Population ratio
-
ముంచుకొస్తున్న జనాభా సంక్షోభం
ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో నిరుద్యోగం పెచ్చురిల్లుతోంది. సరైన సంపాదన అవకాశాలులేక ప్రజలు పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారు. దానికితోడు కొన్నిదేశాల్లో పెరుగుతున్న జనాభా ఆయా ప్రాంతాల అభివృద్ధికి సవాలుగా మారుతుంటే.. యూరప్లాంటి ఇంకొన్ని ప్రాంతాల్లో తగ్గుతున్న జనాభా భవిష్యత్తులో శ్రామికశక్తి లోటును సూచిస్తోంది. జనన రేటు, వృద్ధాప్యం, వలసలు, ఆర్థిక మార్పులు వంటి వివిధ అంశాలతో 2100 నాటికి యూరప్ జనాభా భారీగా తగ్గిపోతుందని కొన్ని సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి జనాభాను ఆకర్షించేందుకు, స్థానికులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేసేందుకు యూరప్ దేశాలు కొన్ని ప్రత్యేక వెసులుబాట్లు కల్పిస్తున్నాయి. అసలు యూరప్లో ఈ పరిస్థితులు నెలకొనేందుకుగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.వృద్ధులు అధికమవుతుండడంయూరప్ 2100 నాటికి ప్రపంచంలోనే అత్యధిక వృద్ధాప్య జనాభా ఉన్న ప్రాంతాల్లో ఒకటిగా ఉంటుందని అంచనా. ఆరోగ్య సంరక్షణలో పురోగతి వల్ల వృద్ధుల నిష్పత్తి గణనీయంగా పెరుగుతుంది. ఇప్పటికే జర్మనీ, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లో భారీగా వృద్ధులు పెరుగుతున్నారు. దేశ ఉత్పాదకతలో పెద్దగా పాలుపంచుకోని ఈ జనాభా వల్ల సామాజిక సంక్షేమ వ్యవస్థలు, ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు, పెన్షన్ పథకాలపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు, వృద్ధాప్య సమాజానికి మద్దతు ఇవ్వడానికి సమగ్ర విధాన సంస్కరణలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.తగ్గుతున్న జననాల రేటుఅనేక యూరప్ దేశాల్లో జననాల రేటు క్షీణిస్తోంది. ఈ ధోరణి రాబోయే దశాబ్దాల్లో అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. మారుతున్న సామాజిక నిబంధనలు, ఆర్థిక ఒత్తిళ్లు, జీవనశైలి వంటి అంశాలు ఈ తగ్గుదలకు దోహదం చేస్తాయి. దాంతో భవిష్యత్తులో గ్రీస్, పోర్చుగల్, హంగేరి వంటి దేశాలు స్థిరమైన శ్రామిక శక్తిని నిర్వహించడంలో సవాళ్లను ఎదుర్కోవచ్చు. ఇది కార్మికుల కొరతకు, ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది. దీన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు అధిక జనన రేటుకు అవసరమయ్యే విధానాలను అమలు చేయాలి. యువతకు, పనిచేసే తల్లిదండ్రులకు మద్దతుగా నిలిచేందుకు వినూత్న పరిష్కారాలను అన్వేషించాలి.వలసలే శరణ్యం?2100 నాటికి యూరప్ జనాభాపై వలసలు కీలక పాత్ర పోషిస్తాయని అంచనా వేస్తున్నారు. శ్రామిక కొరత, జనాభా అసమతుల్యతలను పరిష్కరించడానికి వలస విధానాలు మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. ఫ్రాన్స్, యునైటెడ్ కింగడమ్, స్వీడన్ వంటి దేశాలు గణనీయమైన సంఖ్యలో వలసదారులను ఆకర్షించే ప్రయత్నాలు చేయాల్సి ఉంది. ఇది జనాభా పెరుగుదలకు, వైవిధ్యానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలు ఈ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి.స్పెయిన్: గ్రామీణ ప్రాంతాల్లో జనాభా తగ్గుదలను పరిష్కరించేందుకు ఆయా ప్రాంతాల్లో నివసించాలనుకునేవారికి ప్రత్యేకంగా 3,000 యూరోలు(రూ.2.7 లక్షలు) అందిస్తుంది. పిల్లలతో ఉన్న కుటుంబాలు అదనపు బోనన్ను పొందవచ్చు.ఇటలీ: ఇటలీ తన ప్రాంతాల్లో తిరిగి జనావాసాన్ని పెంచే కార్యక్రమాలను ప్రారంభించింది. మోలిస్, కాలాబ్రియా, సిసిలీ వంటి ప్రాంతాల్లో నివసించాలనుకునే కొత్తవారికి మూడు సంవత్సరాలకుగాను 28,000 యూరోలు(రూ.25.44 లక్షలు) అందిస్తుంది. దాంతోపాటు స్థానిక వ్యాపారాన్ని ప్రారంభించడానికి గ్రాంట్లు కూడా పొందవచ్చు. ఒక యూరో(సుమారు రూ.91) కంటే తక్కువకు గృహాలను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తుంది.గ్రీస్: మారుమూల ద్వీపం అంటికైథెరాలో నివసించడానికి గ్రీస్ కొత్త నివాసితులను ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభించింది. అక్కడ నివసించాలనుకునే వారికి గృహ సహాయంతో పాటు ఏటా 3,000 యూరోలు(రూ.2.7 లక్షలు) వరకు గ్రాంట్లను అందిస్తుంది. ఈ చొరవ వల్ల ఆ ద్వీపం సంస్కృతిని పరిరక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది.ఐర్లాండ్: ఐర్లాండ్ ద్వీపాల్లో నివసించడానికి ఇష్టపడేవారికి గృహ పునరుద్ధరణ, పునరావాస గ్రాంట్ల కోసం ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు.పట్టణీకరణ, ప్రాంతీయ అసమానతలుపట్టణీకరణ పెరుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఉపాధికోసం, ఇతర కారణాల వల్ల లండన్, పారిస్, బెర్లిన్ వంటి ప్రధాన నగరాల్లో నివసిస్తున్నారు. ఇవి ఆర్థిక కార్యకలాపాలు, సాంస్కృతిక వైవిధ్యానికి కేంద్రాలుగా ఉన్నప్పటికీ ప్రాంతీయ అసమానతలకు దారితీస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలు జనాభా, ఆర్థిక క్షీణతను ఎదుర్కొంటున్నాయి. ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించడం, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టడం, తక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో అవకాశాలను పెంపొందించడం ద్వారా ఈ అసమతుల్యతలను పరిష్కరించాలి.సాంకేతిక పురోగతి, భవిష్యత్తు అవకాశాలుయూరప్ భవిష్యత్తు జనాభాను పెంపొందించడంలో సాంకేతిక పురోగతి కీలక పాత్ర పోషిస్తుంది. ఆటోమేషన్, కృత్రిమ మేధస్సు, ఆరోగ్య సంరక్షణలో పురోగతి శ్రామిక శక్తిని ప్రభావితం చేస్తాయి. ప్రభుత్వాలు, వ్యాపారాలు నూతన మార్పులకు అనుగుణంగా మారాలి. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో అవసరమైన నైపుణ్యాలు, వనరులను పౌరులు కలిగి ఉన్నారో లేదో నిర్ధారించుకుని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి.ఇదీ చదవండి: కుమారుడి పెళ్లి ఖర్చుపై విమర్శలు.. నీతా అంబానీ రిప్లై2100 నాటికి యూరప్ దేశాల్లో జనాభా క్షీణత ఇలా..దేశం జనాభా క్షీణత తగ్గుదలపోలాండ్ 1.88 కోట్లు 49%జర్మనీ 1.31 కోట్లు 16%ఇటలీ 2.38 కోట్లు 40%ఉక్రెయిన్ 2.38 కోట్లు 61%బల్గేరియా 32 లక్షలు 47%లిథువేనియా 16 లక్షలు 57%లాట్వియా 9.28 లక్షలు 50%సెర్బియా 30 లక్షలు 45%హంగేరీ 22 లక్షలు 23% -
Mahakumbh-2025: సంగమ తీరంలో.. ఢిల్లీకి నాలుగింతల జనాభా
ప్రయాగ్రాజ్: యూపీలోని ప్రయాగ్రాజ్లో కుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈరోజు(బుధవారం) మౌని అమావాస్య కావడంతో పుణ్యస్నానాలు చేసేందుకు లెక్కలేనంతమంది భక్తులు సంగమ తీరానికి చేరుకున్నారు.మౌని అమావాస్యకు ఒక రోజు ముందు అంటే మంగళవారం నాటికే ప్రయాగ్రాజ్కు భక్తులు తండోపతండాలుగా చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం దాదాపు 5.5 కోట్ల మంది సంగమంలో స్నానమాచరించారు. ప్రయాగ్రాజ్లో ప్రస్తుతం 8 నుంచి 10 కోట్ల మంది జనాభా ఉన్నారని ముఖ్యమంత్రి స్వయంగా తెలిపారు.ఈ గణాంకాల ప్రకారం చూస్తే ఇక్కడ ఇప్పుడున్న జనాభా.. ఢిల్లీలో ఉంటున్న జనాభాకు నాలుగు రెట్లు అధికంగా ఉంది. కుంభమేళా జరుగుతున్న ప్రాంతమంతా జనసంద్రంలా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రయాగ్రాజ్ నగరంలో దాదాపు 10 కోట్ల మంది ఉన్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. కుంభమేళా జరుగుతున్న ప్రాంతం నాలుగు వేల హెక్టార్లలో విస్తరించి ఉంది. ఇక్కడ అధికారులు 45 ఘాట్లను ఏర్పాటు చేసినప్పటికీ, భక్తులు త్రివేణీ సంగమంలోనే స్నానాలు చేయాలని భావిస్తున్నారు. దీంతో సంగమ ప్రాంతంలో విపరీతంగా భక్తుల రద్దీ నెలకొంది. కుంభమేళా ప్రాంతంలోని భూలా బిస్రా సెంటర్లో భక్తుల రద్దీ భారీగా కనిపిస్తోంది. భద్రతా దళాలు అప్రమత్తంగా వ్యవహరిస్తూ పరిస్థితులను సమీక్షిస్తున్నాయి. ఇది కూడా చదవండి: Mahakumbh-2025: తొక్కిసలాట తర్వాత హెలికాప్టర్ నిఘా పెంపు -
జనాభా తగ్గుతోంది... వృద్ధులు పెరుగుతున్నారు
ఇటు జనాభా క్షీణిస్తోంది. అటు వృద్ధుల సంఖ్య భారీగా పెరుగుతోంది. చైనా సహా అనేక దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లివి. పెళ్లికి, పిల్లలను కనేందుకు యువతరం పెద్దగా ఇష్టపడటం లేదు. కాస్త అటూ ఇటుగా ప్రపంచమంతటా ఇదే ధోరణి పెరుగుతోంది. దాంతో ఏ దేశంలో చూసి నా జనాభా క్రమంగా తగ్గుతోంది. 2024లో చైనా జనాభా 10.4 లక్షలు తగ్గింది. అక్కడ జనాభా తగ్గడం వరుసగా ఇది మూడో ఏడాది. జపాన్లోనైతే 15 ఏళ్లుగా జనాభా వరుసగా తగ్గుము ఖం పడుతోంది. దక్షిణ కొరియాలో 2023లో కాస్త పుంజుకున్న జనాభా ఈ ఏడాది మళ్లీ తగ్గింది. ఇటలీలో జననాల సంఖ్య 19వ శతాబ్దం తరవాత తొలిసారి 4 లక్షల కంటే తక్కువకు పడిపోయింది. 63 దేశాలు, భూభాగాల్లో జనాభా ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరిందని ఐరాస అంచనా. వచ్చే 30 ఏళ్లలో మరో 48 దేశాలు ఆ స్థాయికి చేరతాయని సంస్థ పేర్కొంది. 60 ఏళ్లలో ప్రపంచ జనాభా వెయ్యి కోట్లకు చేరుతుందని, అక్కడినుంచి క్షీణించడం మొదలవుతుందని అభిప్రాయపడింది. చైనాలో రిటైర్మెంట్ వయసు పెంపు మరోవైపు ఆరోగ్య సంరక్షణ, మెరుగైన జీవనశైలి, ఆయుర్దాయం పెరుగుదల తదితరాలతో చాలా దేశాల్లో వృద్ధుల జనాభా నానాటికీ పెరిగిపోతోంది. చైనాలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దాంతో ఆర్థిక వృద్ధి దెబ్బ తింటోంది. ఈ సమస్యను అధిగమించేందుకు చైనా నానా ప్రయత్నాలు చేస్తోంది. పురుషుల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 63 ఏళ్లకు పెంచింది. ఫ్యాక్టరీ, బ్లూ కాలర్ ఉద్యోగాల్లో మహిళలకు 50 నుంచి 55కు, వైట్–కాలర్ ఉద్యోగాల్లో 55 నుంచి 58కు పెంచింది. 2022 నుంచి చైనాలో జనాభా తగ్గుముఖం పట్టడం మొదలైంది. దాంతో అత్యధిక జనాభా రికార్డును 2023లోనే భారత్కు కోల్పోయింది. ఒకే సంతానం నిబంధనను సడలించి ముగ్గురిని కనేందుకు అనుమతించినా లాభం లేకపోయింది. 140 కోట్లున్న చైనా జనాభా 2050 నాటికి 130 కోట్లకు తగ్గుతుందని అంచనా. ఇటలీదీ అదే వ్యథ... ఇటలీలో కూడా జనాభా నానాటికీ తగ్గిపోతోంది. 2023లో 5.94 కోట్లుండగా 2024 చివరికి 5.93 లక్షలకు తగ్గింది. 2008లో 5.77 లక్షలున్న వార్షిక జననాల సంఖ్య 2023 నాటికి ఏకంగా 3.8 లక్షలకు పడిపోయింది! ఇటలీ ఏకీకరణ తరువాత జననాల సంఖ్య క్షీణించడం అదే తొలిసారి! పిల్లల సంరక్షణ ఖరీదైన వ్యవహారంగా మారడం, తక్కువ జీతాలు, వృద్ధ తల్లిదండ్రులను చూసుకునే సంప్రదాయం వంటివి ఇటాలియన్లకు భారంగా మారుతు న్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఎక్కువ మంది పిల్లలను కనాల్సిందిగా పోప్ కూడా ఇటీవలే ఇటాలియన్లకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కూడా 2033 కల్లా ఏటా కనీసం 5 లక్షల జననాలే లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా నిరోధించడానికి జనాభా అవసరమని శాస్త్రవేత్తలు అంటున్నారు. దక్షిణ కొరియాలో విదేశీయుల రాక పుణ్యమా అని 2023లో జనాభా పుంజుకుంది. నిజానికి అధిక పోటీ విద్యా విధానంలో పిల్లలను పెంచడానికి అధిక ఖర్చు, మహిళలే శిశు సంరక్షణ చేపట్టా లనే ధోరణి వల్ల అక్కడ కొన్నేళ్లుగా జనాభా తగ్గుతోంది. వర్కింగ్ వీసా ప్రోగ్రాం పొడిగింపు వల్ల విదేశీ నివాసి తుల సంఖ్య 10% పెరిగి 10.9 లక్షలకు చేరింది. ఫలితంగా జనాభాలో కాస్త పెరుగుదల నమోదై 5.18 కోట్లకు చేరింది. కానీ వీరిలో ఏకంగా 90.5 లక్షల మంది 65, అంతకు మించిన వయసువారే! వృద్ధుల జనాభా పెరగడం కార్మికుల కొరతకు దారి తీస్తోంది.జపాన్లో అలా.. జపాన్ అయితే జనాభా సంక్షోభమే ఎదుర్కొంటోంది! 2008లో 12.8 కోట్లుండగా ప్రస్తుతం 12.5 కోట్లకు పడిపోయింది. జననాల సంఖ్య కూడా బాగా తగ్గుతోంది. యువత పెళ్లి, పిల్లలను కనడంపై తీవ్ర విముఖత చూపుతుండటం ప్రభుత్వాన్ని కలవరపరుస్తోంది. ఉద్యోగావకాశాల లేమి, జీవన వ్యయానికి తగ్గ వేతనాలు లేకపోవడం, కార్పొరేట్ సంస్కృతి పనిచేసే మహిళలు పని చేసేందుకు అనుకూలంగా లేకపోవడం వంటివి సమస్యను మరింత పెంచుతున్నాయి. 2070 నాటికి జపాన్ జనాభా 8.7 కోట్లకు పడిపోతుందని అంచనా. జనాభా సమస్యకు తోడు వృద్ధుల సంఖ్య కూడా జపాన్ను కలవరపరుస్తోంది. అక్కడ ప్రతి 10 మందిలో నలుగురు వృద్ధులే! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈ దేశంలో యువత అధికం.. 15 ఏళ్ల లోపువారు మరీ అధికం
ఎప్పుడైనా జనాభా విషయమై విస్తృత ప్రస్తావనకు వస్తే రెండు వాదనలు వినిపిస్తుంటాయి. వాటిలో ఒకటి.. అధిక జనాభా సమస్యగా మారుతున్న దేశాలు. మరొకటి తగ్గుతున్న జనాభా సంఖ్య కారణంగా జనన రేటును పెంచుకోవాలనుకుంటున్న దేశాలు.ఏ దేశంలోనైనా వృద్ధుల జనాభా అధికంగా ఉంటే ఆ దేశంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. వాటిని పరిష్కరించడం ఆయా ప్రభుత్వాలకు సమస్యగా మారుతుంది. అయితే ఇప్పుడు మనం ప్రపంచంలోని అతి పిన్న వయస్కుల జనాభా కలిగిన దేశం గురించి తెలుసుకుందాం. ఆ దేశంలో జనాభాలో సగం మంది 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. మరోవైపు ఆఫ్రికన్ దేశాలలో నెలకొన్న పేదరికం, వనరుల కొరత కారణంగా అక్కడి ప్రజల ఆయుర్దాయం అంతకంతకూ తగ్గుతోంది. ఫలితంగా అక్కడి ప్రజల సగటు వయస్సు క్షీణిస్తోంది.ఇక అత్యంత పిన్న వయస్కుల జనాభా కలిగిన దేశాల విషయానికొస్తే ఆఫ్రికన్ దేశమైన నైజర్ ఈ జాబితాలో ముందువరుసలో ఉంటుంది. ఐక్యరాజ్యసమితి అందించిన డేటా ప్రకారం ఈ దేశంలోని ప్రజల సగటు వయస్సు 14.8 ఏళ్లు. ఈ జనాభాలో సగం మంది 15 ఏళ్ల కంటే తక్కువ వయస్సు గలవారేకావడం విశేషం. పేదరికం, వనరుల కొరత కారణంగా ఇక్కడ జనన రేటు చాలా ఎక్కువగా ఉంది. నైజర్లో సగటు జనన రేటు ప్రతి స్త్రీకి 7.6 మంది పిల్లలు. ప్రపంచ సంఖ్య 2.5 అయితే. ఇక్కడ ఆయుర్దాయం దాదాపు 58 ఏళ్లు.యువ జనాభా పరంగా నైజర్ ముందు వరుసలో ఉంది. అయితే పెరుగుతున్న యువత జనాభా ఈ దేశానికి సమస్యగా మారింది. నైజర్ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండటంతో దేశంలో విద్యా సౌకర్యాలు, ప్రాథమిక అవసరాలు యువతకు అందడం లేదు. ఈ కారణంగా, ఇక్కడ పేదరికం, బాల్యవివాహాలు తదితర సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ప్రపంచ బ్యాంకు తెలిపిన వివరాల ప్రకారం పేద దేశాలలో అధిక సంతానోత్పత్తి రేట్లు కూడా ఆరోగ్య సమస్యలను సృష్టిస్తున్నాయి.ఆఫ్రికాలో పిన్న వయస్కుల జనాభా కలిగిన దేశం నైజర్ ఒక్కటి మాత్రమే కాదు. ఉగాండా, అంగోలాలలో కూడా పిన్న వయస్కుల జనాభా అధికంగా ఉంది. ఈ రెండు దేశాలలో యువత సగటు వయస్సు 16 సంవత్సరాలు. మధ్యప్రాచ్యంలోని పాలస్తీనా, యెమెన్, ఇరాక్లలో యువత సగటు వయస్సు దాదాపు 22 ఏళ్లు. దీని తరువాత ఆఫ్ఘనిస్తాన్ 20 ఏళ్లు, తైమూర్-లెస్టే 20.6 ఏళ్లు, పాపువా న్యూ గినియాలో యువత సగటు వయస్సు 21.7 ఏళ్లుగా ఉంది.ఇది కూడా చదవండి: Delhi Election 2025: ప్రచారంలో మూమూస్ రుచిచూసిన కేజ్రీవాల్ -
దక్షిణకొరియా మాయమవుతుందా?
ఊరందరిదీ ఒకదారి.. ఉలిపిరి కట్టెది ఇంకోదారి అన్నట్లుగా ఉంది ఈ దేశం పరిస్థితి. అత్యద్భుతంగా సాంకేతికతను అందిపుచ్చుకుని యూరోప్, అమెరికా దేశాలను దాటి ప్రగతిపథంలో సాగుతున్న దక్షిణ కొరియా జనభాపరంగా పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ దేశంలో నానాటికీ జనాభా తగ్గుతూ వస్తున్నందున రానున్న కొన్ని దశాబ్దాల్లో ఆ దేశం జనంలేక నిర్జీవమై అంతరించిపోతుందేమో అనే సందేహాలు వస్తున్నాయి.ఇదిలా ఉండగా గురజాడ చెప్పినట్లుగా దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనావంటి దేశాలు జనాభాని పెంచుకుంటూ పట్టణాలు.. పల్లెలు కిక్కిరిసిపోతున్నాయి. కానీ దక్షిణ కొరియా మాత్రం జనాభా కొరతతో అల్లాడిపోతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వందేళ్లలో జనాభా పూర్తిగా తగ్గిపోయి దేశమే అంతర్థానం అయ్యే ప్రమాదం ఉందని సామాజికవేత్తలు అంటున్నారు.పెళ్లి వద్దు.. కెరీర్ ముద్దు దేశంలో యుక్త వయస్సు రాగానే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనే సంప్రదాయం తగ్గిపోతూ వస్తోంది. ముఖ్యంగా మహిళలు ముందుగా కెరీర్లో స్థిరపడాలి.. ఉన్నత స్థితికి చేరాలి.. ఇల్లు.. కార్లు.. బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోవాలి.. ఆ తరువాతనే పెళ్లి గురించి ఆలోచిద్దాం అనే భావనలో ఉండడంతో దేశంలో పెళ్లిళ్లు కూడా లేటుగా అవుతున్నాయి. పెళ్లి.. ఇల్లు పిల్లలు.. సంసారం గురించి పెద్దలు చెబుతున్నా వినే పరిస్థితుల్లో దేశంలోని మహిళలు లేరని సర్వేలు చెబుతున్నాయి. దీంతో శతాబ్ద కాలంలో దేశం 70 శాతం జనాభాను కోల్పోతుందని, జనాభాలో పునరుత్పత్తి సామర్ధ్యం కూడా గణనీయంగా పడిపోతూ వస్తున్నదని, దేశంలో జననాల రేటు ఏటా 5,00,000 కన్నా అతక్కువగా నమోదవుతూ వస్తోంది.ఇదిలా కొనసాగితే దేశ జనాభా కొన్ని దశాబ్దాల్లోనే ఐదున్నర కోట్ల నుంచి కోటిన్నరకు పడిపోతుందని, ఇది ఏకంగా దేశ మనుగడకు ముప్పుగా మారుతుందని పరిశోధకులు అంటున్నారు. దేశం జనాభాతో కళకళలాడుతూ పది కాలాలపాటు పచ్చగా ఉండాలంటే జననాల రేటు 2. 1 శాతంగా ఉండాలి కానీ ప్రస్తుతం అది 0. 72 శాతానికి పడిపోయింది. తద్వారా దేశంలో జననాల రేటుకన్నా మరణాల రేటు ఎక్కువై పల్లెలు, పాట్టణాలు సందడి తగ్గిపోతూ వస్తున్నాయి.ప్రభుత్వ నిర్ణయాలే కారణమా ?1960 కాలంలో దేశం అంతగా అభివృద్ధి చెందలేదు.. ఇంకా వర్థమానదేశంగానే ఉండేది. ఆ తరుణంలో దేశంలో జనాభా పెరిగితే దేశ ఆర్థిక ప్రగతికి ప్రతిబంధకం అవుతుందని దేశంలో కుటుంబ నియంత్రణను అమలు చేశారు . పిల్లలను కనడం తగ్గించాలని, లేకుంటే మున్ముందు బతకడం కష్టం అవుతుందని చేసిన ప్రభుత్వ ప్రచారం ప్రజలమీద గట్టిగా పని చేసింది. దీంతో అప్పట్నుంచి దేశంలో జనాభా నియంత్రణ మొదలైంది. సరే మనం దేశ జనాభా తగ్గిస్తున్నాం అనుకుంటున్న పాలకులు ఆ నియంత్రణ ఏకంగా దేశాన్ని ఇలా సంక్షోభంలోకి నెట్టేస్తున్నాం అని గుర్తించలేకపోయారు. ఆ తగ్గుదల క్రమంగా అట్టడుగు స్థాయికి దిగిపోయింది. 1980 దశకంలోనే తగ్గుదల కనిపించినా పాలకులు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఈ శతాబ్దం చివరి నాటికి, 52 మిలియన్ల ఉన్న దక్షిణ కొరియా జనాభా 17 మిలియన్లకు తగ్గిపోవచ్చని అంచనా వేస్తున్నారు.దిద్దుబాటు చర్యలున్నా.. ఫలితం నిల్ పరిస్థితిని చక్కదిద్దే యత్నంలో ప్రభుత్వం మళ్ళీ జనాభాను పెంచేందుకు చర్యలు ప్రారంభించింది. పిల్లల సంరక్షణలో సహాయం చేయడానికి విదేశీ ఆయాలను సైతం తెచ్చుకోవచ్చని చెబుతోంది. దీనివల్ల పిల్లల పెంపకం అంటే భయపడుతున్న కొరియా యూత్ కు కాస్త ఉపయుక్తం అవుతుందని ప్రభుత్వం భావించింది. 30 ఏళ్లు నిండకముందే ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలకు తండ్రయ్యే పురుషులను ఆర్మీ నుంచి పంపేయాలని కూడా భావిస్తోంది. ఇన్ని చేస్తున్నా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. ఇదిలా ఉండగా పెళ్లి చేసుకుని, పిల్లల్ని కనడం, వారి సంరక్షణ అనేది తమకు తలకు మించిన భారంగా ఉంటోందని భావించిన మహిళలు అసలు పెళ్లి వద్దనుకుంటున్నట్లు ఒక సర్వేలో వెల్లడైంది. దాదాపు 30 శాతం మంది మహిళలు తాము పెళ్లి చేసుకోకూడదని ఆ సర్వేలో అభిప్రాయపడ్డారు.సైన్యానికి యువకుల కొరత దేశంలో జననాలు తగ్గిపోతుండడంతో దక్షిణ కొరియా సైన్యానికి యువకుల కొరత ఎదురవుతోంది. పక్కనే ఉంటూ నిత్యం కయ్యానికి కాలుదువ్వే ఉత్తర కొరియాలో 12 లక్షల మంది సైన్యం ఉన్నారు. కానీ దక్షిణ కొరియాకు 2017 లో 6. 2 లక్షలుగా ఉండే సైన్యం నేడు అయిదు లక్షలకు పడిపోయింది,. రానున్న అవసరాలమేరకు ఏటా రెండు లక్షల మందిని రిక్రూట్ చేసుకోవాలని దేశం భావిస్తున్నా 1.25 లక్షలమంది యువకులు మాత్రమే అందుబాటులో ఉన్నారట. అదన్నమాట.. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే దక్షిణ కొరియా జనంలేక మొత్తం దేశం ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నారు.-సిమ్మాదిరప్పన్న. -
మంచి పనిని కించపరుస్తారా?
జనాభా సమీకరణాల్లో వస్తున్నంత పరివర్తన సామాజికార్థిక పరిస్థితుల్లో రాకపోవడం దేశంలో ఏకరీతి ప్రగతికి సవాల్ విసురుతోంది. అసమగ్ర అభివృద్ధికి ప్రభుత్వాలే కారణమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ‘జనాభా ఆధారంగా చట్టసభలకు ప్రాతినిధ్య’ పద్ధతి సమాఖ్య స్ఫూర్తికే విఘాతం కలిగించేలా పరిణమించింది. నియోజకవర్గ పునర్విభజనతో జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య పెరుగనుండగా, దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గనున్నాయి. జనాభా నియంత్రిస్తే తప్పయినట్టు, ఎక్కువ మంది పిల్లల్ని కనడమే గొప్పయినట్టు అధికారిక ప్రచారాలు, అమలు చర్యలు మొదలయ్యే ప్రమాదముంది. ఈ పరిస్థితులపై లోతైన సమగ్ర అధ్యయనం, దిద్దుబాటు చర్యలు తక్షణావసరం.మనమిపుడు 140 కోట్ల మందితో ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా ఉన్నాం. వనరులు, సదుపాయాలు, జనాభా నిష్పత్తిలో చూసినపుడు ఇదొక సంక్లిష్ట నమూనా! ఇటీవలి వరకు అధిక జనాభా దేశంగా ఉన్న చైనా కొన్నేళ్లుగా కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలతో జనాభా వృద్ధిని నిలువరించింది. మనం కూడా నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ, ఆశించిన లక్ష్యాలు అందుకోలేకపోయాం. అయితే, దేశంలోని కొన్ని, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు ఈ విషయంలో మంచి విజయాలు సాధించాయి. అర్థవంతమైన సంతానోత్పత్తి రేటు తరుగుదలను నమోదు చేశాయి. ఇది ప్రగతి సంకేతమే! కానీ, అదే తమ పాలిట శాపంగా పరిణమించిందని ఇప్పుడా రాష్ట్రాలు నెత్తి బాదుకుంటు న్నాయి. ప్రధానంగా రెండు సమస్యల్ని ఎదుర్కొంటున్నామని ఆ యా రాష్ట్రాల అధినేతలు భావిస్తున్నారు. ఒకటి, సంతానోత్పత్తి రేటు నియంత్రణ వల్ల పిల్లలు, యువ జనాభా తగ్గుతూ, వృద్ధుల జనాభా నిష్పత్తి పెరుగుతోంది. రెండోది, జనాభా నిలువరింపు కారణంగా, జాతీయ సగటు జనాభా ఆధారంగా జరిగే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనతో ఆ యా రాష్ట్రాల్లో ఎంపీ స్థానాల సంఖ్య తగ్గనుంది. ఇది దేశంలోని అత్యున్నత విధాన నిర్ణాయక సభలో ప్రాతినిధ్యం కోతగా భావిస్తూ వారు కలత చెందుతున్నారు. ఇంకోవైపు, జనాభాను అదుపు చేయక, సంతానోత్పత్తి రేటును అధికంగానే చూపుతున్న రాష్ట్రాల్లో లోక్సభ స్థానాల సంఖ్య పెరుగనుండటం దేనికి సంకేతం? అనే ప్రశ్న పుట్టుకొస్తోంది.తగ్గిన సంతానోత్పత్తి రేటుదక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య భారతంలోని చిన్న రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటులో రమారమి తరుగుదల నమోదైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లోనూ ఈ రేటు తక్కువగానే ఉంది. 2019–21 కాలంలో, దేశంలోనే అత్యల్పంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో సంతానోత్పత్తి రేటు 1.4గా ఉంటే... తెలంగాణ, ఏపీ, కేరళ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లలో ఇది 1.5గా నమోదయినట్టు ‘భారత రిజిస్ట్రార్ జనరల్’ నివేదిక చెబుతోంది. ‘పిల్లలు కనే వయసు’ కాలంలో మహిళలకు పుట్టిన పిల్లల సంఖ్య సగటును, ఆ ప్రాంతపు లేదా ఆ రాష్ట్రపు సంతా నోత్పత్తి రేటుగా పరిగణిస్తారు. అదే సమయంలో బిహార్ (3), ఉత్తర ప్రదేశ్ (2.7), మధ్యప్రదేశ్ (2.6) రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు అధి కంగా నమోదవుతోంది. ఎక్కువ సంతానోత్పత్తి రేటున్న రాష్ట్రాల్లో అభివృద్ధి మందగించడం సహజం.సంతానోత్పత్తి పరిమితుల్లో ఉండటం ప్రగతి సంకేతమే అయినా, మరో సమస్యకు అది కారణమవుతోంది. ఒక వంక పుట్టే పిల్లల సంఖ్య తగ్గుతుంటే, మరోవంక శాస్త్ర సాంకేతికత పురోగతి పుణ్యమా అని మనిషి సగటు జీవనకాలం పెరగటం వల్ల వృద్ధుల సంఖ్య అధిక మవుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లోలాగా ఒక నిర్దిష్ట వయసు దాటినవారికి ప్రభుత్వమే కల్పించే సామాజిక భద్రత పథకాలు, కార్యక్రమాలు మనవద్ద లేకపోవడంతో వారి పోషణ, ఆరోగ్య నిర్వహణ కుటుంబాలకు అదనపు ఆర్థిక భారంగా పరిణమిస్తు న్నాయి. జనాభా ఆధారంగానే వివిధ కేంద్ర పథకాలు, సంక్షేమ కార్య క్రమాల నిధుల కేటాయింపులు, చివరకు చట్టసభల్లో ఆయా రాష్ట్రాల ప్రాతినిధ్య సంఖ్య ఖరారు కూడా జరగటం తమకు నష్టం కలిగిస్తోందని ఏపీ, తమిళనాడు ముఖ్యమంత్రులు వ్యాఖ్యానించారు.ఆధారపడే జనాభా రేటులో వృద్ధిప్రపంచంలోనే అత్యధిక యువజనాభా కలిగిన దేశంగా భారత్ రికార్డులకెక్కింది. కానీ, ఇటీవలి కాలంలో వృద్ధుల జనాభా శాతం క్రమంగా పెరుగుతున్నట్టు, మున్ముందు అది మరింత పెరుగనున్నట్టు ఐక్యరాజ్యసమితి విభాగమొకటి (యూఎన్ఎఫ్పీయే) తన నివేదికలో చెప్పింది. భారత వైద్య, కుటుంబ ఆరోగ్య విభాగం అందించిన సమాచారం ఆధారంగా అంచనాలు లెక్కగట్టిన ఈ విభాగం 2021లో 10.1 శాతంగా ఉన్న వృద్ధుల జనాభా 2036 నాటికి 15 శాతానికి చేరవచ్చని చెప్పింది.అయితే, వృద్ధుల జనాభా పెరుగుదల రేటు సమస్య కాదు... సదరు జనాభా పనిచేసే వయస్కుల మీద ఆధారపడే స్థితి అధిక మవడం ఇబ్బంది. అంటే, వంద మంది పనిచేసే (18–59 ఏళ్లు) వయస్కులున్నపుడు, వారిపై ఆధారపడే వృద్ధుల జనాభా అధికంగా ఉండటం కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై నేరుగా ప్రభావం చూపుతుందనేది అంతర్జాతీయ ప్రమాణాల లెక్క. ఆ నిష్పత్తి పెరుగుతోంది. అది 15 శాతాన్ని దాటితే సమస్యను ‘వృద్ధుల సంక్షోభం’గా లెక్కిస్తారు. భారత జాతీయ జనాభా కమిషన్ (ఎన్సీపీ) 2021 లెక్కల ప్రకారం, కేరళలో ఇది ఇప్పటికే 26.1 శాతంగా ఉంది. తమిళనాడు (20.5), హిమాచల్ ప్రదేశ్ (19.6), ఏపీ (18.5) శాతాలు కూడా అధికంగానే ఉన్నాయి. 2036 నాటికి అవి మరింత గణనీయంగా పెరగటం ఖాయంగా కనిపిస్తోంది. సంతానన్పోత్తి రేటును, తద్వారా జనాభాను నియంత్రించినందుకు, సదరు కుటుంబాల్లో లభించే ఆ ప్రయోజనం... వృద్ధుల పోషణ, వారి ఆరోగ్య పరిరక్షణలోనే కరిగిపోతోందనే వాదన బలంగా వినిపిస్తోంది.కట్టడి చేసినందుకు కనీస స్థానాలా?2026 తర్వాతి జనాభా లెక్కల ఆధారంగా దేశంలో నియోజక వర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది. రాష్ట్ర విభజన చట్ట నిర్దేశ్యం ప్రకారం ఏపీ, తెలంగాణల్లోనూ సంఖ్య పెంపుతో పునర్విభజన జరగాల్సి ఉంది. దేశవ్యాప్తంగా గడువు లోపల జనాభా తాజా లెక్కలు అందించడానికి వీలుగా జనగణన ప్రక్రియ సత్వరం చేపట్టనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే ప్రకటించింది. దశాబ్దానికి ఒకసారి జరిపే జనగణన, పాత సంప్రదాయం ప్రకారం 2020లో మొదలు కావాల్సింది. కోవిడ్ మహమ్మారి వల్ల అది వాయిదా పడింది. ఇప్పుడు 2025లో చేపట్టి, పదేళ్ల సైకిల్ని (ఇదివరకటిలా 2021 –2031 కాకుండా 2025 –2035గా) మారుస్తున్నారు. జనాభా వృద్ధి రేటు తీరుతెన్నుల్ని బట్టి కె.ఎస్. జేమ్స్, శుభ్ర కృతి జరిపిన అధ్యయనం ప్రకారం, వచ్చే పునర్విభజనతో ఉత్తరాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య పెరు గనుండగా దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గనుంది. ఉత్తరప్రదేశ్ (12), బిహార్ (10), రాజస్థాన్ (7) లలో లోక్సభ నియోజకవర్గాలు పెరుగ నున్నాయి. తమిళనాడు (9), కేరళ (6), ఏపీ (5) లలో తగ్గనున్నాయి. జాతీయ జనాభాలో వాటా పెరుగుదల, తరుగుదలను బట్టి ఈ సంఖ్య మారనుంది. ‘ఎక్కువ పిల్లలు కలిగిన తలిదండ్రులకు ప్రోత్సాహకాలివ్వాలి, ఆ మేరకు చట్టం తేవాలని నేను ఆలోచిస్తున్నాను’ అంటూ ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల అన్నారు. ఇటువంటి పంథా మంచిది కాదనీ, దాని వల్ల ఏ మంచీ జరుగదనేది ప్రపంచ వ్యాప్తంగా రుజువైన అంశమనీ సామాజికవేత్తలు అంటున్నారు. ప్రభుత్వాలిచ్చే ప్రాత్సాహకాలు అదనంగా పుట్టే సంతాన పోషణ, వారి విద్య –వైద్య అవసరాలు తీర్చవనీ, అధిక సంతానం కుటుంబ జీవన ప్రమాణాల పతనానికే కారణమవుతుందనీ విశ్లేషణలున్నాయి.ఈ పరిణామాలను ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకొని ప్రత్యా మ్నాయ చర్యలు చేపట్టాలి. జానాభా వృద్ధిని నిలుపుదల చేసిన వారిని ప్రోత్సహించేలా నిర్ణయాలుండాలి. సరైన జనాభా నిష్పత్తి ఉండేలా చూడాలి. వయసు మళ్లినవారు ఆయా కుటంబాలకు భారం కాకుండా సార్వత్రిక సాంఘిక భద్రతా పథకాలు ఉండాలి. ‘పనిచేసే వయసు’ కాలం నిడివి పెరిగేట్టు జీవన ప్రమాణాల వృద్ధికి చర్యలు తీసుకోవాలి. జనాభా నియంత్రణ తప్పు కాదు. ముసలితనం శాపం కాకూడదు. మంచి పనులకు ప్రోత్సాహం ఉండాలే తప్ప, శిక్షలు ఉండకూడదు.దిలీప్ రెడ్డి వ్యాసకర్త ‘పీపుల్స్ పల్స్’ రిసెర్చ్ సంస్థ డైరెక్టర్ -
World Population Day 2024 : ఆసక్తికర విషయాలు (ఫోటోలు)
-
జనాభా పెరుగుతోంది...కానీ సంతానోత్పత్తి రేటు పడిపోతోంది!
ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా జనభా విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుత (2024 నాటికి) ప్రపంచ జనాభా సుమారు ఎనిమిది బిలియన్లుగా ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి గణనీయంగా పడి పోతోంది. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈ స్పెషల్ స్టోరీ మీకోసం.గత కొన్ని దశాబ్దాలతో పోలిస్తే జనాభా పెరుగుదల తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ, పెరుగుతూనే ఉంది. వార్షిక జనాభా వృద్ధి రేటు కాలక్రమేణా క్షీణిస్తూ వస్తోంది. 20వ శతాబ్దం మధ్యలో ఇది దాదాపు 2 శాతంగా ఉండగా ఇదిపుడు ఒక శాతానికి పడిపోయింది.. సంతానోత్పత్తి రేట్లు తగ్గడం , మెరుగైన ఆరోగ్య సంరక్షణ వంటి వాటిని కారణాలుగా చెబుతున్నప్పటికీ, సంతానోత్పత్తి రేటు తగ్గడం కొంత ఆందోళన కలిగించే విషయంగతంలో జనన , మరణాల రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఫలితంగా జనాభా పెరుగుదల నెమ్మదించింది. ప్రచార అవగాహన, అభివృద్ధి నేపథ్యంలో జనన రేట్లు తగ్గాయి. అలాగే శిశుమరణాల రేటు కూడా తగ్గింది.ఆయుర్దాయం పెరగడం , జననాల రేటు తగ్గడం వల్ల, అనేక దేశాల్లో యువకుల సంఖ్య తగ్గుతోంది. వృద్ధుల నిష్పత్తి పెరుగుతోంది. ఇది ఆరోగ్య సంరక్షణ , సామాజిక వ్యవస్థలకు సవాళ్లను విసురుతోంది.పాపులేషన్ పిరమిడ్ (నిర్దిష్ట జనాభా వయస్సు ,లింగ కూర్పుతో ఏడిన గ్రాఫ్). అభివృద్ధి చెందిన దేశాలలో సమతుల్యాన్ని సూచిస్తూ దీర్ఘచతురస్రాకారంగా ఉంటే, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో యువతరం ఎక్కువ ఉంటోంది. అందుకే ఇక్కడి పాపులేషన్ పిరమిడ్ , పిరమిడ్ ఆకారంలో ఉంటోంది.ప్రపంచ వ్యాప్తంగా పట్టణీకరణ కూడా బాగా పెరింది. 2050 నాటికి, ప్రపంచ జనాభాలో 68 శాతం మంది నగరాల్లో నివరసిస్తారని అంచనా. పట్టణీకరణ మౌలిక సదుపాయాలు, పర్యావరణం, జీవన నాణ్యతను ప్రభావితం చేస్తుంది.అధిక జనాభా ఆందోళనలు: ప్రపంచ జనాభా పెరుగుదల మందగించినప్పటికీ, అధిక జనాభా గురించి ఆందోళనలు కొనసాగుతున్నాయి. వనరుల కొరత, పర్యావరణ క్షీణత , అవస్థాపనపై ఒత్తిడి క్లిష్టమైన సమస్యలని మరి కొందరు వాదిస్తున్నారు. సంతానోత్పత్తి రేటు2021లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం సంతానోత్పత్తి రేటు 1 (TFR) అంటే ఒక మహిళకు 2.3 మంది పిల్లలున్నారు. ఇదే 1965లో 5.1గా ఉంటే, 1970లో 4.8, 1980లో 3.7, 1990లో 3.3గా ఉండి 2000లో 2.8కి పడిపోయింది. 2000లో వేగం తగ్గింది. 2000-15 మధ్య 5 సంవత్సరాల సగటు 0.07తో పోలిస్తే, 2015- 2020 మధ్య ఒక్కో మహిళకు 0.17 మంది పిల్లలు తగ్గారు.ఇటీవలి లాన్సెట్ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్లోనూ జనాభా పెరుగుదల రేటు క్రమంగా తగ్గుతోందని, సంతానోత్పత్తి రేటు పడిపోతుందటమే దీనికి కారణం. అలాగే దేశంలో 1950లో 6.18గా సంతానోత్పత్తి రేటు, 2021నాటికి అది 2 కంటే దిగువకు పడిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే, 2050 నాటికి దేశంలో సంతానోత్పత్తి రేటు 1.3కు, 2100నాటికి 1.04కు పడిపోవచ్చని కూడా హెచ్చరించింది. మారిన వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న కాలుష్యం, ఆహారపుటలవాట్లలో మార్పులు, యాంత్రిక జీవనశైలి, పని ఒత్తిళ్లు, ఆందోళన, ఆలస్యంగా వివాహం చేసుకోవడం వెరసి సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతున్నట్టు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు సంతానోత్పత్తి రేటులో తగ్గుదల.. ఉత్పాదక శక్తిపై ప్రభావం చూపి దేశాల ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.ఆసియాలో సంతానోత్పత్తి రేట్లుప్రతి స్త్రీకి 0.9 పిల్లలు చొప్పున ప్రపంచవ్యాప్తంగా అత్యల్ప సంతానోత్పత్తి రేటును కలిగి ఉన్న దేశంగా దక్షిణ కొరియా నిలిచింది. 1.0 వద్ద ప్యూర్టో రికో , మాల్టా, సింగపూర్ ,హాంగ్కాంగ్లో ఒక్కో మహిళకు 1.1 చొప్పున పిల్లలున్నారు.ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలు, చైనా (1.7) ,భారతదేశం (2.2) సంతానోత్పత్తి రేటును కలిగి ఉన్నాయి. ఈ రెండు గణాంకాలు ఈ దేశాలలో పునరుత్పత్తికి సంబంధించిన ప్రభుత్వ విధానాలు, సాంస్కృతిక అంచనాల ద్వారా ప్రభావితమవుతాయి. ఉదాహరణకు చైనా సుమారు 1980 - 2016 వరకు ఒకటే బిడ్డ విధానాన్ని" కొనసాగించింది, అయితే ఆగస్టు 2021లో వివాహిత జంటలు ముగ్గురు పిల్లలను కలిగి ఉండవచ్చని అధికారికంగా ఒక చట్టాన్నిఆమోదించింది. ఇండియాలో కూడా అనధికారంగా చాలామంది జంటలు వన్ ఆర్ నన్ పద్ధతినే అవలంబిస్తుండటం గమనార్హం. -
World Population Day 2024 : జనం.. ప్రభంజనం..ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్!
ప్రతి సంవత్సరం జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పాటిస్తారు. నానాటికి పెరుగుతున్న జనాభా, తద్వారా తలెత్తే దుష్పరిణామాలను ప్రజలకు వివరించేందుకు, జనాభా పెరుగుదల సమస్యలపై అవగాహన కలిగించేందుకు ప్రతి ఏటా జూలై 11వ తేదీన "ప్రపంచ జనాభా దినోత్సవాన్ని" నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.ప్రపంచవ్యాప్తంగ ప్రజలలో అవగాహన తెచ్చేందుకుగాను ఐక్యరాజ్యసమితి 1989వ సంవత్సరంలో దీనిని ప్రారంభించింది.1987, జూలై 11న ప్రపంచ జనాభా ఐదు బిలియన్లకు చేరుకున్న ("డే ఆఫ్ ఫైవ్ బిలియన్") రోజును పురస్కరించుకుని ఆరోజును "ప్రపంచ జనాభా దినం"గా ఐక్యరాజ్యసమితి గుర్తించింది.ప్రపంచ జనాభా దినోత్సవం 2024 థీమ్యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (UNFPA) సమన్వయంతో ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) సంయుక్తంగా ప్రతీ ఏడాది ఒక్కో థీమ్ను నిర్ణయిస్తాయి ఈ సంవత్సరం థీమ్: 'ఎవరినీ వదిలిపెట్టవద్దు, ప్రతి ఒక్కరినీ లెక్కించండి (To Leave No One Behind, Count Everyone’)కొన్ని ఇంట్రస్టింగ్ సంగతులు ఐరాస లెక్కల ప్రకారం 20 ఏళ్ల తరువాత జూలై 11, 2007లో ప్రపంచ జనాభా 6,602,226,175కు చేరుకుంది. .కుటుంబ నియంత్రణ, లింగ సమానత్వం, పేదరికం, మాతృ ఆరోగ్యం , మానవ హక్కులు వంటి జనాభా సమస్యలపై ప్రజలకు అవగాహన పెంచడమే ప్రపంచ జనాభా దినోత్సవ లక్ష్యం. ప్రపంచ జనాభా అధికారికంగా ప్రస్తుతం 8 బిలియన్లు దాటేసింది. ఇది ఇలాగే పెరుగుతూ పోతే, భవిష్యత్ తరాలకు స్థిరమైన, స్నేహపూర్వక అభివృద్దికి అడ్డంకులను సృష్టిస్తుం దనేది ప్రధాన ఆందోళన. ప్రస్తుత ప్రపంచ జనాభా ఇరవయ్యవ శతాబ్దం మధ్యలో ఉన్నదానికంటే మూడు రెట్లు ఎక్కువ. అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలు చైనా, భారతదేశం. ఈ రెండూ వందకోట్ల కంటే ఎక్కువ జనాభా ఈ దేశాల్లో ఉంది. ప్రపంచ జనాభాలో దాదాపు 18 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. 2050నాటికి ప్రపంచ జనాభా 9.7 బిలియన్లకు చేరుతుందని ఐరాస అంచనా. అలాగే 2080ల మధ్యలో 10.4 బిలియన్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. -
ఉడుతలకు, పావురాలకు గర్భనిరోధక మాత్రలు
పావురాలు, ఉడుతలు.. ప్రకృతికి, మనిషికి ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయనే సంగతి మీకు తెలుసా? అమెరికన్, యూరోపియన్ శాస్త్రవేత్తలు ఈ చిన్ని ప్రాణులు మనకు ఎంతో హాని చేస్తున్నాయనే విషయాన్ని గుర్తించారు. దీంతో ఈ జంతువుల సంఖ్యను తగ్గించడంపై దృష్టి సారించారు. దీనిలో భాగంగా పావురాలకు, కుందేళ్లకు గర్భనిరోధక మాత్రలు ఇవ్వాలని శాస్త్రవేత్తలు యోచిస్తున్నారు.పావురాలు, ఉడుతలేకాదు అడవి పందులు, చిలుకలు, జింకలు మొదలైనవి అటు ప్రకృతికి ఇటు మనుషులకు ముప్పుగా మారుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోజురోజుకు వీటి సంఖ్య పెరగడమే ఇందుకు కారణమని వారు అంటున్నారు. ఉడుతలలోని గ్రే స్క్విరెల్ జాతిని 1800లో అమెరికా నుండి ఇంగ్లండ్కు తీసుకువచ్చారు. ఇప్పుడు ఇక్కడ వాటి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇవి చెట్ల బెరడును తొలిచి కలపనునాశనం చేస్తున్నాయి. ఈ ఉడుతల వల్ల ఏటా దాదాపు రూ.40 కోట్ల మేర నష్టం వాటిల్లుతున్నట్లు రాయల్ ఫారెస్ట్రీ సొసైటీ ఆఫ్ ఇంగ్లండ్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.ఇక పావురాల విషయానికొస్తే అవి మనుషులకు శ్వాసకోశ సమస్యలను కలిగిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదేవిధంగా మరికొన్ని జంతువులు మనుషులకు హాని కలిగిస్తున్నాయి. అందుకే వాటి సంఖ్యను నియంత్రించేందుకు వాటికి గర్భనిరోధక మాత్రలు ఇచ్చే ప్రయోగాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. కాంటినెంటల్ యూరప్, స్కాండినేవియాలో గతంలో అడవి పందుల సంఖ్య దాదాపు 5 లక్షలు ఉండగా, 2020 నాటికి వాటి సంఖ్య 10 లక్షలకు పెరిగిందని ఇటలీ రైతు సంఘాలు చెబుతున్నాయి. వీటి కారణంగా పంటలు దెబ్బతినడమే కాకుండా, రోడ్డు ప్రమాదాలు కూడా గణనీయంగా పెరిగాయి.ఈ జంతువుల సంఖ్యను తగ్గించడానికి, వాటిని చంపడం కంటే పునరుత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించడం ఉత్తమమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ది గార్డియన్లో ప్రచురితమైన కథనం ప్రకారం ఈ జంతువులు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, పర్యావరణ నష్టాలను కలిగిస్తున్నాయని న్యూయార్క్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ జియోవన్నా మాస్సే తెలిపారు. ఈ జంతువుల సంఖ్యను నియంత్రించేందుకు, వాటి ఆహార గింజల్లో గర్భనిరోధక మాత్రలు కలపాలని యోచిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.బ్రిటన్లో ఉడుతలకు హాజెల్నట్ అనే పండులో గర్భనిరోధక మాత్రలు ఉంచి వాటికి ఇస్తున్నారు. ఈ ప్రయోగ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పావురాలు, ఇతర పక్షుల సంఖ్యను నియంత్రించడానికి వాటికి అవి తినే గింజలలో గర్భనిరోధక మాత్రలు కలిపి ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
విదేశాల్లో ‘మినీ ఇండియా’లు?
భారత్కు వెలుపల అత్యధిక భారతీయ జనాభా కలిగిన దేశాలు ఏవో మీకు తెలుసా? మారిషస్, యూకే, యూఏఈ, సింగపూర్తో సహా పలు దేశాల్లో భారతీయులు నివసిస్తున్నారు. కొన్ని దేశాల్లో ‘మినీ ఇండియా’లు కూడా ఉన్నాయి. ఇక్కడ భారతీయుల ఇళ్లను సులభంగా గుర్తించవచ్చు. అవి ఏఏ దేశాలో ఇప్పుడు తెలుసుకుందాం. మారిషస్ మారిషస్లో 70శాతం జనాభా భారతీయులని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఇది సాంస్కృతికరంగ స్వర్గధామం. ఇక్కడ భారతీయ ఆహార ఖజానా విరివిగా కనిపిస్తుంది. ఇది విదేశాల్లో స్థిరపడాలనుకున్న భారతీయుల ఉత్తమ ఎంపిక అని అంటారు. యూకే భారతదేశం- యునైటెడ్ కింగ్డమ్ల మధ్య సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. యూకేలో కనిపించే భారతీయ రెస్టారెంట్లు, దుకాణాలు దీనికి తార్కాణంగా నిలుస్తాయి. యూకేలో భారత సంస్కృతి కనిపిస్తుంది. యూకేలోని కొన్ని ప్రాంతాలు.. మనం భారత్లోనే ఉన్నామా అని అనిపించేలా ఉంటాయి. యూకేలోనూ భారతీయులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎమిరేట్స్లో ఎక్కడికి వెళ్లినా భారతీయులు తప్పనిసరిగా కనిపిస్తారు. ఇక్కడ ఉంటే ఇండియాలో ఉన్నట్టేనని చాలామంది అంటుంటారు. యూఏఈ మొత్తం జనాభాలో భారతీయులు 42 శాతం ఉన్నారు. సౌదీ అరేబియా సౌదీ అరేబియాలోని మొత్తం జనాభాలో 10 శాతం నుంచి 13 శాతం వరకూ భారతీయులు ఉన్నారు. ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్న దేశంగా సౌదీ అరేబియా గుర్తింపు పొందింది. కెనడా మెరుగైన ఉద్యోగావకాశాలు, ఉన్నత జీవన ప్రమాణాలు ఉచిత ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు తదితర అదనపు ప్రయోజనాలు భారతీయులను కెనడావైపు మళ్లేలా చేస్తున్నాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక సమాచారం ప్రకారం కెనడాలో గణనీయ సంఖ్యలో భారతీయులున్నారు. ఒమన్ ఒమన్ మొత్తం జనాభాలో ప్రవాస భారతీయులు దాదాపు 20 శాతం ఉన్నారు. 2023 నాటికి ఒమన్లో దాదాపు తొమ్మది లక్షల మంది భారతీయులు ఉన్నారు. ఒమన్లోని భారతీయులు అక్కడి సాంస్కృతిక వైభవానికి తోడ్పాటునందిస్తున్నారు. సింగపూర్ 2023లో సింగపూర్లో భారతీయుల జనాభా ఏడు లక్షలు. సింగపూర్ ప్రభుత్వం ‘లిటిల్ ఇండియా’ ప్రాంత అభివృద్ధికి చేయూతనందిస్తోంది. సింగపూర్ సాంస్కృతిక వైభవానికి అక్కడి భారతీయులు తోడ్పాటునందిస్తున్నారు. అమెరికా అమెరికాలో అత్యధిక సంఖ్యలో భారతీయులున్నారు. ప్రపంచంలో తమది రెండవ అతిపెద్ద భారతీయ ప్రవాసులు కలిగిన దేశమని యునైటెడ్ స్టేట్స్ పేర్కొంది. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు కెరీర్ను మెరుగుపరుచుకోవడంలో పాటు పలు వ్యాపారాలు చేపడుతున్నారు. -
‘నైనిటాల్’లో పెరిగిన రెడ్ పాండా జనాభా
ఉత్తరాఖండ్లో సరస్సుల నగరంగా నైనిటాల్ పేరొందింది. స్థానిక గోవింద్ వల్లభ్ పంత్ జూ పార్కు .. రెడ్ పాండాల కేంద్రంగా మారింది. ఇక్కడి వాతావరణం రెడ్ పాండాలకు అనుకూలంగా ఉండటంతో వాటి జనాభా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా రెడ్ పాండాల సంఖ్య దాదాపు 10 వేలకు తగ్గగా, దీనికి భిన్నంగా నైనిటాల్లో రెడ్ పాండాల జనాభా పెరిగింది. కాగా రెడ్ పాండాను అంతరించిపోతున్న జంతువుల విభాగంలో చేర్చారు. రెడ్ పాండాలను ప్రపంచంలోనే అందమైన జంతువులుగా అభివర్ణిస్తారు. రెడ్ పాండాలు ఎవరికీ ఎటువంటి హాని చేయవు. పూర్వ కాలంలో చాలామంది రెడ్ పాండాలను వేటాడేవారు. వాటి చర్మంతో టోపీలు తయారు చేసేవారు. నైనిటాల్ జంతుప్రదర్శనశాలకు వచ్చే సందర్శకులు రెడ్ పాండాలను చూస్తూ, గంటల కొద్దీ సమయం గడుపుతుంటారు. నైనిటాల్ జంతుప్రదర్శనశాలకు చెందిన జీవశాస్త్రవేత్త అనూజ్ మాట్లాడుతూ 2014లో డార్జిలింగ్ జూ నుండి రెండు ఎర్ర పాండాలను ఇక్కడికి తీసుకువచ్చారని, నేడు వాటి సంఖ్య ఏడుకి పెరిగిందన్నారు. రెడ్ పాండాలు ఎత్తయిన ప్రదేశాలలోని చెట్లపై నివసించడానికి ఇష్టపడతాయన్నారు. అవి రింగల్ గడ్డిని ఇష్టంగా తింటాయని తెలిపారు. నైనిటాల్ వాతావరణం చల్లగా ఉంటుంది. అందుకే ఇక్కడి పాండాలకు వాటి ఆహారంలో ఆపిల్, అరటిపండ్లు, తేనె, పాలు ఇస్తారని తెలిపారు. కాగా రెడ్ పాండా సోమరి జంతువని, ఎప్పుడూ నిద్రిస్తూ ఉంటుందని అన్నారు. దీనిని జూపార్కులో ఉదయం, సాయంత్రం వేళల్లో చూడవచ్చన్నారు. -
ఆ రాష్ట్రంలో క్యాన్సర్ బారిన 30 శాతం జనాభా
నోటి క్యాన్సర్ విషయంలో దేశంలోని రాజస్థాన్ మూడవ స్థానంలో నిలిచింది. రాజస్థాన్ జనాభాలో 30 శాతం మంది నోటి క్యాన్సర్తో బాధపడుతున్నారు. నోటి క్యాన్సర్ అనేది గుట్కా, బీడీ, సిగరెట్, పొగాకు మొదలైన మత్తుపదార్థాలు తీసుకోవడం వలన వస్తుంది. ఈ మత్తు పదార్థాలను తీసుకున్నప్పుడు నోటిలో పుండు ఏర్పడి, అది ఎంతకీ నయంకానపుడు, అది క్యాన్సర్గా పరిణమిస్తుంది. మరోవైపు నోటిలోపల అల్సర్లు ఉండటం సాధారణమేనని అనిపించినా, ఇది తీవ్రమైనప్పుడు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధికి దారితీస్తుంది. నోటి పుండు అనేది చాలా సాధారణ సమస్యే అయినప్పటికీ, దానిని విస్మరించడం ప్రాణాంతకమని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాజస్థాన్లోని జోధ్పూర్కు చెందిన ప్రముఖ దంతవైద్యుడు డాక్టర్ ఆశిష్ జోషి తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్లో 30 శాతం మంది నోటి క్యాన్సర్తో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం చెడు అలవాట్లు. అయితే ఈ వ్యాధికి కొన్ని ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఇవి కూడా నోటి క్యాన్సర్కు కారణంగా నిలుస్తున్నాయి. నోటి లోపల ఏర్పడే పుండ్లు దీర్ఘకాలం ఉంటే అది క్యాన్సర్గా మారే అవకాశం 50 నుంచి 60 శాతం వరకూ ఉంటుందని డాక్టర్ ఆశిష్ జోషి తెలిపారు. 43 ఏళ్లుగా దంతవైద్యునిగా సేవలందిస్తున్న డాక్టర్ ఆశిష్ ప్రత్యేకంగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, ప్రజలకు నోటి క్యాన్సర్పై అవగాహన కల్పిస్తున్నారు. -
చైనా జనాభా రెండో ఏడాదీ తగ్గింది
బీజింగ్: అధిక జనాభాతో మన దేశం జనభారత్గా దూసుకుపోతుంటే పొరుగుదేశం చైనా జనాభా క్షీణతను చవిచూస్తోంది. వరసగా రెండో ఏడాదీ అక్కడ జనాభా క్షీణత నమోదైంది. గత ఏడాదితో చూస్తే 2023 ఏడాదిలో చైనా జనాభా 20.8 లక్షలు తగ్గి 140.97 కోట్లకు పడిపోయింది. వార్షిక గణాంకాలను బుధవారం చైనా విడుదలచేయడంతో ఈ విషయం వెల్లడైంది. జనాభా నియంత్రణే లక్ష్యంగా ఒకే బిడ్డ విధానాన్ని కఠినంగా కమ్యూనిస్ట్ ప్రభుత్వం అమలుచేయడంతో చైనాలో గత ఆరు దశాబ్దాల్లో ఎరుగని జనాభా క్షీణతను 2022 ఏడాది ఎదుర్కొంది. 2022లో చైనాలో 95.6 లక్షల మంది జని్మస్తే 2023లో 90.2 లక్షల మంది పుట్టారు. జననాల రేటు అత్యంత కనిష్టానికి పడిపోవడమూ ఇందుకు ఒక కారణం. కోవిడ్ కారణంగా 2023 ఏడాదిలో ఎక్కువ మంది చనిపోవడమూ జనాభా తగ్గుదలకు మరో కారణమైంది. గత ఏడాది ఏకంగా 1.11 కోట్ల మంది చైనాలో చనిపోయారు. -
2100 నాటికి ప్రపంచ జనాభాలో భారీ తగ్గుదల? భారత్, చైనా పరిస్థితి ఏమిటి?
పెరుగుతున్న జనాభాపై ప్రపంచంలోని పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జనాభా పెరుగుదల అనేక అనర్థాలకు దారితీస్తుందని వాపోతున్నాయి. అయితే ఐక్యరాజ్యసమితి అందించిన ‘రివిజన్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ -2022’ డేటాలోని వివరాలు మన ఊహలకు భిన్నంగా ఉన్నాయి. భవిష్యత్లో ప్రపంచ జనాభాలో తగ్గుదల కనిపించనున్నదని ఈ నివేదిక వెల్లడించింది. దీనికి వెనుకనున్న కారణాలేమిటో కూడా తెలియజేసింది. ప్రపంచంలో 2100 నాటికి మొత్తం జనాభా ఎంత ఉంటుందనే దానిపై ఈ నివేదికలో అంచనా అందించారు. దీనిలో భారతదేశంతో పాటు చైనా, పాకిస్తాన్, అమెరికా, యూరోపియన్ దేశాల జనాభాకు సంబంధించి అంచనాలున్నాయి. ఈ నివేదికలోని వివరాల ప్రకారం 2021లో భారతదేశ జనాభా 153 కోట్లు. ప్రస్తుత జనాభా దాదాపు 140 కోట్లు. అంటే 2021కి.. ఇప్పటికి(2023) జనాభాలో తగ్గుదల కనిపించింది. దీని ప్రకారం చూస్తే వచ్చే 77 ఏళ్లలో అంటే 2100 నాటికి భారతదేశ జనాభా 13 కోట్ల మేరకు మాత్రమే పెరగనుంది. 2100వ సంవత్సరంలో ప్రపంచ జనాభాలో గణనీయమైన పెరుగుదల ఉండకపోవచ్చంటూ ఈ అంచనాలలో పేర్కొన్నారు. ఈ నివేదికలో అత్యంత ఆశ్చర్యకరమైన అంశం చైనాతో ముడిపడివుంది. 2100 నాటికి చైనా జనాభా 140 కోట్ల నుంచి దాదాపు 77 కోట్లకు తగ్గిపోనుంది. యూఎన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (ఐహెచ్ఎంఈ), ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అప్లైడ్ సిస్టమ్స్ అనాలిసిస్ (ఐఐఏఎస్ఏ)లు అందించిన డేటాలలోని అంశాలను క్రోడీకరించి 2100నాటి జనాభా అంచనాలను రూపొందించారు. ప్రపంచ జనాభా 2086 నాటికి గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ఆ నివేదికలో పేర్కొన్నారు. సంతానోత్పత్తి రేట్లు 2050కి ముందుగానే త్వరితగతిన తగ్గుతాయని ఈ అంచనాలలో వెల్లడయ్యింది. 2100కి వీటి స్థిరీకరణ జరగనుందని పేర్కొన్నారు. దేశం అభివృద్ధి చెందుతున్నప్పుడు జనన రేటు తగ్గుతుంది. శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం పెరగడం, గర్భనిరోధకాల లభ్యత, కుటుంబ నియంత్రణకు ప్రోత్సాహం, అధిక సంతాన ఖర్చులు మొదలైనవి సంతానోత్పత్తి తగ్గుదలకు కారణాలుగా నిలుస్తున్నాయి. 2100 నాటికి వివిధ దేశాల జనాభా ఎంత ఉండవచ్చనే అంచనాలను ‘రివిజన్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ -2022’ డేటాలో అందించారు. 2100 నాటికి ఏ దేశంలో ఎంత జనాభా(అంచనా)? భారతదేశం: 153 కోట్లు చైనా: 77 కోట్ల 10 లక్షలు నైజీరియా: 54 కోట్ల 60 లక్షలు పాకిస్తాన్: 48 కోట్ల 70 లక్షలు కాంగో: 43 కోట్ల 10 లక్షలు అమెరికా: 39 కోట్ల 40 లక్షలు ఇథియోపియా: 32 కోట్ల 30 లక్షలు ఇండోనేషియా: 29 కోట్ల 70 లక్షలు టాంజానియా: 24 కోట్ల 40 లక్షలు ఈజిప్ట్: 20 కోట్ల 50 లక్షలు బ్రెజిల్: 18 కోట్ల 50 లక్షలు ఫిలిప్పీన్స్: 18 కోట్లు బంగ్లాదేశ్: 17 కోట్ల 70 లక్షలు సూడాన్: 14 కోట్ల 20 లక్షలు అంగోలా: 13 కోట్ల 30 లక్షలు ఉగాండా: 13 కోట్ల 20 లక్షలు మెక్సికో: 11 కోట్ల 60 లక్షలు కెన్యా: 11 కోట్ల 30 లక్షలు రష్యా: 11 కోట్ల 20 లక్షలు ఇరాక్: 11 కోట్ల 10 లక్షలు ఆఫ్ఘనిస్తాన్: 11 కోట్లు మొజాంబిక్: 10 కోట్ల 60 లక్షలు వియత్నాం: 9 కోట్ల 10 లక్షలు కామెరూన్: 8 కోట్ల 70 లక్షలు మాలి: 8 కోట్ల 70 లక్షలు మడగాస్కర్: 8 కోట్ల 30 లక్షలు టర్కీ: 8 కోట్ల 20 లక్షలు ఇరాన్: 7 కోట్ల 90 లక్షలు దక్షిణాఫ్రికా: 7 కోట్ల 40 లక్షలు యెమెన్: 7 కోట్ల 40 లక్షలు జపాన్: 7 కోట్ల 40 లక్షలు ఇది కూడా చదవండి: చైనా జిత్తులకు అమెరికా, భారత్ పైఎత్తు! -
2050 నాటికి ఏ దేశాల్లో హిందువులు అధికం? భారత్ పరిస్థితి ఏమిటి?
ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలలో మతపరమైన జనాభాలో వేగవంతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అమెరికన్ థింక్ ట్యాంక్ ప్యూ రీసెర్చ్ సెంటర్ ఈ విషయమై నిర్వహించిన ఒక అధ్యయనంలో పలు ఆసక్తికర పరిణామాలు వెలుగుచూశాయి. ప్యూ రీసెర్చ్ సెంటర్ 2015లో ఈ పరిశోధన నిర్వహించింది. రాబోయే నాలుగు దశాబ్దాల్లో ప్రపంచంలోని మతపరమైన జనాభాలో వేగవంతమైన, పెను మార్పులు రావచ్చని అధ్యయనంలో వెల్లడయ్యింది. హిందూ మతంతో పాటు క్రైస్తవం, ఇస్లాం, అనేక ఇతర మతాలు కూడా పరిశోధన పరిధిలో చేరాయి. ఈ పరిశోధన ద్వారా రాబోయే 40 ఏళ్లలో ఏ దేశంలో ఏ మతపరమైన జనాభా ఎక్కువగా ఉండే అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం ప్రకారం 2050 నాటికి హిందూ మతాన్ని అనుసరించే వారి జనాభా ప్రపంచ జనాభాలో 15 శాతానికి చేరుకుంటుంది. అదే సమయంలో భారతదేశంలో హిందూ మతాన్ని అనుసరించే వారి సంఖ్య అప్పటికీ అధికంగానే ఉంటుంది. అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం భారతదేశంలో హిందువుల జనాభా 2050 నాటికి 1.297 (ఒక బిలియన్.. 100 కోట్లు) బిలియన్లకు చేరుకుంటుంది. ప్రస్తుతం దేశంలో అత్యధిక సంఖ్యలో హిందూ మతాన్ని అనుసరించేవారు ఉన్నారు. ఇది మొత్తం జనాభాలో 79 శాతానికి పైగా ఉంది. హిందువుల జనాభా పరంగా భారతదేశం తర్వాత నేపాల్ రెండవ స్థానంలో ఉంది. నేపాల్లో హిందువుల జనాభా 3.812 కోట్లు. 2006కి ముందు నేపాల్ హిందూ దేశంగా ఉండేది. ఆ తర్వాత నేపాల్ సెక్యులర్ దేశంగా ప్రకటించుకుంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం 2050నాటికి అమెరికాలో 47.8 లక్షల మంది హిందువులు ఉంటారు. 2015లో అమెరికాలో హిందువుల జనాభా 22.3 లక్షలు. ఇండోనేషియాలో వచ్చే 27 ఏళ్లలో హిందువుల జనాభా 41.5 లక్షలకు పెరగవచ్చని అధ్యయనంలో తేలింది. శ్రీలంక, మలేషియా, బ్రిటన్, కెనడాలలో హిందువుల జనాభా రాబోయే కాలంలో మరింతగా పెరగవచ్చని అధ్యయనంలో తేలింది. ఇది కూడా చదవండి: టన్నుల కొద్దీ బంగారమున్న గ్రహశకలం ఏది? -
అతి చిన్న స్వయం ప్రకటిత దేశం ఏది? జనాభా ఎంత?
విదేశీయులు భారతదేశాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు వారు వివిధ నియమాలను పాటించాల్సివుంటుంది. ఇటీవల కెనడా పౌరులకు భారతదేశం వీసాలపై నిషేధం విధించింది. అంటే ఇప్పుడు ఎవరైనా కెనడాకు చెందిన వ్యక్తి భారత్ వచ్చేందుకు అనుమతి లేదు. ఇతర దేశాల ప్రజలు భారతదేశానికి రావచ్చు. అయితే దీనికి భిన్నంగా.. ఆ దేశంలో ఇతర దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు ఆ దేశాధ్యక్షుడే స్వయంగా స్వాగతం పలుకుతాడు. కెవిన్ బాగ్ స్వయం ప్రకటిత దేశం. దీనిని రిపబ్లిక్ ఆఫ్ మొలోసియా అని పిలుస్తారు. ఇది అమెరికాలోని నెవాడా సమీపంలో ఉంది. 30 మంది మనుషులు, 4 కుక్కలు ఉన్న ఈ చిన్న దేశానికి సొంత కరెన్సీ (వలోరా) కూడా ఉంది. 2.28 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న బ్యాంక్ ఆఫ్ మొలోసియాలో నాణేలు, ముద్రించిన నోట్లను ఉపయోగిస్తారు. ఈ స్వయం ప్రకటిత దేశంలో కుక్కలకు కూడా పౌరసత్వం లభిస్తుంది. నియంత కెవిన్ బోగ్ తన భార్య, ముగ్గురు పిల్లలతో ఇక్కడ ఉంటున్నాడు. కెవిన్ బోగ్ ఎప్పుడూ సైనిక దుస్తులలో కనిపిస్తాడు. అతను తనను తాను స్వతంత్ర దేశానికి పాలకునిగా చెప్పుకుంటూ, దేశానికి వచ్చే పర్యాటకులకు స్వాగతం పలుకుతాడు. 1990లలో రిపబ్లిక్ ఆఫ్ మొలోసియా తూర్పు జర్మనీపై యుద్ధం ప్రకటించింది. 2006లో రిపబ్లిక్ ఆఫ్ మొలోసియా ముస్టాచెస్టన్ అనే మరో మైక్రోనేషన్తో యుద్ధం చేసింది. దీనిలో కెవిన్ బాగ్ గెలిచాడు. బదులుగా ముస్టాచెస్టన్ పాలకుడు జరిమానా చెల్లించాల్సి వచ్చింది. 2010లో ఈ చిన్న ‘దేశం’ మరో మైక్రోనేషన్తో యుద్ధం చేసింది. రిపబ్లిక్ ఆఫ్ మొలోసియా తన జాతీయ గీతాన్ని రెండుసార్లు మార్చింది. ఈ దేశపు జెండా నీలం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో ఉంటుంది. ఇది కూడా చదవండి: ఏ రాష్ట్రంలో బిచ్చగాళ్లు అధికం? మిగిలిన రాష్ట్రాల పరిస్థితి ఏమిటి? -
దక్షిణాఫ్రికాలో ప్రజల లెక్క
గత ఏడాది అంటే 2022 నాటికి దక్షిణాఫ్రికా జనాభా పెరిగింది. మొత్తం జనాభా 60.6 మిలియన్లకు చేరింది. వీరిలో ఎక్కువ మంది (సుమారు 49.1 మిలియన్లు) నల్లజాతి ఆఫ్రికన్లు ఉన్నారు. భారతీయ లేదా ఆసియా నేపథ్యం కలిగిన వ్యక్తులు అతి చిన్న జనాభా సముదాయంగా ఏర్పడ్డారు. వీరి జనాభా సుమారు 1.56 మిలియన్లుగా ఉంది. దక్షిణాఫ్రికా సరిహద్దు ప్రాంతాలలో దాదాపు 59.3 మిలియన్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. దక్షిణాఫ్రికా.. ఆఫ్రికా ఖండంలో అత్యధిక జనాభా కలిగిన ఆరు దేశాలలో ఒకటిగా నిలిచింది. అతిపెద్ద జనావాస ప్రావిన్సుల విషయానికొస్తే గౌటెంగ్ ( రాజధాని నగరం జోహన్నెస్బర్గ్), క్వాజులు-నాటల్ (రాజధాని నగరం పీటర్మారిట్జ్బర్గ్) ఉన్నాయి. ఇక్కడి జనాభా వరుసగా దాదాపు 15.9 మిలియన్లు, 11.7 మిలియన్లుగా ఉంది. కేప్ టౌన్, డర్బన్, జోహన్నెస్బర్గ్ అతిపెద్ద కమ్యూనిటీలను కలిగిన నగరాలుగా నిలిచాయి. గృహాల సంఖ్యలో పెరుగుదల 2001- 2022 మధ్య కాలంలో దేశంలో మొత్తం గృహాల సంఖ్య మరింతగా పెరిగింది. ఈ కాలంలో దక్షిణాఫ్రికా దాదాపు 60 శాతం గృహాల పెరుగుదలను నమోదు చేసింది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో (30.7 శాతం) కంటే పట్టణ ప్రాంతాలలో (38.2 శాతం) ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులతో కూడిన కుటుంబాలు అధికంగా ఉన్నాయని తేలింది. మరోవైపు ఆరు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు కలిగిన గృహాలు గ్రామీణ ప్రాంతాల్లో 20.5 శాతంగా ఉన్నాయి. 2021లో కుటుంబాల సంఖ్య దాదాపు 17.9 మిలియన్లకు చేరుకుంది. దాదాపు ప్రతి మూడు ఇళ్లలో ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులు ఉన్నారు. దక్షిణాఫ్రికా ప్రజలలో అత్యధికులు అధికారిక గృహాలలో నివసిస్తున్నారు. 2018 నాటికి దక్షిణాఫ్రికాలో అత్యధికంగా మాట్లాడే భాష ఇసిజులు(isiZulu). తరువాతి స్థానంలో ఇసిక్సోసా (isiXhosa), అనంతరం ఇంగ్లీషు వస్తాయి. అత్యధిక ఆదాయ అసమాన దేశం ఆఫ్రికన్ దేశాలు ఆదాయ పంపిణీకి సంబంధించి గణనీయమైన అసమానతలను కలిగి ఉన్నాయి. ఈ విషయంలో దక్షిణాఫ్రికా.. ప్రపంచ ఆదాయ అసమానత ఇండెక్స్లో 63 శాతంగా ఉంది. అయితే కొన్ని సంవత్సరాలుగా ఈ సూచికలో మెరుగుదల కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో మరింత అసమానత నెలకొంది. దేశంలో నెలవారీ జాతీయ ఆహార దారిద్య్ర రేఖ 663 దక్షిణాఫ్రికా రాండ్లు కావడం గమనార్హం. 2019లో దక్షిణాఫ్రికాలోని అత్యధిక కుటుంబాలు జీతాలు లేదా గ్రాంట్లను ప్రధాన ఆదాయ వనరుగా కలిగి ఉన్నాయి. దాదాపు 10.7 మిలియన్ల ప్రజలు వేతనాల ద్వారానే ఆదాయాన్ని పొందుతున్నారు. 7.9 మిలియన్ల కుటుంబాలు ప్రభుత్వం చెల్లించే సామాజిక గ్రాంట్లను అందుకుంటున్నాయి. 2022లో ఆఫ్రికన్ ఖండంలో సగటు ఆయుర్దాయం మహిళలకు 64 సంవత్సరాలు. పురుషులకు 61 సంవత్సరాలు. దేశంలో పురుషుల కంటే మహిళల జనాభానే అధికం. 2021 నాటికి, దక్షిణాఫ్రికాలో సంతానోత్పత్తి రేటు 2.37. ఇది 2019 నుండి తగ్గుతోంది. శిశు మరణాల రేటు కూడా తగ్గుతోంది. ఇది మెరుగైన ఆరోగ్య సంరక్షణకు సూచిక. దేశంలో మరణాలకు ప్రధాన కారణం క్షయవ్యాధి, తరువాత మధుమేహంగా గుర్తించారు. ఇది కూడా చదవండి: దక్షిణాఫ్రికా రాజకీయాలు హింసకు దారి తీస్తున్నాయా? -
పాపం.. జపాన్ భవిష్యత్తు అలా ఏడ్చింది
జపాన్లో అంతకంతకూ పెరుగున్న వృద్ధుల సంఖ్యకు తోడు తగ్గుతున్న జనాభా ఆ దేశానికి అనేక సవాళ్లను విసురుతోంది. భవిష్యత్ను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. ఇటీవల విడుదల చేసిన ప్రభుత్వ డేటాలోని వివరాల ప్రకారం జపాన్లోని ప్రతి ప్రావిన్స్లో మొదటిసారిగా రికార్డు స్థాయిలో జనాభా సంఖ్యలో తగ్గుదల నమోదయ్యింది. జపాన్లో విదేశీ నివాసితుల సంఖ్య దాదాపు 3 మిలియన్లకు పెరిగింది. గత 14 ఏళ్లుగా జపాన్లో జనాభా క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో జపాన్ పౌరుల మొత్తం జనాభా 122.4 మిలియన్లు. ఇది 2021 నాటి జనసంఖ్య కంటే ఎనిమిది లక్షలు తక్కువ. 1968 తర్వాత ఇదే అతిపెద్ద క్షీణత. జనాభాను భర్తీ చేయడంలో విదేశీ పౌరుల పాత్ర జపాన్లోని మొత్తం 47 ప్రిఫెక్చర్(ప్రాంతం)లలో పౌరుల సంఖ్య తగ్గింది. సాధారణంగా అధిక జనన రేటు కలిగిన ఒకినావా ప్రిఫెక్చర్లో కూడా జనాభా సంఖ్య క్షీణించింది. అయితే క్షీణిస్తున్న జనాభాను భర్తీ చేయడంలో విదేశీ పౌరులు పెద్ద పాత్ర పోషిస్తున్నారు. దేశవ్యాప్తంగా రెసిడెన్సీ కార్డులు కలిగిన విదేశీయుల సంఖ్య 10 శాతం పెరిగింది. కోవిడ్-19 మహమ్మారి నుండి కోలుకున్న అనంతరం ఈ సంఖ్య మూడేళ్లలో మొదటిసారిగా పెరిగింది. ఇతర దేశాల నుంచి వచ్చి జపాన్లో నివసిస్తున్న వారి సంఖ్య 2013 తర్వాత అత్యధికంగా ఉందని తేలింది. ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలు తక్కువ జననాల రేటును ఎదుర్కొంటున్నాయి. అయితే జపాన్లో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. విదేశీ జనాభాకు నిలయంగా టోక్యో జపాన్లోని ప్రతీ ప్రావిన్స్లో విదేశీ నివాసితుల సంఖ్య పెరిగింది. రాజధాని టోక్యో విదేశీ పౌరుల జనాభాకు నిలయంగా మారింది. దాదాపు ఆరు లక్షల మంది విదేశీయులు ఇక్కడ నివసిస్తున్నారు. అదేసమయంలో టోక్యోలో జపాన్ పౌరుల జనాభా తగ్గింది. అయితే విదేశీయుల చేరిక కారణంగా ఈ ప్రావిన్స్ మొత్తం జనాభా పెరిగింది. అకిటా ప్రిఫెక్చర్ జనాభా అత్యధికంగా 1.65 శాతం మేరకు తగ్గింది. జపాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ అండ్ సోషల్ సెక్యూరిటీ రీసెర్చ్ తెలిపిన వివరాల ప్రకారం 2067 నాటికి జపాన్ జనాభాలో 10.2 శాతం విదేశీయులు ఉంటారని అంచనా. విదేశీ నివాసితుల సంఖ్య పెద్ద నగరాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ పెరుగుతోంది. నిబంధనలను సడలించడంతో.. జపాన్లో కఠినమైన ఇమ్మిగ్రేషన్ నియమాలు అమలులో ఉన్నాయి. అయితే కార్మికుల కొరత సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం వాటిని క్రమంగా సడలిస్తోంది. ఇది విదేశీయుల రాకకు మార్గం సుగమం చేసింది. ఇక్కడ జనాభాలో 14 ఏళ్లు, అంతకంటే తక్కువ వయస్సు కలిగిన పిల్లల సంఖ్య 11.82 శాతంగా ఉంది. ఇది 0.18 శాతం తగ్గింది. 65 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 0.15 శాతం పెరిగి 29.15 శాతానికి చేరుకుంది. 92.4 శాతం ప్రిఫెక్చర్లలో జపాన్ జనాభా క్షీణించింది. ఈ సంవత్సరం జూన్లో దేశంలో పడిపోతున్న జనన రేటును అధిగమించడానికి జపాన్ ప్రభుత్వం $25 బిలియన్ల ప్రణాళికను ప్రారంభించింది. జపాన్లో జాతీయ విధానాలు జనాభా క్షీణతను ఆపడంలో విఫలమయ్యాయి. ఈ ధోరణి యువత,మహిళలకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచాల్సిన తక్షణ అవసరాన్ని సూచిస్తున్నది. ఇది కూడా చదవండి: మతోన్మాదం యూరప్ కొంప ముంచుతుందా? -
నియంత్రించాం.. నష్టపోతున్నాం: స్టాలిన్
చెన్నై: దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణతో ఆయా రాష్ట్రాలు నియోజకవర్గాలను కోల్పోతున్నాయని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. స్టాలిన్ తాజాగా ‘ది వీక్’ వార్తాసంస్థతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘ దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలుచేస్తూ దేశానికి మేలుచేస్తున్నాయి. కానీ అదేసమయంలో ఈ ప్రాంతంలో జనాభా క్షీణించడంతో నియోజకవర్గాల సంఖ్య తగ్గుతోంది. ఈ పరిణామం దక్షిణాది రాష్ట్రాలకు పెద్ద నష్టం. ఉత్తరాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ పథకాలను సరిగా అమలుచేయలేక చేతులెత్తేశాయి. అయినాసరే ఎక్కువ లోక్సభ స్థానాలను దక్కించుకోనున్నాయి. తమకు ఓటు వేయని దక్షిణాది రాష్ట్రాలపై పగ తీర్చుకునేందుకు ఈ ‘జనాభా ప్రాతిపదికన సీట్లు’ విధానాన్ని అమలుచేయాలని బీజేపీ భావిస్తోంది. ఈసారి ఎన్నికల్లో గెలిస్తే దీనిని అమలుచేసేందుకు బీజేపీ ఉవి్వళ్లూరుతోంది. అయినాసరే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీల మధ్య బేదాభిప్రాయాలు తుడిచిపెట్టుకుపోతాయి. ప్రతిపక్షానికి ఏకైక నిర్వచనంగా కాంగ్రెస్ అవతరిస్తుంది. దేశానికి సరికొత్త నమ్మకంగా రాహుల్ గాంధీ నిలిచారు’ అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. -
అవి ‘అర్ధం, పర్ధం లేని మాటలే’.. ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు!
ఎక్కువ మంది పిల్లలుంటే జనాభా సంక్షోభాన్ని తగ్గించొచ్చని అపరకుబేరుడు ఎలాన్ మస్క్ వాదిస్తున్నారు. అయితే, తాజాగా పిల్లలు, ఓటింగ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ యూజర్ చేసిన ట్వీట్కు స్పందించిన మస్క్..సంతానం లేని వారు ఓటు వేసేందుకు అనర్హులుగా పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. ట్విటర్ యూజర్ డేటాహజార్డ్ ‘తల్లిదండ్రులకు ఓటు హక్కును పరిమితం చేయకుండా ప్రజాస్వామ్యంలో ఆచరణ సాధ్యం కాదంటూ చేసిన ట్వీట్కు ప్రతిస్పందించారు. ఆ కామెంట్ను సమర్ధిస్తూ మస్క్ రిప్లయి ఇచ్చారు. గత ఏడాది జననాల రేటుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆల్ ఇన్ సమ్మిట్లో మాట్లాడుతూ .. కొంతమంది తక్కువ పిల్లలుంటే పర్యావరణానికి మంచిదని భావిస్తారు. ఇది అర్ధం లేని వ్యవహారం. జనాభా పెరుగుతున్నప్పటికీ పర్యావరణం బాగానే ఉంటుందని వ్యాఖ్యానించారు. Democracy is probably unworkable long term without limiting suffrage to parents. Helps solve the procreation problem, too. https://t.co/9zZ6eV56W1 — ~~datahazard~~ (@fentasyl) July 2, 2023 అర్ధం పర్ధం లేని మాటలు అందుకు జపాన్లో క్షీణిస్తున్న జననాల రేటును ఉదహరించారు. 2021లో జపాన్ జనాభా 600,000 మంది క్షీణించిందని, తద్వారా తన ఉనికిని కోల్పేయే ప్రమాదం ఉందని అన్నారు.జనాభా ఎక్కువగా ఉంటే ప్రపంచ నాగరికత క్షీణించదని, పిల్లలను కలిగి ఉండటం పర్యావరణానికి హానికరం కాదని తన వైఖరిని కూడా స్పష్టం చేశారు. నాగరికతను కాపాడుకోవడానికి ఇది చాలా అవసరమని పేర్కొన్నారు. చైనాలో జనాభా చైనాలో జనాభా పెరుగుదల రేటు భారీ స్థాయిలో పడిపోతోందంటూ వచ్చిన పలు నివేదికలపై మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. అతి తొందరలోనే చైనా జనాభా పతనాన్ని చవిచూడనుందని హెచ్చరించారు. చైనాలో జననాల రేటు గణనీయంగా క్షీణిస్తోందని .. రానున్న రోజుల్లో మరింత పతనం అవుతుందని అంచనా వేశారు. చదవండి👉 విడుదల కాకుండానే..మెటా ‘థ్రెడ్స్’కు ఎదురు దెబ్బ! -
ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్న బాలికల సంఖ్య..
ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా ఆదివాసీ–గిరిజన ప్రాంతాల్లో జరిగే ప్రసవాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెడుతోంది. ఆదివాసీ మహిళల కాన్పులు ఇళ్లలో కాకుండా ఆసుపత్రుల్లో లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్ సీలు) జరిగేలా ఆరోగ్య సిబ్బంది చూస్తున్నారు. ఏపీలో మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లలు ఎక్కువగా ఉన్నారని, ఈ విషయంలో దేశంలో కేరళ తర్వాత రెండో స్థానానికి ఆంధ్రప్రదేశ్ చేరుకుందని గణాంకాలు చెబుతున్నాయి. శ్రామిక శక్తికి (లేబర్ ఫోర్స్) సంబంధించిన 2021–2022 సర్వే ప్రకారం ఏపీలో ప్రతి వెయ్యి మంది మగపిల్లలకు 2019–20లో 1021 మంది బాలికలు ఉండగా, ఈ సంఖ్య 2021–2022 నాటికి 1046కు పెరిగిందని కేంద్ర ప్రభుత్వ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పుట్టిన ఆడపిల్లలు ఆరేళ్లు దాటిన తర్వాత కూడా ఆరోగ్యంగా పెరగడానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖతో పాటు వివిధ రకాల ప్రభుత్వ సిబ్బంది కృషిచేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు పోషకాహారం అందజేస్తున్నారు. గతేడాది ఏప్రిల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ఫ్యామిలీ డాక్టర్’ కార్యక్రమం చక్కటి ఫలితాలు అందిస్తుంది. దీనివల్ల 10,032మంది డాక్టర్లు వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్లో వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంబీబీఎస్ డాక్టర్లు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ల ఆరోగ్యాన్ని నిరంతరం పరిశీలిస్తూ అవసరైన గైడెన్స్ అందజేస్తున్నారు. విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సిపి, రాజ్యసభ సభ్యులు -
దేశ జనాభా నియంత్రణపై బాబా రామ్దేవ్ సంచలన వ్యాఖ్యలు
దేశంలో జనాభా నియంత్రణపై యోగా గురువు బాబా రామ్దేవ్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో జనాభా నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు. ప్రస్తుతం దేశంలో జనాభా అత్యధికంగా ఉన్నదన్నారు. అందుకే దేశ జనాభా నియంత్రణకు పార్లమెంట్లో చట్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు. దేశంలో జనాభా 140 కోట్లకు చేరుకున్నదని, ఇంతకుమించి అధికంగా జనాభా పెరగకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడున్న జనాభాకు దేశంలో రైల్వే, ఎయిర్ పోర్టు, కాలేజీ, యూనివర్శిటీ, ఉపాధి కల్పన సేవలు అందించడమే చాలా ఎక్కువన్నారు. అందుకే పార్లమెంట్లో జనాభా నియంత్రణకు చట్టం చేయాలని, అప్పుడే దేశంపై అధికభారం పడదన్నారు. ఉత్తరాఖండ్కు తొలి వందేభారత్ ఎక్స్ప్రెస్ అందించినందుకు ప్రధాని మోదీకి, రైల్వేశాఖ మంత్రి అశ్వని వైష్ణవ్కు యోగా గురువు బాబా రామ్దేవ్ కృతజ్ఞతలు తెలిపారు. హరిద్వార్ అనేది ఉత్తరాఖండ్లో గర్వించదగిన ప్రాంతమని అన్నారు. ఢిల్లీ- డెహ్రాడూన్ మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్ నడపడం ఆనందదాయకమన్నారు.ఇది దేవభూమికి దక్కిన గౌరవమని అన్నారు. గతంలోనూ బాబా రామ్ దేవ్ జనాభా నియంత్రణ గురించి మాట్లాడారు. ఏ కుటుంబంలోనైనా ఇద్దరికిమించి అధికంగా పిల్లలు ఉంటే వారికి కొన్ని హక్కులను వర్తింపజేయకూడదన్నారు. దేశంలో జనాభా పెరిగితే, ఎదురయ్యే పరిస్థితులను తట్టుకునేందకు భారత్ సిద్ధంగా లేదన్నారు.దేశ జనాభా 150 కోట్లు దాటకుండా చూడాలని బాబా రామ్దేవ్ సూచించారు. -
జనాభాలో చైనాను అధిగమించిన భారత్
-
అశ్వాలేవీ..? లొట్టిపిట్టలెక్కడ
దేశంలో మొత్తంగా పశు సంపద కొంతమేర పెరిగినా.. ఒంటెలు, గుర్రాల వంటి జంతువుల సంఖ్యలో 9 శాతం క్షీణత నమోదైంది. 2.90 లక్షల గుర్రాలు తగ్గిపోగా.. 1.50 లక్షల ఒంటెలు కనుమరుగయ్యాయి. గాడిదలు, పందుల సంఖ్య సైతం గణనీయంగా తగ్గిపోయింది. అయితే సంకర జాతి పశువుల సంఖ్య 26.9 శాతం పెరిగింది. దేశవ్యాప్తంగా 6.60 లక్షల గ్రామాలు.. 89 వేల పట్టణాల్లోని 27 కోట్లకు పైగా గృహాలు, ఇతర ప్రాంతాల్లో నిర్వహించిన 20వ పశుగణన నివేదిక ఈ విషయాల్ని తేటతెల్లం చేసింది. పశుగణన ఏం తేల్చిందంటే.. ► 2012 – 2019 మధ్య మొత్తం పశువుల జనాభాలో 4.6 శాతం పెరుగుదల నమోదైంది. ► దేశంలో ఒంటెలు 84 శాతం రాజస్థాన్లో ఉండగా.. 11 శాతం గుజరాత్లో ఉన్నాయి. ► 2012 నుంచి 2019 సంవత్సరం నాటికి దేశంలో ఒంటెల జనాభా 4 లక్షల నుంచి 2.5 లక్షలకు తగ్గింది. ► ఇక 2012 నుంచి 2019 మధ్య గుర్రాల సంఖ్య 6.3 లక్షల నుంచి 3.4 లక్షలకు తగ్గింది. ► ఇతర దేశాలకు చెందిన, సంకర జాతి పశువుల జనాభా 2012తో పోలిస్తే 2019లో 26.9 శాతం పెరిగింది. ► 2012తో పోలిస్తే దేశీయ (దేశవాళీ) పశువులలో 6 శాతం క్షీణత ఉంది. ► గత గణనతో పోలిస్తే.. 2019లో దేశంలో మొత్తం పౌల్ట్రీ 851.81 మిలియన్లకు చేరటం ద్వారా 16.8 శాతం వృద్ధి నమోదు చేసింది. ► 2012తో పోలిస్తే 2019 నాటికి దేశంలో పెరటి కోళ్ల పెంపకం 48.8 శాతం పెరిగి.. 317.07 మిలియన్లకు చేరింది. తగ్గుదలకు కారణాలివీ.. ► ఒంటెలు, గుర్రాల సంఖ్య తగ్గిపోవడానికి వ్యవసాయ రంగంలో వాటి వినియోగం తగ్గటమే కారణమని కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ► గతంలో రవాణాకు ఒంటెలను వినియోగించే వారు. ఇది క్రమంగా తగ్గుతోంది. ► రాజస్థాన్లో మేత భూములు తగ్గడంతో వాటి పెంపకం కష్టంగా మారింది. ► ఇక విదేశాల నుంచి దిగుమతి చేసుకునే గుర్రాల పోషణకు పెట్టుబడి ఎక్కువగా అవుతోంది. దీంతో వీటి పెంపకం ఆర్థికంగా సాధ్యం కావడం లేదు. ► దేశీయ గుర్రపు జాతులను ఎక్కువగా పోలీస్ సేవలు లేదా వినోదాల కోసమే ఉపయోగిస్తున్నారు. – గుర్రాల పెంపకానికి పేరొందిన గుజరాత్లో తప్ప ఇతర రాష్ట్రాల్లో వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ► అయితే ఒంటె జాతిని రక్షించడానికి రాజస్థాన్ ప్రభుత్వం ఒంటెను రాష్ట్ర జంతువుగా ప్రకటించి పలు రక్షణ చర్యలు చేపట్టింది. అలాగే గుజరాత్ ప్రభుత్వం వాటి రక్షణకు చర్యలు తీసుకుంది. కచ్ ప్రాంతంలో ఒంటె పాల సేకరణ, ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. దేశంలో పశు జనాభా ఇలా.. (మిలియన్లలో) ఏపీలో 15.79 శాతం వృద్ధి రాష్ట్రంలో పశు సంపదలో 15.79 శాతం వృద్ధి నమోదైంది. 2012 పశుగణనలో 2.94 కోట్ల పశు సంపద ఉండగా.. 2019 నాటికి 3.40 కోట్లకు పెరిగింది. పౌల్ట్రీ రంగంలోనూ భారీగా వృద్ధి నమోదైంది. 2012 గణన ప్రకారం రాష్ట్రంలో 80.6 మిలియన్ పౌల్ట్రీ జనాభా ఉంటే.. 2019 గణన నాటికి 107.9 మిలియన్లకు చేరింది. అంటే 33.85 శాతం వృద్ధి నమోదైంది. గొర్రెల జనాభాలోనూ 30 శాతం వృద్ధిరేటు నమోదైంది. 2012 గణన ప్రకారం రాష్ట్రంలో 13.6 మిలియన్లు గొర్రెలు ఉండగా.. 2019 నాటికి 17.60 మిలియన్లకు పెరిగాయి. అయితే గేదెల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. 2012లో 6.50 మిలియన్లు గేదెలుంటే.. 2019 నాటికి 6.20 మిలియన్లకు తగ్గాయి. – సాక్షి, అమరావతి -
జన చైనాలో తగ్గిన జనాభా.. 1961 తర్వాత ఇదే తొలిసారి
బీజింగ్: జన చైనాలో జనాభా కాస్త తగ్గింది. అక్కడ జనాభా సంఖ్య తగ్గుముఖం పట్టడం 1961 ఏడాది తర్వాత ఇదే తొలిసారి! 2021 ఏడాది జనాభా లెక్కలతో పోలిస్తే 2022ఏడాదిలో జనాభా 8,50,000 తగ్గిందని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ తాజాగా వెల్లడించింది. 2022 ఏడాదిలో చైనా జనాభా 141.18 కోట్లు అని నేషనల్ బ్యూరో లెక్క తేల్చింది. జననాల వృద్ధిరేటు తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే అంచనావేసిన దానికంటే ముందుగానే చైనాను దాటేసి భారత్ ప్రపంచంలోనే అత్యంత అధిక జనాభాగల దేశంగా అవతరించనుంది. చైనా ఆర్థిక వృద్ధి రేటు దాదాపు 3 శాతంగా నమోదైన ఈ తరుణంలో జనసంఖ్య సైతం వెనకడుగు వేస్తోంది. గత ఐదు దశాబ్దాల్లో చైనాలో ఇంతటి అత్యల్ప వృద్ధిరేటు నమోదవడం ఇది రెండోసారి. ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక, జనాభా విభాగం 2022 అంచనాల ప్రకారం ఈ ఏడాదిలోనే చైనాను భారత్ జనసంఖ్యలో అధిగమించనుంది. 2050కల్లా భారత్ 166.8 కోట్ల మందితో కిటకిటలాడనుంది. 131.7 కోట్లతో చైనా రెండోస్థానానికి పడిపోనుంది. ► 2022లో చైనాలో 95.6 లక్షల మంది జన్మించారు. 2021లో 1.062 కోట్ల మంది జన్మించారు. 2021లో 7.52 శాతమున్న జననాల రేటు 2022లో 6.77 శాతానికి పడిపోయింది. ► చైనాలో 72.20 కోట్ల మంది పురుషులు, 68.96 కోట్ల మంది స్త్రీలు ఉన్నారు. మున్న 16– 59 ఏళ్ల వయసు వారు 87.56 కోట్ల మంది ఉన్నారు. ► దేశ జనాభాలో సీనియర్ సిటిజన్లు 62 శాతం. ► 60 ఏళ్లు పైబడిన వృద్ధుల జనాభా 28 కోట్లు దాటింది. జనాభాలో వీరు 19.8 శాతం. ► ఒకప్పుడు వ్యవసాయ ఆధారిత దేశమైన చైనా ఇప్పుడు ప్రపంచ ఉత్పత్తుల కేంద్రంగా ఎదిగింది. దీంతో పరిశ్రమల్లో పనిచేసేందుకు జనం పట్టణాల బాటపట్టారు. దీంతో పట్టణాల్లో నివసిస్తున్న వారి సంఖ్య 92.07 కోట్లకు ఎగబాకింది. -
కులగణనే సమస్యలకు పరిష్కారం
భారత దేశ సామాజిక, ఆర్థిక వ్యవస్థలు నిచ్చెన మెట్ల కుల వ్యవస్థపై ఆధారపడి నిర్మితమయ్యాయి. భూమి మీద ఎవరికైతే హక్కు ఉందో వారే రాజ్యాధికారాన్నీ అనుభవించే పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. అయితే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వంటి పై మూడు ఆధిపత్య కులాలవారితో పాటూ శూద్రులైన కొన్ని కులాల వారూ సంపదనూ, రాజ్యాధికారాన్నీ అనుభవించ గలుగుతున్నారు. అయితే రాజ్యాధికారంతో పాటూ దేశ సంపదను కులాల దామాషా ప్రకారం ఎవరికి దక్కాల్సింది వారికి దక్కినప్పుడే... రాజ్యాంగం ఇచ్చిన సమానత్వ హక్కుకు సార్థకత్వం చేకూరుతుంది. ఇందుకు దేశంలో ఏ కులంవారు ఎంత మంది ఉన్నారనే లెక్కలు అవసరం. అందుకే కుల గణనను ప్రభుత్వం తక్షణం చేపట్టాలి. భారతదేశంలో సాంఘిక అసమానతలు తగ్గాలంటే కుల గణనతో పాటు కుల సంపద గణన కూడా జరగాల్సి ఉంది. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ కులగణనకు పూనుకోవడం అందుకు 500 కోట్లు కేటాయించడం ఒక సామాజిక పరిణామానికి తప్పక దోహదం చేస్తుంది. అంబేడ్కర్, లోహియాలు ఇరువురూ ఈ కులగణన విషయంలో గట్టిగా పట్టుపట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరూ హిందువులే అనే వాదనలో బ్రాహ్మణవాదం ఉంది అని వీరు పసిగట్టారు. అది ఒక సందర్భంలో ఎస్సీలను హరిజనులు లేదా దేవుని బిడ్డలు అని చెప్పిన ప్పుడు అంబేడ్కర్ అంటరానివారు దేవుని బిడ్డలు అయితే మరి మిగిలిన వారందరూ దెయ్యం బిడ్డలా అని ప్రశ్నించాడు. ఈ సందర్భంలో మాట్లాడుతూ ఇప్పటికైనా భారతదేశాన్ని మనం మార్చు కోవాలి. సామాజిక న్యాయాన్ని పాలనలో తీసుకురావాలంటే తప్ప కుండా కులగణన జరగాలి. అందరికీ భూమి హక్కు వచ్చినప్పుడే సమానత చేకూరుతుంది. వ్యవసాయం ప్రభుత్వ పరిశ్రమగా ఉండాలి. ప్రభుత్వాధీనంలోకి దేశంలోని భూమిని తీసుకురావాలి. అప్పుడే భూస్వామి, భూమిలేని పేద వ్యవసాయ కూలీ, కౌలుదారు అనే భేదాలు తొలగి పోతాయ న్నాడు అంబేడ్కర్. హిందూ మత భావన జాతి వ్యతిరేకమైనదని ఆయన ప్రకటించాడు. సాంఘిక, ఆర్థిక ప్రజాస్వామ్యం లేకుండా రాజ కీయ ప్రజాస్వామ్యానికి మనుగడ లేదు అని ప్రకటించాడు. దేన్నైనా అమ్ముకోండి గానీ ఆత్మాభిమానాన్ని మాత్రం అమ్ముకోవద్దని శూద్రు లకు, అతిశూద్రులకు చాటి చెప్పాడు. నిజానికి బిహార్ బౌద్ధ భూమి. అక్కడ బీసీలుగా చెప్పబడుతున్న అనేక కులాల వారు కొన్ని శతాబ్దాలు బౌద్ధులే. భారతదేశంలో ఉన్న శిల్పాలన్నీ దళితులు, బౌద్ధులు చెక్కారు. నిజానికి భారతదేశంలో దళితులు, బహుజనులు కొన్ని శతాబ్దాలు బౌద్ధంలోనే ఉన్నారు. పైగా వారు బౌద్ధ కవులుగా, బౌద్ధ తాత్వికులుగా, బౌద్ధ శిల్పులుగా, బౌద్ధ భిక్షువులుగా జీవించారు. బీసీలు హిందువులుగా మారింది క్రీ.శ. 6వ శతాబ్దం తరువాతే. క్రీ.శ. 6వ శతాబ్దం ప్రాంతంలో భాగవతాన్ని సృష్టించారు. అందులో కృష్ణుని పాత్ర సృష్టించారు. కృష్ణుడు యాదవు డని బహు భార్యాత్వాన్ని ఆయనకి ఆపాదించారు. భగవద్గీతను కూడా ఆయన చేత చెప్పించారు. అప్పటి నుండే యాదవులు హిందువులుగా మారడం ప్రారంభించారు. భగవద్గీత బుద్ధుని పరిణామ వాదానికీ, ప్రకృతివాదానికీ భిన్నంగా చెప్పబడింది. బుద్ధుడు ఏదీ నిత్యం కాదనీ, మిశ్రతమైనదేదీ శాశ్వతం కాదని చెప్పాడు. ఆ అంశాన్ని వివరిస్తూ అంబేడ్కర్ దీనికి అసంగుని వివరణ ఇలా ఇచ్చారు. ‘‘ఒక దాని ఆధారంగా మరొకటి ఏర్పడిన మిశ్రమంలో ఏ ఒక్కటీ స్వయం శక్తి కలిగి ఉండజాలదు. మిశ్రమం విడిపోయినప్పుడు అందలి ధాతువులు సహితం నాశనమైపోవడం అనివార్యం అవుతుంది.’’ మన్ను, నీరు, నిప్పు, వాయువుల మిశ్రమమే జీవి. ఈ నాలుగు ధాతువులు విడిపోయినప్పుడు జీవి విగతమౌతుందనీ, దానినే మిశ్రమ పదార్థ అనిత్యతత్వం అంటారనీ, ‘ఒక వ్యక్తి శాశ్వత మెలా అవుతాడన్నది’’ ఈ శాస్త్రం వివరిస్తుందని అంబేడ్కర్ శాస్త్రీ యంగా క్రోడీకరించాడు. నిజానికి యాదవులు వ్యవసాయ కులం గొర్రెల కాపరులుగా ఉన్నారు. భగవద్గీత వచ్చాక వారిలో భూస్వామ్య ఆధిపత్యం వచ్చింది. బౌద్ధ భావం తగ్గింది. నిజానికి కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి వారంతా శాతవాహనులుగా, రజకులుగా, నాయీ బ్రాహ్మణులుగా తమనుతాము ఆర్యీకరించుకోవడం, బ్రాహ్మణీకరించుకోవడం; భాగ వత, రామాయణ, భారతాల కథలు బుర్రలకు ఎక్కించుకొన్నాకే జరిగింది. అలా బీసీ కులాల వారు హిందువులుగా మారారు. జ్యోతి రావు ఫూలే బీసీలు హిందువులు కాదని చెప్పడం గమనార్హం. భూమిపై ఆధిపత్యం ఉన్నవారు ఆధిపత్య కులాలుగా అవతరించారు. వారే అధికారాన్ని చేపట్టగలుగుతున్నారు. బ్రాహణ, క్షత్రియ, వైశ్య కులాలవారితో పాటూ కొందరు శూద్రకులాలలో ఆధిపత్య కులాల స్థాయికి చేరినవారూ (తెలుగు రాష్ట్రాల్లో కమ్మ, రెడ్డి; బిహార్లో యాదవ) అధికార పీఠం ఎక్కగలుగుతున్నారు. వీరిదగ్గరే సంపద పోగుపడిపోతున్నది. కూలినాలీ చేసుకొనే వారికి 40 కోట్ల మందికి ఇళ్లే లేవు. ఆధిపత్య కులాలవారి సంపద తేలితేనే సమ సమాజ రూప కల్పనకు ప్రణాళిక రూపొందించుకునే వీలుంది. అయితే భూమి పంచడానికీ, ఇతర సంపద పంచడానికీ ఆధిపత్య కులాలు సిద్ధంగా లేవు. కాగా నామమాత్రపు రిజర్వేషన్లకు ఈర్ష్య పడుతున్నారు. బిహార్ జనాభా పన్నెండు కోట్ల 70 లక్షల మంది. 16 శాతం ఎస్సీలు, 48 శాతం ఓబీసీలు, 17 శాతం ముస్లింలు, 1.28 శాతం ఎస్టీలు జీవిస్తున్నారు. తాజా జనగణన తర్వాత కులాల శాతాలు కూడా బయటకు వస్తాయి. భారతదేశంలో 1871లోనే బ్రిటిష్ ప్రభుత్వం ఎందుకు కులగణన చేపట్టింది? బ్రిటిష్వాళ్లకు భారతీయ కులవ్యవస్థపై ఒక అవగాహన వస్తే కానీ వారు ఇక్కడ మనలేరు. బహుశా అందుకే కులగణన చేసి ఉంటారు. ఈ కుల గణన వల్ల శూద్రులకు, అతి శూద్రులకు సామాజిక çస్పృహ వస్తుందని మహాత్మా ఫూలే నడిపిన సత్యశోధక్ సమాజ్ పేర్కొంది. అంబేడ్కర్ ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్, బీజేపీ ఆంత ర్యాన్ని కనిపెట్టాడు. రాముడు వర్ణాశ్రమ ధర్మాన్ని రక్షించడం కోసం శంబూకుణ్ణి చంపాడు కాబట్టి అన్ని విశ్వవిద్యాలయాల్లో శూద్ర, అతి శూద్ర, మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయి. తామే చదువు కోవాలి, ఇంకొకరు చదువుకోకూడదు. తమకే భూములుండాలి, మరొ కరికి ఉండకూడదు; తమకే రాజ్యాధిపత్యం ఉండాలి, వేరే వారికి ఉండకూడదు అనే మనువాద భావాలను బాగా నమ్ముతున్నారు కనుక ఇటువంటి దాడులకు వారు తెగబడుతున్నారు ఆధిపత్య కులాల వారు. ఈ భావాలు ఏ కులం వారికి ఉన్నా అవి రాజ్యాంగ విరుద్ధమై నవే. రాజ్యాంగానికి వ్యతిరేకంగా జీవిస్తున్న అగ్రవర్ణ ఆధిపత్య బ్రాహ్మణవాదులు నిషేధిత సంస్థల నుండి ఆవిర్భవించినవారేవీరంతా. వారెప్పుడూ రాజ్యాంగానికి బాధ్యులుగా లేరు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించే మార్గంలో వారు నడుస్తున్నారు. మాట్లాడే స్వేచ్ఛను రాజ్యాంగం ఇచ్చిందని వారికి తెలియదు. ఈ మనువాదానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండే బౌద్ధాన్ని అంబేడ్కర్, లోహియా, మహాత్మాఫూలే, పెరియార్ రామస్వామి నాయకర్ అనుసరించారు. ఇప్పుడు మనం బౌద్ధ భారతాన్ని నిర్మించుకోవాలి. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలు ఉత్పత్తి శక్తులు. వారిని పేదరికంలోఉంచి, వారిని దుఃఖంలో ఉంచి ఎవరైనా రాజ్యాంగేతరులుగా పరిపాలించాలని అనుకుంటే అది వట్టి భ్రమే. రాజ్యాంగంలోని 15వ ఆర్టికల్ ఈ విధంగా చెబుతుంది. కుల, మత, లింగ, పుట్టిన ప్రదేశం కారణాలుగా వివక్షకు తావులేదు.1) కేవలం మతం, జాతి, కులం, లింగం, పుట్టిన ప్రదేశం లేక వాటిలో కొన్నింటి ప్రాతిపదికపై ఏ వ్యక్తినీ ప్రభుత్వం వివక్షకు గురి చేయరాదు. 2) కేవలం, మతం, జాతి, కులం, లింగం పుట్టిన ప్రదేశం లేక వాటిలో కొన్నింటి ప్రాతిపదికపై పౌరులెవరికీ హక్కులను నిరాకరించటం, నియంత్రించటం, అర్హత లేకుండా చేయడం గాని చేయరాదు. భారతదేశ పునర్నిర్మాణానికి భారత రాజ్యాంగమే గీటురాయి. మతతత్వవాదులు తప్పక ఓడిపోతారు. ఒక మతం భారతదేశాన్ని ఎప్పటికీ పరిపాలించలేదు. ఒక కులం భారతదేశాన్ని ఎప్పటికీ పరిపా లించలేదు. భారతదేశం అంతర్గతంగా తీవ్రమైన సామాజిక, సాంస్కృతిక, సాంకేతిక విద్యాపరమైన మార్పుకు గురవుతూ వస్తుంది. దళిత బహుజన మైనార్టీలు లౌకికవాదులు ఏకమై సమ సమాజ నిర్మాణానికి పోరాడాల్సిన యుగమిది. కులగణనే కాదు కులసంపద గణన కూడా జరగాల్సిందే. భారతదేశంలో ప్రజలందరూ సమానంగా బతికే రోజు కోసం పోరాడాల్సిందే. అదే అంబేడ్కర్, ఫూలే మార్గం. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళిత ఉద్యమ నేత -
జనాభా తగ్గినా డేంజరే..
(ఎం. విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి): జనాభా పెరగడమే అన్ని సమస్యలకు మూలమని ఇప్పటివరకు అందరిదీ అదే భావన. ఇప్పుడు ప్రపంచానికి సవాళ్లు విసురుతున్న అంశాల్లో జనాభా తగ్గుదల కూడా చేరింది. ఈ సమస్య అభివృద్ధి చెందిన దేశాల్లోనే ముందుగా వచ్చింది. ఆర్థికంగా, సాంకేతికంగా బలమైన వ్యవస్థలున్న జపాన్లాంటి దేశమే ఇప్పుడీ సమస్య ఎదుర్కొంటోంది. ఆసియా ఖండంలో ప్రస్తుతం జపాన్ ఒక్కటే ఈ సమస్యను ఎదుర్కొంటుండగా.. ఐరోపా ఖండంలో చాలా దేశాలను పీడిస్తోంది. జనాభా తగ్గుదల నమోదు కావడమంటే.. దేశ జనాభా సరాసరి వయసు పెరగడం. తద్వారా పనిచేసేవాళ్ల సంఖ్య తగ్గిపోతోంది. ఫలితంగా ఆర్థికాభివృద్ధి కుంటుపడటం, ప్రజారోగ్యం మీద ఖర్చు పెరగడంతో పన్నుల భారం పెరుగుతుండటం ఆయా సమాజాల్లో ఇప్పుడు కనిపిస్తోంది. అదే మన దేశంలో ప్రస్తుత సరాసరి వయసు 28.4ఏళ్లు. ఇది ఇప్పుడు మనకు కలిసొచ్చే అంశం. పుడుతున్న ప్రతి వెయ్యి మందిలో మనోళ్లు 171 మంది ప్రపంచంలో ప్రతి నాలుగు నిమిషాలకు దాదాపు వెయ్యి మంది పుడుతున్నారు. వీరిలో అత్యధికంగా 171 మంది మన దేశంలోనే ఊపిరిపోసుకుంటున్నారు. ఆ తర్వాత 102 మందితో చైనా రెండో స్థానంలో.. 56 మందితో మూడో స్థానంలో నైజీరియా ఉన్నాయి. అలాగే, పాకిస్తాన్ 47 మందితో నాల్గో స్థానంలో.. 31 మందితో కాంగో ఐదో స్థానంలో నిలిచింది. ఇలా టాప్–5లో ఆసియా, ఆఫ్రికా దేశాలే ఉన్నాయి. ► ఇక 140 కోట్ల జనాభా ఉన్న భారత్ ఈ జాబితాలో తొలిస్థానంలో ఉండటం పెద్ద ఆశ్చర్యం కాదు. ఎందుకంటే.. ప్రపంచ సరాసరి బర్త్రేట్ కంటే కొద్దిగానే ఎక్కువ. మన దేశంలో బర్త్రేట్ 17.7 ఉంటే, ప్రపంచ బర్త్రేట్ 16.8 ఉంది. ► అదే చైనా ప్రపంచ జనాభాలో నంబర్వన్. కానీ, జననాల సంఖ్య మన కంటే తక్కువగా ఉంది. అక్కడ ఇప్పటికే జనాభా పెరుగుదల మందగించింది. ఇదే తీరు కొనసాగితే.. జనాభా పెరుగుదల ఆగిపోవడం ఎంతోదూరంలో లేదని నిపుణుల అంచనా. ► ఇక నైజీరియా కథ వేరు. ఇక్కడ బర్త్రేట్ (34.2) ప్రపంచ బర్త్రేట్కు రెట్టింపుగా ఉంది. పేదరికం ఎక్కువగా ఉండటం, మహిళలు విద్యకు దూరంగా ఉండటమే ఇందుకు కారణం. సంపద పెరిగితే జనాభా పెరుగుదల డౌన్ సంపద పెరిగిన దేశాల్లో బర్త్రేట్ తగ్గుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచ జనాభా పెరుగుదల వేగం మందగించడం 1960లో మొదలైంది. ఇదే తీరు కొనసాగితే.. 2100 సంవత్సరానికి జనాభా పెరుగుదల ఆగిపోతుందని, ఆ తర్వాత ప్రపంచ జనాభా తగ్గుదల ప్రారంభమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జనాభా తగ్గుదల మొదలైతే ప్రపంచ జనాభా సరాసరి వయసు పెరగడం మొదలవుతుంది. ఇది జరిగితే సమాజానికి వృద్ధఛాయలు వస్తాయి. చాలా దేశాలు ఇప్పుడీ సమస్యను ఎదుర్కొంటున్నాయి. 2050 నాటికి ప్రపంచంలో 20 దేశాల జనాభా ప్రమాదకరస్థాయిలో తగ్గుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా. కానీ, జనాభా తగ్గుదల అంశం మన దేశంలో కనుచూపుమేరలో లేదు. ► యూరోపియన్ యూనియన్ సభ్యదేశాలతో పోలిస్తే పేద దేశంగా పరిగణించే బల్గేరియాలో జనాభా తగ్గుదల ప్రమాదకర స్థాయిలో ఉంది. ఇక్కడ గత మూడు దశాబ్దాల్లో జనాభా 20 శాతం తగ్గిపోయింది. మరో 30 ఏళ్లలో 22.5 శాతం తగ్గుతుందని ఐరాస అంచనా. ► ఇక ఉక్రెయిన్లోనూ బర్త్రేట్ బాగా తగ్గుతోంది. దేశం నుంచి వలసలూ పెరుగుతున్నాయి. ఫలితంగా వచ్చే 30 ఏళ్లలో దాదాపు 20 శాతం జనాభా తగ్గొచ్చు. రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధ ప్రభావాన్ని కలిపితే జనాభా మరింత వేగంగా తగ్గొచ్చు. మరోవైపు.. జనాభా తగ్గుతున్న దేశాలన్నీ ఐరోపా ఖండంలో ఉన్నవే. ఆసియాలో ఈ సమస్యలేదు. కానీ, జపాన్ కథ భిన్నంగా ఉంది. 2008లో 12.68 కోట్లు ఉన్న జనాభా ప్రస్తుతం 12 కోట్లకు తగ్గిపోయింది. 2050 నాటికి 10.58 కోట్లకు తగ్గుతుందని అంచనా. జనాభా తగ్గుదల అంటే.. దేశంలో చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటమే. పుట్టుకలు తగ్గుతున్నకొద్దీ.. జనాభా సరాసరి వయసు పెరుగుతుంది. అంటే పనిచేయగలిగే వయస్సున్న జనాభా తగ్గుతారు. 1950లో జపాన్ జనాభా సరాసరి వయసు 22ఏళ్లు. అదే 2020లో 48కు, ఇప్పుడు 49 ఏళ్లకు పెరిగింది. ఈ విషయంలో జపాన్ది తొలిస్థానం. ఫెర్టిలిటీ రేట్ (ఒక మహిళ జన్మనిస్తున్న పిల్లల సంఖ్య) ప్రస్తుతం 1.4 ఉంది. ఇది ప్రపంచ సరాసరిలో సగానికంటే తక్కువ. మన దేశానికి ప్రయోజనాలెన్నో.. మన దేశం విషయానికొస్తే.. ఇక్కడ జనాభా పెరుగుతోంది. 140.2 కోట్ల మందితో రెండో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో భారత్ వాటా 17.7 శాతం. దేశంలో ఏటా ఒక శాతం చొప్పున పెరుగుతోంది. త్వరలోనే చైనాను అధిగమిస్తామని నిపుణుల అంచనా. జనాభా పెరుగుదలతో పాటే మన జనాభా సరాసరి వయసూ పెరుగుతోంది. అధికారిక గణాంకాల ప్రకారం.. ► 1970లో దేశ జనాభా సరాసరి వయసు 19.3 ఏళ్లుగా నమోదైంది. ► 2015లో 26.8 ఏళ్లకు.. 2022లో 28.4, 2025లో 30 ఏళ్లు, 2030లో 31.7, 2050లో 38.1 ఏళ్లకు పెరుగుతుందని నిపుణుల అంచనా. ► గట్టిగా పనిచేయగలిగే వయస్సున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటంవల్ల ఆర్థికాభివృద్ధి వేగంగా పెరుగుతోంది. ► వీరికి పని కల్పించడం ప్రభుత్వాల ముందున్న పెద్ద సవాలు. ► ఈ నేపథ్యంలో.. జనాభా తగ్గుదల సమస్య మనకు ఇప్పట్లో లేకపోయినా, శతాబ్దం తర్వాత మనదీ ఐరోపా దేశాల పరిస్థితే అని అంచనా. -
తగ్గనున్న భారత్ జనాభా.. నివేదికలో షాకింగ్ విషయాలు
న్యూఢిల్లీ: భవిష్యత్లో భారత జనాభా భారీగా తగ్గుతుందని ఓ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం దాదాపు 141కోట్లుగా ఉన్న మన దేశ జనాభా.. 2100 నాటికి 100 కోట్లకు పడిపోతుందని తెలిపింది. జనాభా పెరుగుదల ఎంత ప్రతికూలమో.. క్రమంగా తగ్గినా అంతే ప్రమాదమని పేర్కొంది. జ్ఞానం, జీవన ప్రమాణాలు పడిపోయి క్రమంగా జనాభా అంతరించిపోయే ప్రమాదం ఏర్పడుతుందని స్టాండ్ఫోర్డ్ అధ్యయనం పేర్కొంది. రానున్న రోజుల్లో భారత జనసాంద్రత ఆందోళనకర స్థాయిలో పడిపోతుందని చెప్పింది. జనాభా విషయంలో భారత్, చైనా దాదాపు ఒకేలా కన్పిస్తున్నప్పటికీ.. జనసాంద్రతకు వచ్చేసరికి చాలా వ్యత్యాసం ఉంది. భారత్లో ప్రతి చదరపు కిలోమీటర్కు 476మంది నివసిస్తారు. చైనాలో మాత్రం ఆ సంఖ్య 148 మంది మాత్రమే. 2100 నాటికి భారత్లో జనసాంద్రత 335కి పడిపోతుందని, ఇది ప్రపంచం మొత్తంతో పోల్చితే చాలా ఎక్కువ అని అధ్యయనం అంచనా వేసింది. భారత్తో పాటు చైనా, అమెరికాలో వచ్చే 78 ఏళ్లలో జనాభా తగ్గిపోనుంది. ముఖ్యంగా చైనా జనాభా 2100 నాటికి 49 కోట్లకు పడిపోనుంది. సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గుతుండటమే ఇందుకు కారణం. 2050 నాటికే మొత్తం సంతానోత్పత్తి 0.5 శాతానికే పరిమితం అవుతుందని అంచనా. భారత్లో సంతానోత్పత్తి రేటు 2032నాటికి 1.76శాతం నుంచి 1.39శాతానికి తగ్గనుంది. 2052నాటికి 1.28శాతానికి, 2082 నాటికి 1.2శాతానికి, 2100 నాటికి 1.19శాతానికి పడిపోతుందనే అంచనాలున్నాయి. చదవండి: మొక్కజొన్న కంకులు బేరమాడిన మంత్రి.. షాకిచ్చిన యువకుడు -
తగ్గుతున్న యువ భారతం!
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా యువత జనాభా తగ్గుతున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చూస్తే యువత భారత్లోనే అధికంగా ఉన్నట్లు కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు శాఖ ‘యూత్ ఇన్ ఇండియా–22’ నివేదికలో వెల్లడించింది. 2036 నాటికి యువ జనాభాపై నివేదిక రూపొందించింది. క్షీణిస్తున్న సంతానోత్పత్తి, ఆయుర్థాయం పెరుగుదల కారణంగా ఒకపక్క యువ జనాభా తగ్గుతుండగా మరో సమయంలో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. 15 – 29 ఏళ్ల లోపు వారిని యువత కింద పరిగణించి నివేదిక రూపొందించారు. ► 2021 నాటికి ఏపీలో 1.32 కోట్ల మంది యువత ఉండగా 2036 నాటికి 1.05 కోట్లకు తగ్గనున్నట్లు నివేదిక అంచనా వేసింది. అంటే యువత శాతం 25.1 నుంచి 19.6 శాతానికి తగ్గనుంది. ఇదే సమయంలో 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు 12.3 శాతం నుంచి 19 శాతానికి పెరగనున్నారు. ► దేశంలో ప్రస్తుత జనాభాలో యువత 27.3 శాతం ఉండగా 2036 నాటికి 22.7 శాతానికి తగ్గనుంది. ఇదే సమయంలో వృద్ధులు 10.1 శాతం నుంచి 15 శాతానికి పెరగనున్నారు. ► దేశంలో ప్రస్తుతం 14 సంవత్సరాల్లోపు జనాభా 25.7 శాతం ఉండగా 2036 నాటికి 20.2 శాతానికి తగ్గనుంది. ఇదే వయసు వారు రాష్ట్రంలో 20.5 శాతం నుంచి 15.7 శాతానికి తగ్గనున్నారు. ► దేశంలో 30 – 59 ఏళ్ల లోపు జనాభా 37 శాతం ఉండగా 2036 నాటికి 42.2 శాతానికి పెరగనుంది. ఇదే వయసు వారి జనాభా రాష్ట్రంలో 42 శాతం నుంచి 45.8 శాతానికి పెరగనున్నట్లు అంచనా. -
'ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. ప్రోత్సాహకాలు అందుకోండి'
బీజింగ్: జన సంఖ్య పరంగా ప్రపంచంలోనే తొలిస్థానంలో ఉన్న చైనా.. ప్రస్తుతం జనాభా సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది. కొన్నేళ్లుగా చేపట్టిన కట్టడి చర్యలు, ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన ఆంక్షలు, ఆర్థిక పరిస్థితుల కారణంగా చాలా మంది యువత పెళ్లి, సంతానానికి దూరంగా ఉండిపోవటమే అందుకు కారణంగా చెప్పవచ్చు. ఈ అంశం దేశ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపనుందని ఆందోళన చెందుతోంది డ్రాగన్ దేశం. జనాభా వృద్ధి, శ్రామిక శక్తిని పెంచేందుకు ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ.. భారీ ప్రోత్సాహకాలు ఇస్తోంది. అందులో పన్నుల రాయితీ, ఇంటి రుణాలు, విద్యా ప్రయోజనాలతో పాటు నగదు రూపంలోనూ ప్రోత్సాహకాలు ఉన్నాయి. చైనాలోని జనాభాపై 2022, జనవరిలో గ్లోబల్ టైమ్స్ విడుదల చేసిన ఓ నివేదిక విస్తుపోయే విషయాలను వెల్లడించింది. 2021 చివరి నాటికి చైనాలో 1.413 బిలియన్ల జనాభా ఉండగా.. జననాల సంఖ్య 10.62 మిలియన్లకు పడిపోయింది. అది మరణాల సంఖ్యకు సమానంగా ఉండటం గమనార్హం. ఈశాన్య నగరమైన వూహూలో జననాల రేటు అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయినట్లు పేర్కొంది. ఇలాగే జననాల రేటు పడిపోతే.. యువకుల సంఖ్య తగ్గిపోయి కొన్నేళ్లలోనే శ్రామిక శక్తి సైతం వేగంగా పడిపోనుంది. జనాభా సంక్షోభానికి కారణమిదే.. పెరుగుతున్న జనాభాను కట్టడి చేసేందుకంటూ.. గతంలో ఒకే బిడ్డ పాలసీని అమలులోకి తీసుకొచ్చింది చైనా కమ్యూనిస్ట్ పార్టీ. దశాబ్దాలుగా బలవంతంగా అబార్షన్లు చేయించి మహిళల హక్కులను కాలరాసింది. దాంతో పిల్లల్ని కనేందుకు చాలా మంది వెనకడుగు వేయాల్సి వచ్చింది. కొన్నేళ్లలోనే అది జనాభా సంక్షోభానికి దారి తీసింది. ఈ సమస్యను గుర్తించిన చైనా.. ప్రస్తుతం ఇద్దరు, లేదా ముగ్గురు పిల్లల్ని కనేందుకు అనుమతిస్తోంది. అంతే కాదు మహిళలకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటిస్తోంది. ఎక్కువ మంది పిల్లల్ని కనేందుకు మహిళలకు.. పన్ను రాయితీలు, ఇంటి రుణాలు, విద్యా ప్రయోజనాలు, నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. అయితే, ఈ ప్రోత్సాహకాలు వివాహం జరిగిన దంపతులకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. ఒకే బిడ్డ ఉన్న తల్లిదండ్రులు ప్రస్తుతం సామాజిక ప్రయోజనాలైన ఆరోగ్య బీమా, విద్య వంటివి పొందలేకపోతున్నారని తెలిపింది. మరోవైపు.. ఇప్పటికీ మైనారిటీలు, ఒంటరి మహిళలపై చైనా వివక్ష చూపుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నాయి. కొత్త పాలసీపైనా వ్యతిరేకత.. ఆ దేశంలో మహిళలు విద్య, ఆర్థిక పరంగా అభివృద్ధి సాధిస్తున్నా.. వివాహం విషయంలో పురుషులతో పోలిస్తే వెనకబడే ఉన్నారు. గత ఏడాది కొత్త జనాభా, కుటుంబ నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చింది బీజింగ్. దంపతులు ముగ్గురు పిల్లలను కలిగి ఉండేందుకు అనుమతించింది. అయితే.. ఆర్థిక భారం వల్ల ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండటం పట్ల అక్కడి ప్రజలు విముఖత ప్రదర్శిస్తున్నారు. -
ఫెర్టిలిటీ తగ్గింది.. ఊబకాయం పెరిగింది
న్యూఢిల్లీ: భారత మహిళల్లో సంతానోత్పత్తి సామర్థ్యం గణనీయంగా తగ్గిందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఐదో విడత నివేదిక (ఎన్ఎఫ్హెచ్ఎస్–5) వెల్లడించింది. జనాభా నియంత్రణ పద్ధతులను పకడ్బందీగా అమలు చేస్తుండటంతో సంతానోత్పత్తి సామర్థ్యం 2.2 నుంచి 2 శాతానికి తగ్గినట్టు తెలిపింది. ఇది బిహార్ (2.98), మేఘాలయ (2.91), ఉత్తరప్రదేశ్ (2.35), జార్ఖండ్ (2.26), మణిపూర్ (2.17) రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. 2019–21 మధ్య దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు 707 జిల్లాల్లో 6.37 లక్షల ఇళ్లలో 7,24,115 మంది మహిళలు, 1,01,839 మంది పురుషులతో మాట్లాడి నివేదిక రూపొందించారు. పలు ప్రభుత్వ పథకాలకు ఉపయోగపడేందుకు వీలుగా పౌరుల సామాజిక, ఆర్థిక, ఇతర నేపథ్యాలను కూడా సర్వేలో పొందుపరిచారు... సాధికారత సంకేతాలు... మహిళలు సాధికారత దిశగా దూసుకుపోతున్నారని సర్వే వివరాలు చెప్పకనే చెబుతున్నాయి. ► బ్యాంకు ఖాతాలున్న మహిళల సంఖ్య గత నాలుగేళ్లలో 53 నుంచి 79 శాతానికి పెరిగింది. ► కాలుష్యరహిత, పరిశుభ్రమైన వంట ఇంధనం వాడేవారి సంఖ్య 44 శాతం నుంచి 59 శాతానికి పెరిగింది. ► పారిశుద్ధ్య సౌకర్యాలు 49 నుంచి 70 శాతానికి పెరిగాయి. ► కరోనా కాలంలో చేతులు పరిశుభ్రం చేసుకోవడం అలవాటుగా మారింది. ► నీళ్లు, సబ్బు సదుపాయాలున్న వారి సంఖ్య 60 నుంచి 78 శాతానికి పెరిగింది! ► 15–49 మధ్య వయసు వివాహితల్లో ఉద్యోగుల సంఖ్య 31 శాతం నుంచి 32కు పెరిగింది. పెరిగిన ఊబకాయం జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–4తో పోలిస్తే ఊబకాయం సమస్య దేశాన్ని బాగా వేధిస్తోంది. ఊబకాయుల సంఖ్య మహిళల్లో 21 శాతం నుంచి 24 శాతానికి, మగవారిలో 19 నుంచి 23 శాతానికి పెరిగింది. కేరళ, అండమాన్ నికోబర్ దీవులు, ఆంధ్రప్రదేశ్, గోవా, సిక్కిం, మణిపూర్, ఢిల్లీ, తమిళనాడు, చండీగఢ్, లక్షద్వీప్, పాండిచ్చేరిల్లో మూడో వంతుకు పైగా మహిళలు ఊబకాయంతో బాధపడుతున్నారు. పిల్లల్లో తగ్గిన కుంగుబాటు చిన్నారుల్లో కుంగుబాటు గత నాలుగేళ్లలో తగ్గింది. ఐదేళ్లలోపు పిల్లల్లో కుంగుబాటు 38 నుంచి 36 శాతానికి తగ్గినట్టు తేలింది. పట్టణాల (30 శాతం) కంటే గ్రామీణ బాలల్లో (37 శాతం) కుంగుబాటు ఎక్కువగా ఉంది. మహిళల్లో నాలుగో వంతు యుక్తవయసుకు ముందే పెళ్లాడారు దేశవ్యాప్తంగా 18–29 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో 25 శాతం మంది, 21–29 ఏళ్ల పురుషుల్లో 15 శాతం మంది యుక్త వయసుకు ముందే పెళ్లి చేసుకున్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తేల్చింది. భారత్లో అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21 ఏళ్లు పెళ్లికి యుక్తవయసన్నది తెలిసిందే. పశ్చిమబెంగాల్లో అత్యధికంగా 42 శాతం మంది మహిళలకు యుక్తవయసుకు ముందే పెళ్లయింది. బిహార్ (40 శాతం), త్రిపుర (39), జార్ఖండ్ (35), ఏపీ (33), తెలంగాణ (27) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. యుక్తవయసుకు ముందే తాళి కడుతున్న వాళ్ల అబ్బాయిల సంఖ్య బిహార్లో అత్యధికంగా 25 శాతంగా తేలింది. తర్వాతి స్థానాల్లో గుజరాత్, రాజస్థాన్ (24 శాతం), జార్ఖండ్ (22), అరుణాచల్ప్రదేశ్ (21) ఉన్నాయి. మొత్తమ్మీద బాల్య వివాహాలు తగ్గుముఖం పడుతున్నాయని సర్వే పేర్కొంది. 12 ఏళ్లపాటు, అంతకుమించి చదువుకునే అమ్మాయిలు మిగతా వారికంటే ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారని తెలిపింది. టీనేజీ తల్లుల సంఖ్య ముస్లింల్లో ఎక్కవగా (8 శాతం) ఉంది. గర్భ నిరోధక పద్ధతుల వాడకం పెరిగింది ► గర్భనిరోధక పద్ధతుల వాడకం 54 శాతం నుంచి 67 శాతానికి పెరిగింది. ► కుటుంబ నియంత్రణ పాటించని వారి సంఖ్య 13 శాతం నుంచి 9 శాతానికి తగ్గింది. ► ఆస్పత్రి ప్రసవాల సంఖ్య కూడా 79 శాతం నుంచి 89 శాతానికి పెరిగింది. ► గ్రామీణ ప్రాంతాల్లో కూడా 87 శాతం గర్భిణులు ఆస్పత్రుల్లోనే పురుడు పోసుకుంటున్నారు. ఇది పట్టణ ప్రాంతాల్లో 94 శాతం. ► గర్భనిరోధం మహిళల బాధ్యతేనని 35.1 శాతం మంది పురుషులు భావిస్తున్నారు. వీరి సంఖ్య చండీగఢ్లో అత్యధికంగా (69) ఉంది. ► మహిళల్లో గర్భ నిరోధక పద్ధతుల వాడకం వివాహేతర సంబంధాలకు దారి తీయొచ్చని 19.6 శాతం మగవాళ్లు అనుమానిస్తున్నారు! ఇలా భావిస్తున్న వారి సంఖ్య కేరళలో అత్యధికంగా (44.1) ఉంది!! ► అబార్షన్ చేయించుకుంటున్న వారిలో దాదాపు సగం మంది అవాంఛిత గర్భాన్నే కారణంగా చెప్తున్నారు. ► వీరిలో 16 శాతం అబార్షన్ వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కుటుంబ నియంత్రణ పాటించాలన్న ఆసక్తి ఉన్నా అవగాహన లేక, వాటి వాడకం తెలియక దంపతులు ఎక్కువ మందిని కనేవారు. ఆ పరిస్థితుల్లో మార్పు రావడం మంచి పరిణామం – కేంద్రం -
AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?
AP New Districts List With Mandals, సాక్షి, అమరావతి : జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత విస్తీర్ణ పరంగా ప్రకాశం (14,322 చదరపు కిలోమీటర్లు), జనాభా పరంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా(24.697 లక్షలు) పెద్ద జిల్లాలుగా ఆవిర్భవించాయి. 8 నియోజకవర్గాలు, 38 మండలాల చొప్పున ఈ రెండు జిల్లాలు పెద్దవిగా ఏర్పడ్డాయి. తక్కువ విస్తీర్ణం (3,659 చదరపు కిలోమీటర్లు), తక్కువ జనాభా (9.253 లక్షలు)తో పార్వతీపురం మన్యం జిల్లా అత్యంత చిన్న జిల్లాగా ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కేవలం మూడు నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. ప్రతి జిల్లాలో 3 నుంచి 8 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకే ఒక అర్బన్ జిల్లాగా ఏర్పడిన విశాఖ జిల్లాలో కేవలం 11 మండలాలు మాత్రమే ఉండగా, జనాభా మాత్రం 19.595 లక్షలు ఉంది. ప్రతి జిల్లాలో 9.253 లక్షల నుంచి 24.5 లక్షల వరకు జనాభా ఉంది. భౌగోళికంగా, పాలనాపరంగా సౌలభ్యంగా ఉండేలా పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా ఏదో ఒక జిల్లాలో ఉండేలా చూసింది. స్థానికంగా వచ్చిన విజ్ఞప్తులను బట్టి కొన్ని మండలాలను సమీప జిల్లాల్లో చేర్చింది. దీనివల్ల ఆయా నియోజకవర్గాల ప్రజలకు పరిపాలనాపరంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా జాగ్రత్తలు తీసుకుంది. పునర్వ్యవస్థీకరణ తర్వాత జిల్లాల స్వరూపం, జనాభా (2011 లెక్కల ప్రకారం) ఇలా ఉంది. శ్రీకాకుళం జిల్లా జిల్లా కేంద్రం: శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గాలు: 8 (ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట) రెవెన్యూ డివిజన్లు: పలాస (కొత్త), టెక్కలి, శ్రీకాకుళం. మండలాలు : 30, పలాస డివిజన్లోని మండలాలు: ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి, పలాస, మందస, వజ్రపుకొత్తూరు, నందిగం టెక్కలి డివిజన్లోని మండలాలు: టెక్కలి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, సారవకోట, మలియపుట్టి, పాతపట్నం, కొత్తూరు, హిరమండలం, లక్ష్మినరసుపేట, శ్రీకాకుళం డివిజన్లో మండలాలు: శ్రీకాకుళం, గార, ఆమదాలవలస, పొందూరు, సరుబుజ్జిలి, బుర్జ, నరసన్నపేట, పొలాకి, ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం, జలుమూరు, గంగువారిశిగడం విస్తీర్ణం: 4,591 చదరపు కిలోమీటర్లు జనాభా: 21.914 లక్షలు విజయనగరం జిల్లా.. జిల్లా కేంద్రం : విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట, గజపతినగరం) రెవెన్యూ డివిజన్లు : బొబ్బిలి (కొత్త), చీపురుపల్లి (కొత్త), విజయనగరం. మండలాలు : 27 బొబ్బిలి డివిజన్లో మండలాలు : బొబ్బిలి, రామభద్రాపురం, బాదంగి, తెర్లాం, గజపతినగరం, దత్తిరాజేరు, బొండపల్లి, మెంటాడ చీపురుపల్లి డివిజన్లో మండలాలు: చీపురుపల్లి, గరివిడి, గుర్ల, నెల్లిమర్ల, మెరకముడిదం, వంగర, రేగిడి ఆమదాలవలస, సంతకవిటి, రాజాం విజయనగరం డివిజన్లో మండలాలు : విజయనగరం, గంట్యాడ, పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం, శృంగవరపుకోట, జామి, వెపడ, లక్కవరపుకోట, కొత్తవలస విస్తీర్ణం : 4,122 చదరపు కిలోమీటర్లు జనాభా : 19.308 లక్షలు పార్వతీపురం మన్యం జిల్లా జిల్లా కేంద్రం : పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గాలు : 4 (పాలకొండ, పార్వతీపురం, సాలూరు, కురుపాం) రెవెన్యూ డివిజన్లు: పార్వతీపురం, పాలకొండ మండలాలు : 15 పార్వతీపురం డివిజన్లో మండలాలు : పార్వతీపురం, సీతానగరం, బలిజపేట, సాలూరు, పాచిపెంట, మక్కువ, కొమరాడ, గరుగుబిల్లి పాలకొండ డివిజన్లో మండలాలు : జియమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, పాలకొండ, సీతంపేట, భామిని, వీరఘట్టం విస్తీర్ణం : 3,659 చదరపు కిలోమీటర్లు జనాభా : 9.253 లక్షలు అల్లూరి సీతారామరాజు జిల్లా జిల్లా కేంద్రం : పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాలు : 3 (పాడేరు, అరకు, రంపచోడవరం) రెవెన్యూ డివిజన్లు : పాడేరు, రంపచోడవరం మండలాలు : 22 పాడేరు డివిజన్లో మండలాలు : అరకు వ్యాలీ, పెదబయలు, డుంబ్రిగూడ, ముంచంగిపుట్టు, హకుంపేట, అనంతగిరి, పాడేరు, జి మడుగుల, చింతపల్లి, గూడెం కొత్తవీధి, కొయ్యూరు రంపచోడవరం డివిజన్లో మండలాలు : రంపచోడవరం, దేవీపట్నం, వై రామవరం, అడ్డతీగల, గంగవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, యెటపాక, చింతూరు, కూనవరం, వర రామచంద్రపురం విస్తీర్ణం : 12,251 చదరపు కిలోమీటర్లు జనాభా : 9.54 లక్షలు విశాఖపట్నం జిల్లా జిల్లా కేంద్రం : విశాఖపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలు : 6 (భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ నార్త్, విశాఖ వెస్ట్, విశాఖ సౌత్, గాజువాక) రెవెన్యూ డివిజన్లు : భీమునిపట్నం (కొత్త), విశాఖపట్నం. మండలాలు : 11 భీమునిపట్నం డివిజన్లో మండలాలు : భీమునిపట్నం, ఆనందపురం, పద్మనాభం, విశాఖపట్నం రూరల్, సీతమ్మధార విశాఖపట్నం డివిజన్లో మండలాలు : గాజువాక, పెదగంట్యాడ, గోపాలపట్నం, ములగడ, మహారాణిపేట, పెందుర్తి విస్తీర్ణం : 1,048 చదరపు కిలోమీటర్లు జనాభా : 19.595 లక్షలు అనకాపల్లి జిల్లా జిల్లా కేంద్రం : అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (పాయకరావుపేట, నర్సీపట్నం, మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి, చోడవరం) రెవెన్యూ డివిజన్లు : అనకాపల్లి, నర్సీపట్నం మండలాలు : 24 అనకాపల్లి డివిజన్లో మండలాలు : దేవరపల్లి, కె కొత్తపాడు, అనకాపల్లి, కశింకోట, యలమంచిలి, రాంబిల్లి, మునగపాక, అచ్యుతాపురం, బుచ్చయ్యపేట, చోడవరం, పరవాడ, సబ్బవరం నర్సీపట్నం డివిజన్లో మండలాలు : నర్సీపట్నం, గోలుగొండ, మాకవారిపాలెం, నాతవరం, నక్కపల్లి, పాయకరావుపేట, కోటఅవురుట్ల, ఎస్ రాయవరం, రావికమతం, రోలుగుంట, మాడుగుల, చీడికాడ విస్తీర్ణం : 4,292 చదరపు కిలోమీటర్లు జనాభా : 17.270 లక్షలు కాకినాడ జిల్లా జిల్లా కేంద్రం : కాకినాడ అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పెద్దాపురం) రెవెన్యూ డివిజన్లు : పెద్దాపురం, కాకినాడ మండలాలు : 21 పెద్దాపురం డివిజన్లో మండలాలు : పెద్దాపురం, జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి, తుని, కోటనందూరు, ప్రత్తిపాడు, శంఖవరం, ఏలేశ్వరం, రౌతులపూడి, తొండంగి కాకినాడ డివిజన్లో మండలాలు : సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు, యు కొత్తపల్లి, కరప, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, పెదపూడి, కాజులూరు, తాళ్లరేవు విస్తీర్ణం : 3,019 చదరపు కిలోమీటర్లు జనాభా : 20.923 లక్షలు కోనసీమ జిల్లా జిల్లా కేంద్రం : అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (రామచంద్రాపురం, మండపేట, అమలాపురం, రాజోలు, గన్నవరం, కొత్తపేట, ముమ్మిడివరం) రెవెన్యూ డివిజన్లు : రామచంద్రాపురం, అమలాపురం మండలాలు : 22 రామచంద్రాపురం డివిజన్లో మండలాలు : రామచంద్రాపురం, కె గంగవరం, మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం, కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు అమలాపురం డివిజన్లో మండలాలు : ముమ్మిడివరం, ఐ పోలవరం, కాట్రేనికోన, అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు, పి గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి, విస్తీర్ణం : 2,083 చదరపు కిలోమీటర్లు జనాభా : 17.191 లక్షలు తూర్పుగోదావరి జిల్లా జిల్లా కేంద్రం : రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (అనపర్తి, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం) రెవెన్యూ డివిజన్లు : రాజమండ్రి, కొవ్వూరు మండలాలు : 19 రాజమండ్రి డివిజన్లో మండలాలు : రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్, కడియం, రాజానగరం, సీతానగరం, కోరుకొండ, గోకవరం, అనపర్తి, బిక్కవోలు, రంగంపేట కొవ్వూరు డివిజన్లో మండలాలు : కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి, నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి, దేవరపల్లి, గోపాలపురం, నల్లజర్ల విస్తీర్ణం : 2,561 చదరపు కిలోమీటర్లు జనాభా : 18.323 లక్షలు పశ్చిమగోదావరి జిల్లా జిల్లా కేంద్రం: భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం) రెవెన్యూ డివిజన్లు : నర్సాపురం, భీమవరం (కొత్త). మండలాలు : 19 నర్సాపురం డివిజన్లో మండలాలు : నర్సాపురం, మొగల్తూరు, పాలకొల్లు, పోడూరు, యలమంచిలి, ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర, తణుకు, ఇరగవరం భీమవరం డివిజన్లో మండలాలు : అత్తిలి, భీమవరం, వీరవాసరం, ఉండి, కాళ్ల, పాలకోడేరు, ఆకివీడు, తాడేపల్లిగూడెం, పెంటపాడు విస్తీర్ణం: 2,178 చదరపు కిలోమీటర్లు జనాభా: 17.80 లక్షలు ఏలూరు జిల్లా జిల్లా కేంద్రం: ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (ఉంగుటూరు, కైకలూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, నూజివీడు, చింతలపూడి) రెవెన్యూ డివిజన్లు : జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజివీడు. మండలాలు : 28 జంగారెడ్డిగూడెం డివిజన్లో మండలాలు: జంగారెడ్డిగూడెం, పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, కుక్కునూరు, వేలేరుపాడు, కామవరపుకోట, టి నర్సాపురం, ద్వారకాతిరుమల ఏలూరు డివిజన్లో మండలాలు: ఏలూరు, దెందులూరు, పెదవేగి, పెదపాడు, ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు, గణపవరం, కైకలూరు, మండవల్లి, కలిదిండి, ముదినేపల్లి, నూజివీడు డివిజన్లో మండలాలు: నూజివీడు, ఆగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు, చింతలపూడి, లింగపాలెం విస్తీర్ణం: 6,679 చదరపు కిలోమీటర్లు జనాభా: 20.717 లక్షలు కృష్ణా జిల్లా జిల్లా కేంద్రం : మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (గుడివాడ, పెనమలూరు, గన్నవరం, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు) రెవెన్యూ డివిజన్లు : గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు (కొత్త) మండలాలు : 25 గుడివాడ డివిజన్లో మండలాలు : గుడివాడ, గుడ్లవల్లేరు, నందివాడ, పెదపారుపూడి, పామర్రు, గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు ఉయ్యూరు డివిజన్లో మండలాలు: ఉయ్యూరు, పమిడిముక్కల, కంకిపాడు, పెనమలూరు, తోట్లవల్లూరు, మొవ్వ, ఘంటసాల, చల్లపల్లి మచిలీపట్నం డివిజన్లో మండలాలు : పెడన, గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను, మచిలీపట్నం, అవనిగడ్డ, మోపిదేవి, నాగాయలంక, కోడూరు విస్తీర్ణం : 3,775 చదరపు కిలోమీటర్లు జనాభా : 17.35 లక్షలు ప్రకాశం జిల్లా జిల్లా కేంద్రం: ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాలు: 8 (యర్రగొండపాలెం, గిద్దలూరు, సంతనూతలపాడు, ఒంగోలు, కొండెపి, దర్శి, కనిగిరి, మార్కాపురం) రెవెన్యూ డివిజన్లు: మార్కాపురం, కనిగిరి (కొత్త), ఒంగోలు. మండలాలు : 38 మార్కాపురం డివిజన్లో మండలాలు: మార్కాపురం, గిద్దలూరు, బెస్తవారిపేట, రాచర్ల, కొమరోలు, కంభం, అర్థవీడు, యర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు, తర్లుపాడు కనిగిరి డివిజన్లో మండలాలు: పొదిలి, హనుమంతునిపాడు, వెలిగండ్ల, కనిగిరి, పెదచెర్లోపల్లి, చంద్రశేఖరపురం, పామూరు, కొనకనమిట్ల, దర్శి, దొనకొండ, కురిచేడు, మర్రిపూడి, పొన్నలూరు ఒంగోలు డివిజన్లో మండలాలు: ముండ్లమూరు, కొండపి, జరుగుమిల్లి, తాళ్లూరు, శింగరాయకొండ, ఒంగోలు, కొత్తపట్నం, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, మద్దిపాడు, చీమకుర్తి, టంగుటూరు విస్తీర్ణం: 14,322 చ.కి.మీ. జనాభా : 22.88 లక్షలు బాపట్ల జిల్లా జిల్లా కేంద్రం: బాపట్ల. అసెంబ్లీ నియోజకవర్గాలు: 6 (వేమూరు, రేపల్లె, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల) రెవెన్యూ డివిజన్లు: బాపట్ల (కొత్త), చీరాల (కొత్త) మండలాలు: 25 బాపట్ల డివిజన్లో మండలాలు: వేమూరు, కొల్లూరు, చుండూరు, భట్టిప్రోలు, అమృతలూరు, రేపల్లె, నిజాంపట్నం, నగరం, చెరుకుపల్లి, బాపట్ల, పిట్టవానిపాలెం, కర్లపాలెం చీరాల డివిజన్లో మండలాలు: చీరాల, వేటపాలెం, అద్దంకి, జె పంగులూరు, సంతమాగులూరు, బల్లికురువ, కొరిశపాడు, పర్చూరు, యద్దనపూడి, కారంచేడు, ఇంకొల్లు, చినగంజాం, మార్టూరు విస్తీర్ణం : 3,829 చ.కిమీ. జనాభా: 15.87 లక్షలు పల్నాడు జిల్లా జిల్లా కేంద్రం: నర్సరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (పెదకూరపాడు, గురజాల, మాచర్ల, చిలకలూరిపేట, నర్సరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి) రెవెన్యూ డివిజన్లు : గురజాల, నర్సరావుపేట, సత్తెనపల్లి (కొత్త). మండలాలు : 28 గురజాల డివిజన్లో మండలాలు : గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల, మాచవరం, మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, రెంటచింతల, కారెంపూడి, బొల్లాపల్లి సత్తెనపల్లి డివిజన్లో మండలాలు : సత్తెనపల్లి, రాజుపాలెం, ముప్పాళ్ల, అచ్చంపేట, క్రోసూరు, అమరావతి, పెదకూరపాడు, బెల్లంకొండ, నకిరేకల్లు నర్సరావుపేట డివిజన్లో మండలాలు : చిలకలూరిపేట, నాదెండ్ల, ఎడ్లపాడు, నర్సరావుపేట, రొంపిచర్ల, వినుకొండ, నూజెండ్ల, శావల్యపురం, ఈపూరు విస్తీర్ణం : 7,298చ.కిమీ. జనాభా: 20.42 లక్షలు గుంటూరు జిల్లా జిల్లా కేంద్రం : గుంటూరు అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (తాడికొండ, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, మంగళగిరి, తెనాలి, పొన్నూరు, ప్రత్తిపాడు) రెవెన్యూ డివిజన్లు : గుంటూరు, తెనాలి మండలాలు : 18 గుంటూరు డివిజన్లో మండలాలు : తాడికొండ, తుళ్లూరు, ఫిరంగిపురం, మేడికొండూరు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, పెదనందిపాడు, పెదకాకాని తెనాలి డివిజన్లో మండలాలు: మంగళగిరి, తాడేపల్లి, తెనాలి, కొల్లిపర, పొన్నూరు, చేబ్రోలు, దుగ్గిరాల, కాకుమాను విస్తీర్ణం : 2,443 చ.కిమీ. జనాభా : 20.91 లక్షలు ఎన్టీఆర్ జిల్లా జిల్లా కేంద్రం : విజయవాడ. అసెంబ్లీ నియోజకవర్గాలు: 7 (విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం) రెవెన్యూ డివిజన్లు: విజయవాడ, తిరువూరు (కొత్త), నందిగామ (కొత్త). మండలాలు : 20 తిరువూరు డివిజన్లో మండలాలు : రెడ్డిగూడెం, తిరువూరు, విస్సన్నపేట, గంపలగూడెం, ఎ.కొండూరు, మైలవరం నందిగామ డివిజన్లో మండలాలు: నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు, వీరుళ్లపాడు, జగ్గయ్యపేట, వత్సవాయి విజయవాడ డివిజన్లో మండలాలు: ఇబ్రహీంపట్నం, విజయవాడ రూరల్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ నార్త్, విజయవాడ ఈస్ట్, జి.కొండూరు విస్తీర్ణం : 3,316 చ.కిమీ. జనాభా : 22.19 లక్షలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జిల్లా కేంద్రం: నెల్లూరు. అసెంబ్లీ నియోజకవర్గాలు: 8 (కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు) రెవెన్యూ డివిజన్లు: కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు. మండలాలు: 38 కందుకూరు డివిజన్లో మండలాలు: కందుకూరు, లింగసముద్రం, గుడ్లూరు, ఉలవపాడు, ఓలేటివారిపాలెం, కొండాపురం, వరికుంటపాడు కావలి డివిజన్లో మండలాలు: కావలి, బోగోలు, అల్లూరు, దగదర్తి, జలదంకి, కలిగిరి, దత్తులూరు, విడవలూరు, కొడవలూరు, వింజమూరు ఆత్మకూరు డివిజన్లో మండలాలు: ఆత్మకూరు, పేజర్ల, అనుమసముద్రంపేట, మర్రిపాడు, సంగం, అనంతసాగరం, ఉదయగిరి, సీతారామపురం, కలువోయ, నెల్లూరు డివిజన్లో మండలాలు: నెల్లూరు రూరల్, నెల్లూరు అర్బన్, కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరిపేట, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం, మనుబోలు, పొదలకూరు, సైదాపురం, రాపూరు విస్తీర్ణం: 10,441 చ.కి.మీ. జనాభా: 24.697 లక్షలు కర్నూలు జిల్లా జిల్లా కేంద్రం: కర్నూలు. అసెంబ్లీ నియోజకవర్గాలు: 8 (పాణ్యం, కోడుమూరు, కర్నూలు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ) రెవెన్యూ డివిజన్లు: కర్నూలు, ఆదోని, పత్తికొండ (కొత్త). మండలాలు: 26 కర్నూలు డివిజన్లో మండలాలు: కల్లూరు, ఓర్వకల్లు, సి బెళగల్, గూడూరు, కర్నూలు అర్బన్, కర్నూలు రూరల్, కోడుమూరు, వెల్దుర్తి ఆదోని డివిజన్లో మండలాలు: ఆదోని, మంత్రాలయం, పెద్దకడుబూరు, కోసిగి, కౌతాళం, హొలగుంద, ఎమ్మిగనూరు, నందవరం, గోనెగండ్ల పత్తికొండ డివిజన్లో మండలాలు: హాలహర్వి, ఆలూరు, ఆస్పరి, దేవనకొండ, చిప్పగిరి, పత్తికొండ, మద్దికెర ఈస్ట్, తుగ్గలి, కృష్ణగిరి విస్తీర్ణం: 7,980 చ.కి.మీ. జనాభా: 22.717 లక్షలు నంద్యాల జిల్లా జిల్లా కేంద్రం: నంద్యాల. అసెంబ్లీ నియోజకవర్గాలు: 6 (నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్, నందికొట్కూర్, శ్రీశైలం). రెవెన్యూ డివిజన్లు: ఆత్మకూరు (కొత్త), నంద్యాల, డోన్ (కొత్త). మండలాలు: 29 ఆత్మకూరు డివిజన్లో మండలాలు: శ్రీశైలం, ఆత్మకూరు, వెలుగోడు, నందికొట్కూరు, పగిడ్యాల, జూపాడు బంగ్లా, కొత్తపల్లి, పాములపాడు, మిడుతూరు, బండి ఆత్మకూరు నంద్యాల డివిజన్లో మండలాలు: నంద్యాల, గోస్పాడు, శిరివెళ్ల, దొర్నిపాడు, ఉయ్యాలవాడ, చాగలమర్రి, రుద్రవరం, మహానంది, ఆళ్లగడ్డ, పాణ్యం, గడివేముల, సంజామల, కొలిమిగుండ్ల డోన్ డివిజన్లో మండలాలు: బనగానపల్లె, అవుకు, కోయిలకుంట్ల, డోన్, బేతంచర్ల, ప్యాపిలి విస్తీర్ణం: 9,682 చ.కి.మీ. జనాభా: 17.818 లక్షలు అనంతపురం జిల్లా జిల్లా కేంద్రం: అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గాలు: 8 (రాయదుర్గం, కళ్యాణదుర్గం, శింగనమల, అనంతపురం అర్బన్, గుంతకల్, ఉరవకొండ, రాప్తాడు, తాడిపత్రి) రెవెన్యూ డివిజన్లు: గుంతకల్ (కొత్త), అనంతపురం, కళ్యాణదుర్గం. మండలాలు: 31 గుంతకల్ డివిజన్లో మండలాలు: ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూర్, గుంతకల్, గుత్తి, పామిడి, యాడికి, పెద్దవడుగూరు అనంతపురం డివిజన్లో మండలాలు: అనంతపురం, తాడిపత్రి, కూడేరు, ఆత్మకూరు, పెద్దపప్పూరు, శింగనమల, గార్లదిన్నె, పుట్లూరు, యల్లనూరు, నార్పల, బీకే సముద్రం, రాప్తాడు కళ్యాణదుర్గం డివిజన్లో మండలాలు : రాయదుర్గం, డి హీరేహల్, కనేకల్, బొమ్మనహాల్, గుమ్మఘట్ట, కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, శెట్టూరు, కుందుర్పి, కంబదూరు, బెళుగుప్ప విస్తీర్ణం: 10,205 చ.కి.మీ. జనాభా: 22.411 లక్షలు శ్రీ సత్యసాయి జిల్లా జిల్లా కేంద్రం: పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గాలు: 6 (మడకశిర, హిందూపురం, పెనుగొండ, పుట్టపర్తి, కదిరి, ధర్మవరం) రెవెన్యూ డివిజన్లు: ధర్మవరం, కదిరి, పుట్టపర్తి (కొత్త), పెనుకొండ. మండలాలు: 32 ధర్మవరం డివిజన్లో మండలాలు : ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ, రామగిరి, కనగానిపల్లి, చెన్నేకొత్తపల్లి కదిరి డివిజన్లో మండలాలు : కదిరి, తలుపుల, నంబులపూలకుంట, గాండ్లపెంట, నల్లచెరువు, తనకల్లు, అమడగూరు పుట్టపర్తి డివిజన్లో మండలాలు: బుక్కపట్నం, కొత్త చెరువు, పుట్టపర్తి, నల్లమాడ, ఓ.డి.చెరువు, గోరంట్ల పెనుగొండ డివిజన్లో మండలాలు: పెనుకొండ, సోమందేపల్లి, రొద్దం, హిందూపురం, చిల్లమత్తూరు, మడకశిర, పరిగి, లేపాక్షి, గుడిబండ, రోళ్ల, అమరాపురం, అగళి విస్తీర్ణం: 8,925 చ.కిమీ. జనాభా: 18.400 లక్షలు వైఎస్సార్ జిల్లా జిల్లా కేంద్రం: కడప అసెంబ్లీ నియోజకవర్గాలు: 7 (కడప, కమలాపురం, ప్రొద్దుటూరు, బద్వేల్, మైదుకూరు, పులివెందుల, జమ్మలమడుగు) రెవెన్యూ డివిజన్లు: బద్వేల్, కడప, జమ్మలమడుగు మండలాలు: 36 బద్వేల్ డివిజన్లో మండలాలు: మైదుకూరు, దువ్వూరు, చాపాడు, శ్రీ అవధూత కాశీనాయన మండలం, కలసపాడు, పోరుమామిళ్ల, బి.కోడూరు, బద్వేల్, గోపవరం, బ్రహ్మంగారి మఠం, అట్లూరు, ఖాజీపేట కడప డివిజన్లో మండలాలు: కడప, చక్రాయిపేట, ఎర్రగుంట్ల, వీరపనాయునిపల్లె, కమలాపురం, వల్లూరు, చెన్నూరు, చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, ఒంటిమిట్ట, సిద్ధవటం, వేంపల్లె జమ్మలమడుగు డివిజన్లో మండలాలు: జమ్మలమడుగు, పెద్దముడియం, మైలవరం, ముద్దనూరు, కొండాపురం, పులివెందుల, సింహాద్రిపురం, లింగాల, తొండూరు, వేముల, ప్రొద్దుటూరు, రాజుపాలెం విస్తీర్ణం: 11,228 చ.కి.మీ. జనాభా: 20.607 లక్షలు అన్నమయ్య జిల్లా జిల్లా కేంద్రం: రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాలు: 6 (రాజంపేట, కోడూరు, రాయచోటి, తంబళ్లపల్లె, మదనపల్లి, పీలేరు) రెవెన్యూ డివిజన్లు: రాజంపేట, రాయచోటి (కొత్త), మదనపల్లె. మండలాలు: 30 రాజంపేట డివిజన్లో మండలాలు: పోడూరు, పెనగలూరు, చిట్వేల్, పుల్లంపేట, ఓబులవారిపల్లె, రాజంపేట, నందలూరు, వీరబల్లె, టి సుందరపల్లె రాయచోటి డివిజన్లో మండలాలు: రాయచోటి, సంబేపల్లి, చిన్నమండెం, గాలివీడు, లక్కిరెడ్డిపల్లె, రామాపురం, పీలేరు, గుర్రంకొండ, కలకాడ, కంభంవారిపల్లె. మదనపల్లె డివిజన్లో మండలాలు: మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం, తంబళ్లపల్లె, మొలకలచెరువు, పెద్దమండ్యం, కురబలకోట, పెద్ద తిప్ప సముద్రం, బి.కొత్తకోట, కలికిరి, వాల్మీకిపురం విస్తీర్ణం: 7,954 చ.కి.మీ. జనాభా: 16.973 లక్షలు చిత్తూరు జిల్లా జిల్లా కేంద్రం: చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గాలు: 7 (నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమలేరు, కుప్పం, పుంగనూరు). రెవెన్యూ డివిజన్లు: చిత్తూరు, నగరి (కొత్త), పలమనేరు (కొత్త), కుప్పం (కొత్త). మండలాలు: 31 నగరి డివిజన్లో మండలాలు: నగరి, శ్రీరంగరాజపురం, వెదురుకుప్పం, పాలసముద్రం, కార్వేటినగరం, నిండ్ర, విజయపురం చిత్తూరు డివిజన్లో మండలాలు: చిత్తూరు, గుడిపాల, యాదమరి, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, పెనుమూరు, తవణంపల్లె, ఈరాల, పులిచెర్ల, రొంపిచర్ల పలమనేరు డివిజన్లో మండలాలు: పలమనేరు, గంగవరం, పెదపంజాని, సోమ్ల, చౌడుపల్లి, పుంగనూరు, సదుం, బంగారుపాలెం, బైరెడ్డిపల్లి, వెంకటగిరికోట కుప్పం డివిజన్లో మండలాలు: కుప్పం, శాంతిపురం, గుడుపల్లె, రామకుప్పం విస్తీర్ణం: 6,855 చ.కి.మీ. జనాభా: 18.730 లక్షలు తిరుపతి జిల్లా జిల్లా కేంద్రం: తిరుపతి. అసెంబ్లీ నియోజకవర్గాలు: 7 (సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు). రెవెన్యూ డివిజన్లు: గూడూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, తిరుపతి మండలాలు: 34 గూడూరు డివిజన్లో మండలాలు: గూడూరు, చిల్లకూరు, కోట, వాకాడు, చిత్తమూరు, బాలాయపల్లె, వెంకటగిరి, డక్కిలి సూళ్లూరుపేట డివిజన్లో మండలాలు: ఓజిలి, నాయుడుపేట, పెళ్లకూరు, దొరవారిసత్రం, సూళ్లూరుపేట, తడ, బుచ్చినాయుడి కండ్రిగ, వరదయ్యపాలెం, సత్యవేడు శ్రీకాళహస్తి డివిజన్లో మండలాలు: శ్రీకాళహస్తి, తొట్టంబేడు, రేణిగుంట, ఏర్పేడు, కుమార వెంకట భూపాలపురం, నాగులాపురం, పిచ్చాటూరు, నారాయణవనం తిరుపతి డివిజన్లో మండలాలు: తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రామచంద్రాపురం, వడమాలపేట, పుత్తూరు, యర్రవారిపాలెం, చిన్నగొట్టిగల్లు, పాకాల విస్తీర్ణం: 8,231 చ.కి.మీ. జనాభా: 21.970 లక్షలు. -
పిల్లల్ని కంటే రుణాలిస్తాం
బీజింగ్: ఒకప్పుడు చైనా అంటే జనాభా విస్ఫోటనం. దీన్ని అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం పలు కఠిన నియమాలు తెచ్చింది. అవన్నీ ఫలితాలివ్వడంతో చాలావరకు జనన రేటు అదుపులోకి వచ్చింది. ఈ ప్రయత్నాలు క్రమంగా ఆదేశ జనాభా తరుగుదలకు, ముఖ్యంగా యువత సంఖ్య తగ్గేందుకు కారణమయ్యాయి. ప్రమాదాన్ని ఊహించిన ప్రభుత్వం ప్రస్తుతం మరింతమందిని కనేందుకు ప్రోత్సాహాలిస్తోంది. ఈ కోవలోనే జిలిన్ ప్రావిన్సు కొత్త పథకం ప్రకటించింది. పెళ్లైన వారు పిల్లలు కనాలనుకుంటే వారికి 2 లక్షల యువాన్ల(సుమారు రూ. 25 లక్షలు) బ్యాంకు రుణాలిప్పిస్తామని ప్రకటించింది. చిన్నాచితకా వ్యాపారాలు నడిపే జంటలకు ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువమంది పిల్లలుంటే వారి వ్యాపారాలపై పన్నుల్లో తగ్గింపులు, మినహాయింపులు ఇస్తామని ప్రకటించింది. -
2031 నాటికి జనాభా 3.92 కోట్లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే పదేళ్లలో రాష్ట్ర జనాభా మరో 15 లక్షల మేర పెరుగుతుందని.. మొత్తం జనాభా సంఖ్య 2026 నాటికి 3.86 కోట్లకు, 2031 నాటికి 3.92 కోట్లకు చేరుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో 1.97 కోట్ల మంది పురుషులు, 1.95 కోట్ల మంది మహిళలు ఉంటారని తెలిపింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 3.50 కోట్లుగా ఉన్న తెలంగాణ జనాభా.. 2021 నాటికి 3.77 కోట్లకు చేరిందని వివరించింది. రాష్ట్ర ప్రణాళిక, గణాంక శాఖ ‘తెలంగాణ ఎట్ ఏ గ్లాన్స్–2021’ పేరిట రూపొందించిన నివేదికలో ఈ విశేషాలను వెల్లడించింది. శనివారం హైదరాబాద్లోని అర్థగణాంకశాఖ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్చైర్మన్ బి.వినోద్కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు ఈ నివేదికను విడుదల చేశారు. ఇందులో గత కొన్నేళ్లకు సంబంధించిన పలు గణాంకాలను, ప్రస్తుతం వివిధ రంగాల్లో పురోగతి, భవిష్యత్ అంచనాలను వివరించారు. ‘తెలంగాణ ఎట్ ఏ గ్లాన్స్’ నివేదికలో 2020–21 గణాంకాలివే.. ∙ రాష్ట్ర సగటు వార్షిక వర్షపాతం 905.4 మిల్లీమీటర్లుకాగా.. 2020–21లో 1,322.5 మిల్లీమీటర్లు కురిసింది. సాధారణంతో పోలిస్తే ఇది 46 శాతం ఎక్కువ. ∙ 2014–15లో 66,276 కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు జరగ్గా.. 2020–21 నాటికి 1.45 లక్షల కోట్లు దాటింది. అంతకుముందటి ఏడాదితో పోలిస్తే ఈసారి 7.99 శాతం ఐటీ ఎగుమతులు పెరిగాయి. ఈ రంగంలో ప్రస్తుతం 6,28,615 మంది ఉపాధి పొందుతున్నారు. ∙ 2020–21లో 1,04,23,177 ఎకరాల్లో వరి సాగయింది. వానాకాలంలో 52,51,261 ఎకరాల్లో, యాసంగిలో 51,71,916 ఎకరాల్లో వరి వేశారు. ఆ తర్వాత అత్యధికంగా మొక్కజొన్న 6.39 లక్షల ఎకరాల్లో, జొన్నలు 2.24లక్షల ఎకరాల్లో సాగుచేశారు. ∙ మొత్తంగా 2,18,51,471 టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. ఇందులో వానాకాలంలో 96,31,057 టన్నులు, యాసంగిలో 1,22,20,414 టన్నులు వచ్చింది. ఇందులో 1.41 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ∙ రాష్ట్రంలో మొత్తం రూ.11,886.70 కోట్ల విలువైన 485.17 లక్షల టన్నుల బొగ్గును వెలికి తీశారు. రూ.806 కోట్ల విలువైన 239 లక్షల టన్నుల సున్నపురాయి ఉత్పత్తి చేశారు. అన్నిరకాల ఖనిజ వనరులు కలిపి 29,962 కోట్ల విలువైన ఉత్పత్తులు వచ్చాయి. ∙ ఉపాధి విషయానికి వస్తే.. 2020–21లో మొత్తం 12.7 లక్షల మందికి పలు వ్యాపార/వాణిజ్య సంస్థల ద్వారా ఉపాధి లభించింది. ఇందులో దుకాణాల్లో పనిచేసేవారు 5.72 లక్షలుకాగా.. వాణిజ్యసంస్థల్లో 5.76 లక్షలు, సినిమా థియేటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లలో 1.22లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ∙ 2020–21లో మొత్తం 66,555 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగా.. 57,007 మిలియన్ యూనిట్లు వినియోగించారు. రాష్ట్రం ఏర్పాటైన 2014–15లో విద్యుత్ వినియోగం 39,519 మిలియన్ యూనిట్లు మాత్రమే. ∙రాష్ట్రంలో రోడ్డెక్కిన కొత్త వాహనాలు 8,22,416. ఇందులో టూవీలర్లు 5.58 లక్షలకుపైగా ఉండగా.. కార్లు/మినీ వ్యాన్లు వంటివి 1.17 లక్షలు, ట్రాక్టర్లు 23,160, రోడ్డు రోలర్లు 61, వ్యవసాయ ట్రాలర్లు 10,891 ఉన్నాయి. ∙ రవాణా వాహనాల విషయానికి వస్తే.. గూడ్స్ క్యారేజీలు 97,633, 5,836 ఆటోలు, 1,458 క్యాబ్లు, 43 విద్యాసంస్థల వాహనాలు ఉన్నాయి. ∙ 2020–21లో కొత్తగా రిజిస్టరైన ఆర్టీసీ బస్సుల సంఖ్య 4 మాత్రమే. -
Fertility Rate: ఇక్కడ తగ్గుతున్నారు.. అక్కడ పెరుగుతున్నారు
సాక్షి, అమరావతి: దేశంలో కొన్ని రాష్ట్రాల్లో జననాల సంఖ్య (బర్త్ రేట్) అమాంతం పెరుగుతుంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో ఊహించని విధంగా తగ్గిపోతోంది. దేశంలో జనాభా పెరుగుదల మధ్య తీవ్ర వ్యత్యాసాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో సంతాన సాఫల్య సూచిక (టోటల్ ఫెర్టిలిటీ రేటు) తగ్గాల్సిన దానికంటే ఎక్కువగా తగ్గిపోతోంది. దీనివల్ల భవిష్యత్లో వృద్ధుల సంఖ్య పెరిగిపోనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సంతాన సాఫల్యత గల మహిళ ఆంధ్రప్రదేశ్లో 1.6 మందిని మాత్రమే కంటున్నారు. ఫెర్టిలిటీ రేటు తగ్గడం ఊహించని పరిణామంగా చెబుతున్నారు. 2006లో ఆంధ్రప్రదేశ్లో సగటున ఒక మహిళ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చేది. తాజా గణాంకాల ప్రకారం అది 1.6 కు మాత్రమే పరిమితమైంది. కనీసం 1.9 లేదా ఆ పైన జననాల సంఖ్య ఉంటేనే జనాభా పెరుగుదల ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. తమిళనాడు, కేరళ, తెలంగాణ, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాలన్నిటిలోనూ ఫెర్టిలిటీ రేటు 1.7 కంటే తక్కువగా ఉంది. దీనివల్ల జనాభా పెరుగుదల కనీస స్థాయిలో కూడా ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో అయితే.. దేశంలోనే అత్యంత తక్కువగా జననాల రేట 1.5 మాత్రమే ఉంది. ఉత్తరాదిన పెరుగుతున్న జనాభా ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం సగటుకు మించి జనాభా పెరుగుతున్నారు. అత్యధికంగా బిహార్లో సగటున ఒక మహిళ 3.2 మందికి జన్మనిస్తోంది. ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జనాభా నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచి్చన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇండియా సగటు బర్త్ రేటు 2.2గా ఉంది. తాజా గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే బిహార్లో నూరు శాతం ఎక్కువగా ఫెర్టిలిటీ రేటు నమోదవటం గమనార్హం. ఇద్దరంటే మొగ్గు చూపడం లేదు గతంలో ‘ఇద్దరు పిల్లలు.. ఇంటికి వెలుగు’ అనే నినాదాలు హోరెత్తేవి. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పరిస్థితి లేదు. ఒక్కరే చాలు అనుకునే వాళ్లే ఎక్కువయ్యారు. చాలామంది యువతులు ఉద్యోగాలు, ఉపాధి వంటి కారణాల వల్ల ఆలస్యంగా వివాహాలు చేసుకుంటున్నారు. దీంతో వారు ఇద్దరు పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదు. మగవాళ్లు సైతం అదే భావంతో ఉంటున్నారు. పట్టణీకరణ నేపథ్యంలో కుటుంబ ఖర్చులు పెరిగిపోవడం, చదువుల వ్యయం కారణంగా ఆయా కుటుంబాలు పిల్లలకు జన్మనిచ్చే విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నాయి. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడంతో పిల్లల పెంపకం భారంగా మారడం కూడా సంతాన సాఫల్యత తగ్గడానికి కారణంగా చెబుతున్నారు. ఇలా రకరకాల కారణాలతో సంతానోత్పత్తి తగ్గిపోతున్నట్టు చెబుతున్నారు. ఇలా తగ్గుతూ వెళితే.. జనాభా ప్రాతిపదికన ఏర్పాటయ్యే పార్లమెంటరీ స్థానాలను పునరి్వభజన చేస్తే ఒక ప్రాంతంలో భారీగా సీట్లు పెరిగే అవకాశం ఉందని, మరో ప్రాంతంలో తగ్గిపోతాయని చెబుతున్నారు. ఇది రాజకీయ అసమానతలకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. -
‘తాత కావాల్సిన వయసులో మూడో భార్య కోసం వేట’
భోపాల్: బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్-కిరణ్రావుల విడాకుల అంశంపై దేశవ్యాప్తంగా తెగ చర్చ నడుస్తోంది. రెండు వివాహాలు చేసుకున్న ఆమిర్ వైవాహిక జీవితం ఇలా మధ్యలోనే ముగిసిపోవడం.. ఇద్దరు భార్యలకు విడాకులు ఇవ్వడాన్ని పలువురు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ నాయకుడు ఒకరు ఆమిర్ ఖాన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన లాంటి వల్లే దేశంలో జనాభా పెరుగుతుందని ఆరోపించారు. ఆ వివరాలు.. మధ్యప్రదేశ్ మంద్సోర్ బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా జనాభా పెరుగుదలకు, అసమానతలకు ఆమిర్ ఖానే బాధ్యుడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సుధీర్ గుప్తా మాట్లాడుతూ.. ‘‘ఆమిర్ ఖాన్ తన మొదటి భార్య రీనా దత్తాకు విడాకులు ఇచ్చాడు.. ఆమెతో కలిగిన ఇద్దరు బిడ్డలను వదిలేశాడు. ఆ తర్వాత కిరణ్ రావ్ను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెతో ఓ బిడ్డను కన్నాడు. ఇప్పుడు ఆమెకు విడాకులు ఇచ్చాడు. తాత కావాల్సిన వయసులో ఇప్పుడు మూడో భార్య కోసం వెతుకుతున్నాడు. దేశ జనాభాలో అసమానతలకు ఆమిరే కారణం’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాక ‘‘దేశ విభజన సమయంలో పాకిస్తాన్కు ఎక్కువ భూభాగం.. తక్కువ జనాభా లభించగా.. మనకు అందుకు రివర్స్లో జరిగింది. మన దగ్గర జనాభా పెరుగుతుంది తప్ప భూభాగం పెరగడం లేదని.. ఇది ఏమాత్రం మంచిది కాదు’’ అన్నారు సుధీర్ గుప్తా. కాగా తమ 15 ఏళ్ల వైవాహిక జీవితానికి ఆమిర్ ఖాన్- కిరణ్ రావులు చరమగీతం పాడారు. వీరికి సరోగసీ ద్వారా ఆజాద్ రావు అనే కుమారుడు ఉన్నాడు. కిరణ్ రావుని వివాహం చేసుకోకముందు ఆమిర్, రీనా దత్తాను వివాహం చేసుకోగా వారికి జునైద్ అనే కొడుకు, ఇరా అనే కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఆమిర్ ఖాన్, కిరణ్ రావులు విడిపోతున్నట్లు ప్రకటించి షాకిచ్చిన సంగతి తెలిసిందే. -
అధిక సంతానం ఉంటే అనర్హులే.. యూపీ నూతన చట్టం
లక్నో: ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయలేరు. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేరు. ఉద్యోగాలు చేస్తున్నవారికి పదోన్నతి సైతం దక్కదు. ప్రభుత్వం నుంచి ఏ రకమైన రాయితీలూ పొందలేరు. జనాభా విస్ఫోటనాన్ని నియంత్రించడమే లక్ష్యంగా బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న బిల్లు ముసాయిదాలోని ముఖ్యాంశాలివీ. జనాభా నియంత్రణ బిల్లును తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా ఇద్దరు పిల్లల విధానాన్ని కఠినంగా అమలు చేయాలని యోచిస్తోంది. ఈ పాలసీని ఉల్లంఘిస్తే ప్రభుత్వం నుంచి ప్రయోజనాలను పొందడం అసాధ్యమే. ఈ మేరకు ‘ఉత్తరప్రదేశ్ జనాభా(నియంత్రణ, స్థిరీకరణ, సంక్షేమం) బిల్లు–2021’లో భాగంగా యూపీ లా కమిషన్(యూపీఎస్ఎల్సీ) ముసాయిదాను సిద్ధం చేస్తోంది. ఈ ముసాయిదాను మెరుగుపర్చేందుకు ప్రజల సలహాలు, సూచనలు, వినతులు, అభ్యంతరాలను స్వీకరిస్తున్నట్లు లా కమిషన్ వెల్లడించింది. జూలై 19లోగా ప్రజలు స్పందించాలని కోరింది. ముసాయిదాలో ఏముందంటే.. ► జనాభా నియంత్రణ చట్టాన్ని అమలు చేయడానికి రాష్ట్ర జనాభా నిధిని ఏర్పాటు చేస్తారు. ► ఇద్దరు పిల్లల విధానాన్ని పాటించే ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం సర్వీసు కాలంలో అదనంగా 2 ఇంక్రిమెంట్లు అందుకోవచ్చు. 12 నెలల పూర్తి వేతనం, భత్యాలతో మాతృత్వ, పితృత్వ సెలవులు తీసుకోవచ్చు. నేషనల్ పెన్షన్ స్కీమ్లో ప్రభుత్వ వాటాను 3 శాతం పెంచుతారు. ► అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెటర్నిటీ సెంటర్లు నెలకొల్పుతారు. ఇక్కడ గర్భనిరోధక మాత్రలు, కండోమ్లు సరఫరా చేస్తారు. ► ఫ్యామిలీ ప్లానింగ్ పద్ధతులపై ఆరోగ్య కార్యకర్తల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. ► గర్భధారణలు, ప్రసవాలు, జననాలు, మరణాలను కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయాలి. ► జనాభా నియంత్రణను అన్ని సెకండరీ పాఠశాలల్లో ఒక సబ్జెక్టుగా తప్పనిసరిగా బోధించాలి. ► పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో వనరులు పరిమితంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరికీ ఆహారం, సురక్షిత తాగునీరు, సరైన ఆవాసం, నాణ్యమైన విద్య, విద్యుత్ వంటి వసతులతోపాటు జీవనోపాధి తప్పనిసరిగా కల్పించాల్సి ఉంది. పరిమిత వనరులతో అందరికీ అన్ని వసతులు అందుబాటులోకి తీసుకురావడం కష్టం. అందుకే జనాభా నియంత్రణ, స్థిరీకరణ చర్యలు చేపట్టాలి. రాజకీయ అజెండాతోనే.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జనాభా నియంత్రణ బిల్లు ముసాయిదాను బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని యూపీ కాంగ్రెస్ ప్రతినిధి అశోక్ సింగ్ ఆరోపించారు. ఇలాంటి బిల్లును తీసుకురావడం అంటే ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్సీ అశుతోష్ సిన్హా ధ్వజమెత్తారు. దేశంలో దళితులు, గిరిజనుల కారణంగానే జనాభా పెరుగుతోందని సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే ఇక్బాల్ మహూమూద్ వ్యాఖ్యానించారు. జనాభా నియంత్రణ కోసం ఏ చట్టాన్ని తీసుకొచ్చినా అది ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రగానే భావించాలన్నారు. -
జనాభా కాదు... నైపుణ్యం ముఖ్యం!
ప్రపంచ జనాభా కోటి నుంచి వంద కోట్లకు చేరుకోవడానికి 5,000 సంవత్సరాలు పట్టింది. కానీ ఎప్పుడైతే సైన్సు అందుబాటులోకి వచ్చిందో శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గి, జన విస్ఫోటనం పెరిగింది. 2011లో ప్రపంచ జనాభా 7 బిలియన్ మార్కుకు చేరుకుంది. ఇది 2030లో సుమారు 8.5 బిలియన్లకు, 2050లో 9.7 బిలియన్లకు పెరుగుతుందని అంచనా. మనిషి సగటు జీవితకాలం 1990ల ప్రారంభంలో 64.6 నుండి 2019 వరకు 72.6 ఏళ్లకు పెరిగింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా 1980లలో వన్–చైల్డ్ విధానం అమలు చేయడానికి ముందు జన్మించిన తరాలు నేడు ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారనున్నాయి. రాబోయే పదేళ్ళలో 55 అంతకంటే ఎక్కువ వయసు గల 12.39 కోట్ల మంది అక్కడ ఉండబోతున్నారు. చైనా జనాభా సగటు వయసు 1990లో 25 ఏళ్లు ఉండగా, 2020లో 38 ఏళ్లకు పెరిగింది. జనాభా సంక్షో భాన్ని నివారించడానికి దశాబ్దాల నాటి వన్–చైల్డ్ పాలసీని సడలించి నప్పటికీ, చైనా జనన రేటు 2017 నుండి స్థిరంగా క్షీణించింది. ప్రధాన నగరాల్లో పిల్లలను పెంచడానికి అధిక వ్యయంతో పోరాడుతున్న జంటలు, మహిళా సాధికారత పెరగడం వల్ల సహజంగానే ప్రసవాలను ఆలస్యం చేయడం లేదా నివారించడం దీనికి కారణం. జనాభా నియంత్రణ విధానాన్ని తీసివేస్తే భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల పరిస్థితులను తగ్గించుకోవచ్చని ప్రభుత్వానికి జనాభా శాస్త్రవేత్తలు సూచించారు. కానీ సాంకేతిక పరిజ్ఞానం, రోబోటిక్ టెక్నాలజీ సాయంతో ప్రతికూల ప్రభా వాన్ని తగ్గించుకోవచ్చుననే వాదన కూడా చైనాలో ఉంది. మరోవైపు 2027 నాటికి చైనా జనాభాను భారతదేశం అధిగమిస్తుందని అంచనా. అయితే భారతదేశంలో ప్రపంచం లోనే అత్యధిక కౌమారులు, యువకులు ఉన్నారు. 2011 జనగణన ప్రకారం, భారతదేశంలో ప్రతి ఐదవ వ్యక్తి కౌమార దశలో (10–19 సంవత్సరాలు) ఉన్నారు. మొత్తం 23.65 కోట్లు. అయితే దేశ భవిష్యత్తు కార్మికుల సంఖ్య పెంచడం కంటే, ప్రతి కార్మికుడి నైపుణ్యాలు, ఉత్పత్తి విలువను పెంచడం మీద ఆధారపడి ఉంటుంది. స్వాతంత్య్ర కాలంలో దేశ జనాభా 35 కోట్లు. అప్పటి నుండి నాలుగు రెట్లు పెరిగింది. 2019లో ఇది 1.37 బిలియన్లు. జనాభా గణనీయంగా పెరగడం ఆందోళన కలిగించే విషయం. అధిక జనాభా వల్ల సహజ వనరులను వేగంగా వినియోగించుకోవడం వల్ల భవిష్యత్ తరాలకు కొరత ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాకుండా పెరుగుతున్న జనాభా పర్యావరణాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ దృష్ట్యా 2019 ఆగస్టు 15న తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ’జనాభా విస్ఫోటనం గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది’ అని ప్రకటించారు. జనాభా విషయంలో సామాజిక అవగాహన చాలా అవసరమని నొక్కి వక్కా ణించారు. దేశాల మధ్య జనాభా అసమతుల్యత కారణంగా విపత్కర పరిస్థితి నెలకొనే అవకాశం ఉంటుంది. జనాభా పెరుగుదలను అరికట్టడానికి ఒక రాష్ట్రం, దేశం కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కలిసికట్టుగా పటిష్టమైన విధానాన్ని అవలంబిం చాలి. తద్వారా పటిష్టమైన మానవ వనరులను ఏర్పరుచుకోవడా నికి అవకాశం ఉంటుంది. అది ప్రకృతి పైన భారాన్ని తగ్గించి, మానవ, జీవజాతుల శ్రేయస్సుకు దోహదకారి అవుతుంది. చిట్టేడి కృష్ణారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ‘ 91825 52078 (నేడు ప్రపంచ జనాభా దినోత్సవం) -
ఎక్కువ పిల్లల్ని కనండి.. లక్ష గెల్చుకోండి!
న్యూఢిల్లీ: ఓవైపు పెరిగిపోతున్న జనాభా దేశ ఆర్థిక అవసరాలను సంక్లిష్టంగా మారుస్తూ వస్తోంది. ఈ తరుణంలో చాలా రాష్ట్రాలు, జనాభా నియంత్రణ పాలసీలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే ఈశాన్య రాష్ట్రం మిజోరం నుంచి అందుకు విరుద్ధమైన ప్రకటన వెలువడడం చర్చనీయాంశంగా మారింది. ఆ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి రాబర్ట్ రోమవీయా ఓ కొత్త ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. తన నియోజకవర్గంలో అత్యధిక సంతానం ఉన్న కుటుంబాలకు లక్ష రూపాయల ప్రోత్సాహకం ఇస్తానని ప్రకటించారు. దీంతో ఈ మంత్రి ప్రకటన సంచలనంగా మారింది. అస్సాంకి కౌంటర్? మిజోరంకి పోరుగున్న ఉన్న అస్సాం.. జనాభా నియంత్రణలో చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. గతంలో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత ఉండదని ప్రకటించింది కూడా. ఇక ఈమధ్యే మరో జీవో విడుదల చేసింది. ఇద్దరు సంతానం లోపు ఉన్న కుటుంబాలకు మాత్రమే సంక్షేమ పథకాల లబ్ధి దక్కుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు స్వయంగా ముఖ్యమంత్రి హిమాంత బిస్వా ప్రకటన చేశారు కూడా. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే.. మిజోరం మినిస్టర్ స్టేట్మెంట్ను కౌంటర్ ఇచ్చాడంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే అందులో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చాడు మంత్రి రాబర్ట్. కొడుకు సొమ్మే.. ‘‘మిజోరాం ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు సరిపోయే స్థాయిలో మిజోరం జనాభాలేదు. మిజోలు లాంటి చిన్న చిన్న తెగల విషయంలో ఇదో పెద్ద సమస్యగా మారింది’’ అని మంత్రి రాబర్ట్ వ్యాఖ్యానించారు. ఫాదర్స్ డే నాడు సందర్భంగా మంత్రి ఈ ప్రకటన చేశారు. తల్లిదండ్రుల్లో ఎవరోఒకరికి రూ. లక్ష రూపాయలను ప్రోత్సాహకంగా ఇస్తానని ఆయన ప్రకటించారు. లబ్ధిదారుడికి నగదు ప్రోత్సాహకంతో పాటూ ఓ ట్రోఫిని కూడా పొందుతారు. గరిష్టంగా, కనిష్టంగా ఎంత మంది పిల్లలు అనేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. అయితే ఈ స్కీమ్ను తన సొంత కొడుకు కంపెనీ నుంచే ఇస్తానని ప్రకటించడంతో విమర్శలకు తావు ఇవ్వకుండా జాగ్రత్తపడ్డాడు ఆయన. చదవండి: వీపున మామ.. ఎలా మోయగలిగావ్ తల్లీ! -
మూడో బిడ్డకూ చైనా ఓకే
బీజింగ్: దేశంలో జననాల రేటు పడితుండటంతో చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీ విధానపరమైన కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే సంతానం విధానాన్ని దశాబ్దాలపాటు కఠినంగా అమలు చేయడంలో చైనాలో జనాభా పెరుగుదల క్షీణించింది. దీని కారణంగా తలెత్తే దుష్ఫలితాలపై ఆందోళనలు వెల్లువెత్తడంతో ఇద్దరు బిడ్డల్ని కనవచ్చంటూ 2016లో వెసులుబాటు కల్పించింది. పిల్లల్ని పెంచడం ఆర్థికంగా భారంగా మారడంతో చైనాలో చాలా మంది దంపతులు ఇద్దరు సంతానం కలిగి ఉండేందుకు సముఖంగా లేరు. దీంతో తాజాగా, మరో అడుగు ముందుకేసి దంపతులు ముగ్గురు పిల్లల్ని కలిగి ఉండేందుకు వీలు కల్పించింది. కొత్త గణాంకాల ప్రకారం.. వరుసగా నాలుగో ఏడాది కూడా జననాల రేటు అతితక్కువగా నమోదైంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా, రెండోఅతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనాలో పనిచేయగలిగే వారి సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతుండటంపై ప్రభుత్వ వర్గాల్లో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో, దేశాధ్యక్షుడు, కమ్యూనిస్ట్ పార్టీ(సీపీసీ) అధినేత జిన్పింగ్..ఇప్పటి వరకు అనుసరించిన కుటుంబ నియంత్రణ విధానాన్ని పక్కనబెట్టి, దంపతులు మూడో బిడ్డను కూడా కలిగి ఉండేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. ‘మూడో సంతానాన్ని కనాలనే దంపతులను చైనా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది’అని అధ్యక్షుడు జిన్పింగ్ ఆధ్వర్యంలో జరిగిన సీపీసీ పొలిటికల్ బ్యూరో నిర్ణయించినట్లు అధికార వార్తా సంస్థ జిన్హువా పేర్కొంది. ఈ విధానం అమలుకు అవసరమైన ప్రోత్సాహక చర్యలతో చైనా జనాభా పెరుగుతుందని ఆ సమావేశం పేర్కొందని తెలిపింది. -
చిరుతకూ.. ఓ లెక్కుంది!
సాక్షి, హైదరాబాద్: అడవులు, పర్యావరణం, జీవవైవిధ్య పరిరక్షణలో పెద్దపులుల తర్వాత చిరుతలు కూడా కీలకపాత్రను పోషిస్తున్నాయి. చిరుతలను కూడా ‘కీ స్టోన్’ స్పీషీస్గా పరిగణిస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని చిరుత పులుల సంఖ్యను శాస్త్రీయ పద్ధతుల ద్వారా లెక్కించిన వివరాలు, అధికారిక గణాంకాల నివేదికను ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పెద్దపులుల పరిరక్షణ, వాటి సంఖ్యను అధికారికంగా అంచనా వేయడంలో భాగంగానే చిరుతపులుల సంఖ్యపైనా మొట్ట మొదటిసారిగా అధికారిక లెక్కలను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ప్రకటించింది. కేంద్ర అటవీ శాఖ ఆధ్వర్యంలోని వైల్డ్లైఫ్ ఇన్స్టిట్యూట్ దేశంలో ఏయే రాష్ట్రాల్లో ఎన్ని చిరుతలున్నాయనే దానిపై అధికారిక గణాంకాలు వెల్లడించింది. మనరాష్ట్రంలో సంఖ్యాపరంగా 341 చిరుతలున్నట్టుగా అధికారికంగా వెల్లడైంది. ఈ దేశవ్యాప్త అధ్యయనానికి కొనసాగింపుగా 2022లో మరోసారి అధికారికంగా వీటి లెక్కలకు సంబంధించి కేంద్రం రెండో నివేదికను విడుదల చేయనుంది. స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా నివేదికలో ఏముందంటే... కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా-2018 పేరిట ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం, దేశంలో మొత్తం 12,852 చిరుత పులులున్నట్లుగా అంచనా వేస్తున్నారు. వీటిలో అత్యధికంగా సెంట్రల్ ఇండియా, ఈస్ట్రన్ ఘాట్లలో 8,071 చిరుతలుండగా, అందులో అత్యధికంగా మధ్యప్రదేశ్లో 3,421, పశ్చిమ కనుమల్లో భాగంగా ఉన్న కర్నాటక 1,783 చిరుతలతో రెండో స్థానాన్ని ఆక్రమించింది. సెంట్రల్ ఇండియా, ఈస్ట్రన్ ఘాట్లలో అంతర్భాగంగా ఉన్న మహారాష్ట్ర 1,690 చిరుతలతో తృతీయ స్థానంలో నిలుస్తోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఆంధ్రప్రదేశ్లో 492, తెలంగాణలో 334 చిరుతలున్నట్టుగా ఈ నివేదిక వెల్లడించింది. 2014లో దేశంలో దాదాపు 7,900 చిరుతలు ఉండగా 2018 నాటికి వాటి సంఖ్య 12,852కు (దాదాపు 60 శాతం) పెరగడం గమనార్హం. చిరుతల పరిరక్షణా ముఖ్యమే... దేశంలో పులులు, చిరుతల సంరక్షణకు చేపడుతున్న చర్యలు ఏ మేరకు ఫలప్రదం అవుతున్నాయనే విషయంపై నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట్రాల అటవీశాఖలు, ఈ రంగంలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో వైల్డ్లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా వీటి సంఖ్యను శాస్త్రీయంగా గణిస్తోంది. చిరుత తీరిది... పెద్ద పులుల మాదిరిగానే రెండేళ్లకు పైబడిన చిరుతలను ‘అడల్ట్’గా పరిగణిస్తారు. రెండున్నరేళ్ల నుంచే అది సంతానోత్పత్తి మొదలుపెడుతుంది. 10 ఏళ్ల వయసు వచ్చేవరకు పిల్లలకు జన్మనిస్తుంది. చిరుతల ఆయుర్ధాయం సహజమైన అడవుల్లో 14, 15 ఏళ్లు ఉంటుంది. ఆహారం, వైద్యం అందుబాటులో ఉండటంతో పాటు ఇతర జంతువుల నుంచి ప్రాణహాని ఉండదు కాబట్టి జూలలో 17, 18 ఏళ్ల వరకు జీవించే అవకాశం ఉంటుంది. చిరుతలు పెద్దగా బరువు పెరగవు. గరిష్టంగా 55-60 కేజీల వరకు బరువుంటాయి. ఆహారం కూడా రోజుకు రెండు కేజీల మేర సరిపోతుంది. చిరుతల సంఖ్య పెరిగేందుకే అవకాశాలు రాష్ట్రంలో పెద్దపులులు, చిరుతపులుల సంఖ్య పెరుగుదలతో అడవులు, పర్యావరణానికి మంచి భవిష్యత్ ఉంటుంది. చిరుతల సంఖ్యపై తొలి నివేదిక తయారీలో కేంద్ర పరిశోధక బృందానికి రాష్ట్రం నుంచి అటవీశాఖ అధికారులు అవసరమైన సహకారాన్ని అందించారు. 2022 జనవరిలో రెండో నివేదికను కేంద్రం వెలువరించేందుకు సంబంధించి అవసరమైన ముందస్తు చర్యలు, సహకారాన్ని రాష్ట్ర అటవీశాఖ పరంగా అందజేస్తున్నాము. మనరాష్ట్రంలో చిరుతల సంఖ్య 341గా ఉన్నట్టుగా గత నివేదికలో వెల్లడైంది. వచ్చే జనవరిలో విడుదలయ్యే అధికారిక నివేదికను బట్టి తెలంగాణలో వాటి సంఖ్య కచ్చితంగా పెరుగుతుందనే భావిస్తున్నాము. -ఎ.శంకరన్, వైల్డ్ లైఫ్ విభాగం ఓఎస్డీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ -
జపాన్ను వణికిస్తున్న‘జనాభా’
టోక్యో: అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన జపాన్ దేశం జనాభా విషయంలో మాత్రం వెనకబడుతోంది. 2019 ఏడాదిలో మరోసారి అత్యంత కనిష్ట జననాల రేటును నమోదు చేసింది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో తక్కువ జననాల రేటు నమోదైనట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2019 లో దేశంలో జన్మించిన శిశువుల సంఖ్య 8లక్షల 64వేలకు పడిపోయింది. 1899లో నివేదికలు గణించడం ప్రారంభమైనప్పటి నుంచి అతి తక్కువ అని ఆరోగ్య, కార్మిక, సంక్షేమ మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ నివేదిక తెలిపింది. ముఖ్యంగా నవజాత శిశువుల సంఖ్య 2018 నుంచి 54 వేలకు పడిపోయిందని నివేదిక అంచనా వేసింది. 2019లో మరణాల సంఖ్య 1.376 మిలియన్లకు చేరుకుందని తెలిపింది. జపాన్లో సంతానోత్పత్తి రేటు తగ్గడం, వృద్ధుల శాతం పెరగడం పట్ల ఆ దేశ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. జనన శాతం తగ్గుదల ఇలాగే కొనసాగితే 2060 నాటికి జపాన్ జనాభా మూడో వంతు పడిపోతుందని ఆ దేశ సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా తగ్గుతున్న ఏకైక దేశం జపాన్ కావడం గమనార్హం. జపాన్ దేశ జనాభాలో వృద్ధులు అధికం. 20శాతం ప్రజలు 65ఏళ్లకు పైబడిన వారేనని తెలిపింది. సంతానోత్పత్తి సమస్యలు కేవలం జపాన్ దేశానికే కాక జర్మనీ, యుఎస్, యుకే, సింగపూర్, ఫ్రాన్స్ దేశాలు 2030 సంవత్సారానికి సంతానలేమి సమస్యలు ఎదుర్కోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జననాల సంఖ్యను పెంచడానికి దక్షిణ కొరియా ప్రభుత్వం ఉద్యోగుల పని గంటలను వారానికి 68 గంటల నుంచి 52 గంటలకు తగ్గించింది. సంతానోత్పత్తి రేటు తగ్గడం ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగిస్తుందని నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
ఊళ్లకు ఊళ్లు మాయం !
సాక్షి, హైదరాబాద్ : మనుషులు అదృశ్యం కావడం.. వస్తువులు కనిపించకుండా పోవడం గురించి విన్నాం. అయితే ఇక్కడ ఏకంగా ఊళ్లకు ఊళ్లే మాయమయ్యాయి. అదెలా అని ఆశ్చర్య పోతున్నారా?.. మన రెవెన్యూ అధికారుల నిర్వాకంతో ఇది సాధ్యమైంది. జనాభా లెక్కల సేకరణతో అసలు విషయం వెలుగుచూసింది. 2021 జనగణనకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో 2011 సెన్సెస్ను పరిగణనలోకి తీసుకున్న అధికారులు ఆ జాబితా ఆధారంగా గ్రామాల వారీగా జనాభా వివరాల సేకరణకు కసరత్తు ప్రారంభించారు. ఇందులో కొన్ని గ్రామాలు కనిపించకుండా పోవడంతో కేంద్ర జనగణన శాఖ అవాక్కయ్యింది. ఏకంగా ఊళ్లు మాయం కావడాన్ని సీరియస్గా పరిగణించింది. 2011 జనాభా లెక్కల అనంతరం ఏర్పడిన 23 జిల్లాలు కలుపుకొని.. మొత్తం 14 జిల్లాల పరిధిలో 460 గ్రామాలు, 2 మున్సిపాలిటీల పేర్లు గల్లంతయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర జనగణనశాఖ జాయింట్ డైరెక్టర్ హెలెన్ ప్రేమకుమారి.. సదరు గ్రామాలను డీనోటిఫై చేశారా?.. అలాగే కొత్తగా జాబితాలో 38 పంచాయతీలు చేర్చిన వైనాన్ని ప్రశ్నిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖాస్త్రం సంధించడం గమనార్హం. ఒకవేళ కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో చేరిస్తే.. ఆ వివరాలు పంపాలని కోరారు. రెవెన్యూ లెక్క తప్పింది ! జిల్లాల పునర్విభజన అంశంతో కొన్ని పల్లెల వివరాలు రెవెన్యూ రికార్డుల నుంచి మాయమయ్యాయి. భౌతికంగా ఆ పల్లెలు యథాస్థానంలో ఉన్నా రికార్డుల నుంచి కనిపించకుండాపోవడం కలకలం సృష్టించడమే కాదు, అధికారుల నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది. 2016లో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్తగా 23 జిల్లాలను ఏర్పాటు చేస్తూ జీఓ 221 నుంచి 250లను జారీ చేసింది. జీఓల్లో గ్రామాలకు గ్రామాలే గల్లంతయ్యాయి. జిల్లా కేంద్రాలుగా ఏర్పడ్డ 2 మున్సిపాలిటీల పేర్లు కూడా కనిపించకుండా పోయా యి. పోనీ, ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులు గుర్తించారా! అంటే అదీ లేదు. 2021 జనాభా లెక్కల సేకరణకు కేంద్రం సిద్ధమవుతున్న తరుణంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆయా జిల్లాల్లోని గ్రామాల జాబితాను పరిశీలిస్తున్న క్రమంలో 58 మండలాల పరిధిలోని 460 గ్రామాలతోపాటు వనపర్తి, గద్వాల మున్సిపాలిటీల సమాచారం కూడా గల్లంతుకావడంతో జనగణన అధికారులు నివ్వెరపోయారు. ఈ విషయాన్ని గత మార్చిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ ద్వారా తెలియజేసింది. ఈ గ్రామాలున్నాయా? రద్దు చేశా రా? కొత్తగా 38 గ్రామాలను ఏర్పాటు చేశా రు కదా.. వాటికి సంబంధించి ఉత్తర్వు కాపీలను పంపమని సూచించింది. భారత్–2021 జనాభా లెక్కలకు సంబంధించి ఈ ఏడాది చివరి నాటికి గ్రామాల హద్దులను ప్రకటించాల్సి ఉన్నందున తక్షణమే వివరాలను నివేదించాలని కోరింది. కేంద్రం లేఖతో తేరుకున్న రెవెన్యూ శాఖ.. గ్రామాల గల్లంతుపై దృష్టి సారించింది. గత జూన్లో సీఎస్ జిల్లా కలెక్టర్లతో ప్రత్యేకంగా ఈ అంశంపై చర్చించారు. కేంద్రం పంపిన జాబితాలో గల్లంతైనట్లు గుర్తించిన గ్రామాలపై మండలాలవారీగా నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 589 తహసీల్దార్లలో కేవలం 167 మంది, 142 మున్సిపాలిటీల్లో 30 మంది మాత్రమే స్పందించారు. -
యువత తగ్గుముఖం!
సాక్షి, న్యూఢిల్లీ: సంతానోత్పత్తి రేటు(టీఎఫ్ఆర్) తగ్గుముఖం పడుతుండడంతో దేశ జనాభాలో చిన్నారులు, యువత శాతం తగ్గుముఖం పట్టి.. వృద్ధుల సంఖ్య రెట్టింపు కానుందని ఆర్థిక సర్వే విశ్లేషించింది. వర్కింగ్ ఏజ్ గ్రూప్ జనాభాలో 59 శాతం వరకూ ఉండనుందని వివిధ గణాంకాల ఆధారంగా విశ్లేషించింది. టీఎఫ్ఆర్ తగ్గుతుండడంతో మొత్తం జనాభాలో 0 నుంచి 19 ఏళ్ల వయస్సు మధ్య గల జనాభా తగ్గుతుందని ఆర్థిక సర్వే పేర్కొంది. 2011లో 41 శాతం ఉన్న ఈ గ్రూపు జనాభా.. 2041 నాటికి 25 శాతానికి పడిపోతుందని తెలిపింది. అలాగే 60 ఏళ్లు పైబడిన జనాభా గ్రూపు పెరుగుతుందని వివరించింది. 2011లో వీరు 8.6 శాతం ఉండగా.. 2041 నాటికి 16 శాతానికి పెరగనుంది. 20 నుంచి 59 మధ్య ఉండే వర్కింగ్ గ్రూప్ జనాభా.. 2041లో కూడా 59 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. పెరిగిన లింగనిష్పత్తి బేటీ బచావో బేటీ పడావో పథకం ప్రారంభించిన తరువాత ఆంధ్రప్రదేశ్ సహా పలు పెద్ద రాష్ట్రాల్లో లింగ నిష్పత్తి గణనీయంగా పెరిగిందని ఎకనమిక్ సర్వే వెల్లడించింది. అంతకుముందు 2001 నుంచి 2011 వరకు లింగ నిష్పత్తి తగ్గగా.. ఈ పథకం ప్రారంభమయ్యాక లింగ నిష్పత్తిలో మార్పు వచ్చిందని తెలిపింది. 2015–16లో ఏపీలో లింగ నిష్పత్తి 873 నుంచి 901 మధ్య ఉండగా.. 2018–19 నాటికి 930–980 నమోదైంది. మరోవైపు తెలంగాణలోనూ లింగనిష్పత్తిలో గణనీయమైన పెరుగుదల నమోదైందని నివేదికలో వెల్లడించింది. -
జన విస్ఫోటనంతో వచ్చే సమస్యలు ఇవే!
సాక్షి, న్యూఢిల్లీ : భారత దేశంలో సంతానోత్పత్తి తగ్గుతూ వస్తున్నప్పటికీ 2026వ సంవత్సరం నాటికి దేశ జనాభా 165 కోట్లకు పెరుగుతుందని, 2027 నాటికి దేశ జనాభా చైనా జనాభాను అధిగమిస్తుందని ఐక్యరాజ్య సమితి ఇటీవల విడుదల చేసిన ఓ నివేదికలో వెల్లడించిన విషయం తెల్సిందే. జనాభా పెరుగుదల వల్ల మనకొచ్చే లాభనష్టాలు ఏమిటీ ? ‘డెమోగ్రాఫిక్ డివిడెండ్’ ద్వారా భారత్కు ప్రయోజనమని, ఆర్థిక వృద్ధిరేటు పెరుగుతుందని అగ్ర రాజ్యాలు ఎప్పటినుంచో చెబుతున్నాయి. జనాభా పెరగడం వల్ల పనిచేసే వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతుందని, వారి శ్రమ వల్ల ఆర్థికవృద్ధి రేటు పెరుగుతుందని ఆ దేశాల వాదన. 15–64 మధ్య వయస్కులను పనిచేసే వారిగా పరిగణిస్తున్నారు. వారి సంఖ్య 1963 నాటికి మొత్తం జనాభాలో 65 శాతం ఉంటుందని అంచనా. అంతమంది పనిచేస్తే ఆర్థిక వృద్ధి రేటు ఆశించిన దానికన్నా ఎక్కువనే సాధించవచ్చేమోగానీ వారందరికి నైపుణ్య శిక్షణ ఇవ్వడం, వారి ఉపాధి అవకాశాలు కల్పించడం ముఖ్యం. 2100 సంవత్సరం నాటికి కూడా పురుషులకన్నా మహిళల సంఖ్య తక్కువగా ఉంటుందని సమితి నివేదిక వెల్లడించింది. 2011లో జరిగిన జనాభా లెక్కల నాటికి ప్రతి వెయ్యి మంది పురుషులకు 943 మంది మహిళలు ఉండగా, ప్రస్తుతం ప్రతి వెయ్యి మంది పురుషులకు మహిళల సంఖ్య 924 ఉంది, ఇప్పుడిప్పుడే మహిళల సంఖ్య పురుషులతో పోలిస్తే కొద్ది కొద్దిగా పెరుగుతోందని, ఇక ముందు ఇంకా పెరుగుతుందని, అయినప్పటికీ ఇరువురి మధ్య ఉన్న వ్యత్యాసం తొలగిపోయే అవకాశం లేదన్నది అంచనా. అప్పటికి ప్రతి వెయ్యి మంది పురుషులకు 966 మంది మహిళలు ఉంటారన్నది అంచనా. 1950 నాటికి గ్రామీణ ప్రాంతాలు మరింత తగ్గిపోయి పట్టణ వాసుల సంఖ్య మరింత పెరిగిపోతుంది. పట్టణాల్లో ప్రాథమిక సదుపాయాలు కల్పించడం ఓ సవాల్గా మారుతుంది. జనాభా పెరుగుదలతో కాలుష్యం పెరుగుతోంది. ఇప్పటికే తగ్గిపోతున్న భూగర్భ జలాలతో పడుతున్న తిప్పలు అధిక జనాభాతో మరింత పెరుగుతాయి. మెట్రో, బస్సు సర్వీసులను విస్తరించకపోతే మరిన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. ముంబై, మద్రాస్ లాంటి నగరాలో అవి కిక్కిరిసి నడుస్తున్నాయి. -
ఇక సెన్సెస్–2021
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులను అంచనా వేసి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రూపొందించేందుకు నిర్ధేశించిన జన గణనకు అధికార యంత్రాంగం మరోసారి సమాయత్తం అవుతోంది. పదేళ్లకోసారి జరిపే జనగణన 2011లో ముగిసింది. ప్రస్తుతం 2011 జనాభా లెక్కల ప్రకారమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలను రూపొందించి అమలు చేస్తున్నాయి. 2021 జన గణన కోసం ఇప్పటి నుంచే సన్నాహక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి నుంచి 2020 చివరి వరకు జనాభా లెక్కల ప్రక్రియ సాగుతుంది. 2021 నుంచి కొత్త లెక్కల ప్రకారం కార్యక్రమాల రూపకల్పన ఉంటుంది. కాగా రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనతోపాటు మండలాలు, గ్రామ పంచా యతీల సంఖ్య పెరిగిన నేపథ్యంలో సెన్సెస్ –2021 కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మంగళవారం జిల్లాకు చెందిన మునిసిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. 021 జనగణన కోసం పునర్విభజన అనంతరం ఏర్పాటైన మండలాలు, గ్రామాలు, మునిసిపాలిటీల హద్దులతో కూడిన మ్యాపులను, పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశిం చారు. మ్యాపులను బుధవారంలోగా సమర్పిం చాలని అన్నారు. అన్ని గ్రామాల్లో విలేజీ రిజిస్టర్, పట్టణాల్లో టౌన్ రిజిస్టర్ నిర్వహించాలని సూచించారు. రెవెన్యూ గ్రామాలను ప్రామాణికంగా వివరాలు సేకరించాలన్నారు. మునిసిపాలిటీలలో ఎన్నికల వార్డులను ప్రామాణికంగా తీసుకొని కాలనీలు, వార్డుల మ్యాపులతోపాటు మునిసిపాలిటీ, కార్పొరేషన్ మ్యాపులు పంపిం చాలని ఆదేశించారు. మునిసిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు పంపిన మ్యాపుల ఆధారంతగా జియో ట్యాగింగ్తో నిర్ధిష్టమైన మ్యాపులను హైదరాబాద్లో రూపొందించనున్నట్లు చెప్పా రు. డిసెంబర్ 31లోపు మ్యాపులన్నీ సిద్ధంగా ఉంటాయని చెప్పారు. జనగణన కోసం ప్రత్యేకంగా ఎన్యుమరేటర్లను నియమిస్తామని కలెక్టర్ తెలిపారు. మునిసిపాలిటీలు, మండలాల నుం చి వివరాలు డూప్లికేట్ కాకుండా కమిషనర్లు, తహసీల్దార్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, ప్రత్యేక అధికారి ప్రావీణ్య, డీఆర్ఓ బిక్షానాయక్, ప్రణాళిక శాఖ ఉప సంచాలకులు శక్తికుమార్, కరీంనగర్, హుజూరాబాద్ ఆర్డీవోలు ఆనంద్కుమార్, చెన్నయ్య, మునిసిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన షురూ
సాక్షి,హైదరాబాద్: ఢిల్లీలోని ఉమ్మడి ఏపీ భవన్ విభజన ప్రక్రియ మొదలైంది. నగదు భారం పడకుండా ఏపీ భవన్ను 58:42 లో పంచునేందుకు ఏపీ, తెలంగాణ రాష్ట్రా లు సూత్రప్రాయంగా అంగీకరించాయి. సచివాలయం లో బుధవారం జరిగిన రెండు రాష్ట్రాల విభజన విభా గం అధికారుల తొలి భేటీలో తెలంగాణ నుంచి ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, ఏపీ నుంచి విభజన విభాగం ముఖ్యకార్యదర్శి ప్రేమ్చంద్రారెడ్డి, పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారమే పంపిణీ రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఢిల్లీలో ఏపీ భవన్కు 19.437 ఎకరాల భూములున్నాయి. ఇందులో 3.73 ఎకరాల్లో శబరి బ్లాక్, 4.196 ఎకరాల్లో గోదావరి –స్వర్ణముఖి బ్లాకులతో పాటు ఏపీ సీఎం కాటేజీ ప్రాంగణం, 3.412 ఎకరాల్లో ఓల్డ్ నర్సింగ్ హాస్టల్, 7.564 ఎకరాల్లో పటౌడీహౌస్ ఉన్నాయి. మధ్యలో 0.535 ఎకరాల మేర సర్వీసు రోడ్డు ఉంది. విభజన చట్టం ప్రకారం ఈ ఆస్తులన్నీ రెండు రాష్ట్రాల మధ్య జనాభా నిష్పత్తి ప్రకారం ఏపీ 58%, తెలంగాణ 42% నిష్పత్తిలో పంచుకోవాల్సి ఉంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ సూచనలమేర పంచుకునేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే పంపిణీపై అధికారులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఏపీ భవన్ తెలంగాణకే చెందుతుందని గతంలో సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. దీనికి స్పందించిన కేంద్రం పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఉమ్మడి భవన్ను రెండు రాష్ట్రాలు పంచుకోవాలని గతేడాది మార్చిలోనే సూచించింది. -
గురి తప్పని కెరీర్కు.. గణాంక శాస్త్రం
అప్కమింగ్ కెరీర్: గణాంక శాస్త్రం (స్టాటిస్టిక్స్).. 17వ శతాబ్దంలో ఆవిర్భవించిన శాస్త్రం. ప్రపంచవ్యాప్తంగా దీనికి రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది తప్ప ఎక్కడా తగ్గడం లేదు. ఒక రంగానికి సంబంధించిన గణాంకాలను సేకరించి, సరైన రీతిలో విశ్లేషించి, వాస్తవాలను బహిర్గతం చేసేవారే స్టాటిస్టిషియన్స్. పొరపాట్లను గుర్తించి, సరైన నిర్ణయాలు తీసుకునేందుకు గణాంక శాస్త్ర నిపుణులు తోడ్పడతారు. ఒకప్పుడు కొన్ని రంగాలకే పరిమితమైన స్టాటిస్టిషియన్ల సేవలు నేడు ఎన్నో రంగాలకు విస్తరించాయి. అందుకే వీరికి ఉన్నత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. భారత్లో గణాంక నిపుణుల కొరత అధికంగా ఉండడంతో అభ్యర్థులకు స్టాటిస్టిక్స్ కోర్సు పూర్తిచేసిన వెంటనే కొలువులు స్వాగతం పలుకుతున్నాయి. ఆకర్షణీయమైన జీతభత్యాలతో విదేశాల్లోనూ ఉద్యోగాలు దక్కుతున్నాయి. గణాంక శాస్త్రం చదివి ఖాళీగా ఉన్నవారు చాలా అరుదుగా కనిపిస్తారు. అంకెలు, సంఖ్యలు, లెక్కలు, ఎక్కాలపై ఆసక్తి ఉన్నవారు ఈ రంగంలోకి అడుగుపెట్టి ప్రొఫెషనల్ కెరీర్ను సొంతం చేసుకోవచ్చు. అవకాశాలు ఎన్నెన్నో... ప్రభుత్వాలు గతంలో జనాభా లెక్కలు, బడ్జెట్ తయారీకి అవసరమైన వివరాలను సేకరించడానికి స్టాటిస్టిషియన్లను ఉపయోగించుకునేవి. ఇప్పుడు వ్యవసాయం, ఫార్మాస్యూటికల్స్, డ్రగ్ టెస్టింగ్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్స్, బయో ఇన్ఫర్మాటిక్స్, ఎకనామెట్రిక్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, మార్కెట్ రీసెర్చ్, స్పోర్ట్స్.. ఇలా చాలా రంగాల్లో వీరి సేవలు అవసరమవుతున్నాయి. స్టాటిస్టిషియన్లకు కార్పొరేట్ సంస్థలు భారీ వేతనాలను ఆఫర్ చేస్తూ ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి. వీరికి ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగాల్లో ఎన్నో కొలువులు ఉన్నాయి. స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, అప్లయిడ్ స్టాటిస్టిక్స్లో పోస్టుగ్రాడ్యుయేషన్ చేసినవారిని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్కు ఎంపిక చేస్తోంది. సోషల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టాటిిస్టిషియన్లు సెఫాలజిస్ట్గా కూడా పనిచేయొచ్చు. అంతేకాకుండా బోధనపై ఆసక్తి ఉంటే విద్యాసంస్థల్లో ఫ్యాకల్టీగా స్థిరపడొచ్చు. విశ్లేషణాత్మక దృక్పథం: స్టాటిస్టిషియన్లకు వృత్తిలో రాణించడానికి మ్యాథమెటిక్స్పై గట్టి పట్టు ఉండాలి. క్వాంటిటేటివ్, అనలిటికల్ స్కిల్స్ అవసరం. ప్రతి విషయాన్ని తర్కబద్ధంగా ఆలోచించగలగాలి. మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు తప్పనిసరి. బృంద స్ఫూర్తి కావాలి. సొంతంగా నిర్ణయాలు తీసుకొని, అమలు చేసే సామర్థ్యం ఉండాలి. స్టాటిస్టికల్ సాఫ్ట్వేర్లపై పరిజ్ఞానం పెంచుకోవాలి. అర్హతలు: భారత్లో స్టాటిస్టిక్స్లో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులున్నాయి. మ్యాథమెటిక్స్తో ఇంటర్మీడియెట్ పూర్తయిన తర్వాత గ్రాడ్యుయేషన్లో చేరొచ్చు. పోస్టు గ్రాడ్యుయేషన్ కూడా అభ్యసిస్తే ఉన్నతస్థాయి అవకాశాలను పొందొచ్చు. ప్రొఫెషనల్ గ్రోత్ ఉంటుంది. వేతనాలు: గణాంక శాస్త్ర నిపుణులకు వార్షిక వేతన ప్యాకేజీలు భారీగా ఉంటాయి. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్-కోల్కతా విద్యార్థికి గతంలో రూ.10 లక్షల ప్యాకేజీ దక్కింది. ఢిల్లీ యూనివర్సిటీలో స్టాటిస్టిక్స్ కోర్సు అభ్యసించిన విద్యార్థికి రూ.7.5 లక్షల వేతన ప్యాకేజీ లభించింది. ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ కోర్సు పూర్తిచేసినవారికి సగటున ఏడాదికి రూ.4 లక్షల నుంచి రూ.4.5 లక్షల వేతనం అందుతుంది. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: ఏ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్-హైదరాబాద్ వెబ్సైట్: www.isihyd.ac.in ఏ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వెబ్సైట్: www.uohyd.ac.in ఏ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ వెబ్సైట్: www.du.ac.in/du/ ఏ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్-కోల్కతా వెబ్సైట్: www.isical.ac.in ఏ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్-బెంగళూరు వెబ్సైట్: www.isibang.ac.in ఏ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్-ఢిల్లీ; వెబ్సైట్: ఠీఠీఠీ.జీటజీఛీ.్చఛి.జీ గణనీయమైన అవకాశాలు! శ్రీసాఫ్ట్వేర్, బ్యాంకింగ్, బీమా, నిర్మాణ తదితర రంగాలన్నింటిలోనూ స్టాటిస్టిక్స్ నిపుణులకు విస్తృత అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. కంపెనీల పనితీరును, ప్రగతిని విశ్లేషించుకోవడానికి, భవిష్యత్ ప్రణాళికా రచనలో వీరి అవసరం తప్పనిసరి. డేటా అనలిటిక్స్, బిగ్డేటా, సిక్స్సిగ్మా, క్వాలిటీ కంట్రోల్ తదితర విభాగాల్లో స్టాటిస్టిషియన్స్కు డిమాండ్ ఉంది. ఆసక్తితోపాటు మంచి విశ్లేషణాత్మక నైపుణ్యాలు, గణిత సామర్థ్యాలు, అనువర్తన నైపుణ్యాలున్నవారు ఈ రంగాన్ని కెరీర్గా ఎంచుకోవచ్చు. ఇంజనీరింగ్ కోర్సులు పూర్తిచేసిన వారు స్టాటిస్టిక్స్ను అభ్యసిస్తే అవకాశాలను మెరుగుపర్చుకోవచ్చు. ఈ కోర్సులు చదివినవారికి ప్రైవేటు సంస్థలతోపాటు పలు ప్రభుత్వ విభాగాల్లోనూ అవకాశాలున్నాయి. - ప్రొ.ఎస్.ఎం.సుభానీ, ఎస్క్యూసీ అండ్ ఓర్, ఐఎస్ఓ 9000, సిక్స్ సిగ్మా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్ -
అయ్యో... ‘బంగారం’
కామారెడ్డి: అమ్మ కడుపులో నవ మాసాలు పెరిగిన శిశువు.. గర్భం నుంచి ఈ ప్రపంచంలోకి రాగానే.. ముర్రిపాల అమృతంతో కడుపు నింపుకోవాల్సిన సమయం.. అమ్మ నులివెచ్చని పొత్తిళ్లలో ఒదిగిపోవాల్సిన శిశువులు.. ఆడపిల్ల అన్న చిన్నచూపో.. మరేకారణమో.. ఆడ శిశువులు కళ్లు తెరిచేసరికి ముళ్లపొదలు, మురికి కాలువలు, పాడుబడ్డ బావుల్లోకి చేరుతున్నారు. ఆడపిల్లను భారంగా భావించేవారు వారిని వదిలేసుకుంటున్న వైనం.. సభ్య సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవైపు ఆడపిల్లలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్న నేటి రోజుల్లో కూడా ‘ఆడపిల్ల’ అన్న వివక్ష కొనసాగుతోంది. ఇప్పటికే ఆడపిల్లల సంఖ్య తగ్గిపోయి పెళ్లికాని ప్రసాద్ల సంఖ్య పెరిగిపోతున్నా సృష్టికి మూలమైన ఆడజన్మను కాపాడాల్సిన చేతులే కాటికి పంపుతుండడం విస్మయపరుస్తోంది. తాజాగా మాచారెడ్డి మండలం పల్వంచ గ్రామంలో అప్పుడే పుట్టిన ఆడశిశువును ఓ పాడుబడ్డ బావిలో పడేసిన ఘటన సమాజాన్ని తట్టిలేపింది. ఆ పాప అరుపులు విన్న గ్రామస్తులు బావి నుంచి బయటకు తీసి కాపాడారు. పేదరికం, నిరక్షరాస్యత వెరసి ఆడపిల్ల అన్న భావన ఇంకా సమాజాన్ని వదలడం లేదు. ఆడపిల్లలు ఎంత ఎత్తుకు ఎదుగుతున్న వారిపై వివక్ష పోవడం లేదు. గర్భంలో పెరుగుతున్నది ఆడపిల్ల అని తెలిస్తే చాలు తుంచేసే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు వీలుకాని పరిస్థితుల్లో పుట్టిన శిశువును మురికి కాలువల్లోనో, ముళ్ల పొదల్లోనో, పాడుబడ్డ బావులు, చెత్తకుప్పల్లోనూ విసిరేస్తున్నారు. మగపిల్లవాడు కావాలని ఎంతో మంది ఆరాపడుతుంటారు. మగపిల్లాడి కోసం ఎన్ని అబార్షన్లయినా చేయించుకునేవారు లేకపోలేదు. వరుసగా ఇద్దరు ఆడపిల్లలు పుడితే చాలు మగపిల్లాడి కోసం మరో ప్రయత్నం చేయడం, గర్భంలో ఉన్నపుడే ఆడ, మగా తెలుసుకుని ఆడపిల్లని తెలిస్తే చాలు తుంచేసేందుకు వెనుకాడడం లేదు. కొందరు రెండు, మూడు అబార్షన్లు చేయించుకున్నవారు ఉంటున్నారంటే ఆడపిల్ల మీద ఎంత వివక్ష, మగపిల్లవానిమీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఐదువేల మంది బాలికలు తక్కువ.... జిల్లా జనాభా 25,51,335 మంది ఉండగా, మహిళలు 13,00,694 మంది, పురుషులు 12,50,641 మంది ఉన్నారు. అంటే పురుషుల కన్నా మహిళలు 50 వేల మంది ఎక్కువగా ఉన్నారు. అయితే నాలుగేళ్లలోపు పిల్లల విషయానికి వచ్చే సరికి పరిస్థితులు తలకిందులయ్యాయి. జిల్లాలో 4 సంవత్సరాల లోపు పిల్లలు 1,94,793 మంది ఉంటే బాలురు 99,714 మంది, బాలికలు 95,079 మంది ఉన్నారు. అంటే జిల్లాలో 5 వేల మంది వరకు ఆడపిల్లలు తక్కువగా ఉన్నారనేది అధికారిక రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే ఆడపిల్లలు దొరక్క మగపిల్లలు చాలా మందికి పెళ్లిళ్లు కుదరడం లేదు. రాబోయే 15 యేళ్ల తరువాత పెళ్లికాని ప్రసాద్లు జిల్లాలో వేలాది మంది మిగులుతారు. ఈ పరిస్థితి జిల్లాలోనే కాక రాష్ట్రమంతటా ఉండడంతో భవిష్యత్తు బాలికలదేనని స్పష్టమవుతోంది. బంగారు తల్లులను కాపాడుకోవాలి.... రోజురోజుకూ తగ్గిపోతున్న ఆడపిల్లల సంఖ్య సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. బంగారు తల్లులను కాపాడుకోకుంటే భవిష్యత్తు అంధకారమేనన్న విషయాన్ని గుర్తించాలి. ప్రభుత్వాలు అబార్షన్ల నియంత్రణకు ఎన్ని చట్టాలు తెచ్చినా యథేచ్ఛగా లింగనిర్దారణ పరీక్షలు జరుగుతుండడం, ఆడపిల్ల సంరక్షణకు ఎన్ని పథకాలు తీసుకువచ్చినా అవి వారి ధరికి చేరకపోవడం వంటి కారణాలు బంగారు తల్లుల సంఖ్య తగ్గడానికి కారణమవుతున్నాయి. గత ప్రభుత్వం బంగారుతల్లి పథకాన్ని ఆర్భాటంగా ప్రారంభించినా అది ప్రయోజనం కలిగించలేకపోయింది. వరకట్న దురాచారం, ఆడపిల్ల అన్న వివక్ష వంటి వాటిని రూపుమాపేందుకు ప్రభుత్వాలు, ప్రజలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
2021 నాటికి ‘వర్కింగ్ ఏజ్’ జనాభా 64%
న్యూఢిల్లీ: దేశంలో పనిచేసే వయసులో ఉన్నవారి జనాభా నిష్పత్తి 2001లో ఉన్న 58 శాతం నుంచి 64 శాతానికిపైగా పెరిగే అవకాశం ఉందని కేంద్రం ఆర్థిక సర్వేలో అంచనా వేసింది. వీరిలో 20 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయసువారు ఎక్కువగా ఉంటారని తెలిపింది. 2020 నాటికి 125 కోట్లకు చేరుకునే దేశ జనాభాలో ప్రజల సగటు వయసు 29 ఏళ్లుగా ఉంటుందని వివరించింది. 2011 నుంచి 2016 మధ్యలో 6.35 కోట్ల మంది యువతీయువకులు కొత్తగా ఈ జాబితాలో చేరతారని ప్రభుత్వం తెలిపింది. మానవ వనరుల అభివృద్ధికి ఈ జనాభా పెరుగుదలను అవకాశంగా మలచుకోవాలని సర్వే సూచించింది