Priyadarshini
-
అత్తమామలపై కోడలు పైశాచికం
యశవంతపుర: బెంగళూరులోని ఓ వైద్యురాలు తన ఇద్దరు పిల్లలతో కలిసి వృద్ధులైన అత్తమామలపై విచక్షణారహితంగా దాడిచేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. బెంగళూరు విక్టోరియా ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్న డాక్టర్ ప్రియదర్శిని, తన ఇద్దరు పిల్లలతో కలిసి ఈనెల 10వ తేదీ రాత్రి తన అత్తమామలపై పైశాచికంగా దాడిచేశారు. ఈ వీడియో చూసి నెటిజన్లు భగ్గుమన్నారు.. దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ ‘ఎక్స్’లో డిమాండ్ చేస్తూ ఈ పోస్టును బెంగళూరు నగర పోలీసు కమిషనర్కు ట్యాగ్ చేశారు. బాధిత వృద్ధుడు జె.నరసింహయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రియదర్శినిపై కేసు నమోదు చేశారు. తన కొడుకు నవీన్కుమార్, కోడలు ప్రియదర్శిని విడాకులు తీసుకోడానికి 2007లో ఫ్యామిలీ కోర్టులో కేసు వేశారని.. కేసు చివరి దశకు చేరుకున్న సమయంలో ఆమె ఈ దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో వివరించారు. -
ప్రియదర్శి డార్లింగ్ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్
-
ప్రియదర్శి - రాహుల్ రామకృష్ణ
-
కథ వినగానే మా అమ్మ గుర్తొచ్చింది- రానా
‘‘పాఠశాలలో చదువుతున్నప్పుడు 35 నంబర్ నాకు పెద్ద పర్వతంలాంటిది (నవ్వుతూ). నందు ‘35–చిన్న కథ కాదు’ చెప్పినప్పుడు నాకు నేను గుర్తొచ్చాను, మా అమ్మ గుర్తొచ్చింది. ఈ కథని మా అమ్మకు చెప్పాను. ఇది మన అందరి కథ. ఈ కథని అందరూ రిలేట్ చేసుకుంటారు’’ అని హీరో రానా దగ్గుబాటి అన్నారు. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘35–చిన్న కథ కాదు’. నంద కిశోర్ ఈమాని దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. బుధవారం హైదరాబాద్లో నిర్వహించిన ఈ చిత్రం టీజర్ లాంచ్ ఈవెంట్లో రానా మాట్లాడుతూ– ‘‘వాణిజ్య సినిమాలు చాలా వస్తుంటాయి. కానీ ఇలాంటి ప్యూర్ హార్ట్ వార్మింగ్ స్టోరీలు రావడం చాలా అరుదు. ఇలాంటి మంచి కథలు సురేష్ ప్రొడక్షన్లో చేయాలనేది మా ఉద్దేశం. థియేటర్స్లో ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు. ‘‘35–చిన్న కథ కాదు’లో తల్లి పాత్రలో కనిపిస్తాను. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రల్లో చాలా డిఫరెంట్ క్యారెక్టర్ని ఈ సినిమాలో చేశాను’’ అన్నారు నివేదా థామస్. ‘‘35–చిన్న కథ కాదు’ చాలా పెద్ద సినిమా’’ అన్నారు నంద కిశోర్. ‘‘ఈ సినిమా గొప్ప అనుభూతినిస్తుంది. మాకు మైలురాయిగా నిలిచి΄ోతుంది’’ అన్నారు సృజన్ యరబోలు. ఈ కార్యక్రమంలో నటుడు విశ్వదేవ్ మాట్లాడారు. -
భార్యకు స్పెషల్గా విష్ చెప్పిన టాలీవుడ్ హీరో.. పోస్ట్ వైరల్!
టాలీవుడ్ యంగ్ హీరో మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. సుధీర్ బాబు హీరోగా నటించిన చిత్రం హరోం హర. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో మాళవిక శర్మ జంటగా కనిపించనుంది. ఈ చిత్రాన్ని జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీని మే 31న రిలీజ్ చేయాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాలతో వాయిదా వేశారు. వచ్చేనెల జూన్ 14న రిలీజ్ చేయనున్నట్లు సుధీర్బాబు ప్రకటించారు. 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.అయితే సుధీర్ బాబు.. సూపర్ స్టార్ కృష్ణ కూతురు ప్రియదర్శినిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే సుధీర్, ప్రియదర్శినిల పెళ్లి మే 29,0 2006లో ఘనంగా జరిగింది. తాజాగా వివాహా వార్షికోత్సవం సందర్భంగా అరుదైన ఫోటోను పంచుకున్నారు సుధీర్. తన భార్య ప్రియదర్శిని పెళ్లిచూపుల ఫోటోను ట్విటర్లో పంచుకున్నారు. ఈ సందర్భంగా వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. నాతో ఉన్నప్పటి తన మొదటి ఫోటో.. అంతేకాదు పెళ్లిచూపుల ఫోటో అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు హీరో జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. Happy Anniversary my love 'Priya' 💐 You complete me 😘🤗…. First pic of hers I have with me. Pellichoopulu photo 😄 pic.twitter.com/005YWnBIzZ— Sudheer Babu (@isudheerbabu) May 29, 2024 -
మాస్క్ తో చేసే సీన్స్ లో నేను ఎంత ఇబ్బంది పడ్డానంటే!
-
ఈ సినిమాలో నన్ను ఎవరైనా చూస్తారా లేదా అని భయమేసింది
-
గణనాథుని సేవలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
యాదమరి (చిత్తూరు జిల్లా): కాణిపాక శ్రీవరసిద్ధి వినాయక స్వామిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రియదర్శిని సోమవారం దర్శించుకున్నారు. ఉదయం ఆమె కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనార్థం కాణిపాకం విచ్చేయగా ఆలయ ఏఈవో విద్యాసాగర్రెడ్డి స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం ఆశీర్వాద మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించి స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ కోదండపాణి, ఇన్స్పెక్టర్ బాబు పాల్గొన్నారు. -
Priyadarshini Karve: పొగరహిత కుక్కర్ తో.. పొగకు పొగ పెట్టవచ్చు!
శతకోటి సమస్యలకు అనంతకోటి పరిష్కారాలు ఉన్నాయట! మనం చేయాల్సిందల్లా... ఆ పరిష్కారాల గురించి ఆలోచించడం. చిన్నప్పుడు తనకు ఎదురైన సమస్యను దృష్టిలో పెట్టుకొని దానికి శాస్త్రీయ పరిష్కారాన్ని అన్వేషించింది ప్రియదర్శిని కర్వే. ‘సముచిత ఎన్విరో టెక్’తో పర్యావరణ ప్రేమికులను ఆకట్టుకుంటోంది... చిన్నప్పుడు స్కూల్కు వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు దారిలో తీయగా పలకరించే చెరుకుతోటలను చూసేది ప్రియదర్శిని. ఈ తీపిపలకరింపుల మాట ఎలా ఉన్నా తోటల్లో పంటవ్యర్థాలను దహనం చేసినప్పుడు నల్లటిపొగ చుట్టుముట్టేది. తోట నుంచి ఊళ్లోకి వచ్చి అక్కడ అందరినీ ఉక్కిరిబిక్కిరి చేసేది. ‘ఈ సమస్యకు పరిష్కారం లేదా!’ అనే ఆలోచన ఆమెతో పాటు పెరిగి పెద్దదైంది. పుణెకు సమీపంలోని పల్తాన్ అనే చిన్నపట్టణానికి చెందిన ప్రియదర్శిని కర్వే సైంటిస్ట్ కావాలనుకోవడానికి, సైంటిస్ట్గా మంచిపేరు తెచ్చుకోవడానికి తన అనుభవంలో ఉన్న వాయుకాలుష్యానికి సంబంధించిన సమస్యలే కారణం. కేంద్రప్రభుత్వం ‘యంగ్ సైంటిస్ట్’ స్కీమ్లో భాగంగా వ్యవసాయవ్యర్థాలకు అర్థం కల్పించే ప్రాజెక్ట్లో పనిచేసింది ప్రియదర్శిని. ఇది తొలి అడుగుగా చెప్పుకోవచ్చు. 2004లో స్కాట్లాండ్లోని ‘యూనివర్శిటీ ఆఫ్ ఎడిన్బర్గ్’లో బయోచార్ రిసెర్చ్ సెంటర్లో చేరింది. బయోమాస్ సాంకేతికతను లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ రిసెర్చ్ సెంటర్ ఉపయోగపడింది. ఎంతోమంది ప్రముఖులతో మాట్లాడి, ఎన్నో విషయాలపై అవగాహన ఏర్పర్చుకునే అరుదైన అవకాశం దీని ద్వారా లభించింది. ‘సముచిత ఎన్విరో టెక్’ అనే కంపెనీ స్థాపించి పర్యావరణ అనుకూల వస్తువుల ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది ప్రియదర్శిని. తోటలోని చెట్ల వ్యర్థాలను తొలగించడం అనేది పెద్ద పని. చాలామంది ఆ వ్యర్థాలను ఒక దగ్గర చేర్చి మంట పెట్టి ఇబ్బందులకు గురవుతుంటారు. చుట్టుపక్కల వారిని ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ‘సముచిత ట్రాన్స్ఫ్లాషన్ క్లీన్’తో అందరి దృష్టిని ఆకర్షించింది ప్రియదర్శిని. ఇది రివల్యూషనరీ డిజైన్గా పేరు తెచ్చుకుంది. ఈ బాక్స్ బట్టీలో తోట వ్యర్థాలను వేసి, మంటపెట్టి మూత పెడతారు. అవి బయోచార్ ఇంధనంగా మారుతాయి. ప్రియదర్శిని మరో ఆవిష్కరణ పొగరహిత కుక్కర్. ‘వంటగది కిల్లర్’ అనే మాట పుట్టడానికి కారణం అక్కడ నుంచి వెలువడే పొగతో మహిళలు రకరకాల ఆరోగ్యసమస్యలకు గురికావడం. కట్టెలు, బొగ్గు మండించి వంట చేయడం తప్ప వేరే పరిష్కారం కనిపించని పేదలకు ఈ పొగరహిత కుక్కర్ సరిౖయెన పరిష్కారంగా కనిపించింది. కొద్ది మొత్తంలో బయోచార్ని ఉపయోగించి దీనితో వంట చేసుకోవచ్చు. పొగకు పొగ పెట్టవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పట్టణ ప్రాంత ప్రజల కోసం ‘కార్బన్ ఫుట్ప్రింట్ క్యాలిక్యులెటర్’ను తయారుచేసిన ప్రియదర్శిని కర్వే కొత్త కొత్త ఆవిష్కరణలపై దృష్టి పెట్టడమే కాదు పర్యావరణ పరిరక్షణకు సంబంధించి పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అవగహన సదస్సులు నిర్వహిస్తోంది. వీటివల్ల తనకు తెలిసిన విషయాలను స్థానికులతో పంచుకోవడమే కాదు తనకు తెలియని సమస్యల గురించి కూడా తెలుసుకొని వాటి పరిష్కారానికి ఆలోచన చేస్తోంది ప్రియదర్శిని కర్వే. -
బుల్లితెర నటుడి భార్య మృతి, డైట్ మార్పులే కారణమా?
తమిళ నటుడు భరత్ కళ్యాణ్ భార్య ప్రియదర్శిని (43) కన్నుమూశారు. గత కొన్నివారాలుగా కోమాలో ఉన్న ఆమె సోమవారం ఉదయం 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆమె మృతికి డైట్ మార్పులే కారణమని తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం ప్రియదర్శిని పలియో డైట్ స్టార్ట్ చేశారు. సడన్గా ఆహారపు అలవాట్లు మార్చుకోవడంతో ఆమె రక్తంలో షుగర్ లెవల్స్ విపరీతంగా పెరిగిపోయాయట. మూడు నెలల క్రితం పరిస్థితి సీరియస్ కావడంతో ఆమెను చెన్నైలోని ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత ఆమె కోమాలోకి వెళ్లగా తాజాగా మరణించారు. కాగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటుడిగా పేరు తెచ్చుకున్న కల్యాణ్ కుమార్ తనయుడే భరత్ కల్యాణ్. మొదట్లో సినిమాలు చేసిన ఆయన తర్వాత బుల్లితెరపై తన సత్తా చాటుతున్నాడు. అపూర్వ రంగల్, వంశం, జమిలా వంటి సీరియల్స్తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు భరత్ కల్యాణ్. చదవండి: ప్రముఖ బుల్లితెర నటి మృతి ఇనయను ఆడుకున్న హౌస్మేట్స్, శ్రీహాన్ లాస్ట్ పంచ్ అదిరింది -
రూ. 3 కోట్ల మోసం, శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన యంగ్ హీరో ఇతడే
Shilpa Choudhary Cheating Case: అధిక వడ్డి ఇప్పిస్తానంటూ పలువురు సెలబ్రెటీ వద్ద కోట్ల రూపాయలు వసూలు చేసిన వ్యాపారవేత్త శిల్పా చౌదరి చీటింగ్ కేసులో రోజురోజుకు కీలక విషయాలు బయట పడుతున్నాయి. ఆమె చేతిలో మోసపోయిన సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరి, యంగ్ హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని శిల్పా చౌదరిపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కిట్టి పార్టీల పేరుతో శిల్ప తన దగ్గర సుమారు 3 కోట్ల రూపాయలు తీసుకుని ఇవ్వడం లేదంటూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు శిల్పను మరోసారి కస్టడిలోకి తీసుకుని ఆరా తీస్తున్నారు. చదవండి: పోలీసులను ఆశ్రయించిన మహేశ్ బాబు సోదరి ప్రియదర్శిని ఈ క్రమంలో శిల్ప చేతిలో మోసపోయానంటూ మరో టాలీవుడ్ సెలబ్రెటీ బయటకు వచ్చాడు. యంగ్ హీరో హర్ష్ కనుమిల్లి శిల్ప మాయమాటలు నమ్మి నట్టేట మునిగాడు. కిట్టి పార్టీ పేరుతో మాయ మాటలు చెప్పి శిల్ప తన దగ్గర రూ. 3 కోట్లు వసూలు చేసిందట. ఆ డబ్బు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తొందంటూ ఈ యంగ్ హీరో పోలీసులను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. కాగా ‘సెహరి’ సినిమాతో హర్ష్ కనుమల్లి హీరోగా పరిచయమయ్యాడు. వీరితో పాటు మరో స్టార్ హీరో కూడా శిల్ప బాధితుల్లో ఉన్నట్లు సమాచారం. కాగా కిట్టి పార్టిలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో శిల్పా చౌదరి సెలబ్రెట్రీలతో పాటు నగరానికి చెందిన ప్రముఖుల వద్ద దాదాపు రూ. 200 కోట్లు రూపాయలు వసూలు చేశారు. చదవండి: అన్నయ్యను ఇలా పరిచయం చేస్తాననుకోలేదు: హీరో ఆవేదన ఆమె మాయమాటలకు ప్రముఖ టాలీవుడ్ హీరో కుటుంబం కూడా రూ. 12 కోట్లు మోసపోయినట్లు సమాచారం. వారు టాలీవుడ్ అగ్రహీరోకు అత్యంత ఆప్తులుగా తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి కోసం ఒక్కొక్కరి వద్ద రూ. 6 కోట్ల చొప్పున మొత్తం 12 కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. మరో సీనియర్ నటుడు కూడా రూ. 2.4 కోట్లు మోసపోయినట్లు సమాచారం. శిల్పా చౌదరి బాగోతాలు వెలుగులోకి రావడంతో బాధితులు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట తదితర పోలీస్ స్టేషన్ల్లో ఫిర్యాదు చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: వైరల్ అవుతోన్న కమెడియన్ రఘు షాకింగ్ వీడియో! కాగా యంగ్ హీరో సుధీర్బాబు భార్య ప్రియదర్శిని దగ్గర 2 కోట్ల 90 లక్షల రూపాయలు తీసుకుని మూడు నకిలీ చెక్కులు, నకిలీ బంగారాన్ని ష్యూరిటీ కింద ఇచ్చినట్టు బయట పడింది. చెక్కు మార్చేందుకు ఇండియన్ బ్యాంక్కు వెళ్లిన ప్రియదర్శిని.. మోసపోయినట్టు తెలుసుకుని అవాక్కయింది. దీంతో పోలీసులను ఆశ్రయించింది. శిల్పా చౌదరి 50 కోట్ల రూపాయలు హవాలా ద్వారా దుబాయ్ తరలించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శిల్పా చౌదరికి చెందిన 6 బ్యాంక్ అకౌంట్స్పై నార్సింగ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. -
పోలీసులను ఆశ్రయించిన మహేశ్ బాబు సోదరి ప్రియదర్శిని
Young Hero Sudheer Babu Wife Priyadarshini Files Complaint Over Rs 2.9 Crore Cheating Case: అధిక వడ్డి ఇప్పిస్తానంటూ ముగ్గురు టాలీవుడ్ హీరోలతో పాటు నగరానికి చెందిన ప్రముఖులను మోసం చేసిన వ్యాపారవేత్త శిల్పా చౌదరి వ్యవహరం సంచలనం రేపుతోంది. రూ. 100 కోట్ల నుంచి రూ. 200 కోట్ల మేర శిల్ప పలువురికి కుచ్చు టోపి పెట్టింది. దీంతో ఓ మహిళ చేతిలో అంత ఈ జీగా మోసపోయింది పేరున్న వ్యక్తులు, సెలబ్రెటీలు అని తెలిసి అందరూ షాకవుతున్నారు. చదవండి: ఏపీ వరదలు: బాధితుల కోసం చిరంజీవి, మహేశ్, తారక్ల భారీ విరాళాలు దివ్య రెడ్డి అనే మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు శిల్ప ఆమె భర్తను శనివారం (నవంబర్ 27) ఉదయం అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్కు తరలించారు. ఇక వారి రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. రియల్ ఎస్టెట్ వ్యాపారం పేరుతో శిల్ప మోసాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసు వెలుగులోకి వచ్చిన 5 రోజుల తర్వాత ఓ అగ్ర హీరో సోదరి, యంగ్ హీరో భార్య మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు. చదవండి: Cheating Case: సినీ సెలబ్రిటీలను రూ. 200 కోట్లు మోసం, రిమాండ్లో కీలక విషయాలు వెల్లడి ఆమె ఎవరో కాదు సూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరి, యంగ్ హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని. శిల్ప తన దగ్గర డబ్బు తీసుకుని మోసం చేసిందంటూ బుధవారం(డిసెంబర్ 1) ప్రియదర్శని పోలీసులను ఆశ్రయించారు. తన వద్ద రూ. 2.9 కోట్లు తీసుకుని శిల్ప మోసం చేసినట్లు ఆమె మాదాపూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డబ్బుల కోసమే ఆమె ప్రతి వీకెండ్లో కిట్టి పార్టీ ఏర్పాటు చేసేదని ప్రియదర్శిని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శిల్పను మరోసారి కస్టడిలోకి తీసుకుని డబ్బులు ఎక్కడికి తరలించారనే దానిపై విచారిస్తామని పోలీసులు తెలిపారు. -
మహేశ్బాబు చెల్లెలు, సుధీర్ బాబు భార్య బర్త్డే సెలబ్రేషన్స్
Mahesh Babu Sister Sudheer Babu Wife Priya Darshini Birthday Celebrations: సూపర్స్టార్ మహేశ్ బాబు చెల్లెలు, హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని ఘట్టమనేని పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఇంట్లోనే కుటుంబసభ్యుల మధ్య బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి. సూపర్ స్టార్ కృష్ణతో, మంజుల సహా పలువురు కుటుంబ సభ్యుల మధ్య ప్రియదర్శిని కేక్ కట్ చేసి పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చదవండి: సమంత ఇన్స్టా పోస్ట్.. పర్సనల్ లైఫ్ గురించేనా? సుధీర్బాబు సైతం భార్యకు బర్త్డే విషెస్ తెలియజేస్తూ ఇన్స్టాగ్రామ్లో పోస్టును షేర్చేశారు. 'హ్యాపీ బర్త్డే ప్రియ..నీతో ప్రతీ సంవత్సరం మునుపటి ఏడాది కంటే మెరుగ్గా ఉంటుంది. ప్రతిరోజూ కుటుంబాన్ని ఎంతో సంతోషంగా చూసుకుంటూ ప్రేమను పంచుతున్నందుకు ధన్యవాదాలు' అంటూ శ్రీమతికి ప్రేమగా బర్త్డే విషెస్ను తెలియజేశారు. చదవండి: హీరోయిన్ కాజల్ ముఖ్యమైన ప్రకటన..ఇన్స్టాలో పోస్ట్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Sudheer Babu (@isudheerbabu) -
క్యాబ్ డ్రైవర్ను కొట్టిన యువతి: మరో షాకింగ్ వీడియో వైరల్
లక్నో: ఇటీవల ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన ఓ యువతి క్యాబ్ డ్రైవర్ను కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. క్యాబ్ డ్రైవర్ తనను ఢీకొన్నాడని.. అతడిని తీవ్రంగా కొట్టింది. ఆమె ఫిర్యాదు మేరకు ఉత్తరప్రదేశ్ పోలీసులు క్యాబ్ డ్రైవర్ని అరెస్ట్ చేశారు. అయితే ఆ తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన రెండో ఫుటేజ్ పరిశీలించగా ఆ యువతి చెప్పినదానికి.. అక్కడ జరిగిన దానికి ఏమాత్రం పొంతన లేదని తేలింది. దీంతో ఆ యువతిపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆ యువతికి సంబంధించిన మరో షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. (చదవండి: ‘పోయిన పరువు తిరిగి తీసుకురాగలరా’... క్యాబ్ డ్రైవర్) లక్నోలో ప్రియదర్శిని నారాయణ యాదవ్కు సంబంధించిన వీడియో ఆమె ప్రవర్తనా తీరును స్పష్టంగా చెబుతోంది. ఆమె నివసిస్తున్న ప్రాంతంలో ఒకరు తమ ఇంటి గేటుకు నలుపు రంగు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నలుపు రంగు ఎందుకు వేశారంటూ ఆ ఇంటివారితో గొడవకు దిగింది. వెంటనే రంగు మార్చాలని గట్టిగా అరుస్తూ ఉంది. మీ వలన కాలనీ అంతా ప్రమాదంలో పడుతుందని పేర్కొంది. డ్రోన్స్ ద్వారా దాడి జరుగుతుంది అని ఆందోళన వ్యక్తం చేసింది. గట్టిగా అరుస్తూ.. కేకలు వేస్తుండడంతో కాలనీలో కొంత గందరగోళం ఏర్పడింది. రాత్రిపూట వచ్చి ప్రియదర్శిని గొడవ చేయడంతో ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఆమెతో మాట్లాడారు. పోలీసులతోనూ ఆమె గేటుకు ఉన్న నలుపు రంగు గురించే మాట్లాడింది. ఆమెకు నచ్చచెప్పేందుకు పోలీసులు తీవ్రంగా కష్టపడ్డారు. అనంతరం ఆమెను అక్కడి నుంచి పంపించారు. దీనికి సంబంధించిన వీడియోను కొందరు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. రెండేళ్ల కిందటి వీడియో అయినా ఇప్పుడు వైరలవుతోంది. క్యాబ్ డ్రైవర్పై దాడి నేపథ్యంలో ఇప్పుడు ఈ వీడియో హల్చల్ చేస్తోంది. ప్రియదర్శిని మానసిక పరిస్థితి బాగా లేదేమో అని నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మొదటి నుంచి ఇలాగే ఉందని చెబుతున్నారు. గేటుకు నల్లరంగు ఉంటే ఏమిటి? నీ ఒంటిపై కూడా నలుపు రంగు దుస్తులు ఉన్నాయి కదా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. This is the 2 Year Old Video Of #PriyadarshiniYadav Arguing with Neighbours over the Black Colour of their Main Gate. Credits: ig@be_harami#ArrestLucknowGirl #PriyadarshiniNarayan pic.twitter.com/KMB5eR6IW0 — Fackt Checker (@FacktChecker) August 5, 2021 -
Priyadarshini Nahar: విజయానికి ప్రధాన కారణం అదే...
‘మేం అంగవికలురం కాదు, దివ్యాంగులం’ అంటారు ప్రియదర్శినీ నహర్. అందరు పిల్లల్లాగానే ఆరోగ్యంగా పుట్టారు ప్రియా. చక్కగా ఆటపాటలతో బాల్యం అందంగా, ఆనందంగానే గడుస్తోంది. ఇంతలోనే విధి చిన్న చూపు చూసింది. ప్రియదర్శినికి ఆరు సంవత్సరాల వయసులో, పోలియో కాటు వేసింది. రెండు కాళ్లు చచ్చుపడిపోయాయి. శరీరం పనిచేయలేదు. ప్రియా నహర్ తన అచేతన స్థితికి కుంగిపోలేదు. తల్లిదండ్రుల సహకారంతో, ప్రోత్సాహంతో చదువుకోవటం ప్రారంభించింది. కామర్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు ప్రియదర్శినీ నహర్. అక్కడితో ఆగిపోలేదు. తనలాంటి ఎంతోమందికి చదువు చెప్పాలనుకున్నారు. అందుకోసం టెక్నాలజీని వాడుకోవాలనుకున్నారు ప్రియదర్శిని. ఆన్లైన్ క్లాసుల ద్వారా దివ్యాంగులకు పోటీ పరీక్షలకు కావలసిన శిక్షణ ఇవ్వాలనుకున్నారు. తనకు ఆలోచన వచ్చిన వెంటనే ఆచరణలో పెట్టారు. ఇందుకోసం పెద్ద ఆఫీసు తీసుకోలేదు. ఒక చిన్న గదిలో కూర్చుని, ముగ్గురు విద్యార్థులకు ఆన్లైన్లో ట్యూషన్ చెప్పటం ప్రారంభించారు. ఒకరి నుంచి ఒకరికి ఈ విషయం తెలిసి, ఉత్సాహవంతులైన చాలామంది దివ్యాంగులు ఆన్లైన్ క్లాసులకు కూర్చోవటం మొదలుపెట్టారు. క్రమేపీ విద్యార్థుల సంఖ్య పెరుగుతుండటంతో, పుణేలోని లా కాలేజ్ రోడ్డులో ‘యాష్ క్లాసెస్’ ప్రారంభించే స్థాయికి ఎదిగారు. ‘ది ఆసరా’ సంస్థ ప్రియా నహర్కి ఎంతగానో సహకరించింది. మార్కెటింగ్ ప్లాన్ చెప్పి, మరింతమంది విద్యార్థులు ఇందులో చేరేలా ఈ సంస్థ ప్రోత్సహించింది. ఇప్పుడు ‘యాష్ క్లాసెస్’ అంటే మంచి శిక్షణ సంస్థగా పేరు సంపాదించుకుంది. వందమందికి పైగా సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డు విద్యార్థులకు లెక్కలు, సైన్స్, ఇంగ్లీషు, కంప్యూటర్స్, ఎకనమిక్స్, కామర్స్ అంశాలలో మంచి శిక్షణ ఇస్తున్నారు ప్రియదర్శిని. తన దగ్గరే టీచర్లను వేసుకుని వారికి జీతాలు ఇచ్చే స్థాయికి చేరుకున్నారు ప్రియా నహర్. ఇప్పుడు ఈ సంస్థ ద్వారా రెండువేల మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. అంతేకాదు, ‘ఓపెల్ ఫౌండేషన్ ఫర్ బెటర్ ఫ్యూచర్’ అనే సంస్థను కూడా స్థాపించి, దివ్యాంగులకు రకరకాల వృత్తులలో శిక్షణ ఇస్తున్నారు. ముప్పై సంవత్సరాలుగా ఈ సంస్థను ప్రియదర్శిని విజయవంతంగా నడుపుతున్నారు. తన గురించి చెబుతూ... ‘‘మా ఇంట్లో నేనే పెద్దదాన్ని. నాకు ఒక చెల్లి, ఒక తమ్ముడు ఉన్నారు. చెల్లికి వివాహమైంది. పుణేలో ఉంటోంది. మా తమ్ముడు మంచి వస్త్ర వ్యాపారవేత్త అయ్యాడు. మా తల్లిదండ్రుల కృషి, పట్టుదలతో ఇప్పుడు నేను కొద్దికొద్దిగా నడవగలుగుతున్నాను. కుటుంబ సభ్యులతో హాయిగా గడుపుతున్నాను. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కూడా నాకు మంచి చదువు చెప్పించారు అమ్మవాళ్లు. నా కాళ్ల మీద నిలబడాలనుకున్నాను. బయటకు వెళ్లలేని పరిస్థితి నాది. అందువల్ల ఇంటి నుంచే ఏదో ఒక పని చేయాలనుకున్నాను. చదువుకునే రోజుల్లో నేను బ్రైట్ స్టూడెంట్ని కావటం వల్ల, చదువుకు సంబంధించిన వాటిమీదే నా దృష్టి పెట్టాను. అలా ప్రారంభమైంది యాష్ కోచింగ్ సెంటర్’’ అంటున్న ప్రియదర్శిని.. విద్యార్థులకు చదువుతో పాటు, బిహేవియరల్ అనలిస్టులతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్లో కూడా శిక్షణ ఇస్తున్నారు. కొంతమంది యోగా గురువులతో దివ్యాంగుల కోసం జిమ్ కూడా ప్రారంభించారు. ‘‘నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం. పిల్లలకు పాఠాలు చెప్పటంలో నాకు చాలా ఆనందం ఉంటుంది. ముందు నేను శ్రద్ధగా చదువుకుని, ఆ తరవాత పిల్లలకు చెబుతాను. చాలామంది విద్యార్థులు మంచి మంచి పొజిషన్లలో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో మంచి స్థాయిలో ఉంటూ, వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. వాళ్లని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంటుంది. నేను పెళ్లి చేసుకోకపోయినా, నాలాంటి చాలామంది పిల్లలకు తల్లిని. ‘నాణ్యమైన పని విజయానికి ప్రధాన కారణం’ అని నేను నమ్ముతాను’’ అంటారు ప్రియదర్శిని నహర్. Fortune World's 50 Greatest Leaders List: ఫార్చూన్ ఉమెన్ -
ఘనంగా సీనియర్ నటి శరణ్య కూతురి ఎంగేజ్మెంట్..
-
ప్రియరాగం
గ్రామీ అవార్డ్ల నామినీల జాబితాలో ‘బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్’ విభాగంలో స్థానాన్ని దక్కించుకొని అంతర్జాతీయ గుర్తింపు పొందింది ప్రియదర్శిని. ప్రియదర్శిని గురించి మాట్లాడుకోవాలంటే యూత్ను ఊపేస్తున్న ‘పెరిఫెరీ’ ఆల్బమ్ గురించి మాత్రమే కాదు... ఆమె బహుముఖప్రజ్ఞ, సేవాతత్వం గురించి కూడా మాట్లాడుకోవాలి. చిన్నాచితకా పనులు చేస్తూనే ‘అబ్బా! టైమ్ సరిపోవడం లేదు’ అని గొణుక్కుంటాం. పెద్ద పెద్ద పనులు చేస్తున్నవారి గురించి ఆలోచిస్తూ ‘ఒక్కరే ఇన్నిన్ని పనులు ఎలా చేస్తారు!’ అని కూడా ఆశ్చర్యపోతుంటాం. ‘టైమ్ మన చేతిలో ఉంటే అదృష్టం కూడా మన చేతిలో ఉంటుంది’ అని చెప్పడానికి నిలువెత్తు ఉదాహరణ... ప్రియదర్శిని. సింగర్ సాంగ్ రైటర్ స్విమ్మర్ ఎంటర్ప్రెన్యూర్ సోషల్ యాక్టివిస్ట్ ఆల్ట్రా–మారథానర్... ప్రియదర్శిని అనే పేరుకు ముందు ఇన్ని విశేషణాలు ఉన్నాయి. ‘నా పేరు నిలపాలి సుమా!’ అని పెద్దలు అంటుంటారు. నిలపడమేమిటి, అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది. ప్రియదర్శిని బామ్మ పేరు ప్రియదర్శిని. సేమ్ పేరు అన్నమాట! అమ్మమ్మ ఒడిలోనే సంప్రదాయ కర్నాటక సంగీతాన్ని నేర్చుకుంది. ముంబైలో పుట్టి పెరిగిన ప్రియదర్శిని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్–మేకింగ్, యాక్టింగ్లో శిక్షణ తీసుకుంది. ప్రసిద్ధ మ్యూజిక్ బ్యాండ్లు, సంగీతకారులతో కలిసి పనిచేసింది. మదర్ థెరెసా జీవితం ఆధారంగా తీసిన హాలివుడ్ సినిమా ‘ది లెటర్స్’లో సుభాషిణి దాస్ పాత్రలో ఒదిగిపోయింది. ప్యార్ క్యోం కియా, డి–కంపెనీ... మొదలైన బాలీవుడ్ సినిమాలలో పాటలు పాడి తన గాత్రంతో శ్రోతలను ఆకట్టుకుంది. వందకు పైగా రేడియో, టీవి కమర్షియల్స్కు తన గాత్రాన్ని అందించింది. నే పాడితే లోకమే ఆడదా... 2017లో ‘ఇట్ కాన్ట్ హ్యాపెన్ హియర్’ నాటకంలో నటించి రంగస్థలంపై కూడా తన ప్రతిభ చాటుకుంటుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే ‘పెరిఫెరీ’ ఆల్బమ్ ఒక ఎత్తు. ఆమె తొలి ఆల్బమ్ యూత్ను తెగ ఆకట్టుకుంది. సంప్రదాయ కర్నాటక సంగీతం, అమెరికన్ పాప్ మ్యూజిక్ కలయికగా వచ్చిన ఈ ఆల్బమ్ న్యూ ఏజ్ మ్యూజిక్లో తనదైన స్టాంప్ వేసింది. ‘నా చిన్నప్పటి కల నిజమైంది. ముంబైలోని గోరెగావ్లో పెరిగిన నాలాంటి తమిళ పొన్నుకు ఇలాంటి నిజాలు జీర్ణం చేసుకోవడం కాస్త కష్టమే’ అంటోంది ప్రియదర్శిని. ఆమె తన గురించి ఏమనుకుంటుంది సరే, మరి ఇతరులు? ఫైవ్ టైమ్ గ్రామీ విన్నర్ రాయ్ వుటెన్ ఇలా అంటారు... ‘ఆమె ఎంతోమందికి స్ఫూర్తి’ గానం, సాహిత్యంలోనే కాదు సాహసంలోనూ తనదైన ప్రత్యేకత చాటుకుంది ప్రియదర్శిని. అత్యంత ప్రతికూల వాతావరణంలో ఆల్ట్రా మారథాన్ రన్నర్గా 100–మైల్ హిమాలయన్ స్టేజ్ రేస్ పూర్తి చేసి రికార్డ్ సృష్టించింది. ఆ సమయంలో పోర్టర్లు, గైడ్లుగా బతుకుతున్న షేర్పాల జీవితాన్ని దగ్గరగా చూసే అవకాశం వచ్చింది. వాళ్లు దోపిడికి గురవుతున్నారనే వాస్తవం బోధ పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆల్ట్రా మారథాన్లను నిర్వహించడానికి ‘ది విండ్ ఛేజర్స్’ అనే కంపెనీ లాంచ్ చేసింది. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని షేర్పాల కుటుంబ సంక్షేమానికి కేటాయిస్తున్నారు. హోమ్ మ్యూజిక్ వీడియోలో ఒక దృశ్యం నమీబియా ఎడారిలో 250 కిలోమీటర్ల హార్డ్ కోర్ రేస్ మరో సాహసం ప్రియదర్శిని దృష్టిలో గానం, పరుగు రెండు వేరు విషయాలు కాదు. ఒకదానికొకటి అనుసంధానమైవి. ‘సృజనాత్మకత మరింత పదును తేలడానికి ఇది ఉపకరిస్తుంది’ అంటోంది ప్రియదర్శిని. సాహనం మాత్రమే కాదు సహాయం కూడా ఆమెకు ఇష్టమైన మాట. క్యాన్సర్ చికిత్స కోసం ముంబై మహానగరానికి వచ్చి ఆశ్రయం దొరకక ఇబ్బందిపడే పేదలకు ప్రియదర్శిని తల్లి తన వన్–బెడ్రూమ్ ఫ్లాట్లో ఆశ్రయం కల్పించేది. తల్లి నుంచి ఇలాంటి మంచి గుణాన్ని పుణికిపుచ్చుకున్న ప్రియదర్శిని ‘జనరక్షిత’ అనే స్వచ్ఛందసంస్థను ప్రారంభించింది. ‘జనరక్షిత’ ద్వారా ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని సౌకర్యాలు సమకూరుస్తుంది. బాలికల విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ను తగ్గించడానికి కృషి చేస్తుంది. కళ,సేవ,వ్యాపారరంగంలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది ప్రియదర్శిని. నామినీ జాబితాలో చోటు సంపాదించుకున్న మన కళాకారులు అనుష్క శంకర్, నేహా మహాజన్, శిల్పారావులకు అభినందనలు తెలియజేద్దాం. -
ఎవరి కథ వారిదే
మన సినిమాల్లో ఆడవాళ్లను గయ్యాళి వారిగా పరిచయం చేయడానికి కొన్ని ప్రత్యేకమైన సీన్లుంటాయి. వీధి కుళాయి దగ్గర పెద్ద నోరేసుకుని అరుస్తూ మిగిలిన అందరినీ హడలుగొడుతూ నీళ్లు పట్టుకునే సన్నివేశం కూడా ఆ కోవకు చెందినదే. అయితే అవన్నీ సమాజంలో ఉన్నవే. కానీ పైకి కనిపించే సంఘటనల వెనుక ఉన్న కారణాల జోలికి వెళ్లదు సినిమా. ఎందుకంటే ఆ చిత్రంలో ఆ పాత్ర పరిచయానికి అంతకంటే లోతుగా అధ్యయనం చేయాల్సిన పని ఉండదు. అలాగని మహిళను గయ్యాళిగా చూసే అభిప్రాయాన్ని సమాజం మెదడు నుంచి తుడిచేయకపోతే ఎలా? ఇదే పని చేస్తున్నారు ప్రియదర్శిని పళని. జీవిత రచన చెన్నైలో బ్లూ క్లబ్ పేరుతో ఒక మీడియా సంస్థ శ్రామిక వర్గ మహిళల కోసం పని చేస్తోంది. ప్రియదర్శిని ఆ సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్లలో ఒకరు. ఆమె చెన్నైలోని పెరుబాక్కమ్, తెదీర్ నగర్ వంటి ప్రదేశాలను సందర్శించి అనేక యదార్థ గాథలను డాక్యుమెంట్ చేస్తోంది. ఐదేళ్ల కిందట మొదలైన ఈ క్లబ్ ఇప్పటివరకు రెండు వందలకు పైగా మహిళల జీవితాలను వాళ్ల చేతనే గ్రంథస్థం చేయించింది. నిజానికి ఆ మహిళల్లో ఎవరూ కథ, కథనాల మధ్య తేడా తెలిసిన వాళ్లు కూడా కాదు. అయితే జీవితం నేర్పించినన్ని పాఠాలు మరే యూనివర్సిటీ కూడా నేర్పించలేదు. జీవితం ఇచ్చే శిక్షణ ముందు మిగిలిన శిక్షణలన్నీ దిగతుడుపే. ఇదే మాట చెబుతారు ప్రియదర్శిని. ఆమె అల్పాదాయ వర్గాలు నివసించే కాలనీలలో శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది. వాళ్లంతా ఏదో బడికి వెళ్లి చదవడం, రాయడం మాత్రమే నేర్చుకుని ఆ తర్వాత బతుకు పోరాటంలో భాగంగా పనుల్లో పడిపోయిన వాళ్లే. ఒక్కో మహిళను ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు రోజులో చేసే పనులను చెప్పమన్నప్పుడు అందరూ చెప్పడం మొదలు పెట్టారు. పైకి దాదాపుగా అందరి జీవితం ఒకటే మూసలో ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ తరచి చూస్తే ఎవరి అగాధం వారిదే. ఆ అగాధాన్ని దాటి రావడానికి వాళ్లు పడే శ్రమ కూడా దేనికదే ప్రత్యేకం. వాళ్ల జీవితాలను రిపోర్టు చేయడానికి వచ్చిన ఏ రిపోర్టర్ అయినా మహా అయితే... వీధి చివర్లో నీళ్ల కుళాయి దగ్గర నీళ్లు పట్టుకునే మహిళల దుస్థితిని దయనీయంగా కళ్లకు కట్టగలుగుతారేమో. నిజానికి ఆ బిందెడు నీళ్లు తీసుకెళ్లకపోతే ఇంట్లో ఆగిపోయే పనుల గురించి ఏకరువు పెట్టగలిగింది ఆ బాధను అనుభవిస్తున్న మహిళలే. నీళ్లు లేకుండా ఇంటికి వెళ్తే ఒక మహిళ ఇంట్లో భర్త చేతిలో దెబ్బలు తినాల్సి వస్తుంది. మరో ఇంట్లో ఆ మహిళ బిడ్డకు స్నానం చేయించకుండా చెంబుడు నీటిలో వస్త్రాన్ని తడిపి ఒంటిని తుడిచి సరిపెట్టాల్సి వస్తుంది. మరో ఇంట్లో ముసలి వాళ్లు ఉంటారు. నీళ్లు లేకపోతే ఎలాగా అనే బెంగతో అదే విషయాన్ని పలుమార్లు తలుచుకుంటూ కోడలిని సతాయిస్తుంటారు. ఇంకో ఇంట్లో బిందెడు నీళ్లు లేని కారణంగా స్కూలుకెళ్లాల్సిన పిల్లలకు అన్నం వండి బాక్సు పెట్టడానికి కుదరదు. అవసరానికి పనికొస్తాయని దుస్తుల అడుగున దాచుకున్న చిల్లర డబ్బులను పిల్లలకిచ్చి ఏదైనా కొనుక్కుని తినమని స్కూలుకు పంపిస్తుందా తల్లి. నీటి కుళాయి తగవులాట వెనుక, ఆటోవాలాకిచ్చే చిల్లర దగ్గర గొడవ పడడం వెనుక ఇంతటి విషాదాలుంటాయి. ఆ కష్టాలను యథాతథంగా పేపర్ మీద రాయమంటుంది ప్రియదర్శిని. తమ రోజువారీ కార్యక్రమాలను చెప్పడం మొదలైనప్పటి నుంచే వారిలో ఆలోచన విస్తరిస్తోంది. ఇక రాయడం మొదలు పెట్టిన తర్వాత వాళ్ల దృష్టి కోణం మరింతగా విస్తరిస్తోందని చెబుతున్నారు ప్రియదర్శిని. శ్రామిక వర్గ మహిళలు తాము జీవిస్తున్న జీవితాన్ని విశ్లేషించడంతోపాటు అందుకు దారి తీసిన మూల కారణాలను కూడా అన్వేషించగలుగుతున్నారు. కొందరి విషయంలో అవి కుటుంబ పరమైన కారణలయి ఉంటున్నాయి. మరికొందరికి ఆ కారణాలు సామాజికపరమైనవి అయి ఉంటున్నాయి. ‘శ్రామిక వర్గ మహిళల కష్టాలను నేను చూసి రాయడంకంటే వాళ్ల చేత రాయించగలిగితే అసలు కారణాలు బయటకు వస్తాయనుకున్నాను. అది నిజమని నా ప్రయత్నంలో నిర్ధారణ అయింది’ అంటున్నారు ప్రియదర్శిని. -
అందుకే ఐరన్ లేడీ చేస్తున్నా!
దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా మూడు నాలుగు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. వాటిలో నిత్యా మీనన్ నటిస్తున్న ‘ఐరన్ లేడీ’ ఒకటి. జయలలిత జీవితంతో మూడు నాలుగు సినిమాలు రూపొందుతున్న నేపథ్యంలో మీరు నటిస్తున్న ‘ఐరన్ లేడీ’ ప్రత్యేకత ఏంటి? ఒకే వ్యక్తి గురించి ఇన్ని సినిమాలు వస్తున్నా మీరు నటించడానికి కారణం ఏంటి? అనే ప్రశ్నలు నిత్యా మీనన్ ముందుంచితే – ‘‘నిజమే... జయలలితగారి జీవితంపై సినిమాలు, వెబ్ సిరీస్లు వస్తున్నాయని నాకు లె లుసు. అందుకే మనం ఎందుకు చేయాలి? అనే అనుమానం నాకూ వచ్చింది. నా సందేహాన్ని ‘ఐరన్ లేడీ’ దర్శకురాలు ప్రియదర్శిని ముందుంచాను. దానికి ఆమె చెప్పిన సమాధానం నాకు చాలా సంతృప్తినిచ్చింది. ‘జయలలితగారిపై ఎవరెన్ని సినిమాలు తీసినా తీయనివ్వండి. కానీ, మనం తీసే సినిమా ఎంత గొప్పగా ఉంటుందనేదే పాయింట్. నేను జయలలితగారిని వ్యక్తిగతంగా చాలాసార్లు కలిశాను. ఆమెను దగ్గరినుంచి గమనించాను, చాలా విషయాలు మాట్లాడాను’ అన్నారు ప్రియదర్శిని. ఆమె మాటల్లో చాలా కాన్ఫిడెన్స్ కనిపించింది. మనం మంచి సినిమా చేస్తున్నాం అనే నమ్మకం కలిగింది. అందుకే ధైర్యంగా ‘ఐరన్ లేడీ’లో నటిస్తున్నాను’’ అన్నారు. -
ప్రియదర్శినికి కాంస్యం
కోల్కతా: జాతీయ సీనియర్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ వెయిట్లిఫ్టర్ ప్రియదర్శిని కాంస్య పతకం సాధించింది. మంగళవారం జరిగిన మహిళల 49 కేజీల విభాగంలో ప్రియదర్శిని మొత్తం 168 కేజీల (స్నాచ్లో 70+క్లీన్ అండ్ జెర్క్లో 98) బరువెత్తి మూడో స్థానంలో నిలిచింది. మీరాబాయి జాతీయ రికార్డు: 49 కేజీల విభాగంలోనే భారత స్టార్ లిఫ్టర్ మీరాబాయి చాను కొత్త జాతీయ రికార్డు నెలకొల్పడంతోపాటు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. రైల్వేస్కు ప్రాతినిధ్యం వహిస్తున్న మణిపూర్కు చెందిన 25 ఏళ్ల మీరాబాయి మొత్తం 203 (స్నాచ్లో 88+ క్లీన్ అండ్ జెర్క్లో 115) కేజీలు బరువెత్తి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో 201 కేజీలతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. రైల్వేస్కే చెందిన మరో వెయిట్లిఫ్టర్ సంజిత చాను మొత్తం 185 కేజీలు (స్నాచ్లో 80+క్లీన్ అండ్ జెర్క్లో 105) బరువెత్తి రజత పతకాన్ని దక్కించుకుంది. -
అమ్మ లక్షణాలు ఆమెలో ఉన్నాయి
సినిమా: అమ్మ లక్షణాలు సహజంగానే ఆమెలో ఉన్నాయి అని మహిళా దర్శకురాలు ప్రియదర్శిని అన్నారు. ఈమె ఎవరి గురించి చెబుతున్నారో ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. అవును దర్శకురాలు ప్రియదర్శిని చెబుతున్నది నటి నిత్యామీనన్ గురించే. నవ దర్శకురాలైన ప్రియదర్శిని దివంగత ముఖ్యమంత్రి, ప్రఖ్యాత నటీమణి జయలలిత బయోపిక్ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో జయలలిత పాత్రకు నటి నిత్యామీనన్ను ఎంపిక చేసుకున్న సంగతి విదితమే. దీనికి ది ఐరన్ లేడీ అనే టైటిల్ను ఖరారు చేశారు. అయితే ఇదంతా జరిగి చాలా రోజులైంది. దీంతో ఈ చిత్రంపై రకరకాల ప్రచారం జరుగుతోంది. దీంతో దర్శకురాలు ప్రియదర్శిని స్పందిస్తూ శనివారం సాయంత్రం మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో ది ఐరన్లేడీ చిత్రం గురించి పలువురు పలు విధాలుగా ప్రశ్నిస్తున్నారు. వారందరికి వాస్తవాలను తెలియజేయాలని భావించాను. ఈ చిత్రం తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పరిపూర్ణ జీవితాన్ని ఆవిష్కరిస్తుంది. నిజ జీవిత అంశాలను పూర్తిగా చర్చించిన తరువాతనే జయలలిత పాత్రలో నటి నిత్యామీనన్ సరిగ్గా నప్పుతారని ఆమెను ఆ పాత్రకు ఎంపిక చేశాం, జయలలితలోని సహజమైన లక్షణాలన్నీ నిత్యామీనన్లో ఉన్నాయి. పురట్చి తలైవి అమ్మ మాదిరిగానే నిత్యామీనన్ ఆరు భాషల్లో సరళంగా మాట్లాడగలరు. తను చిన్నతనంలోనే భరతనాట్యం, క్రీడలు పరిచయం కలిగి ఉన్నారు. అంతే కాదు సంగీతంలోనూ ప్రతిభ కలిగిన నటి. జీవిత చరిత్రను తెరకెక్కించడం సవాలే. అదేవిధంగా బయోపిక్లతో పలు సమస్యలు, చర్చలు, విమర్శలు ఉన్నా, అమ్మ జీవిత చరిత్రను యథార్థంగా ఎలాంటి మార్పులు చేయకుండా తెరపై ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ కథను తెరకెక్కించడంలో దర్శకురాలిగా సవాళ్లు అధికమే. ప్రజలు అంగీకరించేలా, అలరించేలా ఒక మంచి చిత్రాన్ని రూపొందించే బాధ్యతను తీసుకున్నాం. సర్ రిచర్డ్ ఆటంబరో గాంధీ బయోపిక్ను తెరకెక్కించడానికి 18 ఏళ్ల సమయాన్ని ఖర్చు చేశారు. ఒక ఉన్నతమైన చిత్రాన్ని రూపొందించడానికి అంత సమయం అవసరం అవుతుందన్న విషయంలో మేమూ దృఢంగా ఉన్నాం. ఈ చిత్రంలో సగం విజయం సరైన కథాపాత్రలను ఎంపిక చేయడంలోనే ఉంది. ఈ విషయంలో రాజీకి చోటు ఉండదు. అలా కాంప్రమైజ్ అయితే మీరు కచ్చితంగా అంగీకరించరన్నది మాకు తెలుసు.అందుకే యథార్థం మీరకుండా పూర్తి స్వేచ్ఛతో ఈ చిత్రాన్ని మీ ముందుంచాలని భావించాం, చిత్రంలో మూడు ప్రధాన పాత్రలు పోషించనున్న నటీనటుల కాల్షీట్స్ కోసం వేచి ఉన్నాం. ఈ విషయాన్ని మీ ముందుంచడం సంతోషంగా ఉంది. ఈ ఆదరణతో అసాధ్యాన్ని సాధ్యం చేస్తాం. అని ది ఐరన్ లేడీ చిత్ర రూపకల్పనకు పూనుకున్న నవ దర్శకురాలు ప్రియదర్శిని పేర్కొన్నారు. -
భర్తకు ప్రేమతో.. గెలుపు బాధ్యత
భోపాల్: ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందనేది ఎంత వరకు నిజమో తెలీదు కానీ.. ప్రతి భర్త విజయం వెనుక భార్య శ్రమ ఉంటుందని రుజువు చేస్తున్నారు మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జ్యోతిరాదిత్య సింథియా భార్య.. ప్రియదర్శినీ రాజే. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంతో కీలకమైన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ ఒకటి. ఆ రాష్ట్రంలో పార్టీ విజయానికి ప్రియదర్శిని ఎంతో కష్టపడుతున్నారు. భర్త జ్యోతిరాదిత్య జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గుణ లోక్సభ నియోజకవర్గ గెలుపు బాధ్యతను ఆమె మోస్తున్నారు. మధ్యప్రదేశ్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన రెండు స్థానాల్లో గుణ ఒకటి. గత ఏడాది హోరాహోరీగా జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం వెనుక జ్యోతిరాదిత్యా కృషి అందరికీ తెలిసిందే. సీనియర్ నేత కమల్నాథ్ను పక్కన పెట్టి సీఎంగా కుర్చి కూడా అయననే వరిస్తుందని ఓ వర్గం నేతలు ఎంతో ధీమా వ్యక్తం చేశారు. కానీ ఫలితాల అనంతరం లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కమల్నాథ్కు సీఎం పీఠం అప్పగించి.. జ్యోతిరాదిత్యకు ఉప ముఖ్యమంత్రి పదవి అప్పగించారు. ఆ తరువాత దేశంలో పెద్ద రాష్ట్రమైన యూపీలో పార్టీ పుర్వవైభవం కోసం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. సింథియా, ప్రియాంక గాంధీను యూపీ బాధ్యులుగా నియమించారు. యూపీలో విజయం కోసం ప్రియాంకతో పాటు సింథియా విశ్వప్రయత్నలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సొంత నియోజకవర్గమైన గుణ ప్రచారానికి దూరమైయారు జ్యోతిరాదిత్య. గుణలో సింథియా కుటుంబానికి మంచి ఆదరణ ఉంది. 1967 నుంచి వరసగా వారి కుటింబికులే ఇక్కడ విజయం సాధిస్తూ వస్తున్నారు. దీంతో ఈసారి గెలుపు బాధ్యతను ఆయన భార్య ప్రియదర్శినీ రాజేపే మోపారు. లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన దగ్గర నుంచి గుణ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో విస్రృతంగా పర్యటిస్తూ.. ప్రజల అవసరాల గురించి ఆరాతీస్తూ.. ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మరాఠా గైక్వాడ్ రాజవంశానికి చెందిన ప్రియదర్శినీ రాజే.. ప్రత్యర్థి అభ్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే జ్యోతిరాదిత్య ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం గుణ స్థానంలో ఆయన భార్యను నిలపాలనే అనుకున్నారు. చివరి వరకూ ఇదే ప్రచారం జరిగినా.. కీలక ఎన్నికలు కావడంతో సింథియానే బరిలో నిలిపింది కాంగ్రెస్ అధిష్టానం. 2002లో తండ్రి మరణంతో ఈ స్థానం ఖాళీ కావడంతో తొలిసారి ఉప ఎన్నికల్లో గుణ ఎంపీగా గెలుపొందారు. ఇప్పటి వరకు నాలుగు సార్లు సింథియా విజయం సాధించారు. గత ఎన్నికల్లో లక్షన్నర ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థిపై గెలుపొందారు. మరోసారి తన భార్యపై ఉన్న నమ్మకంతో విజయంపై ధీమాగా ఉన్నారు. కాగా మరాఠా గైక్వాడ్ రాజవంశానికి చెందిన ప్రియదర్శినీ రాజేను 1994లో జ్యోతిరాదిత్యా సింథియా వివాహమాడిన విషయం తెలిసిందే. -
మిఠాయి బాగుంది
రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, కమల్ కామరాజు, శ్వేతవర్మ, అర్ష ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మిఠాయి’. ప్రశాంత్కుమార్ దర్శకత్వంలో డా. ప్రభాత్ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదలకానుంది. ఈ చిత్రం థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్న మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘అందరినీ ఆహ్లాదపరిచే చక్కటి వినోదాత్మక చిత్రమిది. డార్క్ కామెడీతో విభిన్న పాత్రల మధ్య సాగే కథ, కథనాలు ఆద్యంతం ప్రేక్షకులను అలరింపజేస్తాయి. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిల అభినయం సినిమాకే హైలైట్. నవరసాలను మేళవించి దర్శకుడు ఈ చిత్రాన్ని ఎంతో బాగా తీశాడు. వివేక్ సాగర్ సంగీతం వీనుల విందుగా ఉంటుంది. ప్రేక్షకులకు ఓ మంచి చిత్రాన్ని చూసిన అనుభూతి కలుగుతుంది’’ అన్నారు. భూషణ్ కల్యాణ్, రవివర్మ, గాయత్రి గుప్త, అదితీ మైఖేల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: రవివర్మన్ నీలమేఘం. -
కామెడీ మిఠాయి
‘మిఠాయి’ తియ్యగా ఉంటుందని అందరికీ తెలుసు. కానీ మా ‘మిఠాయి’ తినేది కాదు చూసేది’’ అంటున్నారు నిర్మాత డా. ప్రభాత్కుమార్. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, కమల్ కామరాజ్, శ్వేతావర్మ, ఆర్ష ముఖ్య తారలుగా ప్రశాంత్ కుమార్ దర్శకత్వం వహించారు. ‘‘చిత్రరంగంలో విశేష అనుభవం సంపాదించుకున్న నిర్మాత మామిడాల శ్రీనివాస్ ఫ్యాన్సీ ధరకు ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ను సొంతం చేసుకున్నారు’’ అని నిర్మాత తెలిపారు. రాజేశ్వరి ఫిలింస్, మూవీ మ్యాక్స్ సంస్థలు సంయుక్తంగా ఈ నెల 22న ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాయి. మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘ డార్క్ కామెడీతో విభిన్నమైన పాత్రల మధ్య సాగే చిత్రమిది. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి పాత్రలు పోటీపడి హాస్యాన్ని పంచుతాయి. అలాగే చిత్రంలో నవరసాలను దర్శకుడు ప్రశాంత్ చక్కగా తెరకెక్కించారు. స్క్రీన్ప్లే బాగా కుదిరింది. సంగీత దర్శకుడు వివేక్ సాగర్ మంచి బాణీలను అందించారు. సంగీతంతో పాటు కెమెరా, కామెడీ ఈ సినిమాకి హైలైట్గా నిలుస్తాయి’’ అన్నారు. ఈ చిత్రానికి పాటలు: కిట్టు విస్సాప్రగడ, మాటలు: బి.నరేశ్ రెడ్డి. -
ది ఐరన్ లేడి
మాజీ నటి, రాజకీయ నాయకురాలు, తమిళ ప్రజల ‘పురిట్చి తలైవి’ (విప్లవ నాయకురాలు) జయలలిత జీవితం ఆధారంగా తమిళంలో నాలుగు బయోపిక్స్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అందులో దర్శకురాలు ప్రియదర్శిని తెరకెక్కించబోయే ‘ఐరన్ లేడీ’ ఒకటి. ఈ సినిమాలో టైటిల్ రోల్ను నిత్యా మీనన్ పోషించనున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ– ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం విశేషాలను దర్శకురాలు ప్రియదర్శని పంచుకున్నారు. ‘‘జయలలితగారి పాత్ర పోషించడానికి చాలామంది హీరోయిన్ల పేర్లను పరిశీలించాం. ఫైనల్గా నిత్యా మీనన్ అయితే బావుంటుందని భావించాం. నిత్యా కూడా క్యారెక్టర్కు బాగా సూట్ అవుతున్నారు. జయలలితగారి ఆప్త మిత్రురాలు శశికళ పాత్రకు వరలక్ష్మీ శరత్కుమార్ని అనుకుంటున్నాం. మిగతా నటీనటుల పేర్లను చిత్రం ప్రారంభోత్సవం రోజు చెబుతాం’’ అన్నారు. సినిమా కథ గురించి చెబుతూ – ‘‘జయలలితగారి జీవితం మొత్తం మా సినిమాలో చూపించదలిచాం. ఆమె పుట్టినప్పటి నుంచి చివరి వరకూ (1948 నుంచి 2016 వరకూ) చిత్రకథ ఉంటుంది. సినిమాలకు, రాజకీయాలకు సమానమైన ప్రాముఖ్యతని ఇచ్చాం. ఏ ఘట్టాన్నీ పక్కన పెట్టుకోదలచుకోలేదు. జయలలితగారి అంత్యక్రియల సన్నివేశాలను కూడా చూపించనున్నాం. కానీ ఆసుపత్రిలో ఉన్న భాగాన్ని మాత్రం చూపించడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఆ విషయం మీద కోర్ట్లో కేసు నడుస్తోంది. ఇన్వెస్టిగేషన్ జరిగే సమయంలో ఏది కరెక్టో సరిగ్గా చెప్పలేం. అందుకే దాన్ని చూపించదలచుకోలేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న జయలలిత జన్మదినం రోజున ఈ చిత్రం ప్రారంభిస్తాం’’ అని ప్రియదర్శిని చెప్పుకొచ్చారు. దర్శకుడు భారతీరాజా, ఏయల్ విజయ్, లింగుస్వామి కూడా జయలలిత బయోపిక్స్ అనౌన్స్ చేశారు. -
ఐరన్ లేడీ!
ఆ మధ్య జయలలిత మీద వరుసగా బయోపిక్స్ అనౌన్స్ చేసింది తమిళ ఇండస్ట్రీ. ఏయల్ విజయ్, ప్రియదర్శిని, భారతీరాజా దర్శకులు అనే వార్త వచ్చింది. ఇప్పుడు ఈ ముగ్గురిలో దర్శకురాలు ప్రియదర్శిని ఒక అడుగు ముందుకువేసి ‘ఐరన్లేడీ’ అంటూ టైటిల్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఈ బయోపిక్లో వరలక్ష్మీ శరత్కుమార్ టైటిల్ రోల్ చేస్తారని సమాచారం. వచ్చే నెలలో ఓ గ్రాండ్ ఓపెనింగ్ ఫంక్షన్ నిర్వహించి, ఆ కార్యక్రమంలో నటీనటులను అనౌన్స్ చేయాలనుకుంటున్నారట. ‘‘ఎప్పటికీ తమిళుల గుండెల్లో ఉండిపోయేటువంటి జీవితాన్ని గడిపారు జయలలితగారు. ఈ సినిమా కచ్చితంగా ఆవిడకు మంచి నివాళిలా ఉండేలా ప్లాన్ చేస్తున్నాం’’ అని ప్రియదర్శిని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న జయలలిత పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను స్టార్ట్ చేయనున్నారు. -
‘ఐరన్ లేడి’గా వస్తున్న అమ్మ
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత... అటు వెండితెరపైనే కాకుండా.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. తమిళ ప్రజలకు అమ్మగా.. కోట్లాది ప్రజలకు దేవతగా... జయలలిత చేసిన సేవలను ఎన్నటికీ తమిళనాట చెరగని ముద్రనే. జయ జీవితం పూలపాన్పేమీ కాదు. ఎన్నో ఒడిదుడుకులను ఆమె ఎదుర్కొన్నారు. ప్రస్తుతం జయలలిత జీవితాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఆమె జీవితాన్ని బయోపిక్గా తీసుకురావడానికి సుమారు ఐదుగురు డైరెక్టర్లు ముందుకు వచ్చారు. వారిలో ఒకరు ప్రియదర్శిని. ప్రియదర్శిని డైరెక్ట్ చేయబోయే అమ్మ బయోపిక్ టైటిల్ పేరును, ఫస్ట్ లుక్ను డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ ఆవిష్కరించారు. ‘జయలలిత బయోపిక్ ‘ది ఐరన్ లేడి’ టైటిల్ పోస్టర్ను లాంచ్ చేయడం చాలా సంతోషంగా, ఉత్తేజితంగా ఉంది. ప్రియదర్శిని, టీమ్ గ్రాండ్ సక్సెస్ సాధించాలని ఆశిస్తున్నా’ అంటూ ఏఆర్ మురుగదాస్ ట్వీట్ చేశారు. ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా త్వరలోనే చాలా గ్రాండ్గా జరగనుందని కూడా ప్రకటించారు. ఈ బయోపిక్లో జయలలిత పాత్రలో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించబోతున్నారు. కోట్లాది ప్రజల హృదయాల్లో ఇప్పటికీ సజీవంగా నిలిచిన అమ్మ చిత్రం ‘ది ఐరన్ లేడి’ గురించి గత నాలుగు నెలలుగా చర్చిస్తూనే ఉన్నామని ప్రియదర్శిని తెలిపారు. తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ భాషల ప్రజలకు చేరేలా ఈ సినిమాను తీయాలని ప్లాన్ చేశామని చెప్పారు. ఈ సినిమా అమ్మకు నివాళిగా సమర్పించనున్నామన్నారు. జయలలిత పుట్టిన రోజు ఫిబ్రవరి 24 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా, జయలలిత సినిమా తీద్దామనుకున్న మరో లెజెండ్ డైరెక్టర్ దాసరి నారాయణ రావు. అమ్మ బయోపిక్ తీయాలని కోరిక నెరవేరకుండా దాసరి నారాయణ రావు కన్నుమూశారు. Extremely happy and excited to launch the Title poster of #Jayalalithaabiopic #THEIRONLADY I wish @priyadhaarshini and team for a grand success.. pic.twitter.com/4c87Xxks74 — A.R.Murugadoss (@ARMurugadoss) September 20, 2018 -
బాల్య వివాహాలొద్దు..చదువే ముద్దు
ఒంగోలు సెంట్రల్: బాల్య వివాహాలు వద్దు..ఆడ పిల్లలకు చదువే ముద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్శన్ ఎంజీ ప్రియదర్శిని అన్నారు. బుధవారం స్థానిక జిల్లా జడ్జి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. చైల్డ్లైన్, హెల్ప్ స్వచ్ఛంద సంస్థలు దాదాపు 200 బాల్య వివాహాలు నిలుపుదల చేసినట్లు తెలిపారు. వీరిలో పదో తరగతి ఫలితాల్లో ఐదుగురు విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని గుర్తు చేశారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, ప్రజల్లో అవగాహన కోసం పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాదయాత్ర కనిగిరిలో ప్రారంభమై వెలిగండ్ల వరకూ సాగిందని జిల్లా జడ్జి ప్రియదర్శిని వివరించారు. పారాలీగల్ వలంటీర్ బీవీ సాగర్ పాల్గొన్నారు. -
ప్రియదర్శినికి స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్కూల్ గేమ్స్ అండర్–19 వెయిట్లిఫ్టింగ్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి టి. ప్రియదర్శిని సత్తా చాటింది. హకీంపేట్లోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో 48 కేజీల విభాగంలో ఆమె స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో ప్రియదర్శిని స్నాచ్ విభాగంలో 62 కేజీలు, క్లీన్ అండ్ జర్క్ కేటగిరీలో 83 కేజీలతో ఓవరాల్ 145 కేజీల బరువునెత్తి విజేతగా నిలిచింది. ఈ విభాగంలో నూతన్ (మహారాష్ట్ర–125 కేజీలు), రమణ్దీప్ కౌర్ (పంజాబ్–123 కేజీలు) వరుసగా రజత, కాంస్యాలను సాధించారు. 44 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి బి. రాజేశ్వరి రాణించింది. ఆమె ఫైనల్లో 103 (48+55) కేజీల బరువునెత్తి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మహారాష్ట్రకు చెందిన రుతుజా ఠాకూర్ (121 కేజీలు) స్వర్ణాన్ని, తమిళనాడుకు చెందిన పూన్ గోడి (118 కేజీలు) రజతాన్ని గెలుచుకున్నారు. పోటీలకు ముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తూముకుంట ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీ నర్సయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్జీఎఫ్ఐ పరిశీలకుడు శర్మ, తెలంగాణ వెయిట్ లిఫ్టింగ్ అధ్యక్షులు కోటేశ్వర్ రావు, కార్యదర్శి శ్రీనివాస్ రావు, టోర్నీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎల్. రాజేంద్ర ప్రసాద్, రాష్ట్ర పరిశీలకుడు జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. -
'శక్తి'గా వస్తున్న స్టార్ వారసురాలు
కోలీవుడ్ సీనియర్ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా వెండితెరకు పరిచయం అయిన నటి వరలక్ష్మీ శరత్ కుమార్. కోలీవుడ్ లో గ్లామర్ హీరోయిన్ గా సత్తా చాటిన ఈ భామ ఇప్పుడు నటనకు ఆస్కారం ఉన్న పాత్రల మీద దృష్టి పెట్టింది. విశాల్ తో ప్రేమాయణం నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన ఈ భామ త్వరలో ఓ తెలుగు సినిమాతో ఆడియన్స్ ముందుకు రానుంది. శక్తి పేరుతో తెరకెక్కుతున్న ఈ మూడు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు ఫస్ట్ లుక్ పోస్టర్ ను టాలీవుడ్ హీరో రానా రిలీజ్ చేశాడు. ప్రియదర్శిని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ పూర్తి డిఫరెంట్ మేకోవర్ లో దర్శనమిస్తోంది. #shakthivaru good luck my friend!! @varusarath@sharanyalouis@priyadhaarshini@papertalestory pic.twitter.com/vtprTtMcSe — Rana Daggubati (@RanaDaggubati) 5 October 2017 -
ఆ ఇద్దరి బాటలో వరలక్ష్మీ శరత్కుమార్
తమిళసినిమా: నయనతార, త్రిష తరహాలో ఫెరోషియస్ పోషించడానికి నటి వరలక్షీ శరత్కుమార్ రెడీ అయ్యింది. తారాతప్పట్టై చిత్రంతోనే తన టాలెంట్ను నిరూపించుకున్న వరలక్ష్మీ ఇప్పుడు తమిళంతో పాటు మలయాళం, కన్నడం భాషలోనూ నటిస్తోంది. తాజాగా కోలీవుడ్లో హీరోయిన్ సెంట్రిక్ పాత్రను పోషించే అవకాశం వరించింది. దర్శకుడు మిష్కిన్ శిష్యుడు ప్రియదర్శిని మెగాఫోన్ పట్టనున్న ఈ చిత్రం త్వరలో సెట్పైకి వేళ్లనుంది. ఈ వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం హీరోయిన్ ఓరియెంటెడ్ కథగా ఉంటుందని చెప్పారు. హీరోయిన్గా వరలక్ష్మీశరత్కుమార్ నటించనున్నారని, ఆమె పాత్ర అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్గా ఉంటుందని తెలిపారు. వరలక్ష్మీ పాత్రకు ఫైట్ సన్నివేశాలు భారీగా ఉంటాయని చెప్పారు. ఇంకా చెప్పాలంటే క్యాట్ అండ్ మౌస్ గేమ్ తరహాలో ఆమె పాత్ర ఉంటుందని అన్నారు. ఇందులో హీరోగా నటించడానికి ఒక ప్రముఖ నటుడితో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. చిత్ర షూటింగ్ను చెన్నై, పూనె ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇది జనరంజకమైన అన్ని కమర్షియల్ అంశాలతో రూపొందనున్న చిత్రం అన్నారు. యాక్షన్, మిస్టరీ, రోడ్ థ్రిల్లర్ చిత్రంగా ఉంటుందని తెలిపారు. దీనికి శ్యామ్.సీఎస్ సంగీతం, బాలాజీ రంగా ఛాయాగ్రహణం అందించనున్నారు. చిత్రాన్ని అక్టోబర్ 15న ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఫస్ట్లుక్ను దర్శకుడు మిష్కిన్ బర్త్డే సందర్భంగా బుధవారం విడుదల చేయాలనుకున్నా, అందుకు పనులు పూర్తి కాకపోవడంతో విజయదశమి సందర్భంగా ఈ నెల 30న విడుదల చేయనున్నామని చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిం చనున్నట్లు చెప్పారు. -
అగ్గిపూలు
ఆదర్శం రైటర్స్ కేఫ్, చెన్నై, తమిళనాడు. ఇచట తీయటి కబుర్లతో కాఫీ తాగవచ్చు. ఇష్టమైన పుస్తకం చదువుకోవచ్చు. ఇష్టంగా ఏదైనా రాసుకోవచ్చు. నచ్చిన పుస్తకంపై చర్చలు చేయవచ్చు. ... ఇది మాత్రమే అయితే రాయపురలోని ‘రైటర్స్ కేఫ్’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. మరి ఏమిటి ఈ కేఫ్ ప్రత్యేకత? ‘ప్రత్యేకత’ అనడం కంటే... ‘విశిష్ఠత’ అనడం సబబుగా ఉంటుందేమో. ‘ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తమదైన స్థానం ఉంది’ అనే వాస్తవం వెలుగులో మొదలైన కేఫ్ ఇది. ఈ కేఫ్లో పనిచేసే ఏడుగురు మహిళలు... బర్న్ విక్టిమ్స్. ప్రతి ఒక్కరికీ తమదైన కన్నీటి చరిత్ర ఉంది. వాళ్లు...విధి చేత వెక్కిరించబడ్డారు. జీవితాన్ని ఇక చాలించాలనుకున్నారు. ఇప్పుడు ‘రైటర్స్ కేఫ్’ సహకారంతో కొత్త అడుగు వేస్తున్నారు. ఇరవై ఏళ్ల ప్రియదర్శినిని కదిలిస్తే ఇలా చెబుతుంది... ‘‘నా గురించి అమ్మ కన్న కలలను నిజం చేయలేకపోయాను. చదువులో రాణించలేకపోయాను. అమ్మ నన్ను మా బంధువుల ఇంట్లో పనికి కుదిర్చింది. అక్కడ కృంగుబాటులోకి వెళ్లిపోయాను. ఇక్కడి నుంచి తీసుకువెళ్లమని ఒకరోజు అమ్మను అడిగాను. ‘ఇక్కడే ఉండు... లేదా చావు...’ అని ఆమె కోపంగా అరిచింది. ఆత్మహత్య చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఒంటిపై కిరోసిన్ పోసుకొని అగ్గిపుల్ల వెలిగించాను. అదృష్టశాత్తు దగ్గర్లో ఉన్న చిన్న వాటర్ కంటైనర్ మీద పడిపోవడంతో ముఖం కాలలేదు’’ ‘‘రైటర్స్ కేఫ్లోకి అడుగు పెట్టిన తరువాత... కొత్త జీవితంలోకి అడుగు పెట్టినట్లు అనిపించింది’’ అంటుంది ప్రియదర్శిని. ఆస్మాది మరో కథ. ఆస్మా ప్రేమ వివాహం చేసుకుంది. తన భర్తకు గతంలోనే పెళ్లైన చేదు నిజం కాస్త ఆలస్యంగా తెలిసింది. తాగే అలవాటు ఉన్న భర్త రోజూ ఆస్మాను మానసిక, శారీరక హింసలకు గురి చేసేవాడు. ఇది తట్టుకోలేక ఒంటి మీద కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. అయితే కాలిన గాయాలతో ఆమె చాలా కాలం పాటు బాధ పడాల్సి వచ్చింది. భుక్తి కోసం ఎక్కడైనా పనిచేయాలన్నా ఈ కాలిన గాయాల గుర్తులు అడ్డంకిగా ఉండేవి. ఇలాంటి సమయంలో...‘రైటర్స్ కేఫ్’ ఆమెకు ఉద్యోగం ఇవ్వడమే కాదు... సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ధైర్యాన్ని ఇచ్చింది. ‘రైటర్స్ కేఫ్’లో పనిచేసే ఏడుగురిలో ఎవరిని కదిలించినా కన్నీటి కథలు ఎన్నో వినిపిస్తాయి. ‘‘సమాజమే కాదు... సొంతవాళ్లు కూడా మాలాంటి వాళ్లను సూటిపోటి మాటలతో అవమానిస్తుంటారు. మరోవైపు... నేను వికారంగా కనిపిస్తున్నానేమో అనే ఆలోచన మరింత కృంగుబాటులోకి తీసుకువెళుతుంది.ఇలాంటి సమయంలో బాధితులకు రైటర్స్ కేఫ్ అండగా నిలవడం అనేది గొప్ప విషయం’’ అంటుంది కేఫ్లో ట్రైనీగా చేరిన లూలు బుహారి. స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన చెఫ్ స్టాడ్లర్, సిబ్బందికి వంటలు చేయడంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ‘రైటర్స్ కేఫ్’ అనేది ‘ఓరియెంటల్ క్యుసైన్’ ఛైర్మన్ యం.మహాదేవన్ మానసపుత్రిక. కీల్పాక్ మెడికల్ కాలేజీ ‘బర్న్ వార్డ్’ నుంచి కేఫ్కు అవసరమైన సిబ్బందిని ఎంపిక చేసుకున్నారు మహాదేవన్. ఈ ప్రక్రియలో ‘క్రైమ్ ప్రివెన్షన్ అండ్ విక్టిమ్ కేర్’ (పీసీవీíసీ) సంస్థ తమ వంతు సహకారాన్ని అందించింది. పీసీవీసి అనేది గృహహింస బాధితుల కోసం పనిచేస్తున్న సంస్థ. ‘‘మా అమ్మ ఎప్పుడూ ఒక మాట చెబుతుండేవారు. ఈరోజు నువ్వు వంద రూపాయలు సంపాదిస్తే... అందులో 50 రూపాయలు మాత్రమే నీవి. మిగిలిన డబ్బును సమాజం కోసం ఉపయోగించు అని. సమాజం కోసం నావంతుగా ఏదైనా చేయాలనుకోవడానికి ఈ మాట ఎంతో ప్రేరణ ఇచ్చింది’’ అంటున్నారు మహాదేవన్. కేఫ్ అంటే కాఫీ కబుర్లతో సేద తీరే ప్రదేశం కావచ్చు. అయితే ఈ ‘రైటర్స్ కేఫ్’ మాత్రం.... అణువణువూ ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే చోటు. జీవితానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే చోటు. బతుకు సమరంలో విజయానికి సరికొత్త ఆయుధాన్ని ఇచ్చే చోటు. -
వ్యవసాయ శాఖలో ఉద్యోగుల సమ్మె
22న ప్రభుత్వానికి నోటీసు ఇవ్వాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ శాఖలో డైరెక్టర్కు, ఉద్యోగులకు మధ్య మళ్లీ వివాదం రగులుకుంది. ఇటీవల ఆ శాఖ డైరెక్టర్ ప్రియదర్శినికి, డిప్యూటీ డైరెక్టర్ రాములుకు మధ్య కొద్దిపాటి ఘర్షణ జరిగినట్లు తెలిసింది. దీంతో ప్రియదర్శిని పోలీసు కేసు వరకు వెళ్లినట్లు సమాచారం. ఇలా ఆ శాఖలో ఆమెకు, ఉద్యోగులకు మధ్య తరచు ఘర్షణ వాతావరణం నెలకొంటోందన్న విమర్శలున్నాయి. డైరెక్టర్ తమను వేధింపులకు గురి చేస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై గతంలో ఆందోళన చేశామని, మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, అయినా డైరెక్టర్ వైఖరిలో మార్పు రాలేదని, ప్రభుత్వం కూడా స్పందించలేదని ఉద్యోగులు చెబుతున్నారు. డైరెక్టర్ వైఖరికి నిరసనగా సమ్మె చేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.రాములు తెలిపారు. ఈనెల 22న సమ్మె నోటీసు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించామని, మిగతా సంఘాలతో చర్చిస్తున్నామని పేర్కొన్నారు. కీలక సమయంలో రైతులను పట్టించుకోవడం మానేసి, ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. సమ్మెను జిల్లాలకు కూడా వ్యాపింపజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఉద్యోగులంతా సమ్మె నిర్వహించి డైరెక్టర్పై చర్యకు డిమాండ్ చేయాలని నిర్ణయించామన్నారు. దీనిపై మంత్రి పోచారంను కలసి విన్నవించనున్నామని తెలిపారు. -
విడాకులిచ్చింది.. మళ్లీ కిడ్నాప్ చేసి పెళ్లి ...
సీబీసీఐడీ విచారణకు హైకోర్టు ఆదేశం కేకే.నగర్: ఈ భర్త నాకు వద్దంటూ విడాకులు తీసుకున్న ఓ భార్య ఆస్తి కోసం అదే వ్యక్తిని కిడ్నాప్ చేసి మళ్లీ పెళ్లి చేసుకుంది. ఈ కేసుపై సీబీసీఐడీ విచారణ జరపాలని మద్రాసు హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. చెన్నైకు చెందిన పారిశ్రామికవేత్త రాజన్ కుమారుడు మనోజ్. ఇతడు మానసిక దివ్యాంగుడు. అయితే 2008లో మనోజ్కు, ప్రియదర్శిని అనే యువతితో మైలాపూర్ ఆలయంలో వివాహం జరిగింది. పెళ్లైన ఏడాది లోపే విడాకులు కోరుతూ ప్రియదర్శిని పిటిషన్ దాఖలు చేసింది. మానసిక దివ్యాంగుడనే విషయాన్ని దాచి మనోజ్ తో తనకు పెళ్లి చేశారని పిటిషన్లో పేర్కొంది. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ పరిస్థితిలో కోట్ల రూపాయల ఆస్తులతోపాటు కుమారుడిని సంరక్షించే బాధ్యతను తన మిత్రుడు ఆనందన్కు అప్పగించి మనోజ్ తండ్రి రాజన్ 2013లో మృతి చెందాడు. అనంతరం మనోజ్ను కూడలూరు మానసిక దివ్యాంగుల కేంద్రంలో చేర్పించారు. గత నెల కూడలూరుకు చెందిన న్యాయవాదితో పాటు వెళ్లిన ప్రియదర్శిని... మనోజ్ను బలవంతంగా కిడ్నాప్ చేసి తనతో తీసుకెళ్లినట్లు దివ్యాంగుల కేంద్రం నిర్వాహకుల ద్వారా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాంతో ఈ సంఘటనపై విచారణ జరిపి నివేదిక దాఖలు చేయాలని ఆనందన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి పిఎన్.ప్రకాష్ ... మనోజ్ ఎక్కడ ఉన్నాడనే విషయాన్ని కనిపెట్టి సంరక్షణా కేంద్రంలో అప్పగించాలని పోలీసులను ఆదేశించారు. అయితే మనోజ్ను కిడ్నాప్ చేసి ప్రియదర్శిని మళ్లీ వివాహం చేసుకున్నట్లు తెలిసింది. దీంతో మళ్లీ కేసు న్యాయస్థానానికి చేరింది. దాంతో న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రియదర్శిని మనోజ్ను మళ్లీ వివాహం చేసుకోవాలనుకుంటే అందుకు కోర్టు అనుమతి తీసుకోవాలని సూచించారు. అలా చేయకుండా న్యాయవాదితో కలిసి మనోజ్ను కిడ్నాప్ చేసి అతనికి సొంతమైన 1.67 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ప్రియదర్శని సొంతం చేసుకునేందుకు కుట్ర పన్నిందని ఆరోపించారు. పేర్కొన్నారు. దీంతో న్యాయమూర్తులు ఈ కేసును సీబీసీఐడీ విచారణకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. -
ఖరీఫ్కు ఎరువులు, విత్తనాలు సిద్ధం
-వ్యవసాయశాఖ డెరైక్టర్ ప్రియదర్శిని వెల్లడి నర్సాపూర్ రూరల్ వచ్చే ఖరీఫ్ కోసం ఎరువులు, విత్తనాలు సిద్ధంగా ఉంచామని వ్యవసాయశాఖ డెరైక్టర్ ప్రియదర్శిని తెలిపారు. సోమవారం ఆమె మెదక్ జిల్లా నర్సాపూర్లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో 1.25 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేసేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సారి వర్షాలు బాగా కురుస్తాయని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగానే ఖరీఫ్ నాటికి రైతులను సమాయత్తం చేసేందుకు ‘మన తెలంగాణ- మన వ్యవసాయం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. మూడు ఎకరాల్లో పాలీహౌస్ ఏర్పాటు చేసుకున్న ఓసీ రైతులకు 80శాతం, బీసీలకు 90శాతం, ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం సబ్సిడీ ఇస్తున్నట్టు తెలిపారు. 12 ఎకరాల వరకు డ్రిప్పై సబ్సిడీ ఇస్తున్నామన్నారు. రైతులను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున సబ్సిడీపై ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలను అందజేస్తున్నామని తెలిపారు. -
పెర్త్ క్షతగాత్రుల పరిస్థితి విషమం
ఆస్ట్రేలియూ వెళ్లేందుకు ప్రియదర్శిని తల్లిదండ్రులకు తత్కాల్ పాస్పోర్టు వరంగల్ క్రైం: ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. అక్కడ గాయపడిన ప్రియదర్శిని తల్లిదండ్రులు గురువారం వరంగల్ నగర పోలీస్ కమిషనర్ను కలిశారు. తమ కూతురు అల్లుడిని చూడడానికి ఆస్ట్రేలియూ వెళ్లేందుకు పాస్పోర్టు కోసం విన్నవించారు. వారికి తత్కాల్ పాస్పోర్ట్ అందేలా వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సుధీర్బాబు ఏర్పాట్లు చేశారు. పాస్పోర్ట్ కోసం ప్రత్యేక అధికారిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా ఆస్ట్రేలియాలోని తన మిత్రులకు కమిషనర్ ఫొన్చేసి క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని కోరారు. ఆస్ట్రేలియా దేశంలోని పెర్త్ నగరంలో 6వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన అరవింద్కుమార్ సామల, భీమవరానికి చెందిన శేషగిరి మేడవరపు అనే ఇద్దరు విద్యార్థులు మరణించారు. వారితోపాటు అదే కారులో ప్రయాణిస్తున్న హన్మకొండకు చెందిన బానియార్ కమలాకర్, కవిత దంపతుల కుమార్తె - అల్లుడు ప్రియదర్శిని, నిశాంత్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరూ ప్రస్తుతం పెర్త్లోని రాయల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, తమ కుమార్తె, అల్లుడిని చూడడానికి ఆస్ట్రేలియా వెళ్లేందుకు కావాల్సిన పాస్పోర్ట్ కమలాకర్, కవిత దంపతులకు లేకపోవడంతో వారు గురువారం పోలీస్ కమిషనర్ను కలిసి జరిగిన సంఘటన చెప్పారు. స్పందించిన పోలీస్ కమిషనర్ వారికి తత్కాల్ పాస్పోర్ట్ లభించేలా చర్యలు చేపట్టారు. వీరికి పాస్పోర్ట్ కార్యాలయంలో సహకారం అందించేందుకు ఒక ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేశారు. అలాగే, క్షతగాత్రులకు అవసరమైన చికిత్స చేసేం దుకు ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల కార్యాలయం అధికారులతో పోలీస్ కమిషనర్ మాట్లాడి క్షతగాత్రుల వివరాలను తెలియపరిచారు. వారికి కావాల్సిన పూర్తి సహాయ సహకారాలను అందజేయూల్సిందిగా పెర్త్, మెల్బోర్న్లోని తన మిత్రులకు, డాక్టర్లకు ఫోన్చేసి కోరారు. గాయపడిన నిశాంత్, ప్రియదర్శినిల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసిందని, కారును ఆస్ట్రేలియూకు చెందిన యువతి నడుపుతున్నదని, ఆమె కూడా ప్రమాదంలో మృతి చెందినట్టు తెలిసిందని ప్రియదర్శిని తండ్రి కమలాకర్, తల్లి కవిత తెలిపారు. -
అన్యాయాలను ప్రశ్నించేలా!
అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో, ఓ అందమైన ప్రేమకథగా తెరకెక్కిన చిత్రం ‘యూత్ఫుల్ లవ్’. జూలై 3న ఈ చిత్రం విడుదల కానుంది. మనోజ్నందం, ప్రియదర్శిని జంటగా రాదారం రాజలింగం నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేముగంటి దర్శకుడు. ‘‘సమాజంలోని అన్యాయాల నేపథ్యంలో అమ్మాయిలు తమను తాము ఎలా రక్షించుకోవాలనే కథాంశంతో తెరకెక్కించాం. అంతర్లీనంగా సందేశం ఉంటుంది’’ అని చెప్పారు. థ్రిల్లర్ మంజు ఇందులో ప్రధాన పాత్రధారి. -
27 నుంచి చిరుధాన్యాల ప్రదర్శన
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఈ నెల 27 నుంచి మార్చి 1వ తేదీ వరకు ‘తెలంగాణ చిరుధాన్యాల ప్రదర్శన-2015’ నిర్వహిస్తున్నట్లు వ్యవసాయశాఖ కమిషనర్ ప్రియదర్శిని, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ ప్రత్యేకాధికారి ప్రవీణ్రావులు వెల్లడించారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను వ్యవసాయశాఖమంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. జొన్న, రాగి, సజ్జ, కొర్ర, వరిగ, సామ తదితర చిరుధాన్యాల ప్రాధాన్యాన్ని ఇందులో వివరిస్తారని చెప్పారు. -
అదనపు జిల్లా జడ్జి ప్రియదర్శిని బదిలీ
విజయనగరం లీగల్ : ఒకటవ అదనపు జిల్లా జడ్జి ఎం. జి.ప్రియదర్శినికి బదిలీ అయ్యింది. ఆమెను కర్నూలు జిల్లా నంద్యాల మూడో అదనపు జిల్లా జడ్జిగా బదిలీ చేస్తూ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కోర్టు బాధ్యతలను జిల్లా జడ్జి ఎం.లక్ష్మీనారాయణకు అప్పగించారు. 2012 ఫిబ్రవరిలో బాధ్యతలు స్వీకరించిన ఆమె..కేసుల సత్వర పరిష్కారానికి కృషిచేశారు. న్యాయ అవగాహన సదస్సులో చట్టాలు,కోర్టులపై ప్రజల్లో అవగాహన కల్పనకు కృషి చేశారు. నాలుగు గోడలకే పరిమితం కాకుండా పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు జిల్లా కోర్టులో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పచ్చదనం పరిశుభ్రత పేరుతో కోర్టులను శుభ్రపరిచారు. మానవహక్కుల రక్షణ చట్టం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిగా, బాలలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం (నిర్భయ) ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు. -
‘వర్క్టూ రూల్’కు స్వస్తి!
మహబూబ్నగ్ టౌన్: ఇటీవల కొద్దిరోజులుగా కలెక్టర్ జీడీ ప్రియదర్శిని, రెవెన్యూ ఉద్యోగుల మధ్య రగులుతున్న వర్క్టూ రూల్ వివాదం ఇక సమసినట్లే..! జేసీ మధ్యవర్తిత్వంతో చర్చలు సఫలమై.. ఉద్యోగులు కలెక్టర్కు సహకరిస్తామని ఆదివారం ప్రకటించారు. ఇదిలాఉండగా, కలెక్టర్ జిల్లా కు వచ్చిరాగానే ప్రభుత్వం రకరకాల సర్వేలు చేపట్టింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగంపై కూడా కొంత పనిఒత్తిడి పెరిగింది. సామాజిక భద్రత పింఛన్లు, రేషన్కార్డులకు సంబంధించి అర్హులను గుర్తించే క్రమంలో అధికారు లు, సిబ్బందితో కలెక్టర్ ఒక్కోసారి రాత్రి సమయం వరకు కూడా సమీక్ష లు నిర్వహిస్తుండేవారు. ఈ పరంపరలో సీసీకుంట వీఆర్వో రంగారెడ్డి గుండెపోటుతో మృతిచెందాడు. పనిఒత్తిడి కారణంగానే సదరు వీఆర్వో చనిపోయారని రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు దిగిన విషయం విదితమే. అర్ధరాత్రి వరకు సమావేశాలు నిర్వహించకుండా పనిలో స్వేచ్ఛాయుత వాతావరణం ఇవ్వాలని వారు కలెక్టర్కు విజ్ఞప్తిచేశారు. స్పందించిన కలెక్టర్ విధుల నిర్వహణ పట్ల కాస్త కఠినంగానే ఉంటానని ప్రకటించడంతో ఉద్యోగులు నిరసనబాట పట్టారు. రెండురోజులుగా జిల్లాలో విధులు బహిష్కరిస్తూ వర్క్టూ రూల్ను అమలుచేశారు. దీంతో ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. వీరికితోడు ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇవ్వడంతో కలెక్టర్, రెవెన్యూ ఉద్యోగుల యుద్ధ వాతావరణం రాజుకుందనే చెప్పొచ్చు. నాలుగైదు రోజులుగా సమస్య ఓ కొలిక్కిరాకపోవడంతో రెవెన్యూ ఉద్యోగులు ఏకంగా సీఎం సమావేశానికి కూడా గైర్హాజరయ్యారు. అంతటితో ఆగకుండా తెలంగాణ రాష్ట్ర సాధనకోసం చేపట్టిన ఉద్యమం తరహాలో కొనసాగిస్తామని ప్రకటించారు. జేసీ ఎల్.శర్మన్ సమస్య మరింత ముందుకు పోకుండా పరిష్కరించేందుకు శ్రీకారం చుట్టారు. కలెక్టర్, రెవెన్యూ ఉద్యోగులకు మధ్యవర్తిత్వం వహించి శనివారం రాత్రి రెవెన్యూ అసోసియేషన్ నేతలను కలెక్టర్తో చర్చలకు ఆహ్వానించారు. సుమారు రెండుగంటలపాటు కొనసాగిన చర్చల్లో సమస్యను పరిష్కరించేందుకు కృషిచేయడంతో ఉద్యోగులు మెత్తబడ్డారు. విధుల నిర్వహణలో కలెక్టర్కు సహకరిస్తామని అంగీకరించారు. దీంతో వర్క్టూ రూల్ విధానానికి స్వస్తి పలికినట్లయింది. కలెక్టర్కు పూర్తిగా సహకరిస్తాం కొంత ఇబ్బందులు కలిగినా కలెక్టర్ జీడీ ప్రియదర్శిని స్పందించి తమకు పూర్తిగా సహకరించి సమస్యలను పరిష్కరిస్తామని హామీఇచ్చారని, ఆమెకు విధుల పట్ల అన్నివిధాలుగా సహకరిస్తామని రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ ప్రకటించారు. ఆదివారం స్థానిక రెవెన్యూభవన్లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్ధరాత్రి సమావేశాలతో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చిందన్నారు. కలెక్టర్ అంగీకరించి పదోన్నతులు సైతం ఇచ్చేందుకు అంగీకరించారని తెలిపారు. ఇది ఒక కుటుంబ సమస్యేనని, పరిష్కరించుకున్నట్లు తెలిపారు. సమావేశంలో టీజీఓ అధ్యక్షుడు రామకృష్ణగౌడ్, కార్యదర్శి బక్క శ్రీనివాస్, వీఆర్వోల సంఘం అధ్యక్షుడు జ్ఞానేశ్వర్రెడ్డితోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. -
ఆందోళన వద్దు
సాక్షి, మహబూబ్నగర్: రుణమాఫీకి సంబంధించి రై తులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని కలెక్టర్ జీడీ ప్రియదర్శిని భరోసాఇచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వం 25శాతం కింద రూ.682 కోట్లు మంజూ రు చేసిందని, త్వరలో మిగతా 75శాతం రు ణం మంజూరవుతుందని స్పష్టంచేశారు. ఆదివారం రాత్రి తన కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత రుణమాఫీ కేవలం పంటల బీమాను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కేవలం 25శాతం నిధులు మాత్రమే మంజూరుచేసిందని వివరించారు. ప్రభుత్వం మంజూరుచేసిన రూ.682 కోట్లలో ఇప్పటికే దాదాపు 80శాతం బ్యాంకులకు అందజేశామని, మిగతా బ్యాంకులు ఖాతాలు తెరవగానే అందజేస్తామని వెల్లడించారు. కావునా పాత రుణాలను మరిచి కొత్తలోన్లు ఎంత అవకాశముంటే దానిప్రకారం బ్యాంకులు చెల్లిస్తాయని తెలిపారు. చెల్లింపు విధానం ఇలా.. ప్రస్తుత రుణంలో 25శాతం ప్రభుత్వం మాఫీచేసింది. పాతరుణం 75శాతం ఉంటుంది. మాఫీ అయిన 25శాతం రుణానికి కిసాన్ క్రెడిట్కార్డు(కెసీసీ)నామ్స్ ప్రకారం అదనంగా రుణం ఇస్తారు. ఈ ప్రకారంగా కొత్తగా 55శాతం రుణం పొందే అవకాశముందని కలెక్టర్ వివరించారు. ఉదాహరణకు ఒక రైతు రూ.10వేల రుణం తీసుకుంటే ప్రస్తుతం ప్రభుత్వం రూ.2,500 మాఫీ చేసింది. కేసీసీ నామ్స్ ప్రకారం అదనంగా 30శాతం లోన్ కలుపుకుని కొత్తగా రూ.5,500రుణం పొందవచ్చు. అయితే భూమి విస్తీర్ణం, స్కేల్ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఏ పంట ఎంతమేరకు ఇవ్వొచ్చనే దానిపై రుణం అందుతుందని స్పష్టంచేశారు. రుణమాఫీ కోసం అర్హత సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. భూమి ఎంత ఉందనే విషయాన్ని పేర్కొంటూ రెవెన్యూ అధికారి, ఏ పంట ఎంతమేర సాగుచేశారనే విషయాన్ని మండల వ్యవసాయాధికారి గుర్తిస్తారని కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు 30వేల డాక్యుమెంటేషన్లు పూర్తయ్యాయని వెల్లడించారు. కొత్తరుణం తీసుకోకపోవడమే ఉత్తమం ప్రస్తుతం బ్యాంకులు కొత్తగా ఇచ్చేరుణాలను రైతులు తీసుకోకపోవడమే ఉత్తమమని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత రుణాలు కేవలం పంటబీమాను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నట్లు తెలిపారు. ఏదైనాఅనుకోని కరువు, వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు లబ్ధిచేకూరే ఉద్ధేశంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. సెప్టెంబర్ 30వ తేదీలోగా చెల్లిస్తేనే పంటలబీమా వర్తిస్తుందనే ఆలోచనతోనే ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపట్టిందని వివరించారు. -
ఐపీఎస్ అధికారిపై ప్రియురాలు ఫిర్యాదు
తిరుత్తియూరు: తిరుచ్చికి చెందిన ఐపీఎస్ అధికారి వరుణ్కుమార్పై అతని ప్రియురాలు తిరిగి పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. తిరుచ్చికి చెందిన వరుణ్కుమార్ ఐపీఎస్ అధికారి. ఇతను చెన్నైకు చెందిన విశ్రాంత సహాయ కమిషనర్ కుమార్తె ప్రియదర్శినిని ప్రేమించాడు. కొంతకాలానికి వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలో వరుణ్కుమార్పై చెన్నై పోలీసు కమిషనర్కు ప్రియదర్శిని ఒక ఫిర్యాదు చేసింది. అందులో వరుణ్కుమార్ తనను ప్రేమించి మోసం చేశాడని, వివాహం చేసుకోవాలంటే ఖరీదైన కారు, ఎక్కువ నగలు, నగదు కోరినట్టు పేర్కొంది. తన ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అతని చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పరిశీలించిన హైకోర్టు దీనిపై పరిశీలనకు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు వరుణ్కుమార్ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ప్రస్తుతం బెరుుల్పై విడుదల అయ్యాడు. ఈ క్రమంలో ప్రియదర్శిని తిరిగి మంగళవారం ఫిర్యాదు చేశారు. అందులో తన ఫిర్యాదుపై వున్న కేసులో ఇంతవరకు వరుణ్కుమార్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని త్వరలో అతనిపై కేసు నమోదు చేయాలని పేర్కొంది. -
రేపు జిల్లాకు కేసీఆర్ రాక...
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : జిల్లాలో వివిధ పరిశ్రమల్లో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గురువారం జిల్లాకు వస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూలును జిల్లా కలెక్టర్ జీడీ ప్రియదర్శిని మంగళవారం మీడియాకు విడుదల చేశారు. జిల్లాలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తారని కలెక్టర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా జిల్లాకు వస్తున్న కేసీఆర్ సుమారు నాలుగున్నర గంటల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం పోలేపల్లి సెజ్లో మౌలిక సౌకర్యాలను పరిశీలించడంతో పాటు కొత్తగా నిర్మించిన 132 కేవీ సామర్థ్యం కలిగిన సబ్స్టేషన్ను ప్రారంభిస్తారు. రూ.30కోట్లతో సెజ్ ఆవరణలో చేపట్టే అంతర్గత రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆయా ప్రదేశాలను బుధవారం జిల్లా ఎస్పీతో కలిసి ఏర్పాట్లను సమీక్షిస్తున్నట్లు కలెక్టర్ ప్రియదర్శిని వెల్లడించారు. సీఎం రాకకు ఏర్పాట్లు అడ్డాకుల: రేపు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మండలంలోని వేముల కొజెంట్ గ్లాస్ కంపెనీకి వస్తున్న నేపథ్యంలో మంగళవారం కంపెనీలో ఏర్పాట్లపై అధికారులు సమీక్షించారు. వనసర్తి డీఎస్పీ జె.చెన్నయ్య, నాగర్కర్నూల్ ఆర్డీఓ వీరారెడ్డి, కొత్తకోట సీఐ రమేష్బాబు కంపెనీలో హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. సీఎం మాట్లాడేందుకు ఏర్పాటుచేసే సభ విషయమై చర్చించారు. కంపెనీ లోపల గ్లాస్ తయారుచేసే యంత్రాల వద్దకు సీఎం వెళ్లాల్సి వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలను డీఎస్పీ చెన్నయ్య కంపెనీ ప్రతినిధులకు వివరించారు. ఆయన వెంట అడ్డాకుల తహశీల్దార్ జె.రాంకోటి, ఎస్ఐ ముత్తినేని వెంకటేశ్వర్లు, స్థానిక సర్పంచ్ దాసరి వాణి, ఆర్ఐ శ్రీనివాస్, వీఆర్ఓలు దేవరాజ్, కుర్మయ్య ఉన్నారు. అదేవిధంగా మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పర్యవేక్షించారు. కంపెనీ ప్రతినిధి అక్షయ్సింగ్తో -
మహిళలకు స్ఫూర్తిగా...
సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ఇతివృత్తంగా తీసుకుని వేముగంటి దర్శకత్వం వహించిన చిత్రం ‘యూత్ఫుల్ లవ్’. మనోజ్ నందం, ప్రియదర్శిని, అజిత్, థ్రిల్లర్ మంజు ముఖ్య తారలుగా రాధారం రాజలింగం ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘మహిళల సమస్యలను చూపించడంతో పాటు పరిష్కారం కూడా చెప్పాం. తల్లిదండ్రులకు సందేశం కూడా ఇస్తున్నాం. ప్రధానంగా యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ అయినప్పటికీ, కమర్షియల్ థ్రిల్లర్గా సాగుతుంది’’ అని చెప్పారు. ప్రతి మహిళా ఆత్మరక్షణార్థం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే ఎలా ఉంటుంది? అనే కథాంశంతో ఈ చిత్రం సాగుతుందని దర్శకుడు, మహిళలకు స్ఫూర్తిగా నిలిచే చిత్రమని మనోజ్ నందం తెలిపారు. -
యూత్ ఫుల్ లవ్ మూవీ హాట్ స్టిల్స్
-
‘జూరాల’లో నలుగురి మునక
ఒకరి మృతదేహం లభ్యం లభించని ముగ్గురి ఆచూకీ ధరూరు, న్యూస్లైన్: మహబూబ్నగర్ జిల్లా ప్రియదర్శిని జూరాల రిజర్వాయర్లో నలుగురు మునిగి పోయారు. స్థానికులు, బాధితులు కథనం మేరకు.. హైదరాబాద్లోని బోరబండ ప్రాంతానికి చెందిన కుటుంబం గద్వాలలోని శేరెల్లివీధికి చెందిన మహిమూదా ఇంటికి శనివారం వచ్చింది. రాత్రి గద్వాలలోనే ఉండి ఆదివారం ఉదయం ఆత్మకూరులోని బంధువులను చూసేందుకు జీపులో వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో గద్వాలకు తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యంలోని జూరాల ప్రాజెక్టును చూసి అక్కడే కొద్దిసేపు గడిపి వెళ్దామని ఆగారు. వేసవి కావడం, ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిగా తగ్గి ఉండడంతో వారు కుడికాల్వకు నీటిని విడుదల చేసే రెగ్యులేటరీ వద్దకు చేరుకున్నారు. అక్కడ నీళ్లలో ఆడుకుంటున్న హైదరాబాద్కు చెందిన షాకీర్ (17) మునిగిపోయాడు. గమనించిన తోటివారు సాబేర్ (20), మోసిన్ (19)తో పాటు గద్వాల పట్టణానికి చెందిన వారి బంధువుల అబ్బాయి సమీర్ (19) షాకీర్ను కాపాడబోయి ఒకరివెంట మరొకరు ఐదుగురూ నీటిలో మునిగిపోయారు. జుబేర్ను జాలర్లు కాపాడారు. రిజర్వాయర్లో ఒండ్రుమట్టి పేరుకుపోవడంతో పాటు యువకులకు ఈత రాకపోవడంతో నీట మునిగిపోయారు. ఆదివారం రాత్రి వరకు షాకీర్ ఒక్కరి మృతదే హమే లభించింది. మిగిలిన ముగ్గురి ఆచూకీ తెలియాల్సి ఉంది. పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు.. జూబ్లీహిల్స్/ఎర్రగడ్డ, న్యూస్లైన్: నీళ్లలోకి దిగి గల్లంతైన యువకుల ఉదం తం స్థానికంగా విషాదం నింపింది. బోరబండ సైట్-1కి చెందిన మహమ్మద్ కుమారులు సాబేర్, షాకిర్ పదో తరగతి పూర్తి చేశారు. షాకిర్ అమీర్పేటలోని చెప్పుల దుకాణంలో పనిచేస్తుండగా, సాబేర్ ఇంటి దగ్గరే ఉంటూ చిన్నా చితకా పనులు చేస్తూ కుటుంబానికి సహాయపడుతున్నాడు. అదే ప్రాంతంలో ఉండే వీరి సమీప బంధువు మోసిన్ (19) కూడా చెప్పుల షాపులో పనిచేస్తున్నాడు. వీరు ముగ్గురూ కలిసి శనివారం మహబూబ్నగర్ జిల్లా గద్వాలలో ఉండే పెదనాన్న ఇంటికి వెళ్లారు. ఆదివారం ఈత కొట్టడానికని సమీపంలోని జూరాల ప్రాజెక్టుకు వెళ్లి గల్లంతయ్యారు. వీరి తల్లిదండ్రులు, బంధువులు హుటాహుటిన గద్వాల బయలుదేరి వెళ్లారు. -
'దిల్లున్నోడు' మూవీ స్టిల్స్
-
తీరు మారలేదు
=పసిబాలిక హత్యకు గురైనా భద్రత గాలికే.... =మారని రైల్వే పోలీసులు సికింద్రాబాద్, న్యూస్లైన్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద పోలీసుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం ఈ దృశ్యం. మంగళవారం మధ్యాహ్నం పోలీసుల కళ్లుగప్పి మారణాయుధాలతో స్టేషన్లో సంచరించిన సైకో.. ముక్కుపచ్చలారని ఏడేళ్ల ప్రియదర్శినిని దారుణంగా హతమార్చాడు. రాష్ర్టవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఈ సంఘటన నేపథ్యంలో బుధవారం నుంచి కట్టుదిట్టమైన బందోబస్తు ఉంటుందని అందరూ భావిస్తారు. అయితే ఇక్కడి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. నిత్యం లక్షకు పైబడిన ప్రయాణికులు, సందర్శకులు రాకపోకలు సాగించే రైల్వేస్టేషన్లోని ఈ ప్రధాన ద్వారాన్ని దేశవ్యాప్తంగా ఎక్కడ విధ్వంసాలు జరిగినా, ఉగ్రవాదులు సంచరిస్తున్నారని హెచ్చరికలు వచ్చినా అన్ని ప్రవేశ ద్వారాలను మూసివేసి ప్రయాణికుల రాకపోకలను ఒక్క ఈ ద్వారం నుంచే అనుమతిస్తారు. ఇక్కడ మూడు మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేయడంతోపాటు, లగేజీలను తనిఖీ చేసేందుకు ప్రత్యేకంగా రైల్వే పోలీసు సిబ్బందిని నియమించారు. ఇంత కీలకమైన ఈ ద్వారం వద్ద కాపలకాసే రైల్వే పోలీసుల తీరులో ఎన్ని ఘటనలు జరిగినా మార్పు కన్పించడంలేదు. బుధవారం మెటల్ డిటెక్టర్లకు మాత్రమే భద్రత విధులు అప్పగించి ఇద్దరు మంతనాల్లో మునిగిపోగా, మరొకరు బల్లపై కూర్చొని సెల్ఫోన్తో కాలక్షేపం చేయడం కన్పించింది. -
అశ్రునయనాల మధ్య ప్రియదర్శిని అంత్యక్రియలు
దుఃఖంలోనూ చిన్నారి నేత్రాలను దానం చేసిన తల్లిదండ్రులు ఘాతుకంపై నివేదికకు లోకాయుక్త ఆదేశం రైల్వే ఎస్పీకి నోటీసులు ఉన్మాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఏడేళ్ల చిన్నారి ప్రియదర్శిని అంత్యక్రియలు బుధవారం ఆమె స్వగ్రామమైన మెదక్ జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లిలో అశ్రునయనాల మధ్య జరిగాయి. కోయినాపల్లితోపాటు సమీప గ్రామాల ప్రజలు కూడా భారీగా తరలివచ్చి ప్రియదర్శిని అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంతకుముందు మంగళవారం రాత్రి ప్రియదర్శిని మృతదేహానికి గాంధీ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వైద్యులు గాంధీ ఆస్పత్రికి చేరుకుని ప్రియదర్శిని కళ్లు దానంగా ఇవ్వడానికి తల్లిదండ్రులు శ్రీనివాస్, సోనీలను ఒప్పించారు. కూతురు లేదన్న అంతులేని విషాదంలోనూ వారు చిన్నారి కళ్లను దానం చేసి తమ గొప్ప మనసును చాటుకున్నారు. మరో ఇద్దరి కంటిచూపునకు దారి చూపారు. సైకోకు రిమాండ్.. ప్రియదర్శినిపై కత్తితో పాశవికంగా దాడి చేసి హ తమార్చిన సైకోను బుధవారం సికింద్రాబాద్ రైల్వే పోలీసులు రిమాండ్కు తరలించారు. మంగళవారం మధ్యాహ్నం పెళ్లికి హాజరయ్యేందుకు నానమ్మ, తండ్రితో కలసి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు వచ్చిన ముషీరాబాద్ గంగపుత్రకాలనీకి చెందిన ప్రియదర్ళినిపై చిత్తూరు జిల్లాకు చెందిన ఉన్మాది కోలా కరణ్కుమార్ కత్తితో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందిన సంగతి తెలిసిందే. ప్రయాణికుల సహకారంతో సైకోను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ అనంతరం అతడిని రిమాండ్కు తరలించారు. మరోవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్మాది దాడిపై ఈ నెల 16లోగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని లోకాయుక్త జస్టిస్ సుభాషణ్రెడ్డి రైల్వే ఎస్పీని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు. చిన్నారి మృతికి రైల్వే పోలీసుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల సంఘం బుధవారం లోకాయుక్తకు ఫిర్యాదు చేయడంతో జస్టిస్ సుభాషణ్రెడ్డి ఈ మేరకు ఆదేశించారు. భద్రతపై రైల్వే జీఎం సమీక్ష రైల్వే స్టేషన్లు, పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్(జీఎం) పి.కె.శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు. సైకో చేతిలో చిన్నారి హత్యకు గురైన నేపథ్యంలో ఆయన బుధవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ 10వ ప్లాట్ఫాం వద్ద ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ప్రయాణికుల భద్రతపై రైల్నిలయంలో అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. -
శోకసంద్రం
నంగునూరు, న్యూస్లైన్: కోనాయిపల్లి శోకసంద్రమైంది... మౌనంగా రోదించింది. గ్రామంలో ఎవరిని కదిపినా కన్నీరే సమాధానమిచ్చింది. అందరి నోటా చిన్నారి ప్రియదర్శిని పేరే వినిపించింది. మంగళవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ జరిగిన సైకో దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి ప్రియదర్శిని అంత్యక్రియలు బుధవారం బంధువులు, గ్రామస్తుల అశ్రునయనాల మధ్య స్వగ్రామం నంగునూరు మండలం కోనాయిపల్లిలో జరిగాయి. కోనాయిపల్లి వాసులే కాకుండా పక్క గ్రామాల వారూ భారీగా తరలివచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. సికింద్రాబాద్లో పోస్టుమార్టం అనంతరం చిన్నారి మృతదేహాన్ని మంగళవారం రాత్రే ఇక్కడికి తీసుకొచ్చారు. అప్పటికే టీవీల ద్వారా విషయం తెలుసుకున్న స్థానికులు చిన్నారిని చూసేందుకు భారీగా తరలివచ్చారు. పుట్టెడు దుఃఖంలోనూ నేత్రదానం అల్లారు ముద్దుగా పెంచిన కూతురు ప్రియదర్శిని కానరాని లోకాలకు వెళ్లిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులు శ్రీనివాస్, సోనీలు సమాజహితం కోసం ఓ నిర్ణయం తీసుకున్నారు. ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యుల సూచన మేరకు తమ కంటి దీపం ఆరిపోయినా, మరో రెండు ఇళ్లలో వెలుగులు నింపారు. తమ గారాల పట్టి కళ్లను దానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. వీరి ఔదార్యాన్ని గ్రామస్తులతో పాటు బంధువులు, స్నేహితులు అభినందించారు. రైల్యే సిబ్బందిపై కేసు నమోదు చేయాలి ప్రజలందరూ చూస్తుండగానే సైకో కత్తులతో వీరంగం సృష్టించడం రైల్వే పోలీసులు, సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోందని చిన్నారి తండ్రి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. పటిష్ట భద్రత కలిగిఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దుండగుడు కత్తులతో రావడం భద్రతాలోపానికి నిదర్శనమని ఆయన ఆరోపించారు. తన కూతురి మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తన కుటుంబానికి కడుపు కోత మిగిల్చినట్లు మరొకరికి జరగకుండా చూడాలని చేతులు జోడించి వేడుకున్నాడు. సైకోను ఉరితీయాలి అభం శుభం తెలియని చిన్నారిని కత్తులతో పొడిచి చంపేందుకు వానికి(సైకో) చేతులెలా వచ్చాయంటూ చిన్నారి మృతదేహం వద్ద మహిళలు బోరున విలపించారు. ‘వాని కుటుంబం నాశనమైపోను’ అంటూ శాపనార్థాలు పెడుతూ ప్రియాంక తల్లిదండ్రులను ఓదార్చారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా సైకో కిరణ్కుమార్ను బహిరంగంగా ఉరితీయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. బతుకుదెరువు కోసం వలస వెళ్లి చిన్నారిని కోల్పోయిన శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ పిల్లి వెంకటేశం, జడ్పీటీసీ మాజీ సభ్యుడు దువ్వల మల్లయ్య, నాయకులు నిమ్మ శ్రీనివాస్రెడ్డి, రవీందర్రెడ్డితోపాటు గ్రామస్తులు కోరారు. -
కరాటే... కుంగ్ఫూ తప్పనిసరి!
మనోజ్ నందం, ప్రియదర్శిని జంటగా వేముగంటి దర్శకత్వంలో రంజిత్ నిర్మిస్తున్న చిత్రం ‘యూత్ఫుల్ లవ్’. శ్రీకాంత్ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్లో విడుదల చేశారు. నిర్మాత దామోదర ప్రసాద్ ఆడియో సీడీని ఆవిష్కరించి, యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలందజేశారు. ఈ వేడుకలో కేవీవీ సత్యనారాయణ, సునీల్కుమార్రెడ్డి, శ్రీ, శోభారాణి, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘తమకు ఎదురవుతున్న చేదు అనుభవాలను ధైర్యంగా ప్రతిఘటించాలంటే మహిళలు చదువుతోపాటు కరాటే, కుంగ్ఫూల్లాంటి విద్యలు కూడా నేర్చుకోవాలని చెప్పే చిత్రం ఇది’’ అన్నారు. మంచి సందేశం ఉన్న యూత్ఫుల్ మూవీ ఇదని, యూత్కి బాగా కనెక్ట్ అయ్యే చిత్రమని రంజిత్ చెప్పారు. అబ్బాయిలు, అమ్మాయిలు... ఎవరికైనా సెల్ఫ్ డిఫెన్స్ అవసరమని చెప్పే చిత్రమని మనోజ్ నందం తెలిపారు. తెలుగులో చేసి రెండోచిత్రమని ప్రియదర్శిని అన్నారు.