praneeth
-
ప్రణీత్ హనుమంత్ కి బెయిల్ కూడా రాకుండా చేస్తున్నారు..
-
ట్రోల్స్, రోస్టర్స్ ముసుగులో రెచ్చిపోతున్న కామాంధులు..
-
పోక్సో కేసు.. చంచల్గూడ జైలుకు యూట్యూబర్ ప్రణీత్
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో తండ్రి,కూతురు వీడియోపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన నిందితుడు యూట్యూబ్ ప్రణిత్ హనుమంతు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పోక్సో చట్టంతో పాటు 67B ఐటీ యాక్ట్, భారత న్యాయ సంహిత చట్టం సెక్షన్లు 79, 294 ప్రకారం కేసు నమోదు చేశారు. ప్రణీత్తోపాటు ఆ లైవ్ ఛాటింగ్ చేసిన మరో ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో A2 డల్లాస్ నాగేశ్వర్ రావు, A3 బుర్రా యువరాజ్, A4 సాయి ఆదినారాయణగా ఉన్నారు. ప్రస్తుతం యూట్యూబ్ ప్రణిత్ హనుమంతు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అదుపులో ఉన్నాడు. నిన్న(బుధవారం) బెంగళూరు నుంచి పిటి వారెంట్పై పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి హైదరాబాకు తీసుకొచ్చారు. హనుమంతును విచారించిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో.. ఈ మధ్యాహ్నం నాంపల్లి కోర్టులో హాజరు పరిచింది. ప్రణీత్ హనుమంతుకు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. -
ప్రణీత్ హనుమంతు పై పోక్సో చట్టం
-
ఇలాంటి సమయంలో చెప్పాల్సి వస్తుందని ఊహించలేదు: ప్రణీత్ బ్రదర్
సోషల్ మీడియాలో చిన్నపిల్లలపై అసభ్యకరమైన వీడియోలు చేస్తోన్న ప్రముఖ యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును పోలీసులు అరెస్ట్ చేశారు. హీరో సాయి ధరమ్ తేజ్ చేసిన ట్వీట్తో అతని పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. ప్రణీత్పై చర్యలు తీసుకోవాలంటూ పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. దీంతో అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు.తాజాగా ప్రణీత్ అరెస్ట్పై ఆయన సోదరుడు అజయ్ హనుమంతు(అయే జుడే) స్పందించారు. తప్పు ఎవరు చేసినా తప్పేనని.. అది తమ్ముడైనా సరే శిక్ష పడాల్సిందే అన్నారు. తన పెళ్లి గురించి ఇలాంటి సమయంలో చెప్పాల్సి వస్తుందని ఊహించలేదన్నారు. కానీ తప్పడం లేదు.. నాకు పెళ్లై ఇప్పటికే ఆరేళ్లయిందని అయే జుడే తెలిపారు. ఇంజినీరింగ్ పూర్తయిన వెంటనే లవ్ మ్యారేజ్ చేసుకున్నట్లు తెలిపారు.అజయ్ మాట్లాడుతూ..' నా పెళ్లి విషయం సంతోషకరమైన సమయంలో చెబుదామని అనుకున్నా. కానీ చెప్పక తప్పడం లేదు. నా పెళ్లి జరిగి ఆరేళ్లైంది. కాలేజీ పూర్తవ్వగానే లవ్ మ్యారేజ్ చేసుకున్నా. అప్పటి పరిస్థితులు వేరు. లైఫ్లో చాలాసార్లు ఫెయిలయ్యా. జీవనోపాధి లేక కష్టాలు పడ్డా. ఐఏఎస్ ఆఫీసర్ కుమారుడినైనా రోడ్ మీద నుంచే నా లైఫ్ స్టార్ట్ చేశా. అడల్డ్ అండ్ కామెడీని పర్సనల్గా నేను ప్రోత్సహించను. అలాంటివి చూడను కూడా. అది ఎవరు చేసిన తప్పే. ఈ విషయంలో మీరు ఎంత దూరంగా ఉన్నారో.. నేను కూడా అంతే.' అని అన్నారు. Naaku 6 years back marriage ayyindhi... Ah taravatha nen intlo nundi bayataki vachesa..Social Media lo Vunna incident ki meeru entha dooranga unnaro, nenu anthe dooranga unnanu~#AyeJude (youtuber) #PhanHanumantu brother pic.twitter.com/szbX3xWfBF— Filmy Bowl (@FilmyBowl) July 10, 2024 -
ప్రణీత్ హనుమంతు అరెస్ట్ ఈడ్చుకొస్తున్న పోలీసులు
-
యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తండ్రీ కూతుళ్ల బంధంపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్ అయ్యారు. బుధవారం బెంగళూరులో అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్కు తీసుకురానున్నారు. ఇప్పటికే అతనిపై సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు.కొన్నేళ్లుగా తన స్నేహితులతో వీడియో చాటింగ్ చేస్తూ అసభ్యకర మాటలతో రెచ్చిపోతున్న ప్రణీత్ హనుమంతు తీరుపై టాలీవుడ్ హీరో సాయి దుర్గ తేజ్ మొదటిసారి రియాక్ట్ అయ్యాడు. ఆయన తీరును తప్పుబడుతూ ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకు సోషల్ మీడియా ద్వారా విషయాన్ని షేర్ చేశారు. దీంతో ఈ విషయం నెట్టింట వైరల్ అయింది.తండ్రీకూతుళ్ల బంధంపై విచక్షణ మరచి ప్రణీత్ హనుమంతు మాట్లాడాడు. తండ్రి, కుమార్తె బంధంలో అశ్లీలం ధ్వనించేలా తన స్నేహితులతో ఆయన మాట్లాడాడు. సాయి దుర్గ తేజ్ ఈ విషయాన్ని తెరపైకి తీసుకురావడంతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చర్యలకు ఆదేశించారు. తాజాగా ప్రణీత్ హనుమంతును టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. అక్కడే ఆయన్ను కోర్టులో హాజరుపరిచారు. ట్రాన్సిట్ వారెంట్ ద్వారా ప్రణీత్ హనుమంతును హైదరాబాద్కు తీసుకురానున్నారు. ఆయనపై నాన్బెయిలబుల్ వారెంట్ కేసు నమోదు చేశారు. ప్రణీత్తో పాటు అతని స్నేహితులలో మరో ముగ్గుర్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు: నాంపల్లి కోర్టులో హైడ్రామా
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టులో హైడ్రామా నడిచింది. పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్ను కోర్టు వెనక్కి పంపగా.. ఇదే అదనుగా ఈ కేసులో నిందితుడు ప్రణీత్రావు బెయిల్ కోసం ప్రయత్నించాడు. అయితే ఇక్కడే ఊహించని ట్విస్టు చోటు చేసుకుంది.ఛార్జ్షీట్లో కొన్ని తప్పిదాలను గుర్తించిన నాంపల్లి కోర్టు.. దానిని పోలీసులకు తిప్పి పంపించింది. అయితే ఈ గ్యాప్లో ప్రణీత్ రావు కోర్టును ఆశ్రయించాడు. తొంభై రోజుల్లో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేయలేదు కాబట్టి బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించాడు. అయితే ఈలోపే తప్పులు కరెక్ట్ చేసిన పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అంతేకాదు.. బెయిల్ ఇస్తే ప్రణీత్రావు సాక్ష్యాల్ని తారుమారు చేస్తారని వాదించారు. కొత్త ఛార్జ్షీట్ పరిగణనలోకి తీసుకోవడమే కాకుండా.. పోలీసుల వాదనతో నాంపల్లి కోర్టు ఏకీభవించింది. ఫలితంగా.. ప్రణీత్రావు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. -
1200 వందల ప్రముఖుల ఫోన్లు ట్యాప్ నిజాలు ఒప్పుకున్నా ప్రణీత్ రావు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనాలు బయటకు..
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన హైదరాబాద్ టాస్క్ఫోర్స్ మాజీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) పి.రాధాకిషన్రావు అండ్ టీమ్ అక్రమాలు బయటపడుతున్నాయి. రాధాకిషన్రావు రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్కు మద్దతుగా ఇతర పార్టీల నేతలకు సంబంధించిన డబ్బును పట్టుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ను రాధాకిషన్రావు ఆయుధంగా ఉపయోగించుకున్నట్లు ఇప్పటికే పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. అయితే బీఆర్ఎస్కు అనుకూలంగా డబ్బు తరలించే వ్యవహారంలోనూ రాధాకిషన్రావు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసుల తాజా దర్యాప్తులో బయటపడింది.ఈ ప్రక్రియలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డికి చెందిన డబ్బును ఎక్కువగా తరలించినట్లు తేలింది. రాధాకిషన్రావు డబ్బు తరలించేందుకు అప్పట్లో సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ టీంలో పనిచేస్తున్న ఓ ఎస్సైని ఎంచుకున్నారు. ఆయనకు ప్రత్యేకంగా ప్రభుత్వ బొలేరో వాహనాన్ని సమకూర్చి అందులోనే పెద్దఎత్తున నగదును తరలించారు. భారాస ఎమ్మెల్సీ, విశ్రాంత ఐఏఎస్ వెంకట్రామిరెడ్డ్డికి చెందిన డబ్బు తరలింపు వాహనాలకు రాధాకిషన్రావు ఆదేశాలతో ఎస్సై పలుమార్లు ఎస్కార్ట్గా వ్యవహరించారు. తెల్లాపూర్లోని రాజ్పుష్ప గ్రీన్డేల్ విల్లాస్లో వెంకట్రామిరెడ్డి ఇంటి సమీపంలో ఉండే శివచరణ్రెడ్డి అలియాస్ చరణ్ను కలవాలని రాధాకిషన్రావు ఎస్సైకి సూచించారు. అనంతరం శివచరణ్రెడ్డి కొత్త ఐఫోన్ను, సిమ్కార్డును తీసుకొచ్చి ఎస్సైకి అప్పగించారు రాధాకిషన్రావు. నగదు తరలింపు వ్యవహారాల గురించి రాధాకిషన్రావు ఆ ఫోన్కే కాల్ చేస్తూ ఎస్సైకి ఆదేశాలిచ్చేవారు. డబ్బులకు ఎస్కార్ట్ ఇచ్చి మరీ డెలివరీ చేశారు. సికింద్రాబాద్లో ఉండే మాజీ ఎస్పీకి సైతం డబ్బుల రవాణాలో పాత్ర ఉంది. ఆ ఎస్సై పలు సార్లు రూ. 3 కోట్ల డబ్బులు తరలించారు. డబ్బులు తరలించిన ఎస్ఐ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. ప్రభాకర్ రావు ఆదేశాలతో రాజకీయ నాయకులపై నిఘా కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. రాజకీయ నాయకులపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రభాకర్కి రాధాకిషన్రావు చేరవేశారు. ప్రణీత్ రావు ఇచ్చే సమాచారంతో రాధా కిషన్ నిఘాను పెట్టారు. రాధాకిషన్ సహకరించిన ఎస్సైలు, ఇన్స్పెక్టర్లను తోపాటు మాజీ పోలీసు అధికారులను పోలీసులు విచారించనున్నారు. పలువురు రాజకీయ నేతల విచారణకు రంగం సిద్దం చేశారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు ఏడు రోజుల కస్టడీ
సాక్షి, హైదరాబాద్: ఫోన్ టాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధా కిషన్ రావును తమ కస్టడీకి కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్పై బుధవారం నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. ఈమేరకు రాధాకిషన్రావును పదిరోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే రాధా కిషన్రావును ఏడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు పోలీసులు ప్రశ్నించానున్నారు. దీంతో గురువారం చంచలగూడ జైలు నుంచి పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. కాగా ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు A4గా ఉన్నారు. చదవండి: రాధాకిషన్ రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు -
ముక్కలు చేసి.. మూసీలో పడేసి!
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐబీలోని స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) ద్వారా జరిగిన అక్రమ ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టు అయిన అదనపు ఎస్పీల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్నలను ఐదు రోజులపాటు పోలీసు కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నించారు. ఫలితంగా ట్యాపింగ్తో పాటు ఆధారాల ధ్వంసానికి సంబంధించిన సమాచారం సేకరించారు. ఈ వివరాలను పోలీసులు తమ రిమాండ్ రిపోర్టు ద్వారా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. భుజంగరావు, తిరుపతన్నలు తమ నేరం అంగీకరించారని, ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్రావు ఆదేశాలతోనే నేరం చేసినట్టు బయటపెట్టారని కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు. మంగళవారం వీరిద్దరిని గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి శనివారం వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించగా, చంచల్గూడ జైలుకు తరలించారు. ప్రణీత్రావు దారికి వచ్చాడంటూ... ఈ కేసులో తొలి అరెస్టు ఎస్ఐబీ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్రావుదే. తొలుత పోలీసు విచారణకు అతడు సహకరించలేదని, అయితే రానురాను సహకరిస్తూ కీలక వివరాలు వెల్లడించారని పోలీసులు కోర్టుకు తెలిపారు. ప్రభాకర్రావు రాజీనామా చేసిన రోజే (గత ఏడాది డిసెంబర్ 4న) ఆయన ఆదేశాల మేరకు ప్రణీత్రావు ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న టీఎస్ఎస్పీ హెడ్కానిస్టేబుల్ కైతోజు కృష్ణతో కలిసి ఎస్ఐబీ కార్యాలయంలోకి వెళ్లారు. అక్కడ తాను ఏర్పాటు చేసుకున్న వార్ రూమ్తోపాటు అధికారిక ట్యాపింగ్స్ జరిగే లాగర్ రూమ్ దగ్గర సీసీ కెమెరాలు ఆఫ్ చేయించాడు. వార్రూమ్లోని 17 కంప్యూటర్లలో ఉన్న వాటితోపాటు విడిగా భద్రపరిచిన 50 హార్డ్డిస్క్ లను ధ్వంసం చేయడానికి ఉపక్రమించాడు. తనతో వచ్చిన ఎల్రక్టీషియన్తోపాటు నమ్మినబంటుగా ఉన్న ఓ పోలీసు సహాయంతో ఎలక్ట్రిక్ కట్టర్ వినియోగించి ఈ హార్డ్డిస్క్లు ముక్కలు చేశాడు. వీటి శకలాలను నాగోలు వద్ద మూసీనదిలో పారేశాడు. ఈ విషయాలు వెలుగులోకి రావడంతోనే అప్రమత్తమైన సిట్ అధికారులు మూసీలో సోదాలు చేశారు. వీరికి ధ్వంసమైన హార్డ్డిస్క్ కేసులు 5, హార్డ్డిస్క్ ముక్కలు తొమ్మిది లభించాయి. వీటితో పాటు తాము మూసీ నుంచే ఆరు మెటల్ హార్డ్డిస్క్ ముక్కల్నీ సీజ్ చేశామని కోర్టుకు తెలిపారు. ఎస్ఐబీ కార్యాలయం నుంచి ఆధారాలు ప్రణీత్రావు వాంగ్మూలం ఆధారంగా సిట్ అధికారులు మూసీనది నుంచే కాకుండా గ్రీన్లాండ్స్లోని ఎస్ఐబీ కార్యాలయం, దాని ఆవరణ, పరిసరాల నుంచి కొన్ని ఆధారాలు, భౌతిక సాక్ష్యాలు సేకరించారు. అక్రమ ట్యాపింగ్కు వినియోగించిన 12 కంప్యూటర్లు, 7 సీపీయూలు, ల్యాప్టాప్, మానిటర్లు, పవర్ కేబుళ్లు స్వాదీనం చేసుకున్నారు. అక్కడ ఉన్న ఎలక్ట్రిషియన్ గదిలో క్లూస్, ఫోరెన్సిక్ అధికారులతో కలిసి సోదాలు చేసిన సిట్ హార్డ్డిస్క్లు కట్ చేస్తున్నప్పుడు కింద పడి, మూలలకు చేరిన వాటి పొడిని సీజ్ చేశారు. ఎస్ఐబీ కార్యాలయ ఆవరణలో పాక్షికంగా కాలిన డాక్యుమెంట్లు, స్పైరల్ బైండింగ్ చేసిన పత్రాలతో పాటు సీసీ కెమెరాల ఫుటేజీకి సంబంధించిన లాగ్బుక్ ప్రతులను పోలీసులు సేకరించారు. ఎస్ఐబీ కానిస్టేబుల్ కొత్త నరేష్ గౌడ్ నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. టి.ప్రభాకర్రావు ఆదేశాల మేరకు ప్రతిపక్షాలపై తాము నిఘా పెట్టినట్టు అతడు బయటపెట్టాడు. ప్రధానంగా ప్రైవేట్ వ్యక్తులపై అక్రమ నిఘా ఉంచడంలో భుజంగరావు, తిరుపతన్న కీలకంగా వ్యవహరించారని, ఈ విషయాన్ని వారు అంగీకరించారని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు: రాధాకిషన్ రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అటు రాజకీయంగానూ తీవ్ర దమారం రేపుతోంది. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్తోపాటు బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధానికి తెరదీసింది. తాజాగా ట్యాపింగ్ కేసులో A4గా ఉన్న రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు వెలుగుచూశాయి. 2018 ఎన్నికలు, దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికలు, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు తరలించినట్లు పోలీసుల ఎదుట అంగీకరించారు. 8 సార్లు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తరలించినట్లు ఒప్పుకున్నారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలు మేరకు ఎన్నికల సమయంలో ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ గెలుపు కోసం కొందరు అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు రాధాకిషన్ రావు తెలిపారు. టాస్క్ఫోర్స్లోని సిబ్బందిని బెదిరించి బీఆర్ఎస్ పార్టీకి చెందిన డబ్బులను సరఫరా చేసినట్లు అంగీకరించారు. టాస్క్ఫోర్స్ బృందానికి వాహనాలు సమకూర్చినట్లు ఒప్పుకున్నారు. ఓ ఎమ్మెల్సీ చిన్ననాటి స్నేహితుడు కావడంతో అతడి డబ్బులు తరలించినట్లు పేర్కొన్నారు. 2023లో టాస్క్ఫోర్స్లో పనిచేసిన ఇన్స్పెక్టర్లు, సిబ్బంది డబ్బుల పట్టుకోవడంలో కీలక పాత్ర వహించినట్లు వెల్లడించారు. 8 సార్లు పట్టుకున్న డబ్బు మొత్తం ప్రతిపక్షాలకు చెందినదేనని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా 2018లో శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థి భవ్య సిమెంట్ ఆనంద్ ప్రసాద్ నగదు ప్యారడైజ్ వద్ద 70 లక్షలు సీజ్ చేసినట్లు తెలిపారు. 2020 దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో రఘునంధన్ రావు, ఆయన బందువుల నుంచి కోటి రూపాయలు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ముడుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సహచరుల నుంచిరూ.3.50 కోట్ల స్వాధీనం చేసుకున్నామని రాధకిషన్ రావు చెప్పినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు: మరో కీలక పరిణామం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎస్ఐబీ) ఫోన్ టైపింగ్ కేసులో కీలక పరిమాణం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి అయిన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు అమెరికా నుంచి వస్తున్నట్లు సమాచారం. అమెరికా నుండి రేపు (సోమవారం) హైదరాబాద్కు రానున్న తెలుస్తోంది. ఫోన్ టాపింగ్ కేసులో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావు చుట్టూ.. ఈ కేసు తిరుగుతున్న విషయం తెలిసిందే. ప్రభాకర్ రావును విచారిస్తే సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉంది. ప్రభాకర్ రావు విచారణ అనంతరం బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎస్ఐబీ చీఫ్గా ఉండి ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డ ప్రభాకర్ రావు.. రాజకీయ నేతలు, ప్రముఖులు, వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేశారు. ఇక.. ఇప్పటికే ఈ కేసులో అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్న కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. అదే విధంగా టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్రావుకు సైతం14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. సిట్ అధికారులు రాధాకిషన్రావుతో పాటు భుజంగరావు, తిరుపతన్నలను ప్రధానంగా రెండు కోణాల్లో ప్రశ్నించారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్రావుతో వీరికి ఉన్న సంబంధాలు, ఆయన ఆదేశాల మేరకు చేసిన ఫోన్ ట్యాపింగ్పై ఎక్కువగా దృష్టి పెట్టారు. డీఎస్పీ దుగ్యాల ప్రణీత్రావు నేతృత్వంలోని బృందం సహాయంతో వీరు ప్రతిపక్ష నేతలు, కీలక వ్యక్తులతో పాటు వ్యాపారుల ఫోన్లూ ట్యాప్ చేసి వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నారు. ఈ రకమైన ఆదేశాలు ఎవరు ఇచ్చారు? గుర్తించిన వివరా లను తొలుత ఆ వ్యక్తులకు చెప్పేవారా? అనే కోణాల్లో సిట్ ప్రశ్నించింది. వీరి వేధింపుల నేపథ్యంలో ఓ పార్టీకి వివిధ రూపాల్లో విరా ళాలు ఇవ్వడంతో పాటు ప్రభాకర్రావు, రాధా కిషన్రావు తదితరులకు కప్పం కట్టిన వాళ్లల్లో బడా బిల్డర్లు, జ్యువెలరీ దుకాణాల యజమా నులు, రియల్టర్లతో పాటు హవాలా వ్యాపా రులూ ఉన్నట్టు సిట్ అనుమానిస్తోంది. ఈ ముగ్గురినీ ప్రశ్నించిన సిట్ అధికారులు దీనికి సంబంధించి కీలక సమాచారం సేకరించారని తెలిసింది. రాచకొండ ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లును శుక్రవారం తెల్లవారు జామున విడిచిపెట్టారు. దాదాపు ఆరుగంటల పాటు రాధాకిషన్రావుతో కలిపి గట్టుమల్లును ప్రశ్నించిన సిట్ ఆయన నుంచి వాంగ్మూలం నమోదు చేసింది. ఎస్ఐబీ, టాస్క్ఫోర్స్ల్లో పనిచేసిన అనేక మంది అధికారులు, సిబ్బందినీ సిట్ విచారిస్తూ వారి నుంచి వాంగ్మూలాలు సేకరిస్తోంది. ఇప్పటి వరకు 47మంది నుంచి స్టేట్మెంట్స్ రికార్డు చేశారని సమాచారం. రాధాకిషన్రావు, నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్నలు అక్రమ ఆస్తులు కూడబెట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని ప్రాథమిక ఆధారా లు సేకరించారు. ఈ అంశాలను క్రోడీకరిస్తూ అవినీతి నిరోధక శాఖకు సమాచారమివ్వాలని సిట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వివరాలు అందిన తర్వాత ఏసీబీ అధికారులు ఆదాయా నికి మించిన ఆస్తుల కేసు నమోదు చేయనున్న ట్లు సమాచారం. మరోపక్క అక్ర మ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉండి, అరెస్టు అయిన అధికారుల పూర్వాపరాల ను ఉన్నతా ధికారులు పరిశీలిస్తున్నారు. వీరు గతంలో ఎక్క డెక్కడ పనిచేశారు? ఆయాచోట్ల వీరిపై ఉన్న వివాదాలు ఏంటి? కేసులు ఉన్నా యా? అని ఆరా తీస్తున్నారు. తిరుపతన్నపై పెద్దగా వివాదాల్లేనప్పటికీ.. భుజంగ రావు సర్వీసు మొత్తం అక్రమ దందాలతోనే సాగిందని అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. రాధాకిషన్రావు ఉప్ప ల్ ఏసీపీగా ఉండగా 2013లో చోటు చేసుకున్న యాంజాల్ శ్రీధర్రెడ్డి అలియాస్ ఉప్పల్ వైఎస్సార్ ఆత్మహత్య కేసును అధికా రులు తవ్వుతున్నారు. అప్పటి రామంతాపూర్ కార్పొరేటర్ పరమేశ్వర్రెడ్డితోపాటు రాధా కిషన్రావు వేధింపులతోనే ఉప్పల్ వైఎస్సార్ ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదైంది. 2007లో జరి గిన పరమేశ్వర్రెడ్డి సోదరుడు జగదీశ్వర్రెడ్డి హత్య కేసులో ఉప్పల్ వైఎస్సార్ నిందితుడు. ఇతడు మరికొందరితో కలిసి పరమేశ్వర్రెడ్డికి హత్యకు కుట్ర పన్నిన ఆరోపణలపై ఉప్పల్ వైఎస్సార్ తదితరులను పోలీ సులు 2013 జూన్లో అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి రాధా కిషన్ రావు రూ.10 లక్షల లంచం డిమాండ్ చేసి వేధించడంతోనే ఉప్పల్ వైఎస్సార్ ఆత్మహత్య చేసుకున్నట్టు అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసు ఇప్పటికీ ట్రయల్ పూర్తి కాకపోవడానికి కారణాలను ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసు.. యూఎస్ నుంచి ప్రభాకర్రావు రియాక్షన్ ఇది! -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు, ఎన్స్పెక్టర్ గట్టు మల్లును అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరిని గురువారం హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు విచారిస్తున్నారు. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావుతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. కాగా ప్రణీత్రావుపై కేసు నమోదుకాగానే రాధాకిషన్రావు అమెరికా వెళ్లిపోయారు. లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో హైదరాబాద్కు తిరిగివచ్చారు. ప్రణీత్ రావు డ్రైవర్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభాకర్రావుతో సమానంగా రాధాకిషన్ ట్యాపింగ్కు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేయడంతో రాధాకిషన్ గట్టుమల్లు కీలకపాత్ర వహించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ప్రణీత్రావుతో పాటు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రముఖుల వ్యక్తిగత విషయాలపై వీరు నిఘా పెట్టి, ప్రభుత్వం మారాక హార్డ్డిస్క్లను ధ్వంసం చేసినట్లు ఆరోపణలున్నాయి. మరో వైపు భుజంగరావు, తిరుపతన్నను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై నాంపల్లి కోర్టులో బుధవారం వాదనలు ముగియగా.. న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. చదవండి: ఎస్ఐబీలో నడిచిన ఓఎస్డీల రాజ్యం.. -
ఫోన్ ట్యాపింగ్ కేసు లో ఎమ్మెల్సీ..
-
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో టెలిగ్రాఫ్ చట్టాన్ని జోడించిన అధికారులు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
HYD: ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు పోలీసులు ముమ్మరం చేశారు. 15 మంది అధికారులు చెప్పు చేతుల్లో ఎస్ఐబీ కీలుబొమ్మగా మారింది. అధికారులు ఎస్ఐబి కంట్రోల్ చేసినట్లుగా గుర్తించారు. రిటైర్డ్ ఐజీ ప్రభాకర్రావుతో పాటు ఒక మాజీ డీఐజీ నేతృత్యంలో ఎస్ఐబీ నడిచింది. ముగ్గురు మాజీ ఎస్పీలు, ఐదుగురు అదనపు ఎస్పీల కంట్రోల్లో ఎస్ఐబీ నడిచింది. అదనపు ఎస్పీ భుజంగరావు, తిరుపతన్నను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. రిటైర్డ్ అయిన తర్వాత కూడా ముగ్గురు అదనపు ఎస్పీలు, ఐదుగురు డిఎస్పీలు అక్కడే తిష్ట వేశారు. ప్రణీత రావు నేతృత్వంలో మాజీ అధికారులు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారు. ప్రణీతరావుకి పూర్తిగా ఐదుగురు ఇన్స్పెక్టర్లు సహకరించినట్లు గుర్తించారు. ఎస్ఐబిలో మొత్తం 38 మంది సిబ్బందితో ప్రణీత్రావు లాగర్ రూమ్ నడిపారు. ప్రభాకర్ రావు ఆదేశాలతో పలువురి నంబర్లను ట్రాప్ చేసిన మాజీలు.. రిటైర్డ్ అయిన అధికారులు ఓఎస్డీ పేరుతో ఎస్ఐబీలో చలామణి అయ్యారు. సర్వీస్లో ఉన్న అధికారుల పేర్లతో ఓఎస్డీలు అక్రమాలను సిట్ గుర్తించింది. ప్రణీత్ రావుకి సహకరించిన వారందరినీ విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇదీ చదవండి: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. వెలుగులోకి ఎమ్మెల్సీ పాత్ర -
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. వెలుగులోకి ఎమ్మెల్సీ పాత్ర
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ట్యాపింగ్ టీమ్ అక్రమ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి నిత్యం కొత్త వ్యక్తుల పేర్లు తెరమీదకు వస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారంలో ఓ ఎమ్మెల్సీ పాత్ర ఉన్నట్లు తేలింది. ఎమ్మెల్సీ పాత్రపై సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. ఇజ్రాయిల్లో అధునాతన పరికరాలు కొని హైదరాబాధ్కు రప్పించడంలో ఎమ్మెల్సీ కీలక పాత్ర వహించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఎమ్మెల్సీ తన పలుకుబడితో రవిపాల్తో ట్యాపింగ్ డివైజ్లను తెప్పించినట్లు గుర్తించారు. అదే విధంగా ఎస్ఐబీ కేంద్రంగా అక్రమ ట్యాపింగ్కు పాల్పడిన మాజీ ఓఎస్డీ టి. ప్రభాకర్రావు అండ్ టీమ్ సాగించిన దందాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రతిపక్ష నేతలు, కీలక వ్యక్తులు, వారి కుటుంబీకులపై నిఘా ఉంచడంతో పాటు, ట్యాపింగ్ సందర్భంగా తెలుసుకున్న సమాచారం ఆధారంగా పలు కంపెనీలు, పలువురు రియల్టర్లు, బిల్డర్లు, జ్యువెలర్స్ను బెదిరించి భారీ స్థాయిలో వసూళ్లకు పాల్పడినట్లు సిట్ అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు సైతం లభించినట్లు సమాచారం. చదవండి: ఆ నలుగురూ ఉమ్మడి నల్లగొండలో పనిచేసిన వారే.. మరోవైపు ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో రవిపాల్ కీలకంగా మారారు. ఎస్ఐబీ టెక్నికల్ కన్సల్టెంట్గా ఉన్న రవిపాల్ నేతృత్యంలోనే ట్యాపింగ్ డివైజ్లు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా డివైజ్ను తీసుకొచ్చిన రవిపాల్, ఓ సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో ఇజ్రాయిల్ నుంచి ట్యాపింగ్ డివైజ్లు దిగుమతి చేసినట్లు సమాచారం. ఇందుకు రవిపాల్కు ఎస్ఐబీ కోట్లలో డబ్లులు చెల్లించినట్లు తెలిసింది. రవిపాల్, ప్రభాకర్ కలిసి ఆధునాతన డివైజ్లను దిగుమతి చేసుకున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. 300 మీటర్ల పరిధిలో మాటలను వినే వీలున్న డివైజ్లు తెచ్చిన రవిపాల్ ..రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో ఆఫీస్ తీసుకొని డివైజ్ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. రేవంత్ ఇంట్లో జరిగే ప్రతి విషయన్ని ఎప్పటికప్పుడు ప్రణీత్రావు, రవిపాల్ విన్నారు. ఈ క్రమంలో రవిపాల్ను ప్రశ్నించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. -
ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో కొత్త కోణం..
సాక్షి, హైదరాబాద్: ప్రణీత్ రావుఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త కోణం వెలుగు చూసింది. రియల్ ఎస్టేట్, ఫార్మా, సాఫ్ట్వేర్ కంపెనీ యజమానుల ఫోన్లను ప్రణీత్ ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రతిపక్ష నేతలతో టచ్లోకి వెళ్లిన రాజకీయ, వ్యాపారులను ప్రణీత్రావు గ్యాంగ్ బెదిరించినట్లు తెలిసింది. వ్యాపార వేత్తల వాయిస్ను వారికే వినిపించి బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. ఆడియోలు బయటకు రావొద్దంటే బీఆర్ఎస్ నేతలకు డబ్బులు ఇవ్వాలని ప్రణీత్ రావు డిమాండ్ చేసినట్లు వెల్లడైంది. బెదిరింపు ఆడియోలను వ్యాపారుల ముందు పెట్టి వారిచేత ప్రణీత్ గ్యాంగ్ ఎలక్టోరల్ బాండ్స్ కొనిపించినట్లు గుర్తించారు. కొన్ని సంవత్సరాలుగా వ్యాపారులు అత్యధికంగా బీర్ఎస్కు ఎలక్టోరల్ బాండ్లు కొన్నట్లు తేలింది. చదవండి: ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ కేసు.. రిమాండ్ రిపోర్ట్లో సంచలనాలు మరోవైపు ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో రవిపాల్ కీలకంగా మారారు. ఎస్ఐబీ టెక్నికల్ కన్సల్టెంట్గా ఉన్న రవిపాల్ నేతృత్యంలోనే ట్యాపింగ్ డివైజ్లు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా డివైజ్ను తీసుకొచ్చిన రవిపాల్, ఓ సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో ఇజ్రాయిల్ నుంచి ట్యాపింగ్ డివైజ్లు దిగుమతి చేసినట్లు సమాచారం. ఇందుకు రవిపాల్కు ఎస్ఐబీ కోట్లలో డబ్లులు చెల్లించినట్లు తెలిసింది. రవిపాల్, ప్రభాకర్ కలిసి ఆధునాతన డివైజ్లను దిగుమతి చేసుకున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. 300 మీటర్ల పరిధిలో మాటలను వినే వీలున్న డివైజ్లు తెచ్చిన రవిపాల్ ..రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో ఆఫీస్ తీసుకొని డివైజ్ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. రేవంత్ ఇంట్లో జరిగే ప్రతి విషయన్ని ఎప్పటికప్పుడు ప్రణీత్రావు, రవిపాల్ విన్నారు. ఈ క్రమంలో రవిపాల్ను ప్రశ్నించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. చదవండి: ట్యాపింగ్ కేసులో ముగ్గురికి రిమాండ్ -
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ లీడర్లకు నోటీసులు?
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్రావు కస్టడీ ద్వారా కీలక విషయాల్ని రాబట్టడంలో దర్యాప్తు బృందం దూకుడుగా వ్యవహరించింది. ఏడు రోజుల విచారణలో ఆయన నుంచి ప్రధాన పాత్రధారులెవరనేది దాదాపుగా నిర్ధారించుకున్న అధికారులు.. ఇప్పుడు రాజకీయ నేతలపై ఫోకస్ చేసినట్లు సమాచారం. విచారణ సమయంలో ప్రణీత్రావు పోలీస్ అధికారులతో పాటు పలువురు నేతల పేర్లు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ నేతలకు నోటీసులు ఇచ్చి పశ్నించాలని అధికారులు భావిస్తున్నారు. బీఆర్ఎస్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఇద్దరు నేతలకు నేడో, రేపో నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. తద్వారా ప్రణీత్ చెప్పిన విషయాలకు సంబంధించి వాళ్ల నుంచి సమాచారాన్ని సేకరించాలని.. వాళ్లిచ్చే సమాధానంతో తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రణీత్రావు నడిపించిన ట్యాపింగ్ రాకెట్తో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ ఇప్పటికే బీఆర్ఎస్ కీలక నేతలు కొందరు బహిరంగంగా మీడియా ముందుకు వచ్చారు. ఇక.. ఇప్పటికే ఈ వ్యవహారంలో గత ప్రభుత్వంతో అంటకాగిన మాజీ పోలీస్ బాస్లు పరారీలో ఉండగా.. ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగ్రావు, తిరుపతన్నలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సంగతి తెలిసిందే. -
ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ కేసు.. రిమాండ్ రిపోర్ట్లో సంచలనాలు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రణీత్, భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ రిపోర్ట్ బహిర్గతమైంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్రావు చెబితేనే చేశామని ప్రణీత్, భుజంగరావు, తిరుపతన్న తెలిపారు. 7 రోజుల విచారణలో ప్రణీత్రావు కీలక విషయాలు బయటపెట్టారు. కాగా, ఈ కేసులో ప్రభాకర్రావును ఏ1గా పోలీసులు చేర్చారు. ఏ1 ప్రభాకర్రావు, ఏ2 ప్రణీత్రావు, ఏ3 రాధాకిషన్, ఏ4 భుజంగరావు, ఏ5 తిరుపతన్న, ఏ6 ప్రైవేట్ వ్యక్తి పేరును పోలీసులు చేర్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్రావే కీలక సూత్రధారిగా తేలింది. ప్రభాకర్రావు కనుసన్నల్లోనే ట్యాపింగ్ జరిగినట్లు పోలీసులు నిర్థారించారు. ప్రభాకర్రావు ఆదేశాల మేరకే ట్యాపింగ్ డివైజ్లను ప్రణీత్రావు ధ్వంసం చేశాడు. ప్రణీత్రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెడిపోయిన ట్యాపింగ్ డివైజ్ను పోలీసులు రిట్రీవ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్లో ఏముంది? భుజంగరావు, తిరపతన్న ఇచ్చిన నెంబర్లను ప్రణీత్ ట్యాప్ చేశారు. ఎన్నికల సమయంలో వందలాది రాజకీయ నేతలు, వారి కుటుంబసభ్యుల ఫోన్లను ట్యాప్ చేశానని, రాజకీయ నేతలు కదలికలు, నిధుల సమీకరణపై దృష్టిపెట్టానని ప్రణీత్రావు వెల్లడించాడు. వ్యాపారవేత్తలతో పాటు సమాజంలో పేరు ఉన్న వారి ఫోన్లను కూడా టాప్ చేశాం. ట్యాపింగ్ సంబంధించిన మెయిన్ డివైజ్ని పూర్తిగా ధ్వంసం చేశాను. 17 కంప్యూటర్లలో ఉన్న హార్డ్ డిస్క్లు అన్నిటిని ధ్వంసం చేశాను. హార్డ్ డిస్కులు ప్రధాన డివైజ్ని కట్టర్తో ముక్కలు ముక్కలుగా కట్ చేశాం. ముక్కలుగా చేసిన హార్డ్ డిస్క్లు, డివైజ్లు తీసుకువెళ్లి మూసీ నదిలో పడవేశాం. రెండు లాకర్ రూములలో ఉన్న డాక్యుమెంట్లు అన్నిటిని తగలబెట్టామని ప్రణీత రావు వెల్లడించాడు. బీఆర్ఎస్ కీలక నేత ఇచ్చిన నెంబర్లను ట్యాప్చేశానని.. ప్రణీత్ ఇచ్చిన సమాచారాన్ని బీఆర్ఎస్ కీలక నేతకు చేరవేశామని భుజంగరావు చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు చాలా మంది రాజకీయ నేతల ఫోన్లను కుటుంబ సభ్యుల నెంబర్లను టాప్ చేశామని తెలిపారు. మాజీ టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు ఇచ్చే నంబర్లను ప్రణీత్కి ఇచ్చానని తిరుపతన్న వెల్లడించారు. హైదరాబాద్ సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు డీసీపీ షేర్ చేశాడు. డీసీపీ చెప్పిన నంబర్లతో పాటు కొంతమంది కదలికలను ట్రాక్ చేశామని తిరుపతన్న తెలిపారు. ఇదీ చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రభాకర్రావే కీలక సూత్రధారి -
ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రభాకర్రావే కీలక సూత్రధారి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్రావును ఏ1గా నిందితుడిగా పోలీసులు చేర్చారు. ఏ1 ప్రభాకర్రావు, ఏ2 ప్రణీత్రావు, ఏ3 రాధాకిషన్, ఏ4 భుజంగరావు ఏ5 తిరుపతన్న, ఏ6 ప్రైవేట్ వ్యక్తి పేరును చేర్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్రావే కీలక సూత్రధారి అని పోలీసులు గుర్తించారు. ప్రభాకర్రావు కనుసన్నల్లోనే ట్యాపింగ్ జరిగిందని తెలిపారు. ప్రభాకర్రావు ఆదేశాల మేరకే ట్యాపింగ్ డివైజ్లు ధ్వంసం చేశారు. ప్రభాకర్రావు చెప్పిన మేరకే హార్డ్ డిస్క్లను ప్రణీత్రావు ధ్వంసం చేశాడని చెప్పారు. ప్రణీత్రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెడిపోయిన ట్యాపింగ్ డివైజ్ను పోలీసులు రిట్రీవ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. హార్డ్ డిస్కుల నుంచి సమాచారాన్ని పోలీసులు రిట్రీవ్ చేస్తున్నారు. చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసు: ఇద్దరు అదనపు ఎస్పీలకు రిమాండ్ -
భుజంగరావు, తిరుపతన్నకు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం...
-
ఫోన్ ట్యాపింగ్ కేసు: పోలీసుల అదుపులో ఏఎస్పీ భుజంగరావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా మరో కీలక మలుపు చోటు చేసుకుంది. భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రణీత్ రావుతో కలిసి భుజంగరావు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. భూపాలపల్లి ఏఎస్పీగా ఉన్న భుజంగరావు.. గతంలో తెలంగాణ ఇంటెలిజెన్స్లో పనిచేశారు. రేపు ఆయన్ను న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరు పర్చునున్నారు. ప్రణీత్ రావును, భుజంగరావును శనివారం పోలీసులు ఎనిమిది గంటలపాటు విచారించారు. అనంతరం బంజారాహిల్స్ పోలీస్ పోలీసులు.. భుజంగరావు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రణీత్రావును ఇప్పటికే ఆరు రోజుల పాటు పోలీసులు విచారించారు. రేపు( ఆదివారం) మెజిస్ట్రేట్ ఇంట్లో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రణీత్రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా.. ఎస్ఐబీలో పని చేసిన పలువురు అధికారులు, కానిస్టేబుల్స్ను పిలిచి విచారించారు. మరోవైపు ఎస్ఐబీలో పని చేసిన అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో స్పెషల్ టీమ్ ముందు హాజరయ్యారు. వీరితో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్ఐబీలో పని చేసిన వాళ్లందరినీ విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
Phone Tapping Case: నిఘా ముసుగులో చట్ట వ్యతిరేక పనులు
సాక్షి, హైదరాబాద్: ప్రణీత్రావు విచారణతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారాలకు కర్త, కర్మ, క్రియ.. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్రావే అని దాదాపుగా నిర్ధారణ అయ్యింది. నిఘా ముసుగులో ప్రభాకర్&టీం చట్ట వ్యతిరేక పనులకు పాల్పడినట్లు తేలింది. ఇష్టానుసారం ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్లు చేయడమే కాకుండా.. పెద్ద ఎత్తున్న బ్లాక్ మెయిలింగ్ దందా నడిపి భారీగా సొమ్ములు వసూలు చేసినట్లు తెలుస్తోంది. గత అధికార పార్టీతో అంటకాగిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్రావు.. 2018 నుంచి ప్రతిపక్ష నేతల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేపిస్తూ వచ్చారు. నల్లగొండ ఎస్పీగా ఉన్న టైంలో తనకు నమ్మకంగా ఉన్న కొందరు అధికారులతో ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకున్నారాయన. ప్రధానంగా స్పై పోలీసుల ముఠాలో.. టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావు, భుజంగరావు, తిరుపతన్నలను కీలక సభ్యులుగా చేర్చారు. మరికొందరు పోలీసుల హస్తం కూడా ఉన్నట్లు తేలింది. ఇక.. ట్యాపింగ్, ఇతర నిఘా పరికరాలపై అధ్యయనం కోసం ఇజ్రాయెల్, రష్యాలో సైతం పర్యటించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభాకర్ టీంకు రవి పాల్ సాంకేతిక సహకారం అందించారు. రవిపాల్ సూచన మేరకే సూట్కేసులో పట్టే పరికరంతో ఆనాటి ప్రతిపక్ష నేత ఇళ్ల వద్ద ఎస్ఐబీ టీం మాటు వేసేది. ట్యాపింగ్ ఎంత పక్కాగా జరిగేదంటే.. కేంద్రానికి సమాచారం ఇవ్వకుండా ఉండేందుకు నిబంధనల కన్నా తక్కువ సమయంతో ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించిందా బృందం. మరోవైపు నాటి విపక్ష నేతలే కాకుండా.. వ్యాపారస్తులను సైతం ప్రభాకర్ బృందం టార్గెట్ చేసింది. సుమారు 30 మందికిపైగా వ్యాపారుల ఫోన్లపై నిఘా వేసి.. అక్రమంగా ఫోన్ల ట్యాప్ చేసి బ్లాక్మెయిల్కి సైతం చేసినట్లు తెలుస్తోంది. అలా.. రూ. 500-600 కోట్ల దాకా వసూలు చేసినట్లు వెల్లడైంది. అందుకే ఆయా మాజీ అధికారుల ఆస్తులకు సంబంధించిన వివరాలను సైతం సేకరించే దిశగా తాజా సోదాలు జరిగినట్లు సమాచారం. సంబంధిత వార్త: ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు ప్రణీత్పై వేటుతో అప్రమత్తమై.. ప్రభాకర్రావు తెలంగాణ ఏర్పడ్డాక సీసీఎస్ డీసీపీగా పని చేశారు. 2020లో ఇంటెలిజెన్స్ ఐజీగా పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత అప్పటి ప్రభుత్వం ఓఎస్డీలో బాధ్యతలు అప్పగించింది. గతేడాది ప్రభుత్వం మారాక ఓడీఎస్ పోస్టుకు ప్రభాకర్ రాజీనామా చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎస్ఐబీలో డీఎస్పీగా పని చేసిన ప్రణీత్రావుపై వేటు పడింది. ప్రణీత్రావు ప్రభాకర్రావుకు బంధువు కూడా. వెంటనే ప్రభాకర్రావు అప్రమత్తం అయ్యారు. కుటుంబంతో విహరయాత్ర పేరుతో హైదరాబాద్ దాటారు. అటు నుంచి అటే ఆయన అమెరికా పరారైనట్లు తెలుస్తోంది. ప్రణీత్ రావు నుంచి రాబట్టిన వివరాల ఆధారంగా.. ప్రభాకర్రావు విషయంలోనూ దర్యాప్తు సంస్థ ఓ నిర్ణయం తీసుకునేలా కనిపిస్తోంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు...ఓ మీడియా ఛానల్ ఓనర్ ఇంట్లో సోదాలు
-
ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏకకాలంలో పది చోట్లా.. అదీ మాజీ పోలీస్ అధికారుల ఇళ్లలో పంజాగుట్ట పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రణీత్రావు వెల్లడించిన సమాచారం మేరకే ఈ సోదాలు జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పలువురు అనుమానితుల నివాసాల్లో సోదాలు చేస్తున్నారు పోలీసులు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్రావు ఇంటితో పాటు పలువురు మాజీ అధికారుల ఇళ్లలో సోదాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఓ అధికారి ఇంటి నుంచి 2 లాప్ టాప్ లు, 4 ట్యాబ్ లు, 5 పెన్ డ్రైవ్లు, ఒక హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మాజీ అధికారులతో పాటు మరో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఇద్దరు డీఎస్పీల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. ప్రణీత్రావు ఏడు రోజుల కస్టడీ నేటితో ముగియనుంది. విచారణ అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అలాగే.. ఇప్పటివరకు జరిగిన విచారణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనకు సహకరించిన వారి అందరి పేర్లు ప్రణీత్ రావు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రణీత్రావు ఇచ్చిన స్టేట్మెంట్ను ఇవాళ కోర్టుకు సమర్పించనుంది దర్యాప్తు చేస్తున్న స్పెషల్ టీం. -
ఇజ్రాయెల్ నుంచి ఎలా వచ్చాయి?
సాక్షి, హైదరాబాద్: అప్పటి ఎస్ఐబీ చీఫ్ ‘టి.ప్రభాకర్రావు అండ్ టీమ్’ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక ఉపకరణాలకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ (ఎంహెచ్ఏ) అనుమతి ఉందా? లేదా? అనే అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. వీటిని ఖరీదు చేయడానికి ఏ బడ్జెట్ నుంచి నిధులు వెచ్చించారనేదిపై కూడా స్పష్టత లేదు. మరోపక్క సిట్ కస్టడీలో ఉన్న ఎస్ఐబీ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్రావును అధికారులు ఆరో రోజైన శుక్రవారం ప్రశ్నించారు. ఈయన పోలీసు కస్టడీ గడువు శనివారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే మరికొన్ని రోజుల కస్టడీ కోరాలా? వద్దా? అనే దానిపై ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి ఉగ్రవాదులు, మావోయిస్టులపై నిఘా, ఆపరేషన్లు చేయడానికి ప్రతీరాష్ట్రం ప్రత్యేకంగా విభాగాలను ఏర్పాటు చేసుకుంటాయి. రాష్ట్రంలో మావోయిస్టులపై నిఘాకు ఎస్ఐబీ, ఉగ్రవాదుల కదలికలపై కన్నేసి ఉంచడానికి కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ పనిచేస్తుంటాయి. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లకు గ్రేహౌండ్స్, ఉగ్రవాదులపై పోరాడటానికి ఆక్టోపస్ ఉన్నాయి. ఈ విభాగాలు ఎప్పటికప్పుడు అప్డేట్, అప్గ్రేడ్ అవుతాయి. దీనికోసం దేశవిదేశాల్లో అందుబాటులోకి వచి్చన అత్యాధునిక పరికరాలు, ఉపకరణాలను ఖరీదు చేస్తాయి. కొన్నింటిని దేశంలోని వివిధ నగరాల్లో ఉన్న లైసెన్డ్స్ ఏజెన్సీల నుంచి, మరికొన్ని కన్సల్టెంట్స్ ద్వారా విదేశాల నుంచి కొనుగోలు చేస్తాయి. ఇది అన్ని విభాగాల్లోనే జరిగే నిరంతర ప్రక్రియే. అయితే అనుమతి లేదా సమాచారం శాంతిభద్రతల పరిరక్షణ అనేది రాష్ట్రపరిధిలోని అంశమే. దీంతో భద్రతాపరమైన ఏర్పాట్లకు రాష్ట్ర పోలీసు, నిఘా విభాగాలు కొన్ని ఉపకరణాలను సమీకరించుకుంటాయి. అయితే వీటికి సంబంధించిన సమాచారం మొత్తం కేంద్ర హోం మంత్రిత్వశాఖకు తెలియాల్సిందే. ఈ విషయంలో రాష్ట్రాలు రెండు విధానాలను పాటిస్తాయి. అత్యవసరమైనప్పుడు దేశంలోని వివిధ ఏజెన్సీల నుంచి ఉపకరణాలను ఖరీదు చేస్తాయి. ఆపై పోస్ట్ ఫ్యాక్టో విధానం అనుసరిస్తూ కేంద్ర హోంమంత్రిత్వశాఖ (ఎంహెచ్ఏ)కు సమాచారం ఇస్తాయి. విదేశాల నుంచి ఏదైనా దిగుమతి చేసుకోవాలంటే దానికి కొంత సమయం ముందు నుంచే కసరత్తు మొదలవుతుంది. ఇది అత్యవసరంగా జరిగేది కాదు. దీంతో కచి్చతంగా ముందు అనుమతి తీసుకోవాల్సిందే. బ్యూరో ఆఫ్ పోలీసు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (బీపీఆర్అండ్డీ) ద్వారా ఎంహెచ్ఏలో ఉండే స్పెషల్ సెక్రటరీ (ఇంటర్నల్ సెక్యూరిటీ) నుంచి అనుమతి పొందాలి. ట్యాపింగ్ వంటి ఉపకరణాలు, పరికరాలు విషయంలో ఇది తప్పనిసరిగా అమలు కావాల్సిందే. నిధుల విషయంలో ఏదీ స్పష్టత ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు, రియల్టర్లు తదితరులను టార్గెట్ చేయడానికి 2018లో ఎస్ఐబీ ఇజ్రాయెల్ నుంచి అత్యాధునిక ఉపకరణాల ఖరీదుకు ముందు కేంద్రం నుంచి అనుమతి, పోస్ట్ ఫ్యాక్టో సమాచారం ఇచ్చినట్టు ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు చెబుతున్నారు. ఇలాంటివి ఏమీ లేకుండా అక్రమంగా ట్యాపింగ్ ఉపకరణాలను దిగుమతి చేసుకుంటే బాధ్యులపై ఎంహెచ్ఏ కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేస్తున్నారు. మరోపక్క వీటిని ఖరీదు చేయడానికి ఏ నిధులు వాడారు? ఎంత వెచ్చించారు? తదితర అంశాలను లోతుగా ఆరా తీస్తున్నారు. ఎంహెచ్ఏకు చెందిన ఓ మాజీ అధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘సాధారణంగా ఇలాంటివి అక్రమంగానే దిగుమతి అవుతాయి. రాజకీయ పార్టీల ప్రోద్బలంతో విదేశాల్లో ఉన్న వారి సానుభూతిపరుల నుంచి నిధులు సమీకరిస్తారు. అలా వచ్చిన డబ్బుతో వీటిని కొంటారు. రాష్ట్రంలో ఉన్న డమ్మీ కంపెనీల పేర్లతో, వాటికి సంబంధించిన ఉపకరణాలని చెబుతూ దిగుమతి చేసుకుంటారు. వివాదాస్పదమైనప్పుడే వీటిపై దృష్టి పడుతుంది’అని వివరించారు. మీడియా చానల్ అధినేత ఇంట్లో సోదాలు ఎస్ఐబీ కేంద్రంగా జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉచ్చు ఓ మీడియా చానల్ అధినేతకు చుట్టుకుంది. మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్రావుకు ఇన్ఫార్మర్గా వ్యవహరించినట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. శుక్రవారం రాత్రి సిట్ అధికారులు జూబ్లీహిల్స్ రోడ్ నెం.78లోని ఆయన ఇంట్లో సోదాలు చేశారు. ప్రణీత్రావు అరెస్టు తర్వాత ఈ మీడియా అధినేత అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలిసింది. ఇతడికి ప్రణీత్రావుకు మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్కు సంబంధించిన స్క్రీన్ షాట్లు ఇప్పటికే సిట్కు లభించాయి. ఎన్నికల నేపథ్యంలో రాజకీయనేతల ఆర్థిక లావాదేవీలపై కన్నేసిన ప్రణీత్కు ఈ మీడియా అధినేత సహకరించారన్నది ప్రధాన ఆరోపణ. ఈ వ్యక్తి అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్రెడ్డితో పాటు ఆయన కుటుంబీకులు, వీరికి అండగా నిలుస్తున్న వారి వివరాలను తన నెట్వర్క్ ద్వారా సేకరించి ప్రణీత్కు అందించారు. అక్రమ ట్యాపింగ్ ఉపకరణాన్ని ప్రణీత్రావు కొన్ని రోజులు ఈ మీడియా చానల్లో ఉంచి కథ నడిపిట్టు ఆరోపణలు ఉన్నాయి. మరోపక్క వీరు బెదిరింపులు, వసూళ్లకు పాల్పడినట్టు సిట్ ఆధారాలు సేకరించింది. -
ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పరార్!
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఫోన్లు టాప్ చేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణీత్ రావు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్లో ప్రణీత్కు అండగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాకర్రావు ఆదేశాల మేరకే తాను సమాచారాన్ని ధ్వంసం చేశానని ప్రణీత్రావు వెల్లడించిన సంగతి తెలిసిందే. 2018 నుంచే అక్రమ ట్యాపింగ్ దందా మొదలైనట్లు పోలీసులు గుర్తించారు. ఇజ్రాయిల్ నుంచి అత్యాధునిక ఉపకరణాలు ఖరీదు చేయగా, రామ్ గోపాల్ కన్సల్టెంట్, అడ్వైజర్గా వ్యవహరించారు. ఆదిలాబాద్ ఘర్షణ సమయంలో అక్కడ వినియోగించినట్లు గుర్తించారు. ప్రణీత్రావు కేసులో మరో నలుగురికి నోటీసులు జారీ చేశారు. కాగా, మాజీ ఐపీఎస్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్రావు బంధువే ఈ ప్రణీత్ రావు. ప్రణీత్ కెరీర్లో అడుగడుగునా ప్రభాకర్ రావు అండగా ఉన్నట్లు సమాచారం. ప్రభాకర్ రావు నల్గొండ ఎస్పీగా ఉన్నప్పుడే ప్రణీత్ ప్రొబేషన్ క్లియరెన్స్ అయ్యింది. అలాగే.. ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్ కాగానే.. ప్రణీత్కు ఎస్ఐబీలో పోస్టింగ్ లభించింది. ఇదిలా ఉంటే.. ఎస్ఐబీలో ఉన్న ఇతర ఇన్స్పెక్టర్లను కాదని ప్రణీత్ను వెనకేసుకొచ్చాని ప్రభాకర్పై ఆరోపణలు కూడా ఉన్నాయి. అందులో భాగంగానే నిబంధనలకు విరుద్దంగా ప్రణీత్కు డీఎస్పీగా ప్రమోషన్ ఇప్పించారని ప్రభాకర్ బలమైన ఆరోపణ కూడా ఒకటి ఉండడం గమనార్హం. -
ప్రణీత్ రావు పిటిషన్ ను కొట్టేసిన తెలంగాణ హై కోర్ట్
-
ప్రణీత్రావు పిటిషన్లో తీర్పు రిజర్వు
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం తన విచారణ జరగడం లేదంటూ మాజీ డీఎస్పీ ప్రణీత్రావు దాఖలు చేసిన పిటిషన్లో వాదనలు ముగించిన హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. కస్టడీ సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శ కాలను పాటించడం లేదని, పీఎస్లో నిద్రపోవడానికి సరైన సౌకర్యాలు లేవని, విచారణ పూర్తయిన తర్వాత తిరిగి జైలుకు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరడంతోపాటు పోలీస్ కస్టడీ ఇస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రణీత్ హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్రావు వాదనలు వినిపిస్తూ.. ‘24 గంటలూ ప్రణీత్రావును పోలీసులు విచారిస్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాల్సి ఉన్నా.. దాన్ని పాటించడంలేదు. ప్రణీత్ పరువుకునష్టం కలిగించేలా అధికారులు వివరాలు మీడియాకు లీక్ చేస్తున్నారు’ అని చెప్పారు. అనంతరం పీపీ పల్లె నాగేశ్వర్రావు వాదిస్తూ.. ‘పిటిషనర్ న్యాయవాది వాదనలు సరికాదు. 2023లో అక్రమంగా ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారు. ఇది చాలా తీవ్ర నేరం. నిబంధనల మేరకే ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేస్తోంది. సాక్ష్యాలను అందించేందుకే రమేశ్ విచారణ జరిగే ప్రాంతానికి వచ్చారు తప్ప.. విచారణలో పాల్గొనలేదు’ అని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తీర్పును రిజర్వు చేశారు. గురువారం తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు... వెలుగులోకి సంచలన నిజాలు
-
Praneeth Rao: ట్యాపింగ్ తీగ లాగితే..
హైదరాబాద్: మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నాలుగో రోజు విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా ప్రణీత్ రావు నుంచి కీలక విషయాలు రాబడుతోంది దర్యాప్తు బృందం. ఈ క్రమంలో ప్రణీత్ రావు మరికొందరు అధికారుల పేర్లను వెల్లడించినట్లు తెలుస్తోంది. దీంతో.. ఆ అధికారులకు నోటీసులు ఇచ్చి, వారిని విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇక విచారణలో ప్రణీత్ రావు..ఫోన్ ట్యాపింగ్ కోసం విదేశాల నుంచి ప్రత్యేక సాఫ్ట్ వేర్, పరికరాలు తీసుకువచ్చి వాడినట్టు ఒప్పుకన్నారు. అయితే టెలిఫోన్ సర్వీసులకు సంబంధం లేకుండా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డట్టు గుర్తించారు. అందుకోసం విదేశాల నుంచి ప్రత్యేక సాఫ్ట్ వేర్ తెప్పించింది ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కానీ ప్రణీత్ రావు మాత్రం విచారణ ఈ ఫోన్ ట్యాపింగ్ అధికారుల ఆదేశాల మేరకు చేశానని చెబుతుండటం గమనార్హం. దీంతో ఈ కేసులో మరొకందరిక నోటీసులు, కీలక అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ట్యాపింగ్ కేసు నిందితుడు ప్రణీత్రావు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఇవాళ విచారణ జరగనుంది. కస్టడీ విషయంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించడం లేదని.. కస్టడీ ముగిసిన వెంటనే జైలుకు తరలించేలా ఆదేశాలివ్వాలని పిటిషన్లో ఆయన పేర్కొన్నారు. అలాగే.. తనకు సరైన సదుపాయాలు కల్పించడం లేదంటూ పిటిషన్లో ఆరోపించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇప్పటికే పోలీసుల నుంచి వివరణ కోరింది. మరోవైపు.. తనను దర్యాప్తు చేస్తున్న టీంలో ఇంటలిజెన్స్ అధికారులతో పాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు, అలాగే SIB అడిషనల్ ఎస్పీ రమేష్ విచారణలో పాల్గొనకుండా ఆదేశాలు ఇవ్వాలని ప్రణీత్ రావు కోరడం గమనార్హం. -
ప్రణీత్రావు విచారణలో వెలుగులోకి సంచలనాలు
సాక్షి, హైదరాబాద్: మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు వ్యవహారంలో విచారణ కొనసాగుతోంది. ఎస్ఐబీలోని టాపింగ్ డివైజ్ మొత్తాన్ని ప్రణీత్రావు ధ్వంసం చేసినట్లు గుర్తించారు. మరోసారి పనికిరాకుండా.. డివైజ్ను ధ్వంసం చేసి అందులో హార్డ్ డిస్క్ మొత్తాన్ని పగలగొట్టినట్లు తేలింది. అడవుల్లో పడేసిన డివైజ్లను స్వాధీన పరుచుకునేందుకు పోలీసుల ప్రయత్నిస్తున్నారు. మరో వైపు ప్రణీత్రావు వెనకాల మీడియా సంస్థ యజమాని ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక మీడియా సంస్థ యజమాని ఇచ్చిన నెంబర్లను ట్యాప్ చేసిన ప్రణీత్ రావు.. ఆ మీడియా సంస్థ యజమాని దగ్గర ఏకంగా ఒక సర్వర్ పెట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. మరొక రెండు సర్వర్ లను రెండు చోట్ల పెట్టినట్లు గుర్తించారు. వరంగల్తో పాటు సిరిసిల్లలో సర్వర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడైంది. బీఆర్ఎస్ కీలక నేత ఆదేశాలతో ప్రణీత్ రావు సర్వర్లు ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఇదీ చదవండి: ‘ఫోన్ ట్యాపింగ్ తెలియదు.. వార్ రూమ్ తెలియదు’ -
‘ఫోన్ ట్యాపింగ్ తెలియదు.. వార్ రూమ్ తెలియదు’
హన్మకొండ: తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి పలువురు నేతలు కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్న నేపథ్యంలో ఎర్రబెల్లి కూడా పార్టీ మారనున్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. కేసీఆర్ సారథ్యంలో పార్టీ కోసం ఒక సైనికుడిగా పనిచేస్తానని తెలిపారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం ఓ ఫేక్ అని స్పష్టం చేశారు. మంగళవారం ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. ‘నా రాజకీయ జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను. ప్రణీత్ రావు ఎవరో కుడా తెలియదు. ఆయన అమ్మమ్మ ఊరు పర్వతగిరి. నా పేరు చెప్పాలని ప్రణీత్రావు మీద ఒత్తిడి తెస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ తెలియదు.. వార్ రూమ్ కూడా నాకు తెలియదు. చాలా మంది నాయకులు పార్టీ వీడి పోతున్నారు. బిజినెస్, ల్యాండ్ దందాలు, తప్పుడు పనులు చేసేవారు అధికార పార్టీలోకి పోతున్నారు. కాంగ్రెస్ వంద రోజుల పాలన ఫెయిల్ అయిందని ప్రజలు అనుకుంటున్నారు. ఆరు గ్యారంటిలు అమలు చేయలేరు. ఎన్నికల కోసమే డ్రామా చేశారు. కేసీఆర్ పెట్టిన పథకాలు కూడా అమలు చేయట్లేరు. మాయ మాటలు చెప్పడం, మోసాలు చేయడం సీఎం రేవంత్రెడ్డికి అలవాటే. నీళ్లు లేవు.. పంటలు ఎండిపోతున్నాయి. మండే వేసవిలో కూడా చెరువులు నింపిన మహానుభావుడు కేసీఆర్. కార్యకర్తలు ధైర్యంగా ఉండండి, నాయకులు పోయినంత మాత్రాన ఏమీ కాదు. కార్యకర్తలు మీద తప్పుడు కేసులు పెడితే మేము పోలీస్ స్టేషన్లో కూర్చుంటాం. బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుందాం.. గెలుపు, ఓటములు సహజం. ఎన్టీఆర్ లాంటి నాయకునికి కూడా ఓటమి తప్పలేదు’అని ఎర్రబెల్లి అన్నారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజం ఒప్పుకున్న ప్రణీత్
-
అసలు టార్గెట్ ట్యాపింగ్ కాదా?
సాక్షి, హైదరాబాద్: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కార్యాలయం కేంద్రంగా డీఎస్పీ ‘ప్రణీత్రావు అండ్ కో’ అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి సీఎం రేవంత్రెడ్డి సహా అనేక మంది ఫోన్లను ట్యాప్ చేశారు... ఈ నెల తొలి వారం నుంచి పోలీసులు లీకుల రూపంలో చెబు తున్న అంశం ఇది. అయితే పంజగుట్ట ఠాణాలో నమోదైన ప్రణీత్ కేసు, ఆయన రిమాండ్ రిపోర్టులో ఎక్కడా ట్యాపింగ్ నేరానికి సంబంధించిన చట్టం ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో సిట్ దర్యాప్తు టార్గెట్ వేరే ఉందా? అనే అనుమానాలు కలు గుతున్నా యి. ప్రణీత్ వారం రోజుల కస్టడీ దేనికోసమో అంతు చిక్క ట్లేదు. కేసులో ఒక్కటి మినహా అన్నీ బెయిలబుల్ సెక్షన్లే. ఏపీలో నమోదైన ‘స్కిల్డెవల ప్మెంట్’ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లడానికి కారణమైన ఐపీసీలోని 409సెక్షన్ ఈ కేసులోనూ ఉండటంతో ప్రణీత్ జ్యుడీషియల్ రిమాండ్కు వెళ్లాడని నిపుణులు చెప్తున్నారు. సస్పెన్షన్ ఉత్తర్వుల్లో అస్పష్టంగా.. ఎస్ఐబీలో అంతర్భాగమైన స్పెషల్ ఆపరే షన్స్ టార్గెట్ (ఎస్ఓటీ) బృందానికి నేతృత్వం వహించిన ప్రణీత్.. ప్రభుత్వం మారిన తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఎస్ఐబీ అంతర్గత విచారణలో ఆయన చేసిన అవక తవకలు వెలుగులోకి వచ్చాయి. ఈ విభాగాధిపతి ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రణీత్ను సస్పెండ్ చేస్తూ డీజీపీ ఈ నెల మొదటి వారంలో ఉత్తర్వులు జారీ చేశారు. వీటిలో కొంత వరకు ట్యాపింగ్కు సంబంధించిన ఆరోపణలున్నాయి. ఎస్ఓ టీకి ఉద్దేశించిన లీజ్డ్ లైన్, ఇంటర్నెట్ కనెక్షన్లను ప్రణీత్ దుర్వినియోగం చేశారని అందులో ఆరోపించారు. అందులోనే 42 హార్డ్డిస్క్లు మార్చేయడం, ధ్వంసం చేయడం అంశాన్నీ ప్రస్తావించారు. ఈ సస్పెన్షన్ జరిగిన వారం తర్వాత ఎస్ఐబీ ఏఎస్పీ ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసుస్టేషన్లో ప్రణీత్, ఇతరులపై కేసు నమోదైంది. ఆ రెంటిలో కనిపించని ప్రస్తావన... ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో పోలీసులు మూడు చట్టాల్లోని 9 సెక్షన్ల కింద అభియోగాలు చేశారు. ఐపీసీ, ఐటీ, ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక (పీడీపీపీ) చట్టంలోని సెక్షన్లు వాడారు. ఈ నెల 13న అధికారులు న్యాయస్థానంలో రిమాండ్ కేసు డైరీని సమర్పించారు. ఇందులో ఓ సెక్షన్ తగ్గించి ఎనిమిదింటి కిందే ఆరోపణలు చేశారు. ఎఫ్ఐఆర్లో ఐపీసీలోని 120బీ (కుట్ర) ఉండగా... రిమాండ్ రిపోర్టులో ఈ సెక్షన్ కనిపించలేదు. సెక్షన్ 34 చేర్చినప్పుడు 120బీ ఉండాల్సిన అవసరం లేదని, ఈ నేపథ్యంలోనే రిమాండ్ రిపోర్టులో తొలగించి ఉంటారని కొందరు చెబుతున్నారు. అయితే ఓ నిందితుడిపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేయాలంటే కచ్చితంగా టెలిగ్రాఫిక్ యాక్ట్ను జోడించాలి. అయితే ఎఫ్ఐఆర్, రిమాండ్ కేసు డైరీ రెండింటిలోనూ ఎక్కడా ప్రత్యక్షంగా ట్యాపింగ్ ప్రస్తావన, ఈ యాక్ట్ కనిపించకపోవడం గమనార్హం. ఆ అధికారులూ బాధ్యతులే అవుతారు... ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అధికారులు అంగీకరిస్తున్నప్పటికీ కేసులో దీన్ని ప్రస్తావించకపోవడం వెనుక బలమైన కారణాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఫోన్లను అనధికారికంగా ట్యాప్ చేయడం చాలా ఖరీదుతో కూడిన అంశం. అధికారికంగా ట్యాప్ చేయాలంటే సంబంధిత సర్వీస్ ప్రొవైడర్ సహకారం అనివార్యం. దీనికోసం పోలీసు విభాగం వారికి లేఖ రాయాల్సి ఉంటుంది. ఇది డీఎస్పీ ప్రణీత్ వద్ద నుంచే వచ్చి... ఎస్పీ సహా కొందరు ఉన్నతాధికారులు ఫార్వర్డ్ చేయాలి. ఈ లేఖలు సర్వీస్ ప్రొవైడర్ వద్ద నిర్ణీత కాలం వరకు భద్రంగా ఉండాలి. ట్యాపింగ్ కోణంలో దర్యాప్తు చేస్తే ఆధారాలు సేకరించడం, తదుపరి చర్యలు తీసుకోవడం తేలికే అయినప్పటికీ... అప్పట్లో లేఖలు ఫార్వర్డ్ చేసి, ప్రస్తుతం ఉన్నత స్థానంలో ఉన్న కొందరు అధికారులకు నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. అసలు లేఖలే లేకుండా లేదా ప్రాపర్ చానల్లో రాకుండా ట్యాపింగ్కు సహకరిస్తే సర్వీస్ ప్రొవైడర్ తీవ్ర ఇబ్బందుల్లో పడతాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అధికారికంగా ఎక్కడా ట్యాపింగ్ ప్రస్తావన నేరుగా తీసుకురాకుండా కేసు దర్యాప్తు చేస్తున్నారు. దీని టార్గెట్ వేరేది ఏదో ఉంటుందని, అది తెలియాలంటే మరికొన్నాళ్లు పడుతుందని కొందరు అధికారులు చెబుతున్నారు. -
మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు రెండో రోజు కస్టడీ విచారణ
-
ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రణీత్ కు స్పెషల్ ఇంటర్నెట్ కనెక్షన్
-
రేవంత్ రెడ్డిపై స్పెషల్ ఫోకస్..
-
ప్రణీత్రావుతో చాటింగ్ చేసిన బీఆర్ఎస్ ముఖ్యనేత?
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టై.. విచారణ ఎదుర్కొంటున్న ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రణీత్రావు ఫోన్లను సీజ్ చేసిన స్పెషల్ టీం.. ఆ ఫోన్లలోని వాట్సాప్ ఛాటింగ్లను రిట్రీవ్(డిలీట్ చేసిన సమాచారాన్ని సేకరించడం) చేసినట్లు తెలుస్తోంది. ఈ వాట్సాప్ సంభాషణలనే కీలకంగా భావిస్తూ.. దర్యాప్తులో ముందుకెళ్లాలని భావిస్తోంది. ప్రణీత్రావు ఛాటింగ్లో ఓ బీఆర్ఎస్ ముఖ్యనేత పేరు ప్రముఖంగా ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ నేత ఇచ్చిన సూచనల మేరకే ప్రణీత్ కొంత మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు విచారణ బృందం గుర్తించింది. బీఆర్ఎస్కు చెందిన ఆ ముఖ్యనేత వంద ఫోన్ నెంబర్లు ప్రణీత్ రావు ఇచ్చారని.. ఆయా వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేయాలని ప్రణీత్రావును ఆదేశించారని తెలుస్తోంది. .. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డిని ఎవరెవరు కలుస్తున్నారు?.. ఎక్కడ కలుస్తున్నారు? అనే వివరాల్ని ఆ బీఆర్ఎస్ నేత ప్రణీత్రావు నుంచి కోరినట్లు సమాచారం. ఈ క్రమంలో రేవంత్రెడ్డి సోదరులు, అనుచరులతో పాటు చుట్టుపక్కల ఉన్నవాళ్ల ఫోన్లను సైతం ప్రణీత్రావు ట్యాప్ చేశారు. అంతేకాదు ట్యాపింగ్ చేసిన ఆ సమాచారాన్ని రాత్రికి రాత్రే ప్రణీత్రావు ఆ బీఆర్ఎస్ పెద్దకు చేరవేసినట్లు దర్యాప్తు బృందం గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో.. ప్రణీత్రావు గతంలో చెప్పిన పోలీసు అధికారులతో(మాజీలు) పాటు సదరు బీఆర్ఎస్ ముఖ్య నేతను సైతం విచారణ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు అసలు ఆ ముఖ్యనేత ఎవరు? అనే ఆసక్తి సర్వత్రా ఇప్పుడు నెలకొంది. -
ప్రజా ప్రతినిధులు, అధికారుల ఫోన్ల ట్యాప్ చేశాను: ప్రణీత్
-
Phone Tapping Case: కీలక విషయాలు వెల్లడించిన ప్రణీత్రావు
సాక్షి, హైదరాబాద్: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) ప్రణీత్ రావు అరెస్టులో కీలక విషయాలు వెలుగు చూశాయి. అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాను ఫోన్ ట్యాపింగ్లు చేశానని, ఆ సమాచారాన్ని ధ్వంసం కూడా చేశానని ఆయన వెల్లడించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ని మరోసారి కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాలని స్పెషల్ టీం భావిస్తోంది. ‘‘అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా, రియల్ ఎస్టేట్ పెద్దల ఫోన్లను ట్యాప్ చేశా. పూర్తి సమాచారాన్ని అప్పటి ఎస్పీ స్థాయి అధికారుల నుంచి ఎస్ఐబీ చీఫ్ దాకా ఆ సమాచారం అందజేశాను. కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారుల కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశా. చాలామంది అధికారులు, ప్రజాప్రతినిధుల వాట్సాప్ ఛాటింగ్లపై నిఘా పెట్టాను.. .. ఫోన్ ట్యాపింగ్ సమాచారాన్ని అధికారులకు ఇచ్చాను. అప్పటి ఎస్ఐబీ మాజీ చీఫ్ ఆదేశాల మేరకు ఆ సమాచారం మొత్తం ధ్వంసం చేశా. సెల్ఫోన్లు, హార్డ్ డిస్కులతో పాటు వేల సంఖ్యలో పత్రాలు ధ్వంసం చేశాను’’ అని ప్రణీత్రావు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం 14 రోజుల రిమాండ్ మీద చంచల్గూడ జైల్లో ఉన్న ప్రణీత్రావును మరోసారి విచారించేందుకు ప్రత్యేక టీం నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసింది. ఆయన్ని వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్లో కోరినట్లు తెలుస్తోంది. ఇక ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంతో.. ఎస్ఐబీ మాజీ చీఫ్ తో పాటు పలువురు ఎస్పీ, డీఎస్పీలను విచారించేందుకు సిద్ధమవుతోంది. -
ప్రణీత్ రావు ఇంట్లో సోదాలు
-
ప్రణీత్రావుకు 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్
సాక్షి, హైదరాబాద్: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ డీఎస్పీ ప్రణీత్రావును పోలీసులు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బుధవారం పంజాగుట్ట పోలీసులు.. ప్రణీత్రావును న్యాయముర్తి ముందు ప్రవేశ పెట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావుకు న్యాయమూర్తి ఈ నెల 26 వరకు రిమాండ్ విధించారు. అనంతరం ఆయన్ను పంజాగుట్ట పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. ఎస్ఐబీలోని హర్డ్ డిస్క్లు ధ్వంసం, రికార్డుల మాయం వ్యవహారంలో పంజాగుట్ట పోలీస్స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. ఎస్ఐబీ, ఎడిషనల్ ఎస్పీ రమేశ్ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద ప్రణీత్ రావుతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రణీత్రావు సెల్ ఫోన్ సీజ్ చేసిన పోలీసులు.. వాట్సాప్ చాటింగ్, కాల్ డీటెయిల్స్, డేటా రీట్రీవ్ చేయనున్నారు. ప్రణీత్రావు ఎవరి ఫోన్లు టాపింగ్ చేశాడనే సమాచారాన్ని పోలీసులు రాబడుతున్నట్లు తెలుస్తోంది. -
ప్రణీత్ రావు కేసు..ప్రత్యేక టీంకు బదిలీ
-
మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్
-
ప్రణీత్రావు విచారణ కోసం స్పెషల్ టీం
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ కేసుతో వార్తల్లోకి ఎక్కిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. అయితే.. ఈ కేసు విచారణ కోసం ఇప్పుడు ప్రత్యేక బృందం ఏర్పాటైంది. జూబ్లీహిల్స్ ఏసీపీ నేతృత్వంలోని ఈ బృందం.. ప్రణీత్రావును విచారణ చేపట్టి.. ఆ వివరాలతో సహా ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రణీత్రావును మంగళవారం రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయన నివాసంలోనే పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రికిరాత్రి ఆయన్ని హైదరాబాద్కు తరలించారు. ఇక.. ఎస్ఐబీ లాగర్ రూమ్లో హార్డ్డిస్క్లు ధ్వంసం చేసిన తర్వాత నుంచి ప్రణీత్రావు పక్కా ప్లాన్తో వ్యవహరించినట్లు తెలిసింది. గత నెలలో రాజన్న సిరిసిల్ల జిల్లా డీసీఆర్బీలో రిపోర్ట్ చేశారు. అక్కడ జాయిన్ అయిన రెండు రోజులకే సిక్ లీవ్ పెట్టినట్లు సమాచారం. సస్పెన్షన్కు వారం రోజుల ముందు నుంచే డీసీఆర్బీకి వెళ్లలేదని సమాచారం. సిరిసిల్ల హెడ్క్వార్టర్ను విడిచి వెళ్లరాదని సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొనప్పటికీ ఆయన తప్పించుకుని తిరుగుతున్నట్లు తేలింది. ఈ క్రమంలోనే ప్రణీత్రావు కోసం శ్రీనగర్ కాలనీలోని ఇంటి వద్ద పోలీసులు నిఘా పెట్టారు. ఇదీ చదవండి: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నాడు.. ప్రణీత్రావు చేసిన నిర్వాకమిది! మంగళవారం రాత్రి ప్రణీత్ రావు ఇంటికి వచ్చిన విషయం గుర్తించి దాడి చేసి, ఆయనను అరెస్టు చేశారు. ఆయన వద్ద ఉన్న సెల్ ఫోన్లను సీజ్ చేశారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి ప్రణీత్రావును హైదరాబాద్కు తరలించారు. స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన అనంతరమే ఆయన్ని నాంపల్లి కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. ఎస్ఐబీలో కీలక సమాచారాన్ని ధ్వంసం చేశారనే ఆరోపణలపై.. ఎస్ఐబీ అడిషనల్ ఎస్పీ రమేశ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదైన సైతం అయ్యింది. అంతకు ముందు.. ఆయన పోలీసుల అదుపులోనే రహస్య ప్రదేశంలో ఉన్నారని.. విచారణ జరుగుతోందన్న ప్రచారం నడిచింది. అయితే ప్రణీత్ రావు కోసం రెండ్రోజులుగా పంజాగుట్ట పోలీసులు సిరిసిల్లలోనే మకాం వేసినట్లు ఇప్పుడు తేలింది. ప్రణీత్రావుతో పాటు ఆయనకు సహకరించిన పలువురు అధికారుల్ని సైతం ప్రత్యేక టీం విచారణ చేపట్టే అవకాశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. -
ప్రణీత్రావు బాగోతం.. ప్రభుత్వానికి కీలక నివేదిక
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్రావు వ్యవహారంపై ప్రభుత్వానికి అధికారులు నివేదిక ఇచ్చారు. అసెంబ్లీ ఫలితాలు వెలువడిన రోజు రాత్రి సీసీ కెమెరాలు ఆఫ్ చేసి 45 హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసినట్లు నివేదికలో స్పష్టం చేశారు. ఎస్ఐబీలోని కీలక ఫైల్స్ను మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వం నివేదిక పరిశీలించిన తర్వాత ప్రణీత్ రావుపై పంజాగుట్ట పీఎస్లో కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధమైంది. అప్పటి ప్రతిపక్ష నేతల ఫోన్ టాపింగ్ వ్యవహారంపై సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం.. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ చట్టం కింద ప్రణీత్రావు పై కేసులు నమోదు చేసేందుకు సిద్ధమైంది. రహస్య సమాచారం సేకరణ, వ్యక్తిగత వివరాలు తస్కరించడం వంటి వాటిపై ఐటీ చట్టం కింద కేసులు నమోదుకు రంగం సిద్ధమైంది. హార్డ్ డిస్క్లు నాశనం చేసినందుకు, అధికార దుర్వినియోగం, ప్రభుత్వాస్తులు ధ్వంసం కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ప్రణీత్ రావ్ వ్యవహారంలో మాజీ పోలీసు ఉన్నతాధికారి ప్రమేయం ఉన్నట్లు నివేదికలో అధికారులు పేర్కొన్నారు. ప్రణీత్ రావు ప్రమోషన్ వ్యవహారంపై కూడా అధికారులు విచారణ చేస్తున్నారు. అత్యంత సంచలనాత్మకమైన వ్యవహారంపై సీఐడి లేదా సిట్కు కేసును అప్పగించే అవకాశం ఉంది. ఇదీ చదవండి: ‘టానిక్’ వెనుక కీలక వ్యక్తులు ఎవరు?.. వెలుగులోకి సంచలనాలు -
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్
-
ప్రణీత్ రావ్ సస్పెన్షన్ లో సంచలన విషయాలు
-
స్పాన్సర్లు లేరన్న బాధ! 2 కోట్ల 50 లక్షల నజరానా ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఆమెకు..
సాక్షి, హైదరాబాద్: భారత్ నుంచి 82వ చెస్ గ్రాండ్మాస్టర్గా నిలిచిన తెలంగాణ కుర్రాడు ఉప్పల ప్రణీత్ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అభినందించారు. ప్రణీత్ తన తల్లిదండ్రులు శ్రీనివాసాచారి, ధనలక్ష్మిలతో కలిసి సోమవారం సచివాలయంలో సీఎంను కలిశాడు. ప్రణీత్ ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేసిన కేసీఆర్...అతను మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. భారీ నజరానా భవిష్యత్తులో ప్రణీత్ ఇతర టోర్నీల కోసం సన్నద్ధమయ్యేందుకు, మరింత మెరుగైన శిక్షణ తీసుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకంగా రూ. 2 కోట్ల 50 లక్షలను తెలంగాణ సీఎం ప్రకటించారు. రాష్ట్రం తరఫున గ్రాండ్మాస్టర్గా నిలిచిన ఐదో ఆటగాడిగా ప్రణీత్ గుర్తింపు పొందాడు. ఆమెకు 50 లక్షలు మరోవైపు మహిళా క్యాండిడేట్ మాస్టర్ (డబ్ల్యూసీఎం) హోదా పొందిన చెస్ ప్లేయర్ వీర్లపల్లి నందినికి రూ. 50 లక్షల ప్రోత్సాహకాన్ని సీఎం ప్రకటించారు. ఈ దిశగా తక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా తన కార్యదర్శి భూపాల్ రెడ్డిని సీఎం ఆదేశించారు. చదవండి: రన్నరప్ హంపి బెర్లిన్: వరల్డ్ చెస్ అర్మగెడాన్ బ్లిట్జ్ చాంపియన్షిప్ మహిళల టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి రన్నరప్గా నిలిచింది. బిబిసారా అసాబయేవా (కజకిస్తాన్)తో జరిగిన ఐదు గేమ్ల ఫైనల్లో హంపి 1.5–3.5తో ఓడిపోయింది. తొలి గేమ్లో హంపి 33 ఎత్తుల్లో ఓడిపోగా.. రెండో గేమ్లో హంపి 41 ఎత్తుల్లో గెలిచింది. మూడో గేమ్లో 61 ఎత్తుల్లో, నాలుగో గేమ్లో 27 ఎత్తుల్లో బిబిసారా విజయం సాధించింది. ఐదో గేమ్ 57 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. ఎనిమిది మంది అగ్రశ్రేణి క్రీడాకారిణుల మధ్య ఈ టోర్నీ జరిగింది. మహిళల టోర్నీ విన్నర్, రన్నరప్ హోదాలో బిబిసారా, హంపి ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగే అర్మగెడాన్ గ్రాండ్ ఫైనల్ టోర్నీకి అర్హత సాధించారు. గ్రాండ్ ఫైనల్ టోర్నీకి ఇప్పటికే సో వెస్లీ, సామ్ షాంక్లాండ్ (అమెరికా), దొమ్మరాజు గుకేశ్ (భారత్), నొదిర్బెక్ అబ్దుసత్తరోవ్ (ఉజ్బెకిస్తాన్) కూడా అర్హత పొందారు. త్వరలో యూరోప్, ఆఫ్రికా రీజియన్ మధ్య జరిగే టోర్నీ ద్వారా మరో ఇద్దరికి గ్రాండ్ ఫైనల్ టోర్నీకి బెర్త్లు లభిస్తాయి. చదవండి: WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో భువనేశ్వర్! స్వింగ్ సుల్తాన్ ఉంటే! -
‘గ్రాండ్మాస్టర్’ ప్రణీత్.. ఇప్పటికైతే ఆర్థికంగా ఆదుకోవడానికి నాకు స్పాన్సర్ లేరు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ చెస్ టోర్నీలలో తన నిలకడమైన ప్రదర్శనను కొనసాగిస్తూ తెలంగాణ టీనేజ్ ప్లేయర్ వుప్పాల ప్రణీత్ భారత 82వ గ్రాండ్మాస్టర్ (జీఎం)గా అవతరించాడు. అజర్బైజాన్లో జరిగిన బకూ ఓపెన్ టోర్నీలో 15 ఏళ్ల ప్రణీత్ గ్రాండ్మాస్టర్ హోదా ఖరారు కావడానికి అవసరమైన 2500 ఎలో రేటింగ్ను అధిగమించాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో ప్రణీత్ ఆరు పాయింట్లు స్కోరు చేసి ఆరో ర్యాంక్లో నిలిచాడు. ఎనిమిదో రౌండ్లో టాప్ సీడ్, అమెరికా గ్రాండ్మాస్టర్ హాన్స్ మోక్ నీమన్పై ప్రణీత్ గెలుపొందడంతో అతని లైవ్ ఎలో రేటింగ్ 2500.5గా నమోదైంది. చివరి రౌండ్లో ఈ టోర్నీ విజేత, భారత గ్రాండ్మాస్టర్ లియోన్ ల్యూక్ మెండోంకా (గోవా) చేతిలో ఓడిపోయినా అతని ఎలో రేటింగ్పై ప్రభావం చూపకపోవడంతో ప్రణీత్కు జీఎం హోదా ఖాయమైంది. జీఎం హోదా ఖరారైంది ఇలా ►ఈ టోర్నీలో ప్రణీత్ నలుగురు గ్రాండ్మాస్టర్లు వహాప్ సనాల్ (తుర్కియే), వుగార్ అసాదిల్ (అజర్బైజాన్), లెవాన్ పాంత్సులయ (జార్జియా), నీమన్ (అమెరికా)లపై నెగ్గడంతోపాటు ఇస్కందరోవ్ (అజర్బైజాన్), నిజాత్ అబసోవ్ (అజర్బైజాన్)లతో గేమ్లను ‘డ్రా’ చేసుకున్నాడు. ►చెస్లో గ్రాండ్మాస్టర్ హోదా రావాలంటే మూడు జీఎం నార్మ్లు సాధించడంతోపాటు ఎలో రేటింగ్ పాయింట్లు 2500 దాటాలి. ప్రణీత్ ఇప్పటికే మూడు జీఎం నార్మ్లు సంపాదించినా అతని ఎలో రేటింగ్ 2500 దాటలేకపోవడంతో జీఎం హోదా కోసం నిరీక్షించాల్సి వచ్చింది. అయితే బకూ ఓపెన్లో ప్రణీత్ అద్భుత ప్రదర్శన కనబరిచి తన 2500 ఎలో రేటింగ్ను అధిగమించడంతో అతనికి జీఎం హోదా ఖరారైంది. ►ప్రణీత్ తొలి జీఎం నార్మ్ను 2022 మార్చిలో ఫస్ట్ సాటర్డే టోర్నీలో, రెండో జీఎం నార్మ్ను 2022 జూలైలో బీల్ ఓపెన్ టోర్నీలో, మూడో జీఎం నార్మ్ను 2023 ఏప్రిల్లో సన్వే ఫార్మెన్టెరా ఓపెన్ టోర్నీలో సాధించాడు. ►2021 వరకు ప్రముఖ కోచ్ ఎన్వీఎస్ రామరాజు వద్ద శిక్షణ పొందిన ప్రణీత్ ప్రస్తుతం ఇజ్రాయెల్ గ్రాండ్మాస్టర్ విక్టర్ మిఖాలెవ్స్కీ వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు. పదేళ్లుగా చెస్ ఆడుతున్న ప్రణీత్ శ్రమకు తగ్గ ఫలితం రావడంపట్ల అతని తల్లిదండ్రులు శ్రీనివాసాచారి, ధనలక్ష్మి ‘సాక్షి’తో ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకైతే ప్రణీత్ను సొంత ఖర్చులతోనే టోర్నీలకు పంపించామని, ఇకనైనా అతనికి స్పాన్సర్లు వస్తే సంతోషిస్తామని తెలిపారు. ఇప్పటికైతే ఆర్థికంగా ఆదుకోవడానికి నాకు స్పాన్సర్ లేరు ఒక స్వప్నం సాకారమైంది. నా కెరీర్లో ఇది చిరస్మరణీయ క్షణం. 2500 రేటింగ్ దాటడం ఒక మైలురాయిలాంటిది. భవిష్యత్లో 2700 రేటింగ్ను అందుకోవడం, ప్రపంచ చాంపియన్ కావడం నా సుదీర్ఘ లక్ష్యాలు. కొన్నాళ్లుగా నిలకడగా రాణిస్తున్నా నిర్ణీత సమయంలోపు గేమ్ను ముగించాలనే ఒత్తిడి నాపై ఉండేది. ఈ విషయంలో ఇప్పుడిప్పుడే మెరుగవుతున్నా. భారత్ నుంచి పలువురు యువ ఆటగాళ్లు గ్రాండ్మాస్టర్ టైటిల్ సాధిస్తుండటం ఈ ఆటకు ఎంతో మేలు చేస్తుంది. కజకిస్తాన్లో త్వరలో జరిగే ఆసియా చాంపియన్షిప్లో పతకం సాధించడమే నా తదుపరి లక్ష్యం. అత్యున్నతస్థాయిలో పోటీపడాలన్నా, మెరు గైన శిక్షణ తీసుకోవాలన్నా, విదేశాల్లో టోర్నీలు ఆడేందుకు వెళ్లాలన్నా చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఇప్పటికైతే ఆర్థికంగా ఆదుకోవడానికి నాకు స్పాన్సర్ లేరు. గ్రాండ్మాస్టర్ హోదా టైటిల్తో నాకు స్పాన్సర్లు లభిస్తారని ఆశిస్తున్నా. –ప్రణీత్ తెలంగాణ నుంచి భారత చెస్లో తెలంగాణ నుంచి గతంలో ఇరిగేశి అర్జున్ (2018), హర్ష భరతకోటి (2019), రాజా రిత్విక్ (2021), రాహుల్ శ్రీవాత్సవ్ (2022)ఈ ఘనత సాధించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటికే పెంటేల హరికృష్ణ (2001), హంపి (2002), హారిక (2011), లలిత్ బాబు (2012), కార్తీక్ వెంకటరామన్ (2018) గ్రాండ్మాస్టర్ హోదా పొందారు. -
ప్రణీత్, కశ్యప్ ఔట్
ఫుజౌ (చైనా): చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్ సింగిల్స్లో భారత పోరాటం ముగిసింది. మహిళల విభాగంలో ప్రపంచ చాంపియన్ సింధు, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ సైనా నెహ్వాల్ ఇప్పటికే ఇంటిదారి పట్టగా... తాజాగా ప్రపంచ చాంపియన్షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్ కూడా వెనుదిరిగారు. గురువారం 84 నిమిషాల పాటు సాగిన ప్రిక్వార్టర్ పోరులో ప్రపంచ 11వ ర్యాంకర్ సాయిప్రణీత్ 20–22, 22–20, 16–21తో టోర్నీ నాలుగో సీడ్ ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్) చేతిలో పోరాడి ఓడాడు. తొలి గేమ్లో నువ్వా–నేనా అన్నట్లు పోరాడటంతో స్కోరు 20–20తో సమమైంది. చివర్లో వరుసగా రెండు పాయింట్లు సాధించిన డెన్మార్క్ షట్లర్ తొలి గేమ్ను గెలిచాడు. రెండో గేమ్లోనూ ఇద్దరు ఆటగాళ్లు తొలుత హోరాహోరీగా ఆడినప్పటికీ కీలక సమయంలో పాయింట్లు సాధించిన ప్రణీత్ 19–13తో ఆధిక్యంలో నిలిచాడు. ఈ దశలో తడబడిన ప్రణీత్ వరుసగా 5 పాయింట్లను ప్రత్యర్థికి కోల్పోయి ఆధిక్యాన్ని 19–18కి తగ్గించుకున్నాడు. అనంతరం ప్రణీత్ ఒక పాయింట్, ఆంటోన్సెన్ రెండు పాయింట్లు తమ ఖాతాలో వేసుకోగా స్కోర్ 20–20తో సమమైంది. అయితే ఇక్కడ ఎటువంటి పొరపాటు చేయని ప్రణీత్ రెండు పాయింట్లు సాధించి రెండో గేమ్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక నిర్ణాయక మూడో గేమ్లో డెన్మార్క్ షట్లర్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. మరో ప్రిక్వార్టర్ పోరులో కశ్యప్ 13–21, 19–21తో ప్రపంచ ఆరో ర్యాంకర్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడాడు. తొలి గేమ్లో ఏ మాత్రం పోటీ ఇవ్వని కశ్యప్ రెండో గేమ్లో మాత్రం పోరాడాడు. అయితే 19–17తో ఉన్న సమయంలో ఒత్తిడికి లోనైన కశ్యప్ వరుసగా 4 పాయింట్లను ప్రత్యర్థికి సమర్పించుకొని ఇంటి ముఖం పట్టాడు. సాత్విక్కు మిశ్రమ ఫలితాలు భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్కు మిశ్రమ ఫలితాలు ఎదురైయ్యాయి. డబుల్స్లో చిరాగ్ శెట్టితో జత కట్టిన సాయిరాజ్ క్వార్టర్స్ చేరగా... మిక్స్డ్ డబుల్స్లో మాత్రం ప్రిక్వార్టర్స్ అడ్డంకిని దాటలేకపోయాడు. డబుల్స్ ప్రిక్వార్టర్స్లో సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి ద్వయం 21–18, 21–23, 21–11తో ఆరో సీడ్ హిరోయుకి ఎండో– యుట వటనాబె (జపాన్) జోడీపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్– అశ్విని పొన్నప్ప జంట 21–23, 16–21తో టోర్నీ ఐదో సీడ్ సియో సెయుంగ్ జే– చే యుజుంగ్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడింది. నేడు జరిగే క్వార్టర్స్ పోరులో టోర్నీ మూడో సీడ్ లి జున్ హుయ్– లియు యున్ చెన్ (చైనా) జంటతో సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి ద్వయం తలపడుతుంది. -
మైండ్ గేమ్
‘సర్! మా నాన్నగారిది సహజ మరణం కాదు. హత్యేనని నేను కచ్చితంగా చెప్పగలను’ ఇన్స్పెక్టర్ కుమార్కు చేతులు జోడించి చెప్పాడు ప్రణీత్. ‘ఏమిటి ప్రణీత్ బాబూ మీరనేది? నీరజ్గారు గుండెపోటుతో పోయారని డాక్టర్లు చెబుతుంటే’ ముసలి జావేద్ తన తెల్లటి గడ్డాన్ని సవరించుకుంటూ అన్నాడు. సీఐ కుమార్ అక్కడే నిలబడి ఏడుస్తూ ఉన్న పనివాడు యాభయ్యేళ్ల కోటయ్య వంక చూశాడు. ‘కోటయ్యా! నువ్వు నిన్న ఇక్కడే ఉన్నావు కదా... ఏం జరిగిందో చెప్పు’ అన్నాడు. కోటయ్య గొంతు సవరించుకున్నాడు. చెస్ చాంపియన్ల ఖిల్లాగా ఆ పట్టణానికి పేరుంది. ఐదారేళ్ల నుంచి వరుసగా ఆ పట్టణవాసులే రాష్ట్ర చెస్ చాంపియన్షిప్ గెలుస్తూ ఉన్నారు. ప్రస్తుత చాంపియన్ నీరజ్, మాజీ చాంపియన్ సరోజ్ ఆ పట్టణవాసులే. ప్రస్తుత చాంపియన్ నీరజ్ తండ్రి కూడా చదరంగ ప్రవీణుడే. తాతలనాటి పురాతన భవంతిలోనే నీరజ్ నివసిస్తూ ఉంటాడు. చదరంగమే లోకంగా ఉంటూ ఉద్యోగమేమీ చేయకపోవడంతో అతనికి పెద్దగా ఆదాయం లేదు. నీరజ్కు, మరికొందరికీ చిన్ననాటి నుంచి చదరంగం తర్ఫీదు ఇచ్చి చాంపియన్లుగా తీర్చిదిద్దిన జావేద్ ముసలివాడయ్యాడు. కంటిచూపు మందగించినా, ఆటపై మక్కువ చంపుకోలేక రోజూ చదరంగం ఆడటానికి తన శిష్యుడు నీరజ్ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంకా మాజీ చాంపియన్ సరోజ్, మరికొందరు కూడా నీరజ్తో చదరంగం ఆడటానికి రోజూ వస్తూ ఉంటారు. నీరజ్తో చదరంగం ఆడటానికి రోజూ వచ్చేవారిలో మదన్, మోహిని ముఖ్యులు. మదన్ది జమీందార్ల వంశం. డబ్బుకు, అతిశయానికీ లోటు తక్కువేం లేదు. రాష్ట్రస్థాయిలో అతను చదరంగంలో మొదటి పది ర్యాంకుల్లో ఉన్నాడు. కానీ ఇంతవరకు ఏ పోటీలోనూ విజేతగా నిలవలేదు. మోహిని రాష్ట్రస్థాయి మహిళా చదరంగ పోటీల్లో రన్నరప్గా నిలిచింది. ఈసారి ఆ పోటీలో గెలవాలని కసిగా ప్రాక్టీస్ చేస్తోంది. కొంతకాలంగా గుండెజబ్బుతో బాధపడుతున్న నీరజ్ చదరంగం ఆడటం తగ్గించాడు. రాత్రి ఎనిమిదిన్నరకు పాములు, తేళ్ల భయంతో ఇంటి తలుపులు, కిటికీలన్నీ మూసి నిద్రిస్తాడు. నీరజ్ భార్య గత ఏడాది మరణించింది. కొడుకు ప్రణీత్ ఆ ఊళ్లోనే బీ టెక్ చదువుతున్నాడు. పనివాడు కోటయ్య వంటచేసి రాత్రి ఎనిమిది గంటలకు వెళ్లిపోతుంటాడు. ‘నిన్న సాయంత్రం ఐదు గంటలకు సరోజ్గారు ఇంటికి వచ్చారు. ప్రణీత్ ఇంట్లో లేడు. నీరజ్గారి గదిలోకి వెళ్లి సరోజ్ గారు చదరంగం ఆడారు. అప్పుడు అయ్యగారు ఉల్లాసంగానే కనిపించారు’ అన్నాడు కోటయ్య. ‘నేను మంచి ఫామ్లో ఉన్నాను. ఏడు నిమిషాల్లోనే నీరజ్పై గెలిచాను. ఆ శుభవార్త బయటనే వెయిట్ చేస్తూ ఉన్న మోహినికి చెప్పి ఆనందంగా వెళ్లిపోయాను’ అన్నాడు సరోజ్. ఇన్స్పెక్టర్ కుమార్ మోహిని వంక చూశాడు. ‘ఔను! సరోజ్ ముఖం గెలుపు ఆనందంతో మతాబాలాగా వెలుగుతోందప్పుడు. నా కాన్ఫిడెన్స్ కొద్దీ బ్లైండ్ఫోల్డ్గా ఆడతానని నిన్ననే నీరజ్గారికి చెప్పి వారి పర్మిషన్ తీసుకున్నా. కళ్లకు గంతలు కట్టుకుని ఆయనతో చదరంగం ఆడాను’ చెప్పింది మోహిని. ‘మరి గెలిచారా?’ అడిగాడు ఇన్స్పెక్టర్. ‘లేదు. కానీ గెలిచినంత పని చేశా. నన్ను నిలువరించడానికి నీరజ్గారు ఇరవై నిమిషాలు కష్టపడాల్సి వచ్చింది. చివరికెలాగో నన్ను ఓడించారు’ చెప్పింది మోహిని. ‘సాయంత్రం ఐదు నలభైకి నీరజ్గారు ఎందుకో గట్టిగా కేక పెట్టారు. బయట తోటలో ఉన్న నేను పరుగున ఆయన గదిలోకి వెళ్లాను. అప్పుడు సార్ మదన్గారితో గేమ్ ఆడుతున్నారు. ఏదో వస్తువు కిందపడ్డట్లు అనిపించింది’ అన్నాడు కోటయ్య. ‘టేబుల్ మీద ఉన్న నా లెదర్ బ్యాగ్ కింద పడిందంతే. కోటయ్యను కాఫీ తీసుకు రమ్మని చెప్పారు నీరజ్ గారు. ఎందుకో ఆయన భయపడినట్లు అనిపించింది’ చెప్పాడు మదన్. ‘మరి ఆట ముగిశాక మీరు వెళ్లిపోయారా?’ ‘లేదు. ఎందుకో నీరజ్గారు అసౌకర్యంగా ఉన్నట్లు అనిపించడంతో నేను ఆయన పక్కనే ఉన్న చెయిర్లో కూర్చున్నాను. ఇంతలో జావేద్గారు లోనికి వచ్చారు’ అన్నాడు మదన్. ‘నేను గదిలోకి వచ్చేసరికి బెడ్లైట్ వెలుగుతోంది. ఆట మొదలెడదామా అని నేను అడిగే సరికి సరేనన్నాడు నీరజ్. మదన్గారు పక్కనే కుర్చీలో ఉన్నారు. కోటయ్య వచ్చి మా ముగ్గురికీ కాఫీ కప్పులు టేబుల్ మీద పెట్టి వెళ్లిపోయాడు. ఐదు నిమిషాల్లోనే నేను గెలిచాను. ఆ ఆనందంతో నీరజ్తో కరచాలనం చేసి వెళ్లిపోయాను’ చెప్పాడు జావేద్. ‘ఆ తర్వాత మదన్గారు వెళ్లిపోయారు. నేను గదిలోకి వెళ్లి చూసే సరికి మూడు కప్పుల్లో కాఫీ అలాగే ఉంది. కప్పులు తీసుకుని వెళ్లిపోయాను. పది నిమిషాల తర్వాత ఏదో అనుమానం వచ్చి నీరజ్గారి గదిలోకి వెళ్లి పిలిస్తే పలకలేదు. శరీరంలో చలనం లేదు. భయంతో డాక్టర్గారికి, ప్రణీత్కు ఫోన్ చేశాను’ అన్నాడు కోటయ్య. ఇన్స్పెక్టర్ కుమార్కు మరుసటి రోజు ఏదో అనుమానం వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు ప్రణీత్. చదరంగంలో రాష్ట్ర చాంపియన్గా నీరజ్కు ఉన్న పేరు ప్రఖ్యాతుల బట్టి వెంటనే ఇద్దరు కానిస్టేబుల్స్తో వచ్చి దర్యాప్తు చేశాడు కుమార్. డాక్టర్తోను, ముందురోజు నీరజ్తో చదరంగం ఆడిన నలుగురితోనూ మాట్లాడాడు. ‘నాకు అర్జెంట్గా విజయవాడలో పని ఉంది. నేను వెళ్లి సాయంత్రం నాలుగింటికి తిరిగొస్తాను’ అన్నాడు మదన్. మిగిలిన ముగ్గురూ కూడా తమకేదో పని ఉందంటూ చెప్పారు. ఇన్స్పెక్టర్ కుమార్ ప్రణీత్ గదిలోకి వెళ్లి ఐదు నిమిషాల తర్వాత తిరిగొచ్చాడు. సరే, మీరందరూ మీ మీ పనులు చూసుకొని రండి. సాయంత్రం ఐదింటికి మళ్లీ మనం ఇక్కడే కలుద్దాం. నీరజ్ది సహజ మరణమే అనిపిస్తోంది’ అన్నాడు. నలుగురూ బయటకు వెళ్లిపోయారు. కుమార్ తనతో వచ్చిన కానిస్టేబుల్స్కు పనులు పురమాయించాడు. ‘మిస్టర్ మదన్! మీరు నీరజ్ మరణానికి కారకులయ్యారు. మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం’ అన్నాడు కుమార్. మదన్ ముఖం కళ తప్పింది. ‘సార్! ఇది అన్యాయం. నీరజ్గారు గుండెపోటుతో మరణించారని డాక్టర్లే చెప్పారు’అన్నాడు ఆవేశంగా. ‘కావచ్చు. కానీ గుండెపోటు వచ్చేలా చేసింది నువ్వే’ అన్నాడు కుమార్. ‘ఇది చాలా అన్యాయం సార్’ దీనంగా అన్నాడు మదన్. ‘నిన్ను అరెస్టు చేయడానికి ఈ రుజువు చాలు’ అని కుమార్ ఒక చిన్న టేప్రికార్డర్ తీసి ఆన్ చేశాడు. అందులో మదన్, నీరజ్ల సంభాషణ ఉంది. ‘ఆ రోజు సాయంత్రం నీరజ్ ఎప్పటిలాగానే చదరంగం ఆడటానికి తన గదిలో కూర్చున్నాడు. ముందు వచ్చిన సరోజ్ బాగా ఆడి గెలిచి సంతోషంగా వెళ్లిపోయాడు. తర్వాత వచ్చిన మోహిని కళ్లకు రిబ్బన్ కట్టుకుని బ్లైండ్ఫోల్డ్ గేమ్ ఆడింది. ఆమెకు తెలియడం కోసం నీరజ్ ఆమె, తాను వేసే ప్రతి ఎత్తునూ గట్టిగా బయటకు చెప్పాడు. అలా చెబుతున్నప్పుడు ఆట తర్వాత వివాదాలు రాకుండా రికార్డు ఆన్ చేయడం ఆయనకు అలవాటు. మోహినితో ఆట పూర్తయ్యాక టేప్ రికార్డర్ ఆఫ్ చేయడం మరచి, అలాగే ఉంచేశాడు నీరజ్.తర్వాత వచ్చిన మదన్కు రాష్ట్ర చాంపియన్ కావాలని తగని కోరిక ఉంది. ఎలాగైనా నీరజ్ను అంతమొందిస్తే సరోజ్ను డబ్బుతో కొనవచ్చని, అలా ఇద్దరు ప్రత్యర్థులను అడ్డు తొలగించుకోవచ్చని పథకం వేశాడు. నీరజ్ గుండెజబ్బు మనిషని మదన్కు తెలుసు. అందుకే సరోజ్తో ఘోరంగా ఓడావని, మోహిని బ్లైండ్ఫోల్డ్ ఆడినా ఓడినంత పనైందని నీరజ్ను రెచ్చగొట్టాడు. తర్వాత తనతో తెచ్చిన బొమ్మ పామును జేబులోంచి తీసి నీరజ్ కాలిపై వేసి ‘పాము... పాము’ అని చిన్నగా అరిచాడు. దాంతో షాక్ తిన్న నీరజ్ గుండెపోటుకు గురై మరణించాడు. అదంతా టేప్రికార్డర్లో రికార్డయింది. మదన్ ఇల్లు శోధిస్తే ఆ బొమ్మ పాము దొరికింది. పథకం ప్రకారం మదన్ నీరజ్ శవాన్ని పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి తాను నీరజ్ కుర్చీలో కూర్చున్నాడు. మదన్కు మిమిక్రీ వచ్చు. ట్యూబ్లైట్ ఆఫ్ చేసి, గదిలో బెడ్లైట్ వేశాడు. గదిలోకి వచ్చిన కోటయ్యకు కాఫీ తెమ్మని నీరజ్ గొంతుతో చెప్పాడు. తర్వాత జావేద్ వచ్చాడు. కంటిచూపు బాగులేని జావేద్ బెడ్లైట్ వెలుతురులో మదన్నే నీరజ్ అనుకున్నాడు. జావేద్తో ఆట ఓడిపోయి, నీరజ్ గొంతుతో అతన్ని అభినందించాడు. జావేద్ వెళ్లగానే నీరజ్ను అతని కుర్చీలో కూర్చోబెట్టి వెళ్లిపోయాడు మదన్.’ అని ముగించాడు కుమార్. మదన్ తలదించుకుని పోలీసులకు లొంగిపోయాడు. -
నేటి నుంచి జపాన్ ఓపెన్... బరిలో పీవీ సింధు
అంతర్జాతీయ టోర్నీల్లో నిలకడగా రాణిస్తున్నప్పటికీ తుది పోరులో ఓడిపోతున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరో ప్రతిష్టాత్మక టోర్నీకి సిద్ధమైంది. ఈ ఏడాది ఇండియా ఓపెన్, కామన్వెల్త్ గేమ్స్, థాయ్లాండ్ ఓపెన్, ప్రపంచ చాంపియన్షిప్, ఆసియా క్రీడల్లో రన్నరప్గా నిలిచిన సింధు నేటి నుంచి మొదలయ్యే జపాన్ ఓపెన్లో బరిలోకి దిగుతోంది. మంగళవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో జపాన్ అమ్మాయి, ప్రపంచ 13వ ర్యాంకర్ సయాకా తకహాషితో మూడో ర్యాంకర్ సింధు తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో ఇద్దరూ 2–2తో సమఉజ్జీగా ఉన్నారు. -
అసలేం జరిగింది?
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కళాశాలలో వైద్యవిద్యార్థి హర్షప్రణీత్రెడ్డి మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. అతను ఉండే హాస్టల్ గదిలో చెల్లాచెదురుగా పడిన వస్తువులను చూస్తే ఎవరికైనా ఈ అనుమానాలు తలెత్తడం ఖాయం. గురువారం హర్షప్రణీత్రెడ్డి గదిలోకి వెళ్లి లోపల గడియ పెట్టుకోకముందు జరిగిన ఘటనలను పోలీసులు ఆరా తీస్తున్నారు. హర్ష ఆ రోజు ఎవరికి ఎక్కువసార్లు ఫోన్ చేశాడు? చనిపోవడానికి ముందు ఎవరితో మాట్లాడాడు? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. ఈ మేరకు అతని సెల్ఫోన్లో డేటాను పరిశీలిస్తున్నారు. ఆ విద్యార్థి ఎక్కువగా చాటింగ్ చేసేవాడని, ఎప్పటికప్పుడు మెసేజ్లను డిలిట్ చేసేవాడని చెబుతున్నారు. ఈ కోణంలోనూ పోలీసులు పరిశీలిస్తున్నారు. డిలిట్ చేసిన మెసేజ్లను తెలుసుకునేందుకు, కాల్ డేటాను తెప్పించేందుకు చర్యలు ప్రారంభించారు. హర్ష మృతిచెందిన గదిలో ఇనుప మంచం పూర్తిగా వంగిపోయి ఉంది. దానిపైన ఉండే పరుపు చెల్లాచెదురుగా పడి ఉంది. ఫ్యాన్కు సైతం రెండు, మూడు టవళ్లు వేలాడుతూ ఉన్నాయి. దీన్ని బట్టి అతని మృతికి ముందే గదిలో ఏదైనా గొడవ జరిగిందా? అన్న అనుమానాలు నివృత్తి కావాల్సి ఉంది. మొత్తంగా హర్ష సెల్ఫోన్ డేటా, మెసేజ్ల వివరాలు తెలిస్తే గానీ మృతికి గల కారణాలు తెలిసే పరిస్థితి లేదని పలువురు వైద్యులు అన్నారు. -
చాంప్స్ ప్రణీత, సంకేత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం (టీఎస్సీఏ) ఆధ్వర్యంలో జరిగిన హైదరాబాద్ జిల్లా అండర్–11 చెస్ సెలక్షన్ టోర్నీలో ప్రణీత ప్రియ, సంకేత్ రెడ్డి చాంపియన్లుగా నిలిచారు. టీఎస్సీఏ కార్యాలయం వేదికగా జరిగిన ఈ టోర్నీ బాలికల విభాగంలో 4 పాయింట్లతో ప్రణీత అగ్రస్థానంలో నిలిచింది. ఆమె తలపడిన అన్ని మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది. ఎస్. అనీష్క, జి. ఇషాన్వి, జి. శరణ్య వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి హైదరాబాద్ జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. బాలుర విభాగంలో నిర్ణీత 5 రౌండ్లకుగానూ 5 పాయింట్లు సాధించి సంకేత్ విజేతగా నిలిచాడు. ఎస్. చిద్విలాస్ రెండోస్థానాన్ని దక్కించుకోగా... కె. అవనీశ్, విశ్వ తర్వాతి స్థానాలను సాధించారు. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన ఈ నలుగురూ హైదరాబాద్ జిల్లా బాలుర జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ జట్లు రాష్ట్ర స్థాయి చెస్ చాంపియన్షిప్లో హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తాయి. -
సివిల్స్లో సత్తా చాటిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ తనయుడు
-
మెడికో దుర్మరణం..
గార్లదిన్నె(అనంతపురం): మండలంలోని యర్రగుంట్ల సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. సర్వజనాస్పత్రి కంటి వైద్య నిపుణులు డాక్టర్ సైదన్న కుమారుడు ప్రణీత్(25) వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మూడో సంవత్సం చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో స్నేహితులతో కలిసి ద్విచక్రవాహనాల్లో మండలంలోని పెనకచెర్లడ్యాంకు బయల్దేరాడు. యర్రగుంట్ల గ్రామంలో పిల్లకాలువ సమీపంలోకి రాగానే బైక్ అదుపుతప్పడంతో ప్రణీత్ రోడ్డుపై పడిపోయాడు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ అతనిపై వెళ్లింది. దీంతో అతను కొంతదూరం ఎగిరిపడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతని 108లో అనంతపురం ఆస్పత్రికి తరలించారు. చికిత్ప పొందుతూ ప్రణీత్ మృతి చెందాడు. ఎస్ఐ ప్రదీప్కుమార్ కేసు నమోదు చేశారు. -
3000మీ. పరుగు విజేత ప్రణీత్
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం స్పోర్ట్స్ మీట్లో గృహవిజ్ఞాన కళాశాల విద్యార్థి సత్తా చాటాడు. రాజేంద్రనగర్లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరుగుతోన్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన 3000మీ. పరుగు ఈవెంట్లో విజేతగా నిలిచాడు. అదే కళాశాలకు చెందిన సాయి ప్రకాశ్ రెండో స్థానాన్ని దక్కించుకోగా... పాలెం వ్యవసాయ కళాశాల విద్యార్థి బాలకోటి మూడో స్థానాన్ని సాధించాడు. షాట్పుట్ విభాగంలో ఎస్ఆర్ నందా (అశ్వరావుపేట వ్యవసాయ కళాశాల), కె. రవిబాబు, రాకేశ్ (పాలెం వ్యవసాయ కళాశాల) వరుసగా తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు. ఇతర ఈవెంట్ల విజేతల వివరాలు జావెలిన్ త్రో బాలికలు: 1. పి. బెన్లా, 2. వి. వినీత, 3. బి. మనీష టెన్నికాయింట్ బాలికలు: 1. ఎ. ఉషారాణి– ఎస్. పూజిత, 2. ఎం. అరుణ– పి. అలేఖ్య బాల్ బ్యాడ్మింటన్: 1. జగిత్యాల వ్యవసాయ కళాశాల, 2. హైదరాబాద్ గృహ విజ్ఞాన కళాశాల. -
గ్రామీణ నేపథ్యంలో...
‘జయం’ చిత్రంతో నటుడిగా పరిచయమైన ప్రణీత్ పండగ పలు చిత్రాల్లో నటించారు. తాజాగా ఆయన దర్శకునిగా మారారు. వరం, తన్యారెడ్డి జంటగా ప్రణీత్ దర్శకత్వంలో వైష్ణవి నిరంజన్ నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్లో ప్రారంభమైంది. సీనియర్ నటుడు చలపతిరావు, సుమన్శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హీరో, హీరోయిన్లపై చలపతిరావు క్లాప్ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రణీత్లో మంచి ప్రతిభ ఉంది’’ అన్నారు. ‘‘పల్లెటూరి నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. హైదరాబాద్, వైజాగ్, చిక్ మంగళూరు ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతాం’’ అని దర్శకుడు అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహేష్ ధీర, కెమేరా: రాహుల్ మాచినేని, సమర్పణ: పరమ గీత. -
జాతీయ చెస్లో తెలుగోళ్ల క్లీన్స్వీప్
► రవితేజకు స్వర్ణం, ప్రణీత్కు కాంస్యం హైదరాబాద్: జాతీయ చాలెంజర్ చెస్ చాంపియన్షిప్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు క్లీన్స్వీప్ చేశారు. ఉత్తరప్రదేశ్ (యూపీ)లోని నోయిడాలో మంగళవారం ముగిసిన ఈ టోర్నీలో ఏపీ ఆటగాడు ఎస్.రవితేజ విజేతగా నిలువగా, అతని సహచరుడు ధూళిపాళ బాలచంద్ర ప్రసాద్ రజతం నెగ్గాడు. తెలంగాణకు చెందిన ఫిడే మాస్టర్ కె. ప్రణీత్ సూర్య కాంస్య పతకం గెలిచాడు. వీరంతా జాతీయ ప్రీమియర్ చెస్ చాంపియన్షిప్కు అర్హత సంపాదించారు. ఈ టోర్నీ కూడా యూపీలోనే నవంబర్లో జరగనుంది. 8 మంది గ్రాండ్మాస్టర్లు, 19 మంది అంతర్జాతీయ మాస్టర్లు తలపడిన చాలెంజర్ చెస్లో అంతర్జాతీయ మాస్టర్ ప్రణీత్, బాలచంద్రలిద్దరూ 9.5 పాయింట్లతో ఉమ్మడిగా రెండో స్థానంలో నిలిచాడు. అయితే టై బ్రేక్లో బాలచంద్రకు రెండు, ప్రణీత్కు మూడో స్థానం దక్కాయి. 13 రౌండ్ల పాటు జరిగిన ఈ టోర్నీలో రైల్వేకు ప్రాతినిధ్యం వహించిన అంతర్జాతీయ మాస్టర్ రవితేజ 10 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం (టీఎస్సీఏ) అధ్యక్ష, కార్యదర్శులు నరసింహా రెడ్డి, వెంకటేశ్వర రావు... ప్రణీత్ను అభినందించారు. -
అమెరికాలో హైదరాబాదీ దారుణ హత్య
-
అమెరికాలో హైదరాబాదీ దారుణ హత్య
♦ నిందితుడూ నగరవాసే.. టెక్సాస్ రాజధాని అస్టిన్లో ఘటన ♦ అస్టిన్లో ఉద్యోగం చేస్తున్న సంకీర్త్ ♦ ఆయన రూమ్లో 15 రోజుల క్రితమే చేరిన సందీప్ ♦ ఆదివారం ఇద్దరి మధ్య గొడవ.. సోమవారం తెల్లవారుజామున సంకీర్త్ను కత్తితో పొడిచిన సందీప్ ♦ ఆసుపత్రికి తీసుకువెళ్లినా దక్కని ఫలితం ♦ మరో రూమ్మేట్ ద్వారా మృతుడి తల్లిదండ్రులకు సమాచారం.. నిందితున్ని అరెస్టు చేసిన పోలీసులు సాక్షి, హైదరాబాద్: అమెరికాలో హైదరాబాద్ యువకుడొకరు మరో హైదరాబాదీ చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. రూమ్మేట్ చేతిలోనే కత్తిపోట్లకు గురై కన్నుమూశాడు. సోమవారం తెల్లవారుజామున టెక్సాస్ రాజధాని అస్టిన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్లోని కుద్బిగూడకు చెందిన గుండం సంకీర్త్ (24) రెండున్నరేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. చదువు పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. 15 రోజుల కిందటే సంకీర్త్ రూమ్లో హైదరాబాద్కు చెందిన కుర్రెముల సాయి సందీప్గౌడ్ (27) చేరాడు. ఆదివారం వీరిరువురి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. సోమవారం తెల్లవారుజామున సందీప్.. సంకీర్త్ను కత్తితో పొడిచి పారిపోయాడు. అనంతరం అక్కడి పోలీసులు సందీప్ను అరెస్ట్ చేశారు. హత్య కేసు నమోదు చేసి ట్రావీస్ జైలుకు తరలించారు. ప్రభుత్వ ఉద్యోగం.. హెచ్-1 వీసా.. మెదక్ జిల్లా నర్సాపూర్కు చెందిన గుండం విజయ్కుమార్, రమాదేవి వైద్య, ఆరోగ్య శాఖలో అధికారులుగా పనిచేస్తూ కాచిగూడ కుద్బిగూడలో నివసిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. పెద్దవాడైన సంకీర్త్ రెండున్నరేళ్ల కిందటే అమెరికా వెళ్లాడు. యూనివర్సిటీ ఆఫ్ న్యూ హెవెన్లో ఎంఎస్ పూర్తి చేసి ఇటీవల ప్రభుత్వ ఉద్యోగంతోపాటు హెచ్-1 వీసా పొందాడు. అస్టిన్లోని కొలోనియల్ విలేజ్లోని క్యూరీ ఓక్స్ అపార్ట్మెంట్లో హైదరాబాద్కు చెందిన మరో యువకుడు ప్రణీత్తో కలసి ఉంటున్నాడు. గతేడాది డిసెంబర్లో ఇంటికి వచ్చి వెళ్లిన సంకీర్త్.. ప్రతిరోజూ స్కైప్ ద్వారా కుటుంబీకులతో మాట్లాడుతుంటాడు. అయితే సోమవారం మాట్లాడకపోవడంతో తల్లిదండ్రులు కొంత ఆందోళనకు గురయ్యారు. మంగళవారం ఉదయం 7.30 గంటలకు ప్రణీత్.. సంకీర్త్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. సంకీర్త్కు ప్రమాదం జరిగిందని ఓసారి, కోమాలో ఉన్నాడని మరోసారి చెప్పాడు. ఆపై కొద్దిసేపటికి హత్యకు గురయ్యాడని చెప్పడంతో కుటుంబీకులు షాక్కు గురయ్యారు. వెంటనే అమెరికాలోని తమ పరిచయస్తులతో వాకబు చేశారు. వారు అక్కడి పత్రికల్లో ప్రచురితమైన హత్య వార్తలోని వివరాలు చదివి చెప్పడంతో సంకీర్త్ కుటుంబీకులు కుప్పకూలారు. నివసిస్తున్న రూమ్లోనే హత్య ఓ కన్సల్టెన్సీ ద్వారా అమెరికా వెళ్లిన సాయి సందీప్ 15 రోజులు క్రితం సంకీర్త్ రూంలో చేరాడు. సందీప్, సంకీర్త్ మధ్య ఆదివారం మధ్యాహ్నం చిన్న గొడవ జరిగిందని అక్కడి పోలీసులు చెప్పినట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. గదిలో సంకీర్త్, ప్రణీత్, సాయి సందీప్ ఆ రాత్రి నిద్రకు ఉపక్రమించారు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 3.51 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలు) సంకీర్త్ను సాయి సందీప్ కత్తితో పొడిచాడు. అలికిడి విన్న ప్రణీత్ నిద్రలేవడంతో సాయి సందీప్ పారిపోయాడు. వెంటనే సంకీర్త్ను రౌండ్ రాక్ ఆస్పత్రికి తరలించినా అప్పటికే చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సాయి సందీప్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రణీత్ను సైతం అదుపులోకి తీసుకుని విడిచిపెట్టారు. ఆ తర్వాత ప్రణీత్ జరిగిన విషయాన్ని మంగళవారం సంకీర్త్ కుటుంబీకులకు ఫోన్ ద్వారా తెలిపాడు. కుద్భుగూడలో విషాదఛాయలు సంకీర్త్ హత్య వార్తతో కాచిగూడ పరిధిలోని కుద్భుగూడలో విషాదఛాయలు అలముకున్నాయి. సంకీర్త్ ఎంతో చురుకైన విద్యార్థి అని స్థానికులు తెలిపారు. బడిచౌడిలోని కేంబ్రిడ్జి స్కూల్లో ప్రాథమిక విద్య, నారాయణగూడలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ చదివిన సంకీర్త్.. నాదర్గుల్లోని ఎంవీఎస్ఆర్ కాలేజీలో ఇంజనీరింగ్ చదివాడు. పరాయి దేశంలో తెలుగువాడి చేతిలోనే హత్యకు గురయ్యాడని తెలియంతో సంకీర్త్ కుటుంబీకులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. తల్లి రమాదేవి ఆరోగ్య దృష్ట్యా ఆమెకు హత్య విషయం తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆమె ముందు బాధ కనిపించకుండా దిగమింగుకుంటున్నారు. సంకీర్త్ తండ్రి విజయ్కుమార్ మెదక్ జిల్లా నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే గుండం వీరయ్య కొడుకు కావడం గమనార్హం. ప్రస్తుతం విజయ్ భూదాన్పోచంపల్లిలో ప్రభుత్వ ఆస్పత్రిలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. మూడో వ్యక్తి ఎవరు? ఆదివారం సంకీర్త్, సందీప్ మధ్య గొడవ జరిగిందని చెబుతున్న ప్రణీత్.. తొలుత ఎవరి వల్ల వాగ్వాదం చోటు చేసుకుందన్న అంశాన్ని మాత్రం వెల్లడించట్లేదు. ఈ ఘటన తర్వాత ఇద్దరు వ్యక్తులు మరో వ్యక్తిని కారులోకి తరలిస్తున్నారని, వారి చర్యలు అనుమానాస్పదంగా ఉన్నాయంటూ వీరి అపార్ట్మెంట్లోనే నివసించేవారు ‘911’ ద్వారా సమాచారం ఇవ్వడంతో అస్టిన్ పోలీసులు రంగంలోకి దిగారు. సంకీర్త్ను పొడిచిన తర్వాత సందీప్ పారిపోయాడు. అయితే ప్రణీత్తో కలసి సంకీర్త్ను కారులోకి తరలించిన మరో వ్యక్తిని గుర్తించడం కోసం అస్టిన్ పోలీసులు యత్నిస్తున్నారు. -
పిచ్చి కుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు
ఇంటి ముందు ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారిపై ఓ పిచ్చి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరించింది. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం కొండాపురం గ్రామంలో గురువారం ఈ ఘటన జరిగింది. కుక్క దాడిలో ప్రణీత్ ముఖంపై తీవ్ర గాయాలు కాగా బాలుడిని చికిత్స కోసం జిల్లా ఆస్పత్రి రిమ్స్ కు తరలించారు. -
చిన్నారిని చిదిమేసిన లారీ
గుంటూరు జిల్లా చిలకలూరిపేట బస్టాండ్ సమీపంలో లారీ ఢీకొని ఓ ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. బుధవారం ఉదయం సాయి అనే మహిళ తన ఐదేళ్ల కుమారుడు ప్రణీత్తోపాటు పొరుగింటికి చెందిన నర్సరీ చదివే శ్రావణిని స్కూటీపై స్కూల్కు తీసుకెళుతోంది. బస్టాండ్ సమీపంలో గుంటూరు వైపు నుంచి వచ్చిన లారీ స్కూటీని ఢీకొంది. సాయి, శ్రావణి ఒక వైపు పడిపోగా, ప్రణీత్ మరో వైపు పడిపోయాడు. అతడిపై నుంచి లారీ వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. -
క్వార్టర్స్లో సింధు, ప్రణీత్
ప్రణయ్ కూడా... మకావు ఓపెన్ బ్యాడ్మింటన్ మకావు: డిఫెండింగ్ చాంపియన్ పి.వి.సింధు మకావు ఓపెన్ బ్యాడ్మింటన్లో క్వార్టర్ ఫైనల్కు చేరింది. ఈ టోర్నీలో ఐదో సీడ్గా బరిలోకి దిగిన భారత స్టార్ ప్రి క్వార్టర్ ఫైనల్లో 21-17, 21-18తో లిండావెని ఫనేత్రి (ఇండోనేసియా)పై గెలిచింది. మ్యాచ్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సింధు 46 నిమిషాల్లో ప్రత్యర్థిని చిత్తు చేసింది. క్వార్టర్స్లో సింధు చైనాకు చెందిన చెన్ యుఫీతో తలపడుతుంది. ఇక పురుషుల విభాగంలో 15వ సీడ్ సాయి ప్రణీత్, ఏడో సీడ్ ప్రణయ్ కూడా క్వార్టర్స్కు చేరారు. ప్రి క్వార్టర్స్లో ప్రణయ్ 12-21, 21-11, 21-19తో కియావో బిన్ (చైనా)పై నెగ్గాడు. గంటా ఐదు నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో తొలి గేమ్ను కోల్పోయినా ప్రణయ్ చివరి రెండు గేమ్ల్లో బాగా ఆడాడు. సాయి ప్రణీత్ 21-15, 21-6తో గోహ్సూన్ (మలేసియా)పై అలవోకగా గెలిచాడు. -
అమెరికాలో మెరిసిన తెలుగు తేజం
జూబ్లీహిల్స్: నగర కుర్రాడు అమెరికాలో సత్తా చాటాడు. నగరానికి చెందిన ప్రణీత్ పొలినేని ప్రతిష్టాత్మక ‘ప్రెసిడెన్షియల్ స్కాలర్షిప్’కు ఎంపికయ్యాడు. నగరానికి చెందిన శ్రీనివాస్రావు, శాలిని దంపతులు అమెరికాలో సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డారు. వారి ఏకైక కుమారుడు ప్రణీత్ ఫ్లోరిడా రాష్టంలో జాక్సన్విల్లేలోని స్టేషన్ కాలేజి ప్రిపేటరి స్కూల్లో 12వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక ప్రెసిడెన్షియల్ స్కాలర్షిప్కు ధరఖాస్తు చేసుకున్నాడు. 30లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వివిధ దశల్లో పరీక్షలు నిర్వహించగా చివరకు 141 మంది స్కాలర్షిప్కు ఎంపికయ్యారు. వీరిలో ఐదుగురు భారతీయులు కాగా అందులో ప్రణీత్ ఒకరు. 1964లో ఏర్పాటు చేసిన ఈ స్కాలర్షిప్ పథకంలో ఎంపిక కావడం ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఈనెల 21న వాషింగ్టన్లోని అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్హౌస్లో నిర్వహించే కార్యక్రమంలో అద్యక్షుడు ఒబామా చేతులమీదుగా స్కాలర్షిప్ అందుకోనున్నారు. అత్యుత్తమ వైద్యుడిగా సేవలు అందించడమే తన లక్ష్యమని ప్రణీత్ పేర్కొన్నాడు. -
ఆ బస్సులు మాకొద్దు..!
న్యూఢిల్లీ: ‘ఉదయం 8 గంటలు.. ప్రణీత్ వాళ్ల మమ్మీతో కలిసి రోడ్డుపైన బస్సు కోసం వేచి చూస్తున్నాడు.. అతడికి ఇంకా పూర్తిగా నాలుగేళ్లు నిండలేదు.. భుజాలకు 10 కిలోలకు పైగానే బరువున్న పుస్తకాల బ్యాగు, చేతిలో టిఫిన్ బాక్సు, వాటర్ బాటిల్ ఉన్న ప్లాస్టిక్ బుట్ట ఉన్నాయి. అంతలో స్కూ లు బస్సు రానే వచ్చింది.. అప్పటికే అది పిల్లలతో నిండిపోయి ఉంది.. ప్రణీత్ అతికష్టం మీద అందులోకి ఎక్కాడు.. పుస్తకాల బ్యాగ్ తీసి ఒక మూలన పడేశారు.. అతడి తల్లి పిల్లాడి పరిస్థితిని చూసి నిట్టూర్చడం తప్ప ఏం చేయలేకపోయింది.. బస్సు కదిలింది నిండు గర్భిణిలా..’ నగరంలో ఏ స్కూల్ బస్సు చూసినా అటుఇటుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సామర్థ్యానికి మించి పిల్లలను వాటిలో కుక్కి తీసుకుపోతున్నారు. అంతేకాక పాఠశాలకు పిల్లలను తొందరగా చేర్చాలన్న ధ్యాసలో వేగంగా వెళ్లి ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్న సంఘటనలు కూడా కోకొల్లలు. దీంతో చిన్నారుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసినట్లవుతోంది. కాగా, ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. అన్ని ప్రైవే ట్ స్కూళ్లు ‘రక్షిత రవాణా’ను తప్పక పాటిం చాలని ఆదేశించింది. తమ పిల్లలకు మంచి రవాణా సౌకర్యాన్ని ఏర్పాటుచేయాలని, చట్టబద్ధం కాని వ్యాన్లను నడపవద్దని ఆయా పాఠశాలల యాజమాన్యాలను తల్లిదండ్రులు కోరవచ్చని సూచిచింది. సామర్థ్యానికి మించి పిల్లలను ఎక్కించుకువచ్చే వ్యాన్లపై కఠనంగా వ్యవహరించనున్నట్లు ఇటీవల విద్యాశాఖ డెరైక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా వ్యాన్లలో సీటింగ్ కెపాసిటీకి మించి పిల్లలను ఎక్కిస్తే వాటి అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు. అలాగే విద్యార్థులున్న స్కూల్ వ్యాన్లను నిర్లక్ష్యంగా నడిపే డ్రైవర్లపై కఠిన చర్యలు తప్పవని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఇప్పటికీ పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు ప్రైవేట్ వ్యాన్లపైనే ఆధారపడుతున్నారు. ఈ సందర్భంగా సేఫ్-ట్రస్టీ ఆఫ్ సేఫ్ రోడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మహ్మద్ ఇమ్రాన్ మాట్లాడుతూ..‘చాలా చిన్న పాఠశాలలకు సొంత బస్సులు ఉండవు..వారు ప్రైవేట్ వాహనాలను అద్దెకు తీసుకుని వాటినే తమ సొంత వాహనాలుగా తల్లిదండ్రులకు చూపుతారు. తల్లిదండ్రుల నుంచి రవాణా చార్జీల కింద ఎక్కువ వసూలు చేసి వ్యాన్ యజమానులకు తక్కువ చెల్లిస్తారు. అలాగే, ఎటువంటి ప్రమాదాలు జరిగినా తమ బాధ్యత ఏమీ ఉండదని చెబుతారు. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తల్లిదండ్రులు వారిని ప్రశ్నిస్తే మా బాధ్యత ఉండదని మొదటే చెప్పాం.. మీరు డ్రైవర్తోనే మాట్లాడుకోండి.. అని దబాయిస్తుంటార’ని తెలిపారు. అయితే స్కూలు యాజమాన్యాలకు ఈ వ్యాన్లపై ఏదైనా ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పిల్లలు ఎటువంటి ఇబ్బందులు పడాల్సి వస్తుందోనని తల్లిదండ్రులు సైతం వ్యాన్ డ్రైవర్లపై ఫిర్యాదు చేసేందుకు జంకుతున్నారని వివరించారు. ‘ఇటువంటి సంఘటనలపై ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా మేం ఏమీ చేయలేం.. ఆయా పాఠశాలల యాజమాన్యాలు పిల్లల రవాణాపైనే కాదు.. యూనిఫారాలు, పుస్తకాలు ఇలా అన్ని విభాగాలపైనా తల్లిదండ్రుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు కాని ఆ స్థాయిలో సేవ లు అందించడంలేద’ని ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశారు. చాలావరకు ప్రైవేట్ వాహనాలను చట్టవిరుద్ధంగా నడుపుతున్నారు.‘ ఆయా పాఠశాలలకు ఈ వ్యాన్లను చాలావరకు పోలీసులే సూచిస్తున్నారు. ఎప్పుడైనా మేం ఆ వ్యాన్ వాళ్లను ప్రశ్నిస్తే.. మా కోసమే కాక వేరే (పోలీస్) వారి కోసం కూడా మేం సంపాదించాల్సివస్తోంది.. అందువల్లనే ఈ పరి స్థితి..’ అని వారు తమ నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారని ఇమ్రాన్ తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ విషయమై ఐదేళ్ల విద్యార్థి తల్లి దీక్షా సేథ్ మాట్లాడుతూ..‘ ప్రతి నెలా స్కూలు వాళ్లు బస్ కోసం రూ.1,800 వసూలు చేస్తున్నారు. మా అబ్బాయి కోసం మాట్లాడుకున్న ప్రైవేట్ వ్యాన్కు నేను నెలకు కేవలం రూ.600 చెల్లిస్తున్నా.. వాళ్లు అబ్బాయిని మా అపార్ట్మెంట్ గేట్ వద్దే ఎక్కించుకుని, మళ్లీ అక్కడే దింపుతారు. దాంతో నాకు వాడికోసం ఎక్కడో వేచి చూడాల్సిన అవసరం తప్పింది.. స్కూల్ బస్సులు అలాకాదు.. వాటి కోసం మనం తప్పనిసరిగా వేచి చూడాల్సిందే..’నని తెలిపారు. మరో విద్యార్థి తల్లి రీమా అగర్వాల్ మాట్లాడుతూ..‘ ప్రైవేట్ వ్యాన్ వాళ్లయితే ఎప్పుడైనా మా అబ్బాయికి స్కూల్లో కొంచెం ఆలస్యమైనా అత నికోసం వేచి ఉంటారు. స్కూల్ బస్సులు అలా కాదు.. వారు ఎవరికోసం వేచి చూడారు.. అందుకే ప్రైవేట్ వ్యాన్లనే మేం నమ్ముకుంటున్నా’మని చెప్పారు. ‘మాకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతి మేరకు ఏడు లేక ఎనిమిది మంది విద్యార్థులను మాత్రమే ఎక్కించుకుపోవాలి. అయితే దానివల్ల మాకు ఉపయోగం ఉండదు. అదనపు ఆదాయం కోసం ఎక్కువ మంది విద్యార్థులను ఎక్కించుకోవడం తప్ప మాకు గత్యంతరం లేదు.. అని తన పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక వ్యాన్ డ్రైవర్ స్పష్టం చేశాడు. -
హవ్వ.. ఇదేం విచిత్రం!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: క్షేత్రస్థాయి అధికారుల పోస్టుల భర్తీ పట్టించుకోని సమాచార, ప్రజా సంబంధాల శాఖ ఉన్నత స్థాయిలో కొత్త పోస్టుల సృష్టికి ఉబలాటపడుతోంది. జిల్లాస్థాయిలో ప్రస్తుతం ప్రజా సంబంధాల అధికారి(డీపీఆర్ఓ) పర్యవేక్షణలో సమాచార, ప్రజా సంబంధాల శాఖ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. డీపీఆర్ఓ పోస్టును కొనసాగిస్తూనే కొత్తగా డిప్యూటీ డెరైక్టర్(డీడీ) లేదా అసిస్టెంట్ డైరక్టర్(ఏడీ) పోస్టులను సృష్టించారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 12 డీడీ, 13 ఏడీ పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మెదక్ జిల్లాకు ఈ ఇద్దరిలో ఏ హోదా అధికారి వస్తారో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. జిల్లాలో డీపీఆర్ఓతో పాటు, ముగ్గురు డివిజనల్ పీఆర్వోలు పనిచేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ పోస్టులన్నీ ఖాళీగా ఉండటంతో రంగారెడ్డి జిల్లా డివిజనల్ పీఆర్వో ప్రణీత్ డిప్యూటేషన్పై మెదక్ జిల్లా డీపీఆర్ఓగా పనిచేస్తున్నారు. సిద్దిపేట డివిజనల్ పీఆర్వో ఆరోగ్య కారణాలతో చాలాకాలంగా సెలవులో ఉన్నారు. మెదక్, సంగారెడ్డిలో డివిజనల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల పదవీ విరమణ చేసిన పబ్లిసిటీ అసిస్టెంట్ నాగభూషణంకు పౌర సరఫరాల విభాగం ద్వారా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వేతనం చెల్లిస్తూ మెదక్ డివిజన్ బాధ్యతలు అప్పగించారు. రెండు అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్(ఏపీఆర్ఓ) పోస్టులూ ఖాళీగానే ఉన్నాయి. ఆరుగురు పబ్లిసిటీ అసిస్టెంట్లకు గాను ఇద్దరే జిల్లా కేంద్రంలో పనిచేస్తున్నారు. వీరిలో ఒకరు నల్గొండ జిల్లా నుంచి డిప్యూటేషన్పై వచ్చినవారే కావడం గమనార్హం. ఫొటోగ్రాఫర్ లేకపోవడంతో ఆర్వీఎం ద్వారా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఓ వ్యక్తిని నియమించి నెట్టుకొస్తున్నారు. ఉన్న ఒక్క ఆడియో విజువల్ పబ్లిసిటీ అసిస్టెంట్ పోస్టూ ఖాళీగానే ఉంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది నియామకంపై దృష్టి పెట్టని ప్రభుత్వం అధికారుల పోస్టులను మాత్రం ఉదారంగా మంజూరు చేయడంపై విమర్శలు వస్తున్నాయి.