race
-
హీరో అజిత్ కు పెను ప్రమాదం.. పల్టీలు కొట్టిన కారు
-
అజిత్ కుమార్కు తప్పిన పెను ప్రమాదం.. వీడియో వైరల్!
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్కు(Ajith Kumar) పెను ప్రమాదం తప్పింది. దుబాయ్లో జరుగుతున్న రేసింగ్లో ఆయన నడుపుతున్న కారు పక్కనే ఉన్న ట్రాక్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అజిత్కు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. రేసింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంక్రాంతి బరిలో అజిత్..కాగా.. అజిత్ కుమార్ హీరోగా ప్రస్తుతం ‘విడాముయర్చి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో అర్జున్ సర్జా ప్రధాన పాత్ర పోషించారు. లైకా ప్రోడక్షన్స్ బ్యానర్పై జీకేఎం తమిళ్ కుమరన్ నేతృత్వంలో సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా ఈ సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన విడాముయార్చి సినిమా టీజర్కు అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో మా మూవీపై అంచ నాలు మరింతగా పెరిగాయి. ఈ చిత్రంలో ఆరవ్, రెజీనా కసండ్రా, నిఖిల్ నాయర్ కీలక పాత్రల్లో నటించారు.మైత్రి మూవీ మేకర్స్తో మరో సినిమా..అజిత్ కుమార్ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్తో జతకట్టారు. ఆయన హీరోగా తెరకెక్కిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఇందులోనూ త్రిషనే హీరోయిన్గా నటిస్తోంది . ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.వేసవిలో రిలీజ్..ఈ మూవీని వేసవిలో ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. అజిత్పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఇండియన్ మూవీ చరిత్రలోనే గుడ్ బ్యాడ్ అగ్లీ ఓ మైలురాయిగా నిలుస్తుందిని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్కుమార్ సంగీతం అందించారు. కాగా ఈ చిత్రాన్ని తొలుత సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వీలు కాకపోవడంతో ఏప్రిల్కు రిలీజ్ కానుంది. Ajith Kumar’s massive crash in practise, but he walks away unscathed.Another day in the office … that’s racing!#ajithkumarracing #ajithkumar pic.twitter.com/dH5rQb18z0— Ajithkumar Racing (@Akracingoffl) January 7, 2025 -
ఫార్ములా కారు రేసు కేసులో బిగ్ ట్విస్ట్
-
‘నన్ను అరెస్ట్ చేస్తారా.. చేస్కోండి’: కేటీఆర్
సాక్షి,తెలంగాణ భవన్: నేను ఏ తప్పు చేయలే .. అందుకే నేను భయపడను. ఈ రేస్ అయినా ఇంకేదైనా. అరెస్టు చేసుకుంటే చేసుకో అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సీఎం రేవంత్రెడ్డికి సవాల్ విసిరారు. గురువారం రాష్ట్ర రాజకీయాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా ప్రతినిధులతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.చిట్చాట్లో కేటీఆర్ ఏమన్నారంటే..ఎస్పీ నారాయణ రెడ్డి కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల్ని వదిలేసి బీఆర్ఎస్ శ్రేణుల్ని కొట్టారు. దీనిపై మేధావులు ఎవరు మాట్లాడలేదు. పోలీసుల తీరు సరిగా లేదు. పోలీసులు వైఫల్యం ఉంది. ఇంటిజెన్స్ వ్యవస్థ అట్టర్ ప్లాప్ అయింది. రేవంత్రెడ్డి సైన్యంలా పరిస్థితి తయారైంది. రైతులు,బీఆర్ఎస్ శ్రేణుల్ని ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసినట్లు చేస్తున్నారు. నేను ఊరుకోను. రేవంత్ రెడ్డి నీ సంగతి తేలు. లగచర్ల బాధితులను ఢిల్లీకి తీసుకుపోయి.. ఎస్సీ, ఎస్టీ కమిషన్ను ఆశ్రయిస్తా. నేను ఏ తప్పు చేయలే.. అందుకే నేను భయపడను. ఈ రేస్ అయినా ఇంకేదైనా. అరెస్టు చేసుకుంటే చేసుకో. మీలాంటి వాళ్ళను చాలా మందిని చూశా. నీ కుర్చీ కాపాడుకో. ఎన్ని రోజులు ఉంటావో. ఉత్తమ్, భట్టీ నీ కుర్చిలో కూర్చుంటారు. బాంబులు పేల్చేది నీ మీదనే.. మీ పార్టీలోనే. మూసీ కోసం రేవంత్ కొత్తగా చేసిందేమీ లేదు. డబ్బు దండుకోవడమే. డీపీఆర్ లేకుండా రూ. లక్ష 50వేల కోట్లు ఎలా అవుతాయ్ రేవంత్. ఢిల్లీకి డబ్భులు పంపాలని ప్లాన్ చేశారు. నీ నియోజకవర్గంలో సమస్యనే పరిష్కరించలేని నువ్వు ఓ ముఖ్యమంత్రివి. నీదో కథ’ అని కేటీఆర్ చిట్చాట్లో వ్యాఖ్యానించారు. -
మళ్ళీ తెర పైకి ఈ-కార్ రేస్
-
చెన్నైలో 'రేస్' అదరహో.. సెలబ్రిటీల సందడి
సాక్షి, చెన్నై: ఫార్ములా కార్ రేస్ ఆదివారం అదరహో అనిపించే విధంగా జరిగింది. వినోదంతో కూడిన సాహసాలు హోరెత్తాయి. సినీ సెలబ్రిటీలు సందడి చేశారు. చెన్నై ఐలాండ్ గ్రౌండ్ వేదికగా ఫార్ములా కార్ రేస్ –4 శనివారం మొదలైన విషయం తెలిసిందే. తొలిరోజు అర్హత పోటీలు ఉత్కంఠ భరితంగా సాగాయి. రెండవ రోజు ఆదివారం ఉదయం నుంచి ట్రయల్ రన్ పేరిట పోటీలు హోరెత్తాయి. అలాగే, నగర వాసులు, ప్రేక్షకులను ఆకర్షించే దిశగా వినోద కార్యక్రమాలు, సాహసాలతో కూడిన కార్ రేసులు సాగాయి. జేకే టైర్ కార్ రేస్ ప్రత్యేక ఆకర్షణగా దూసుకెళ్లింది. ఆదివారం రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు తుది పోటీలు ఇండియన్ చాంపియన్షిప్, ఇండియన్ రేసింగ్ లీగ్ కేటగిరిలలో జరిగాయి. అత్యంత పోటాపోటీగా ఉత్కంఠ భరితంగా గాల్లో 200 కి.మీకి పైగా వేగంతో కార్లు దూసుకెళ్లాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు పోటీలలో విజయాన్ని కైవశం చేసుకునే దిశగా రేసులో దూసుకెళ్లారు.చివరి రోజు పోటీలను వీక్షించేందుక ప్రత్యేక ఆకర్షణగా త్రిష వంటి సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. అలాగే, భారత మాజీ క్రికెటర్ గంగూలి, బాలీవుడ్ స్టార్ అర్జున్ కపూర్, జాన్అబ్రహం, నిర్మాత బోనికపూర్తో పాటు పలువురు నటీ నటులు హాజరయ్యారు. కోలీవుడ్కు చెందిన అనేక మంది స్టార్లు తరలి వచ్చారు.సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే, టాలీవుడ్ స్టార్ నాగచైతన్య ఈ ఫార్ములాకు మరింత ప్రత్యేక ఆకర్షణ అయ్యారు. అర్ధరాత్రి జరిగిన విజయోత్సవంలో మరెందరో సినీ, క్రీడా సెలబ్రిటీలు సందడి చేశారు. శునకాల కోసం వేట కార్ రేస్కు శునకాలు పెద్ద సమస్యగా మారాయి. ఈ రేస్ జరిగే పరిసరాలలో కూవం నదీ తీరంలోని కొన్ని మురికి వాడలు ఉన్నాయి. ఇక్కడ శునకాలు ఎక్కవ. శనివారం రేస్ సమయంలో ఓ శునకం ట్రాక్లోకి దూసుకు రావడంతో రైడర్లు అలర్ట్ అయ్యారు. ఆ శునకం ట్రాక్ను రేస్ కారు వేగంతో దాటేయడంతో పెనుప్రమాదం తప్పినట్టైంది. దీంతో ఆదివారం రేసుకు శునకాల రూపంలో ఆటంకాలు ఎదురుకాకుండా జాగ్రత్తలు పడ్డారు. ఆదివారం ఉదయం నుంచి ఆ పరిసరాలలో శునకాల కోసం కార్పొరేషన్ సిబ్బంది తీవ్ర వేట సాగించారు. పదికి పైగా శునకాలను పట్టేశారు. రాత్రి జరిగిన ఫైనల్స్లోకి శునకాలు ట్రాక్ వైపుగా దూసుకు రాకుండా డేగ కళ్లతో కార్పొరేషన్ సిబ్బంది నిఘా వేయాల్సి వచ్చింది. Lovely! Normal Traffic on the left lane! Races on the right lane..👌🏎️#Formula4Chennai pic.twitter.com/2fqMd5KDSY— Chennai Updates (@UpdatesChennai) September 1, 2024 -
లక్నో మెంటార్గా జహీర్ ఖాన్!
న్యూఢిల్లీ: భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ను మెంటార్గా నియమించుకునేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) ప్రయత్నాలు చేస్తోంది. మెగా వేలం ప్రారంభానికి ముందే జహీర్తో ఒప్పందం కుదుర్చుకోవాలని లక్నో జట్టు యాజమాన్యం భావిస్తోంది. ముంబై ఇండియన్స్ గ్లోబల్ డెవలప్మెంట్ హెడ్గా పనిచేస్తున్న జహీర్ ఖాన్.. ఐపీఎల్లో 10 సీజన్లపాటు మూడు జట్ల తరఫున 100 మ్యాచ్లు ఆడి 102 వికెట్లు పడగొట్టాడు.2017లో అన్ని ఫార్మాట్ల క్రికెట్కు వీడ్కోలు పలికిన జహీర్... అప్పటి నుంచి ముంబై ఇండియన్స్తో కొనసాగుతున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్కు మెంటార్గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్ 2023 సీజన్ అనంతరం లక్నోను వీడి కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) జట్టుకు మారాడు. ఈ సీజన్లో గంభీర్ మార్గదర్శకత్వంలో కోల్కతా జట్టు అద్వితీయ ప్రదర్శన కనబర్చి మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ కైవసం చేసుకుంది. ‘టీమ్ మెంటార్గా జహీర్ ఖాన్ను నియమించేందుకు లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం ప్రయత్నిస్తోంది.గంభీర్ నిష్క్రమణతో అతడి స్థానాన్ని జహీర్తో భర్తీ చేయాలని అనుకుంటున్నారు’ అని పలు కథనాలు వెలుగులోకి వచ్చాయి. గంభీర్ మెంటార్షిప్లో 2022, 2023లో ప్లేఆఫ్స్కు చేరిన లక్నో... ఈ ఏడాది అంతగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా లక్నో బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా ఆ జట్టును వీడి... భారత జాతీయ జట్టు బౌలింగ్ కోచ్గా నియమితుడయ్యాడు. దీంతో లక్నో జట్టు ఐపీఎల్ మెగా వేలానికి ముందు సహాయక సిబ్బంది ఎంపిక పూర్తి చేయాలని భావిస్తోంది.మరోవైపు పంజాబ్ కింగ్స్ జట్టు కూడా కోచ్ కోసం అన్వేషణ కొనసాగిస్తోంది. హెడ్ కోచ్ ట్రేవర్ బేలిస్ స్థానంలో భారత ఆటగాడికే ఈ బాధ్యతలు అప్పగించాలని పంజాబ్ యాజమాన్యం భావిస్తోంది. అయితే ఈ జాబితాలో వీవీఎస్ లక్ష్మణ్ పేరు బలంగా వినిపిస్తోంది. ఆటపై అపార అనుభవం ఉన్న లక్ష్మణ్ ప్రధాన కోచ్ పదవికి సరైన ప్రత్యామ్నాయం అని పంజాబ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.అయితే గత కొన్నాళ్లుగా బీసీసీఐతో కొనసాగుతున్న వీవీఎస్.. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్గా వ్యవహరిస్తున్నాడు. మరో ఏడాది కాలం లక్ష్మణ్ ఎన్సీఏ హెడ్గా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రయత్నాలు ఫలిస్తాయా చూడాలి! -
సల్మాన్ రేస్లో లేరా?
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ‘రేస్’లో లేరా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ‘రేస్’ మూవీ ఫ్రాంచైజీలో ఇప్పటికే మూడు సినిమాలు (2008లో ‘రేస్’, 2013లో ‘రేస్ 2’, 2018లో ‘రేస్ 3’) వచ్చి, బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచాయి. దీంతో ఈ ఫ్రాంచైజీలో రానున్న నాలుగో సినిమాపై ఫుల్ క్రేజ్ నెలకొంది. ‘రేస్, రేస్ 2’ చిత్రాలకు అబ్బాస్–మస్తాన్ దర్శకత్వం వహించగా, ‘రేస్ 3’కి రెమో డిసౌజా దర్శకత్వం వహించారు.‘రేస్ 3’లో సల్మాన్ ఖాన్, అనీల్ కపూర్, బాబీ డియోల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, డైసీ షా కీలక పాత్రలు పోషించారు. 2018 రంజాన్ సందర్భంగా రిలీజైన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. దీంతో ‘రేస్ 4’ పై ఎలాంటి అప్డేట్ వస్తుందా? అని ప్రేక్షకులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. వారి నిరీక్షణకు నిర్మాత రమేశ్ ఎస్. తౌరానీ ఓ స్పష్టత ఇచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ– ‘‘రేస్’ ఫ్రాంచైజీలో రానున్న నాలుగో చిత్రానికి ఇప్పటికే కథ సిద్ధంగా ఉంది. ఇందులో నూతన నటీనటులు ఉంటారు.‘రేస్ 4’లో సల్మాన్ ఖాన్ భాగమవుతాడా? లేదా అనేది ఇప్పుడే చెప్పలేను. ఈ మూవీకి దర్శకుడు ఎవరన్నది కూడా ఇంకా నిర్ణయించలేదు. ఈ ఏడాది చివరికల్లా ఈ ్రపాజెక్ట్ సెట్స్పైకి వెళుతుంది’’ అన్నారు. మరి ‘రేస్ 4’లో సల్మాన్ భాగమవుతారా? లేదా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. -
SRH: సన్రైజర్స్ గుండెల్లో గుబులు.. మ్యాచ్ గనుక రద్దైతే!
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే పదకొండేసి మ్యాచ్లు ఆడిన కోల్కతా నైట్ రైడర్స్(నెట్ రన్రేటు 1.453), రాజస్తాన్ రాయల్స్ రాయల్స్(నెట్ రన్రేటు 0.476) ఎనిమిది గెలిచి టాప్-2లో తిష్ట వేశాయి.చెరో పదహారు పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకున్నాయి. ఇక ప్రస్తుతం మూడో స్థానం కోసం 12 పాయింట్లతో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ (-0.065)మధ్య జరుగుతున్న పోటీలో ఇప్పటి వరకు రన్రేటు పరంగా మెరుగ్గా ఉన్న సీఎస్కే(0.700)నే పైచేయి సాధించింది.ప్లే ఆఫ్స్ పోటీలో కీలక మ్యాచ్దీంతో రైజర్స్ నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. రాజస్తాన్ రాయల్స్పై మంగళవారం నాటి విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ సైతం ముందుకు దూసుకువచ్చింది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ సైతం 12 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతూ టాప్-4పై కన్నేసింది.ఈ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య బుధవారం నాటి మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు దూసుకువెళ్తుంది. అదే సమయంలో ఓడిన జట్టు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.పొంచి ఉన్న వాన గండంఅయితే, సొంతగడ్డపై మ్యాచ్ జరుగనుండటం సన్రైజర్స్కు సానుకూల అంశమే అయినా.. వర్షం రూపంలో ప్రమాదం పొంచి ఉంది. ఐపీఎల్ తాజా ఎడిషన్లో ఇప్పటి వరకు 56 మ్యాచ్లు జరిగాయి.కానీ ఒక్క మ్యాచ్ కూడా వరణుడి కారణంగా రద్దు కాలేదు. అయితే, ఉప్పల్ స్టేడియంలో జరగాల్సిన సన్రైజర్స్- లక్నో మ్యాచ్కు మాత్రం వాన గండం పొంచి ఉంది. హైదరాబాద్లో మంగళవారం కుండపోతగా వర్షం కురిసింది.ఈ నేపథ్యంలో స్టేడియం సిబ్బంది మైదానంలోని మధ్య భాగాన్ని కవర్లతో కప్పి ఉంచారు. అయితే, వాతావరణ శాఖ రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని మంగళవారం హెచ్చరించడం ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో గుబులు రేపుతోంది.మ్యాచ్ గనుక రద్దు అయితేకాగా తాజా సీజన్లో ఆరంభ మ్యాచ్లో తడబడ్డా ప్యాట్ కమిన్స్ బృందం తర్వాత అనూహ్య రీతిలో పుంజుకుంది. 266.. 277.. 287 స్కోర్లు నమోదు చేసి పరుగుల విధ్వంసానికి మారుపేరుగా నిలిచింది.అయితే, గత కొన్ని మ్యాచ్ల నుంచి సన్రైజర్స్ పేలవ బ్యాటింగ్తో తేలిపోతోంది. ఆఖరిగా సోమవారం ముంబై ఇండియన్స్తో ఆడిన మ్యాచ్లో సన్రైజర్స్ ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇక బుధవారం నాటి మ్యాచ్ గనుక రద్దైతే సన్రైజర్స్, లక్నోల ఖాతాలో చెరో పాయింట్ చేరుతుంది. అలా కాక మ్యాచ్ సాఫీగా సాగితే గెలిచిన జట్టుకు రెండు పాయింట్లు వస్తాయి.వాతావరణ శాఖ హెచ్చరికనగరంలో వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్లో బుధవారం సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది.చదవండి: సంజూ శాంసన్కు ఊహించని షాకిచ్చిన బీసీసీఐ 𝙇𝙤𝙘𝙠𝙚𝙙 𝙖𝙣𝙙 𝙡𝙤𝙖𝙙𝙚𝙙 👊🔥#PlayWithFire #SRHvLSG pic.twitter.com/En1XXReksW— SunRisers Hyderabad (@SunRisers) May 8, 2024 -
స్పోర్ట్స్ న్యూస్: ‘పారిస్’ మార్క్ను దాటిన రాంబాబు..
న్యూఢిల్లీ: భారత రేస్ వాకర్ రాంబాబు పారిస్ 20 కిలో మీటర్ల రేసులో పారిస్ ఒలింపిక్స్ అర్హత టైమింగ్ను అందుకున్నాడు. స్లొవేకియాలో జరుగుతున్న టూర్ గోల్డ్ లెవల్ ఈవెంట్లో రాంబాబు మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఈవెంట్ను 1 గంటా 20 నిమిషాల్లో రాంబాబు పూర్తి చేశాడు. పెరూ, ఈక్వెడార్ అథ్లెట్లు తొలి రెండు స్థానాల్లో నిలిచారు. పారిస్ క్వాలిఫయింగ్ టైమింగ్ 1 గంటా 20 నిమిషాల 10 సెకన్లుగా ఉంది. అయితే ఈ ప్రదర్శనతో ఉత్తరప్రదేశ్కు చెందిన రాంబాబు నేరుగా ఒలింపిక్స్లో ఆడే అవకాశం లేదు. అతనికంటే ముందే ఆరుగురు భారత రేస్ వాకర్లు అర్హత టైమింగ్ను సాధించారు. ఒలింపిక్స్ నిబంధనల ప్రకారం దేశంనుంచి గరిష్టంగా ముగ్గురికే పాల్గొనే అవకాశం ఉంది. ఇవి చదవండి: నేడు జరిగే WPL లో.. కొత్త విజేత ఎవరో!? -
రామానాయుడు స్టూడియోలో కార్ రేసింగ్.. సందడి చేసిన టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)
-
ఈ మూడు కారణాలే బాబాను సీఎం రేసు నుంచి తప్పించాయా?
రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవి రేసు నుంచి బాబా బాలక్నాథ్ తప్పుకున్నారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే బాబా బాలక్నాథ్ పేరు ముఖ్యమంత్రి పదవి రేసులో వినిపించింది. పార్టీ అంతర్గత సర్వేలో కూడా ఆయన ఆధిక్యత కనబరిచారు. ఎన్నికల్లో ఆయన గెలిచిన తర్వాత ఈ వాదన మరింత బలపడింది. పైగా బాబా బాలక్నాథ్.. బీజేపీ నేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో కూడా సమావేశం అయ్యారు. ఈ నేపధ్యంలో బాబా ముఖ్యమంత్రి అవుతారనే చర్చలు మరింత ఊపందుకున్నాయి. అయితే ఇప్పుడు ఆయన తాను ముఖ్యమంత్రి రేసులో లేనని ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. అయితే బాబా సీఎం కాకపోవడానికి మూడు కారణాలను కీలకంగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. మొదటిది: బాబా బాలక్నాథ్ ఓబీసీ వర్గానికి చెందినవారు. రాజస్థాన్ పొరుగు రాష్ట్రమైన మధ్యప్రదేశ్లో సీఎం పదవికి బలమైన పోటీదారులుగా ఓబీసీ నేతలు ఉన్నారు. అటువంటి పరిస్థితిలో రాబోయే లోక్సభ ఎన్నికల దృష్ట్యా రెండు పొరుగు రాష్ట్రాలలో ఒకే సామాజికవర్గానికి చెందిన ముఖ్యమంత్రులను ఎంపిక చేసేందుకు బీజీపీ సుముఖంగా లేదని తెలుస్తోంది. రెండవది: బాబా బాలక్నాథ్కు రాజకీయాలలో తగినంత అనుభవం లేదు. ఒక ప్రకటనలో ఆయన కూడా ఈ విషయాన్ని అంగీకరించారు. బాబా బాలక్నాథ్ ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే ఎంపీ అయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ కోణంలో చూస్తే బాబా రాజకీయ అనుభవం ఐదేళ్లు మాత్రమే. తగిన అనుభవం లేకపోవడంతోనే బాబా సీఎం కుర్చీ దూరమయ్యారనే మాట వినిపిస్తోంది. మూడవది: రాజస్థాన్కు పొరుగు రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజస్థాన్లోనూ బాబా బాలక్నాథ్ను సీఎం చేస్తే బీజేపీపై హిందుత్వ ముద్ర మరింత బలమవుతుంది. అప్పడు అన్ని వర్గాలను అభివృద్ధి చేస్తామని చెబుతున్న బీజేపీ హామీకి విలువలేకుండా పోతుంది. అందుకే బాబాను సీఎం రేసు నుంచి బీజేపీ తప్పించిందని అంటున్నారు. ఇది కూడా చదవండి: మధ్యప్రదేశ్ సీఎం ఎవరు? రాజస్థాన్లో ఏం జరుగుతోంది? -
ఛత్తీస్గఢ్ సీఎం రేసులో వెనుకబడిన రమణ్ సింగ్!
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్గఢ్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. ఈ నేపధ్యంలో బీజేపీ మరో విజయానికి ఇక్కడి నుంచే బీజం వేయాలని భావిస్తోంది. 2024 లోక్సభ ఎన్నికలలోనూ ప్రభావం చూపే నేతను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాలని పార్టీ భావిస్తోంది. ఛత్తీస్గఢ్లో అధికారాన్ని ఓబీసీ గిరిజన నేతకు అప్పగించాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. ఈ వ్యూహాల నేపధ్యంలో ముఖ్యమంత్రి పదవి రేసులో మాజీ సీఎం రమణ్ సింగ్ పేరు వెనుకబడింది. సీఎం పదవికి బీజేపీ కొత్త పేరును పరిశీలిస్తోంది. చత్తీస్గఢ్లో సీఎం రేసులో ఎంపీ రేణుకా సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ సావో, ఎంపీ గోమతి సాయి పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కూడా రేసులో ఉన్నారని చెప్పినప్పటికీ, మిగిలినవారు ఈ రేసులో ముందున్నారు. రమణ్ సింగ్ 71 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపధ్యంలో అతనిని పక్కన పెట్టాలని బీజేపీ భావిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ సీఎం రేసులో లతా ఉసేంది, రాంవిచార్ నేతమ్, విష్ణుదేవ్ సాయి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. విష్ణుదేవ్ సాయి గిరిజన నాయకుడు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు ఎంపీగా గెలిచారు. మూడుసార్లు ఛత్తీస్గఢ్ బీజేపీ అధ్యక్షునిగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో అమిత్ షా ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఛత్తీస్గఢ్ సీఎం ఎంపిక కోసం ఈరోజు (ఆదివారం) జరిగే శాసనసభా పక్ష సమావేశంలో ముగ్గురు పరిశీలకులు, జార్ఖండ్ మాజీ సీఎం, గిరిజన నాయకుడు అర్జున్ ముండా, అస్సాం మాజీ సీఎం, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, పార్టీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ గౌతమ్ పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పరిశీలకులు సీఎం ఎంపిక విషయంలో ఎమ్మెల్యేల అభిప్రాయం తెలుసుకుని పార్టీ హైకమాండ్కు తెలియజేస్తారని విశ్వసనీయ సమాచారం. ఇది కూడా చదవండి: బొగ్గు గనుల మూసివేత పరిణామాలేమిటి? కూలీలు ఏం చెయ్యాలి? -
సీఎం ఎంపికపై మల్లగుల్లాలు.. ఢిల్లీకి వసుంధర రాజే!
రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా తేలలేదు. ఈ నేపధ్యంలో మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేను బీజేపీ హైకమాండ్ ఢిల్లీకి పిలిపించింది. రాజే బుధవారం రాత్రి 10:30 గంటలకు ఇండిగో ఎయిర్వేస్ విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. వసుంధర రాజే గురువారం ఉదయం జేపీ నడ్డా, అమిత్ షాలతో భేటీ కానున్నారు. రాజస్థాన్లో అధికారాన్ని వసుంధర రాజేకు అప్పగించాలని పార్టీ హైకమాండ్ మరోసారి భావిస్తున్నట్లు చర్చ సాగుతోంది. డిసెంబరు 3న రాజస్థాన్లో బీజేపీకి మెజారిటీ వచ్చిన తరుణంలో ముఖ్యమంత్రి ఎవరనేదానిపై చర్చ మొదలైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో చాలా మంది పేర్లు వినిపించాయి. ఈ జాబితాలో వసుంధర రాజే, అర్జున్ రామ్ మేఘ్వాల్, గజేంద్ర సింగ్ షెకావత్, రాజేంద్ర రాథోడ్, దియా కుమారి, బాబా బాలక్నాథ్, ఓం బిర్లా పేర్లు ఉన్నాయి. సీఎం రేసులో అనేక మంది పేర్లు ఉండటంతో వసుంధర రాజే చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేలను ఆమె విందుకు ఆహ్వానించారు. ఈ నేపధ్యంలో దాదాపు 70 మంది ఎమ్మెల్యేలు ఆమెను ముఖ్యమంత్రిని చేసేందుకు అంగీకరించారని వసుంధర మద్దతుదారులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో రాజే ఢిల్లీకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: ఎంపీ పదవికి 10 మంది రాజీనామా -
తైవాన్ అధ్యక్ష రేసులో..టెర్రీ గౌ
ఐ ఫోన్ తయారీ సంస్థ ఫౌండర్, అపర కుబేరుడు టెర్రీ గౌ కూడా తైవాన్ అధ్యక్ష రేసులో నిలిచారు. కుచేలుడి నుంచి కుబేరుని స్థాయికి ఎదిగిన ఆసక్తికర నేపథ్యం టెర్రీది. కనుక ఆయనకున్న ప్రజాదరణ నేపథ్యంలో ఒక్కడే గనక బరిలో ఉంటే పాలక డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ కి గట్టి పోటీ ఇవ్వడం కూడా ఖాయమేనని అంటున్నారు. కానీ విపక్షాల తరఫున ఇప్పటికే ఇద్దరు రంగంలోకి దిగారు.ఈ నేపథ్యంలో టెర్రీ పోటీ విపక్ష ఓటును మూడుగా చీల్చి చివరికి 2024 జనవరిలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో అధికార పక్షం నెత్తిన పాలు పోసేలా కనిపిస్తోందన్నది పరిశీలకుల విశ్లేషణ... తైవాన్కు చెందిన 72 ఏళ్ల టెర్రీ అపర కుబేరుడు. ఐ ఫోన్ తయారీ సంస్థ ఫాక్స్ కాన్ వ్యవస్థాపకుడు.వ్యాపారవేత్తగా దేశ ప్రజల్లో ఆయనకున్న చరిష్మా అంతా ఇంతా కాదు. అధికార పక్షంతో ఇప్పటికే రెండు విపక్షాలు తలపడుతుండగా మూడో శక్తిగా ఆయన కూడా రంగంలోకి దిగి అధ్యక్ష ఎన్నికల రేసును ఆసక్తికర మలుపు తిప్పారు. బరిలో ఆ ముగ్గురు... అధ్యక్షుడు సై ఇంగ్ వెన్కు ఇది రెండో టర్మ్. అంతకు మించి పదవిలో కొనసాగేందుకు తైవాన్ నిబంధనలు అనుమతించవు. దాంతో ఈసారి అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (డీపీపీ) తరఫున విలియం లై చింగ్ తే బరిలో దిగుతున్నారు. ప్రధాన విపక్షమైన జాతీయవాద కోయిమిన్ టాంగ్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్గా చాన్స్ దక్కించుకునేందుకు టెర్రీ ఎంతగానో ప్రయత్నించి విఫలమయ్యారు. ఆయనకు బదులుగా హొవ్ యూ ఇయ్కు పార్టీ అవకాశం ఇచ్చింది. మరో విపక్షం టీపీపీ తరఫున దేశ ప్రజల్లో అత్యంత ఆదరణ ఉన్న కో వెన్ జే పోటీ పడుతున్నారు. రాజధాని తాయ్ పీ సిటీ మేయర్గా చేసిన అనుభవం ఆయన సొంతం. పైగా యువ ఓటర్లు ఆయనను వేలం వెర్రిగా అభిమానిస్తారు. ప్రస్తుతం రేసులో రెండో స్థానంతో వెన్ దూసుకుపోతున్నారు. ఎంత ప్రయత్నించినా ప్రధాన విపక్షం డీపీపీ నుంచి అవకాశం దక్కకపోవడంతో టెర్రీ స్వతంత్ర హోదాలో పోటీకి దిగారు. అంతులేని సంపద, వ్యాపార విజయాలతో పాటు చైనాతో దీర్ఘకాలం పాటు విజయవంతంగా కలిసి పని చేసిన విశేషానుభవం టెర్రీకి మరింతగా కలిసొచ్చే అంశం.– నేషనల్ డెస్క్, సాక్షి తైవాన్ ఇంజనీరింగ్ ప్రతిభకు మానవ వనరులను కలగలిపి ఫాక్స్ కాన్ (హాన్ హై ఇండస్ట్రీస్)ను ప్రపంచంలోనే అతి పెద్ద ఎల్రక్టానిక్స్ తయారీదారుగా తీర్చిదిద్దారు టెర్రీ. 1980, 90ల్లో దక్షిణ చైనాలో అతి పెద్ద తయారీ సంస్థలను నెలకొల్పి చైనీయులకు వేలాదిగా ఉపాధి కల్పించారు. ఈ మోడల్ సూపర్ సక్సెస్ అయింది. ఎంతగా అంటే, యాపిల్ తన మాక్ బుక్స్, ఐ ఫోన్ల తయారీని ఫాక్స్ కాన్కే అప్పగించేలా ఒప్పించగలిగారు టెర్రీ. దాంతో ఫాక్స్ కాన్ అతి పెద్ద కంపెనీగా, టెర్రీ దేశంలోనే అతి సంపన్నుల్లో ఒకరిగా ఎదగడం సాధ్యపడింది. తైవాన్ సారబౌమత్వాన్ని కాపాడేందుకు చైనాతో తనకున్న సంబంధాలన్నింటిన్నీ ఉపయోగిస్తానని, దేశాభివృద్ధి కోసం తన అనుభవం మొత్తాన్నీ రంగరిస్తానని చెబుతున్నారు టెర్రీ. తైవాన్ను ఎలాగైనా పూర్తిగా తనలో కలిపేసుకోవాలని చైనా ప్రయత్నిస్తుండటం, ఇటీవల ఆ దిశగా దూకుడు పెంచడం, అది తైవాన్ కు కొమ్ము కాస్తున్న అమెరికాతో ఘర్షణ దాకా వెళ్లడం తెలిసిందే పాలక డీపీపీ అసమర్థ, అసంబద్ధ, దుందుడుకు విధానాలే ఈ దుస్థితికి కారణమని టెర్రీ ఆరోపిస్తున్నారు. కానీ తైవాన్ ప్రజల్లో అత్యధికులు ఈ వాదనను విశ్వసించడం లేదు. త్రిముఖ ఓటుతో ఇప్పటికే అవకాశాలు సన్నగిల్లేలా కనిపిస్తున్న టెర్రీకి ఇది మరింత ప్రతికూలంగా మారేలా ఉంది. 40 శాతానికి పైగా ఓటర్లు పాలక పక్షానికి గట్టిగా మద్దతిస్తున్నట్టు ఇటీవలి సర్వేలు కూడా తేల్చాయి. ఈ పరిస్థితుల్లో విపక్షాలన్నీ ఒక్కటై ఉమ్మడిగా ఒకే అభ్యర్ని నిలిపితేనే అధికార పార్టీ కి కాస్తో కూస్తో పోటీ ఇవ్వడం సాధ్యపడేలా కనిపిస్తోంది. కానీ అందుకు రెండు విపక్షాల్లో ఏదీ సిద్ధంగా లేదు. దాంతో సర్వేలు చెబుతున్నట్టు అధికార డీపీపీకి కేవలం 40 శాతం ఓట్లు మాత్రమే వచ్చినా అది అధికారం నిలుపుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. -
ట్రాక్పై విషాదం.. 13 ఏళ్ల రేసర్ దుర్మరణం
చెన్నై: బెంగళూరుకు చెందిన 13 ఏళ్ల కుర్రాడు కొప్పారం శ్రేయస్ హరీశ్కు రేసింగే ప్రాణం. మోటార్సైకిల్ రేసింగ్లో బుల్లెట్లా దూసుకెళ్లే ఈ రైడర్ తన కలల్ని సాకారం చేసుకోకముందే కన్నవాళ్లకు కన్నీళ్లను మిగిల్చి వెళ్లాడు. తనకెంతో ఇష్టమైన ట్రాకే అతని ప్రాణం తీసింది. రేసింగ్లో మెరికగా చిరుప్రాయంలోనే జాతీయ స్థాయిలో విజేతగా నిలిచిన ఈ టీనేజ్ కుర్రాడు శనివారం పోల్ పొజిషన్తో భారత జాతీయ మోటార్సైకిల్ రేసింగ్ చాంపియన్షిప్ పోటీలో పాల్గొన్నాడు. రేసు ప్రారంభమైన కాసేపటికే మెరుపు వేగంతో దూసుకెళ్తున్న అతని బైక్ ‘టర్న్–1’ (మలుపు) వద్ద అదుపుతప్పింది. వేగంతో ఉండటం, కిందపడగానే తలకు బలయమైన గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. చదవండి: ఫైనల్లో ప్రణయ్ -
US: యూనివర్సిటీల్లో ఆ రిజర్వేషన్లపై నిషేధం
వాషింగ్టన్ డీసీ: అమెరికా సుప్రీం కోర్టు గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. యూనివర్సిటీల అడ్మిషన్లలో జాతి సంబంధిత రిజర్వేషన్లపై నిషేధం విధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఆఫ్రో-అమెరికన్లు, ఇతర మైనారిటీలకు విద్యావకాశాలను పెంపొందించే ఉద్దేశంతో యూనివర్సిటీ అడ్మిషన్లను అమలు చేస్తున్నారు. 1960 సంవత్సరం నుంచి ఇవి అమలు అవుతున్నాయి. ఈ మేరకు అడ్మిషన్ విధానాల్లో జాతి, తెగ పదాలను ప్రధానంగా ఉపయోగిస్తూ వస్తున్నారు. అయితే.. ఇకపై ఆ పదాలను ఉపయోగించడానికి వీల్లేదని.. ఆ పదాలను నిషేధిస్తూ అమెరికా అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. 👨⚖️ ఈ మేరకు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ ఆ సంచలన తీర్పు చదువుతూ.. ఒక స్టూడెంట్ను అతని అనుభవాల ఆధారంగా పరిగణించబడాలిగానీ జాతి ఆధారంగా కాదు. యూనివర్సిటీలలో ఇకపై జాతి సంబంధిత అడ్మిషన్లు కొనసాగడానికి వీల్లేదు అంటూ తీర్పు కాపీని చదివి వినిపించారాయన. 👉 అమెరికాలో అత్యంత పురాతనమైన ఉన్నత విద్యాసంస్థలు హార్వర్డ్ యూనివర్సిటీ, యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినా (UNC)ల్లో అడ్మిషన్ల విధానంలో పారదర్శకత కోరుతూ ఓ విద్యార్థి సంఘం వేసిన పిటిషన్ ఆధారంగా అమెరికా సుప్రీం కోర్టు ఈ తీర్పు వెల్లడించింది. 👉 ఒకప్పుడు అఫ్రో-అమెరికన్ల పట్ల విపరీతమైన జాతి వివక్ష కొనసాగేది. ఈ క్రమంలోనే అమెరికా ఉన్నత విద్యాసంస్థల్లో వాళ్లకు అవకాశాలు దక్కేవి కావు. 👉 అయితే.. 1960లో జరిగిన పౌర హక్కుల ఉద్యమం ఆధారంగా యూనివర్సిటీలలో నల్ల జాతి పౌరులకు,ఇతర మైనారీటీలకు విద్యావకాశాలు అందజేసే ఉద్దేశంతో పలు నూతన విధానాలు తీసుకొచ్చారు. 👉 అయితే.. జాతి సంబంధిత అడ్మిషన్ విధానాల వల్ల సమానత్వానికి తావు లేకుండా పోయిందని, పైగా మెరుగైన అర్హత కలిగిన ఆసియా అమెరికన్లకు అవకాశాలు దూరం అవుతున్నాయని సదరు గ్రూప్ సుప్రీం ముందు వాదించింది. 👉 నల్లజాతి అమెరికన్లకు చోటు కల్పించేందుకు ఆసియన్ల పట్ల వివక్ష చూపుతున్నారన్నది ప్రధాన అభ్యంతరం చాలా కాలంగా కొనసాగుతోందక్కడ. 👨⚖️ తాజాగా.. సుప్రీం కోర్టు ధర్మాసనంలోని 6-3 న్యాయమూర్తుల మెజార్టీ సదరు రెండు యూనివర్సిటీలలో జాతి సంబంధిత అడ్మిషన్లు చెల్లవంటూ తీర్పు ఇచ్చింది. ట్రంప్ తప్పా అంతా ఆగ్రహం యూనివర్శిటీ అడ్మిషన్లలో రిజర్వేషన్లపై నిషేధం తీర్పుపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తీర్పుతో తాను విబేధిస్తున్నట్లు తెలిపారాయన. అమెరికాలో వివక్ష ఇంకా మనుగడలోనే ఉందన్న విషయాన్ని గుర్తు చేశారాయన. జాతుల పరంగా వైవిధ్యం ఉన్నప్పుడే అమెరికా విద్యాసంస్థలు బలోపేతంగా ఉంటాయని తాను భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. కోర్టు తీర్పు తుది నిర్ణయం కాదంటూ ప్రధానంగా ప్రస్తావించారాయన. The odds have been stacked against working people for too long – we cannot let today's Supreme Court decision effectively ending affirmative action in higher education take us backwards. We can and must do better. pic.twitter.com/Myy3D5jUGH — President Biden (@POTUS) June 30, 2023 సుప్రీం తీర్పు.. భవిష్యత్తు తరాలకు అవకాశాలను నిరాకరించడమే అవుతుందని ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ అభిప్రాయపడ్డారు. తీర్పును వర్ణాంధత్వం అంటూ అభివర్ణించిన ఆమె.. దేశాన్ని వెనక్కి తీసుకెళ్లడమే అంటూ తీవ్రంగా వ్యతిరేకించారామె. Today’s Supreme Court decision in Students for Fair Admissions v. Harvard and Students for Fair Admissions v. University of North Carolina is a step backward for our nation. Read my full statement. pic.twitter.com/pIBCmVMr6d — Vice President Kamala Harris (@VP) June 29, 2023 రిజర్వేషన్లపై నిషేధం విధిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పుపై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మండిపడ్డారు. అందరికీ అవకాశాల పేరిటే ఈ విధానాలు తెరపైకి వచ్చాయని.. తద్వారానే తాను, తన భార్య మిచెల్లీ లాంటి వాళ్లం వృద్ధిలోకి వచ్చామని అంటున్నారాయన. ఆ విధానాలు తెచ్చిన ఉద్దేశ్యాన్ని న్యాయవ్యవస్థ గుర్తించి ఉంటే బాగుండేదని అంటున్నారాయన. Affirmative action was never a complete answer in the drive towards a more just society. But for generations of students who had been systematically excluded from most of America’s key institutions—it gave us the chance to show we more than deserved a seat at the table. In the… https://t.co/Kr0ODATEq3 — Barack Obama (@BarackObama) June 29, 2023 ట్రంప్ మాత్రం ఇలా.. ఇది గొప్ప శుభదినం అంటూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన ఆయన.. సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘమైన పోస్ట్ సైతం ఉంచారు. అమెరికాకు ఇది గొప్ప రోజు. ఇది ప్రతి ఒక్కరూ ఎదురుచూసిన.. ఆశించిన తీర్పు. దీని ఫలితం అద్భుతంగా ఉంటుంది. ప్రపంచంలోని ఇతర దేశాలతో మనల్ని పోటీగా ఉంచుతుంది అంటూ ట్రూత్సోషల్లో పోస్ట్ చేశారాయన. -
ఫైనల్ బెర్త్ ఎవరిది..
-
ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబో రేస్ని పూర్తి చేసిన తొలి భారతీయుడు
రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ అభిలాష్ టోమీ చరిత్ర సృష్టించాడు. ఫ్రాన్స్లోని లెస్ సాబుల్స్ డి ఒలోన్ నుంచి ప్రారంభమైన సోలో సెయిలింగ్ రేస్లో ప్రపంచవ్యాప్తంగా చుట్టూ వచ్చిన సెయిలర్గా(నావికుడు) రెండో స్థానంలో నిలిచాడు. ఈ రేస్ సెప్టెంబర్ 4,2022న ఫ్రాన్స్లో ప్రారంభమైంది. దీంతో టోమీ ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ రేస్ను పూర్తి చేసిన మొదటి భారతీయుడిగా నిలిచాడు. అంతేగాదు ప్రపంచవ్యాప్తంగా సోలో సెయిలింగ్ రేసులో రెండో స్థానం దక్కించుకున్న వ్యక్తిగా నిలిచాడంటూ రేసు అధికారిక వెబ్పేజ్లో ఒక ప్రకటనలో వెల్లడించింది. (చదవండి: బ్యూటీపార్లర్కు వెళ్లనివ్వలేదని భార్య క్షణికావేశంతో..) -
ఈ–టూవీలర్ల కోసం రేస్ఎనర్జీ, హాలా జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ సంస్థ రేస్ఎనర్జీ, రైడ్ షేరింగ్ ప్లాట్ఫామ్ హాలా మొబిలిటీ తాజాగా జట్టు కట్టాయి. దేశవ్యాప్తంగా 2,000 పైచిలుకు ఎలక్ట్రిక్ టూ–వీలర్లను డెలివరీ సర్వీసుల కోసం వినియోగంలోకి తేనున్నాయి. ఈ ఏడాది జూలై నుంచి తొలి దశ కింద కొన్ని వాహనాలు వినియోగంలోకి రానున్నట్లు సంస్థలు తెలిపాయి. విస్తృతమైన రేస్ బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ .. తమ మార్కెట్, కస్టమర్ల బేస్ను మరింతగా పెంచుకునేందుకు సహాయకరంగా ఉండగలదని హాలా మొబిలిటీ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ఈ–ఆటో మార్కెట్లో తాము పటిష్టంగా ఉన్నామని, హాలాతో జట్టు కట్టడం ద్వారా మిగతా విభాగాల్లోకి కూడా గణనీయంగా విస్తరించగలమని రేస్ఎనర్జీ సహవ్యవస్థాపకుడు, సీఈవో అరుణ్ శ్రేయాస్ పేర్కొన్నారు. -
బ్రిటన్ ప్రధాని రేసు.. రెండో రౌండ్లోనూ రిషి సునాక్ జోరు
లండన్: బ్రిటన్ ప్రధాని రేసులో ఇవాళ మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునాక్ అత్యధిక ఓట్లతో రెండో దశ ఎన్నికలో ముందంజలో నిలిచారు. అదే సమయంలో.. భారత సంతతికే చెందిన సువెల్లా బ్రావర్మన్ తక్కువ ఓట్లతో పోటీ నుంచి ఎలిమినేట్ అయ్యారు. కన్జర్వేటివ్ పార్టీ నిర్వహించిన రెండో దశ ఎన్నికల్లో.. 101 ఓట్లతో రిషి సునాక్ ముందంజలో నిలిచారు. పెన్నీ మోర్డాంట్ 83 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఇక భారత సంతతికి చెందిన సువెల్లా బ్రావెర్మన్(అటార్నీ జనరల్) పోటీ నుంచి వైదొలిగారు. ప్రధాని రేసులో చాలామంది ఉండడంతో దశల వారీగా బ్యాలెట్ పోలింగ్ నిర్వహించి.. చివరికి ఒకరిని ఎన్నుకుంటారు. మెజార్టీ ఉన్న పార్టీ తరపున అభ్యర్థి కావడంతో కన్జర్వేటివ్ పార్టీ నుంచి చివరగా మిగిలిన వ్యక్తే ప్రధాని(బోరిస్ జాన్సన్ స్థానంలో) అవుతారు. అయితే ప్రధానిగా ఎన్నికైన వ్యక్తి ఒకవేళ ఎన్నికలకు వెళ్లాలనుకుంటే.. వెళ్లొచ్చు. -
ఊహించని మలుపులు.. ప్రీతి పటేల్ అవుట్
లండన్: బ్రిటన్ రాజకీయాల్లో ఇవాళ కీలక, ఊహించని పరిణామాలే చోటుచేసుకున్నాయి. కన్జర్వేటివ్ పార్టీ తరపున ప్రధాని అభ్యర్థి విషయంలో మాజీ ఛాన్స్లర్ రిషి సునాక్కు అవకాశాలు కొంచెం కొంచెంగా మెరుగు అవుతున్నాయి. అదే సమయంలో.. బ్రిటన్ హోం సెక్రెటరీ ప్రీతి పటేల్(50) కీలక నిర్ణయం ప్రకటించారు. ప్రధాని రేసులో తాను దిగట్లేదని కాసేపటి కిందట ఆమె స్పష్టం చేశారు. 2016 బ్రెగ్జిట్ రిఫరెండమ్లో డేవిడ్ కామెరున్ క్యాబినెట్ నుంచి బోరిస్ జాన్సన్, మైకేల్ గోవ్తో పాటు ప్రీతి పటేల్ కూడా కీలకంగా వ్యవహరించారు. ఈ తరుణంలో..కన్జర్వేటివ్ పార్టీ తరపున నాయకత్వ రేసులో ఆమె దిగుతారని అంతా భావించారు. అయితే పోటీలో తాను లేనని హోం సెక్రటరీ ప్రీతి సుశీల్ పటేల్ ప్రకటించారు. సహచరుల నుంచి లభిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలని ఆమె పేర్కొన్నారు. అంతకు ముందు ఆమె మద్దతుదారులు.. పోటీ విషయంలో ఆమె ధృడంగా ఉన్నారని, సుదీర్ఘకాలం బ్రెగ్జిటర్గా ఉన్నారని పేర్కొన్నారు. అంతేకాదు.. ప్రీతి పటేల్ను మార్గరేట్థాచర్తో పోల్చారు కొందరు సభ్యులు. అయితే ఆమె మాత్రం పోటీలో ఉండడం లేదని క్లారిటీ ఇచ్చారు. సరిపడా మద్దతు లేనందునే ఆమె తప్పుకున్నట్లు తెలుస్తోంది.కానీ, పటేల్కు విద్యా మంత్రి ఆండ్రియా జెన్కీన్స్, న్యాయశాఖ మంత్రి టామ్ పుర్సుగ్లోవ్తో పాటు పదమూడు మంది సభ్యుల మద్దతు ఉంది. ఈ మద్దతు కోసం ఇప్పుడు మిగతా సభ్యులు చూస్తున్నారు. మరోవైపు రేసులో ఉన్న రిషి సునాక్(42) భారత సంతతి వ్యక్తికాగా, ప్రతీ కూడా భారత సంతతి వ్యక్తే కావడం గమనార్హం. ఇప్పటికే సువెల్లా బ్రావర్మన్, లిజ్ ట్రుస్స్లు బ్రిటన్ ప్రధాని రేసులో నిలబడ్డారు. ఇదిలా ఉంటే.. ప్రధాని రేసులో నిల్చునే అభ్యర్థి పేరును బ్యాలెట్ పేపర్లో చేర్చాలంటే కనీసం 20 ఎంపీల మద్దతు అయినా అవసరం ఉంటుంది. కన్జర్వేటివ్ పార్టీ తరపున అభ్యర్థి కోసం నిర్వహించిన ఓటింగ్లో.. ఊహించని మలుపులు ఇదిలా ఉంటే.. బ్రిటన్ రాజకీయాల్లో ఇవాళ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఉప ప్రధాని డోమినిక్ రాబ్, రవాణా శాఖ మంత్రి గ్రాంట్ షాప్స్లు.. రిషి సునాక్ నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రకటన చేశారు. అంతేకాదు.. రాబ్ స్వయంగా సునాక్ ప్రచార ఈవెంట్ను లాంచ్ చేశారు ఇవాళ. ఇదిలా ఉంటే.. ప్రధాని రేసు నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించిన గ్రాంట్ షాప్స్.. ట్విటర్ ద్వారా సునాక్ అనుభవానికి, అర్హతకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. చదవండి: బ్రిటన్ తదుపరి ప్రధానిని ప్రకటించేంది అప్పుడే! -
గెలుపంటే ఇది అనిపించేలా సాధించింది: వీడియో వైరల్
Despite Losing Shoe She Won Track Race: మనం చాలా క్రీడల్లో చూస్తుంటాం. అసలు వాళ్లు ఆ ఆటలో ఓడిపోతారేమో అనుకునే సమయంలో అందర్నీ ఆశ్చర్యపరిచేలా గెలిచి చూపిస్తారు. అంతెందుకు క్రికెట్ మ్యాచ్ లేదా టెన్నిస్ మరే ఏ ఆటైన ఆ క్రీడాకారులు ఆడుతున్న తీరు చూసి గెలవరని అర్థమైపోతుంది. కానీ వాళ్లు అందరీ అంచనాలను తారుమారు చేసి మరీ మంచి గా ఆడి గెలుస్తారు. అచ్చం అలాంటి సంఘనటనే అమెరికాలో నెబ్రాస్కాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ప్రముఖ బాక్సర్ టెరెన్స్ క్రాఫోర్డ్ కుమార్తె 7 ఏళ్ల తలయా నార్త్వెస్ట్ హై స్కూల్లోని స్ప్రింట్ పోటీ(పరుగుల పోటీ) లో పాల్గొంది. ఐతే ఆ ట్రాక్ రేస్ మొదలైనప్పుడూ ఆమె కాలి షూ జారిపోతుంది. దీంతో ఆ రేస్లో పాల్గొన్న వాళ్లంతా తలయా కంటే చాలా ముందంజలో ఉన్నారు. కానీ ఆమె ఆ షు వేసుకోవడంలోనే ఉండిపోతుంది. ఆమె పరుగు మొదలు పెట్టేటప్పటికే చాలా ఆలస్యమవుతుంది. ఆ స్టేడియంలో ఉన్న ప్రేక్షకులంతా ఆమె గెలవదనే అనుకుంటారు. కానీ అందరీ అభిప్రాయలను తలకిందులు చేస్తూ అనుహ్యంగా తనతోటి రేసర్లను వెనక్కి నెట్టి మరీ ముందుంటుంది. చివరికీ ఆ పోటీలో ఆమె గెలుస్తుంది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: పొట్టు పొట్టు చినిగిన నాశనం అయిన షూస్.. ధర తెలిస్తే దిమ్మతిరగడం ఖాయం) -
వరల్డ్ ఫస్ట్..రేసింగ్ కార్ కన్నా వేగంగా పని..
కార్ల రేస్లకు సంబంధించిన పోటీలను టీవీలో చూస్తున్నప్పుడు కొన్ని అత్యంత వేగంగా పల్టీలు కొడుతుండటం చూస్తుంటాం. ప్రమాదానికి గురైన కార్లను రేస్కు అడ్డు రాకుండా అంతే వేగంగా తొలగించే కార్యక్రమం కూడా జరుగుతుంటుంది. ఇప్పటివరకు ఈ పనిని పురుషులే చేసేవారు. కానీ, ఈ ప్రపంచంలోకీ ఓ మహిళ అడుగుపెట్టి, తన సత్తా చాటుతోంది. దీంతో వరల్ట్ ఫస్ట్ ఫిమేల్ క్రేన్ డ్రైవర్గా 30 ఏళ్ల మరియన్ అల్–బజ్ గుర్తింపు పొందింది. రేస్ పోటీల్లో క్రేన్ డ్రైవర్గా ఓ మహిళ నియమితురాలవడం ప్రపంచమంతా గుర్తించదగిన విషయంగా అరబ్ ట్రిబ్యూన్ ప్రకటించింది. ‘మోటార్ ఇంజిన్ల పట్ల ఆమెకున్న మక్కువే ఈ ఏడాది దిరియా ఇ–ప్రిక్స్ 2022లో పాల్గొనేలా చేసింద’ని స్పష్టం చేసింది. పురుషాధిపత్య రంగంలో ఆల్–బజ్ చూపిన సాహసం ఎంతోమంది మహిళల్లో స్థైర్యాన్ని నింపుతోంది. అల్–బజ్ 13 ఏట నుండి వాహనాలను నడపడంలో ఆసక్తి చూపింది. ఈ విషయాల గురించి ఆమె ఇలా ప్రస్తావిస్తుంది. ఆసక్తి నేర్పిన పాఠం ‘ఒక మహిళ ఈ రంగంలోకి ప్రవేశించగలదని ఎవరూ ఎప్పుడూ అనుకొని ఉండరు. మెకానికల్ ప్రపంచమంటేనే పురుషుల ఆధిపత్య వృత్తి. మా నాన్నకు మెకానిక్ పని అంటే చాలా ఇష్టం. ఆయన వద్ద చాలా పాత కార్లు ఉన్నాయి. వాటిని రిపేర్ చేసి, మళ్లీ మార్కెట్లోకి తీసుకువస్తాడు. నా చిన్నప్పటి నుంచి నాన్న చేసే పనిని ఆసక్తిగా చూస్తుండేదాన్ని. మెల్ల మెల్లగా నైపుణ్యాలను తెలుసుకుంటూ, పెంచుకుంటూ వచ్చాను. ఎప్పుడైనా, దేనిలోనైనా ప్రతిభ చూపాలనుకుంటే మా పేరెంట్స్ నాకు పూర్తి మద్దతు ఇస్తారు. అలా చదువుతోపాటు మెకానిక్ పరిజ్ఞానం కూడా అబ్బింది. సాధనతోనే చేరువైన కల ప్రతి కార్తోనూ ఎగ్జిబిషన్స్ లేదా రేసుల్లో పాల్గొనేదాన్ని. దీంతో నా కలను మరింత ముందుకు తీసుకెళ్లగలిగాను. నా ఇన్నేళ్ల జీవితంలో కార్లనే అపరిమితంగా ఇష్టపడ్డాను. రేసింగ్, డ్రిఫ్టింగ్లో తగినంత అనుభవం ఉంది. జూన్, 2018లో అరబ్ కంట్రీలో మహిళల డ్రైవింగ్పై నిషేధం ఎత్తివేయడంతో రేస్, డ్రైవర్, మెకానిక్ ల వంటి పాత్రలు మహిళలకు అవకాశాలు దక్కేలా చేశాయి. మెకానిక్ను కావాలనే నా లక్ష్య సాధనకు ఇది కూడా ఉపయోగపడింది. ఇప్పుడు వీధిలోంచి వెళ్తే చాలు... చుట్టూ ఉన్నవారు నా గురించి తెలుసుకోవడం, గుర్తుపట్టి పలకరించడం, ప్రోత్సహించడం, నా నుంచి నేర్చుకోవాలని ఆసక్తి చూపుతుండటం నాకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. కష్టమైన ఛాలెంజ్ ఈ ఏడాది జరిగిన ఇ–ప్రిక్స్లో ఫైర్, రికవరీ, ఫాగ్, ట్రాక్సైడ్ వంటి నాలుగు రకాల మార్షల్స్ ఉన్నాయి. వీటిలో నా సామర్థ్యాలను చూసి అధికారులు రికవరీ మార్షల్ బృందానికి రిఫర్ చేశారు. రేసు జరిగేటప్పుడు ట్రాక్పై ప్రమాదం జరిగితే వెనువెంటనే వారు తగిన చర్యలు తీసుకుంటారు. ఇన్నాళ్లూ రికవరీ మార్షల్గా ఉండటం మహిళలకు కష్టమైన పనిగా పరిగణించ బడింది. సర్క్యూట్లో ప్రమాదం జరిగినప్పుడు వీలైనంత త్వరగా కార్లను తీయడానికి క్రేన్ డ్రైవర్గా పనిచేస్తున్నాను. నా పని ఎంత వేగంగా చేయాలంటే రేసు ప్రవాహానికి అడ్డుపడనంత స్పీడ్గా ఉండాలి. ఏదైనా కారు రోడ్ బ్లాక్కు కారణమయితే, ఇతర రేసర్లకు అడ్డు అవుతుంది. అందుకే, ఈ వృత్తిలో ఏమాత్రం అలక్ష్యం చేయకుండా ప్రతి క్షణం అలర్ట్గా ఉండాలి’ అని తన పని గురించి వివరిస్తుంది అల్–బజ్. ఈ యువ డ్రైవర్ నేర్చుకున్నది మెకానిక్ పని. చదువు మాత్రం పూర్తి భిన్నమైది. లెబనాన్లో సైకాలజీ అండ్ మీడియాకు సంబంధించిన కోర్సులు పూర్తి చేసింది. కానీ, మోటార్ కార్ల ప్రపంచంలో తనని తాను నిరూపించుకోవడానికి ముందుంటుంది. తన మెకానిక్ నైపుణ్యాలతో ఇతరులకు శిక్షణ కూడా ఇస్తోంది. సొంతంగా ఆటోమొబైల్ రిపేర్ షాప్ను నిర్వహించాలనుకుంటున్న అల్–బజ్ డేరింగ్ డ్రైవర్గా మన్ననలు అందుకుంటోంది. -
కర్నూలులో వింత ఆచారం: భేష్.. గార్ధభాల రేస్
కోవెలకుంట్ల: మనలో చాలామందికి గుర్రాల పరుగు పందేలు తెలుసు. వృషభాల బండలాగుడు పోటీలు కూడా చూసే ఉంటారు. ఈ కోవలోనే గాడిదల (గార్ధభాలు)కూ పరుగు పందేలు ఇటీవల కాలంలో నిర్వహిస్తున్నారు. తరతరాల నుంచి ప్రజలు గాడిదలను బరువులు మోసేందుకు మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. రవాణా సౌకర్యాలు లేని రోజుల్లో కొండప్రాంతాల నుంచి ధాన్యం, అటవీ సంపదను గార్ధభాలపై వేసుకుని ఒకచోట నుంచి మరో చోటకు తరలించేవారు. జంతు బలప్రదర్శన పోటీలపై ఆసక్తి ఉన్న కొందరు వ్యక్తులు ఇటీవల గార్ధభాలను పెంచి పోషిస్తున్నారు. జిల్లాలోని కోవెలకుంట్ల, చాగలమర్రి, ఆళ్లగడ్డ, రుద్రవరం, బనగానపల్లె, అవుకు, కోడుమూరు, ఆదోని, పత్తికొండ, కల్లూరు, వెలుగోడు, తదితర మండలాల్లో గార్ధభాలను ప్రత్యేకంగా పెంచుతున్నారు. బలవర్ధక ఆహారం పోటీలకు పెంచే గార్ధభాలకు బలవర్ధక ఆహారం అందజేస్తున్నారు. కేవలం దాణారూపంలో పెసలు, ఉలవలు, వడ్లగింజలు, కొర్రలు, కొర్ర పిండి, బెల్లం, తదితర పప్పుదినుసులతోపాటు వివిధ పండుగల సందర్భంగా కజ్జికాయలు కూడా ఆహారంగా అందజేస్తున్నారు. పశుగ్రాసంతో పాటు ఉదయం, సాయంత్రం వేళల్లో రోజుకు 750 గ్రాముల దాణాను ఆహారంగా ఇస్తున్నారు. పోటీలకు నిర్ణీత సమయం పరుగుపందెం పోటీల్లో ఇసుక సంచుల బరువుతో గార్ధభాలు నిర్ణీత పది నిమిషాలు సమయంలో నిర్దేశించిన దూరం పరుగెత్తాలి. సంజామల మండలం ఆల్వకొండ క్రాస్ సమీపంలో కాశినాయన ఆరాధనోత్సవాల సందర్భంగా ఇటీవల నిర్వహించిన పోటీల్లో ఆళ్లగడ్డ మండలం బాచేపల్లి గ్రామానికి చెందిన యోహాన్ గార్ధభం నిర్ణీత సమయంలో 11వేల అడుగుల దూరం పరుగెత్తి విజేతగా నిలిచి రూ.20 వేలు బహుమతి కైవసం చేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన నాగవైష్ణవి గార్ధభం 10,700 అడుగులు, చాగలమర్రి మండలం పెద్ద వంగలికి చెందిన పాములేటి గార్ధభం 10,500 అడుగుల దూరం పరుగెత్తి తర్వాతి రెండు, మూడుస్థానాల్లో రూ.10వేలు, రూ.8 వేలు గెలుపొందాయి. పండుగలు, తిరుణాళ్లలో పోటీలు ఏటా ఉగాది, శ్రీరామ నవమి, సంక్రాంతి పండుగలతోపాటు కాశినాయన ఆరాధోత్సవాలు, పాండురంగస్వామి బ్రహ్మోత్సవాలు, గ్యార్మీ, అమ్మవారి జాతరల సందర్భంగా కర్నూలు, నంద్యాల, చాగలమర్రి, ఆల్వకొండ, కోవెలకుంట్ల తదితర ప్రాంతాల్లో ఎక్కువగా గార్ధభాల పరుగు పందెం పోటీలను నిర్వహిస్తున్నారు. నిర్వాహకుల నుంచి పోటీల సమాచారం తెలుసుకుని ఆయా ప్రాంతాల్లో గార్ధభాలను పెంచే వారు పందేలకు కొన్ని రోజుల ముందు మరోసారి శిక్షణ ఇచ్చి పోటీల్లో పాల్గొంటున్నారు. రూ.లక్ష వరకు ధర పరుగు పందెం పోటీలకు ఉపయోగించే గార్ధభాల ధర మార్కెట్లో సైజును బట్టి రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు పలుకుతోంది. వివిధ సైజుల్లోని గార్ధభాలను కొనుగోలు చేసిన వారు వాటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి పోటీలకు సిద్ధం చేస్తున్నారు. పోటీల్లో పాల్గొనే గార్ధభాలకు ఆయాసం రాకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో పరిగెత్తించడం, పోటీలకు తగ్గట్టు ఇసుకను సంచుల్లో నింపి పరుగుపందెం ప్రాక్టీస్ చేయిస్తారు. వాటిపై ఇసుక సంచులు తాళ్లతో కట్టి పోటీలకు దింపుతారు. పోటీలలో గార్ధభం దాదాపు 200 కిలోల బరువుతో పరిగెత్తాల్సి ఉంటుంది. రూ.42 వేలతో కొన్నా వైఎస్సార్ జిల్లా జంగాలపల్లెలో నెల రోజుల క్రితం రూ.42 వేలు వెచ్చించి గార్ధభాన్ని కొన్నాను. ఆ జిల్లాలో పది పర్యాయాలు పరుగు పందెం పోటీల్లో పాల్గొని అది బహుమతులు కైవసం చేసుకుంది. ఆ గార్ధభాన్ని కొనుగోలు చేశాక ఇటీవల ఒంగోలు, ఆల్వకొండ ప్రాంతాల్లో జరిగిన పోటీలకు తీసుకెళ్లాను. – సుధాకర్, కోవెలకుంట్ల చాకిరేవు వృత్తితోపాటు పోటీలకు చాకిరేవు వృత్తితోపాటు గార్ధభం పోటీలపై ఆసక్తి ఉండటంతో ఏడాది క్రితం కర్నాటక రాష్ట్రంలో రూ.50 వేలు వెచ్చించి గార్ధభాన్ని కొనుగోలు చేశాను. ప్రతి రోజు జొన్నలు, వడ్లు కలిపి ఆహారంగా పెడుతున్నాను. ఇప్పటి వరకు నంద్యాల, అయ్యలూరు, చిన్నవంగలి, ఆల్వకొండలో జరిగిన పోటీల్లో పాల్గొన్నాను. – సుబ్బరాయుడు, ముక్కమల్ల, సంజామల మండలం -
వెన్నులో వణుకుపుట్టించిన దృశ్యం.. గాల్లో కార్ల రేసింగ్
ఫార్ములా వన్ రేసింగ్... కార్లు జెట్స్పీడ్లో ట్రాక్మీద దూసుకుపోతుంటే... ఊపిరి బిగబట్టి చూడటం ప్రేక్షకుల వంతవుతుంది. ఇక అవే కార్లు గాల్లో ఎగిరిపోతుంటే ఉండే థ్రిల్ అంతా ఇంతా కాదు. వినడానికే వెన్నులో వణుకు పుట్టిస్తోన్న ఈ ఎగిరేకార్ల రేసింగ్ గురువారం నాడు ఆస్ట్రేలియాలో జరిగింది. దీపావళి పండుగరోజు మన దగ్గర రాకెట్ పటాకులు ఆకాశంలో కాంతులీనితే... ఆస్ట్రేలియాలో మాత్రం రెండు కార్లు గాల్లో దూసుకుపోయాయి. ఎయిర్స్పీడర్ సంస్థ ఎక్సా సిరీస్ పేరుతో నిర్వహించిన ఫ్లయింగ్ కార్స్ రేస్లో అలౌడా ఎరోనాటిక్స్ కంపెనీ తయారు చేసిన ఎమ్కె3 (ఎలక్ట్రికల్ వర్టికల్ టేకాఫ్ అండ్ల్యాండింగ్) కార్లు పాల్గొని విజయవంతంగా రేస్ పూర్తి చేశాయి. రన్వే అవసరమే లేదు... ఈ కార్లను నిపుణులైన ఆపరేటర్స్ రిమోట్ సా యంతో (డ్రోన్ల మాదిరిగా) కంట్రోల్ చేశారు. ఈ ఎమ్కె3 ఎగిరే కార్లు టేకాఫ్ అయిన 2.3 సెకన్లలోనే గంటకు వంద కి.మీ. వేగాన్ని అందుకోగలవు. సాధారణంగా విమానం, హెలికాప్టర్ టేకాఫ్ అవ్వడానికి రన్వే అవసరం. కానీ.. ఈ కార్లలో ఉన్న వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ కోసం థర్డ్ డైమెన్షన్ను యాడ్ చేశారు. దీంతో ఉన్న చోటనుంచే గాల్లోకి ఎగరగలదు కారు. 2022 నాటికి పైలట్ నడిపేట్టుగా... దాదాపు వంద కేజీల బరువున్న ఈ కార్లను కార్బన్ ఫైబర్తో తయారు చేశారు. పైలట్ నడపాలంటే మాత్రం ఎమ్కె 4 తయారు చేయాలంటోంది కంపెనీ. 2022 కల్లా సాధ్యం చేసి చూపిస్తామని చెబుతోంది. క్షణాల్లో బ్యాటరీ రిప్లేస్మెంట్... సాధారణంగా ఫార్ములావన్ రేసింగ్లో ఫ్లాట్ టైర్ అయితే క్షణాల్లో మార్చే అవకాశం ఉంటుంది. ఫ్లయింగ్ కార్లలోనూ బ్యాటరీ రిప్లేస్మెంట్ వేగంగా చేయడం కోసం స్లైడ్ అండ్ లాక్ సిస్టమ్ రూపొందించారు. కారు గాల్లో ఉన్నప్పుడు రోటర్ లేదా బ్యాటరీ సిస్టమ్ ఫెయిల్ అయినా సురక్షితంగా ల్యాండయ్యేలా రూపొందించారు. సో పైలట్ సేఫ్. 2050 నాటికి లక్షల కోట్ల ఇండస్ట్రీ... జాబీ, అలౌడా, జెట్సన్, మేజర్ వంటి ఎయిర్క్రాఫ్ట్ కంపెనీలన్నీ ఎలక్ట్రికల్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ వాహనాల మీద పనిచేస్తున్నాయి. ఈ ‘ఎలక్ట్రికల్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ ఇండస్ట్రీ’ 2050 సంవత్సరం నాటికి లక్షన్నర కోట్ల పరిశ్రమగా అవతరిస్తుందని మోర్గన్ స్టాన్లీ అంచనా. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
గ్రామ సింహాలు.. పరుగో పరుగు
గట్టు (గద్వాల): మండలంలోని పెంచికలపాడులో చౌడేశ్వరిదేవి జాత రను పురస్కరించుకొని సోమవారం గ్రామ సింహాల పరుగు పందెం పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 12 గ్రామ సింహాలు పోటీల్లో పాల్గొన్నాయి. ఈ క్రమంలో కర్ణాటకలోని అక్షాలకు చెందిన రాణి అనే గ్రామ సింహం మొదటి బహుమతి దక్కించుకోగా.. దాత ఆశప్ప రూ.10,016ను అందజేశారు. అలాగే ఏపీలోని గుడికల్కు చెందిన లక్కీ అనే గ్రామ సింహం ద్వితీయ స్థానంలో నిలవగా దాత నర్సింహులు రూ.5,016, ఆత్మకూరుకు చెందిన యువరాజు అనే గ్రామ సింహం తృతీయ స్థానంలో నిలవగా దాత శివప్ప రూ.3,016లను అందజేశారు. కార్యక్రమంలో న్యాయవాది శ్రీదర్శన్రెడ్డి, ఉపసర్పంచ్ ఆంజనేయులు, రాఘవేంద్ర, హలీంపాష, తిమ్మప్ప, సలీం, మహాదేవప్ప, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
సౌదీ అరేబియాలో ఎఫ్1 రేస్
దుబాయ్: ఫార్ములా వన్ (ఎఫ్1) రేసు క్యాలెండర్లో సౌదీ అరేబియా అరంగేట్రం చేయనుంది. వచ్చే ఏడాది జరిగే ఎఫ్1 సీజన్లో సౌదీలోని జిద్దా నగరాన్ని చేరుస్తూ ఎఫ్1 నిర్వాహకులు గురువారం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సౌదీ ఆటోమొబైల్, మోటార్ సైకిల్ సమాఖ్య (ఎస్ఏఎమ్ఎఫ్)తో ఒప్పందం కుదిరినట్లు వారు పేర్కొన్నారు. కొత్తగా నిర్మించిన జిద్దా నగర శివార్లలోని ‘కార్నిక్’ వద్ద వద్ద స్ట్రీట్ ట్రాక్పై 2021 నవంబర్లో ఈ రేసును నిర్వహిస్తున్నట్లు ఎఫ్1 తెలిపింది. ఎర్ర సముద్రానికి సమాంతరంగా ఉండే ఈ ట్రాక్ చూపరులకు కనువిందు చేస్తుందని వెల్లడించింది. ‘ఎఫ్1 సీజన్లోకి సౌదీ అరేబియాను ఆహ్వానిస్తున్నాం’ అని ఎఫ్1 సీఈవో చేస్ క్యారీ వ్యాఖ్యానించారు. గల్ఫ్ దేశాల్లో బహ్రెయిన్, అబుదాబిలు ఇప్పటికే ఎఫ్1 సీజన్ల్లో ఏటా రేస్లకు ఆతిథ్యమిస్తూ వస్తున్నాయి. సౌదీ రాజధాని రియాద్లో 2030 నాటికి ఫార్ములా వన్ రేసును నిర్వహించేలా... ట్రాక్ను కూడా నిర్మిస్తున్నారు. 2021 ఎఫ్1 సీజన్ క్యాలెండర్ పూర్తయిందని... త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటిస్తామని క్యారీ తెలిపారు. సౌదీ దేశంలో ఉండే తీవ్ర ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని ఈ రేస్ను రాత్రి వేళ నిర్వహించే ప్రతిపాదన కూడా ఉంది. -
మరోసారి చిక్కుల్లో విప్రో
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రో మరోసారి చిక్కుల్లో పడింది. తమపై జాతి వివక్ష చూపిస్తోందని ఆరోపిస్తూ అయిదుగురు మాజీ ఉద్యోగులు సంస్థపై దావా వేశారు. 2020 మార్చి 30 న న్యూజెర్సీ జిల్లా కోర్టులో వీరు తాజా క్లాస్ యాక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. దక్షిణ ఆసియన్లు, భారతీయులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని, విప్రో అనుసరిస్తున్న ఈ వివక్ష కారణంగా తాము ఉద్యోగాలు కోల్పోయామని వాదించారు. అమెరికాలో ఉన్న దక్షిణ ఆసియన్లు, భారతీయులు కానివారికి అప్రైజల్ స్కోర్క్ ఇవ్వడంలేదని, అలాగే వివిధ ప్రాజెక్టులకు కేటాయించిన వీరిలో అధిక సంఖ్యలో ఉద్వాసనకు గురవుతున్నారని ఆరోపించారు. దక్షిణ ఆసియన్లు, భారతీయులం కాదనే నెపంతో సంస్థ తమపై 'జాతి వివక్ష' చూపిస్తోందని అమెరికాలోని ఐదుగురు మాజీ ఉద్యోగులు ఆరోపించారు. ఉద్యోగులపై పదోన్నతులు, జీతం పెంపు, తొలగింపు నిర్ణయాలకు సంబంధించి తేడాలు చూపిస్తోందన్నారు. దీని ఫలితంగా తాము ఉద్యోగాల్ని కోల్పోయామని పేర్కొన్నారు. నియామకం, పదోన్నతి ఇతర నిర్ణయాల్లో వివక్షత లేని పద్ధతిని అవలంబించాలనే ఆదేశాలతో పాటు, ఫెడరల్ రూల్స్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ ప్రకారం , చట్టవిరుద్ధమైన విధానాలలో పాల్గొనకుండా శాశ్వత నిషేధానికి అనుగుణంగా దావాను 'క్లాస్ యాక్షన్' గా వర్గీకరించాలని కోర్టును కోరారు. గత పదేళ్లుగా విప్రోలో పని చేసిన ఐదుగురు మాజీ ఉద్యోగులు నలుగురు కాకేసియన్ మూలానికి , మరొకరు హిస్పానిక్ మూలానికి చెందినవారుగా భావిస్తున్నారు. మరోవైపు ఈ పరిణామంపై వ్యాఖ్యానించేందుకు విప్రో తిరస్కరించింది. కాగా గత సంవత్సరం డిసెంబరులో ఆఫ్రికాకు చెందిన అమెరికా ఉద్యోగి ఇలాంటి దావావేయడంతో, పరిహారం ఇప్పించాల్సిందిగా కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. (ప్రతీరోజు 20 లక్షల మందికి ఆహారం : విప్రో) చదవండి : జియో మార్ట్ వాట్సాప్ నంబరు ఇదే! -
హిమ దాస్కు రెండో స్వర్ణం
న్యూఢిల్లీ: భారత స్టార్ అథ్లెట్ హిమ దాస్ వారం వ్యవధిలో అంతర్జాతీయ టోర్నమెంట్లో రెండో స్వర్ణ పతకాన్ని సాధించింది. పోలాండ్లో జరిగిన కుట్నో అథ్లెటిక్స్ మీట్లో హిమ దాస్ మహిళల 200 మీటర్ల విభాగంలో పసిడి పతకాన్ని దక్కించుకుంది. హిమ 23.97 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచింది. భారత్కే చెందిన విస్మయ 24.06 సెకన్లలో రేసును ముగించి రజత పతకం దక్కించుకుంది. గత మంగళవారం పొజ్నాన్ అథ్లెటిక్స్ గ్రాండ్ప్రి మీట్లోనూ హిమ 200 మీటర్ల విభాగంలో స్వర్ణం సాధించింది. -
అభిలాష్ను కాపాడారు
న్యూఢిల్లీ: గోల్డెన్ గ్లోబ్ రేస్లో భాగంగా ఒంటరిగా ప్రపంచ యానం చేస్తూ హిందూమహా సముద్రంలో ప్రమాదానికి గురైన కేరళకు చెందిన నేవీ కమాండర్ అభిలాష్ టామీ(39)ను విజయవంతంగా రక్షించారు. ఆస్ట్రేలియాలోని పెర్త్కు 1,900 నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదంలో చిక్కుకున్న ఆయన్ను రక్షించేందుకు భారత్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. సోమవారం అభిలాష్ పడవ ‘తురయా’ వద్దకు చేరుకున్న ఫ్రెంచి మత్స్యకార పడవ ‘ఒసిరిస్’ సిబ్బంది ఆయన్ను రక్షించింది. ఈ విషయం తెలిసి తాము టెన్షన్ నుంచి బయటపడ్డామని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ‘ఆయన ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు. ఒసిరిస్లో దగ్గర్లోని ఇల్ ఆమ్స్టర్డాం దీవికి, అక్కడి నుంచి ‘ఐఎన్ఎస్ సాత్పురా’లో మారిషస్ తీసుకువచ్చి, అవసరమైన వైద్య చికిత్సలు చేయిస్తాం’ అని మంత్రి ట్విటర్లో పేర్కొన్నారు. -
నావికా దళాధికారి ఆచూకీ లభ్యం
పారిస్/కోచి: తీవ్రంగా గాయపడి హిందూమహా సముద్రంలో గల్లంతైన భారతీయ అధికారి ఆచూకీ దొరికిందని ఫ్రాన్స్కు చెందిన గోల్డెన్గ్లోబ్ రేస్ సంస్థ ప్రకటించింది. భారత నావికాదళ కమాండర్ అభిలాష్ టామీ(39) తురయా అనే తన పడవలో ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టి వచ్చే ‘గోల్డెన్ గ్లోబ్ రేస్’లో భారత్ నుంచి పాల్గొన్న ఏకైక నావికుడు. ఫ్రాన్స్ తీరం నుంచి జూలై 1వ తేదీన 18 మంది పోటీదారులతో ప్రారంభమైన ఈ రేసులో ఇప్పటివరకు 10,500 నాటికల్ మైళ్లు ప్రయాణించారు. ప్రస్తుతం మూడోస్థానంలో ఉన్న అభిలాష్ హిందూమహా సముద్రంలో ఆస్ట్రేలియాలోని పెర్త్కు 1,900 నాటికల్ మైళ్ల దూరంలో ఉండగా తీవ్ర తుపానులో చిక్కుకున్నారు. అలల తాకిడికి ఆయన పడవ తీవ్రంగా దెబ్బతింది. తీవ్రంగా గాయపడి, నిస్సహాయ స్థితిలో ఉన్న అభిలాష్ శనివారం రేస్ నిర్వాహకులకు మెసేజ్ పంపారు. రక్షణ చర్యల్లో పాల్గొనేందుకు నావికాదళానికి చెందిన ఆధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ సాత్పురాను ఆ ప్రాంతానికి పంపించినట్లు భారత నావికా దళం తెలిపింది. -
రేకుల షెడ్డూ ఎక్కిన వందల మంది.. ఒక్కసారిగా...
-
కుప్పకూలిన భారీ షెడ్డు.. తొక్కిసలాట
జైపూర్: రాజస్థాన్లో ఆదివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ గంగానగర్ జిల్లా పదంపూర్ పట్టణం అజాజ్ మండిలో ట్రాక్టర్ల రేసు నిర్వహించారు. ప్రతీ ఏటా నిర్వహించే రేసును తిలకించేందుకు ఈసారి భారీ సంఖ్యలో(సుమారు 5 వేల మంది అని అంచనా) జనం హాజరయ్యారు. అత్యుత్సాహంతో వందల మంది అక్కడే ఉన్న ఓ షెడ్డూపై ఎక్కి వీక్షిస్తున్నారు. అదే సమయంలో బరువుకు తాళలేక ఆ షెడ్డూ కుప్పకూలిపోయింది. ఆ వెంటనే తొక్కిసలాట చోటు చేసుకోగా.. పరిస్థితి అదుపులోకి రావటానికి రెండు గంటలకు పైగానే పట్టింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లు సమాచారం. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. -
రెచ్చిపోయిన ఆటోడ్రైవర్లు..
-
రెచ్చిపోయిన ఆటోడ్రైవర్లు.. పోలీసుల ఛేజింగ్
ఆటోడ్రైవర్ల చేష్టలతో వాహనదారులు వణికిపోయారు. హైవేపై రేసులతో రెచ్చిపోయారు. దీంతో వాహనదారులు భయాందోళనలకు గురికాగా, సమాచారం అందుకున్న పోలీసులు వారిని వెంటాడి మరీ అరెస్ట్ చేశారు. తమిళనాడులోని చెన్నై హైవేలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాక్షి, చెన్నై: నగరంలో ఆటోడ్రైవర్లు చెలరేగిపోయారు. చెన్నై హైవే ఔటర్ రింగ్ రోడ్పై రేసులు నిర్వహించి అడ్డంగా బుక్కయ్యారు. బైక్పై వెళ్తున్న కొందరు వారిని రెచ్చగొట్టంతో వారు మరింత వేగంతో దూసుకెళ్లటంతో వాహనదారులు భీతిల్లిపోయారు. అది గమనించిన పోలీసులు వారిని వెంటాడి మరీ పట్టుకున్నారు. సుమారు ఆరగంటకు పైగానే ఛేజింగ్ కొనసాగింది. మొత్తం ఆరు ఆటోలను, ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు చేపట్టారు. ఇల్లీగల్ రేసులు, ట్రాఫిక్ ఉల్లంఘనతోపాటు వాహనదారులకు భయాందోళనలు గురి చేసినందుకు వారిపై కేసులు నమోదు చేశారు. కాగా, గతంలోనూ తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని అధికారి ఒకరు వెల్లడించారు. -
మూవీ మ్యాటర్స్ - రేస్13
-
పదోన్నతి ‘పరుగు’లో కుప్పకూలాడు
జైపూర్, రాజస్ధాన్ : పదోన్నతి కోసం నిర్వహించిన పరుగు పందెం కాస్తా ఆ కానిస్టేబుల్ పాలిట శాపమైంది. పదోన్నతి గురించి కలలు కంటూ పరుగు పందెంలో పాల్గొన్న వ్యక్తి గమ్యం చేరకుండానే అసువులు బాసాడు. విషాదాంతకరమైన ఈ సంఘటన జైపూర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జైపూర్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సుశీల్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్సై) గా పదోన్నతి కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో జైపూర్ పోలీసు శాఖ శుక్రవారం అమీర్ రోడ్డులోని జల్మహల్లో పదోన్నతి కోసం నిర్వహించిన పరుగు పందెంలో సుశీల్ పాల్గొన్నాడు. అయితే మార్గ మధ్యలో ఉన్నట్టుండి, ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన పోలీసులు వెంటనే సుశీల్ను సమీప ఎస్ఎమ్ఎస్ ఆస్పత్రికి తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే సుశీల్ మృతి చెందినట్లు నిర్ధారించారని తెలిపారు. -
దిగ్గజ నటుడి తప్పిదం
సాక్షి, సినిమా : సోషల్ మీడియాలో చేసే పోస్ట్లు ఆచీ తూచీ చేయకపోతే.. ట్రోలింగ్ చేసేందుకు జనాలు సిద్ధంగా ఉంటారు. సరిగ్గా హాలీవుడ్ దిగ్గజం సిల్వెస్టర్ స్టాలోన్(71)కు అలాంటి పరిస్థితే ఎదురైంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన రేస్-3 చిత్రానికి సంబంధించి ఈ మధ్య వరుసగా లుక్కులతో పోస్టర్లను వదులుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టాలోన్ తన ఇన్స్టాగ్రామ్లో చిత్ర యూనిట్కు ఆల్ ది బెస్ట్ చెప్పే యత్నం చేశారు. ఈ క్రమంలో చిత్రంలో మరో పాత్రధారి బాబీ డియోల్ ఫోటోను షేర్ చేసి టాలెంటెడ్ హీరో సల్మాన్కు ఖాన్కు బెస్ట్ విషెస్ అంటూ సందేశం ఉంచాడు. అంతే ఇక ట్రోలింగ్ బాబులు వాళ్ల పనితనం చూపిస్తూ ఈ సీనియర్ హీరోను ఎగతాళి చేస్తున్నారు. చిత్రానికి ప్రమోషన్ చేస్తే చేశారుగానీ.. ఇలా కనీస పరిజ్ఞానం లేకుండా పోస్ట్ ఎలా చేస్తారంటూ ఏకీపడేస్తున్నారు. కోట్లాది అభిమానులు ఉన్న సల్మాన్ ఎవరో స్టాల్లోన్కు తెలీదా? అంటూ కొందరు.. కనీసం సల్మాన్ పోస్ట్ చేసిన ఫోటో చూసైనా స్టాల్లోన్ ఫోటో పెట్టి ఉంటే బాగుండేది కదా అంటూ మరికొందరు సలహాలిస్తున్నారు. ఏదిఏమైనా స్టాలోన్ ఇప్పటిదాకా ఆ పోస్ట్ను మాత్రం డిలీట్ చేయలేదు. The very best wishes to very talented film hero SALMAN KHAN For his next film RACE 3 !@beingsalmankhan A post shared by Sly Stallone (@officialslystallone) on Mar 21, 2018 at 1:25pm PDT -
న్యూ టాలెంట్
సల్మాన్ ఖాన్లోని నటుడు మనందరికీ ఎప్పటినుంచో పరిచయమే. ఆ తర్వాత పెయింటర్గా, సింగర్గా మారి ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు తనలో దాగున్న మరో కొత్త టాలెంట్ను బయటకు తీశారు సల్మాన్. తాజా చిత్రం ‘రేస్ 3’ కోసం ఆయన పాటల రచయితగా మారారు. ఈ సినిమాలో హీరో,హీరోయిన్ మధ్యలో వచ్చేఓ రొమాంటిక్ సాంగ్ను ఒక ప్రముఖ రచయితతో రాయించాలని చిత్రబృందం చూస్తుంటే ‘నేను రాసుకున్న పాట ఒకటి ఉంది’ అని, తను రాసుకున్న పాటను చదివి వినిపించారట సల్మాన్. టీమ్ అందరికీ ఆ పాట బాగా నచ్చిందట. వెంటనే ఆ పాటకు మ్యూజిక్ కంపోజ్ చేసే పనిలో పడ్డారట సంగీత దర్శకుడు విశాల్ మిశ్రా. ఈ రొమాంటిక్ సాంగ్ను సల్మాన్, జాక్వెలిన్పై నృత్యదర్శకుడు రెమో డిసౌజా చిత్రీకరించనున్నారట. ఈ చిత్రాన్ని ఈ ఏడాది రంజాన్కి విడుదల చేయాలనుకుంటున్నారు. సో.. సల్మాన ్ ఖాన్లోని ఈ న్యూ టాలెంట్ను మనం రంజాన్కు వినొచ్చన్నమాట. ఆ సంగతలా ఉంచితే.. సల్మాన్ లవర్స్ లిస్ట్ చాలానే ఉంది. సంగీతా బిజలానీ, ఐశ్వర్యా రాయ్, కత్రినా కైఫ్, లూలియా వంటూర్.. ఇంకా కొంతమంది ఉన్నారు. మరి.. వీళ్లల్లో ఎవరి కోసం సల్మాన్ ఆ రొమాంటిక్ సాంగ్ రాశారో? -
సల్మాన్ రేస్ 3 మోషన్ పోస్టర్ విడుదల
సాక్షి, న్యూఢిల్లీ : సల్మాన్ ఖాన్ నెక్ట్స్ మూవీ రేస్ 3 మోషన్ పోస్టర్ను బాలీవుడ్ కండలవీరుడు గురువారం విడుదల చేశారు. రెమో డిసౌజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రేస్ 3 ఈ ఏడాది జూన్లో ప్రేక్షకుల ముందుకొస్తుందని ఈ సందర్భంగా సల్మాన్ వెల్లడించారు. రేస్ 3 లీడ్ రోల్లో సల్మాన్ ఖాన్ సందడి చేయనుండగా, జాక్వలిన్ ఫెర్నాండెజ్, డైసీ షా తమ అందాలతో కనువిందు చేయనున్నారు. ఇంకా అనిల్ కపూర్, సాఖిబ్ సలీంలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గతంలో రేస్, రేస్ 2 మూవీల్లో సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటించారు. ఇక రేస్ 3 మూవీ టిప్స్ ఫిల్మ్స్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకుంటోంది. రేస్ సీక్వెల్లో సైఫ్ అలీ ఖాన్ స్ధానంలో సల్మాన్ ఖాన్ ఎంతవరకూ మెప్పించగలరన్నది ఆసక్తికరంగా మారింది. ఈ మూవీలో సోనాక్షి సిన్హా కూడా కొద్దిసేపు మెరవనున్నట్టు తెలిసింది. యాక్షన్, డ్రామా, రొమాన్స్, గ్లామర్ కలగలిపి రేస్ 3 ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. -
ఫైట్ కోసం డైట్
సీరియస్ యాక్షన్కు సిద్ధం అయ్యారు జాక్వెలిన్. సల్మాన్ ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ జంటగా రెమో డిసౌజా తెరకెక్కిస్తున్న చిత్రం ‘రేస్ 3’. ‘రేస్’ సిరీస్లో ఇది థర్డ్ ఇన్స్టాల్మెంట్. లాస్ట్ రెండు సినిమాల కంటే ఈ సినిమాలో యాక్షన్ మోతాదు కొంచెం ఎక్కువగా ఉంటుందట. ఒక హై ఓల్టేజ్ యాక్షన్ షెడ్యూల్ని బ్యాంకాక్లో, ఆ తర్వాత అబుదబీలో షూట్ చేయనున్నారట. ఈ సినిమా యాక్షన్ సీన్స్ గురించి దర్శకుడు మాట్లాడుతూ – ‘‘ కేవలం స్టంట్స్ మాత్రమే కాదు, జాక్వెలిన్ ఈ సినిమాలో డైరెక్ట్గా విలన్స్తో తలపడనున్నారు. దానికి కోసం మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకుంటున్నారు’’ అని అన్నారు. జాక్వెలిన్ ఎప్పుడూ ఫిట్గానే ఉంటారు. కానీ ఈ సినిమాలో ఉన్న యాక్షన్ సన్నివేశాలను ఇంకా కాన్ఫిడెంట్గా, పర్ఫెక్షన్తో కంప్లీట్ చేయటం కోసం కొన్ని రోజుల పాటు స్ట్రిక్ట్ డైట్లో ఉంటారట. కొన్ని రోజుల పాటు మార్నింగ్ సాలిడ్ ఫుడ్స్కు ఫుల్స్టాప్ పెట్టి ఓన్లీ ఫ్లూయిడ్స్ మీదే ఉంటారట. లంచ్కి ఎగ్స్, స్పినాచ్ (పాల కూర)ని ఎక్కువగా తీసుకుంటున్నారట. ఈవినింగ్స్ ఓన్లీ మిల్క్ షేక్స్. సో ఈ నెల మొత్తం జాక్వెలిన్ ఫైట్ కోసం డైట్లో ఉండబోతున్నారన్న మాట. తన పాత్ర కోసం ఇంత కష్టపడుతున్నారంటే వర్క్ మీద ఎంత డెడికేషనో ఊహించవచ్చు. -
నాకు అమ్మాయి దొరికింది : సల్మాన్
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఓ ఆసక్తికర మైన ట్వీట్ తో అభిమానులకు షాక్ ఇచ్చాడు. 50 ఏళ్లుదాటినా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్గా ఉన్న సల్మాన్.. తనకు అమ్మాయి దొరికిందంటూ ట్వీట్ చేశాడు. అయితే సల్మాన్ చేసిన ఈ ట్వీట్ తన పెళ్లికి సంబంధించినదేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొంత కాలంగా లులియా వాంటూర్ తో సన్నిహితంగా ఉంటున్న సల్మాన్ ఇటీవల ఆమెకు దూరమైనట్టుగా వార్తలు వినిపించాయి. లులియా కూడా సల్మాన్ తనకు మంచి స్నేహితుడు మాత్రమే అంటూ కామెంట్ చేయటంతో వారిద్దరు దూరమయ్యారని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. ఇప్పుడు సల్మాన్ ట్వీట్ తో మరోసారి సల్మాన్ పెళ్లి వార్త హాట్ టాపిక్గా మారింది. ఇటీవల టైగర్ జిందాహై సినిమాతో ఘనవిజయం సాదించిన సల్లూభాయ్ ప్రస్తుతం రేస్ 3 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. రెమో డిసౌజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో జాక్వలిన్ ఫెర్నాండెజ్, డైసీ షాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. Mujhe ladki mil gayi — Salman Khan (@BeingSalmanKhan) 6 February 2018 -
సల్మాన్ఖాన్కు బెదిరింపులు..!
-
చంపేస్తా.. భాయ్కు బెదిరింపులు
‘సల్మాన్ని చంపేస్తాను’ అంటూ రాజస్థాన్ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణొయి సంచలన వ్యాఖ్య చేశారు. కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అందులో భాగంగా జోద్పూర్ కోర్టులో హాజరయ్యారు. ఆ తర్వాతి రోజే రాజస్థానీ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణొయి మర్డర్ కేసులు, కార్ జాకింగ్, కిడ్నాప్ వంటి ఆరోపణల మీద కోర్టుకు హాజరయ్యారు. ఆ సమయంలో సల్మాన్ను చంపేస్తాం అంటూ సెన్సేషనల్ కామెంట్ చేశారు. ఇంతకీ సల్మాన్ మీద బిష్ణాయికి ఎందుకంత కోపం అంటే.. ఓ కారణం ఉంది. లారెన్స్ వాళ్లు రాజస్థానీ తెగలకు చెందిన వాళ్లు. ఈ కమ్యూనిటీ వాళ్లు కృష్ణ జింకను దైవంగా కొలుస్తారట. అందుకే సల్మాన్ని చంపేస్తామని బెదిరించారు. ఈ బెదిరింపులను తేలికగా తీసిపారేయడానికి లేదని ‘రేస్ 3’ బృందం అంటోంది. ప్రస్తుతం సల్మాన్ నటిస్తోన్న చిత్రం ఇది. ఈ షూటింగ్ స్పాట్ చుట్టూ కొంతమంది అనుమానాస్పదంగా కనిపించారట. ఈ విషయాన్ని ముంబై పోలీసులు గ్రహించారట. వెంటనే రంగంలోకి దిగి, ‘రేస్ 3’ సినిమా షూటింగ్ లొకేషన్కి వెళ్లి, సల్మాన్, చిత్రనిర్మాతలను కలిసి షూటింగ్ని నిలిపివేయాలని కోరారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య సల్మాన్ ఖాన్ని బాంద్రాలోని అతని ఇంటి దగ్గర దింపారు. సల్మాన్ కొన్ని రోజులు పాటు తన నివాసంలో ఉండటమే క్షేమమని భావించిన ముంబాయి పోలీస్లు.. కొన్ని రోజులు పాటు షూటింగ్స్ కూడా నిలిపివేయాలని కోరారు. ఎక్కడ ఉంటున్నాడనే విషయాన్ని ఎవరి దగ్గరా చెప్పొద్దనీ, సోషల్ మీడియా ద్వారా పంచుకోవద్దని కూడా కోరారు. సల్మాన్ ఖాన్ వీలున్నప్పుడల్లా ముంబై వీధుల్లో సైకిల్ మీద షికార్లు చేస్తుంటారు. కొన్ని రోజుల పాటు సైక్లింగ్ వద్దన్నారు. ‘‘సల్మాన్కు మాగ్జిమమ్ పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తున్నాం’’ అని ముంబై పోలీసులు పేర్కొన్నారు. -
సల్మాన్ ఖాన్పై దాడికి యత్నం
సల్మాన్ ఖాన్ కు గ్యాంగ్ స్టర్ లారెన్స్ విష్టోయ్ నుంచి బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసింది. ఇటీవల కృష్ణజింక కేసులో జోద్పూర్ కోర్టుకు హాజరైన సమయంలో ఈ సంఘటన జరిగింది. అయితే తాజాగా కొందరు వ్యక్తుల సల్మాన్ ఖాన్పై దాడికి యత్నించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సల్మాన్ రేస్ 3 షూటింగ్ లోబిజీగా ఉన్నారు. ఈ షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో చిత్రయూనిట్ అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడి చేరుకున్న పోలీసులు సల్మాన్ తో పాటు చిత్ర నిర్మాత రమేష్ తౌరానిని ఎస్కార్ట్ వాహనంలో ఇంటికి తరలించారు. ఇక మీద షూటింగ్ సమయంలో సల్మాన్ కు సెక్యూరిటీ మరింత పెంచే దిశగా ఏర్పాట్లు చేస్తున్నారట. సల్మాన్ సరసన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్గా నటిస్తున్న రేస్ 3 సినిమాలో అనీల్ కపూర్, డైసీ షా, బాబీ డియోల్ లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా ఈ చిత్రానికి దర్శకుడు. -
ఎక్స్ట్రా స్పెషల్
అది ముంబైలో ‘రేస్ 3’ సినిమా కోసం వేసిన సెట్. ఫస్ట్ డే షూట్లో పాల్గొనడానికి అనిల్ కపూర్ ఆ సెట్లోకి అడుగుపెట్టారు. అంతే.. ‘రేస్ 3’ చిత్రబృందం సెల్ఫోన్ కెమెరాల్లో ఆయన్ను బంధించారు. డేట్స్ ఇచ్చిన అన్ని రోజులూ అనిల్ కపూర్ ‘రేస్ 3’ లొకేషన్కి వెళతారు కదా.. ఇలా ఆయనతో ఫొటోలు దిగడానికి తొలి రోజే ఎందుకంత తొందరపడ్డారు అంటే.. రీజన్ ఉంది. సోమవారం ఆయన బర్త్డే. ఏడాదిలో ఒక్కసారే బర్త్డే వస్తుంది కదా. అందుకే అందరూ ఫొటోలు దిగారు. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే.. బర్త్డే సెలబ్రేషన్స్తో పాటు క్రిస్మస్ వేడుకలను కూడా ఒకేసారి సెట్లో సెలబ్రేట్ చేసింది ‘రేస్ 3’ చిత్రబృందం. అంటే డబుల్ సెలబ్రేషన్స్ అన్నమాట. రెమో డిసౌజా దర్శకత్వంలో అనిల్ కపూర్, సల్మాన్ఖాన్, బాబీ డియోల్, అర్జున్ కపూర్, పూజా హెగ్డే కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ను తెరకెక్కిస్తున్నారు. ‘‘షూటింగ్ లొకేషన్స్లో బర్త్డే పార్టీలు బోరింగ్గా ఉంటాయన్న మాటలు అవాస్తవం. నా బర్త్డేను ఎక్స్ట్రా స్పెషల్గా సెలబ్రేట్ చేసిన చిత్రబృందానికి ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు అనిల్ కపూర్. -
మంచి పోజ్ ఇవ్వు భాయ్
అని.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ను అడిగి మరీ, కెమెరా క్లిక్మనిపించారు వరుణ్ ధావన్. ఈ యంగ్ హీరో ఫొటోగ్రాఫర్గా మారారేమో అనుకుంటున్నారా? అదేం కాదు. సరదాగా సెల్ కెమెరాని క్లిక్మనిపించారు. సల్మాన్ నటిస్తోన్న ‘రేస్ 3’ షూటింగ్ జరుగుతున్న లొకేషన్ను సందర్శించారు వరుణ్. షూటింగ్ గ్యాప్లో ఇలా ఆట విడుపుగా ఫొటోలు తీసి, సందడి చేశారు. ‘మంచి పోజ్ ఇవ్వు భాయ్’ అని వరుణ్ ఫొటోలు క్లిక్మనిపించారు. ఈ ఫొటోని సల్మాన్ తన టిట్టర్ అకౌంట్లో షేర్ చేసుకున్నారు. ‘రేస్ 3’ మరియు బిగ్ బాస్ రియాలిటి షోలతో బిజీ బిజీగా గడుపుతున్నారు సల్మాన్. -
బాబీ గుర్రం
‘రేస్’ సిరీస్లో మూడో సినిమా వస్తోంది. హిట్ సినిమాల్లో సాధారణంగా 1, 2 3.. అని సీక్వెల్స్ వస్తూ ఉంటాయి. ఆ సీక్వెల్స్లో ఉన్న పాత్రలు మొదటిదానికంటే రెండోది, రెండోదానికి కంటే మూడోది.. రేసులో ముందుండాలని చేసే ప్రయత్నం ముచ్చటగా అనిపిస్తుంది. మనకు ముచ్చటే గానీ, వారికి ముచ్చెమటలే. బాబీ డియోల్ను చూడండి. మన ఐరన్ మ్యాన్ ధర్మేంద్ర కొడుకు. చాలా సినిమాల్లో చేశాడు. బొద్దుగా, రౌండుగా, లవ్లీగా ఉంటాడు. కానీ ‘రేస్ 3’ లో మాత్రం రేసు గుర్రంలా ఉన్నాడు. ఈ మాట మనం అనడం కాదు. షర్టు తీసి, కండలు చూపించే సల్లూ భాయే అంటున్నాడు. ‘బాబీ డియోల్ హాట్ బాడ్’ చూస్తే.. మీరందరూ నోరెళ్లబెడతారు’ అని సల్మాన్ అంటే.. ‘కష్టానికి తగిన ఫలితం ఇచ్చినప్పుడు సంతోషం కలుగుతుంది’ అని బాబీ డియోల్ అన్నాడు. మీడియా మాత్రం ‘అచ్చు.. వాళ్ల డాడ్ బాడ్’ అని చమత్కరించింది.. బాబీ డియోల్ బాడీని చూసి. -
అనుకోని అతిథి!
ముంబైలో ఓ ప్రముఖ స్టూడియో అది. జోరుగా షూటింగ్ జరుగుతోంది. కెమెరా, యాక్షన్, కట్, టేక్.. ఇలాంటి వర్డ్స్ తప్ప లొకేషన్లో ఇంకో మాట వినబడటంలేదు. టీమ్ అంతా సీరియస్గా వర్క్లో నిమగ్నమైపోయారు. సడన్గా ఓ వ్యక్తి అనుకోని అతిథిలా వచ్చాడు. అంతే వారి సీరియస్నెస్లో హుషారు నింపాడు. సెట్లో నవ్వులు పంచాడు. అతను రణ్వీర్ సింగ్. ఇతగాడికి ‘లైవ్ వైర్’ అనే పేరుంది. రణ్వీర్ ఎక్కడ ఉంటే అక్కడ సందడే. సల్మాన్ ఖాన్ ‘రేస్ 3’ సినిమా సెట్లో రణ్వీర్ చేసిన సందడి ఇప్పుడు బీటౌన్లో ఓ హాట్ టాపిక్. ‘ఏబీసిడి (ఎనీబడీ కెన్ డ్యాన్స్), ఏ ప్లైయింగ్ జాట్’ వంటి చిత్రాలను తెరకెక్కించిన రెమో డిసౌజా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, బాబీ డియోల్, సలీమ్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ స్పాట్కు వెళ్లారు రణ్వీర్సింగ్. ఇన్సెట్లో మీరు చూస్తున్న పిక్ అదే. ‘‘రణ్వీర్సింగ్ ‘రేస్3’ షూటింగ్ లొకేషన్లోకి వచ్చాడు. వస్తూ వస్తూ నవ్వులు మోసుకొచ్చి మా అందరికీ పంచాడు’’ అని పేర్కొన్నారు నిర్మాత రమేశ్. వచ్చే ఏడాది రంజాన్ సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. -
పోటీకి సై!
ఆల్మోస్ట్ 15 ఏళ్ల క్రితం లవ్లో ఉన్న కండల వీరుడు సల్మాన్ఖాన్, అందాల భామ ఐశ్యర్యా రాయ్ ఏవో రీజన్స్ వల్ల బ్రేకప్ చెప్పుకున్నారని బాలీవుడ్ కథనాలు చదివాం. ఆ తర్వాత 2007లో అభిషేక్ బచ్చన్ను ఐశ్యర్య వివాహం చేసుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు సల్మాన్, ఐశ్యర్యల మధ్య వార్ మొదలైంది. ఏవేవో ఊహించుకోకండి. వార్ పర్సనల్గా కాదు. ప్రొఫెషనల్గా. వీరిద్దరూ వచ్చే ఏడాది బాక్సాఫీస్ వార్కి సై అంటున్నారు. అతుల్ మంజ్రేకర్ దర్శకత్వంలో ఐశ్యర్యా రాయ్ లీడ్ రోల్లో ‘ఫ్యాన్నీ ఖాన్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అనీల్కపూర్, రాజ్కుమార్ రావు కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది రంజాన్కు రిలీజ్ చేయనున్నట్లు ఈ సినిమా నిర్మాతలు అర్జున్ ఎన్.కపూర్, ప్రీమా అరోరా, భూషన్ కుమార్, రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా తెలిపారు. ఈ పండగకే రావడానికి రెడీ అవుతున్నట్లు ఆ మధ్య సల్మాన్ ఖాన్ ‘రేస్ 3’ బృందం ప్రకటించింది. సల్లూభాయ్కి బాక్సాఫీసు దగ్గర అచ్చొచ్చిన పండగ రంజాన్. ఒక్క 2013 మినహాయించి 2009 నుంచి మొన్నీ మధ్య 2017 వరకు ప్రతి రంజాన్ పండక్కి సల్మాన్ సినిమా వచ్చింది. ‘వాంటెడ్, దబాంగ్, బాడీగార్డ్, ఎక్ థా టైగర్, కిక్, భజరంగీ భాయిజాన్, సుల్తాన్, ట్యూబ్లైట్ (2017)’ సినిమాలు రంజాన్కు విడుదలైనవే. 2018 మిస్సవుతుందని అనుకున్నారు. ఎందుకంటే సల్మాన్ ‘భరత్’ సినిమాను 2019లో రంజాన్కు రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రదర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ ప్రకటించారు. సో...∙2018 రంజాన్కి సల్లుభాయ్ సినిమా లేనట్లే అని ఫిక్సవుతున్న తరుణంలో ఈ కండల వీరుడు హీరోగా రూపొందుతోన్న ‘రేస్ 3’ సినిమాను రంజాన్కు రిలీజ్ చేయనున్నట్లు దర్శకుడు రెమో డిసౌజా తెలిపారు. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 9న మొదలైంది. ఒకవైపు కలసి వచ్చిన పండక్కి రావడానికి సల్మాన్ రెడీ అవుతోంటే, ఐశ్వర్యా రాయ్ ‘ఫ్యానీ ఖాన్’తో రేస్లో నిలబడ్డారు. మరి... ఎక్స్ లవర్స్లో గెలుపు ఎవరిది? వేచి చూద్దాం. -
కులమతాలతో ఓట్లు కోరడం అవినీతే
• సుప్రీం కోర్టు కీలక తీర్పు • జాతి, వర్గం, భాష పేర్లతోనూ ఓట్లు కోరకూడదు • ఎన్నికల్లో మతానికి చోటు లేదని స్పష్టీకరణ న్యూఢిల్లీ: రాజకీయాల నుంచి కులమతాలను వేరు చేసే దిశగా సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరిం చింది. ‘మతం, జాతి, కులం, వర్గం, భాషల పేర్లతో ఓట్లు అడగడం ఎన్నికల చట్టం కింద అవినీతి చర్య కిందికే వస్తుంది’ అని విస్పష్టంగా పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ సహా ఏడుగురితో కూడిన ధర్మాసనం సోమవారం ఈమేరకు 4:3 మెజారిటీ తేడాతో తీర్పునిచ్చింది. హిందుత్వం జీవన విధానమన్న తన 21 ఏళ్ల నాటి వివాదాస్పద తీర్పును సవరిస్తూ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ప్రజాప్రాతినిధ్య (ఆర్పీ) చట్టం–1951లోని 123(3) సెక్షన్ ప్రకారం ‘అతని మతం’(హిజ్ రిలిజియన్) అంటే ఓటర్లు, అభ్యర్థులు, వారి ఏజెంట్లు సహా అందరి కులమతాలూ అని అర్థం‘ అని జస్టిస్ ఠాకూర్, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావులు(మెజారిటీ జడ్జీలు) స్పష్టం చేశారు. ఇలాంటి విషయాల్లో లౌకికవాదాన్ని దృష్టిలో ఉంచుకోవాలని జస్టిస్ లోకూర్ రాసిన తీర్పులో సూచించారు. అభ్యర్థి, ఎన్నికల ఏజెంట్, ప్రత్యర్థి, ఓటర్ల మతాల పేరుతో ఓట్లు కోరడం ఆర్పీ చట్ట ప్రకారం అవినీతి కిందికి వస్తుందని జస్టిస్ ఠాకూర్ చెప్పారు. ఎన్నికల ప్రక్రియ పవిత్రతను కొనసాగించేందుకు 123(3)కి విస్తృత, ప్రయోజనకర భాష్యం కావాలన్నారు. లౌకికవాదం మన రాజ్యాగ మౌలిక నిర్మాణంలో భాగమని, మతమనేది వ్యక్తిగత విషయమని అన్నారు. ‘రాజ్య వ్యవహారాలను మతం తో కలపడానికి వీల్లేదు. లౌకిక రాజ్యం ఏ మతంతోనూ గుర్తింపు పొందకూడదు. లౌకిక ప్రక్రియ అయిన ఎన్నికల్లో మతానికి చోటు లేదు’ అని స్పష్టం చేశారు. దేవుడిని మనిషి అనుసరించే మార్గాలు వ్యక్తిగత ప్రాధాన్యాలని పేర్కొన్నారు. మనలాంటి పెద్ద ప్రజాస్వామ్యంలో ఈ సెక్షన్ను అభ్యర్థికి మేలు చేకూరేలా వ్యాఖ్యానించడం ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా మారుతుందని జస్టిస్ లోకూర్ అన్నారు. మైనారిటీ జడ్జీలు ఏమన్నారంటే.. మెజారిటీ జడ్జీలతో విభేదించిన జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఏకే గోయెల్, జస్టిస్ డీవై చంద్రచూడ్లు.. సెక్షన్ 123(3) ప్రకారం.. ‘అతని మతం’ అంటే అభ్యర్థి మతమేనన్నారు. ఆర్పీ చట్టానికి ఎన్నో సవరణలు చేసినా ఈసెక్షన్ మాత్రం మారలేదన్నారు. కులమతాల కారణంగా అన్యాయానికి గురవుతున్న ప్రజల న్యాయబద్ధమైన ఆందోళన గురించి మాట్లాడకుండా, చర్చించకుండా అడ్డుకుంటే ప్రజాస్వామ్యం అస్పష్టంగా మారుతుందన్నారు. ‘ఏ తరహా ప్రభుత్వమూ సంపూర్ణమైనది కాదు. అయితే ఇందులోని లోపాలను న్యాయవ్యవస్థ.. చట్ట నిబంధనను తిరగరాయడం ద్వారా పరిష్కరించకూడదు’ అని మైనారిటీ తీర్పు రాసిన జస్టిస్ చంద్రచూడ్ అన్నారు . కులమతాల పేర్లతో ఓట్లు అడగడం అవినీతా, కాదా అన్న దానికి సంబంధించిన ఎన్నికల చట్ట నిబంధన విస్తృతిపై విచారణ జరిపిన కోర్టు గత అక్టోబర్ 27న తీర్పు వాయిదా వేయడం తెలిసిందే. గతంలో ఇచ్చిన తీర్పులో కోర్టు ‘అతని మతం’ అంటే అభ్యర్థి మతం మాత్రమే అని పేర్కొంది. మతాన్ని ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ఉందని, అయితే ఎన్నికల కోసం మతాన్ని వాడుకోవచ్చా?అని ధర్మ సందేహం లేవనెత్తింది. 1990లోశాంతాక్రజ్ ఎమ్మెల్యేగా(బీజేపీ) తన ఎన్నికను బాంబే హైకోర్టు కొట్టేయడంతో అభిరాం సింగ్ సహా పలువురు వేసిన పిటిషన్లు కోర్టు విచారణలో ఉన్నాయి. ‘హిందుత్వ’ను ఉద్దేశించి చేసే విజ్ఞప్తి హిందువులను ఉద్దేశించి చేసినట్లు భావించకూడదని, హిందుత్వమనేది ఓ జీవన విధానమని 1995లో బెంచ్ సంచలన తీర్పు వెలువరించింది. 2002లో ఈ తీర్పును ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి నివేదించాలని కోర్టు నిర్ణయించింది. ఆర్పీ చట్టంలోని 123(3) వివరణ అంశాన్ని తేల్చాలని 2014లో కోర్టు ఏడుగురు జడ్జీల బెంచ్కు నివేదించింది. -
దీపావళి రేస్లో సూపర్స్టార్
దీపావళి, సంక్రాంతి వంటి పండగ రోజుల్లో స్టార్ హీరోల చిత్రాలు తెరపైకి వస్తే ఆ సందర్భాలు వారి అభిమానులకు మరో పండగే. అలాంటిది ఇండియన్ సూపర్స్టార్ రజనీకాంత్ చిత్రం దీపావళికి విడుదలైతే ఆ సందడే వేరు. రజనీకాంత్కు ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఆయన చిత్రం ఏ భాషలో రూపొందినా అది పలు దేశాల్లో ప్రదర్శింపబడుతుంది. ఇకపోతే కారణాలేమైనా రజనీకాంత్ నటించిన చిత్రాలు ఈ మధ్య దీపావళి పండగకు తెరపైకి రావడం లేదు. పండగల సందర్భంగా తమ సూపర్స్టార్ చిత్రాలు విడుదల కావాలని ఆయన అభిమానులు కోరుకుంటుంటారు. అరుుతే రజనీకాంత్ హీరోగా కేఎస్. రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన ముత్తు చిత్రం 1995లో దీపావళి సందర్భంగా అక్టోబర్ మూడవ తేదీన విడుదలైంది. ఆ తరువాత ఆయన నటించిన ఏ చిత్రం ఇప్పటి వరకూ దీపావళికి తెరపైకి రాలేదు. అలాంటిది 2017లో 2.ఓ చిత్రం దీపావళి పండగ సందర్భంగా విడుదల కానుంది. అంటే 21 ఏళ్ల తరువాత సూపర్స్టార్ నటించిన చిత్రం ఈ పండగకు రానుందన్న మాట. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న 2.ఓ చిత్రంపై అంచనాలు ఇప్పటికే తారా స్థారుుకి చేరుకున్నారుు. కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ నిపుణుల సృష్టితో అత్యధిక బడ్జెట్తో 3డీ ఫార్మాట్లో తెరకెక్కుతున్న తొలి భారతీయ చిత్రంగా సూపర్స్టార్ చిత్రం 2.ఓ రికార్డుకెక్కనుంది. ఇక ఈ చిత్రం తిరగరాసే రికార్డుల కోసం ఎదరుచూద్దాం. -
జమైకాలో అదే నా చివరి రేసు: బోల్ట్
కింగ్స్టన్: పరుగుల వీరుడు, జమైకా స్టార్ స్పింటర్ ఉసేన్ బోల్ట్ తన దేశంలో పాల్గొనబోయే చివరి రేసును ప్రకటించేశాడు. స్వదేశంలో వచ్చే జూన్ లో జరిగే రేసర్స్ గ్రాండ్ ప్రినే తనకు అక్కడ ఆఖరి రేసు అని బోల్ట్ స్ఫష్టం చేశాడు. ఇప్పటికే లండన్ లో జరిగే వరల్డ్ చాంపియన్ షిప్ తో తన రేసింగ్ కెరీర్కు ముగింపు పలకబోతున్నట్లు ప్రకటించిన బోల్ట్.. జమైకాలో పాల్గొనే ఆఖరి రేసును కూడా వెల్లడించాడు. 'రేసర్స్ గ్రాండ్ ప్రినే జమైకా ప్రజల సమక్షంలో పాల్గొనబోయే ఆఖరి రేసు. ఆ తరువాత ఇక్కడ నా పరుగు ఉండదు'అని బోల్ట్ పేర్కొన్నాడు. ఈ ఏడాది జరిగిన రేసర్స్ గ్రాండ్ ప్రిలో బోల్ట్ 100 మీటర్ల పరుగులో విజేతగా నిలిచాడు. వచ్చే ఏడాది కూడా ఇదే ఫామ్ ను చాటుకుని విజయంతో తన ప్రజలకు వీడ్కోలు పలకాలని భావిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. -
ఖమ్మంలో బైక్ రేసింగ్
పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు ఖమ్మం అర్బన్ : ఫ్రెండ్షిప్ డే వేడుకల్లో భాగంగా కొంతమంది యువకులు బైక్ రేసింగ్ నిర్వహిస్తున్నారని సమాచారం. నగరంలోని మధురానగర్ రోడ్డులో నూతనంగా ఓ హోటల్ నిర్వహకులు యువకులకు వివిధ పోటీలను నిర్వహించారని, అందులో భాగంగానే కొంతమంది బైక్ రేసింగ్ నిర్వహించారని తెలిసింది. మొదటిస్థానం సాధించినవారికి రూ.5 వేలు ఇచ్చినట్లు సమాచారం. పోటీల్లో పాల్గొన్న ఓ యువకుడు కిందపడిపోయి తీవ్ర గాయాలపాలైనట్లు తెలిసింది. పోటీల్లో మెడికోలు, ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు పాల్గొన్నట్లు ప్రచారం జరుగుతోంది. మమతా రోడ్డులో బైక్ రేసింగ్ నిర్వహించడంతో ట్రాఫిక్ సమస్య ఎదురవడంతో స్థానికులు 100కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో అర్బన్ పోలీసులు సంఘటనా స్థనాలనికి చేరుకుని కొంతమంది యువకులను అదపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై అర్బన్ సీఐ శ్రీధర్ను వివరణ కోరగా బైక్ రేసింగ్లు జరిగినట్లు తమకు సమాచారం లేదన్నారు. కొంతమంది యువకులు లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతుంటే గుర్తించి ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
మూడేళ్లు... కాదు రెండేళ్లే..!
– మున్సిపల్ చైర్మన్ సీటుపై వాడివేడిగా చర్చ – రేసులో ఆసం రఘురామిరెడ్డి, ముక్తియార్ ప్రొద్దుటూరు టౌన్: ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ సీటుపై టీడీపీలో వాడివేడిగా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం చైర్మన్గా ఉన్న ఉండేల గురివిరెడ్డి కొనసాగుతారా లేదా అనే విషయం చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జరిగిన చర్చల్లో గురివిరెడ్డికి రెండేళ్లు, మిగతా మూడేళ్లు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి వరదరాజులరెడ్డి వర్గీయుడు 20వ వార్డు టీడీపీ కౌన్సిలర్ ఆసం రఘురామిరెడ్డికి ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గురువిరెడ్డి తాను మూడేళ్లకు ఒక్క రోజు ముందు కూడా పదవి నుంచి దిగే ప్రసక్తే లేదని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఎలాగైనా గురివిరెడ్డిని చైర్మన్ పదవి నుంచి తప్పించేందుకు వరదరాజులరెడ్డి వ్యూహం పన్నుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. దిగాల్సిందే... ఈ నెల 3వ తేదికి రెండేళ్లు పూర్తి చేసుకున్న చైర్మన్ గురివిరెడ్డి పదవి నుంచి దిగాల్సిందేనని వరదరాజులరెడ్డి పరోక్షంగా సంకేతాలు పంపుతున్నారు. ఆయన వర్గీయుల్లో ముఖ్యుడైన ఓ మాజీ కౌన్సిలర్ ద్వారా రెండు రోజుల క్రితం గురివిరెడ్డికి చెప్పినట్లు సమాచారం. ఇందుకు ఆయన ససేమిరా అన్నట్లు తెలిసింది. చైర్మన్ బరిలో ఉన్న ఆసంకు టీడీపీ కౌన్సిలర్లు మద్దతు ఇస్తారో లేదోననే విషయం చర్చనీయాంశమైంది. ఇప్పటి వరకు జరిగిన 24 మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో ఏ రోజు కూడా ఆసం సమస్యలపై కానీ, కౌన్సిలర్లతో చర్చించడం కానీ చేయలేదని కొందరు టీడీపీ కౌన్సిలర్లు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల్లో పట్టణంలోని 40 వార్డుల్లో 22 మంది టీడీపీ కౌన్సిలర్లు, 18 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు గెలుపొందారు. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లలో వీఎస్ ముక్తియార్తోపాటు మరో 8 మంది టీడీపీలో ఇటీవల చేరారు. ప్రస్తుతం ఉన్న 22 మంది టీడీపీ కౌన్సిలర్లలో కొంత మంది మినహా మిగిలిన వారంతా రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మల్లేల లింగారెడ్డి తరఫున ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో లింగారెడ్డి తన వర్గీయుడైన ముక్తియార్ను చైర్మన్ చేసేందుకు కౌన్సిలర్లతో కలిసి పావులు కదుతున్నారు. ప్రస్తుతం ఉన్న టీడీపీ కౌన్సిలర్లలో ఎక్కువ మందిని ఆకట్టుకుంటున్న లింగారెడ్డి వర్గీయుడు ముక్తియార్ పేరు చర్చకు వస్తోంది. మరి కొన్ని రోజుల్లో ఏర్పాటు చేయనున్న కౌన్సిల్ సమావేశంలో చైర్మన్ సీటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
11.5 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్ట్ రెడీ
3 నెలల్లో పూర్తి చేసిన రేస్ పవర్ ఇన్ఫ్రా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సౌర విద్యుత్ సంస్థ రేస్ పవర్ ఇన్ఫ్రా మహబూబ్నగర్లో నిర్మిస్తున్న 11.5 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసుకుంది. 46 ఎకరాల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ఈ ఏడాది జనవరిలో ప్రారంభమై.. మంగళవారంతో పూర్తి చేసుకున్నట్లు సంస్థ సీఈఓ కేతన్ మెహత ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ సోలార్ పార్క్ పాలసీలో భాగంగా చేపట్టిన 500 మెగావాట్ల ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇది ఒకటని పేర్కొన్నారు. -
డ్రైవర్ లెస్ టెక్నాలజీ రేసులో చైనా!
బీజింగ్ః భారీ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సంస్థ గూగుల్ కు పోటీగా ప్రముఖ చైనా సంస్థ స్వయం చోదిత కార్లను సిద్ధం చేస్తోంది. చైనా ఆటోమొబైల్ తయారీ సంస్థతో కలసి ఇంటర్నెట్ దిగ్గజం బైడు ఈ డ్రైవర్ లెస్ కార్ల తయారీ చేపట్టనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం, యంత్ర మేథస్సుల కలయికతో ఈ స్వయం చోదిత కార్లను తయారు చేయనున్నట్లు చైనా క్లౌడ్ కంప్యూటింగ్ సేవల సమావేశంలో బైడు సీనియర్ ఉపాధ్యక్షులు వాంగ్ జిన్ తెలిపారు. చైనా తయారీదారులు, ఇంటర్నెట్ దిగ్గజాలు డ్రైవర్ లెస్ టెక్నాలజీవైపు దృష్టి సారిస్తున్నారు. అమెరికా సంస్థలకు దీటుగా డ్రైవర్ లెస్ కార్ల తయారీకోసం సన్నాహాలు చేస్తున్నారు. అయితే మార్కెట్ విషయంలో మాత్రం ఇప్పటివరకూ ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఇప్పటికే గూగుల్ స్వయం చోదిత కారును అమెరికాలో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్న విషయం తెలిసిందే. గత ఆరేళ్ళుగా బిఎమ్ డబ్ల్యూ, వోల్వో, టయోటాల సహకారంతో గూగుల్ అటానమస్ వాహనాల తయారీ చేపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం చైనా ఇంటర్నెట్ సెర్చ్ దిగ్గజం'బైడు' తయారీదారులు 'చంగన్' తో కలసి అదే రేసులో ఎంటరయ్యే ప్రయత్నం చేస్తోంది. దేశ మొట్టమొదటి స్వయం ప్రతిపత్తి వాహనాల టెస్ట్ లో రాజధానికి నైరుతిలోని పర్వతశ్రేణుల్లో 2,000 కిలోమీటర్ల అత్యధిక దూరం ప్రయాణించిన రెండు స్వీయ డ్రైవింగ్ ఛంగన్ కార్లు ఇప్పటికే బీజింగ్ ఆటో షో లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాయి. దీనికితోడు మరో చైనీస్ ఇంటర్నెట్ దిగ్గజం 'లీ ఎకో' కూడ అటానమస్ టెక్నాలజీలోకి ప్రవేశించి ఓ ఎలక్ట్రానిక్ కారును బీజింగ్ లో ఆవిష్కరించింది. చైనాలో 'బైడు' సంస్థ మొదటిసారి స్థానికంగా రూపొందించిన డ్రైవర్ లెస్ వాహనం గతేడాది చివరల్లో బీజింగ్ లోని వీధుల్లో 30 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ స్థానికులను ఆకట్టుకుంది. అయితే సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల తయారీలో చైనా ఆలస్యంగా మార్కెట్లోకి వచ్చినప్పటికీ స్థానిక వినియోగదారులకు అనుకూల వాతావరణాన్ని కల్పించి, కీలక మార్కెట్ గా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. -
'చంచల్గూడ జైలు, రేస్ కోర్స్ తరలించండి'
-
యాప్లో దూసుకుపోతున్న ఫేస్బుక్
మొబైల్ ఫోన్లలో వాడేందుకు తయారు చేసిన సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ను యాప్స్ అంటున్నాం. యాప్ ను అభివృద్ధి చేసి జనానికి అందుబాటులోకి తేవడానికి అనేక కంపెనీలు పోటీ పడుతుంటాయి. అయితే మనం వాడే మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ను బట్టి ఆయా యాప్ లు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో అత్యధిక వినియోగదారులతోపాటు ప్రజాభిమానం చూరగొంటున్న ఫేస్ బుక్...మొబైల్ అనువర్తనాల రేసులోనూ దూసుకుపోతోంది. అయితే 2015 కొత్త గణాంకాల ప్రకారం మాత్రం గూగుల్ టాప్ టెన్ లో అధిక భాగాన్ని ఆక్రమించుకొంది. యాపిల్.. యాప్ స్టోర్ ను పరిచయం చేసిన వెంటనే ఐఫోన్ రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత పెరిగిన టెక్నాలజీకి అనుగుణంగా క్రమంగా కంప్యూటరీకరణలోనూ అనంతమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే కొన్ని సంస్థలు ప్రత్యేకంగా మొబైల్ మార్కెట్ పై అధిపత్యం కొనసాగించాయి. నీల్సన్ పరిశోధన ప్రకారం ఫేస్ బుక్ మొబైల్ యాప్ అన్నింటికంటే ఎక్కువగా 126 మిలియన్ల మంది ప్రత్యేక వినియోగదారులతో కొనసాగుతుండటమే కాక, ఈ సామాజిక నెట్ వర్క్ గత సంవత్సరం ఫేస్ బుక్ మెసెంజర్ కు సంబంధించిన మూడు యాప్ లతోనూ... ఇన్ స్టాగ్రామ్.. ఎనిమిది యాప్ ల తోనూ కొనసాగింది. అయితే ఈ సంవత్సరం టాప్ టెన్ లోని ఆ స్థానాన్ని గూగుల్ ఆక్రమించింది. అత్యధికంగా ఉపయోగించే పది యాప్ లలో ఐదు గూగుల్ వే ఉన్నట్లు మౌంటైన్ వ్యూ పరిశోధనల ఆధారంగా తెలుస్తోంది. ఇకపోతే యూట్యూబ్ 97 మిలియన్లపైగా వినియోగదారులతో రెండో స్థానంలో నిలువగా.. జీ మెయిల్ ఛార్ట్ కు మధ్య స్థానంలోకి చేరిపోయింది. యాపిల్ సంస్థ అధీనంలోని యాపిల్ మ్యూజిక్, ఆపిల్ మ్యాప్స్ యాప్ లు చివరిస్థానంతోనే సరిపెట్టుకున్నాయి. అయితే మొట్ట మొదట మొబైల్ యాప్ స్టోర్ ను పరిచయం చేసిన యాపిల్... ఇప్పటికీ గూగుల్ మ్యాప్స్ ను అధిగమించేందుకు యాపిల్ మ్యాప్స్, గూగుల్ ప్లే ను అధిగమించేందుకు యాపిల్ మ్యూజిక్ తనూ ప్రయత్నిస్తూనే ఉంది. అయితే చాలామంది ఇతర యాప్స్ కూడ వాడుతున్నప్పటికీ ఫేస్ బుక్, గూగుల్ సంస్థలు యాప్ వాడకానికి డబ్బు వినియోగంతోపాటు... తమ ఉచిత సేవలను కూడ అంది స్తుండటంతో మొబైల్ వ్యాపార రంగంలోనూ జోరుగా దూసుకుపోతున్నాయి. -
ఆదిలాబాద్లో పోటీకి కాంగ్రెస్ దూరం
-
బ్రేకింగ్ న్యూస్.. అనర్థాల రేస్
డేట్లైన్ హైదరాబాద్ మీడియా మరింత జాగ్రత్తగా, బాధ్యతగా ఉండాలన్న విషయంలో ఎవరికీ విభేదం లేదు. కేంద్ర మంత్రయినా, గవర్నరయినా, పేద పత్తి రైతైనా... వారి విషయంలో మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిందే. మీడియాను వృత్తిగా స్వీకరించే వారికి అలాంటి శిక్షణ తప్పక ఉండాల్సిందే. కాకపోతే అదే స్వరంలో మీడియా మీద జరుగుతున్న ముప్పేట దాడిని గురించి కూడా మాట్లాడుకోవాలి. మీడియా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛల పట్ల పలుపురి వైఖరి, నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించినట్టుగా ఉంటోంది. రాష్ర్ట గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గత ఆదివారం నాడు ఒక సభలో మాట్లాడుతూ మీడియా పోకడల మీద కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆయన మాటల్లోని ఆవేదననూ, ధర్మాగ్రహాన్ని మీడియాతో సహా ఎవరూ కాదనలేరు. తన సోదరుడి మృతి విషయంలోనే మీడియా వ్యవహరించిన తీరును ఆయన గతంలో కూడా కొన్ని సందర్భాలలో ఉదహరించారు. నరసింహన్ సోదరుడు ఐఏఎస్ అధికారిగా అస్సాంలో పని చేస్తుండగా ఉగ్రవాదుల మందుపాతర పేలుడుకు బలైపోయారు. ఆ విషాద సంద ర్భంలో ఆయన ముఖం మీద మైకు పెట్టి, ఎలా అనిపిస్తుంది? అని అడగడం కంటే దుర్మార్గం ఉంటుందా? 30 ఏళ్ల క్రితమే, మండల్ కమిషన్ సిఫార సులకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం ఉవ్వెత్తున లేచిన సమయంలోనే మీడియా అమానవీయతపై పెద్ద ఎత్తున చర్చ మొదలయింది. అప్పటికింకా 24 గంటల వార్తా చానళ్లూ లేవు, ఇంత పోటీ, ఉరుకులుపరుగులూ లేవు. 1985లో, ఆ ఉద్యమం సాగుతుండగా రాజీవ్ గోస్వామి అనే యువకుడు వందలాది మంది సమక్షంలో వంటి మీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాన్ని మరుసటి వారం ఒక ప్రముఖ ఇంగ్లిష్ వారపత్రిక రంగుల ముఖ చిత్రంగా ప్రచురించి సభ్యసమాజం నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నది. ఆత్మాహుతికి పాల్పడుతున్న వ్యక్తిని అడ్డు కుని, రక్షించాల్సిందిపోయి, ఆ పత్రిక ఫొటోగ్రాఫర్ ముఖచిత్రం కోసం ఆరాటపడటం ఏమిటని అంతా విమర్శించారు. అనారోగ్యకర పోటీ ఈ మూడు దశాబ్దాలలో మీడియా ఇటువంటి విషయాలలో ఏమీ మారలేదు సరికదా మరింత అమానవీయంగా తయారయింది. 24 గంటల న్యూస్ చానళ్లు వచ్చిన తరువాత అయితే పరిస్థితి మరింతగా దిగజారిపోయింది. నరసింహన్ గారు చెప్పినట్టు ధ్యాస అంతా బ్రేకింగ్ న్యూస్ మీదే అయ్యేసరికి మిగతా విలువలన్నీ వెనుకబడి పోతున్నాయి. గవర్నరే అన్నట్టు దీనికి ప్రధాన కారణం ‘రాట్ రేస్’ (విపత్కర పోటీ). అందరికన్నా ముందున్నామని చెప్పు కోడానికి పెడుతున్న అనారోగ్యకరమైన పరుగు. ఫలితంగా చాలా సంద ర్భాల్లో వాస్తవాలు తెరమరుగయ్యే ప్రమాదం ఉంటుంది. రెండు రోజుల క్రితమే జరిగిన సంగతి చూడండి. 800 ఏళ్ల తరువాత ఒక హిందూ పాలకుడు దేశాన్ని పాలించబోతున్నాడని సార్వత్రిక ఎన్నికల విజయానంతరం నేటి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ వ్యాఖ్యానించారని, లోక్సభలో మార్క్సిస్ట్ సభ్యుడు సలీం అన్నారు. ఒక ప్రఖ్యాత ఆంగ్ల పత్రికపై ఉన్న నమ్మకంతో ఆ పత్రిక చేసిన వ్యాఖ్యనే ఆయన ఉదహరించారు. చాలా సీనియర్ మార్క్సిస్ట్ నాయకుడైన సలీం వ్యాఖ్యలు లోక్సభను కుదిపేశాయి. రాజ్నాథ్, తానా వ్యాఖ్యలు చెయ్యలేదని ఖండించారు, సలీం క్షమాపణ చెప్పాలని పట్టు బట్టారు. మార్క్సిస్ట్ నాయకులు ససేమిరా అన్నారు. ఇంత రాద్ధాంతానికి కారణమైన ఆ పత్రిక ‘‘అయ్యా క్షమించాలి. ఆ మాటలు అన్నది రాజ్నాథ్ కాదు, స్వర్గీయ అశోక్ సింఘాల్. మా పొరపాటును సవరించుకుంటున్నాం, మా పత్రిక ఆన్ లైన్ ఎడిషన్లో మార్చేశాం’’ అని ట్వీట్టర్లో సవరణ జారీ చేసింది. చిన్నదీ చితకదీ కాని ఆ పత్రికను నమ్మిన ఆ ప్రముఖ నేతకూ, ఆయన విమర్శకు గురైన మంత్రికి కూడా బాధ కలిగింది, నష్టం జరిగింది. మీడియా నుంచి జరిగే ఇలాంటి తప్పులు పెద్దవైనా చిన్నవైనా హానికరమైనవి. అనారోగ్యకర పోటీతో సాగిస్తున్న ఈ ఉరుకులుపరుగుల వల్ల ఇలాంటి ఎన్నో పొరపాట్లు జరుగుతున్నాయి. కొద్ది కాలం క్రితం ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో ఓ రైతు కలెక్టర్ కార్యాలయం మెట్ల మీద పురుగుల మందు తాగి, ఆత్మహత్యాయత్నం చేశాడు. జనం ఆ రైతును ఆస్పత్రికి తరలించే హడావుడిలో ఉంటే, మీడియా మిత్రులు మాత్రం ఆ రైతు ముఖం మీద మైకులు పెట్టి ప్రశ్నలు గుప్పించారు. ఇటీవలే ఒక వార్తా చానల్, పత్రిక, ఒక వ్యక్తి సెల్ టవర్ మీద నుంచి దూకదాన్ని దశలవారీగా చిత్రించి ప్రసా రంచేసి, ప్రచురించి సంబరపడింది. ఇలాంటి ఉదాహరణలు ఎన్నయినా చెప్పొచ్చు. మీడియా... అవి పత్రికలే కావొచ్చు, వార్తా చానళ్లే కావొచ్చు మరింత జాగ్రత్తగా, బాధ్యతగా ఉండాలన్న విషయంలో ఎవరికీ విభేదం లేదు. మీడియాకు స్వీయ నియంత్రణ అవసరమని మీడియా పెద్దలే నిత్యమూ ఘోషిస్తున్నారు. కేంద్ర హోంమంత్రే అయినా, రాష్ర్ట గవర్నర్ అయినా, పేద పత్తి రైతయినా మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించా ల్సిందే. మీడియాను వృత్తిగా స్వీకరించే వారికి అలాంటి శిక్షణ తప్పక ఉండాల్సిందేననడంలోనూ భిన్నాభిప్రాయం లేదు. తెలుగు ఏలికల రాజకీయ అసహనం కాకపోతే అదే స్వరంలో మీడియా మీద జరుగుతున్న ముప్పేట దాడిని గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎంత సేపూ మీడియా స్వీయ నియంత్రణ గురించే మాట్లాడే వారు సమాజంలో పెచ్చుపెరుగుతున్న అసహనాన్ని గురించి కూడా మాట్లాడితే, దానికి నివారణ మార్గం చూపితే బాగుంటుంది. మీడియా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి మీడియాకు వెలుపల ఉన్న పలుపురి వైఖరి.. నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించినట్టుగా ఉంటోంది. గత ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా మీడియా మీద, విలేకరుల మీద ఆందో ళనకరమైన రీతిలో దాడులు జరుగుతున్నాయి. అందుకు కారణం కారణం రాజకీయ నాయకత్వం అనుసరిస్తున్న వైఖరే. ప్రస్తుతం ఎక్కడ చూసినా అస హనంపై చర్చే వినవస్తోంది. ఇక్కడ ప్రస్తావిస్తున్నది అవార్డు వాపసీలపై ప్రద ర్శిస్తున్న అసహనం గురించి కాదు. అటువంటి విషయాలను వార్తలుగా మలిచి ప్రజలకు చేరవేస్త్తున్న మీడియా పట్ల రాజకీయ వర్గాల్లో పెరిగిపోతున్న అసహనం గురించి. ఇది ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు, దేశ వ్యాప్తంగానే ఉంది. గత జూన్లో ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో జగేంద్రసింగ్ అనే జర్నలిస్ట్ను స్థానిక రాజకీయ నాయకుడి ప్రాపకంలోని గూండాలూ, పోలీసులు కలిసి తగులబెట్టి చంపారు. అదే నెలలో మధ్య ప్రదేశ్లో మరో జర్నలిస్ట్ను ఇలాగే హతమార్చారు. వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఇలాంటి మరో పది వరకు దాడుల్లో పలువురు జర్నలిస్టులు ఆస్పత్రుల పాలయ్యారు. ఈ ఘటనలన్నింటికీ రాజకీయ నాయకత్వం అసహనమే కారణం. తమకు నచ్చని లేదా తమ ప్రయోజనాలను దెబ్బతీసే వార్తలు రాసినందుకే ఈ దాడులన్నీ జరుగుతున్నాయి. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. మీడియాపై ముప్పేట దాడి గవర్నర్ నరసింహన్ ఏలుబడిలోనే ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజ కీయ నాయకత్వం అసహనాన్ని గురించి కూడా మాట్లాడుకోవాలి. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన వెంటనే అక్కడి ప్రభుత్వం ప్రదర్శించిన అసహనాన్ని ప్రపంచమంతా చూసింది. అది గవర్నర్ దృష్టికి రాలేదనుకోగలమా? అటు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే సమయంలో ప్రభుత్వ కార్యక్రమాలకు కొన్ని మీడియా సంస్థలను అనుమతించని విషయం, వర్కింగ్ జర్నలిస్ట్ల ఉద్య మం నిరసన అనంతరం ఆ నిర్ణయాన్ని మార్చుకోవడం కూడా అందరికీ తెలుసు. ప్రభుత్వ వ్యతిరేక వార్తలను వెలువరిస్తున్నాయంటూ, నిన్నగాక మొన్న ఏపీ ముఖ్యమంత్రి సాక్షి దిన పత్రిక చదవొద్దని, సాక్షి టీవీ చూడొద్దనీ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వంలో తప్పులు జరిగితే, ప్రజాధనం దుర్వి నియోగమైతే వాటిని వెలుగులోకి తేకుండా ఉండాలనే కోరిక పాలకులకు ఉండొచ్చు. కానీ, ఆయన పిలుపు మేరకు ఎవరైనా వాటిని చదవడం, చూడ టం మానేస్తే అది వారి ఇష్టం. కానీ, కొన్నేళ్లుగా అధికార పార్టీ కార్యాల యంలోకి కొన్ని మీడియా సంస్థల ప్రతినిధుల ప్రవేశాన్ని నిషేధించడం ప్రజాస్వామ్యంలో సరైన చర్యేనా? అని గవర్నర్ ఆలోచించాలి. తన ఏలు బడిలోనే జరుగుతున్న ఈ అప్రజాస్వామిక చర్యను గురించి గవర్నర్ మాట్లాడకపోయినా, సరిచేస్తే బాగుండేది. చివరగా, తెలుగుదేశం పార్టీ నాయకుల అసహనం. దానికి పరాకాష్ట ఆ పార్టీ తెలంగాణ రాష్ర్ట కార్యా ద్యక్షుడు రేవంత్రెడ్డి గత బుధవారం విలేకరుల గోష్టిలో చేసిన వ్యాఖ్యలు. వరంగల్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీడీపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన బీజేపీ... రేవంత్రెడ్డిని వెంట పెట్ట్టుకుని ప్రచారం చెయ్యడం ఏమిటని రాసినందుకు ఆయన ఈ కాలమిస్ట్ మీద విరుచుకుపడ్డారు. నిజమే కదా, అంతకు కొద్ది నెలల క్రితమే శాసన మండలి ఎన్నికల్లో అవతల పార్టీ శాసనసభ్యుడికి రూ.50 లక్షలు లంచం ఇవ్వజూపి ఏసీబీకి దొరికిపోయి, జైలుకు వెళ్లి, బెయిల్ మీద బయటున్న వ్యక్తిని వెంట పెట్టుకుని ప్రచారానికి పోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో, అందునా వరంగల్ వంటి చోట ఎక్కువ ఓట్లెలావొస్తాయి? ఆ మాట అన్నందుకు అసహనం, అవాకులు చవా కులూ పేలడమా? ఈ తరహా రాజకీయ నాయకులను ఎవరు కట్టడి చెయ్యాలి? - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
వధువుల పరుగో పరుగు
బ్యాంకాక్: థాయ్ లాండ్లో వధువుల పరుగు పోటీలు ఆకట్టుకున్నాయి. ఇది ఏదో సరదాకోసం జరిగిన పరుగు పోటీలు అనుకుంటే పొరపాటే. ఈ పోటీల్లో విజేతలకు అక్షరాల 27,928 యూఎస్ డాలర్లు(దాదాపు రూ.18.62లక్షలు ) నగదు బహుమతి ఉండటంతో పోటీల్లో పాల్గొన్న వధువులు చాలా సీరియస్గానే ప్రయత్నించారు. అంతేకాకుండా ఈ పోటీల్లో పాల్గొనే వారు తప్పకుండా తమ వెడ్డింగ్ గౌన్లనే ధరించాలనే నిబంధన ఉంది. 'రన్నింగ్ ఆఫ్ ది బ్రైడ్స్' పేరుతో జరిగిన ఈ పోటీల్లో పొడగాటి గౌన్లను ధరించి తమ కాబోయే భర్తలతో కలిసి పరుగెత్తారు. ఎవరైతే ముందుగా లక్ష్యాన్ని చేరుకుంటారో ఆ జంటను విజేతగా ప్రకటిస్తారు. అయితే ఈ పోటీల వేనుక మరోకోణం కూడా ఉంది. ఖరీదైన వివాహా వేడుకలకు అడ్డాగా చేసేందుకు, బ్యాంకాక్ ఇలాంటి పోటీలతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. బ్యాంకాక్ టూరిజం ఆథారిటీ తెలిపిన లెక్కల ప్రకారం బ్యాంకాక్లో ఖరీదైన వివాహాలు చేసుకునే దేశాల్లో భారత్ ముందంజలో ఉంది. -
రేసు మొదలైంది
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఉప ఎన్నిక విజయోత్సవం టీఆర్ఎస్లో తొణికసలాడుతోంది. దూకుడు మీద ఉన్న ఆ పార్టీ నేతలు ఎమ్మెల్సీ బరిలో దిగడానికి తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు. ఒక స్థానానికి అభ్యర్థి దాదాపు ఖరారు కాగా, రెండో అభ్యర్థిని ఖ రారు చేయడం అధికారపార్టీకి తలనొప్పిగా మారింది. ఆశావహుల జాబితా చాంతాడును తలపిస్తుండడంతో అభ్యర్థి ఖరారుపై అచితూచి వ్యవహరించాలని గులాబీ నాయకత్వం భావిస్తోంది. నరేందర్రెడ్డికి గ్రీన్సిగ్నల్ దక్కడంతో రెండో స్థానాన్ని బీసీలకు కేటాయిస్తారనే ప్రచారం ఊపుందుకుంది. ఈక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన శంభీపూర్ రాజు టికెట్ రేసులో ముందంజలో ఉన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై కేటీఆర్ ఇదివరకే హామీ ఇచ్చినందున.. టికెట్ ఖాయమనే భావన ఆయనలో వ్యక్తమవుతోంది. మరోవైపు రాజు అభ్యర్థిత్వానికి మంత్రి మహేందర్ కూడా సుముఖంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. శేరిలింగంపల్లికి చెందిన రాగం నాగేందర్ యాదవ్ కూడా టికెట్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని వేడుకున్న రాగం.. తాజాగా మరోసారి సీఎంను కలిశారు. సామాజిక సమతుల్యతలో భాగంగా తనకు అవకాశం కల్పించకపోతే మహిళా కోటాలో భార్య సుజాతకు ఛాన్స్ ఇవ్వాలని అభ్యర్థించారు. ఇదిలావుండగా, సీనియర్ నేత హరీశ్వర్రెడ్డి కూడా ఎమ్మెల్సీ స్థానంపై కన్నేశారు. ఈ క్రమంలో ఇప్పటికే లాబీయింగ్ మొదలుపెట్టిన ఆయన సీఎంను కలిసి మరోసారి అంతరంగాన్ని వె ల్లడించాలని భావించారు. బుధవారం బిజీ షెడ్యూల్ కారణంగా సీఎం కలవకపోవడంతో ఆయ న వెనుదిరిగారు. మరోవైపు ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన సామల వెంకటరెడ్డి కూడా మండలి సీటుపై గంపెడాశ పెట్టుకున్నారు. కేసీఆర్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగిఉండడం తనకు కలిసివస్తుందని ఆశిస్తున్న ఆయన బుధవారం యువనేత కేటీఆర్తో భేటీ అయి మనసులోని మాటను మరోసారి ముందుంచారు. వీరేకాకుండా చల్లా మాధవరెడ్డి తదితరులు టికెట్ కోసం తెరవెనుక ప్రయత్నాలను సాగిస్తున్నారు. డైలమాలో కాంగ్రెస్ స్థానిక సంస్థల్లో సాంకేతికంగా అత్యధిక సీట్లు కలిగిఉన్న కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడింది. వరంగల్ పరాజయంతో తేరుకోని ఆ పార్టీకి మండలి ఎన్నికలు సవాల్గా పరిణమించాయి. గెలుపుమాట దేవుడెరుగు బరిలో అభ్యర్థులెవరనే అంశంపై తేల్చుకోలేక పోతోంది. కొన్నాళ్ల క్రితం అంగ, ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థులను పోటీలోకి దించాలని భావించిన కాంగ్రెస్ తాజా పరిణామాలు ఆశనిపాతంగా మారాయి. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, సుధీర్రెడ్డిలు పోటీకి ససేమిరా అంటుండడంతో కొత్త అభ్యర్థులను వెతుకుతోంది. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్కు 280 మంది సభ్యులున్నారు. టీడీపీకి 165, బీజేపీ 59 మంది సభ్యులున్నారు. వీరి మద్దతు కూడగడితే జిల్లాలో బోణీ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే, ఎన్నికల అన ంతరం వీరిలో పలువురు గులాబీ గూటికి చేరడంతో సంఖ్యా బలంపై అంచనా తప్పింది. ఈ నేపథ్యంలో టీడీపీ, బీజేపీతో అంతర్గత ఒప్పందం చేసుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. ఫలితంగా చెరొక అభ్యర్థిని బరిలో దించే అంశాన్ని పరిశీలిస్తోంది. పోటీకి సీనియర్లు అనాసక్తి చూపుతున్న తరుణంలో కందుకూరు జెడ్పీటీసీ సభ్యుడు ఏనుగు జంగారెడ్డి అభ్యర్థిత్వానికి మొగ్గుచూపుతోంది. రెండో అభ్యర్థిగా ధారాసింగ్ను పోటీచేయిస్తే ఎలా ఉంటుందనే కోణంలో ఆలోచిస్తోంది. మరోవైపు టీడీపీ తరుఫున శ్రీనివాస్రెడ్డి, సామ భూపాల్రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే, టీఆర్ఎస్ రెండో అభ్యర్థిపై స్పష్టత వచ్చిన అనంతరం వ్యూహాలకు పదునుపెట్టాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. అభ్యర్థి బల బలాలను బేరీజు వేసుకున్న తర్వాతే ఒక నిర్ణయానికి రావాలని ఆ పార్టీ ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్లు గురువారం ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. -
మారథాన్లో కెన్యా వాసుల సందడి
-
అధ్యక్ష ఎన్నికల బరిలో హిల్లరీ క్లింటన్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సతీమణి హిల్లరీ క్లింటన్ పోటీపై ఎట్టకేలకు అధికారికంగా ఒక స్పష్టమైన ప్రకటన వెలువడింది. ఆదివారం అధికారిక ప్రచార వెబ్సైట్లో ఒక వీడియో రిలీజ్ చేశారు. తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాననీ.. అమెరికా వాసులు కోరుకుంటున్న ఛాంపియన్గా నిలవాలనుకుంటున్నానంటూ ఆ వీడియోలో హిల్లరీ పేర్కొన్నారు. దీంతో ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ పోటీపై క్లారిటీ వచ్చింది. దేశ అధ్యక్ష పదవి కోసం పోటీపడాలని హిల్లరీ మొదటిసారి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రెండోసారి ఆ అవకాశాన్ని దక్కించుకున్న హిల్లరీ ఉత్సాహంగా తన ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. దీనికి సంబంధించి న్యూయార్క్లోని బ్లూక్లిన్ హైట్స్ లో ఒక ప్రచార కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. త్వరలో హిల్లరీ ఓటర్లను కలుస్తారని, వచ్చే నెలలో ఒక ర్యాలీని నిర్వహించనున్నట్లు హిల్లరీ ప్రచార మేనేజర్ జాన్ పొడెస్తా వెల్లడించారు. -
ధూమ్ 4
-
రేస్ ఇలా...
బర్డ్వాచర్స్ అంతా ఒకచోటికి చేరి నలుగురేసి చొప్పున బృందాలుగా విడిపోతారు. హైదరాబాద్ చుట్టూ 60 కిలోమీటర్ల పరిధిలో పక్షి జాతులను చూసేందుకు కారులో వెళతారు. లాగ్ బుక్లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఏఏ పక్షులు చూశారో రాయాలి. చీకటి పడే సమయానికి స్టార్టింగ్ పాయింట్లో అంతా కలుస్తారు. అనుభవాలు షేరు చేసుకుంటారు. ఎక్కువ పక్షులు లెక్కించినవారిని సన్మానిస్తారు. ప్రస్తుతం నగరంలో 300 మంది బర్డ్ వాచర్స్ ఉన్నారు. ఒకవేళ కారు లేకున్నా నో ప్రాబ్లమ్. ఏదో కారులో చోటు కల్పిస్తారు. ఎవరైనా పాల్గొనవచ్చు. ఎంట్రీ ఉచితం. ఆదివారం ఉదయం ఏడు గంటలకు రేస్ మొదలవుతుంది. స్టార్టింగ్ పాయింట్: బేగంపేట గ్రీన్ల్యాండ్స్ ఎదురుగా ఉన్న హోటల్ ది ప్లాజా వద్దకు చేరుకోవాలి. రేస్ ముగిసిన తరువాత మళ్లీ అంతా ఇక్కడే మీట్ అవ్వాలి. వివరాలకు ఫోన్: షఫత్: 849229552 సురేఖ: 9949038532 -
పీపుల్స్ చాయిస్ అవార్డు రేసులో భువనేశ్వర్
దుబాయ్: భారత పేసర్ భువనేశ్వర్ ప్రతిష్టాత్మక పీపుల్స్ చాయిస్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. తనతో పాటు ఈ అవార్డు కోసం దక్షిణాఫ్రికా పేసర్ స్టెయిన్, ఏంజెలో మాథ్యూస్ (శ్రీలంక), మిచెల్ జాన్సన్ (ఆసీస్), చార్లెట్ ఎడ్వర్డ్స్ (ఇంగ్లండ్ మహిళా జట్టు కెప్టెన్) రేసులో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు తమ ఓటింగ్ ద్వారా విజేతను ఎన్నుకోవచ్చు. అలాగే ఐసీసీ ఉత్తమ టెస్టు, వన్డే జట్లతో పాటు ఇతర ఐసీసీ అవార్డుల షార్ట్ లిస్ట్ జాబితాను నవంబర్ 4న వెల్లడించనున్నారు. -
యూఎస్కు హైదరాబాద్ విద్యార్థుల రేసు
హూస్టన్: ఉన్నత విద్య కోసం అమెరికాకు పరుగులు పెడుతున్న మనదేశ విద్యార్థుల్లో హైదరాబాద్కు చెందినవారే ఎక్కువగా ఉన్నారట. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది. న్యూఢిల్లీ, ముంబైలను కలిపి లెక్కించినా హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లేవారి సంఖ్యే ఎక్కువగా ఉన్నట్టు బ్రూకింగ్స్ ఇన్ స్టిట్యూషన్ ఇటీవలి అధ్యయనం వెల్లడించింది. 2008 నుంచి 2012 మధ్య కాలంలో అమెరికా కాలేజీలకు, యూనివర్సిటీలకు విద్యార్థులను పంపినవాటిలో సియోల్, బీజింగ్, షాంగైల తర్వాతి స్థానంలో హైదరాబాద్ నగరం నిలిచింది. ఐదో స్థానంలో రియూద్ ఉంది. హైదరాబాద్ నుంచి 26,220 మంది విద్యార్థులు (ఎఫ్1 వీసా) వెళ్లగా, మన దేశంలో హైదరాబాద్ తర్వాతి స్థానంలో ఉన్న ముంబై నుంచి 17,294 మంది వెళ్లారు. హైదరాబాద్ జంట నగరం సికింద్రాబాద్తో పాటు విజయవాడ, విశాఖపట్నం కూడా బ్రూకింగ్స్ జాబితా లో చోటు సంపాదించుకున్నారుు. ముంబై, న్యూఢిల్లీ వంటి నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్ విద్యార్థులను చేర్చుకుంటున్న కొన్ని విద్యాసంస్థలు అంత సుపరిచితమైనవి కావని కూడా అధ్యయనం వెల్లడించింది. -
రేస్
-
‘ప్రధాని’ పోరు... మోడీ జోరు
మోడీ పోటీదారులు రాహుల్గాంధీలాగా బలహీనులు, నితీశ్కుమార్లాగా ఏకాకులు. లేదంటే ముగ్గురు ప్రాంతీయ నేతలు మమతాబెనర్జీ, జయలలిత, మాయావతి లాగా ఇంకా ఎటూ తేల్చుకోనివారు. బీజేపీయేతర కూటమికి ప్రత్యామ్నాయ అయస్కాంతం కాగలిగే పార్టీ కాంగ్రెస్ తప్ప మరేదీ లేదు. ఆగ్రహం ఒక బలీయమైన ఆయుధం. ఎన్నికల ప్రకటనలకార్యక్రమం కోసం బీజేపీ ఏర్పాటు చేసిన అతుకుల బొంత కమిటీలన్నీ ఆ ప్రాథమిక తార్కిక ప్రమేయంపైన కచ్చితంగా ఆధారపడినవే . అయితే అవధులు దాటిన ఆగ్రహం మాత్రం ప్రతికూల ఫలితాలనిస్తుంది. స్వరాన్ని కొద్దిగా పెంచడానికి, ఒళ్లు మరచి సమతూకాన్ని కోల్పోడానికి మధ్య చాలా తేడా ఉంది. హాస్యం రాజకీయరంగంలో గిలిగింతలు పెట్టే ప్రాంతం. అది ఒక జాతీయ పార్టీ ప్రచార కార్యక్రమం ఆ పరిధిలోకి ప్రవేశించడం ఇదే మొదటిసారి. భీతావహులైన ఇద్దరు స్త్రీ, పురుషులపై ఆధారపడ్డ రెండు ప్రకటనలు వెలువడ్డాయి. మోడీ ఢిల్లీ దారి పట్టడాన్ని చూసి అవినీతి, అధిక ధరలుగా మూర్తీభవించిన ఆ ఆడ, మగ భయపడి దేశం విడిచి విదేశాలకు పారిపోతుంటారు. చాలా చక్కగా ఉంది. హాస్యం అంటువ్యాధిలాంటిది. ఇంటర్నెట్ లేదా ఎస్సెమ్మెస్ సందేశాల ప్రపంచంలో అలా విహరించి చూస్తే అది రుజువవుతుంది. ఒకప్పటి, పురాతన, మొబైల్ ఫోన్ పూర్వ కాలంలో మార్క్సిస్టులు గోడల నిండా చక్కటి కార్టూన్లు గీసేవారు. ఎన్నికల కమిషన్ ఆ ప్రచార కార్యక్రమాన్ని నిజంగానే తుడిచిపారేసింది. ఎర్ర కార్టూన్ ఏడ్చుకుంటూ అస్తిత్వంలోంచి తప్పుకుంది. నవ్వుకు ఔషధ గుణం ఉంది. సూచించిన చికిత్సకు తోడు అది కొంత నెమ్మదిని కలుగజేస్తుంది. వీధుల్లోని హింసను తట్టుకొని ప్రభుత్వాలు నిలబడగలవు. నిర్దాక్షిణ్యంగా పొట్టలోని పేగులను బయటకులాగేలా చేసే టీ కొట్టు యజమాని హాస్యాన్ని మాత్రం తట్టుకోలేవు. హాస్యోక్తి మహా వాడి. ధర్మోపన్యాసమేదీ సందేశాన్ని అంత కంటే ఎక్కువ సమర్థవంతంగా నాటుకునేట్టు చేయలేదు. ఉపదేశాలు ఓటర్లను ఆవలింతల ప్రపంచంలోకి పంపేస్తాయి. అధ్వానమైన యూపీఏ పాలన మార్పును జాతీయ ఆవశ్యకతగా మార్చింది. ఆ మార్పు మోడీయే అనే సందేశంలో ఎలాంటి గందరగోళమూ లేదు. అదే ఆయనకున్న అనుకూలత. ఆయన వెనుక నిలవాలనుకునే మిత్రుల బారు పెరుగుతూనే ఉంది. వారికి ఆయన ఇచ్చే సందేశం ఒక్కటే... చెప్పిన చోట సంతకం చేయడమే. మోడీ పోటీదారులు రాహుల్గాంధీలాగా బలహీనులు, నితీశ్కుమార్లాగా ఏకాకులు. లేదంటే ముగ్గురు ప్రాం తీయ నేతలు మమతాబెనర్జీ, జయలలిత, మాయావతి లాగా ఇంకా ఎటూ తేల్చుకోనివారు. రాహుల్ను వెలుగులోకి తేవడానికి కాంగ్రెస్ రూ.750 కోట్లు ఖర్చుపెడుతోంది. కానీ ప్రజా జీవితంలోని అత్యంత కష్టభరితమైన బాధ్యతకు తమ నాయకునికున్న అర్హతల విషయంలో వారిలో అనిశ్చితి ఉంది. అసలు సాధించినదంటూ ఏదీ లేకుండానే ఉన్నట్టు నమ్మించలేరు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో మమతాబెనర్జీ, జయలలిత, మాయావతి వ్యక్తిగతంగా పోటీకి సైతం దిగడం లేదు. అలా అని అదేమీ ప్రధాని పదవి కోసం చెంచాలో గుడ్డును పెట్టుకొని పరుగెత్తే పోటీలోంచి వారిని సాంకేతికంగా తప్పించజాలదు. ప్రమాణ స్వీకారం తర్వాత ఆరు నెలల్లోగా ఎప్పుడైనా పార్లమెంటు సభ్యులు కావొచ్చు. విధి వరించిన నేతగా పీవీ నరసింహారావు ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఆయన పార్లమెంటు సభ్యులు కారు. కెమెరా పరిధికి వెలుపల ఈ ముగ్గురు మహిళలూ వాస్తవికవాదులే. మోడీ గుజరాత్ నుంచి కాక మరో స్థానం నుంచి కూడా అదనంగా పోటీ చేస్తున్నారు. కీలకమైన గంగ-జమున రణరంగంలో ఎన్నికలపరమైన ఉత్సాహాన్ని గరిష్ట స్థాయికి చేర్చడం కోసం ఆయన వారణాసి నుంచి కూడా పోటీ చేస్తున్నారు. అన్ని యుద్ధతంత్రాలకు స్వపక్షపు కాల్పుల్లో చిక్కుకోవడం వల్ల కలిగే నష్టాలు అనే చెప్పరాని కొలబద్ధ ఒకటుంటుంది. ఆధిపత్య స్థానాల కోసం కొట్లాట అత్యంత తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు టికెట్ల పంపిణీ సమయంలో అలాంటి స్వయం కల్పిత గాయాలు భారీగా ఉంటాయి. గాయాలు పతాక శీర్షికలను సృష్టిస్తాయి. ఎన్నికలు ప్రతి స్థాయిలోనూ సంక్లిష్టమైన పోటీయే. అహం గాయపడకుండా పూర్తి రక్షణను కల్పించే ఆయుధాన్ని దేన్నీ ఇంత వరకు కనుగొనలేదు. అయితే, ప్రతి కవాతులోనూ పతకాల ధగధగలతో వెలిగే సైన్యాధిపతులు తీరా యుద్ధం సమీపించే సరికి చిదంబరంలాగా భయంతో వణకడంతో ఈ స్వపక్ష కాల్పులను గందరగోళ పరచకూడదు. ఓటర్ల ముందుకు రావడానికి నిరాకరిస్తున్న కాంగ్రెస్ అత్యున్నత నేత ఆయనొక్కరే కారు. వాస్తవంగా ఒక్కసారి సంఘర్షణ మొదలయ్యాక ఇలాంటి ఘటనలు కనిపించకుండా జారుకుంటాయి. ఎన్నికల్లో తప్ప మరెప్పుడూ నరాలు అంత ఎక్కువ గట్టిగా కిర్రెక్కిపోవు. సూపర్ స్టార్లు సైతం సురక్షితమైన సీటును వెతుక్కుంటారు. నిజానికి వారు వెతుక్కునేది సురక్షితమైన వాతావరణాన్ని. వారి వ్యక్తిగత శక్తిసామర్థ్యాలు లేదా అంతస్సారాన్ని బట్టి విభిన్నమైన అంశాలపై ఆధారపడి ఆ వాతావరణం ఉంటుంది. ప్రజాస్వామ్యం అంటేనే అనిశ్చితితో కూడిన వ్యవస్థ. అదే దానిలోని అందమూ, బలమూను. ఓటరు చిత్తం తిరిగిందంటే 1977లో జరిగినట్టుగా ఇందిరాగాంధీ రాయ్బరేలీలో ఓడిపోవచ్చు. అత్యంత దక్షులనిపించుకున్న అనుభవజ్ఞులు సైతం క్షేత్ర స్థాయిలోని ప్రకంపనలను తప్పుగా గ్రహించవచ్చు. 2009లో లాలూ ప్రసాద్యాదవ్ శరాన్ నుంచి ఓడిపోయాననే అనుకున్నారు. బీమాగా ఉంటుందని పాటలీపుత్రకు పరుగెత్తారు. తీరా చూస్తే శరాన్ నుంచి గెలిచి, పాటలీపుత్రలో ఓడారు. తమిళనాడులాంటి రాష్ట్రంలో బీజేపీ ఓట్లు కాంగ్రెస్ స్థాయిలకు పెరుగుతూ ఇంకా గరిష్ట స్థాయికి చేరుకోనప్పుడు ఉపరితలంలోని ఎత్తులు పై ఎత్తులకు దిగువ అసాధారణమైనదేదో జరుగుతుంటుంది. ఎవరు ఎన్ని స్థానాలు గెలుస్తారు అనే దానితో నిమిత్తం లేకుండా ఒక విషయం స్పష్టమౌతోంది. దేశవ్యాప్తంగా మోడీ ఓట్లు పెరుగుతుండగా, కాంగ్రెస్ కుచించుకుపోతోంది. మోడీ అవకాశాలను దెబ్బతీయగల చివరి అంశంగా ‘ఆప్’ను ప్రోత్సహించారు. కానీ అది తనను సృష్టించిన వాడిపైకే ఎదురు తిరిగిన డాక్టర్ ఫ్రాంకిన్స్టీన్ యంత్రాన్ని గుర్తుకు తెస్తోంది. ముస్లింలు ఆప్ వేపు తిరిగితే, బీటలు వారుతున్న కాంగ్రెస్ మొత్తంగానే తుడిచిపెట్టుకుపోతుంది. ముస్లింల మద్దతు తమకు లభించినట్టేనని అనుకోడానికి లేదని కాంగ్రెస్ అభ్యర్థులు ఇప్పటికే గ్రహిస్తున్నారు. కట్టలు తెగిన అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం ఆప్ విశ్వసనీయతలో కొంత భాగాన్ని ఇప్పటికే హరించేసింది. కానీ సమస్య అంతకంటే ఎక్కువ సూక్ష్మమైనది. బీజేపీయేతర కూటమికి ప్రత్యామ్నాయ అయస్కాంతం కాగలిగే పార్టీ కాంగ్రెస్ తప్ప మరేదీ లేదు. ఆప్ రాత్రికి రాత్రే కాంగ్రెస్ కాలేదు. కేజ్రీవాల్ ఎత్తుగడలు పాదరసం లాంటివే. కానీ వాటికున్న అస్థిరత అనే లక్షణాన్ని 2014లో ఓటర్లు కోరుకోవడం లేదు. ఓటరుదే చివరి నవ్వు కావడమే ఎల్లప్పుడూ ఎన్నికల సమయపు హాస్యంలోని అత్యుత్తమ అంశం. బైలైన్: ఎంజే అక్బర్ (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) -
హైదరాబాద్లో అర్థరాత్రి బైక్ రేస్లు
-
పది టన్నుల బరువున్న ట్రక్లతో రేస్