పంపిణీ సంస్థలను బలోపేతం చేయాలని సూచించారు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ప్రాధాన్యతపై చర్చించారు. డిమాండ్కు తగ్గట్టుగానే మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఏడాదిలోనే బకాయిలన్నీ చెల్లించాం: మంత్రి బాలినేని డిస్కమ్లను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుందని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రజలపై భారం పడకుండా, విద్యుత్ సంస్థలను అప్పుల నుంచి బయట పడేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తోందని చెప్పారు. పాత బకాయిలన్నీ ఏడాది వ్యవధిలోనే చెల్లించామని తెలిపారు. -
మరో 1,600 మెగావాట్ల విద్యుత్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏపీ జెన్కో మరో రెండు కొత్త సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్లను ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఉత్పత్తిలోకి తెచ్చేందుకు సిద్ధమైంది. దీనివల్ల మరో 1,600 మెగావాట్ల మేర అదనపు విద్యుదుత్పత్తి జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక చేయూతతో ఈ ప్లాంట్ల నిర్మాణం వేగం పుంజుకుంది. ప్రస్తుతం ఏపీ జెన్కో 4,500 మెగావాట్ల విద్యుత్ను అందిస్తుండగా కొత్తవి అందుబాటులోకి వస్తే జెన్కో ఉత్పత్తి సామర్థ్యం 6,100 మెగావాట్లకు పెరుగుతుంది. భవిష్యత్తులో డిమాండ్ పెరిగినా సొంతంగా విద్యుత్ సరఫరా చేసే స్థాయికి జెన్కో ఎదిగింది. ఈ ప్రాజెక్టుల పురోగతిని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి గురువారం ‘సాక్షి’కి వివరించారు. ► రాష్ట్ర అవసరాల కోసం ఇబ్రహీంపట్నంలో డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం 8వ యూనిట్ (800 మెగావాట్లు), నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో రెండోదశ (800 మెగావాట్లు)ను 2015లో ప్రారంభించారు. వాస్తవానికి ఇవి 2018లోనే పూర్తవ్వాల్సినా గత ప్రభుత్వం ఇష్టానుసారంగా కాంట్రాక్టులు ఇవ్వడం, సకాలంలో ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో వ్యయం పెరిగింది. ► గత ప్రభుత్వం ఇష్టానుసారంగా విద్యుత్ సంస్థల ఆస్తులను కుదువపెట్టి అప్పులు చేసింది. ఈ ప్రభుత్వం వచ్చేనాటికి జెన్కోకు స్థాయికి మించి అప్పులున్నాయి. ఫలితంగా కొత్తగా అప్పు అందే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నం కొత్త థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణం పనులు మందగించాయి. ► ఈ రెండు ప్లాంట్లకు ఒక్కోదానికి రూ.వెయ్యి కోట్ల చొప్పున ప్రభుత్వమే గ్యారెంటీగా ఉండి అప్పు ఇప్పించేందుకు అంగీకారం తెలిపింది. దీంతో పలు ఆర్థిక సంస్థలు ముందుకు రావడంతో ఆరు నెలల్లో రెండు ప్లాంట్లు అందుబాటులోకి వస్తాయని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ప్లాంట్ల వ్యయం ఇలా రూ.కోట్లలో -
‘పవర్’ఫుల్.. పొదుపు
సాక్షి, అమరావతి: విద్యుత్తును ఆదా చేస్తే పొదుపు చేసినట్లే... మరి వృథా ఖర్చులను నియంత్రిస్తే ప్రజలపై భారాన్ని కూడా నివారించినట్లే! విద్యుత్తుశాఖ ఇదే సూత్రాన్ని పాటించి ఏడాదిలో ప్రజలపై రూ.4,783.23 కోట్ల మేర భారం పడకుండా చేయగలిగింది. తద్వారా బిల్లుల భారాన్ని తప్పించింది. రాష్ట్ర విద్యుత్ రంగం స్వీయ నియంత్రణతో ఏడాదిలోనే అద్వితీయ పురోగతి సాధించింది. విద్యుత్తు సంస్థల నిర్వహణ వ్యయంలో కొనుగోళ్లే అత్యంత కీలకం. గత సర్కారు అవసరానికి మించి ఖరీదైన ప్రైవేట్ విద్యుత్ను తీసుకోవడంతో డిస్కమ్లు అప్పుల్లో కూరుకుపోయాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చౌక విద్యుత్ను అన్వేషించడంతోపాటు దుబారాకు ఏమాత్రం తావివ్వడం లేదు. ► 2018–19లో రాష్ట్ర విద్యుత్ సంస్థల మొత్తం వ్యయం రూ.48,110.79 కోట్లు కాగా 2019–20లో దీన్ని రూ.43,327.56 కోట్లకు తగ్గించడం ద్వారా ప్రభుత్వం రూ.4,783.23 కోట్లను ఆదా చేసింది. గత సర్కారు చేసిన అప్పులకు ఈ ఏడాది కాలంలో అత్యధిక వడ్డీలు కట్టాల్సి వచ్చింది. లేదంటే ఆదా మరింత ఎక్కువగా ఉండేది. ► గత సర్కార్ అడ్డగోలుగా ప్రైవేట్ విద్యుత్ కొనుగోలు చేయగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పూర్తిగా నియంత్రించింది. 2018–19లో రూ.39,262.81 కోట్లున్న విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని 2019–20లో రూ. 34,775.46 కోట్లకు కుదించారు. 2018–19లో వాస్తవానికి 7,629 మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్ ఉంది. కానీ గత సర్కార్ ప్రైవేట్ సంస్థలకు మేలు చేసేందుకు 6,952 మిలియన్ యూనిట్లు అనవసరంగా కొనుగోలు చేసింది. ► టీడీపీ హయాంలో సౌర విద్యుత్ మార్కెట్లో యూనిట్ రూ.2.44కే లభిస్తున్నా యూనిట్ రూ. 8.09 చొప్పున కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది. ఫలితంగా 2019 డిసెంబర్ 31 నాటికి డిస్కమ్లకు రూ. 29 వేల కోట్ల మేర నష్టాలు వచ్చాయి. పవన విద్యుత్లోనూ ఇదే తంతు. ► గతంలో సగటున యూనిట్ రూ.7 చొప్పున బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేయగా ఈ ఏడాది యూనిట్ రూ.1.63 నుంచి రూ.2.80కి మించనివ్వలేదు. దీనివల్ల రూ.700 కోట్లు ఆదా అయ్యాయి. అండగా ప్రభుత్వం ► ప్రజాధనాన్ని ఆదా చేసిన విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం అండగా నిలిచింది. 2019–20లో రూ. 17,904 కోట్లు అందించింది. 2019 డిసెంబర్ 31 వరకూ డిస్కమ్లకు ఉన్న రూ.13,391 కోట్ల సబ్సిడీలో రూ.8,655 కోట్లు విడుదల చేసింది. 2019–20లో మరో రూ.9,249 కోట్లు విడుదల చేసింది. ► గత సర్కారు ఉత్పత్తిదారులకు బకాయిపడిన రూ.34,384 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. 2019–20లో బిల్లుల చెల్లింపు కోసం రూ. 20,384 కోట్లు విడుదల చేసింది. ► మెట్రిక్ టన్ను బొగ్గు గతంలో రూ.1,824 ఉండగా ఏపీ జెన్కోలో బొగ్గు రవాణాకు రివర్స్ టెండరింగ్ చేపట్టడం వల్ల ఇప్పుడు రూ.1,027కే అందుతోంది. కృష్ణపట్నంలో రూ.1,010కే వస్తోంది. విద్యుత్ రంగం పునరుజ్జీవం రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాత్మక చర్యలు చేపట్టడం వల్ల ఏడాది కాలంగా విద్యుత్ రంగం పునరుజ్జీవం దిశగా పయనిస్తోందని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. ఈమేరకు ప్రభుత్వానికి అందించనున్న నివేదికను ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఏ.చంద్రశేఖర్రెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. విద్యుత్ కొనుగోళ్లలో అనవసర వ్యయాన్ని అరికట్టామని, చౌక విద్యుత్తో ప్రజలపై భారం పడకుండా నియంత్రించామని వివరించారు. ► రాష్ట్ర విద్యుత్ రంగం స్వీయ నియంత్రణతో ఏడాదిలోనే అద్వితీయ పురోగతి సాధించింది. ► గత సర్కారు అవసరానికి మించి ఖరీదైన ప్రైవేట్ విద్యుత్ను తీసుకోవడంతో డిస్కమ్లు అప్పుల్లో కూరుకుపోయాయి. ► ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం దుబారాకు ఏమాత్రం తావివ్వడం లేదు. దీంతో ఈ ఏడాదిలో ప్రజలపై రూ.4,783.23 కోట్ల మేర భారం పడకుండా చేయగలిగింది. తద్వారా బిల్లుల భారాన్ని తప్పించింది. ► గతంలో యూనిట్ రూ.7 చొప్పున బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేసేవారు. ఈ ఏడాది యూనిట్ రూ.1.63 నుంచి రూ.2.80కి మించనివ్వలేదు. ► దీని వల్ల దాదాపు రూ.700 కోట్లు ఆదా అయ్యాయి. -
కావాల్సినంత కరెంట్
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్లో డిమాండ్కు తగ్గట్టుగా విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది. రబీ నాటికి వ్యవసాయానికి 9 గంటల పగటి విద్యుత్ను వందశాతం ఫీడర్ల ద్వారా ఇవ్వాలని సూచించింది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను తక్షణమే రూపొందించాలని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంధనశాఖ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి బుధవారం ఏపీ ట్రాన్స్కో, డిస్కమ్ల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ► రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరా వ్యవస్థలో నిర్వహణ లోటుపాట్లకు సంబంధించి చీఫ్ ఇంజినీర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది. కీలకమైన పవర్ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ పరికరాలలో అంతరాయాలు ఏర్పడకుండా చూడాలి. ► రాష్ట్రంలో నిరంతర విద్యుత్, వ్యవసాయానికి 9 గంటల పగటి పూటే విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఖరీఫ్లో వ్యవసాయ విద్యుత్ డిమాండ్ పెరుగుతుందనే అంచనాలకు అనుగుణంగా అధికారులు ముందస్తు ఏర్పాట్లు çచేసుకోవాలి. ► వర్షాకాలంలో మారుమూల గ్రామాల్లో కూడా విద్యుత్ సరఫరాలో అవాంతరాలు ఏర్పడకుండా చూడాలి. బ్రేక్ డౌన్ సమయంలో తక్షణ విద్యుత్తు పునరుద్ధరణకు వీలుగా విద్యుత్ పరికరాలను అందుబాటులో ఉంచాలి. ► సబ్ స్టేషన్లు, జిల్లా వారీగా పనితీరు స్కోర్ నమోదు చేసి ర్యాంకులివ్వాలి. సమీక్ష సమావేశంలో ట్రాన్స్కో జేఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు, విజిలెన్స్ జేఎండీ కే వెంకటేశ్వరరావు, పంపిణీ సంస్థల సీఎండీలు నాగలక్ష్మి సెల్వరాజన్, హెచ్ హరనాథ రావు, జె పద్మ జనార్దన రెడ్డి పాల్గొన్నారు. -
వ్యవసాయానికి ఉచిత విద్యుత్తులో రికార్డు
-
కోరినన్ని కనెక్షన్లు
సాక్షి, అమరావతి: రైతులకు వ్యవసాయ ఉచిత విద్యుత్ కనెక్షన్ల మంజూరులో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఏడాది కాలంలోనే 63,068 కొత్త కనెక్షన్లు జారీ చేసింది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అర్హత కలిగిన ప్రతి దరఖాస్తుదారుడికి ఆన్లైన్లోనే మంజూరు విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఫలితంగా రైతులు వ్యవసాయ కనెక్షన్ కోసం రోజులు తరబడి అధికారుల చుట్టూ తిరిగే దుస్థితి తప్పింది. 2019 మార్చి 31 నాటికి రాష్ట్రంలో 18,07,100 వ్యవసాయ ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య 18,70,168కి పెరిగింది. వీటన్నింటికీ నిరంతరాయంగా 9 గంటల ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. రబీ కల్లా అన్నీ ఫీడర్లలో... రాష్ట్రంలో ప్రస్తుతం 6,663 వ్యవసాయ విద్యుత్ ఫీడర్లున్నాయి. వీటిల్లో 5,383 ఫీడర్లు మాత్రమే (81 శాతం) 9 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయగలిగే స్థాయిలో ఉన్నాయి. మిగతా ఫీడర్లను కూడా బలోపేతం చేసి విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం అదనంగా రూ.1,700 కోట్లు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో 426.88 కిలోమీటర్ల మేర కొత్త లైన్లు, 64 కొత్త సబ్ స్టేషన్ల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. రబీ నాటికల్లా వందశాతం ఫీడర్లలో 9 గంటల వ్యవసాయ విద్యుత్ అందించాలని ప్రభుత్వం దిశా నిర్దేశం చేసింది. మరికొన్ని కనెక్షన్లు! నాణ్యమైన విద్యుత్ అందుతుండడంతో వ్యవసాయ కనెక్షన్లకు డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు ట్రాన్స్ఫార్మర్లపై అనధికారిక కనెక్షన్లు తొలగించి కొత్తవి ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇందుకు లైన్లు, సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని డిస్కమ్ల సీఎండీలు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు సాధ్యమైనంత వరకు కనెక్షన్ ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రతి జిల్లాలోనూ దీన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామని ఇంధనశాఖ అధికారులు వివరించారు. రైతుల కోసం ఎంతైనా ‘రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కొత్త కనెక్షన్ల విషయంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం. ఉచిత విద్యుత్ పథకాన్ని శాశ్వతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా ప్రత్యేకంగా 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి’ – శ్రీకాంత్ నాగులాపల్లి, ఇంధనశాఖ కార్యదర్శి -
‘కోత’లకు కత్తెర
సాక్షి, అమరావతి: విద్యుత్ అంతరాయాల నియంత్రణలో రాష్ట్రం పురోగతి సాధించింది. కచ్చితమైన ప్రణాళికతో ఏడాది కాలంలోనే అంతరాయాలను 37 శాతం తగ్గించగలిగింది. అధికారంలోకొచ్చిన తొలి రోజుల్లోనే విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష జరిపారు. అప్పటి వరకూ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్ కోతలుండేవి. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చాలని అధికారులకు సీఎం సూచించారు. ఆ మేరకు ఇంధన శాఖ ముందుకెళ్లి ఈ ఘనత సాధించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి బుధవారం విడుదల చేశారు. ► ట్రాన్స్కో 400, 200, 132 కేవీ సబ్స్టేషన్లు నిర్మించింది. ఇందుకోసం రూ.382.18 కోట్లు ఖర్చు చేశారు. రూ.85.40 కోట్లతో 389.75 కి.మీ మేర కొత్తగా ట్రాన్స్కో లైన్లు వేశారు. ► ఏపీ డిస్కమ్ల పరిధిలో ఏడాదిలో 77 నూతన సబ్ స్టేషన్లు నిర్మించారు. 19,502.57 కి.మీ మేర కొత్త లైన్లు వేశారు. దీనికి రూ.524.11 కోట్లు వెచ్చించారు. ► ఫలితంగా విద్యుత్ పంపిణీ, సరఫరా వ్యవస్థ మరింత బలోపేతమైంది. అధిక లోడును తట్టుకునే శక్తి విద్యుత్ శాఖకు వచ్చింది. ఈ కారణంగా విద్యుత్ అంతరాయాలు గణనీయంగా తగ్గాయి. ► నాణ్యమైన విద్యుత్ సరఫరాలో రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) కీలకపాత్ర పోషిస్తోంది. ఈ విభాగంలోనూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారు. విద్యుత్ డిమాండ్ను ముందే గుర్తించి, అందుకు తగ్గట్టుగా ఉత్పత్తి కేంద్రాలకు, పంపిణీ సంస్థలకు సరైన సమయంలో ఆదేశాలిస్తున్నారు. దీనివల్ల గ్రిడ్పై లోడ్ను అదుపులో ఉంచడం సాధ్యమవుతోంది. మౌలిక సదుపాయాలను మెరుగు పర్చడం వల్ల ట్రాన్స్కో, డిస్కమ్ల నష్టాలు తగ్గాయి. 2018–19తో పోలిస్తే ట్రాన్స్కో నష్టాలు 2019–20లో 2.91 శాతానికి తగ్గాయి. డిస్కమ్ల నష్టాలు 6.21 శాతానికి తగ్గాయి. -
‘అపోహలే.. అందులో వాస్తవం లేదు’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరెంట్ బిల్లులు పెరిగాయన్న ప్రచారంలో వాస్తవం లేదని, కేవలం అపోహలు మాత్రమేనని ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ స్పష్టం చేశారు. ఆయన గురువారం మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘కరోనా నేపథ్యంలో మార్చి తర్వాత మే నెలలో మీటర్ రీడింగ్ తీసుకున్నాం. ఈ 60 రోజుల బిల్లు ఒకే కేటగిరీ కింద ఒకే శ్లాబ్ సిస్టమ్ కింద బిల్లు వేశారన్నది అపోహ మాత్రమే. 60 రోజుల బిల్లును రెండుతో భాగించి రెండు నెలలకు బిల్లు వేశామని’’ ఆయన వివరించారు. (టెన్త్ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం) మార్చి నెలలో 20 రోజులకు గత ఆర్థిక సంవత్సరంలో ఏ కేటగిరి కింద వినియోగదారుడు ఉంటే అదే కేటగిరి వర్తించేలా బిల్లు వేశామని పేర్కొన్నారు. ఏప్రిల్ నెలకు సంబంధించి కొత్తగా రూపొందించిన కేటగిరి ప్రకారం బిల్లులు వేశామన్నారు. గతంలో స్ట్రాటిక్ విధానం ఉండేదన్నారు. కానీ ఈ విధానం సరిగా లేని కారణంగా ఏపీఈఆర్సీలో వచ్చిన సూచనల మేరకు డైనమిక్ విధానం అమల్లోకి వచ్చిందన్నారు. ఒకవేళ ఒక నెలలో కరెంట్ బిల్లు అధికంగా వస్తే ఆ నెలలోనే కేటగిరి మారుతుందే తప్ప 12 నెలలకూ వర్తించదన్నారు. మే నెలలో వేసవి వల్ల అధికంగా బిల్లు వస్తే జూన్లో అదే కేటగిరి కొత్త విధానంలో ఉండదని చెప్పారు. బిల్లింగ్ విధానంపై ఎవరికైనా అనుమానాలుంటే వెబ్సైట్లో నంబర్ టైప్ చేసి పాత బిల్లులను కూడా తెలుసుకోవచ్చన్నారు. అనుమానాలుంటే ‘1912’ లో సంప్రదించవచ్చని.. ఉన్నతాధికారులు వెంటనే అందుబాటులోకి వచ్చి అనుమానాలు నివృత్తి చేస్తారని తెలిపారు. (విద్యుత్ బిల్లులపై ప్రజల్లోకి వెళ్దాం) ప్రతీ ఏడాది శీతాకాలంలో కరెంట్ బిల్లులు తక్కువగా ఉంటాయని వేసవిలో బిల్లులు అధికంగా ఉంటాయని పేర్కొన్నారు. కోవిడ్ వల్ల కూడా గృహ వినియోగం గతంలో కంటే ఈ సారి అధికంగా పెరిగిందన్నారు. అనుమానం ఉంటే ఆన్లైన్లో గత ఏడాది బిల్లులు, ఇప్పటి బిల్లులు చూసుకోవచ్చన్నారు. బిల్లింగ్ విధానం కూడా పూర్తి పారదర్శకంగా జరిగిందని ఎక్కడా తప్పు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. లాక్డౌన్ కారణంగా జూన్ 30 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా చెల్లించవచ్చన్నారు. గడువు పెంచిన కారణంగా ఈలోపు డిస్ కనెక్షన్ జరగదని, ఒకవేళ డిస్కనెక్షన్ చార్జీలు వేస్తే రాబోయే బిల్లులో మినహాయింపు ఇస్తామని వివరించారు. కరెంట్ బిల్లులపై ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉన్నా నివృత్తి చేయడానికి విద్యుత్ శాఖ అధికారులు సిద్ధంగా ఉన్నారని శ్రీకాంత్ స్పష్టం చేశారు. -
విద్యుత్ బిల్లులపై ప్రజల్లోకి వెళ్దాం
సాక్షి, అమరావతి: విద్యుత్ బిల్లులపై నెలకొన్న అనుమానాలను తొలగించేందుకు ప్రతీ వినియోగదారుడికీ సవివరంగా లేఖ రాయాలని ఇంధనశాఖ నిర్ణయించింది. 1.45 కోట్ల విద్యుత్ వినియోగదారులకు వ్యక్తిగతంగా లేఖలు రాసే బాధ్యతను విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలకు అప్పగించింది. మరోవైపు అన్ని ప్రాంతాల్లోనూ విద్యుత్ బిల్లులను సగటు (ర్యాండమ్)గా పరిశీలన చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. విద్యుత్ బిల్లులు పెరిగాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో డిస్కమ్ల సీఎండీలు, జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్లతో ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వివరాలను ఇంధనశాఖ సీఈవో చంద్రశేఖర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ► వినియోగదారుల్లో ఉన్న అపోహలను దూరం చేయడానికి బిల్లులను పారదర్శకంగా వారి సమక్షంలోనే తనిఖీ చేయాలి. శాస్త్రీయ పద్ధతిలో బిల్లులు ఏ విధంగా తీశామో... వినియోగదారులకు భారం ఏ విధంగా తగ్గించామో వివరించాలి. ఇంకా అనుమానాలుంటే అధికారులు వారికి అర్థమయ్యేలా తెలియజెప్పాలి. ► డిస్కమ్లు తమ వెబ్సైట్లో 1.45 కోట్ల వినియోగదారులకు సంబంధించిన గత రెండేళ్ల విద్యుత్ వినియోగ వివరాలు అందుబాటులో ఉంచాలి. వినియోగదారులు తమ కస్టమర్ ఐ.డీ నంబరు ఫీడ్ చేయడం ద్వారా వివరాలు తెలుసుకునేలా విస్తృత ఏర్పాట్లు చేయాలి. ► 60 రోజులకు మీటర్ రీడింగ్ తీసినా.. ఏ నెలకు ఆ నెల విద్యుత్ వినియోగం మేరకే కరెంటు బిల్లు అందిస్తాం. ఎంత వాడితే అంతే కరెంటు బిల్లు వస్తుంది. శాస్త్రీయ పద్ధతిలోనే బిల్లులు రెండు నెలల వినియోగాన్ని విభజించి మార్చి నెల వినియోగానికి 2019–20 టారిఫ్ కేటగిరీ వర్తింప చేశామని, అలాగే ఏప్రిల్ వినియోగానికి 2020–21 నూతన టారిఫ్ ప్రకారం బిల్లులు జారీ చేశామని శ్రీకాంత్ స్పష్టం చేశారు. దీని వల్ల ఏప్రిల్లో విద్యుత్ బిల్లు కొంత మేర తగ్గే అవకాశం ఉందని తెలిపారు. మే నెలకు కూడా విడిగానే బిల్లులు తయారుచేస్తామని వివరించారు. 1912 టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేశామని, ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమించామని తెలిపారు. మే విద్యుత్ బిల్లుల చెల్లింపు గడువును జూన్ 30 వరకు పెంచినట్టు తెలిపారు. విద్యుత్ బిల్లు ఇచ్చిన 15 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం దీన్ని 45 రోజుల పాటు పొడిగించారు. అప్పటిదాకా ఎలాంటి అపరాధ రుసుములు ఉండవన్నారు. -
లాక్డౌన్లోనూ ఉచిత విద్యుత్కు పెద్దపీట
సాక్షి, అమరావతి: వ్యవసాయ ఉచిత విద్యుత్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని.. ట్రాన్స్ఫార్మర్ల విషయంలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా తక్షణమే స్పందించాలని చెప్పినట్లు ట్రాన్స్కో సీఎండీ శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. వీటిపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. కరోనా కారణంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో రాష్టంలో విద్యుత్ డిమాండ్పై ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి నివేదికలను శుక్రవారం పరిశీలించారు. అందులో తేలిన అంశాలేమిటంటే.. - ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ డిమాండ్ రోజుకు 154 మిలియన్ యూనిట్లు. ఇందులో వ్యవసాయ విద్యుత్ వినియోగం 42 మిలియన్ యూనిట్లు ఉంటోంది. అంటే.. సాధారణ రోజుల్లో మాదిరిగానే ఇప్పుడూ వ్యవసాయ విద్యుత్ వినియోగం కొనసాగుతోంది. - మార్చి చివరి వారం.. ఏప్రిల్ మొదటి వారంలో పంటలకు నీళ్లు ఎక్కువగా అవసరం. ఈ కారణంగా విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. ఇందుకోసం స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు చేయాలని మొదట్లో భావించారు. - రాష్ట్ర విద్యుత్ వినియోగంలో సగటున రోజుకు 33 మిలియన్ యూనిట్లు ఉచిత విద్యుత్ వాడకమే ఉంటుంది. మార్చి, ఏప్రిల్లో ఇది ఇంకా పెరుగుతుంది. ఈ లెక్కన ఈ రెండు నెలల్లో విద్యుత్ డిమాండ్ రోజుకు 204 మిలియన్ యూనిట్లు ఉండొచ్చని అంచనా వేశారు. - లాక్డౌన్ కారణంగా వాణిజ్య విద్యుత్ వాడకం గణనీయంగా తగ్గింది. అందరూ ఇళ్లకే పరిమితం కావడంవల్ల గృహ విద్యుత్ వినియోగం కొంచెం పెరిగింది. వీటన్నింటినీ బేరీజు వేసుకుంటే కొత్తగా అదనపు విద్యుత్ కొనాల్సిన అవసరం లేదని లెక్కతేల్చారు. - కానీ, వ్యవసాయ విద్యుత్ వినియోగం ఉదయం 7–11 గంటల మధ్య ఎక్కువగా ఉంటోందని పంపిణీ సంస్థల ఉన్నతాధికారులు తెలిపారు. 10 గంటల వరకూ గృహ వినియోగం సాధారణంగానే ఉంటుంది. 10–11 మధ్య ఏసీల వాడకం పెరగడంతో, అదే సమయంలో వ్యవసాయ విద్యుత్ వినియోగం ఉండటంతో స్వల్పంగా డిమాండ్ ఏర్పడుతోంది. - దీంతో ట్రాన్స్ఫార్మర్లపై లాక్డౌన్ ప్రభావం తీవ్రంగా ఉందని ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. రోజుకు కనీసం 70 వరకూ ట్రాన్స్ఫార్మర్లకు ఏదో ఒక రకంగా ఇబ్బంది ఏర్పడుతోందని తెలిపారు. దీంతో రాష్ట్రంలో దాదాపు 500 ట్రాన్స్ఫార్మర్లను తక్షణమే మార్చాలని అధికారులు అనుకున్నారు. కానీ, లాక్డౌన్ కారణంతో అవి అందుబాటులోకి రాలేదు. - అయినా.. ట్రాన్స్ఫార్మర్ల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యొద్దని విద్యుత్ సౌధ నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. ఫోన్ చేసిన 24 గంటల్లో ట్రాన్స్ఫార్మర్ రిపేరు చేసి ఉపయోగంలోకి తెస్తున్నామని డిస్కమ్ల సీఎండీలు తెలిపారు. -
అన్ని వర్గాలతో చర్చించాకే నిర్ణయం
‘బీచ్ లవ్’పై పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీకాంత్ వివరణ సాక్షి, విశాఖపట్నం: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖపట్నంలో నిర్వహించతలపెట్టిన బీచ్ లవ్ ఫెస్టివల్పై అన్ని వర్గాలతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. ‘బాబు సర్కారు సమర్పించు బీచ్ లవ్’ శీర్షికతో ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలు సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేవిగానే ఉంటాయని పేర్కొన్నారు. బీచ్ లవ్ ఫెస్టివల్ నిర్వహణకు బాధ్యులైన అధికారులు ఆ కార్యక్రమం ప్రతి దశలోనూ వ్యక్తిగతంగా డిప్యూటీ కలెక్టర్(విశాఖ) నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అనుమతి లేనిదే ఏ కార్యక్రమాన్నీ అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఇక్కడ సంస్కృతి, వారసత్వం, ప్రకృతి అందాలను అంతర్జాతీయంగా పర్యాటకుల దగ్గరకు తీసుకెళ్లాలన్నదే ప్రభుత్వ అభిమతమన్నారు. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు అమితంగా ప్రేమించే కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. అది ప్రైవేటు కార్యక్రమం: టూరిజం రీజనల్ డెరైక్టర్ విశాఖలో బీచ్ లవ్ ఫెస్టివల్ పూర్తిగా ప్రైవేటు కార్యక్రమమని పర్యాటక శాఖ రీజనల్ డెరైక్టర్(విశాఖ) శ్రీరాములునాయుడు వివరణ ఇచ్చారు. దీనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందించడం లేదని స్పష్టం చేశారు. ఉత్సవం పేరుతో సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధంగా కార్యక్రమాల నిర్వహణను అనుమతించబోమన్నారు. ఈ ఫెస్టివల్లో చేపట్టే కార్యక్రమాలపై కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలించాకే అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు. -
ఉడా వీసీగా శ్రీకాంత్
సాక్షి, విజయవాడ : వీజీటీఎం ఉడా వైస్ చైర్మన్గా నాగులపల్లి శ్రీకాంత్ బుధవారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత వీసీ పి.ఉషాకుమారి బదిలీ కాగా, ఆమెకు ఇంకా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. రెండు వారాల క్రితమే సీఆర్డీఏ స్పెషల్ కమిషనర్గా నియమితులైన శ్రీకాంత్ వివిధ కారణాలు, సింగపూర్ బృందం హడావుడి కారణంగా ఆ బాధ్యతలు చేపట్టలేదు. ఈ క్రమంలో సీఆర్డీఏ స్పెషల్ కమిషనర్ బాధ్యతతో పాటు ఉడా వైస్ చైర్మన్గా కూడా ఆయన్నే నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మరోవైపు వీజీటీఎం ఉడా సాంకేతికంగా రద్దు కాలేదు. -
సీఆర్డీఏ ప్రత్యేక కమిషనర్ గా శ్రీకాంత్
నెల్లూరు జిల్లా కలెక్టర్గా జానకి.. ఉత్తర్వులు జారీ సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) ఆర్డినెన్స్ వెలువడకుండానే, దానికి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక కమిషనర్ను నియమించింది. 1998 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన నెల్లూరు జిల్లా కలెక్టర్ నాగులపల్లి శ్రీకాంత్ను ప్రత్యేక కమిషనర్గా నియమించింది. గ్రేటర్ విశాఖపట్టణం అదనపు కమిషనర్ ఎం. జానకిని ప్రభుత్వం నెల్లూరు జిల్లా కలెక్టర్గా నియమించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జపాన్ పర్యటనకు వెళ్లిన వారి స్థానంలో ఇన్చార్జిలు ముఖ్యమంత్రితోపాటు జపాన్ పర్యటనకు వెళ్లిన అధికారుల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఇన్చార్జిలను నియమించింది. ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.పి. టక్కర్ బాధ్యతలను ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి అజేయ కల్లంకు అప్పగించారు. సతీష్ చంద్ర జపాన్ వెళ్లినందున ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ బాధ్యతలను ఏపీ భవన్ ప్రత్యేక కమిషనర్ వీణా ఈస్కు అప్పగించారు. ఐ అండ్ ఐ ముఖ్య కార్యదర్శి డి. సాంబశివరావు బాధ్యతలను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పి.వి. రమేశ్కు అప్పగించారు. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జె.ఎస్.వి.ప్రసాద్ బాధ్యతలను ప్రభుత్వ రంగ సంస్థల ముఖ్య కార్యదర్శి శాలిని మిశ్రాకు అప్పగిం చారు. ఇంధనశాఖ కార్యదర్శి అజయ్ జైన్ బాధ్యతలను జెన్కో ఎండీ కె.విజయానంద్కు అప్పగించారు. ఇంటెలిజెన్స్ అదనపు డీజీ అనురాధ బాధ్యతలను డీజీపీ చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.