NSG
-
విజయవాడ రైల్వేస్టేషన్కు ఎన్ఎస్జీ–1 హోదా
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వే స్టేషన్ భారతీయ రైల్వేలోనే ఎంతో ప్రతిష్టాత్మక ఎన్ఎస్జీ–1 (నాన్ సబర్బన్ గ్రూప్) హోదా సాధించి దేశంలోనే టాప్ 28 స్టేషన్లలో ఒకటిగానూ, దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్ తరువాత రెండో స్టేషన్గా అరుదైన ఘనత సాధించింది. రైల్వేబోర్డు 2017–18 సంవత్సరం నుంచి ప్రతి ఐదేళ్లకోసారి స్టేషన్ల కేటగిరీ ఎంపిక విధానం ప్రవేశపెట్టింది. ఈ విధానంలో రూ.500 కోట్ల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం లేదా 20 మిలియన్ల ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న స్టేషన్లకు ఎన్ఎస్జీ–1 హోదా వస్తుంది. అప్పట్లో విజయవాడ స్టేషన్ రెండు ప్రమాణాలలో తక్కువగా ఉండటంతో ఎస్ఎస్జీ–2 హోదాతో సరిపెట్టుకుంది. ఐదేళ్ల తరువాత 2023–24లో రైల్వేబోర్డు తాజా సమీక్షలో విజయవాడ స్టేషన్ అత్యధికంగా రూ. 528 కోట్ల వార్షిక ఆదాయం, 16.84 మిలియన్ల ప్రయాణికులను కలిగి ఉండడంతో రైల్వేశాఖ ఎన్ఎస్జీ–1 హోదా ప్రకటించింది. డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ మాట్లాడుతూ విజయవాడ డివిజన్కు ప్రతిష్టాత్మక ఎన్ఎస్జీ–1 హోదా రావటం గర్వకారణమన్నారు. వ్యాపార, వాణిజ్య పరంగా డివిజన్ ఎంతో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని తెలిపారు. ప్రయాణికుల అవసరాల మేరకు ఇంకా మెరుగైన సౌకర్యాలు అందించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. -
ఢిల్లీలో బాంబు కలకలం: ఓ ఇంట్లో అనుమానాస్పద బ్యాగ్..!!
-
పేలుడు పదార్ధాల డ్రోన్ను నేలకూల్చిన ఎన్ఎస్జీ
జమ్మూ కశ్మీర్ : పేలుడు పదార్థాలు కలిగిన డ్రోన్ను భద్రతా దళాలు నేలకూల్చాయి. శుక్రవారం కనాచక్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. డ్రోన్లో ఉన్న 5 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. దీనిపై జమ్మూ కశ్మీర్ పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘కనాచక్ ఏరియాలో ఓ డ్రోన్ను నేలకూల్చాము. దానినుండి పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నాము. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది’’ అని తెలిపాడు. కాగా, గత నెలలో జమ్మూ ఏయిర్ బేస్లో చోటు చేసుకున్న డ్రోన్ దాడి నేపథ్యంలో ఎన్ఎస్జీ సిటీలో యాంటీ డ్రోన్ సిస్టమ్ను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ఇతర ఏయిర్ బేస్లలో డ్రోన్ దాడులు జరగకుండా ఉండేందుకు అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం సత్వారీ ఏరియాలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ డ్రోన్ను గుర్తించారు. జులై 16న జమ్మూ ఏయిర్ బేస్లో సంచరిస్తున్న ఓ డ్రోన్ను రాడార్లు, యాంటీ డ్రోన్ సిస్టమ్ గుర్తించాయి. దీంతో భద్రతా దళాలు దాన్ని నేల కూల్చాయి. -
పౌరసత్వం ఇచ్చి తీరుతాం..
కోల్కతా: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కింద దేశంలోని శరణార్థులందరికీ కేంద్ర ప్రభుత్వం పౌరసత్వం ఇచ్చి తీరుతుందని.. అప్పటివరకు వెనకడుగు వేసేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్షా స్పష్టం చేశారు. సీఏఏ శరణార్థులకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించింది మాత్రమేనని.. దీనివల్ల ఏ ఒక్క వ్యక్తి తన పౌరసత్వాన్ని కోల్పోడని ఉద్ఘాటించారు. తృణమూల్ కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు సీఏఏపై అసత్య ప్రచారాన్ని చేస్తూ.. మైనారిటీలు, శరణార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. పౌరసత్వం కోసం శరణార్థులు పత్రాలు చూపించాలని ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. కోల్కతాలో ఆదివారం నిర్వహించిన ఓ పబ్లిక్ ర్యాలీలో పాల్గొన్న అమిత్షా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ధ్వజమెత్తారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ప్రచారం చేసి.. మమత అల్లర్లకు ఆజ్యం పోస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని దళితులు, వెనుకబడిన మతువా కులాలకు పౌరసత్వం రాకుండా మమత అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దమ్ముంటే పౌరసత్వ చట్ట అమలును ఆపాలని మమతకు సవాల్ విసిరారు. శరణార్థులకు పౌరసత్వం ఇవ్వాలని ప్రధాని మోదీ ఆలోచిస్తుంటే మమత సహా ప్రతిపక్షాల నేతలు వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. 2021లో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజార్టీతో విజయం సాధించి.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఆర్ నోయ్ అన్యాయ్ (ఇక అన్యాయాన్ని సహించం)’అనే ప్రచారాన్ని అమిత్షా ప్రారంభించారు. ర్యాలీలో ‘గోలీమారో’నినాదాలు.. షహీద్ మినార్ గ్రౌండ్లో జరిగిన అమిత్షా ర్యాలీలో కొందరు బీజేపీ కార్యకర్తలు ‘గోలీమారో’అని నినాదాలు చేశారు. దీనికి సంబంధించి కోల్కతా పోలీసులను వివరణ కోరగా.. స్పందించేందుకు నిరాకరించారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. భారత్లో మెరుగైన రక్షణ విధానం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో మెరుగైన రక్షణ విధానాన్ని రూపొందించిందని అమిత్షా పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని స్పష్టం చేశారు. 10 వేల ఏళ్ల చరిత్రలో భారత్ ఎలాంటి దాడులూ జరపలేదని.. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయన్నారు. ఎవరైనా తమ భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించినా.. జవాన్లు, ప్రజల మీద దాడులకు యత్నించినా.. భారత్ గట్టిగా బదులిస్తుందని పేర్కొన్నారు. రాజర్హాట్లో జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) 29వ స్పెషల్ కంపోసిట్ గ్రూప్ (ఎస్సీజీ) కాంప్లెక్స్ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్షా మాట్లాడుతూ.. ఎన్ఎస్జీ అంటే ఉగ్ర వ్యతిరేక దళంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని అన్నారు. -
‘మెరుపు దాడులతో ఆ దేశాల సరసన భారత్’
కోల్కతా : దేశాన్ని విభజించి శాంతిని అడ్డుకునే వారి వెన్నులో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) వణుకు పుట్టించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అలాంటి శక్తులతో పోరాడి వాటిని అంతమొందించే బాధ్యత ఎన్ఎస్జీదేనని అన్నారు. కోల్కతాలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పాలనా పగ్గాలు చేపట్టిన అనంతరం తాము చురుకైన సమర్ధవంతమైన రక్షణ విధానాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు. మెరుపు దాడులను విజయవంతంగా చేపట్టడం ద్వారా అమెరికా, ఇజ్రాయిల్ వంటి దేశాల సరసన భారత్ చేరిందని అన్నారు. యావత్ ప్రపంచంలో శాంతిని భారత్ కోరుకుంటుందని, ఏ ఒక్కరిపైనా భారత్ ఎన్నడూ దాడి చేయదని, కానీ మన శాంతిని విచ్ఛిన్నం చేసి మన సైనికుల ప్రాణాలను బలిగొంటే మాత్రం వారికి దీటుగా బదులిస్తుందని స్పష్టం చేశారు. కాగా నిరసనల నడుమ ఆదివారం ఉదయం కోల్కతాకు చేరుకున్న అమిత్ షా ఏప్రిల్లో జరిగే మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కోల్కతాలో జరిగే భారీ ర్యాలీతో శ్రీకారం చుట్టనున్నారు. చదవండి : అమిత్ షా రాజీనామా చేయాలి: సోనియా గాంధీ -
ట్రంప్ పర్యటన.. ఎక్కడికక్కడ వైమానిక నిఘా
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బారత్కు రానున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు. ట్రంప్ బస చేయనున్న ఐటీసీ మౌర్య హోటల్, రోడ్షో నిర్వహించనున్న మార్గాల్లో ఇప్పటికే పలుమార్లు తనిఖీలు నిర్వహించారు. సర్దార్ పటేల్ మార్గ్, మౌర్య హోటల్ సమీపంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వందల సంఖ్యలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని మౌర్య హోటల్ వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. హోటల్లోని ప్రతి ఫ్లోర్లో ఢిల్లీ పోలీసులు సివిల్ దుస్తుల్లో పెట్రోలింగ్ నిర్వహించనున్నారు. అమెరికాకు చెందిన సీక్రెట్ సర్వీస్ అధికారులు, భారత్కు చెందిన జాతీయ భద్రతా సిబ్బంది (ఎన్ఎస్జీ), స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులతో పాటు భారీ సంఖ్యలో పోలీసులు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. ఢిల్లీ పోలీసులు సైతం వీరికి జతకలిశారు. వీరితో పాటు దాదాపు 10 వేల మంది పోలీసులు గుజరాత్లోని పలు వ్యూహాత్మక ప్రాంతాల్లో పహారా కాస్తున్నారు. 25 మంది ఐపీఎస్ ఆఫీసర్లు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలు, స్టేట్ రిజర్వ్ పోలీసులు, చేతక్ కమాండోలు, యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్లు సైతం వీరికి జతకలిశాయి. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి మొటెరా స్టేడియం వరకు దాదాపు 22 కి.మీ. మేర ట్రంప్, మోదీల రోడ్షో జరగనున్న నేపథ్యంలో పరిసరాలను గమనించేందుకు పోలీసులు డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. బాంబు పేలుళ్లు వంటివి సంభవించకుండా అధునాతన పరికరాల సాయంతో రోడ్డు మార్గాన్ని పలుమార్లు జల్లెడ పట్టారు. రోడ్షో జరిగే మార్గంలో 100 వాహనాలతో రిహార్సల్ నిర్వహించారు. మెలానియాకు సైతం.. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలను సందర్శించనున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ట్రంప్ పర్యటించనున్న అన్ని మార్గాల్లో డబుల్ బ్యారికేడింగ్ ఏర్పాటు చేశారు. ఈ మార్గాలపై వైమానిక నిఘా ఉంచారు. సబర్మతి ఆశ్రమానికి తొలిసారిగా భారత్ పర్యటనకు వస్తున్న ట్రంప్ సోమవారం గుజరాత్లోని సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించనున్నట్లు సిటీ పోలీసు కమిషనర్ ఆశిష్ భాటియా వెల్లడించారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి భారీ రోడ్షోలో పాల్గొననున్న ట్రంప్.. మార్గమధ్యంలో సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించనున్నారని చెప్పారు. దాదాపు 15 నిమిషాల పాటు ఆయన ఆశ్రమంలో గడపనున్నారని పేర్కొన్నారు. ఆ తర్వాత తిరిగి రోడ్షోను కొనసాగిస్తారని వెల్లడించారు. ట్రంప్ ఆగ్రాలోని తాజ్మహల్ను కూడా సందర్శించనున్నట్లు తెలిపారు. ట్రంప్తో పాటు ప్రధాని మోదీ సైతం సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. ట్రంప్ హృదయ్ కుంజ్ను సందర్శించనున్నారని సబర్మతీ ఆశ్రమం సెక్రటరీ అమృత్ మోదీ వెల్లడించారు. ట్రంప్ రాక సందర్భంగా ఆశ్రమంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సీక్రెట్ ఏజెన్సీ ఏం చేస్తుంది? అమెరికా అధ్యక్షుడితోపాటు ఆయన కుటుంబం రక్షణ బాధ్యతలను చూసుకునే బాధ్యత అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీదే. ప్రథమ పౌరుడి రక్షణకు సంబంధించిన ప్రతి విషయాన్నీ ఈ విభాగమే పర్యవేక్షిస్తుంటుంది. అధ్యక్షుడు ప్రయాణించే మార్గాన్ని శుభ్రంగా ఉంచటంతోపాటు అనుకోని ఆపద ఎదురైతే తప్పించుకునే మార్గాలు, ప్రణాళికలు సిద్ధంగా ఉంచుతుంది. ప్రమాదం సంభవిస్తే అవసరమైన రక్తాన్ని కూడా సిద్ధంగా ఉంచుతుంది. అధ్యక్షుడిని ఎల్లప్పుడూ అనుసరించి ఉండే వారికీ ఈ విభాగం రక్షణ కల్పిస్తుంది. అధ్యక్షునితో పాటు ఎల్లప్పుడు ఉండేవాటిలో 20 కిలోల బరువుండే జీరో హాలిబర్టన్ నల్లటి బ్రీఫ్కేస్ కూడా ఒకటి. ఇందులో అమెరికా అణు క్షిపణుల రహస్య కోడ్ భద్రపరిచి ఉంటుంది. అధ్యక్షుడు విశ్రాంతి తీసుకునే గది వరకు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ అనుసరిస్తూనే ఉంటాడు. చట్టం ప్రకారం.. తనను ఒంటరిగా వదిలి వేయాలని అధ్యక్షుడు సైతం ఆ అధికారిని ఆదేశించలేడు. 1865లో ఏర్పాటైన ఈ విభాగం 1901 నుంచి అధ్యక్షుడికి రక్షణగా నిలుస్తోంది. సుమారు 7 వేల మందితో కూడిన ఈ విభాగంలో 25% మహిళ లుం టారు. ప్రపంచంలోని ఏ దేశ సైన్యం కంటే కూడా అత్యంత కఠినమైన శిక్షణ వీరికి ఇస్తారు. సీక్రెట్ సర్వీస్ కోసం అందిన ప్రతి 100 దరఖాస్తుల్లో ఒకటి కంటే తక్కువగానే ఎంపిక వుతుంటాయి. వర్జీనియాలో ఉండే ఈ విభాగం లో శిక్షణ పొందిన వారు.. అధ్యక్షుడి కోసం ప్రాణాలైనా అర్పిస్తామంటూ హాలీవుడ్ సినిమా ల్లో చూపిస్తున్న విధంగా ప్రమాణ చేయరట! గంటకు 1.02 కోట్లు రష్యా అధ్యక్షుడి మెర్సిడెంజ్ బెంజ్ కారు, చైనా అధ్యక్షుడి హాంగ్కి ఎల్5 కారుతో పోల్చుకుంటే అమెరికా అధ్యక్షుడి కారు బీస్ట్ చాలా ఖరీదైంది. అధునాతనమైంది కూడా. అలాగే, అమెరికా అధ్యక్షుడి ఎయిర్ఫోర్స్ వన్ విమానం గంట ప్రయాణానికి రూ.1.02 కోట్లు ఖర్చవుతుందట. ఈ విమానంలో పెద్ద ఆఫీసు, కాన్ఫరెన్స్ హాల్, వంద మందికి సరిపడా ఆహారం వండేందుకు వీలుగా ఏర్పాట్లు ఉన్నాయి. అధ్యక్షుడికి విలాసవంతమైన సౌకర్యాలతో కూడిన సూట్ ఉంటుంది. మొత్తంగా ఇది ఒక విమానం మాదిరిగా కాకుండా హోటల్గా ఉంటుంది. అణ్వస్త్రం, క్షిపణి దాడిని సైతం తట్టుకునేలా ఇందులో ఏర్పాట్లుంటాయి. అమెరికాపై దాడి జరిగినప్పుడు ప్రతిస్పందించేలా ఎయిర్ ఫోర్స్ వన్ సంచార కమాండ్ సెంటర్గా పనిచేస్తుంది. వీటితోపాటు అధ్యక్షుడి భారీ కారు లిమోజిన్, వెయ్యి మంది సిబ్బంది, ప్రత్యేక రక్షణ పరికరాలు.. వీటన్నిటికీ సీ5 రకం కార్గో విమానం ఉంటుంది. 2017లో ట్రంప్ జెరుసలేం పర్యటనకు వెళ్లినప్పుడు కింగ్ డేవిడ్ హోటల్లో బస చేశారు. ఆ హోటల్లో ఒక్క రాత్రికి రూ.3.95 లక్షలుండే సూట్లతోపాటు సిబ్బంది కోసం 1,100 రూంలను బుక్ చేయాల్సి వచ్చిందట. -
సాయుధ బలగాల కుదింపు
న్యూఢిల్లీ: పారామిలటరీ బలగాలను కుదించి, పోరాటపటిమను పెంచే వివిధ ప్రతిపాదనలను కేంద్రం తీవ్రంగా పరిశీలిస్తోంది. ‘ఒకే సరిహద్దు.. ఒకే సైన్యం’విధానంలో భాగంగా సశస్త్రసీమా బల్(ఎస్ఎస్బీ), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) విభాగాలను విలీనం చేయడం వంటి ప్రతిపాదనలున్నాయని అధికారులు వెల్లడించారు. దీనిపై సీనియర్ అధికారులతో ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన నివేదికను మరో ఆరునెలల్లో అందజేయనుంది. సీఆర్పీఎఫ్తో ఉగ్రవాద వ్యతిరేక కమాండోలు, ఎన్ఎస్జీలను కూడా ఏకం చేసే అంశంపైనా చర్చ జరుగుతోంది. ఉగ్ర వ్యతిరేక పోరు, హైజాక్ ఘటనలు, మావోయిస్టు, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే ఈ రెండు విభాగాలను ఒకే కమాండ్ కిందికి తీసుకువచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. హోం శాఖ నేతృత్వంలో జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ)తోపాటు సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్, ఎస్ఎస్బీలున్నాయి. -
ప్రాంక్ కాల్.. ఆపై కటకటాల పాలు..
ముంబై : ప్రధాని నరేంద్ర మోదీపై దాడులు జరుగుతాయని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ ప్రాంక్ కాల్ చేసిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ముంబై పోలీసులు సోమవారం వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. జార్ఖండ్కు చెందిన 22 ఏళ్ల కాశీనాథ్ మండల్ ముంబైలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. ఇటీవల జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) కంట్రోల్ రూమ్ కాంటాక్ట్ నెంబర్ సేకరించాడు. ఆపై ఎన్ఎస్జీ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి ప్రధాని మోదీపై దాడి జరుగుతుందని సమాచారం ఇచ్చాడు. కెమికల్ దాడి జరిగే అవకాశం ఉందని, తన వద్ద సమాచారం ఉందని ఎన్ఎస్జీని నమ్మించాడు. ఫోన్ నెంబర్ ఆధారంగా కాశీనాథ్ను సెంట్రల్ ముంబైలోని డీబీ మార్గ్ పోలీసులు జూలై 27న అదుపులోకి తీసుకున్నారు. సూరత్కు వెళ్లే రైలులో ప్రయాణిస్తున్న సమయంలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నరేంద్ర మోదీని కలుసుకోవడమే తన ఉద్దేశమని కాశీనాథ్ విచారణలో వెల్లడించాడు. ఇటీవల జార్ఖండ్లో జరిగిన నక్సల్స్ దాడిలో తన స్నేహితుడు చనిపోయాడని.. ఈ విషయంపై ప్రధాని మోదీని కలుసుకుని మాట్లాడాలని భావించినట్లు నిందితుడు పేర్కొన్నాడు. నిందితుడిని నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. -
దేశరక్షణలో ఎన్ఎస్జీ సుదర్శన చక్రం
-
ఎన్ఎస్జీ పేరు వింటే ఉగ్రవాదులకు దడ
సాక్షి, రంగారెడ్డి జిల్లా : జాతీయ భద్రతా దళాల(ఎన్ఎస్జీ) పేరు వింటే ఉగ్రవాదుల గుండెల్లో గుబులు పుడుతుందని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ అన్నారు. దేశంపై కన్నెత్తి చూసే టెర్రరిస్టులకు ఎన్ఎస్జీ సుదర్శన చక్రంలా కనిపిస్తుందని అన్నారు. అన్ని బలగాల్లోకెల్లా ఎన్ఎస్జీ కమాండోలు అత్యుత్తమమని కొనియాడారు. దేశాన్ని సురక్షితంగా ఉంచడంలో వాటిపాత్ర చాలా గొప్పదని ప్రశంసించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వినోబానగర్లో రూ.157.84 కోట్ల వ్యయంతో 200 ఎకరాల్లో నిర్మించిన 28వ స్పెషల్ కంపోజిట్ గ్రూప్(ఎస్సీజీ) భవన సముదాయాన్ని మంగళవారం రాజ్నాథ్సింగ్ ప్రారంభించారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఎన్ఎస్జీ డైరెక్టర్ జనరల్ సుదీప్ లక్టాకియా, రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఉగ్రవాదం ప్రపంచ నలుమూలలకు పాకిందని, సామాజిక మాధ్యమాల్లోనూ కొత్త సవాళ్లను విసురుతోందని రాజ్నాథ్ అన్నారు. ఈ తరహా సవాళ్లను సైతం అధిగమించేందుకు సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. దేశంలో విధ్వంసాలు సృష్టించేందుకు పొరుగు దేశం ప్రయత్నిస్తోందని పాకిస్తాన్ను ఉద్దేశించి అన్నారు. 2008లో ముంబైలో టెర్రరిస్టులు చేసిన దాడుల నేపథ్యంలో బలగాలు ప్రతిచర్యకు దిగే సమయాన్ని వీలైనంతగా తగ్గించాలన్న ఉద్దేశంతో ఎస్సీజీ రీజినల్ హబ్లను ఏర్పాటు చేయాలని కేంద్రం భావించిందన్నారు. అందులో భాగంగానే హైదరాబాద్తో పాటు ముంబై, చెన్నై, కోల్కతాలో స్థాపించినట్లు వివరించారు. ముంబై, అక్షరధామం, పఠాన్కోట్ దాడులు తీవ్ర నష్టం కలిగించాయని, అలాంటి ఘటనలను భారతీయులు మర్చిపోలేరని చెప్పారు. ప్రముఖులకు రక్షణ కల్పించడంతోపాటు ప్రతిష్టాత్మక జాతీయ, అంతర్జాతీయ సదస్సులను విజయవంతంగా నిర్వహించడంలో ఎన్ఎస్జీల పాత్రను అభినందించారు. ఆ దళాలు చేపట్టే ఎటువంటి కార్యక్రమాల్లోనైనా పాల్గొనడాన్ని గౌరవప్రదంగా భావిస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఎలాంటి భద్రతా బలగాలైనా ఎన్ఎస్జీ తరహాలో ధైర్యసాహసాలు, నైపుణ్యాలను కలిగి ఉండాలన్నారు. వచ్చే సంవత్సరంలో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు సిద్ధమవుతున్న 16 మంది సభ్యులతో కూడిన ఎన్ఎస్జీ బృందానికి ఆయన అభినందనలు తెలిపారు. ఉగ్రమూకలను మట్టుబెట్టడంలో ఎన్ఎస్జీలు కీలకంగా పనిచేస్తున్నాయని ఎన్ఎస్జీ డీజీ సుదీప్ లక్టాకియా అన్నారు. ఎన్ఎస్జీలు తన శక్తియుక్తులను ఇనుమడింప చేసుకొనే ప్రయత్నాల్లో భాగంగా ఫ్రాన్స్, యూఎస్ఏలతో కలసి విన్యాసాలను నిర్వహించిందని తెలిపారు. ధైర్యానికి, త్యాగానికి, నైపుణ్యాలకు ఎన్ఎస్జీలు ప్రతీకలని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఎస్సీజీ ఏర్పాటవడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. అంతకుముందు స్పెషల్ కంపోజిట్ కాంప్లెక్స్లో శిక్షణలో భాగంగా నేర్చుకున్న విన్యాసాలను ఎన్ఎస్జీ బ్లాక్క్యాట్ కమాండోలు ప్రదర్శించారు. కేంద్ర హోంమంత్రి తదితరులు వీటిని వీక్షించి కమాండోల ధైర్యసాహసాలను ప్రశంసించారు. -
ఎన్ఎస్జీ రెడీ..
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఉగ్రమూకల పీచమణిచే జాతీయ భద్రతాదళం(ఎన్ఎస్జీ) ప్రాంతీయ శిక్షణా కేంద్రం మంగళవారం నుంచి అందుబాటులోకి రానుంది. 2008 నవంబర్లో ముంబై మహానగరంపై ఐఎస్ఐ తీవ్రవాదులు దాడులకు పాల్పడిన అనంతరం ముంబై, చెన్నై, కోల్కతా, హైదరాబాద్లో ఎన్ఎస్జీ ప్రాంతీయ శిక్షణా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముష్కరులను హతమార్చిన ఎన్ఎస్జీ కమాండోల పోరాట పటిమకు అప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలందాయి. ఇదే క్రమంలో ఇలాంటి ఘటనలను దీటుగా ఎదుర్కొనేందుకు నలువైపులా ప్రాంతీయ శిక్షణా కేంద్రాలు అవసరమని కేంద్ర సర్కారు భావించింది. అందుకనుగుణంగా దక్షిణాదిన చెన్నైతోపాటు మన రాష్ట్రంలో ఎన్ఎస్జీ ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రూ.157.84 కోట్లతో 200 ఎకరాల్లో.. ఇబ్రహీంపట్నం మండలం వినోభానగర్లో 200 ఎకరాల విస్తీ ర్ణంలో ప్రతిపాదించిన ఈ కమాండో శిక్షణా కేంద్రం నిర్మాణ పనులకు 2013లో అప్పటి కేంద్ర హోంమంత్రి సుశీల్కుమార్ షిండే శంకుస్థాపన చేశారు. రూ. 157.84 కోట్లతో కేంద్ర ప్రజా పనుల విభాగం నిర్మించిన ఈ కాంప్లెక్స్ను మంగళవారం కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ ప్రారంభించనున్నారు. ఈ ప్రాంగణంలో హెలిపాడ్, ఫైరింగ్ రేంజ్, ఇండోర్ షూటింగ్ రేంజ్, స్విమ్మింగ్ ఫూల్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉన్నాయి. కాగా, కేంద్ర హోంమంత్రి పర్యటన నేపథ్యంలో డీజీపీ మహేందర్రెడ్డి సోమవారం ఎన్ఎస్జీ ప్రాంగణాన్ని పరిశీలించారు. -
పాకిస్తాన్కు గట్టి షాకిచ్చిన అమెరికా
వాషింగ్టన్: పాకిస్తాన్కు అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్( ఎన్ఎస్జీ)లో సభ్యత్వం కోసం ఆరాటపడుతున్న పాకిస్తాన్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలేలా చేసింది. అణుసంబంధిత వ్యాపారం చేసే ఏడు సంస్థలపై అమెరికా నిషేదం విధించడంతో ఎన్ఎస్జీలో సభ్యత్వం పొందాలనే పాక్ ఆశలు అడియాశలయ్యాయి. పాక్కు చెందిన ఈ సంస్థలు అణు సంబంధిత వ్యాపారం చేస్తూ అమెరికాకు నష్టం చేకూరుస్తాయనే నెపంతో నిషేదం విధించింది. ఉగ్ర కార్యకలాపాలపై నిఘా ఉంచే ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో పాక్ ఆశలు ఆదిలోనే ఆవిరయ్యాయి. భారత్తో సమానంగా ఎన్ఎస్జీలో సభ్యత్వం కావాలని పాక్ గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే భారత్కు ఈ విషయంలో అనేక దేశాల మద్దతు లభించింది. అలాగే క్షిపణి పరిఙ్ఞానం, వాసేనర్ ఒప్పందం, ఆస్ట్రేలియా గ్రూప్లో ఇప్పటికే భారత్కు సభ్యత్వం ఉంది. సాధారణంగా ఈ సభ్యత్వాలను ఎన్ఎస్జీకి ఎంట్రీగా భావిస్తారు. ఉత్తర కొరియా అణ్వాయుధ పరీక్షలకు పాక్ సహాయపడిందనే వార్తలు రావడంతో ఎన్ఎస్జీలో చేరాలని భావిస్తోన్న పాకిస్తాన్ ఆకాంక్ష వెనుక సదుద్దేశం లేదని అమెరికా గ్రహించింది. తమ జాతీయ భద్రత, విదేశాంగ విధాన ప్రయోజనాలకు విరుద్ధంగా కార్యకలాపాలు చేపట్టే ఆస్కారం ఉందని బలంగా నమ్ముతూ ఈ ఏడు పాకిస్థాన్ సంస్థలపై నిషేధం విధించామని యూఎస్ బ్యూరో ఆఫ్ ఇండస్ట్రీ అండ్ సెక్యూరిటీ పేర్కొంది. ఈ జాబితాలో మొత్తం 23 సంస్థలను చేర్చినట్టు తెలిపింది. అయితే పాకిస్తాన్పై ఒత్తిడి తీసుకురావడానికే అమెరికా ఈ నిర్ణయాలు తీసుకుంటుందని పాకిస్తాన్కి చెందిన ఓ పత్రిక పేర్కొంది. -
లాలు జడ్ప్లస్ వెనక్కి
న్యూఢిల్లీ/పట్నా: బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్ యాదవ్కు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జీ) కల్పిస్తున్న జడ్ప్లస్ భద్రతను కేంద్రం ఉపసంహరించింది. ఇకపై ఆయనకు జడ్ కేటగిరీ భద్రత కల్పిస్తారు. కేంద్రం తీరుపై లాలు, ఆయన ఇద్దరు కుమారులు తేజ్ ప్రతాప్, తేజస్వి యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సామాజిక న్యాయం, మత సామరస్యం కోసం తాను చేస్తున్న పోరాటాన్ని ఆపేసేలా కేంద్రం బెదిరించడానికి కుట్ర పన్నుతోందని లాలు ఆరోపించారు. తనకేమైనా అయితే నితీశ్ కుమార్, మోదీ ప్రభుత్వాలే బాధ్యత తీసుకోవాలని అన్నారు. దిగజారుడుతనమే: తేజస్వి తన తండ్రిని హతమార్చడానికి కుట్ర జరుగుతోందని, ఆయనకు ఏమైనా అయితే మోదీ తోలు వలుస్తామని లాలు కొడుకు తేజ్ ప్రతాప్ హెచ్చరించారు. కావాలంటే తాను మాట్లాడింది వెళ్లి మోదీకి చెప్పుకోవచ్చని మీడియాతో అన్నారు. తన తండ్రికి భద్రతను కుదించడం బీజేపీ దిగజారుడు రాజకీయాలకు అద్దంపడుతోందని లాలు చిన్న కొడుకు తేజస్వి యాదవ్ అన్నారు. ఆర్జేడీ చేస్తున్న ఆరోపణలపై బిహార్ ఉపముఖ్య మంత్రి సుశీల్ మోదీ స్పందిస్తూ...ప్రజలు లాలుకు భయపడుతుంటే ఆయన దేనికి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. -
ఎన్ఎస్జీపై సందిగ్ధం
నవంబర్లో మళ్లీ చర్చలు బెర్న్: అణు సరఫరాదారుల బృందం(ఎన్ఎస్జీ)లో తనకు సభ్యత్వం ఇవ్వాలని భారత్ చేసుకున్న దరఖాస్తుపై సంస్థ ప్లీనరీ నిర్ణయం తీసుకోవడంలో విఫలమైంది. స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్లో శుక్ర, శనివారాల్లో జరిగిన ప్లీనరీలో.. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్పీటీ)పై సంతకాలు చేయని దేశాలకు సభ్యత్వ అంశంపై చర్చించారు. ‘ఈ దేశాల సభ్యత్వానికి సంబంధించిన సాంకేతిక, న్యాయ, రాజకీయ అంశాలపై చర్చించారు. చర్చలు కొనసాగనున్నాయి. ఈ ఏడాది నవంబర్లో దీనికోసం అనధికారిక సమావేశం ఉంటుంది’ అని ఎన్ఎస్జీ ఓ ప్రకటనలో తెలిపింది. భారత్కు సభ్యత్వంపై చైనా వాదన ప్రతిబంధకంగా మారింది. ఎన్పీటీ అమలుకు తాము గట్టిగా మద్దతిస్తామని ప్లీనరీలో పునరుద్ఘాటించిన సభ్య దేశాలు.. ఉత్తర కొరియా అణు పరీక్షలను ఖండించాయి. -
భారత్కు ఇక మరింత కష్టం: చైనా
బీజింగ్: అణు సరఫరా గ్రూపు(ఎన్ఎస్జీ)లో భారత్కు సభ్యత్వం అంశం మరింత కఠినతరం కానుందని చైనా చెప్పింది. అణు సరఫరాయేతర దేశాలన్నింటి విషయంలో ఎలాంటి వివక్ష లేకుండా చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. మొత్తం 48 దేశాల సభ్యత్వం కలిగిన ఈ గ్రూపులో భారత్కు చాలా దేశాలు మద్దతిస్తున్నప్పటికీ ఒక్క చైనా మాత్రం అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. భారత్కు సభ్యత్వం ఇస్తే పాకిస్థాన్కు సభ్యత్వం ఇవ్వాలంటూ చైనా మొండికేస్తుంది. అయితే, ఆయుధ వ్యవస్థపై నియంత్రణ లేని పాక్ కూడా ఎన్ఎస్జీలో సభ్యత్వం ఇవ్వడం ఏమాత్రం సరికాదని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో చైనా ప్రతిసారి మొకాలడ్డుతోంది. ‘కొత్తగా తీసుకొచ్చిన విధానాల వల్ల ఎన్ఎస్జీలో భారత సభ్యత్వం అనేది గతంలో కంటే మరింత క్లిష్టంగా మారనుంది’ అంటూ చైనా విదేశాంగ వ్యవహారాల సహాయమంత్రి లి హులాయి మీడియాకు చెప్పారు. అయితే, భారత్కు క్లిష్టతరంగా మారనున్న అంశాలు ఏమిటనే విషయంపై మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. -
ఇండియా విషయంలో మేం మారం: చైనా
బీజింగ్:చైనా మరోసారి తన మొండిపట్టును వీడనంది. భారత్ విషయంలో తమ వైఖరి మారబోదని ఆ దేశం స్పష్టం చేసింది.న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్(ఎన్ఎస్జీ)లో భారత్ ప్రవేశం విషయంలో తమ నిర్ణయాన్ని మార్చుకోబోమంటూ మరోసారి తన వ్యతిరేక వైఖరిని తేటతెల్లం చేసింది. ఎన్ఎస్జీలో సభ్యత్వం ఉన్న 48 దేశాల్లో దాదాపు అన్ని దేశాలు భారత్ ప్రవేశానికి ఎలాంటి అడ్డు చెప్పనప్పటికీ చైనా మాత్రం అడ్డుకుంటోంది. వచ్చే నెలలో కూడా దీనికి సంబంధించిన సమావేశం జరగనున్న నేపథ్యంలో మరోసారి చైనా చేసిన ఈ ప్రకటన భారత్ ఆశలపై నీళ్లు జల్లినట్లయింది. ఎందుకంటే భారత్ ఎంట్రీకి చైనా మద్దతు చాలా అవసరం. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ మీడియాతో మాట్లాడుతూ భారత్ ఈసారి న్యూక్లియర్ క్లబ్బులోకి అడుగుపెడుతుందని అనుకుంటున్నారని అని అడిగిన ప్రశ్నకు పై విధంగా స్పందించారు. ఎన్ఎస్జీలో సభ్యత్వానికి భారత్తోపాటు పాక్ కూడా దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. భారత్కు ప్రవేశం కల్పిస్తే పాక్కు కూడా కల్పించాల్సిందేననేది చైనా వాదన. ఇటీవల చైనాలో నిర్వహించిన వన్ బెల్ట్ వన్ రోడ్డు సమావేశానికి భారత్ గైర్హాజరవడం, దానిని వ్యతిరేకించడం కూడా భారత్కు ఎన్ఎస్జీలో అవకాశం లేకుండా చేయాలని చైనా మరింత మొండిపట్టుతో ఉన్నట్లు తెలుస్తోంది. -
భారత్కు ఓటేసినట్టే.. పాక్కు వేయకూడదా?: చైనా
న్యూఢిల్లీ: అణుశక్తి సరఫరా బృందం(ఎన్ఎస్జీ)లో భారత్కు స్ధానం కల్పిస్తే.. పాకిస్తాన్కు కూడా కల్పించాలని చైనాకు చెందిన ఓ కమ్యూనిస్టు పార్టీ అధికారి అన్నారు. 19వ ఆసియా భద్రతా సమావేశాల సందర్భంగా మాట్లాడిన మా గ్జియాంగ్వు సంచలన వ్యాఖ్యలు చేశారు. శక్తి సామర్ధ్యాల్లో ఇరుదేశాలు సమానంగా ఉన్నాయని 48 సభ్య దేశాలు కలిగిన ఎన్ఎస్జీలో చేరేందుకు ఇరువురికి అవకాశం ఇవ్వాలని అన్నారు. ఎన్ఎస్జీలో సభ్వత్వానికి చైనా భారత్కు ఓటేసిన చేతితోనే పాకిస్తాన్కు ఎందుకు ఓటు వేయకూడదని? ప్రశ్నించారు. పాకిస్తాన్ తమకు మిత్రదేశమని దానికి అవకాశం ఎందుకు ఇవ్వకూడదని అన్నారు. ఒకరికి చాన్స్ ఇచ్చి మరొకరిని వదిలేస్తే వివక్ష చూపినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. అణుశక్తికి సంబంధించిన టెక్నాలజీని అక్రమంగా లిబియాకు విక్రయిస్తూ పాకిస్తాన్ పట్టుబడిందని.. భారత్కు అలాంటి బ్యాడ్ ట్రాక్ ఏదీ లేదని చెప్పారు. అయితే చైనాకు ఈ విషయంపై కొన్ని సొంత అభిప్రాయాలు ఉన్నాయని తెలిపారు. -
బహుమతి మాకొద్దు: భారత్
న్యూఢిల్లీ: అణుశక్తి సరఫరా బృందం(ఎన్ఎస్జీ)లో సభ్యత్వాన్ని అమెరికా భారత్కు బహుమతిగా ఇవ్వాలని చూస్తోందని చైనా చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ స్పందించింది. బహుమతిగా ఎన్ఎస్జీలో సభ్యత్వాన్ని భారత్ కోరుకోవడం లేదని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ పేర్కొన్నారు. గత కొన్నాళ్లుగా ఎన్ఎస్జీలో సభ్యత్వానికి భారత్ యత్నిస్తుండగా.. ఎన్పీటీపై సంతకం చేయకుండా ఎలా సభ్యుడిగా చేర్చుకుంటారని చైనా మోకాలు అడ్డుపెడుతోంది. కాగా, రాయబారి రిచర్డ్ వర్మ మాత్రం ట్రంప్ నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వం చైనా అడ్డంకిని అధిగమించి భారత్ కు ఎన్ఎస్జీలో సభ్యత్వాన్ని కల్పిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ కూడా ఎన్ఎస్జీలో సభ్వత్వాన్ని కోరుతుండటంతో చైనా ఆ దేశంతోనూ సంప్రదింపులు జరుపుతోంది. -
భారత్కు స్వభ్యత్వం.. అమెరికాపై చైనా ఫైర్!
అంతర్జాతీయ అణుసరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో భారత్కు సభ్యత్వం విషయంలో అమెరికాపై చైనా ఘాటుగా విరుచుకుపడింది. ఎన్ఎస్జీలో సభ్యత్వం అనేది దిగిపోయే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్కు ఇచ్చే వీడ్కోలు కానుక కాదని నోరుపారేసుకుంది. అణు సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు మార్గం సుగమం చేసే ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వానికి మోకాలడ్డుతోంది చైనాయేనని అమెరికా విదేశాంగశాఖ అసిస్టెంట్ సెక్రటరీ నిషా దేశాయ్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో డ్రాగన్ దేశం ఈవిధంగా స్పందించింది. ఎన్ఎస్జీలో భారత్కు సభ్యత్వం ఇచ్చే విషయంలో ఇప్పట్లో తన వైఖరి మార్చుకునే ప్రసక్తి లేదని సంకేతాలు ఇచ్చింది. 'ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వం, ఎన్పీటీ రహిత దేశాల సభ్యత్వం విషయంలో మా వైఖరి ఇదివరకే స్పష్టం చేశాం. దానిని నేను పునరుద్ఘాటించబోను. కానీ, ఎన్ఎస్జీలో సభ్యత్వం అనేది ఒక దేశం మరొక దేశానికి ఇచ్చే వీడ్కోలు కానుక కాదని మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను' అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హు చున్యింగ్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. 48 దేశాల ఎన్ఎస్జీలో సభ్యత్వం విషయంలో ఎన్పీటీ (అణునిరాయుధీకర ఒప్పందం)ని బూచిగా చూపెట్టి భారత్కు చైనా మోకాలడ్డుతోంది. ఈ ఒప్పందంపై సంతకం చేయని దేశాలను ఎన్ఎస్జీలో తీసుకోవాలంటే.. అందుకు గ్రూప్ విధివిధానాలను సవరించాలని, అందరి ఏకాభిప్రాయం తీసుకోవాలని చైనా మొండిగా వాదిస్తోంది. తన అనుయాయి పాకిస్థాన్ కోసమే చైనా ఇంత రాద్ధాంతం చేస్తున్నదని నిపుణులు భావిస్తున్నారు. -
ఎన్ఎస్జీ వెబ్సైట్పై హ్యాకర్ల దాడి
న్యూఢిల్లీ: దేశమంతా కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయి ఉండగా, నేరగాళ్లు భద్రతా సంస్థల వెబ్సైట్లను టార్గెట్ చేసుకున్నారు. దేశ అంతర్గత భద్రతలో కీలక పాత్రవహిస్తోన్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ) అధికారిక వెబ్సైట్ను హ్యాక్ చేశారు. ఆదివారం ఉదయం నుంచి ఎన్ఎస్జీ సైట్లోకి వెళ్లినవారికి సమాచారం స్థానంలో ఓ అభ్యంతరకర మెసేజ్ దర్శనమిచ్చింది. హ్యాకింగ్కు పాల్పడిన గ్రూప్ తనను తాను ‘అలోన్ ఇంజెక్టర్’గా పేర్కొంది. కశ్మీర్లో ప్రభుత్వ, సైనిక హింసాకాండను నిరసిస్తూ హ్యాకర్లు నేరుగా భారత ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ అభ్యంతరకర రాతలు రాశారు. విషయం తెలుసుకున్న వెంటనే స్పందిచిన అధికారులు వెబ్సైట్ను పునరుద్ధరించేపనిలో పడ్డారు. ఉగ్రదాడుల సమయంలో ప్రజలను కాపాడే బాధ్యతను తలకెత్తుకునే ఎన్ఎస్జీ కమాండోలు.. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర వీవీఐపీలకూ అనునిత్యం భద్రత కల్పిస్తూఉంటారు. అంతటి ప్రాముఖ్యం కలిగిన సంస్థ వెబ్సైట్ హ్యాకింగ్కు గురికావడంతో హోంశాఖ వర్గాల్లో కలకలం రేగింది. -
ఆ రెండు అంశాల్లో మా వైఖరి మారదు: చైనా
బీజింగ్: అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో భారత్కు సభ్యత్వం, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ విషయాల్లో తమ వైఖరిలో మార్పు ఉండబోదని చైనా స్పష్టం చేసింది. ఇప్పటికే ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వాన్ని అడ్డుకున్న చైనా.. మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న భారత్ తీర్మానాన్ని ఐకరాజ్యసమితిలో రెండుసార్లు వ్యతిరేకించింది. ఇప్పుడు తాజాగా ఈ రెండు అంశాల్లో తమ వైఖరి మారదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షుయాంఘ్ స్పష్టం చేశారు. -
‘ఎన్ఎస్జీ’పై చైనాతో చర్చలు
భారత్, చైనా విదేశాంగ మంత్రుల భేటీలో నిర్ణయం * మసూద్ అంశంపై పునరాలోచించాలన్న భారత్ * జీ 20 సదస్సుపై ప్రధాని మోదీకి వివరించిన చైనా మంత్రి వాంగ్ * సానుకూల వాతావరణంలో చర్చలు: ప్రభుత్వ వర్గాలు న్యూఢిల్లీ: ఎన్ఎస్జీలో భారత సభ్యత్వాన్ని వ్యతిరేకించడం, జైషే చీఫ్ మసూద్ అజహర్పై ఐరాస నిషేధాన్ని అడ్డుకోవడంపై శనివారం చైనాకు భారత్ తన ఆందోళనను తెలిపింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూతో భేటీలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ అంశాలపై చర్చించారు. ఎన్ఎస్జీ(అణు సరఫరా దేశాల కూటమి) అంశంలో నిరాయుధీకరణ విభాగ అధికారులు త్వరలో భేటీ కావాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి వివిధ అంశాలపై విదేశాంగ కార్యదర్శల స్థాయిలో చర్చలకు యంత్రాంగం ఏర్పాటుపైనా అంగీకారానికి వచ్చారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్పై భారత్ తన ఆందోళన తెలిపింది. సరిహద్దు పరిస్థితులపై సమీక్ష.. మూడు రోజుల పర్యటన కోసం భారత్కు వచ్చిన వాంగ్ శనివారం ఉదయం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అనంతరం సుష్మతో 3 గంటల సేపు చర్చలు జరిపారు. భారత్కు ఎన్ఎస్జీ సభ్యత్వంపై భేటీలో సుధీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. చైనాకు ఎలాంటి సాంకేతిక అభ్యంతరాలున్నా వాటిపై చర్చించేందుకు సిద్ధమని సుష్మ చెప్పారు. ముంబై, పఠాన్కోట్ ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి మసూద్ అజహర్పై ఐక్యరాజ్యసమితి నిషేధాన్ని సాంకేతిక కారణాలు సాకుగా అడ్డుకోవడంపై పునరాలోచించాలని భారత్ కోరినట్లు సమాచారం. ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోమని చైనా ప్రకటించిన నేపథ్యంలో సాంకేతిక కారణాలపై సమీక్షించాలని భారత్ కోరినట్లు తెలుస్తోంది. ఇరు దేశాల సరిహద్దుల వద్ద పరిస్థితులపై సమీక్షతో పాటు శాంతి, ప్రశాంతతను బలోపేతం దిశగా మరిన్ని చర్యలు తీసుకోవాలని సుష్మ, వాంగ్ నిర్ణయించారు. అంతకుముందు మోదీతో.. వాంగ్ భేటీ అయ్యారు. సెప్టెంబర్లో చైనాలో జరిగే జీ20 సదస్సు గురించి వివరించారు. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్కు అభినందనలు తెలపాలని ప్రధాని కోరినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇరు దేశాల మధ్య చర్చలు సానుకూల, నిర్మాణాత్మక వాతావరణంలో కొనసాగాయని, ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షతో పాటు, ఇటీవలి కొన్ని అంశాలపై కూడా చర్చించినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. పెట్టుబడులు విస్తరించాలన్న అంశంపై ఏకాభిప్రాయం వ్యక్తమవడంతో పాటు, మౌలిక సదుపాయల రంగంలో మరింత సహకారం అవసరముందని ఇరు దేశాలు నిర్ణయించాయి. బ్రెగ్జిట్ ప్రభావం, కొరియా ద్వీపకల్పంలో పరిస్థితి, ఐరాస భద్రతా మండలి, జీ20, తూర్పు ఆసియా, బ్రిక్స్ దేశాల సదస్సులపై సుష్మా, వాంగ్ల మధ్య చర్చలు సాగాయి. అయితే ఇరు నేతల మధ్య దక్షిణ చైనా సముద్రం అంశం చర్చకు రాలేదని తెలుస్తోంది. బ్రిక్స్ సదస్సు ఏర్పాట్లపై వాంగ్ పరిశీలన శుక్రవారమే గోవా చేరుకున్న వాంగ్ యీ బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల సద స్సు జరిగే వేదికను పరిశీలించారు. స్థానిక అధికారులతో పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్, గవర్నర్ మృదులా సిన్హాతో కలిసి ఏర్పాట్లపై చర్చించారు. బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ హాజరుకానున్నారు. మోదీతో ప్రీతీ పటేల్ భేటీ బ్రిటన్కు చెందిన అంతర్జాతీయ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి ప్రీతీ పటేల్ శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నైపుణ్య శిక్షణతో పాటు వివిధ అంశాల్లో సహకారంపై వారిద్దరూ చర్చించారు. బ్రిటన్ ప్రధాని థెరెసా మే కొత్త మంత్రివర్గంలో సహాయ మంత్రి స్థానం పొందినందుకు ప్రీతీ పటేల్కు మోదీ శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా గతేడాది నవంబర్లో విజయవంతంగా సాగిన బ్రిటన్ పర్యటనను మోదీ గుర్తు చేసుకున్నారు. ‘అంతర్జాతీయ అభివృద్ధి విభాగం భవిష్యత్తు ప్రణాళికలపై ప్రధానికి పటేల్ వివరించారు’ అని పీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది. -
మనసు గెలుచుకుంటారా?
న్యూఢిల్లీ: చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలుసుకున్నారు. శుక్రవారం రాత్రి మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా ఆయన న్యూఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా కీలక అణు సరఫరా బృందం (ఎన్ఎస్ జీ) అంశం చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ను కూడా ఆయన కలిసి భేటీ అయ్యారు. అనంతరం చైనా అధికార బృందం భారత బృందంతో సమావేశమైంది. ఎన్ఎస్ జీలో స్థానం మిస్ కావడంతో.. చైనా సానుకూలతతోనే ఎన్ఎస్ జీలో స్థానం సంపాదిస్తామని పార్లమెంట్ లో విదేశాంగ శాఖ మంత్రి సుష్మా ఇంతకుముందు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వాంగ్-సుష్మాల సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో చైనా, భారత్ లు పరస్పరం విభేదించుకుంటున్న అంశాలతో పాటు ఎన్ఎస్ జీ చర్చకు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. వాంగ్ పర్యటన సందర్భంగా ఇండియాకు ఇంకా ఎన్ఎస్ జీ తలుపులు మూసుకుపోలేదని అక్కడి పత్రిక వ్యాఖ్యానించడం కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. దక్షిణ చైనా సముద్రంపై ఇండియా తమ ప్రతినిధిని ఎలాంటి ప్రశ్నలు వేయకూడదని కూడా పత్రిక ఆక్షేపించింది. దక్షిణ చైనా సముద్రంలో చైనా చేపడుతున్న నిర్మాణాలను విరమించుకోవాలని అంతర్జాతీయ ట్రైబ్యునల్ తీర్పునిచ్చింది. తీర్పుతో తమకు ఎలాంటి సంబంధం లేదని.. నిర్మాణాలను కొనసాగిస్తామని చైనా తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. -
ఎన్ఎస్జీ తలుపులు మూసుకోలేదు: చైనా
బీజింగ్: ఎన్ఎస్జీ(అణు సరఫరాదారుల కూటమి)లో సభ్యత్వం కోసం భారత్కు తలుపులు పూర్తిగా మూసుకుపోలేదని, నిరాశ చెందాల్సిన అవసరంలేదని చైనాకు చెందిన ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా పేర్కొంది. భారత్లో తమ విదేశాంగ మంత్రి వాంగ్ యి పర్యటన నేపథ్యంలో శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేసింది. ఎన్ఎస్జీలో భారత్ ప్రవేశాన్ని చైనా అడ్డుకుందంటూ తప్పుగా విమర్శిస్తున్నారని, నాన్-ఎన్పీటీ దేశం ఎన్ఎస్జీలో సభ్యత్వం పొందిన ఉదాహరణలు ఇంతకుముందు ఏవీ లేవని తన కథనంలో తెలిపింది. -
'ఇండియాది 1962 నాటి మైండ్సెట్'
బీజింగ్: భారత్ పై చైనా అధికారిక పత్రికల రాతల దాడిని కొనసాగిస్తూనే ఉంది. నిన్నటికి నిన్న భారత్ ఓ చెడ్డదేశమని, భారతీయులు పద్ధతులు నేర్చుకోవాలని చెవాకులు పేలిన చైనీస్ పత్రికలు నేడు ఇండియాది 1962నాటి మైండ్ సెంట్ అంటూ విమర్శలు కురిపించింది. కమ్యూనిస్ట్ ప్రభుత్వ కనుసన్నల్లో నడిచే 'గ్లోబల్ టైమ్స్' పత్రిక సోమవారం నాటి సంపాదకీయంలో భారత్ పై మరోసారి విషం వెళ్లగక్కింది. అణు సరఫరా బృందం(ఎన్ఎస్ జీ) సభ్యత్వం విషయంలో చైనాపై అభాండాలు వేయడం సరికాదని, దానికంటే ప్రపంచం మెప్పును పొందే ప్రయత్నాలు మంచివని ఉచిత సలహా ఇచ్చింది. (చదవండి: 'ఇండియా ఓ చెడ్డ దేశం' అంటూ..) 'గత వారం సియోల్ లో జరిగిన ఎన్ఎస్జీ ప్లీనరీ సమావేశాలు భారతీయులకు కాస్త కఠినంగా అనిపించవచ్చు. వారి దృష్టిలో చైనాయే భారత్ ఎన్ ఎస్ జీ సభ్యత్వానికి అడ్డుపడిందనే భావన ఉండొచ్చు. నిజానికి బీజింగ్.. న్యూ ఢిల్లీలో ఎల్లప్పుడూ స్నేహాన్నే కొరుకుంటోంది. కేవలం అణ్వస్త్ర నిరోధక ఒప్పందంపై సంతకం చేయనందునే ఎన్ ఎస్ జీలోకి భారత్ ప్రవేశాన్ని చైనా సహా మరో 10 దేశాలు అడ్డుకున్నాయి. ప్రపంచాన్ని మెప్పించాల్సిందిపోయి భారతీయులు, భారతీయ మీడియా చైనాను దూశించేపనిలో పడింది. బీజింగ్ ఉదాత్తమైన ఆలోచనలను అర్థం చేసుకోవడంలో న్యూ ఢిల్లీ విఫలం అవుతోంది. ఇండియా ఇంకా 1962 యుద్ధ కాలం నాటి మైడ్ సెట్ లో ఉంది. దాని నుంచి బైటపడి విశాల దృక్ఫధంతో చైనా అభ్యంతరాలను అర్థం చేసుకోవాలి' అని 'గ్లోబల్ టైమ్స్' పేర్కొంది. -
'ఇండియా ఓ చెడ్డ దేశం' అంటూ..
నిన్నటివరకు చైనా ప్రభుత్వమే భారత్ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తే, నేడు అక్కడి పత్రికలు సైతం విషాన్ని చిమ్మే పనికి పూనుకున్నాయి. ఆ దేశంలో ప్రముఖ పత్రిక అయిన 'గ్లోబల్ టైమ్స్' మంగళవారం తన సంపాదకీయంలో భారత్ ను తీవ్రస్థాయిలో తిట్టిపోసింది. ఇండియా ఓ చెడిపోయిన దేశమని, అంతర్జాతీయ వ్యవహారాల్లో జిత్తులమారిలా వ్యవహరిస్తుందని, ఇండియన్స్ పద్ధతులు నేర్చుకోవాల్సిన అవసంరం ఉందని పిచ్చిరాతలు రాసింది. అణు సరఫరా దేశాల కూటమి(ఎన్ఎస్ జీ)లో భారత్ చేరకుండా చైనా అడ్డుకోవడాన్ని నిస్సిగ్గుగా సమర్థించింది. చైనాలో చైనీస్, ఇంగ్లీష్ భాషల్లో ప్రచురితం అవుతోన్న పత్రికల్లో ప్రముఖమైనది 'గ్లోబల్ టైమ్స్' పత్రిక. అన్ని మీడియా సంస్థల మాదిరే గ్లోబల్ టైమ్స్ కూడా అధికార కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల కనుసన్నల్లోనే నడుచుకుంటుంది. ఆ పత్రిక మంగళవారం నాటి సంపాదకీయం(ఎడిటోరియల్) ఆసాంతం భారత్ పై అక్షరదాడి మాదిరి సాగింది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్ పీ టీ)పై సంతకం చేయకుండా భారత్ ఎన్ఎస్ జీలో సభ్యురాలు కావాలనుకోవడం అనైతికమని, అందుకే తమ నైతిక బాధ్యతగా చైనా, ఇతర దేశాలు భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడాయని 'గ్లోబల్ టైమ్స్' పేర్కొంది. ఈ వ్యవహారంలో ఇండియా నంగనాచిలా వ్యవహరించిందంటూ ఎగతాళి చేసింది. భారత్ తోపాటు అమెరికాపైనా 'గ్లోబల్ టైమ్స్' రంకెలేసింది. ప్రపంచ మంటే ఒక్క అమెరికానే కాదని, అది వెనకేసుకొచ్చినంత మాత్రాన మిగతా ప్రపంచమంతా ఇండియాను నిర్ద్వంద్వంగా సమర్థింస్తుందనుకోవడం సబబు కాదని రాసుకొచ్చింది. మార్కెట్ అవకాశాల కోసంమే పశ్చిమ దేశాలు ఆసియా దేశాలతో స్నేహాన్ని నటిస్తున్నాయని అంది. ఇక భారత జాతీయవాదులను ఉద్దేశించి అవమానకరమైన వ్యాఖ్యలు చేసింది 'గ్లోబల్ టైమ్స'. భారత జాతీయవాదుల్లో కొందరు స్వార్థపరులని, స్వలాభం కోసమే ఆలోచిస్తారని ఆరోపించింది. భారతీయులు పద్ధతి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని దూషించింది. తప్పులను ఎత్తిచూపిన దేశాలపై రాళ్లెయ్యటం సరికాదని పేర్కొంది. చైనా పత్రిక విషపూరిత రాతలపై భారత అధికారులు ఇంకా స్పందించాల్సిఉంది. -
లాబీయిస్ట్ కోసం పాక్ వెతుకులాట!
ఇస్లామాబాద్: అమెరికాతో తమ దేశం తరఫున దౌత్యం నడపడానికి పాకిస్తాన్కు ఓ లాబీయిస్ట్ కావాలట. ఎఫ్-16 యుద్ధ విమానాలను సరఫరా చేసేందుకు అమెరికా తిరస్కరించడం, ఎన్ఎస్జీ (అణు సరఫరాదారుల కూటమి)లో భారత్ సభ్యత్వానికి యూఎస్ బహిరంగంగా మద్దతు తెలిపిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగు పరచుకునేందుకు కొత్త లాబీయిస్ట్ కోసం పాక్ వెతుకులాట ప్రారంభించింది. అఫ్గానిస్తాన్లో తాలిబన్లను ఎదుర్కొనే విషయంలో విభేదాలు తలెత్తడం, దేశంలోని ఉగ్రవాద గ్రూపులను రూపుమాపడంలో పాక్ విఫలమైందని అమెరికా ఆరోపణలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఓ పెయిడ్ లాబీయిస్ట్ కోసం వెతుకులాడుతున్నట్లు వాషింగ్టన్లోని పాక్ రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి నదీమ్ హొతియానా ధ్రువీకరించారని, అయితే ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ‘డాన్’ పత్రిక పేర్కొంది. కాగా, తమ దేశం కోసం అమెరికాతో లాబీయింగ్ చేసేందుకు 2008లో ‘లోక్ లార్డ్ స్ట్రాటజీస్’తో ఒప్పందం చేసుకున్న పాక్ ప్రభుత్వం.. 2013 తర్వాత దాన్ని పొడిగించలేదు. -
‘ఎన్ఎస్జీ’ ఆశాభంగం
అణు సరఫరా దేశాల బృందం(ఎన్ఎస్జీ)లో సభ్యత్వం కోసం భారత్ చేసిన ప్రయత్నాన్ని ఊహించినట్టుగానే చైనా వమ్ముచేసింది. వాస్తవానికి అలా చేసింది అదొక్కటే కాదు...స్విట్జర్లాండ్, బ్రెజిల్, మెక్సికో, టర్కీలు కూడా చైనా దోవనే ఎంచుకున్నాయి. అయితే చైనా వ్యతిరేకించడానికీ, మిగిలిన దేశాల అభ్యంత రాలకూ మధ్య తేడా ఉంది. స్విట్జర్లాండ్, బ్రెజిల్, మెక్సికో, టర్కీలు ఎన్ఎస్జీ సభ్యత్వం ఇవ్వడానికి సంబంధించిన ప్రక్రియకు అనుసరించే ప్రమాణాలేమిటో ముందుగా నిర్ణయించాలని కోరాయి. చైనా ఇంకాస్త ముందుకెళ్లింది. అది అంత ర్జాతీయ నిబంధనలు, సూత్రాలు ఏకరువు పెట్టింది. మిగిలిన దేశాల సూచనల వల్ల మనకు కలిగే నష్టమేమీ లేదు. ఎందుకంటే అణు పరిజ్ఞానాన్ని లేదా అణు పదార్థాన్ని ఎవరికీ రహస్యంగా చేరేసిన చరిత్ర మన దేశానికి లేదు. అలాంటి చరిత్ర ఉంటే గింటే చైనాకుంది. ఇలాంటి ప్రమాణాలను ఏర్పర్చడం ప్రారంభిస్తే చైనా, మరికొన్ని ఇతర దేశాల సభ్యత్వాలు గల్లంతయ్యే పరిస్థితి ఏర్పడవచ్చు కూడా. అయితే భారత్ విషయంలో చైనా చెబుతున్న అభ్యంతరాల సారాంశం వేరే ఉంది. అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్పీటీ)పై సంతకం చేసిన దేశాలకే ఎన్ఎస్జీ తదితర సంస్థల్లో సభ్యత్వం ఇవ్వాలన్న నిబంధన ఎన్పీటీలో ఉంది. అలా సంతకం చేయాలంటే ముందుగా మన అణు హోదాను వదులుకోవడానికి సిద్ధపడి ఉండాలి. ఎన్పీటీ ఒప్పందమే ఎంతో వివక్షతో కూడుకుని ఉన్నది. దాన్ని ఏర్పరిచిన అయిదు అగ్ర దేశాలూ ఆ నిబంధననుంచి తమకు తాము మినహా యింపు ఇచ్చుకున్నాయి. దీన్ని ఎత్తి చూపే మన దేశం మొదటినుంచీ ఆ ఒప్పం దంపై సంతకం పెట్టడానికి నిరాకరిస్తోంది. అమెరికాతో 2008లో పౌర అణు ఒప్పం దం కుదరడానికి ముందు మన దేశం అదేమాట చెప్పింది. అందుకు అమెరికా అంగీకరించడంవల్లే ఆ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అది చైనాకు కంటగింపుగా ఉంది. ఇప్పుడు ఎన్పీటీతో ఎన్ఎస్జీ సభ్యత్వాన్ని ముడిపెడితే భారత్ని అడ్డుకోవడం చైనాకు సులభమవుతుంది. మనం ఎప్పటిలా ఎన్పీటీపై సంతకానికి నిరాకరిస్తాం గనుక చర్చంతా దాని చుట్టూ నడుస్తుంది. చివరకు అలా ఒప్పుకుంటే తప్ప భారత్ సభ్యత్వాన్ని అంగీకరించకూడదని ఎన్ఎస్జీలో మిగిలిన దేశాలు భావించవచ్చు. ఎందుకంటే అందులో సభ్యత్వం పొందిన దేశాలన్నీ అలా సంతకం పెట్టి వచ్చాయి. తమకు లేని మినహాయింపు భారత్కు ఎందుకని అవి నిలదీ యొచ్చు. ఆ విషయంలో అమెరికా అందరినీ ఒప్పించగలిగినా వివక్షాపూరిత ఎన్పీటీపై తమ తరహాలో కాక భారత్ పంతం నెగ్గించుకుందన్న న్యూనతకు ఆ దేశాలు గురవుతాయి. అలాంటి పరిస్థితి ఏర్పడేలా చూడటమే చైనా ధ్యేయం. తన చిరకాల మిత్ర దేశం పాకిస్తాన్ ప్రయోజనాలను నెరవేర్చడం చైనా చర్యలోని ఆంతర్యం. పైకి భారత్, పాకిస్తాన్లు రెండింటికీ సభ్యత్వాన్ని ఇవ్వొద్దని చైనా వాదిస్తోంది. ఒక ప్రాంతంలో తరచు విభేదించుకునే రెండు దేశాల్లో ఒకదానికి సభ్యత్వమిచ్చి రెండో దేశానికి ఇవ్వకపోవడం మరిన్ని సమస్యలకు దారితీస్తుం దన్నది ఆ దేశం పైకి చెబుతున్న మాట. కానీ భారత్కు సభ్యత్వం ఇవ్వదల్చుకుంటే పాకిస్తాన్కు కూడా ఇవ్వాలన్నది దాని ఉద్దేశం. పాక్కు ఎన్ఎస్జీ సభ్యత్వం ఇవ్వడాన్ని మన దేశం అడ్డుకోవడంలేదు. కానీ ఎన్ఎస్జీలోని మిగిలిన దేశాలకు తీవ్ర అభ్యంతరాలున్నాయి. ఉత్తర కొరియాకు అణు పరిజ్ఞానం అందించింది పాకిస్తానేనని చాలా దేశాలకు అనుమానాలున్నాయి. సమస్యంతా దానిచుట్టూ తిప్పితే భారత్ సభ్యత్వం ఆగిపోతుందని చైనా భావి స్తున్నట్టు కనబడుతోంది. ఎన్ఎస్జీ సభ్యత్వం ఉంటే అణు రియాక్టర్లు, యురేని యంవంటివి ఎవరివద్దనైనా కొనుగోలు చేయడానికి, అమ్మడానికి అవకాశం ఏర్ప డుతుంది. భారత్ ప్రధాన అవసరం అణు విద్యుదత్పత్తి కాబట్టి తనతో ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంటే సరిపోయేదానికి ఎన్ఎస్జీ సభ్యత్వం అవసరం ఏము న్నదని చైనా అనుకుంటుండవచ్చు. కాని యూరోప్ దేశాల సాంకేతికతతో పోలిస్తే చైనా అణు రియాక్టర్లు మెరుగైనవేమీ కాదు. ఒక వేళ చైనానుంచి కొనాలనుకున్నా ఎన్ఎస్జీ సభ్యత్వం ఉంటే మిగిలిన దేశాలు ఇవ్వజూపుతున్న ధరతో పోల్చి ఆ దేశంతో బేరసారాలు జరపడానికి మనకు అవకాశం ఉంటుంది. అది లేకుండా చేయడం కూడా చైనా ఉద్దేశం కావొచ్చు. భారత్కు సభ్యత్వం విషయంలో చైనాకు ఎలాంటి అభ్యంతరాలూ ఉండబో వని మన దేశం భావించింది. విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ ఒకటికి రెండుసార్లు ఆ సంగతి చెప్పారు. మన విదేశాంగ కార్యదర్శి ఎస్. జయశంకర్ ఈ విషయమై చర్చించడానికి చైనా కూడా వెళ్లారు. చైనా మద్దతుపై ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాంటి అభిప్రాయం మన దేశానికి కలిగించడంలో చైనా నాయకత్వం సఫలమైంది. అయితే ఎన్ఎస్జీ సభ్యత్వానికి తమ మద్దతుంటుందని మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనో నీటో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా ఈనెల మొదట్లో ప్రకటించినా తీరా సమయం వచ్చేసరికి ఆ దేశం ఎందుకు వ్యతిరేకించిం దన్నది అనూహ్యం. స్విట్లర్లాండ్ సైతం ఇలాగే హామీ ఇచ్చి వెనక్కు తగ్గింది. అసలు ఎన్ఎస్జీ సభ్యత్వం కోసం అర్రులు చాచడం అనవసరమని కొంతమంది నిపు ణులు చెబుతున్న మాట. అమెరికాతో పౌర అణు ఒప్పందం కుదిరినప్పుడే ఎన్ఎస్జీ సభ్యత్వం ద్వారా సమకూరే చాలా ప్రయోజనాలు మనకు దక్కాయని వారంటున్నారు. ఇప్పుడు కొత్తగా చేరడంవల్ల భవిష్యత్తులో ఆ సంస్థకు సంబం ధించిన నిబంధనల రూపకల్పనలో పాలుపంచుకోవడం మినహా మనకు అద నంగా దక్కేదేమీ ఉండదని వారి వాదన. ఎన్ఎన్జీ పుట్టుక, పెరుగుదలలో భారత్ వ్యతిరేక మూలాలున్నాయి. 1974లో మన దేశం పోఖ్రాన్లో అణు పరీక్ష జరిపాక దీన్ని ఏర్పాటు చేశారు. రెండోసారి పరీక్ష సమయంలో దాని నిబంధనలు మరింత కఠినం చేశారు. అలాంటి సంస్థలో మనకు అంత సులభంగా సభ్యత్వం దక్కడం కూడా సాధ్యం కాదు. ఒకవేళ అంతా సవ్యంగా జరిగి ఎన్ఎస్జీ సభ్యత్వం లభిస్తే దౌత్యపరంగా ఘన విజయం సాధించామని చెప్పుకోవడానికి ఎన్డీఏ ప్రభు త్వానికి అవకాశం ఉండేది. ఇప్పుడది దూరమైంది. భారత్కు ఆ సభ్యత్వం రావడం పెద్ద కష్టం కాదని, త్వరలోనే అది లభిస్తుందని అమెరికా చెబుతోంది. ఆ సంగతెలా ఉన్నా ఆచితూచి అడుగేయడం, చైనా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని మనం గుర్తించకతప్పదు. -
‘అణు’ సభ్యత్వం తథ్యం కానీ..
బైలైన్ అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో స్థానం సంపాదిం చాలన్న మన ప్రయత్నంలో గణనీయమైన మార్పు వచ్చింది. ఇప్పుడు సమస్య ‘ఇవ్వాలా’ కాదు, ‘ఎన్నడు’ అనేది. గత ఏడాదిగా భారత్ను సమర్థిస్తూ, అనుకూల ప్రభావాన్ని కలుగజేస్తున్న అమెరికా, అది ఈ ఏడాది చివరికే జరుగుతుందని విశ్వసిస్తోంది. భారత్ సభ్యత్వం అంశం చర్చకు వచ్చిన సియోల్ ప్లీనరీ జరిగిన తర్వాత శ్వేతసౌధమే అది తెలిపింది. అంతిమ నిర్ణయం కోసం వేచి చూడాల్సి ఉంది. ఒకప్పుడు మన దేశ అణు కార్యక్రమం పట్ల జాగరూ కతతోనో లేదా వ్యతిరేకతతోనో ఉండిన కెనడా వంటి దేశాలు ఎన్ఎస్జీ సమావేశానికి ముందు... మన దేశానికి ప్రాధ్యాన్యతా ప్రాతిపదికపై ప్రవేశం కల్పించాలని బహిరం గంగానే వాదించాయి. అవి ఉపయోగించిన పదం ‘‘అతి త్వరగా’’. బ్రిటన్, ఫ్రాన్స్, మాస్కో ప్రభుత్వాలు కల్పించిన ఆటంకం ఏమైనా ఉందంటే అదే. విస్పష్టమైన లక్ష్యాల కోసం అలుపెరగని శక్తిసామర్థ్యాలతో, ఆత్మవిశ్వాసంతో. అంతర్జాతీయ ప్రమాణాల మందకొడి గమనానికి బదు లుగా మన కాలానుగుణ ప్రణాళిక ప్రకారం కృషిని సాగిం చడం మన దౌత్యంలోని నూతన పరిణామం. ఇప్పుడు చైనా తప్ప అన్ని ప్రధాన అణుశక్తులూ మన దేశాన్ని ఎన్ఎస్జీలో చేర్చుకోవాలని కోరుతున్నాయంటే అది ఈ నూతన పరిణామం వల్ల కలిగిన లాభమే తప్ప, యాదృచ్ఛికంగా కలిగినదేమీ కాదు. అంతర్జాతీయ బహుముఖ సంస్థలలో ఏకా భిప్రాయం ఏర్పడటం అవసరమైన ఇలాంటి అంశాలను నిర్వచించకుండా వదిలేసిన కాలమనే బహిరంగ ప్రదేశం లోకి తోసేయడం సంప్రదాయకంగా జరుగుతుంటుంది. యథాతథ స్థితి కన్నా దౌత్యపరమైన ప్రశాంతత మెరుగని చెప్పనవసరం లేదు. క్షిపణి సాంకేతిక పరిజ్ఞాన నియంత్రణ వ్యవస్థ (ఎమ్టీసీఆర్) విషయంలో నెలకొన్న అంతర్జాతీయ జడత్వాన్ని మిత్రుల సహాయంతో ఈ నెల మొదట్లో అధిగ మించాం. 2030 నాటికి 40 శాతం కర్బనేతర విద్యుదు త్పత్తికి కట్టుబడతామని మనం గత ఏడాది పారిస్లో వాతా వరణ మార్పుల విషయమై హామీ ఇచ్చాం. ఆ హామీని సైతం ప్రస్తావిస్తూ అతి జాగ్రత్తగా రూపొందించిన వాద నతో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్ఎస్జీ విషయంలోని యథాతథ స్థితిని సవాలు చేశారు. శ క్తివంతమైన ఆ వాదన బలమైన శత్రువులను సైతం మిత్రులుగా మార్చింది. భారత్ తన శక్తికి మించి మరీ వాతావరణ మార్పుల విష యంలో కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నది కాబట్టి ప్రపంచం కూడా భారత అణు వ్యాపారానికి మద్దతును తెలిపితీరాలి అనే తర్కాన్ని వారు అర్థం చేసుకున్నారు. ఇక రెండవ కారణం, అణ్వస్త్రవ్యాప్తి నిరోధకత విష యంలో భారత్కు ఉన్న చరిత్ర. చైనా ప్రతిఘటనను ‘‘విధి విధానాలకు సంబంధించిన అటంకాలు’’ అన్నారని మనకు తెలుసు. అవి, పాకిస్తాన్తో తనకున్న వ్యూహాత్మక మైత్రిని పరిరక్షించుకోవాలనే చైనా కోరిక ఫలితం. మిగతా అణు శక్తులలో చేరడానికి ముందు భారత్ అణువ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ)పై సంతకం చేసి తీరాలనేది చైనా లాంఛనప్రాయమైన అభ్యంతరం. అణుశక్తులైన అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్లు ఈ వాదనను అంగీకరించడానికి ఎందుకు తిరస్కరించాయి? అణువ్యాప్తి నిరోధం విష యంలో భారత్ది మచ్చలేని చరిత్ర కాబట్టి. 1950ల నుంచి అణు సామర్థ్యాన్ని పెంపొందించుకుంటున్న భారత్కు వ్యతిరేకంగా ఎన్నడూ ఏ చిన్న గుసగుస వినిపించ లేదు. అందుకు విరుద్ధంగా పాకిస్తాన్కు అణువ్యాప్తి చెందిం చిన చరిత్ర ఉన్నది. 2002 స్టేట్ ఆఫ్ యూనియన్ ప్రసం గంలో నాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ పాకిస్తాన్ను అణు ముప్పు ఉన్న ప్రాంతంగా పేర్కొన్నారు. అడ్రియన్ లెవీ అండ్ కాథరిన్ స్కాట్-క్లార్క్లు రచించిన డిసెప్షన్: పాకిస్తాన్, ది యునెటైడ్ స్టేట్స్ అండ్ ది గ్లోబల్ న్యూక్లియార్ వెపన్స్ కాన్స్పిరసీ అనే పుస్తకం ఈ అంశంపై ప్రామాణి కమైనది. ఆ పుస్తకం కవర్ పేజీ పైనే ‘‘అమెరికా సహా యంతో, సాంకేతికతను ఇతర దేశాలకు అందించడం ద్వారా, పునరుజ్జీవితమైన తాలిబన్కు, అల్కాయిదాకు ఆశ్రయం కల్పించడం ద్వారా భారీ అణ్వాయుధ సంపత్తిని సమకూర్చుకుని పాకిస్తాన్ నిజానికి పాశ్చాత్య దేశాలను వంచిం చింది’’ అని ప్రముఖంగా ముద్రించి ఉంటుంది. ‘‘టైఫాయిడ్ మర్ఫీ’’ మారుపేరున్న డాక్టర్ అబ్దుల్ ఖదీర్ ఖాన్ డబ్బుకు ఆశపడి... కొన్నిసార్లు ఆ దురాశకు భావ జాలం ముసుగుతొడిగి మరీ అణు రహస్యాలను అమ్మేశాడు. ఒక అసాధారణమైన డాక్యుమెంటు ఫలితంగా ఖాన్ 2004 ఫిబ్రవరి 4న బహిరంగంగా ఆ విషయాన్ని టెలివి జన్లో అంగీకరించాల్సివచ్చింది. లిబియా, ఉత్తర కొరి యాల వంటి ఖాతాదార్లకు అణు సాంకేతికతను అమ్ముతూ ఖాన్ అణు బ్లాక్ మార్కెట్ను నడిపాడు. ఆయన ఇది ఒంటరిగా చేసి ఉండరనేది స్పష్టమే. కానీ సైన్యం చేత తప్పు చేసినవాడిగా ముద్ర వేయించుకున్నాడు. ‘‘ఖాన్ తన తప్పును అంగీకరించాడు, ఆయన అత్యున్నత సహాయకు లకు అణు వ్యాపారం లేకుండా పోయింది’’ అని నాటి అధ్యక్షుడు బుష్ అన్నారు. ‘‘ఖాన్ నెట్వర్క్కు సంబంధించి తనకు తెలిసిన సమాచారాన్నంతా పంచుకుంటానని, తమ దేశాన్ని తిరిగి మరెన్నడూ అణు వ్యాప్తికి వనరును కానిచ్చేది లేదని అధ్యక్షుడు ముష్రాఫ్ వాగ్దానం చేశారు’’ అని కూడా తెలిపారు. పాకిస్తాన్ అధ్యక్షుడు సైతం తన దేశం తప్పు చేసిందని అంగీకరించాల్సి వచ్చింది. ఖాన్కు నగదు రూపం లోనూ, భౌతికంగానూ కూడా చెల్లింపులు జరిగాయి. అతడ్ని జైలుకు పంపడానికి బదులు ఆ డబ్బునంతా ఆయననే ఉంచుకోనిచ్చి, ప్రశాంతంగా పదవీ విరమణానం తర జీవితం గడపమని పంపేశారు. దీనికి విరుద్ధంగా భారత్ ‘‘అణ్వాయుధ వ్యాప్తి నిరో ధక ఒప్పందంలోని నిబంధనలను, లక్ష్యాలను సాధ్యమై నంత విశాలమైన రీతిలో అమలుపరచడానికి’’ సహకరిం చిందని ఎన్ఎస్జీ 2008లో పేర్కొంది. ఇంతకంటే ఎక్కు వగా చెప్పాల్సినది, ప్రత్యేకించి ఎన్ఎస్జీకి సంబంధించి ఏమీ లేదు. పాకిస్తాన్ను కాపాడటం కోసం భారత్కు వ్యతిరేకంగా అణ్వస్త్రవ్యాప్తి నిరోధం సమస్యను లేవనె త్తడం పూర్తి పరిహాసోక్తి కాకపోయినా, గొప్ప వైచిత్రి అవుతుంది. చైనా అభ్యంతరం సైతం సభ్యత్వ క్రమానికి సంబంధిం చినదే తప్ప మన దేశ అర్హతకు సంబంధించి నది కాకపో వడం కూడా భారత్ విశ్వసనీయతపై సందేహం లేదనే దానికి ఆధారం. దౌత్యం ఒక సుదీర్ఘ క్రీడ. క్షిపణి సాంకేతికత వంటి విష యాల్లో మనం ఫలితాలను వెంటనే సాధించగలుగుతాం. ఎన్ఎస్జీ సభ్యత్వం కేవలం కాలానికి సంబంధించిన సమస్యే, అది కూడా చాలా ఎక్కువ కాలమేమీ కాదు. వ్యాసకర్త: ఎం.జె. అక్బర్ (సీనియర్ సంపాదకులు) పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి -
ఇదే ఏడాదిలో ఎన్ఎస్జీ మరో భేటీ!
న్యూఢిల్లీ: ఎన్పీటీ (అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం)పై సంతకం చేయని దేశాలకు ఎన్ఎస్జీ(అణు సరఫరాదారుల కూటమి)లో సభ్యత్వంపై ఈ ఏడాదిలోనే మరోమారు భేటీ జరిగే అవకాశం ఉంది. గత గురు, శుక్రవారాల్లో సియోల్లో జరిగిన ఎన్ఎస్జీ ప్లీనరీ భారత్ సభ్యత్వంపై చైనా వ్యతిరేకతవల్ల నిర్ణయం లేకుండానే ముగియడం తెలిసిందే. దీంతో భారత్ వాదనపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, కూటమి మళ్లీ భేటీ అయ్యే అవకాశం ఉందని చైనాకు ఎన్ఎస్జీ చెప్పింది. భారత్ సభ్యత్వంపై అనధికార చర్చలు జరిపేందుకు అర్జెంటీనా రాయబారి రఫెల్ గ్రోస్సి నేతృత్వంలో ఓ ప్యానెల్ను ఎన్ఎస్జీ ఏర్పాటు చేసింది. సభ్యత్వంతో నష్టమే: యశ్వంత్ ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వంపై మోదీ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని బీజేపీ నేత యశ్వంత్ సిన్హా విమర్శించారు. సభ్యత్వంతో భారత్కు నష్టమన్నారు. -
చైనాకు దక్కనిది మనకు దక్కింది!
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమే (క్షిపణి సాంకేతిక నియంత్రణ మండలి- ఎంటీసీఆర్)లో భారత్ సభ్యురాలైంది. విధ్వంసక క్షిపణులు, వాయుమార్గంలో ప్రయాణించే ఇతర వాహనాల విచ్చలవిడి వ్యాప్తిని నిరోధించేందుకు ఏర్పాటయిన ఎంటీసీఆర్ లో సభ్యత్వం ద్వారా భారత్.. అత్యాధునిక క్షిపణి పరిజ్ఞానంతోపాటు నిఘా డ్రోన్లను కొనుగోలుచేసుకునే వీలుంటుంది. అంతేకాదు అణు సరఫరా దేశాల కూటమి(ఎన్ఎస్ జీ)లో భారత సభ్యత్వానికి మోకాలడ్డిన చైనాను సమీప భవిష్యత్ లోనే దారికి తెచ్చుకునే అవకాశమూ లేకపోలేదు. ఢిల్లీలోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్. జైశంకర్ ఎంటీసీఆర్ సభ్యత్వానికి సంబంధించిన పత్రాలపై సంతకాలు చేశారు. 38 దేశాల ఎంటీసీఆర్ లో కీలకపాత్ర పోషిస్తోన్న ఫ్రాన్స్, నెదర్లాండ్, లక్సెంబర్గ్ రాయబారుల సమక్షంలో భారత్ చేరిక విజయవంతమైందని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్నో లాభాలు.. భారత్ తో అణు ఒప్పందంలో భాగంగా అణ్వస్త్రవ్యాప్తి నిరోధానికి సంబంధించిన అన్ని కూటములలో సభ్యత్వాన్ని సమర్థిస్తానని అమెరికా గతంలో చేసిన వాగ్ధానానికి కార్యరూపమే ఎంటీసీఆర్ లో చేరిక. ప్రస్తుతం ఎంటీసీఆర్ లో 38(భారత్ తో కలిపి) దేశాలకు సభ్యత్వం ఉంది. ఈ దేశాలన్నీ 500 కేజీల బరువు, లక్ష్యం పరిధి 300 కిలోమీటర్లకు పైబడిన బాలిస్టిక్ క్షిపణులు తయారుచేయబోవు. ఒకవేళ ఇంతకు ఉంటేగనుక వాటిని ధ్వంసం చేయాల్సి ఉంటుంది. తద్వారా సభ్యదేశాల నుంచి అత్యాధునిక క్షపణి పరిజ్ఞానాన్ని, డ్రోన్లు, ఇతర వాహక నౌకలను దిగుమతి చేసుకోవచ్చు. మున్ముందు భారత్ సొంతగా రూపొందించబోయే టెక్నాలజీని కూడా అంతర్జాతీయ విపణిలో విక్రయించుకునే అవకాశం లభిస్తుంది. ఎంటీసీఆర్ లో సభ్యత్వం లేకపోవడం వల్లే ఇజ్రాయెల్ తాను రూపొందించిన అత్యాధునిక అంతరీక్ష నౌక(షావిత్)లను అమ్ముకోలేక పోవడం గమనార్హం. చైనాకు చెక్ పెట్టొచ్చు! ఎంటీసీఆర్ లో సభ్యత్వం ద్వారా భారత్ చైనాకు చెక్ పెట్టే అవకాశాలున్నాయి. 2004 నుంచి ఎంటీసీఆర్ లో చైనా సభ్యత్వం పరిశీలనలో ఉంది. వరుస క్షిపణి ప్రయోగడాలతో ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోన్న ఉత్తర కొరియాకు చైనా వెన్నుదన్నుగా నిలుస్తున్నదని ఎంటీసీఆర్ లోని మిగతా దేశాలు ఆరోపిస్తున్నాయి. చైనా మాత్రం పైకి తాను బాలిస్టిక్ క్షిపణుల తయారీని నిలిపేశానని చెప్పుకుంటోంది. లోలోన మాత్రం విధ్వంసక ఆయుధాల విక్రయాన్ని కొనసాగిస్తూనే ఉంది. తాజాగా పాకిస్థాన్ తో చైనా చేసుకున్న ఆయుధ సరఫరా ఒప్పందం కూడా అలాంటిదే. ప్రయత్నాలు ప్రారంభించిన ఏడాదో లోపే భారత్ కు ఎంటీసీఆర్ సభ్యత్వం దక్కడం గమనార్హం. తద్వారా భారత్ మున్ముందు చైనాపై ఒత్తిడి తీసుకువచ్చే లేదా ఆ దేశంపై అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. ఎలాగైతే భారత్ కు ఎన్ఎస్ జీ సభ్యత్వం దక్కకుండా చైనా మోకాలడ్డిందో, భవిష్యత్ లో భారత్ కూడా చైనా ఎంటీసీఆర్ సభ్యత్వానికి అడ్డుపడొచ్చు. ఆ సందర్భమే తలెత్తితే.. ద్వైపాక్షిక చర్చల ద్వారా ఎన్ఎస్ జీ సభ్యత్వానికి మార్గాలు సుగమం చేసుకోవచ్చు. -
మోదీగారు ఎందుకిలా జరిగిందో చెప్పండి?
న్యూఢిల్లీ: అణు సరఫరాదారుల గ్రూప్ (ఎన్ఎస్జీ)లో భారత స్వభ్యత్వం విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. తరచూ విదేశీ పర్యటనలు చేపడుతున్నా.. ఎన్ఎస్జీలో భారత్ స్వభ్యత్వం విషయంలో ఎందుకంత ఘోరంగా విఫలమయ్యారో ఆదివారం ప్రధాని మోదీ దేశ ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో దేశ ప్రజలతో ముచ్చటించనున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో ‘మన్ కీ బాత్’ వేదికగా ఎన్ఎస్జీలో మనకు స్వభ్యత్వం రాకపోవడానికి కారణాలను దేశ ప్రజలకు చెప్పాలని కేజ్రీవాల్ కోరారు. -
ప్రధాని మోదీపై రాహుల్ ఫైర్
న్యూఢిల్లీ: అణు సరఫరాదారుల గ్రూప్ (ఎన్ఎస్జీ)లో భారత స్వభ్యత్వం కోసం నరేంద్రమోదీ ప్రభుత్వం చేసిన దౌత్యం విఫలమవ్వడంతో కాంగ్రెస్ పార్టీ కేంద్ర సర్కార్ పై విరుచుకుపడింది. సియోల్లో జరిగిన ఎన్ఎస్జీ సదస్సులో అంతర్జాతీయంగా భారత్ కు ఇది భంగపాటుగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించగా.. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరో అడుగు ముందుకేసి.. నేరుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఎన్ఎస్జీలో భారత్కు స్వభ్యత్వ నిరాకరణ మోదీ దౌత్య వైఫల్యానికి నిదర్శమని రాహుల్ ట్విట్టర్ లో విమర్శించారు. ఎన్ఎస్జీ విషయంలో నరేంద్రమోదీ జరిపిన సంపద్రింపులు విఫలమయ్యాయని, ఇది దౌత్యపరంగా మోదీ ఫెయిలవ్వడమేనని హ్యాష్ట్యాగ్ జోడించారు. ప్రతిష్టాత్మక ఎన్ఎస్జీలో స్వభ్యత్వం కోసం భారత్ కొన్ని నెలలుగా సంప్రదింపులు జరిపినప్పటికీ, చివరిక్షణంలో చైనా మోకాలడ్డటంతో ఈ ప్రయత్నం విఫలమైన సంగతి తెలిసిందే. NSG: How to lose a negotiation by Narendra Modi #FailedModiDiplomacy — Office of RG (@OfficeOfRG) June 24, 2016 -
మోదీ విదేశాంగవిధానంలో విఫలమయ్యారు:కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ విదేశాంగ విధానంలో విఫలమయ్యారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఎన్ఎస్జీలో భారత్ కు సభ్యత్వంలో తలెత్తిన సమస్యపై మోదీ సమాధానం చెప్పాలని కేజ్రీ డిమాండ్ చేశారు. తరుచుగా విదేశీ యాత్రలు చేసిన మోదీ విదేశాంగ విదానంలోపూర్తిగా విఫలమయ్యారని ట్వీటర్ లో కేజ్రీవాల్ కామెంట్ చేశారు. స్విర్డర్లాండ్ ఎన్ఎస్ జీలో భారత సభ్యత్వాన్ని వ్యతిరేకించడం వల్ల ఆదేశంలో పర్యటించి పూర్తి ఫలాలు సాధించలేకపోయారని అన్నారు. స్విస్ అధ్యక్షుడు జోహన్ ష్నీదర్ అమ్మన్ జూన్ 6 న ఎన్ఎస్జీలో భారత సభ్యత్వానికి మద్దతును తాము ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించినపుడు ఇటీవల ఆదేశంలో ఎందుకు పర్యటించలేదని ఆయన ప్రశ్నించారు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్ పీటీ) లో సంతకం చేయనందువల్లే ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వానికి మద్దతును చైనా,స్విర్డర్లాండ్ నిరాకరించిన విషయం తెలిసిందే. -
భారత్కు ప్రధాన అడ్డంకిగా మారిన చైనా!
సియోల్: అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో భారత్కు సభ్యత్వం విషయంలో భారత్కు చైనా ప్రధాన అడ్డంకిగా మారింది. 48 దేశాల అణుసరఫరాదారుల బృందంలో ఒకటి రెండు దేశాలు మినహా మిగతా దేశాలన్ని భారత్కు అనుకూలంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేసిట్లు సమాచారం. అయితే చైనా మాత్రం నాన్-ప్రొలిఫరేషన్ ట్రిటీ(ఎన్పీటీ)పై సంతకాలు చేసిన దేశాలకు మాత్రమే ఎన్ఎస్జీలో సభ్యత్వం కలిపించాలనే వాదనను వినిపిస్తూ భారత్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ఇకపోతే ఎన్పీటీపై సంతకం చేయని మరో దేశం పాకిస్తాన్కు ఎన్ఎస్జీలో సభ్యత్వానికి చైనా సపోర్ట్ చేస్తుండటం విశేషం. ఎన్పీటీపై సంతకం చేయని పాక్కు కూడా ఎన్ఎస్జీలో సభ్యంత్వం కల్పించాలన్న చైనా వాదనను మెజారిటీ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. గతంలో భారత సభ్యత్వానికి అనుకూలం అని తెలిపిన స్విట్జర్లాండ్ కూడా శుక్రవారం..ఎన్పీటీపై సంతకం చేసిన దేశాలకే సభ్యత్వం కల్పించాలనే వాదనను వినిపిస్తుండటం కొంత ప్రతికూల అంశం. -
ఎన్ఎస్జీ సభ్యత్వంపై ప్రతిష్టంభన
తాష్కెంట్/సియోల్: అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో భారత్కు సభ్యత్వంపై సియోల్లో గురువారం రాత్రి జరిగిన ప్రత్యేక భేటీ ఎలాంటి పరిష్కారం లేకుండానే ముగిసింది. ఈ అంశంపై ఎన్ఎస్జీ సభ్య దేశాలు రెండుగా చీలిపోయాయి. చైనాతోపాటు టర్కీ, న్యూజిలాండ్, ఆస్ట్రియా, ఐర్లాండ్ కూడా భారత్కు సభ్యత్వంపై అభ్యంతరం తెలిపాయి. బ్రిక్స్ కూటమిలో భారత్తో పాటు సభ్య దేశంగా ఉన్న బ్రెజిల్ కూడా వ్యతిరేకత వ్యక్తం చేసింది. శుక్రవారం జరిగే రెండో రోజు ప్లీనరీలో పరిష్కారం దొరుకుతుందేమోనని భారత్ ఆశాభావంతో ఉంది. గురువారం ఉదయం ఎన్ఎస్జీ ప్లీనరీ ప్రారంభ సదస్సులో జపాన్తో పాటు మరి కొన్ని దేశాలు భారత్ అంశాన్ని లేవనెత్తాయి. నాన్-ఎన్పీటీ దేశాలకు సభ్యత్వ అంశం ఎజెండాలో లేకపోవడంతో... రాత్రి ప్రత్యేకంగా భేటీ అవ్వాలని సభ్యదేశాలు నిర్ణయించాయి. జిన్పింగ్తో మోదీ భేటీ అంతకుముందు ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం భారత్కు మద్దతివ్వాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) సదస్సు సందర్భంగా ఇద్దరు నేతలు దాదాపు 50 నిమిషాల సేపు భేటీ అయ్యారు. ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం భారత విజ్ఞప్తిని నిజాయితీగా, సమస్యను పరిష్కరించే లక్ష్యంతో పరిశీలించాలని మోదీ కోరారు. ఇతర అంశాలతో ముడిపెట్టకుండా నిర్ణయం తీసుకోవాలని, సియోల్ సదస్సులో ఏకాభిప్రాయం వచ్చేందుకు చైనా సహకరించాలని విజ్ఞప్తిచేశారు. ఎన్ఎస్జీలో భారత సభ్యత్వాన్ని చైనా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ కీలక భేటీ జరిగింది. చైనా స్పందనపై మాట్లాడేందుకు విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి వికాస్ స్వరూప్ నిరాకరించారు. ‘ఇది సంక్లిష్ట, సున్నితమైన అంశం... సియోల్ నుంచి ఎలాంటి సమాచారం వస్తుందోనని ఎదురుచూస్తున్నాం’ అని చెప్పారు. అంతకుముందు పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ కూడా చైనా అధ్యక్షుడితో చర్చించారు. ఎన్ఎస్జీ సభ్యత్వం అంశంలో పాక్కు మద్దతిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. సియోల్ ప్లీనరీపై మోదీ-జిన్పింగ్ భేటీ ప్రభావం ఉంటుందని భారత్ ఆశలు పెట్టుకున్నా ఫలితం దక్కలేదు. చైనా మద్దతు కీలకం కావడంతో... ఆ దేశాన్ని ఒప్పిస్తే ఇతర దేశాల అభ్యంతరాలు కూడా తొలగిపోతాయని భావించింది. మొదటి నుంచి చైనా... భారత్ను వ్యతిరేకిస్తూనే పాక్కు అనుకూలంగా పావులు కదిపింది. సభ్యత్వం పొందాలంటే 48 సభ్య దేశాల ఏకాభిప్రాయం తప్పనిసరి. -
పాక్ కు మద్దతు.. భారత్ కు నై!
బీజింగ్: న్యూక్లియర్ సరఫరా బృందం (ఎన్ఎస్జీ)లో భారత్ స్వభ్యత్వంపై ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్న చైనా.. అదే సమయంలో మన పొరుగుదేశం పాకిస్థాన్ కు మద్దతు పలుకుతోంది. ఎన్ఎస్జీలో భారత్ స్వభ్యత్వానికి మోకాలడ్డుతున్న చైనా.. అదే సమయంలో వ్యూహాత్మకంగా పాకిస్థాన్ కు స్వభ్యత్వం ఇవ్వాలన్న వాదనను తెరపైకి తెస్తోంది. ఈ నేపథ్యంలోనే న్యూక్లియర్ సరఫరా బృందం (ఎన్ఎస్జీ) లో తమ సభ్యత్వానికి తమ సన్నిహిత మిత్రదేశం చైనా మద్దతు తెలిపిందని పాక్ విదేశీ కార్యదర్శి ఎజాజ్ చౌదరీ తెలిపారు. తాష్కెండ్ లో చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో సమావేశమైన పాకిస్థాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ ఈ మేరకు హామీ లభించిందని ఆయన తెలిపారు. ఇందుకుగాను హుస్సేన్ చైనా అధ్యక్షునికి ధన్యవాదాలు తెలిపారని చెప్పారు. కాగా, చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్ తో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశమై.. ఎన్ఎస్ జీ లో భారత స్వభ్యత్వానికి మద్దతు తెలుపాలని కోరారు. ఎన్ఎస్జీలో భారత్ స్వభ్యత్వంపై పారదర్శకంగా నిర్ణయం తీసుకోవాలని మోదీ చైనాను కోరారు. -
భారత్కు పాకిస్థాన్ వెన్నుపోటు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మరోసారి భారత్పై తన అక్కసును బయటపెట్టింది. ఓ పక్కసోదరభావంతో మెలుగుదామని చెబుతూనే సరిగ్గా వెన్నుపోటు పొడిచామని బహిరంగంగా ప్రకటించింది. ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ కు విదేశీ వ్యవహారాలపై సలహాలు సూచనలు ఇచ్చే సర్తాజ్ అజీజ్ వ్యాఖ్యలు చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్(ఎన్ఎస్జీ)లో సభ్యత్వం కోసం భారత్ అన్ని విధాల కృషి చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎన్ఎస్జీలో సభ్య దేశాలన్నీ కూడా ఇందుకు ఒప్పుకున్నాయి. అయితే, చైనా రూపంలో భారత్కు గట్టి సమస్య ఎదురైంది. భారత్కు సభ్యత్వం ఇస్తే.. పాకిస్థాన్కు కూడా సభ్యత్వం ఇవ్వాల్సిందేనని చైనా డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే, చైనా ఈ ప్రకటన చేయడానికి వెనుక పాక్ ఉన్నట్లు స్పష్టమైంది. పాక్ పార్లమెంటులో అజీజ్ మాట్లాడుతూ'ఎన్ఎస్జీలో సభ్యత్వం పొందకుండా ఉండేందుకు భారత్ను సమర్థంగా కట్టడి చేశాం' అని అన్నారు. వివక్షలేకుండా, మెరిట్ ఆధారంగా మాత్రమే ఎన్ఎస్జీలో సభ్వత్వం ఇవ్వాలని తాము డిమాండ్ చేసినట్లు చెప్పారు. ఎన్ఎస్ జీ విషయంలో భారత్ ను అడ్డుకునేందుకు వీలయినంతగా కృషిచేసి విజయం సాధించామని అన్నారు. త్వరలో ఎన్ఎస్జీ సభ్య దేశాలు భేటీ అవనున్న నేపథ్యంలో అజీజ్ చేసిన ఈ వ్యాఖ్య ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాకుండా, భారత ప్రధాని నరేంద్రమోదీ ముస్లిం దేశాల్లో పర్యటించిన మాత్రానా ఆ దేశాలతో పాకిస్థాన్కు సంబంధాలు బలహీనం కాబోవని, భాషా, మతం, సంస్కృతివంటి విషయాలతో పోలిస్తే అందరం ఒకటే అని అన్నారు. -
'ఎన్ఎస్జీలో భారత్కు కచ్చితంగా సభ్యత్వం'
ఢిల్లీ: ఎన్ఎస్జీ లో భారత్కు కచ్చితంగా సభ్యత్వం వస్తుందని ఆశిస్తున్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ వెల్లడించారు. రెండేళ్ల ఎన్డీఏ ప్రభుత్వం పాలనపై ఆదివారం మంత్రి సుష్మా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలతో 43 శాతం ఎఫ్డీఐలు పెరిగాయని అన్నారు. ఈ ఏడాదిలోపు అన్ని దేశాలతో భారత్కు సత్సంబంధాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే దాడులు, చర్చలు ఏక కాలంలో సాధ్యం కావని సుష్మా అభిప్రాయపడ్డారు. -
'ఎన్ఎస్జీలో భారత్ ఉంటే చైనాకు ప్రమాదం'
బీజింగ్: అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో భారత సభ్యత్వాన్ని వ్యతిరేకిస్తున్న పొరుగుదేశం చైనా ఆ అంశంపై తాజాగా మరింత కఠిన స్వరం వినిపించింది. ఎన్ఎస్జీలో భారత్కు సభ్యత్వం ఇస్తే చైనా జాతీయ ప్రయోజనాలు ప్రమాదంలో పడతాయని, పాకిస్తాన్ను రెచ్చగొట్టినట్టవుతుందని చైనా అధికారిక మీడియా మంగళవారం వ్యాఖ్యానించింది. ఎన్ఎస్జీలో భారత్కు సభ్యత్వం లభించినట్లయితే ఈ ప్రాంతంలో అణ్వస్త్ర పోటీ నెలకొనే అవకాశముందని పేర్కొంది. కాగా, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ)లో ఏడాది లోపల భారత్కు పూర్తిస్థాయి సభ్యత్వం లభించే అవకాశముందని ఆ సంస్థ సెక్రటరీ జనరల్ రషీద్ అలిమోవ్ పేర్కొన్నారు. -
చైనా దుస్సాహసం
ఈటానగర్: పైకి మిత్రుడిగా నటిస్తూ, అంతర్జాతీయ వేదికలపై భారత్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతోన్న చైనా మరో దుస్సాహసానికి ఒడిగట్టింది. చైనీస్ పీపుల్ లిబరేషన్ ఆర్మీకి చెందిన 250 మంది సైనికులు గత వారం అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దును దాటి భారత భూభాగంలోకి ప్రవేశించారని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. అరుణాచల్ ప్రదేశ్ లో సరిహద్దు ప్రాంతమైన కమేంగ్ జిల్లాలోకి జూన్ 9న.. భారీ ఆయుధాలు కలిగిన సుమారు 250 మంది ఎర్ర సైనికులు చొరబడ్డారని, దాదాపు నాలుగు గంటలపాటు అక్కడే గడిపి, తిరిగి వెళ్లిపోయారని రక్షణ శాఖ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. అణుసరఫరా దేశాల కూటమిలో భారత్ చేరికను గట్టిగా వ్యతిరేకిస్తోన్న చైనా.. వీలైననన్ని వక్రమార్గాల్లోనూ ఇండియాను రెచ్చగొట్టాలని చూస్తోంది. గతంలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ పై చర్యల ప్రక్రియకు చైనా అడ్డుతగిలిన సంగతి తెలిసిందే. కాగా, గడిచిన రెండు మూడేళ్లలో పలు మార్లు సరిహద్దు ఒప్పందాల అతిక్రమణలకు పాల్పడిన చైనా.. ఆ దేశ అధ్యక్షుడు జింగ్ పిన్ భారత్ పర్యటన తర్వాత కాస్త వెనక్కుతగ్గింది. సరిగ్గా కమేంగ్ జిల్లా తూర్పు ప్రాంతమైన యంగ్టే వద్ద చైనీస్ ఆర్మీ భారత్ లోకి చొరబడిందని, ఈ ఏడాదిలో చోటుచేసుకున్న మొదటి చొరబాటు ఇదేనని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. తదుపరి ఏం చెయ్యాలనేదానిపై ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. -
ఎన్ఎస్ జీ సభ్యత్వానికి మెక్సికో మద్దతు
మెక్సికో: అమెరికా, స్విట్జర్లాండ్ ల తర్వాత కీలకమైన న్యూక్లియర్ సప్లైయర్స్ గ్రూప్(ఎన్ఎస్జీ)లో భారత్ స్థానం కోసం మెక్సికో మద్దతు తెలిపింది. గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సంప్రదింపులు జరిపిన ఆ దేశ అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో తమ మద్దతును ప్రకటించారు. మోదీతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. దీంతో ఎన్రిక్ కు ధన్యవాదాలు తెలిపిన మోదీ మెక్సికో భారత్ కు ఎనర్జీ సెక్యురిటీలో కీలకభాగస్వామిగా పేర్కొన్నారు. ఐదు దేశాల పర్యటన కోసం వెళ్లిన మోదీ చివరగా మెక్సికోలో ఆ దేశ అధ్యక్షుడితో సమావేశమై చర్చలు జరిపారు. అమ్మకందారు-కొనుగోలుదారులుగా కాకుండా అంతకంటే మంచి భాగస్వామ్యంతో ముందకెళ్తామని అన్నారు. ట్రేడ్ సెక్టార్, పెట్టుబడులు, వాతావరణ మార్పులు, ఎనర్జీ తదితర ఒప్పందాలపై ఇరువురు సంతకాలు చేశారు. చైనా ఎన్ఎస్ జీలో భారత సభ్యత్వాన్ని వ్యతిరేకిస్తుండటంతో మెక్సికో, స్విట్జర్లాండ్ల మద్దతు భారత్ కు కలిసొచ్చే అంశం. భారత్ కు న్యూక్లియర్ ఆయుధాల అమ్మకాలకు సంబంధించిన ఎన్పీటీలో స్థానం లేదని చైనా వాదిస్తుండగా.. భారత్ ట్రాక్ రికార్డు కారణంగా తాము, మిగతా దేశాలు ఇందుకు సపోర్ట్ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మంగళవారం తెలిపిన విషయం తెలిసిందే. ఎన్ఎస్ జీ స్థానం వల్ల అటామిక్ ఎనర్జీ సెక్టార్ లో భారత్ భారీగా లాభపడుతుంది. -
ఆ దేశం శాంతియుతం.. అందుకే!
వాషింగ్టన్: భారత్ కు న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్(ఎన్ఎస్ జీ) లో స్థానం కల్పించడం పట్ల అమెరికా పాకిస్తాన్ కు వివరణ ఇచ్చింది. భారత్ కు అమెరికా మద్దతు తెలపడం కేవలం ఆయుధాల అమ్మకానికి సంబంధించింది కాదనీ, ప్రపంచంలోని న్యూక్లియర్ టెక్నాలజీని శాంతియుతంగా వినియోగించేందుకేననీ.. ఈ విషయాన్ని పాకిస్తాన్ అర్ధం చేసుకుంటే బాగుంటుందని శుక్రవారం అమెరికా డిప్యూటీ ప్రతినిధి మార్క్ టోనర్ తెలిపారు. భారత్ కు గ్రూప్ లో స్థానాన్ని కల్సించడంపై మాట్లాడిన ఆయన మొత్తం 48 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్న ఎన్ఎస్ జీ లో ఓటింగ్ తర్వాత భారత్ సభ్యత్వంపై క్లారిటీ వస్తుందని వివరించారు. న్యూక్లియర్ సప్లై గ్రూప్ లో కొత్తగా సభ్యులను చేర్చుకోవడమా? లేదా? అన్నది వారి ఇష్టమని ఈ విషయంపై ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేని తెలిపారు. త్వరలో జరగనున్న ఎన్ఎస్ జీ సమావేశాలు నూతన సభ్యత్వాలకు సంబంధించినవి కావని వివరించారు. పాకిస్తాన్ తన ఇష్టాన్ని బహిర్గతం చేసుకుందనీ ఎన్ఎస్ జీ లో సభ్యత్వం కోసం ఏ దేశమైనా దరఖాస్తు చేసుకోవచ్చని నిర్ణయం సభ్యుల మధ్య ఏకాభిప్రాయం పై ఆధారపడి ఉంటుంది. -
పఠాన్ కోట్ లో మరో ఉగ్రవాది హతం
పఠాన్ కోట్: పంజాబ్ లోని పఠాన్ కోట్ లో చొరబడ్డ ఉగ్రవాదుల్లో మరొకరిని సైనిక బలగాలు మట్టుబెట్టాయి. రెండతస్తుల భవనంలో నక్కిన ఉగ్రవాదిని కమెండోలు హతమార్చాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ ఆపరేషన్ లో ఇప్పటివరకు హతమార్చిన ఉగ్రవాదుల సంఖ్య ఆరుకు చేరింది. కూంబింగ్ కొనసాగుతోంది. వైమానిక దళంలోకి చొరబడిన ముష్కరులను మట్టుమెట్టేందుకు వరుసగా మూడో రోజు సైనిక ఆపరేషన్ కొనసాగుతోంది. శనివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లోకి ఉగ్రవాదులు చొరబడ్డారు. వీరిని తుదముట్టించే క్రమంలో ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 20 మంది గాయపడ్డారు. అయితే ఎంతమంది ఉగ్రవాదులు చొరబడ్డారనే దానిపై స్పష్టత లేదు. -
ఎన్ఎస్జీ నూతన డీజీ తాయల్
న్యూఢిల్లీ: ఉగ్రవాద నిరోధక సంస్థ అయిన జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) నూతన డెరైక్టర్ జనరల్ (డీజీ)గా హరియాణాకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్.సి. తాయల్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి కేంద్ర హోంశాఖ ఆమోదం తెలపడంతో సోమవారం ఈ మేరకు ఉత్తర్వు జారీ అయింది. అస్సాం-మేఘాలయా క్యాడర్కు చెందిన 1980 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన తాయల్ వచ్చే ఏడాది ఆగస్టులో పదవీవిరమణ చేసే వరకూ ఈ పదవిలో కొనసాగనున్నారు. ఎన్ఎస్జీ ప్రస్తుత చీఫ్ జె.ఎన్. చౌధురి మే 31న రిటైర్ కావడంతో అప్పటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. ప్రస్తుతం సీఆర్పీఎఫ్ ప్రత్యేక డెరైక్టర్ జనరల్గా పనిచేస్తున్న తాయల్ గతంలో సశస్త్ర సీమా బల్ అదనపు డెరైక్టర్ జనరల్గా పనిచేశారు. ఉగ్రవాద, హైజాక్ నిరోధానికి ఎన్ఎస్జీని 1984లో ఏర్పాటు చేశారు. -
పోలీసులు రెడీ
‘మావోయిస్టులతో మరో యుద్ధం మొదలైంది’..కొద్ది రోజుల క్రితం జిల్లా పోలీసులు చేసిన ప్రకటన ఇది. ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రత్యేక బలగాలు విశాఖలో అడుగుపెట్టాయి. మాక్ డ్రిల్ పేరుతో నాలుగు రోజులుగా మకాం వేశాయి. మంగళవారం నుంచి ఏజెన్సీలో పీఎల్జీఏవారోత్సవాలను అడ్డుకునేందుకు పోలీస్ యంత్రాంగం భారీ సన్నాహాలు చేస్తోంది. విశాఖ నగరంలో ఉన్న 250 మంది ఎన్ఎస్జీ, ఆక్టోపస్ బలగాలను వినియోగించుకోవాలని చూస్తోంది. నిజానికి మావోలపై యుద్ధానికే ఇంత మందిని రంగంలోకి దింపారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఛత్తీస్గఢ్లో సోమవారం నాటి ఘటనతో మరింత అప్రమత్తమయ్యారు. వారోత్సవాలను అడ్డుకుంటామని ఓఎస్డీ విశాల్గున్ని ప్రకటించారు. సాక్షి, విశాఖపట్నం: వీరవరంలో కొద్ది రోజుల క్రితం మావోయిస్టులను గిరిజనులు హతమార్చడంతో మొదలైన అలజడి క్షణ క్షణం భయాన్ని సృష్టిస్తూనే ఉంది. ఆ సంఘటనకు ప్రతీకారం తీర్చుకుంటామని, కారకులను ప్రజాకోర్టులో శిక్షిస్తామని మావోయిస్టులు హెచ్చరికలు చేయడంలో గిరిజనులు కలవరపడుతున్నారు. ఇదే అదునుగా పోలీసులు పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నారు. గిరిజనులు, మావోయిస్టుల మధ్య ఏర్పడిన అంతరాన్ని పెద్దది చేసి శాశ్వతంగా వారి బంధాన్ని తెంచాలని ప్రమత్నిస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన దళసభ్యులు పోలీసులపై ఆగ్రహంతో ఉన్నారు. పోలీసులే కొందరు గూండాలతో తమ వారిని హత్య చేయించారని,గిరిజనులతో గ్రామ రక్షక దళాలను ఏర్పాటు చేస్తున్నారని, అయినా తాము భయపడేది లేదని లేఖల ద్వారా స్పష్టం చేశారు. జిల్లాలో ఓ వైపు పోలీసులు, గిరిజనులు, మావోయిస్టుల మధ్య పరస్పర యుద్ధ వాతావరణం నెలకొంది. మరోవైపు విశాఖ నగరానికి ఈ నెల 27న ఎన్ఎస్జీ, ఆక్టోపస్ పోలీసులు 250మంది చేరుకున్నారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు గోప్యంగా ఉంచాయి. అసాంఘిక శక్తులు, ఉగ్రవాదులు దాడులకు తెగబడితే ఏ విధంగా ఎదుర్కొవాలనేదానిపై విశాఖలో మాక్డ్రిల్ నిర్వహించడానికి వచ్చారని అధికారులు చెబుతున్నారు. దీనిపై సోమవారం ఓ హోటల్లో ఎన్ఎస్జి మేజర్ సూరజ్, ఆక్టోపస్ అడిషనల్ ఎస్పీ చిట్టిబాబులు జిల్లా పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. మంగళవారం బీచ్ రోడ్డులోని ఓ హోటల్లో మాక్డ్రిల్ నిర్వహించాలని నిర్ణయించారు. 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకూ మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతుండటంతో అత్యవసరమైతే అందుబాటులో ఉండేలా ఇంతమంది సిబ్బందిని జిల్లాకు రప్పించారని సమాచారం. ప్రత్యేక వాహనాలు, ట్రక్కులు కూడా వీరికి అందుబాటులో ఉంచారు. మావోయిస్టుల వారోత్సవాలు, పోలీసుల మాక్డ్రిల్తో జిల్లాలో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఛత్తీస్గఢ్లో సోమవారం మావోయిస్టులు దాడి చేసి పోలీసులను మట్టుబెట్టడంతో మరింత అప్రమత్తమయ్యారు. పెద్ద ఎత్తున బలగాలను మన్యానికి తరలిస్తున్నట్టు ఓఎస్డీ విశాల్గున్ని ‘సాక్షి’కి తెలిపారు. -
'ఐఎస్ఐఎస్ నుంచి భారత్ కు ముప్పు'
ఢిల్లీ: ఐఎస్ఐఎస్, ఆల్ ఖైదా నుంచి భారత్ కు ఉగ్రవాద ముప్పు ఉందని ఎన్ఎస్జీ(నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్) హెచ్చరించింది. ఒకేసారి పలుపట్టణాల్లో దాడులు చేసే అవకాశం ఉందని ఎన్ఎస్జీ డిప్యూటీ జనరల్ జయంత్ చౌదరి స్పష్టం చేశారు. ప్రధాన నగరాల్లో దాడి చేయడానికి ఐఎస్ఐఎస్, ఆల్ ఖైదాలు ఉమ్మడిగా దాడికి సిద్ధమవుతున్నాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానంగా గోవా, బెంగళూరు, అమృతసర్ లలో ఉగ్రదాడులు చేసే అవకాశం ఉందన్నారు. దీంతో పాటు పలుపట్టణాల్లో దాడులు చేయడానికి కూడా సంసిద్ధమైనట్లు తెలిపారు. రాబోవు పండుగల సీజన్ లో ఆ రెండు ఉగ్రవాద సంస్థలు దాడికి పాల్పడవచ్చని ఇంటలిజెన్సీ ఏజేన్సీ హెచ్చరించిన నేపథ్యంలో జయంత్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఇది ఆందోళన కల్గించే అంశమైనా.. దీన్ని ఎదుర్కొనడానికి ఎన్ఎస్జీ పూర్తి సన్నద్ధంగా ఉందని ఆయన తెలిపారు. -
గుజరాత్లో ఎన్ఎస్జీ ప్రాంతీయ కేంద్రం
గుజరాత్లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పటుచేయడానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు లోక్సభకు మంగళవారం తెలిపారు. ఎన్ఎస్జీ తమకు అనుకూలంగా ఉంటుందని సూచించిన ప్రాంతంలోనే ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామని సభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఆయన తెలిపారు. గుజరాత్ ప్రభుత్వం ఈ కేంద్రం కోసం రెండు ప్రదేశాలను సూచించిందని, ఎన్ఎస్జీ బృందం ఇప్పటికే రెండు ప్రదేశాలూ సందర్శించి నివేదిక సమర్పించిందని ఆయన అన్నారు. అయితే అవి ఎంతవరకు సరిపోతాయనే విషయాన్ని అంచనా వేస్తున్నారని రిజిజు తెలిపారు. గుజరాత్ ప్రభుత్వం నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని, భూమిని ఉచితంగా ఇస్తామని ఆ రాష్ట్ర సర్కారు ముందుకొచ్చిందని ఆయన అన్నారు. ఇప్పటికే తమిళనాడులోని చెన్నై, తెలంగాణాలోని హైదరాబాద్, పశ్చిమబెంగాల్లోని కోల్కతా, ముంబైలోని మహారాష్ట్ర నగరాల్లో నాలుగు ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. -
భారీ భద్రత మధ్య రోడ్షో
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం సాధించిన తర్వాత తొలిసారి నగరానికి వచ్చిన ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ రోడ్షో భారీ భద్రత మధ్య సాగింది. ఢిల్లీ విమానాశ్రయం నుంచి బీజేపీ కార్యాలయం వరకు ఆయన నిర్వహించిన రోడ్షోకు బహుళ అంచెల భద్రత కల్పించారు. సుమారు వందమంది పోలీసులు, ఎన్ఎస్జీ కమాండోలు రక్షణ కవచంలా విధులు నిర్వహించారు. రోడ్షో జరిగిన ప్రాంతాలన్నింటిలో పోలీసులు డేగకన్నుతో పహరా కాశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని, వ్యక్తిని తనిఖీ చేశారు. ఆశోకా రోడ్డులోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు, ఎన్ఎస్జీ కమాండోలతో బహుళ అంచెల భద్రతను కల్పించారు. రోడ్షో జరిగిన ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహించామని, ట్రాఫిక్ను కూడా మళ్లించామని జాయింట్ కమిషనర్ ఎంకే మీనా తెలిపారు. అన్ని భద్రతా సంస్థలు ఢిల్లీ పోలీసులతో సమన్వయం చేసుకున్నాయని అన్నారు. ఏ సమయంలో ఏమీ జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేందుకే ఈ భద్రతా ఏర్పాట్లని తెలిపారు. ట్రాఫిక్ మళ్లింపు... ఐజీఐ ఎయిర్ పోర్టు నుంచి బీజేపీ ప్రధాన కార్యాలయం వరకు ట్రాఫిక్ మళ్లించారు. ఉదయం పది గంటలకు టెర్మినల్-3 నుంచి వెళ్లే వాహనాలను సెంటౌర్ హోటల్, మహిపాల్పూర్కు మళ్లించారు. ఉదయం 11 గంటలకు దౌలా కౌన్, సర్ధార్ పటేల్ మార్గ్ ప్రాంతాల నుంచి ఇతర రోడ్లకు ట్రాఫిక్ను మళ్లించారు. ఐజీఐ ఎయిర్పోర్టు టెర్మినల్ త్రీ నుంచి సర్వీసు రోడ్డు, సెంట్రల్ స్పైన్ రోడ్డు, ఏరోసిటీ, దౌలా కువాన్ ఫ్లైఓవర్, సర్ధార్ పటేల్ మార్గ్, మదర్ థెరిస్సా క్రిసెంట్, టీన్ మూర్తి మార్గ్ నుంచి అక్బర్ రోడ్డు, మోతీలాల్ నెహ్రూ పాలెస్, జన్పథ్, విండ్సర్ ప్లేస్ మీదుగా ఆశోకారోడ్డులోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి మోడీ చేరుకున్నారు. ప్రధానమంత్రికి కల్పించే అన్ని సదుపాయాలను మోడీ రోడ్షోకు కల్పించామని పోలీసు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ రోడ్ షో ఉంటుందని ముందే తెలపడంతో అనేకమంది నగరవాసులు ప్రజా రవాణా వ్యవస్థ బస్సులు, మెట్రో రైళ్లను ఆశ్రయించారని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీసు (ట్రాఫిక్) అనిల్ శుక్లా తెలిపారు. -
ఎన్ఎస్జీ డెరైక్టర్గా జేఎన్ చౌదరి
న్యూఢిల్లీ: జాతీయ భద్రతా దళం(ఎన్ఎస్జీ) నూతన డెరైక్టర్ జనరల్గా అస్సాం-మేఘాలయ కేడర్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి జేఎన్ చౌధురి గురువారం ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు. ఉగ్రవాద నిరోధకం, హైజాకర్ల ఆటకట్టించడం సహా వీవీఐపీల భద్రతను పర్యవేక్షించే ‘బ్లాక్ క్యాట్’(ఎన్ఎస్జీ) కమెండోలకు 28వ డీజీగా 2015 మే వరకు ఈయన వ్యవహరిస్తారు. ఢిల్లీ వర్సిటీ నుంచి ఎకనామిక్స్లో పీజీ చేసిన చౌధురి 1978లో ఐపీఎస్కు ఎంపికై అస్సాం డీజీపీగాను తర్వాత ఇంటిలిజెన్స్ బ్యూరోలోనూ విధులు నిర్వహించారు.