Rajapaksa
-
SL vs WI: శ్రీలంక జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్లపై వేటు!
వెస్టిండీస్తో స్వదేశంలో జరగనున్న టీ20 సిరీస్కు 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. ఈ సిరీస్కు లంక స్టార్ ప్లేయర్లు దాసున్ షనక, దుష్మంత చమీరా దూరమయ్యారు. ఈ ఏడాది జూలైలో భారత్తో జరిగిన టీ20 సిరీస్లో వీరిద్దరూ భాగమయ్యారు. గత సిరీస్లో ఈ సీనియర్ ఆటగాళ్లు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ఈ క్రమంలోనే వారిని సెలక్టర్లు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు ఏడాది తర్వాత మిడిలార్డర్ బ్యాటర్ భనుక రాజపాక్సకు లంక సెలక్టర్లు పిలుపునిచ్చారు.ఈ జట్టుకు స్టార్ ఆల్రౌండర్ అసలంక సారథ్యం వహించనున్నాడు. ఆక్టోబర్ 13 నుంచి దంబుల్లా వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ మూడు మ్యాచ్ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం విండీస్ ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది.శ్రీలంక టీ20 జట్టు: చరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కుసాల్ మెండిస్, కుసల్ పెరీరా, కమిందు మెండిస్, దినేష్ చండిమాల్, అవిష్క ఫెర్నాండో, భానుక రాజపక్స, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, దునిత్ వెల్లలాగే, జెఫ్రీ వాండర్స్, చైమీ వాండర్సే మతీషా పతిరానా, బినూర ఫెర్నాండో, అసిత ఫెర్నాండో. -
Rajiv Gandhi Case: ఆ ఫొటోగ్రాఫర్ ఇంట్లో దొరికిన రసీదే.. హంతకులను తెరపైకి తెచ్చిందా?!
లంక పరిణామాలు మన దేశంలో భారీ మార్పులు తీసుకువచ్చాయి. ప్రభాకరన్ను లంక సైన్యం మట్టుపెట్టడం, ఎల్టీటీఈ తన శ్రేణులన్నీ కోల్పోవడంతో జాఫ్నాతో పాటు ఉత్తర ప్రాంతమంతా లంక సైన్యం ఆధీనంలోకి వచ్చింది. అంతర్యుద్ధం ముగిసిందని అప్పటి అధ్యక్షుడు రాజపక్సే ప్రకటించారు. లంకలో తమిళుల ప్రాభవం వేగంగా కోల్పోవడంతో ఇక్కడ ఖైదీల మీద వీపరీతంగా సానుభూతి పెరిగింది. ఈలోగా జైల్లో ఉన్న ఏడుగురు ఖైదీలు తమను క్షమించమంటూ అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్కు విజ్ఞప్తి చేశారు. అయితే ప్రతిభా పాటిల్ దీన్ని నిర్దంద్వంగా తోసిపుచ్చారు. ఈ లోగా మరో పిటిషన్ మద్రాస్ హైకోర్టు మెట్లెక్కింది. వాదోపవాదాలు, అప్పటి పరిస్థితుల దృష్ట్యా మద్రాస్ హైకోర్టు ఉరి శిక్షపై స్టే ఆర్డర్ ఇచ్చింది. ఇది ఎల్టీటీఈ ఖైదీలకు పెద్ద ఊరట. ఉరిశిక్ష స్థానంలో యావజ్జీవ శిక్షను సూచించింది సుప్రీంకోర్టు. ఈలోగా రాజీవ్ గాంధీ కుటుంబానికి తమిళుల వినతులు వెల్లువెత్తాయి. నేరుగా రాజీవ్ కూతురు ప్రియాంక, కొడుకు రాహుల్ గాంధీ నేరస్థులను జైల్లో కలిశారు. పరిస్థితి ఎందాక వెళ్లిందంటే మొత్తం సమాజం నేరస్థులను క్షమించారా అన్నంత చర్చకు దారి తీసింది. ఈలోగా తమిళనాడు సీఎం జయలలిత ఓ అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. 23ఏళ్లకు పైగా జైల్లో ఉన్న అందరూ ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది ఢిల్లీలో సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. దేశానికి అత్యున్నత పదవుల్లో ఒకటయిన ప్రధానిగా పని చేసిన రాజీవ్గాంధీ హత్యకు గురయితే, దానికి కారకులను ఓ రాష్ట్రం ఎలా విడిచిపెడతారన్న చర్చ జరిగింది. ఇదే విషయం సుప్రీంకోర్టు ముందుకొచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలుత తమిళనాడు నిర్ణయంపై స్టే విధించిన సర్వోన్నత న్యాయస్థానం.. జయ సర్కారు నిర్ణయాన్ని తప్పుబట్టింది. రాజీవ్ హంతకుల విడుదలపై నిర్ణయం తీసుకునే హక్కు తమిళనాడు ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పింది. ముగ్గురు న్యాయమూర్తుల డివిజన్ బెంచ్ తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. జైల్లో నుంచి బయటపడతామని కోటి ఆశలు పెట్టుకున్న ఎల్టీటీఈ ఖైదీలు సుప్రీం తీర్పుతో నిరాశకు గురయ్యారు. అయితే వారిలో ఆశ మాత్రం చావలేదు. దానికి కారణం తమిళులు, వారి రాజకీయాలు. చదవండి: (రాజీవ్ హత్య.. సినిమాను మించే ట్విస్ట్లు.. అసలు ఆనాడేం జరిగింది?) నాడు రాజీవ్ హంతకులను పట్టుకోవడానికి కార్తికేయన్ సారధ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. విచిత్ర పరిస్థితుల మధ్య పలు రకాల అవాంతరాల నడుమ సిట్ పట్టువదలకుండా దర్యాప్తు కొనసాగించింది. విమర్శలు వచ్చినా, సమస్యలు ఎదురైనా ఢీలా పడకుండా విచారణ సాగించిన సిట్ ఈ దారుణానికి పాల్పడింది ఎల్టీటీఈ అని తేల్చింది. ఫోటోగ్రాఫర్ హరిబాబు ఇంట్లో దొరికిన రసీదును ఆధారంగా చేసుకొని తీగ లాగిన సిట్.. హంతకుల పేర్లను తెరపైకి తెచ్చింది. 1991.. దేశమంతటా అస్థిర వాతావరణం నెలకొన్న సమయం. కేంద్రంలో ప్రభుత్వాలు ఒకదాని వెంట ఒకటి కూలిపోయిన తరుణం. అలాంటి సమయంలో లోక్సభకు ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రచార భారం రాజీవ్గాంధీపై పడింది. అప్పటికే దేశమంతా తిరుగుతున్న ఆయన ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకల్లో ప్రచారంపై దృష్టి పెట్టిన ఆయన అందుకు తగినట్లుగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. 1991, మే 20 నుంచి 22 వరకు ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకల్లో ప్రచారం ముగించుకొని 22 సాయంత్రం వరకైనా రాజీవ్ ఢిల్లీకి చేరుకోవాలి. ఇదీ ప్లాన్. ఆంధ్రప్రదేశ్ పర్యటన వరకు అన్నీ అనుకున్న ప్రకారం జరిగాయి. కానీ 21న పరిస్థితి మొత్తం మారిపోయింది. -
లంకలో నిరసనలకు తెర
కొలంబో: శ్రీలంకలో చరిత్రలోనే అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభానికి కారకులైన రాజపక్స కుటుంబ పాలనపై ఆగ్రహంతో వెల్లువెత్తిన దేశవ్యాప్త నిరసనలు ఎట్టకేలకు సద్దుమణిగాయి. రాజధానితో పాటు పలుచోట్ల ఏర్పాటైన నిరసన శిబిరాలను ఆందోళనకారులు మంగళవారం నాటికి పూర్తిగా ఖాళీ చేసి వెళ్లిపోయారు. దాంతో 123 రోజుల ఆందోళనలకు తాత్కాలికంగా తెర పడ్డట్టయింది. మరోవైపు, నిరసనకారుల ప్రధాన డిమాండ్లలో ఒకటైన అధ్యక్షుని అధికారాలకు కత్తెర వేసే రాజ్యాంగ సవరణ బిల్లును ప్రభుత్వం బుధశారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఇది ఆమోదం పొందితే స్వతంత్ర ఎన్నికల సంఘం సభ్యులు, అవినీతి విచారణ అధికారులు, పోలీస్ తదితర ఉన్నతోద్యోగుల నియామకాధికారం అధ్యక్షుడి నుంచి రాజ్యాంగ మండలికి దఖలు పడుతుంది. -
Gotabaya Rajapaksa: సింగపూర్లో ‘గొటబయ’కు ఊహించని షాక్..!
సింగపూర్: శ్రీలంక మాజీ అధ్యక్షుడు, ప్రజాగ్రహంతో దేశం విడిచిన గొటబయ రాజపక్స ప్రస్తుతం సింగపూర్లో తలదాచుకుంటున్నారు. అయితే.. అక్కడా ఊహించని షాక్ తగిలింది. దక్షిణాఫ్రికాకు చెందిన ఓ ప్రజాహక్కుల గ్రూప్ గొటబయపై క్రిమినల్ కేసు పెట్టింది. యుద్ధ నేరాల ఆరోపణలతో గొటబయను అరెస్ట్ చేయాలంటూ.. సింగపూర్ అటార్నీ జెనరల్కు 63 పేజీల ఫిర్యాదును అందజేశారు ఇంటర్నేషనల్ ట్రూత్ అండ్ జస్టిస్ ప్రాజెక్ట్(ఐటీజేపీ) న్యాయవాదులు. 2009లో జరిగిన అంతర్యుద్ధం సమయంలో రక్షణ మంత్రిగా ఉన్న రాజపక్సే.. జెనీవా ఒప్పందాలను తీవ్రంగా ఉల్లంఘించారని పిటిషన్లో పేర్కొన్నారు. అవి అంతర్జాతీయ న్యాయపరిధిలో భాగంగా సింగపూర్ దేశీయ ప్రాసిక్యూషన్కు లోబడిన నేరాలుగా పేర్కొన్నారు. పిటిషన్ ప్రకారం.. అంతర్యుద్ధం సమయంలో అంతర్జాతీయ మానవహక్కుల చట్టం, అంతర్జాతీయ క్రిమినల్ చట్టాలను గొటబయ ఉల్లంఘించారు.‘అందులో హత్య, ఉరి తీయించటం, వేధించటం, అమానవీయంగా కొట్టటం, అత్యాచంర, ఇతర లైంగిక వేధింపులు, స్వేచ్ఛను హరించటం, మానసికంగా క్షోభకు గురిచేయంట వంటివి ఉన్నాయి. ఆర్థిక మాంద్యంతో ప్రభుత్వం పతనాన్ని చూసింది, అయితే శ్రీలంకలో సంక్షోభం నిజంగా మూడు దశాబ్దాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం క్రితం జరిగిన తీవ్రమైన అంతర్జాతీయ నేరాలతో ముడిపడి ఉంది. ఈ ఫిర్యాదు కేవలం అవినీతి, ఆర్థిక అవకతవకల గురించే కాదు.. తీవ్ర నేరాలకు బాధ్యత వహించాలని నమోదు చేశాం.’ అని ఐటీజేపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యోస్మిన్ సూకా పేర్కొన్నారు. గొటబయ రాజపక్సను అరెస్ట్ చేసి యుద్ధ నేరాలపై దర్యాప్తు చేపట్టాలని కోరింది ఐటీజేపీ. 1989లో ఆయన ఆర్మీ కమాండర్గా ఉన్నప్పుడు.. సుమారు 700 మంది కనిపించకుండా పోయారని ఆరోపించింది. ముఖ్యంగా రక్షణ శాఖ సెక్రెటెరీగా ఉన్నప్పుడు ఆ నేరాలు మరింత పెరిగాయని తెలిపింది. తన కింది అధికారులకు టెలిఫోన్ ద్వారా నేరుగా ఆదేశాలు ఇచ్చి ప్రజలపై దాడి చేయించే వారని ఆరోపించింది. ఇదీ చదవండి: కారుతో ఢీకొట్టి చోరీకి పాల్పడిన దుండగులు.. వీడియో వైరల్! -
శ్రీలంక: రాజపక్స కుటుంబానికి బిగ్ షాక్
కోలంబో: ఆర్థికంగా లంకను దిగజార్చి తీవ్ర సంక్షోభంతో.. ఆపై రాజకీయ సంక్షోభంతో ప్రజానిరసనలతో అట్టుడికిపోయేలా చేసిన రాజపక్స కుటుంబానికి భారీ షాక్ తగిలింది. మాజీ ప్రధాని మహీంద రాజపక్స, సోదరుడు బాసిల్ రాజపక్సలను, వాళ్ల వాళ్ల కుటుంబ సభ్యులను దేశం విడచి వెళ్లరాదని దేశ అత్యున్నత న్యాయస్థానం నిషేధాజ్ఞలు జారీ చేసింది. ఇప్పటికే రాజపక్స సోదరుడు, మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స ‘రాజీనామా’ భయంతో దేశం విడిచిపారిపోయాడు. ఆపై సింగపూర్ చేరుకున్నాక అక్కడి నుంచి స్పీకర్కు రాజీనామా లేఖ పంపారు. దీంతో ఇవాళ లంక ప్రధాని రణిల్ విక్రమసింఘే.. తాత్కాలిక అధ్యక్షుడిగా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. చీఫ్ జస్టిస్ జయనాథ జయసూర్య దగ్గరుండి మరీ ప్రమాణం చేయించారు. అక్కడి రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్షుడు గనుక రాజీనామా చేస్తే ప్రధాని పదవిలో ఉన్నవాళ్లు అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. #WATCH | Ranil Wickremesinghe sworn in as Acting-President a short while ago by Sri Lankan Chief Justice Jayantha Jayasuriya#SriLanka pic.twitter.com/odjNmfd4cf — ANI (@ANI) July 15, 2022 ఇప్పటికే గోటబయ దేశం విడిచి వెళ్లారని, కాబట్టి మహీంద బాసిల్లు జులై 28 వరకు దేశం విడిచి వెళ్లరాదని, ఒకవేళ తప్పనిసరి వెళ్లాల్సి వస్తే కోర్టు అనుమతి తప్పనిసరి అని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. సరిగ్గా తీవ్ర నిరసనల నడుమే ప్రధాని హోదాలో కుటుంబంతో సహా దేశం విడిచి పారిపోవాలని ప్రయత్నించిన మహీంద రాజపక్స.. చివరకు రాజీనామా చేసి అక్కడే అజ్ఞాతంలో ఉండిపోయారు. కొత్త కేబినెట్ గనుక కొలువుదీరితే మాత్రం.. అవినీతి, ఇతరత్ర ఆరోపణలపై రాజపక్స కుటుంబం విచారణ.. రుజువైతే కఠిన శిక్షలు పడే అవకాశం ఉంది. Sri Lanka's Supreme Court today issued an interim order preventing former Prime Minister Mahinda Rajapaksa and former Minister Basil Rajapaksa from leaving the country without the court's permission until July 28th: Sri Lanka's DailyMirror (File photos) pic.twitter.com/xg290lfmLX — ANI (@ANI) July 15, 2022 కుటుంబ పాలనతో ద్వీప దేశాన్ని సర్వనాశనం చేశారని రాజపక్స కుటుంబంపై విమర్శలు గుప్పిస్తున్నారు లంక ప్రజలు. గోటబయ రాజపక్స(72) శ్రీలంకకు అధ్యక్షుడిగా, అతని అన్న మహీంద రాజపక్సా ప్రధానిగా, మరో సోదరుడు బసిల్ రాజపక్సా ఆర్థిక శాఖను, పెద్దన్న చామల్ రాజపక్సా వ్యవసాయ శాఖ మంత్రిగా, మరో బంధువు నమల్ రాజపక్సా క్రీడాశాఖ మంత్రిగా కీలక పదవులను నిర్వహించారు. -
మాల్దీవుల్లో ‘గొటబయ’కు నిరసనల సెగ.. మళ్లీ ఏ దేశం వెళ్తారో?
మాలే: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ప్రజాగ్రహంతో అట్టుడుకుతోంది శ్రీలంక. ఆందోళనల నేపథ్యంలో అధ్యక్షుడు గొటబయ రాజపక్స కుటుంబంతో సహా బుధవారం వేకువజామునే దేశం విడిచి మాల్దీవులకు పారిపోయారు. అయితే.. అక్కడ కూడా గొటబయకు నిరసనల సెగ తగిలింది. పదుల సంఖ్యలో అక్కడి శ్రీలంక పౌరులు ఆందోళన చేపట్టారు. గొటబయకు మాలే ఒక సురక్షితమైన ప్రాంతం కాకూడదని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలపాలని అక్కడి ప్రజలను కోరారు. శ్రీలంక జాతీయ జెండాలు, ప్లకార్డులతో రాజపక్సకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు నిరసనకారులు. ' ప్రియమైన మాల్దీవుల స్నేహితులారా.. క్రిమినల్స్కు ఈ ప్రాంతం సురక్షితమైనదిగా మారకుండా మీ ప్రభుత్వానికి తెలియజేయండి' అని బ్యానర్ ప్రదర్శించారు. మరోవైపు.. మిలిటరీ విమానంలో వెలనా అంతర్జాతీయ విమానంలో దిగిన రాజపక్సకు వ్యతిరేకంగా కొందరు నినాదాలు చేస్తున్న వీడియోలను మాల్దీవులకు చెందిన మీడియాలు ప్రసారం చేశాయి. అలాగే.. మాలేలోని కృత్రిమ బీచ్ ప్రాంతంలో పలువురు శ్రీలంక పౌరులు నిరసనలు చేపట్టగా.. పోలీసులు వారిని చెదరగొట్టారు. సింగపూర్కు గొటబయ..! శ్రీలంక నుంచి పరారై మాల్దీవులకు చేరిన అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఓ విలాసవంతమైన రిసార్ట్లో తలదాచుకున్నట్లు స్థానిక మీడియాలు వెల్లడించాయి. అక్కడి నుంచి యూఏఈ లేదా సింగపూర్కు వెళ్లే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. 'ఆయన రెండు దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. అయితే.. ఆ దేశాల్లోనూ శ్రీలంక పౌరులు ఉన్నందున భద్రతాపరమైన సమస్యలు తలెత్తనున్నాయి.' అని శ్రీలంకకు చెందిన భద్రతా విభాగం అధికారి ఒకరు తెలిపారు. గొటబయ రాజపక్సను దేశంలోకి అనుమతించటాన్ని వ్యతిరేకించింది మాల్దీవులకు చెందిన ప్రతిపక్ష ప్రోగ్రెసివ్ పార్టీ. రాజపక్సను అనుమతించటం ద్వారా శ్రీలంకలోని తమ స్నేహితులకు ద్రోహం చేస్తున్నామని పీపీఎం నేత ఒకరు పేర్కొన్నారు. మరోవైపు.. ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. శ్రీలంక పౌరులు మాల్దీవుల్లోని విద్య, ఆరోగ్య, ఆతిథ్య రంగాల్లో పని చేస్తుండగా.. మాల్దీవుల పౌరులు సైతం పెద్ద సంఖ్యలోనే శ్రీలంకలో ఉన్నారు. ఇదీ చూడండి: Gotabaya Rajapaksa: దేశం విడిచిన లంకాధ్యక్షుడు.. అంతా ఇండియానే చేసిందని వదంతులు.. హైకమిషన్ రియాక్షన్ ఏంటంటే? -
చరిత్ర వింతల్లో ఇదొకటి!
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా ‘బాంగ్బాంగ్’ మార్కోస్ ఎన్నికవడం మామూలుగానైతే పెద్ద విశేషం కాదు. కానీ ఆయన ఆ దేశపు నియంత, అత్యంత క్రూరమైన పాలకుడిగా పేరుమోసిన ఫెర్డినాండ్ మార్కోస్ కుమారుడు కావడం వల్ల అది పెద్ద విశేషం అయికూర్చుంది. మూడున్నర దశాబ్దాల క్రితం ఫిలిప్పీన్స్ ప్రజలను ఎన్నో రకాలుగా హింసించి, వేలాది మందిని జైళ్లలో పెట్టి, అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారిన ఫెర్డినాండ్ మార్కోస్ చివరకు ఎంతో సంపదతో దేశం వదిలి పారిపోయారు. సహజంగానే మార్కోస్ కుటుంబం పట్ల ఫిలిప్పీన్స్ ప్రజల్లో ద్వేషం, అనంగీకారం ఉంటుంది. కానీ మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆయన కుమారుడు అధ్యక్షుడిగా గెలవడం అనేది దిగ్భ్రమ కలిగించే వాస్తవం. ఏడాది క్రితం వరకూ మార్కోస్ పునఃపాలన ఊహించలేనిదీ, బహుశా ఊహకే అందనిదీ! అయితే ‘బాంగ్బాంగ్’ అనే ముద్దుపేరుతో ప్రసిద్ధులైన జూనియర్ మార్కోస్ దాదాపుగా అసాధ్యం అనుకున్న దానిని కళ్లెదుట సాక్షాత్కరింపజేశారు. ఆయన రాజకీయంగా ప్రజలకు ప్రియమైనవాడు కావడం అనేది ఒక ప్రత్యేకమైన అధ్యయనాంశం. ముప్పై ఆరేళ్లన్నది సుదీర్ఘమైన కాలం అని నాకు తెలుసు. ఫిలిప్పీన్స్ ప్రస్తుత జనాభాలో 70 శాతం మంది ప్రజలు 1986లో పుట్టే ఉండరు. ఆ ఏడాదికి ముందరి వరకు ఫిలిప్పీన్స్కి రెండు దశాబ్దాల పాటు అధ్యక్షుడిగా ఉన్న ఫెర్డినాండ్ మార్కోస్ అవినీతికీ, దోపిడీకీ, క్రూర త్వానికీ పేరు మోసిన పాలక నియంత. తన హయాంలోని ఇరవై ఏళ్లలో 14 ఏళ్లు సైనిక పాలనతోనే దేశాన్ని దడ పుట్టించేలా నడిపించాడు. ఇంత సుదీర్ఘకాలం తర్వాతే అయినప్పటికీ మళ్లీ ఇప్పుడు ఆ తండ్రి కుమారుడే భారీ మెజారిటీతో ఫిలిప్పీన్స్ ఎన్నికల్లో విజయం సాధించి, ఆ ద్వీప సమూహానికి కొత్త అధ్యక్షుడవడం చూసి నేను ఒక గొప్ప దిగ్భ్రమతో నిర్ఘాంతపోతున్నాను. చరిత్ర వింతల్లో ఇదొకటి అనుకోవాలి. ఏడాది క్రితం వరకూ మార్కోస్ పునఃపాలన ఊహించ లేనిదీ, బహుశా ఊహకే అందనిదీ. అయితే ‘బాంగ్బాంగ్’ అనే ముద్దు పేరుతో ప్రసిద్ధులైన జూనియర్ మార్కోస్ దాదాపుగా అసాధ్యం అనుకున్న దానిని కళ్లెదుట సాక్షాత్కరింపజేశారు. మొదట నేను 1986కి తిరిగి వెళ్లి, అక్కడి నుంచి ముందు కొస్తాను. నాలుగోసారి పదవిలో కొనసాగేందుకు మార్కోస్, అతడి ప్రత్యర్థిగా బరిలోకి దిగిన కొరజాన్ అక్వినో ఒకరితో ఒకరు తలపడుతున్న అధ్యక్ష ఎన్నికల సమయం అది. కొరజాన్ ప్రియనామం ‘కోరీ’. అప్పటికి మూడేళ్ల క్రితం కోరీ భర్త బెనిగ్నో... మార్కోస్ను ఎదుర్కొనేందుకు ప్రవాసం నుంచి ఫిలిప్పీన్స్లో దిగీ దిగగానే మనీలా విమానాశ్రయంలో రన్వే మీదే హత్యకు గురయ్యారు. భర్త వదిలిపెట్టి వెళ్లిన సవాలును కోరీ స్వీకరించి ఎన్నికల్లో నిలబడ్డారు. కోరీకి ప్రజాదరణ ఉన్నప్పటికీ భారీగా రిగ్గింగ్ జరిగి, మార్కోస్కు అనుకూలంగా మోసపూరితమైన ఫలితాలు వచ్చాయి. కొన్ని గంటల్లోనే ఫిలిప్పీన్స్ బద్దలైంది. మార్కోస్కు వ్యతిరేకంగా లక్షలాది మంది వీధుల్లోకి వచ్చారు. ‘కార్డినల్ సిన్’గా ప్రసిద్ధులైన జైమ్ సిన్ ఆ ప్రజా నిరసనలకు నాయకత్వం వహించారు. మార్కోస్ రక్షణ మంత్రి, సైన్యాధినేత కూడా మార్కోస్ని విడిచి పెట్టారు. నాటి ప్రజా విప్లవం ‘పీపుల్స్ పవర్’గా గుర్తింపు పొందింది. ఉరుములా ఉరిమి, పిడుగులా దేశాన్ని దద్దరిల్లించిన తిరుగుబాటు అది. ఫిలిప్పీన్స్లో ఏం జరగబోతున్నదోనని ప్రపంచం మూడు రోజుల పాటు ఊపిరి తీసుకోవడం కూడా మాని ఆతురుతతో ఎదురు చూస్తూ ఉండిపోయింది. ఫిబ్రవరి 26న మార్కోస్ దేశం విడిచి, హవాయి పారిపోయి అక్కడ తల దాచుకున్నారు. ఆ కుటుంబం హవాయికి ఏమేం తీసుకెళ్లిందో, ఫిలిప్పీన్స్లో ఏమేం వదిలి వెళ్లిందో చూడండి. 22 చెక్క పెట్టెలు, 12 సూట్కేసులు, లెక్కలేనన్ని భోషాణాలతో వారు హవాయి వెళ్లినట్లు 23 పేజీల యు.ఎస్. కస్టమ్స్ రికార్డుల్లో నమోదై ఉంది. దుస్తులతో నిండిన 67 అరలు, 413 రకాల బంగారు ఆభరణాలు, అమూల్యమైన రాళ్లను పొదిగిన 70 జతల చెవి దద్దులు ఆ పెట్టెల్లో ఉన్నాయి. ఇంకా.. ‘మా 24వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా నా భర్తకు..’ అని రాసి ఉన్న 24 బంగారు ఇటుకలు, 717 మిలియన్ డాలర్ల నగదు, ప్యాంపర్స్ డైపర్ ప్యాకెట్లలో దాచిన 4 మిలియన్ల డాలర్ల విలువైన రత్నాలు, 65 సీకో, కార్టియర్ వాచీలు; యు.ఎస్., స్విట్జర్లాండ్, కేమాన్ దీవులలోని బ్యాంకు ఖాతాలలో జమ చేసిన 124 మిలియన్ డాలర్ల నగదు తాలూకు రసీదులు ఉన్నాయి. ఇక వదిలేసి వెళ్లినవి... భార్య ఇమెల్డా మార్కోస్కు చెందిన 3,000 జతల బూట్లు, మింక్ జంతువు చర్మంతో అల్లిన 15 ఖరీదైన కోట్లు, అత్యాధునికమైన 508 గౌన్లు.. ఒక్కసారైనా తీసి వాడని ఇవన్నీ కూడా మలాకాన్యాంగ్ ప్యాలెస్లో ‘బెర్గ్డోర్ఫ్ గుడ్మ్యాన్’ డిపార్ట్మెంట్ స్టోర్ లేబుళ్లతో సహా ఉండిపోయాయి. 1965 నుండి 1986 వరకు మార్కోస్ అధ్యక్షుడిగా ఉన్న 20 ఏళ్ల కాలంలో 70,000 మంది జైలు పాలయ్యారనీ, 34,000 మంది చిత్రహింసలకు గురయ్యారనీ, 3,240 మంది హతులయ్యారనీ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది. ఫిలిప్పీన్స్లోని పరిశోధనాత్మక వార్తాపత్రిక ‘బులాత్లాట్’ వార్తాపత్రిక 1,20,000 మందిని నిర్బం ధించారని పేర్కొంది. మార్కోస్ 1989లో మరణించారు. ఇమెల్డా (92) ప్రస్తుతం జీవించి ఉన్నారు. మొత్తం 10 బిలియన్ డాలర్ల అక్రమ సంపాదనకు సంబంధించిన పలు నేరారోపణలు ఆమెపై ఉన్నాయని బి.బి.సి. నివేదించింది. మార్కోస్ వెనుక ఇంత చరిత్ర ఉన్నప్పుడు 1980లు, 90ల కాలంలో ఆయనపై, ఆయన కుటుంబంపై ఫిలిప్పీన్స్ ప్రజల్లో ద్వేషం, అనంగీకారం ఉండటంలో ఆశ్చర్యం ఏముంది? అయితే ఈ రోజున ఆయన పేరున్న ఆయన తనయుడు రాజకీయంగా ప్రజలకు ప్రియమైనవాడు అయ్యారు. అదెలా జరిగింది? చాలామంది అడిగే ప్రశ్న, చాలాకాలంగా చర్చనీయాంశమైన ప్రశ్న. ఇందుకు నేను... తొందరపాటు, సంకోచం, అసంపూర్ణతలతో కూడిన మూడు సమాధానాలను సూచిస్తాను. మొదటిది – మార్కోస్ దశాబ్దాల నిరంకుశత్వ పాలనలో సైతం ఆయనకు వెన్నుగా ఉన్న ఇలోకోస్ నార్టే ప్రావిన్సు నేటికీ ఆ కుటుంబానికి పెట్టని కోటలా ఉంది. కాబట్టి ఆయన తనయుడు బాంగ్బాంగ్ మార్కోస్కు కూడా ఆ ప్రావిన్స్ ఎల్లప్పుడూ ఒక స్థావరంలా ఉంటుంది. అక్కడి నుంచి పని మొదలుపెట్టడం ఆయనకు సులభమైంది. రెండవది.. సోషల్ మీడియా, పూర్తి తప్పుడు సమాచారం గతాన్ని అక్షరాలా రూపు మాపేశాయి. ‘స్టాటిస్టా’ సర్వే ప్రకారం రోజూ కేవలం రెండు గంటలు మాత్రమే సోషల్ నెట్వర్క్లో ఉంటున్న బ్రిటన్ ప్రజానీకంతో పోలిస్తే ఫిలిప్పీన్ ప్రజలు అంతకు రెండింతలుగా నాలుగు గంటల పాటు సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు. తత్ఫలితంగా మార్కోస్ నిరంకుశత్వం, దౌర్జన్యం, అవినీతి – అన్నీ నకిలీ కథనాలుగా పరి గణన పొందడానికి వీలైంది. అంతేనా, ఆయన నియంతృత్వానికి ‘స్వర్ణయుగం’ అనే పేరు కూడా సోషల్ మీడియాలో వచ్చేసింది. ఈ పునర్లిఖిత చరిత్రలో మార్కోస్ క్రూరపాలన వర్ణమయమైన ఆకర్షణగా కూడా మారింది. మూడవది – బాంగ్బాంగ్తో ఈ ఎన్నికల్లో కలిసి ఉపాధ్య క్షురాలిగా పోటీచేసిన అభ్యర్థి.. గద్దె దిగి వెళుతున్న అధ్యక్షుడు డ్యూటర్టే కుమార్తె సారా డ్యూటెర్టే కార్పియో. ఆమె వెనుక ఆమె తండ్రి ప్రజాదరణ ఉంది. అంటే పారంపర్యం పనిచేస్తోందని! ఇండియాతో ఫిలిప్పీన్స్కి ఏమైనా కాస్త పోలికను వెదకితే అది.. 1977–1979 మధ్యకాలంలో ఇందిరాగాంధీ ఉత్థాన పతనాల దశ కావచ్చు. బ్రిటన్ లోనూ ఇలాంటిదే జరిగింది. అయితే ఇందుకు విరుద్ధంగా జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ గెలిచిన తర్వాత జరిగిన ఎన్నికల్లో చర్చిల్ ఓడిపోయారు. కానీ మార్కోస్ వీరోచిత, విస్మయగాథ ప్రత్యేకమైనది. దీన్నుంచి మనం గ్రహించగలిగింది ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టేయడానికి వీల్లేదని! చెప్పలేం.. మరొక గాంధీ ప్రధాని అవొచ్చు. శ్రీలంకలో రాజపక్సేలు ఎప్పటికైనా మళ్లీ పుంజుకోవచ్చు! వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
రణిల్తో లంక చక్కబడేనా?
నెల రోజులకుపైగా ఎడతెరిపిలేని నిరసనలతో అట్టుడుకుతున్న శ్రీలంకలో ప్రధానిగా రణిల్ విక్రమసింఘే ఏలుబడి మొదలైంది. తమ కుటుంబ పాలన నిర్వాకానికి, దానివల్ల తలెత్తిన ఆర్థిక సంక్షోభానికి ఆగ్రహోదగ్రులైన జనం వీధుల్లో విరుచుకుపడినా అధ్యక్షుడు గొటబయ రాజపక్స ధోరణిలో ఆవగింజంతైనా మార్పు రాలేదని రణిల్ నియామకంతో రుజువైంది. గత నెల 9న ప్రారంభమైన ఉద్యమం ప్రభుత్వం ముందుంచిన ఏకైక డిమాండ్ రాజపక్స కుటుంబీకులు గద్దె దిగాలన్నదే. కానీ రణిల్ ఆగమనం ఆ స్ఫూర్తికి విరుద్ధమైంది. రాజపక్స కుటుంబీకులతో ఆయన వర్తమాన సంబంధబాంధవ్యాలు ఎటువంటివో ప్రజలకు తెలుసు. దేశాన్ని తాజా సంక్షోభంనుంచి కాపాడాలన్న చిత్తశుద్ధే గొటబయకు ఉంటే రణిల్ జోలికి పోకుండా విపక్ష ఎస్జేబీ నేత సజిత్ ప్రేమదాసను ఒప్పించే ప్రయత్నం చేసేవారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం అందినప్పుడు సజిత్ షరతు విధించిన మాట వాస్తవం. గొటబయ ఈనెల 15 లోగా అధ్యక్ష పదవినుంచి వైదొలగుతా నంటేనే అందుకు అంగీకరిస్తానన్నారు. ఆ విషయంలో ఆయనకు నచ్చజెప్పవలసి ఉండగా, ఈ సాకుతో రణిల్ను ఎంచుకోవడం గొటబయ కుయుక్తికి అద్దం పడుతుంది. లంక చల్లబడుతుందనీ, మళ్లీ తమ పరివారానికి గత వైభవం దక్కుతుందనీ ఆయన కలలు కంటున్నట్టు కనిపిస్తోంది. తెరవెనక ఎత్తుగడల్లో రణిల్ ఆరితేరి ఉండొచ్చు. కానీ జనంలో విశ్వసనీయత శూన్యం. రెండేళ్ల నాడు జరిగిన పార్లమెంటు ఎన్నికలే ఇందుకు సాక్ష్యం. రణిల్ పోకడలను సహించలేని నేతలంతా ఆ ఎన్నికలకు ముందు పార్టీని విడిచి కొత్త పార్టీ సామగి జన బలవేగయ(ఎస్జేబీ) స్థాపించడంతో ఆయన పార్టీ యునైటెడ్ నేషనల్ పార్టీ(యూఎన్పీ) పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. రణిల్ సైతం ఓటమి పాలు కాగా, పార్టీలకు వచ్చిన ఓట్ల దామాషా ప్రాతిపదికన ఎంపీలను నామినేట్ చేసే ‘నేషనల్ లిస్టు’ పుణ్యమా అని ఆయన ఒక్కడూ ఎంపీ కాగలిగారు. 225 మంది ఎంపీలుండే పార్లమెంటులో యూఎన్పీ తరఫున ఆయన ‘ఏక్ నిరంజన్’. అందుకే ప్రధాని పదవి ఇవ్వజూపితే తీసుకోబోనని పక్షం క్రితం ఆయన గంభీరంగా చెప్పారు. ఇంతలోనే వ్రతభంగానికి పాల్పడ్డారు. గతంలో ఆయన అయిదుసార్లు ప్రధానిగా చేశారు. కానీ ఎప్పుడూ పూర్తికాలం ఉండలేకపోయారు. లంక రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు ఎవరినైనా ప్రధాని పదవిలో కూర్చోబెట్టవచ్చు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది అనైతికమన్న ఆలోచనే గొటబయకు లేకుండా పోయింది. లంక ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడాలంటే అందరికీ ఆమోదయోగ్యమైన జాతీయ ప్రభుత్వం ఏర్పడాలి. అప్పుడు మాత్రమే దానికి ఇంటా బయటా అంతో ఇంతో విశ్వసనీయత కలుగుతుంది. రుణాలు లభిస్తాయి. ఇంధనం, నిత్యావసర సరుకుల దిగుమతులు పుంజుకుంటాయి. సాధారణ పరిస్థితులు ఏర్పడితే లంకకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న పర్యాటక రంగం పట్టాలెక్కుతుంది. శ్రీలంక రూపాయి కొద్దో గొప్పో కోలుకుంటుంది. దేశ క్షేమాన్ని కాంక్షించే రాజనీతిజ్ఞతే ఉంటే గొటబయ ఆ పని చేసేవారు. కానీ అందుకు భిన్నంగా తన చెప్పుచేతల్లో ఉండే నేతను ప్రధానిగా నియమించి భవిష్యత్తులో తనకూ, తన పరివారానికీ ముప్పు కలగకుండా ముందుజాగ్రత్త పడ్డారు. గొటబయ ఎత్తులు ఫలిస్తాయా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అది జరగడం కల్ల. ప్రస్తుత ఉద్యమం ఎప్పుడో సంప్రదాయ రాజకీయ నేతల చేతులు దాటిపోయింది. అందుకే ఉద్యమకారులపై లాఠీచార్జిలతో మొదలుపెట్టి కాల్పుల వరకూ పోయినా... కరడుగట్టిన నేరగాళ్లను జైళ్లనుంచి విడుదల చేయించి వారితో ఉద్యమ నేతలను హతమార్చాలని చూసినా జనం ఎక్కడా బెదరలేదు. సరిగదా అప్పటివరకూ ఎంతో శాంతియుతంగా సాగిన ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. నేర గాళ్లను ఉద్యమకారులు దొరకబుచ్చుకుని దేహశుద్ధి చేసి, వారిని చెత్త తీసుకెళ్లే బళ్లలో ఊరేగించారు. అధికారిక నివాసాలకు నిప్పు పెట్టారు. రివాల్వర్తో కాల్పులు జరిపి తప్పించుకోవాలని చూసిన అధికార పార్టీ ఎంపీని తరిమి తరిమికొట్టారు. చివరకు ఆయన ప్రాణాలు తీసుకున్నాడని మొదట వార్తలు రాగా, అది హత్య అని తాజాగా పోలీసులంటున్నారు. గొటబయ కుటుంబీకులను ఏమాత్రం జనం సహించడంలేదు. అందుకే వారు ఒక్కొక్కరే పదవులనుంచి వైదొలగక తప్పలేదు. చివరకు గత సోమవారం గొటబయ సోదరుడు, ప్రధాని మహిందా రాజపక్స సైతం రాజీనామా చేయవలసి వచ్చింది. కళ్లముందు సాగుతున్న ఈ పరిణామాలు గొటబయకు తెలియవనుకోలేం. అయినా ఆయనలో ఏదో దింపుడు కళ్లం ఆశ ఉన్నట్టు కనబడుతోంది. దేశం దివాలా తీసి, ప్రజానీకమంతా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో గొటబయ తప్పుకోవడం, తమ పాలనలో జరిగిన అక్రమాలపై, కుంభకోణాలపై విచారణకు సిద్ధపడటం ఒక్కటే మార్గం. మెజారిటీ వర్గ ప్రజలను కృత్రిమ ఆధిక్యతా భావనలో ముంచి, వాస్తవ స్థితిగతులనుంచి వారి దృష్టి మరల్చి పౌరుల్లో పరస్పర విద్వేషాలను పెంచి పోషించిన ఘనులు రాజపక్స సోదరులు. ఆ రాజకీయపుటెత్తుగడలే వర్తమాన పెను సంక్షోభానికి మూల కారణం. ఇలాంటి నేతలు ఇంకా పదవుల్లో కొనసాగడం లేదా వారికి అధికారిక అండదండలు లభించడం దేశ భవిష్యత్తుకు మరింత చేటు కలిగిస్తుంది. రాజకీయ సుస్థిరత ఏర్పడి, సాధారణ స్థితిగతులు సాధ్యపడాలంటే రాజపక్సేల ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయంలేని ప్రభుత్వం ఏర్పడటం అత్యవసరం. ఆ దిశగా అడుగులు పడటమే వర్తమాన సంక్షోభానికి విరుగుడు. -
ఇదేం పిచ్చిరా నాయన! తగలెట్టేసి మరీ సెల్ఫీలా!
New selfie points near burnt buses and cars submerged: రాజికీయ, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో అల్లర్లు చెలరేగుతున్నసంగతి తెలిసిందే. తొలుత శాంతియుతంగా చేపట్టిన నిరసనలు కాస్తా హింసాత్మకంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు రాజపక్స కుటుంబాల ఇళ్లను, కార్యాలయాలను ధ్యంసం చేశారు కూడా. నేవీ స్థావరంలో తలదాచుకుంటున్న మహిందా రాజపక్స కుటుంబం పై దాడి చేయాలని నిరసనకారలు ఆ ప్రాంతాలను కూడా ముట్టడించారు. ఈ క్రమంలో ఒకవైపు ఆందోళలనకారులు నిరసనలు చేస్తుంటే మరోవైపు కొంతమంది ఆ ధ్వంసమైన కార్లు, చెరువుల్లో మునిగిపోయిన బస్సుల వద్ద సెల్ఫీలు తీసకుంటున్నారు. ఈ హింసాత్మక అల్లర్లుక కారణంగా శ్రీలంక రక్షణ శాఖ కర్ఫ్యూ విధించడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులన తగలబెట్టేవారిని నిర్థాక్షిణ్యంగా కాల్చేయండి అంటూ అదేశాలు జారీ చేసింది కూడా. ఐతే ఇక్కడ ప్రజలు ధ్వంసం చేసిన ప్రభుత్వ ఆస్తులను సెల్ఫీ పాయింట్లుగా చేసుకుని సెల్ఫీలు దిగేందుకు ఎగబడటం విశేషం. అంతేకాదు ఈ కర్ఫ్యూ కారణంగా తాము స్కూల్కి వెళ్లలేకపోవడంతో తాము తమ కుటుంబంతో బయటకు వచ్చి సెల్ఫీలు దిగుతున్నమని విద్యార్థులు చెబుతుండటం గమనార్హం. ప్రధానమంత్రి కార్యాలయాలు, నివాసస్థలాల వద్ద బస్సలు, కార్లు దగ్ధం కాగా.. ప్రజలు తమ కుటుంబాలతో సహా వాటి వద్దకు వచ్చి మరీ సెల్ఫీలు దిగుతున్నారు. Sri Lanka | Burnt buses and sunken cars become a new selfie point in Colombo "People are taking selfies here as they want to take it as memory, many people could not join protests, they are taking selfies to show solidarity with the protesters," said Clifford, a local resident pic.twitter.com/UpTKzwRLXF — ANI (@ANI) May 12, 2022 (చదవండి: శ్రీలంక కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘే ప్రమాణం) -
శ్రీలంక అధ్యక్షుడు గొటబయా కీలక ప్రకటన
కొలంబో/న్యూయార్క్: శ్రీలంకకు ఈ వారంలోనే కొత్త ప్రధాని వస్తారని అధ్యక్షుడు గొటబయా రాజపక్స చెప్పారు. రాజ్యాంగ సంస్కరణలూ తెస్తామన్నారు. రాజపక్సలు లేకుండా యువ మంత్రివర్గాన్ని నియమిస్తామన్నారు. తాజా మాజీ ప్రధాని మహిందా రాజపక్స ట్రింకోమలీలోని నావల్ బేస్లోనే తలదాచుకున్నారు. భారత ప్రభుత్వం లంకకు సైన్యాన్ని తరలించనుందన్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. చదవండి: లంక కల్లోలం: కొంప ముంచిన మహీంద రాజపక్స మీటింగ్! -
శ్రీలంకలో ఆగని అల్లర్లు.. ప్రధాని ఇంటికి నిప్పు
ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంకలో మొదలైన ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఈ పరిణామాలకు బాధ్యత వహిస్తూ ప్రధాని మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేసినప్పటికీ ఆందోళనలు మాత్రం ఆగడం లేదు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు హంబన్టోట నగరంలోని మెదములానాలో ప్రధాని మహింద రాజపక్సే, అతని తమ్ముడు అధ్యక్షుడు గోటబయ రాజపక్స ఇంటికి నిప్పు పెట్టారు. అంతేకాక కొందరు మహీంద తండ్రి జ్ఞాపకార్థం నిర్మించిన డీఏ రాజపక్స విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు. దీంతో పాటు అధికార కూటమికి చెందిన మంత్రులు, శాసనసభ్యుల పలు ఆస్తులను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో శ్రీలంక అధ్యక్షుడి నివాసాన్ని ఆర్మీ ఆధీనంలో తెచ్చుకుంది. రాజపక్స నివాసం వద్ద భారీ సంఖ్యలో ఆందోళనకారులు రావడంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. పరిస్థితి తీవ్రతరం కావడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాజపక్స అధికారిక నివాసం వద్ద వేల సంఖ్యలో బలగాలను మోహరించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం.. -
Sri Lanka: అప్పుల కుప్ప శ్రీలంక.. అంతా రాజపక్సల మాయ!
శ్రీలంకలో సంక్షోభం మొదలై నెల దాటుతోంది. ప్రజాగ్రహం నానాటికీ పెరుగుతోందే తప్ప చల్లారడం లేదు. రాజపక్స కుటుంబమంతా రాజీనామా చేయాలని నిరసనలు మిన్నంటుతున్నాయి. ఆ ఒక్క డిమాండ్తోనే నిరసనకారులు రోజుల తరబడి అధ్యక్ష భవనం ఎదుట బైఠాయిస్తున్నారు. అరెస్టులకు, లాఠీ దెబ్బలకు వెరవకుండా నిరసనలు కొనసాగిస్తున్నారు. రెండు దశాబ్దాలుగా రాజపక్స వంశాన్ని ఆరాధించిన జనం ఇప్పడు ఆ పేరు చెబితేనే ఎందుకు మండిపడుతున్నారు? అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారు అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు అని దశాబ్దాల కిందట మహాకవి శ్రీశ్రీ రాసిన మాటలు ఇప్పటికీ అక్షర సత్యమని శ్రీలంక రాజకీయాలు నిరూపిస్తున్నాయి. రాజపక్స కుటుంబీకుల బంధుప్రీతి, అవినీతి దేశాన్ని ఆర్థికంగా దిగజార్చడమే గాక ప్రజల్లో ఆ కుటుంబంపై ఏహ్యభావం ఏర్పడింది. రాజపక్సలు దాదాపు రెండు దశాబ్దాలుగా అధికారాన్ని గుప్పిట పట్టి ఉంటూ చక్రం తిప్పుతున్నారు. వారి పార్టీ శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ (ఎస్ఎల్ఎఫ్పీ) 1948 ఫిబ్రవరిలో శ్రీలంకకు స్వాతంత్య్రం రావడానికి ముందే పుట్టింది. దాని వ్యవస్థాపకుడు డాన్ అల్విన్ రాజపక్స పార్లమెంటుకు ఎన్నికైనప్పటి నుంచి రాజకీయాల్లో ఆ కుటుంబ ప్రస్థానం మొదలైంది. అల్విన్ కుమారులైన ప్రధాని మహింద, అధ్యక్షుడు గొటబయ, చమిల్, బాసిల్ సోదరులు అధికారాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. శ్రీలంక ప్రస్తుత దుస్థితికి ఈ నలుగురు అన్నదమ్ములే కారణమన్న విమర్శలున్నాయి. భావి తరం నేతలుగా చక్రం తిప్పడానికి వారి కుమారులు నమల్, యోషిత, శశీంద్ర కూడా సిద్ధంగా ఉన్నారు. మహింద రెండోసారి అధ్యక్షుడిగా చేసిన 2010–15 మధ్య ఆ కుటుంబం నుంచి ఏకంగా 40 మందికి పైగా ప్రభుత్వ పదవుల్లో కొనసాగారు! వారిలో అత్యధికులు ఆర్థిక నేరాల ఆరోపణలు ఎదుర్కొన్నారు. దేశ అప్పుల్లో 78% రాజపక్సల హయాంలో చేసినవే! బాసిల్ రాజపక్స (70) మాజీ ఆర్థిక మంత్రి అన్నదమ్ముల్లో చిన్నవాడు. ఆర్థికమంత్రిగా అవకతవక నిర్ణయాలతో దేశాన్ని సంక్షోభంలోకి నెట్టారు. కాంట్రాక్ట్ ఏదైనా 10 శాతం కమీషన్ ముట్టజెప్పాల్సిందే. అందుకే బాసిల్ను మిస్టర్ 10% అని పిలుస్తారు. మహింద రాజపక్స (76) ప్రధాని అత్యంత ప్రజాదరణ ఉన్న నేత. 2005 నుంచి పదేళ్లు దేశాధ్యక్షుడు. ప్రత్యేక తమిళ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేశారు. దశాబ్దాల తరబడి సాగిన అంతర్యుద్ధాన్ని మే 2009లో మిలటరీ ఆపరేషన్తో నామరూపాల్లేకుండా చేసి సింహళ–బుద్ధిస్టులకు ఆరాధ్యునిగా మారారు. మహింద హయాంలోనే శ్రీలంక చైనాకు దగ్గరైంది. మౌలిక సదుపాయాల కల్పనకంటూ 700 కోట్ల డాలర్లు అప్పుగా తెచ్చారు. ఆ ప్రాజెక్టుల్లో భారీ అవినీతితో ఆ రుణ భారం కొండంతైంది. ఆయన ఏకంగా 1,900 కోట్ల డాలర్లు పోగేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. గొటబయ రాజపక్స (72) అధ్యక్షుడు అన్న మహిందకు కుడిభుజం. ఆయన అధ్యక్షుడిగా ఉండగా ఎన్నో పెద్ద పదవుల్లో ఉన్నారు. 2005లో రక్షణ శాఖకు శాశ్వత కార్యదర్శిగా నియమితులయ్యారు. అంతర్యుద్ధ సమయంలో తమిళ రెబెల్స్పై మూకుమ్మడి అత్యాచారాలు, హింస, హత్యల వెనుక గొటబయ హస్తముందంటారు. ఫైర్ బ్రాండ్ ముద్ర ఉన్న ఈయనను కుటుంబీకులే టెర్మినేటర్ అని పిలుస్తూంటారు. 2019లో అధ్యక్షుడయ్యాక రక్షణ శాఖను తన వద్దే ఉంచుకున్నారు. 2020 అక్టోబర్లో అధ్యక్షుడికి అపరిమిత కార్యనిర్వాహక అధికారాలు కల్పించుకోవడం వివాదాస్పదమైంది. చమల్ రాజపక్స (79) నీటిపారుదల మంత్రి మహింద అధ్యక్షుడిగా ఉండగా స్పీకర్గా చేశారు. ప్రపంచంలో తొలి మహిళా ప్రధాని సిరిమావో బండారు నాయకేకు వ్యక్తిగత అంగరక్షకుడిగా చేయడంతో బాడీగార్డ్ అనే పేరు స్థిరపడిపోయింది. ప్రస్తుతం నీటిపారుదల మంత్రి. అన్నదమ్ముల్లో అంతగా వివాదాలు లేనిది ఈయనొక్కడే. నమల్ రాజపక్స (35) క్రీడలు, యువజన మంత్రి మహింద కుమారుడు. 2010లో 24 ఏళ్ల వయసులోనే పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఎప్పటికైనా అధ్యక్షుడు కావాలని కలలు గంటున్నారు. మహింద అధ్యక్షుడిగా ఉండగా ఏ పదవీ లేకుండానే చక్రం తిప్పడంతో పాటు ఈయనపై మరెన్నో అవినీతి ఆరోపణలూ ఉన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
లంక ప్రధానితో చర్చలకు నో!
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడి భవనం ముందు నిరసనలు కొనసాగిస్తున్న ఆందోళనకారులను ఆ దేశ ప్రధాని మహింద రాజపక్సే చర్చలకు ఆహ్వానించారు. అయితే అధ్యక్షుడు గొటబయ రాజపక్సే రాజీనామా చేయాలని, ఇతర రాజపక్సే కుటుంబ సభ్యులు అధికారం నుంచి వైదొలగాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అంతవరకు చర్చలకు రామని తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆందోళనకారులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయం తెలిపారు. ‘‘మేం ఇక్కడకు చర్చలకు రాలేదు. నువ్వు, నీ ప్రభుత్వం రాజీనామా డిమాండ్ చేయడానికి వచ్చాం’’ అని నిరసనకారుల్లో ఒకరు వ్యాఖ్యానించారు. వీరు నిరసన తెలియజేసే స్థలానికి గాట్గోగామా అని పేరు పెట్టుకున్నారు. బుధవారానికి ఈ ఆందోళనలు ఐదో రోజుకు చేరాయి. ఎక్కువగా యువత ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు. దేశంలోని అవినీతి రాజకీయ సంస్కృతిని మార్చేవరకు వెనుదిరగమంటున్నారు. బుధవారం ఆందోళనల్లో పలువురు సంగీతకారులు, సెలబ్రిటీలు, ఆర్టిస్టులు పాలుపంచుకున్నారు. వీరిలో మాజీ క్రికెటర్ రోషన్ మహానామా కూడా ఉన్నారు. ప్రజలకు నిత్యావసరాలు కూడా దొరకడం లేదని, ఇంతవరకు సంక్షోభానికి పరిష్కారమార్గాలు రాజకీయనాయకుల నుంచి రాలేదని ఆయన వ్యాఖ్యానించారు. అంతకుముందు నిరసనకారులతో చర్చలకు రావాలంటూ ప్రధాని కార్యాలయం యువతను కోరుతూ ప్రకటన చేసింది. ఒకవేళ వారు చర్చలు అంగీకరిస్తే వారి బృందంలో మరింత మంది పాల్గొనే అవకాశం ఇస్తానని మహింద చెప్పారు. దేశమంతా అదే డిమాండ్ రాజపక్సే కుటుంబం పదవులను వీడాలంటూ లంకలో పలు చోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి. దేశ ఆర్థిక సంక్షోభానికి ఈ ప్రభుత్వమే కారణమని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు దేశంలో పెట్రోల్ బంకుల వద్ద, దుకాణాల వద్ద భారీ క్యూలు కనిపించాయి. నూతన సంవత్సర వేడుకలు కూడా జరుపుకునే వీలు లేకపోవడంతో వరుసల్లో నిలబడ్డ ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికుతోంది. విదేశీ నిల్వలు భారీగా దిగజారడంతో బహిర్గత రుణ చెల్లింపులను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే! ప్రభుత్వంలో పలు మంత్రులు రాజీనామాలు చేసిన అనంతరం కొత్త కేబినెట్ ఏర్పాటు చేయడంలో గొటబయ ఇప్పటకీ సఫలం కాలేదు. పార్లమెంట్లో ప్రభుత్వంపై అవిశ్వాసం, అధ్యక్షుడి అభిశంసన, అధ్యక్షుడికి అధిక అధికారాలు కల్పించే 20 సవరణల తొలగింపును కోరుతూ తీర్మానాలను ప్రవేశపెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం సిద్ధమైంది. ప్రభుత్వంలో భాగస్వామైన ఎస్ఎల్పీపీ నేత సిరిసేన ఇకపై ప్రభుత్వంతో ఎలాంటి చర్చలకు హాజరుకానని తేల్చిచెప్పారు. అయితే సంక్షోభానికి కరోనా, ఉక్రెయిన్ యుద్ధం తదితర అంశాలే కారణమని ప్రభుత్వం చెబుతోంది. -
‘గో హోం గొటా’.. శ్రీలంకలో నిరసనల హోరు..
కొలంబో/రామేశ్వరం: శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స తక్షణమే పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తూ జనం వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని కొలంబోలో ఆదివారం వేలాదిమంది ఓ పార్కులో గుమికూడారు. రాజపక్సకు వ్యతిరేకంగా ‘గో హోం గొటా’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. దేశవ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. ఆహారం, గ్యాస్, పెట్రోల్, డీజిల్, ఔషధాలు లేకుండా ఎలా బతకాలని జనం మండిపడుతున్నారు. రాజపక్స రాజీనామా చేసే దాకా ఉద్యమం విరమించే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు. అధ్యక్షుడు గొటబయ రాజపక్సపై పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే ప్రతిపక్షాలకు మద్దతిస్తామని తమిళ్ నేషనల్ అలయెన్స్(టీఎన్ఏ) పార్టీ ఆదివారం ప్రకటించింది. గొటబయపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని సమాగీ జన బలవెగయా(ఎస్జేబీ) పార్టీ శుక్రవారం వెల్లడించింది. శ్రీలంకలో సంక్షోభాన్ని తట్టుకోలేక జనం ఇతర దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. లంక నుంచి 19 మంది తమిళులు పడవలో ఆదివారం భారత్లోని ధనుష్కోటి తీరానికి చేరుకున్నారు. వీరిలో ఆరుగురు మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. -
గొటబయ ప్రభుత్వంపై అవిశ్వాసం
కొలంబో: దేశంలో నెలకొన్న సంక్షోభాలను తక్షణం పరిష్కరించే చర్యలు చేపట్టకుంటే గొటబయ రాజపక్సే ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామని లంక ప్రధాన ప్రతిపక్షం ఎస్జేబీ పార్టీ ప్రకటించింది. దేశంలో అధ్యక్ష పాలన పోవాలని పార్టీ నేత సజిత్ ప్రేమదాస అభిప్రాయపడ్డారు. కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థల మధ్య అధికార పంపిణీ జరగాలన్నారు. గొటబయ తొలగాలన్న ప్రజా డిమాండ్ను ప్రభుత్వం పట్టించుకోవాలన్నారు. లేదంటే తామే అవిశ్వాసం తెస్తామని హెచ్చరించారు. మరోవైపు అవిశ్వాసానికి మద్దతుగా ఎంపీల సంతకాల సేకరణను ఎస్జేబీ ఆరంభించినట్లు మీడియా వర్గాలు తెలిపాయి. అన్ని పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని గతంలో గొటబయ ఎస్జేపీని ఆహ్వానించారు. అయితే ఈ ఆహ్వానాన్ని పార్టీ తిరస్కరించింది. దేశంలో రాజపక్సేల ఆధిపత్యం పోవాలని ఎస్జేబీ కోరుతోంది. గొటబయ రాజీనామా చేయకపోతే అవిశ్వాసం తెస్తామని మరో విపక్షం జేవీపీ నేత విజేత హెరాత్ చెప్పారు. అయితే రాజీనామా డిమాండ్ను గొటబయ తోసిపుచ్చారు. పరిష్కారం దొరకలేదు దేశం ఎదుర్కొంటోన్న ఆర్థిక సంక్షోభపై చర్చ పార్లమెంట్లో మూడు రోజులు చర్చించినా తగిన పరిష్కారం లభించలేదు. పలువురు మంత్రులు రాజీనామా నేపథ్యంలో తక్షణం మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంక్షోభ నివారణా మర్గాలు అన్వేషించాలని అధికార కూటమి సభ్యులు కూడా కోరుతున్నారు. తమ ప్రభుత్వం ఐఎంఎఫ్, చైనా, ఇండియాతో సాయంపై చర్చలు జరుపుతోందని గొటబయ చెబుతున్నారు. ప్రజలు పొదుపుగా వ్యవహరించాలని సూచించారు. దేశంలోని విదేశీ దౌత్యవేత్తలతో విదేశాంగమంత్రి పెరిస్ చర్చలు జరిపారు. మరోవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలో పబ్లిక్ రంగ ఉద్యోగులు శుక్రవారం ఒక్కరోజు సమ్మె చేశారు. మరోవైపు దేశంలో ఔషధాలు, వైద్య పరికరాల కొరత తీవ్రస్థాయికి చేరింది. -
చైనాతో దోస్తీ వల్లే ఇలా జరిగింది..
కొలంబో: ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంకలో దారుణ పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. తినేందుకు తిండి లేక లంకేయులు పస్తులు ఉండాల్సి వస్తోంది. ద్రవ్యోల్బణం కారణంగా నిత్యవసర వస్తువుల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో రాజపక్సే ప్రభుత్వంపై ఆ దేశ ప్రజలు తిరుగుబాటుకు దిగారు. లంకేయుల ఆందోళనల నేపథ్యంలో శ్రీలంకలో ఎమర్జెన్సీ, కర్ఫ్యూ సైతం విధించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా లంక ప్రభుత్వంపై ఆ దేశ వ్యాపారులు సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక ప్రభుత్వం.. చైనాకు అన్నింటినీ అమ్ముతోందని ఆరోపించారు. ప్రతీ దానిని చైనాకు అమ్ముతున్న కారణంగానే శ్రీలంక వద్ద డబ్బు లేదు. ఇది ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసే వాటిపై ప్రభావం చూపుతోందన్నారు. ప్రతీ వస్తువు వేరే దేశాల నుంచి కొనడం కష్టంగా మారింది. ఇదే ప్రధాన సమస్య అని పేర్కొన్నారు. రోజురోజుకు ధరలు పెరుగుతున్నాయని, తమ వద్ద నగదు కూడా మిగలడం లేదని అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పండ్ల విక్రయదారుడు ఫరూఖ్ మాట్లాడుతూ.. నాలుగు నెలల క్రితం కిలో ఆపిల్స్ రూ. 500 గా ఉంది. ఇప్పడు ఆపిల్స్ ధర రూ. 1000-1500లకు చేరుకుంది. ప్రజల వద్ద డబ్బు లేకపోవడంతో ఎవరూ కొనుగోలు చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు.. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస కార్యనిర్వాహక అధ్యక్ష వ్యవస్థను రద్దు చేయాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు అధికార పార్టీకి చెందిన, కొత్తగా నియమితులైన ఆర్థిక మంత్రి అలీ సబ్రీ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వంపై నిరసనల్లో భాగంగా ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఆందోళనకారులు బారికేడ్లు ధ్వంసం చేసి నిరసనలు కొనసాగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. #SriLanka: Clashes broke out between protesters and police today in Colombo during protests against Sri Lanka’s worsening financial crisis. Protesters have been expressing discontent with the ruling family for weeks, intensifying in the past few days.https://t.co/tjKYE8p4KC pic.twitter.com/MeuozfruTA — POPULAR FRONT (@PopularFront_) April 5, 2022 ఇది చదవండి: శ్రీలంకలో ముదురుతున్న సంక్షోభం.. మైనార్టీలో గొటబాయ సర్కార్ -
శ్రీలంకలో ముదురుతున్న సంక్షోభం.. మైనార్టీలో గొటబాయ సర్కార్
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాల్చుతోంది. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోవడంతో ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరనసలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ అమల్లో ఉన్నప్పటికీ నిరసనలు మాత్రం తగ్గడం లేదు. అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో కీలక అధికారులు, మంత్రులు రాజీనామా బాట పడుతున్నారు. ఆహార, ఆర్థిక సంక్షోభంలో అల్లాడుతున్న శ్రీలంకలో.. రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. 41 మంది ఎంపీలు అధికార కూటమికి మద్ధతు ఉపసంహరించుకోవడంతో అధ్యక్షుడు గొటబయా రాజపక్స నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. శ్రీలంక ప్రజా ఫ్రంట్ నుంచి బయటకు వచ్చేశామని, తాము స్వతంత్ర సభ్యులుగా ఉంటామని ఫ్రీడమ్ పార్టీ నేత, మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన వెల్లడించారు. వీరిలో సొంత పార్టీకి చెందిన 12 మందితో పాటు శ్రీలంక ఫ్రీడమ్ పార్టీకి చెందిన 14 మంది, ఇతర మిత్ర పక్షాలకు చెందిన సభ్యులు ఉన్నారు. దీంతో గొటబాయ సర్కార్ మెజార్టీ కోల్పోయింది. చదవండి: శ్రీలంకలో ముదరుతున్న సంక్షోభం.. నూతన ఆర్థిక మంత్రి రాజీనామా ఎమర్జెన్సీ ప్రకటన తర్వాత తొలిసారి మంగళవారం పార్లమెంట్ సమావేశం కాగా.. పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ రంజిత్ సియంబలపితియా తన పదవికి రాజీనామా చేశారు. అలాగే, బసిల్ రాజపక్స స్థానంలో ఆర్థికమంత్రిగా నియమితులైన అలి సబ్రి 24 గంటల్లోనే రాజీనామా చేసి వెళ్లిపోయారు. అదే విధంగా ఆర్థిక అవకతవకల ఆరోపణలతో సెంట్రల్ బ్యాంక్ ఉన్నతాధికారి సోమవారం రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రధాని రాజపక్స సారథ్యంలోని కేంద్ర కేబినెట్లోని మొత్తం 26 మంది మంత్రులు ఆదివారం అర్థరాత్రి సమయంలో మూకుమ్మడిగా రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. దీంతో జాతీయ సంక్షోభం నుంచి గట్టేందుకు కేబినెట్లో చేరి పదవులు చేపట్టాలని అధ్యక్షుడు గోటబయ రాజపక్స.. ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. కానీ ప్రతిపక్షాలు ప్రభుత్వ ప్రతిపాదనను వెంటనే తిరస్కరించాయి. అయితే కేబినెట్ మొత్తం రాజీనామా చేసినా.. గొటబాయ, మహింద రాజపక్సలు మాత్రం తమ పదవుల్లో కొనసాగుతున్నారు. చదవండి: శ్రీలంక సంక్షోభంపై జాక్వెలిన్ ఫెర్నాండేజ్ స్పందన.. ఎమోషనల్ పోస్ట్ -
శ్రీలంకలో ముదురుతున్న సంక్షోభం.. నూతన ఆర్థిక మంత్రి రాజీనామా
Sri Lanka finance minister Ali Sabry resigned: శ్రీలంక అప్పుల ఊబిలో చిక్కుకుంది. నివేదికల ప్రకారం శ్రీలంకకి సుమారు రూ. 3 లక్షల కోట్ల విదేశీ అప్పు ఉంది. అందులో సుమారు 400 కోట్లు ఈ ఏడాది చెల్లించవలసి ఉంది. శ్రీలంక తీవ్ర ఆర్ధిక సంక్షోభం ఎదుర్కుంటున్న తరుణంలో ఆర్థిక మంత్రి అలీ సబ్రీ ప్రమాణస్వీకారం చేసిన తదుపరి రోజే రాజీనామ చేశారు. ఆయన తన సోదరుడు బాసిల్ రాజపక్సేను ఆర్థిక మంత్రిగా తొలగించి న్యాయ మంత్రిగా ఉన్న అలీ సబ్రీని ఆర్థిక మంత్రిగా శ్రీలంక అధ్యక్షుడు గోటబయట రాజపక్సే నియమించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సబ్రీ మాట్లాడుతూ...నేను ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే పనిచేశానని నమ్ముతున్నాను. దేశ సమస్యలను పరిష్కరించడానికి సత్వర చర్యలు అవసరం అని ఆయన అన్నారు. నిజానికి సబ్రీ అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్)తో శ్రీలంక ఆర్థిక పరిస్థితిని చర్చించేందుకు ఈ నెలాఖరులో అమెరికాను సందర్శించాల్సి ఉంది. అయితే అధ్యక్షుడు గోటబయట రాజపక్సే పిలుపునిచ్చిన ఐక్యత ప్రభుత్వాన్ని ప్రతిపక్షం తిరస్కరించడంతో పాలక సంకీర్ణం మెజారిటీని కోల్పోయింది. దీంతో సబ్రీ రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఫ్రీడమ్ పార్టీ అధినేత మైత్రిపాల సిరిసేన మాట్లాడుతూ..‘మా పార్టీ ప్రజల పక్షాన ఉంది. స్వతంత్ర చట్టసభ సభ్యుల సహాయంతో శ్రీలంక ప్రభుత్వం ఇప్పటికీ పనిచేయగలదు. కానీ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో దాని సామర్థ్యం మరింత బలహీనపడింది.అని అన్నారు. అంతేగాక ప్రధాన మంత్రి మహింద్ర రాజపక్స క్యాబినెట్లోని మొత్తం 26 మంది మంత్రులు రాజీనామా చేశారు. అదీగాక శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అజిత్ నివార్డ్ కబ్రాల్ కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాన్ని నియంత్రిస్తున్న రాజపక్స కుటుంబంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్త మవుతోంది. ఈ క్రమంలో గత వారం శ్రీలంక అధ్యక్షుడు గోటబయట రాజపక్స ఇంటిని ముట్టడించేందుకు వందలాది మంది ప్రయత్నించారు కూడా. దీంతో నిరసనకారులు, పోలీసులకు మధ్య జరిగిన హింస కారణంగా డజనుకు పైగా జనాలు గాయపడ్డారు. తప్పనిసరై రాజపక్స జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడమే కాకుండా సైన్యానికి అరెస్టు చేసే అధికారాన్ని ఆదేశించారు. వారాంతంలో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ కూడా విధించారు. ఇప్పటికే భారత్ సుమారు రూ. 200 కోట్ల క్రెడిట్ లైన్లు, దాదాపు రూ. 30 వేల కోట్ల విలువైన ఇంధన సాయాన్ని అందించింది. (చదవండి: లంకలో కల్లోలం) -
లంకలో కల్లోలం
కొలంబో: అల్లకల్లోలంగా మారిన ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే పలు చర్యలను ప్రకటించారు. కేంద్ర కేబినెట్లో చేరాల్సిందిగా ప్రతిపక్షాలను ఆయన సోమవారం ఆహ్వానించారు. ఆయన ఆహ్వానాన్ని ప్రతిపక్షాలు తిరస్కరించాయి. ప్రతిపక్షాలను ప్రభుత్వంలో చేరమని గొటబయ ఆహ్వానించడం ఒక డ్రామా అని ప్రతిపక్ష నేత సమగి జన బలవేగయ విమర్శించారు. సజిత్ ప్రేమదాస, మనో గణేసన్ తదితర విపక్ష నేతలు సైతం ఈ అఖిల పక్ష ప్రభుత్వ యోచనను తిరస్కరించారు. గొటబయ తమ్ముడు, లంక ఆర్థిక మంత్రి బసిల్ రాజపక్సేను ఆర్థిక మంత్రి పదవి నుంచి అధ్యక్షుడు స్వయంగా తొలగించారు. బసిల్ స్థానంలో ప్రస్తుత న్యాయమంత్రి ఆలి సబ్రేను నియమించారు. బెయిల్ అవుట్ ప్యాకేజీపై చర్చించేందుకు బసిల్ సోమవారం అమెరికా వెళ్లి ఐఎంఎఫ్తో చర్చలు జరపాల్సిఉంది. భారత రిలీఫ్ ప్యాకేజీపై కూడా బసిలే చర్చలు జరిపారు. అయితే బసిల్ చర్యలపై లంక అధికార పక్షం ఎస్ఎల్పీపీ కూటమిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో అధ్యక్షుడు బసిల్ను తొలగించినట్లు తెలిసింది. ఆదివారం కేబినెట్లోని మొత్తం 26మంది మంత్రులు తమ రాజీనామాలను సమర్పించారు. అనంతరం కొత్తగా కొందరు మంత్రులు పదవీ స్వీకారం చేశారు. కేంద్ర బ్యాంకు గవర్నర్ రాజీనామా లంక కేంద్ర బ్యాంకు గవర్నర్ అజిత్ నివార్డ్ కబ్రాల్ సోమవారం రాజీనామా చేశారు. గతేడాది సెప్టెంబర్లో కబ్రాల్ ఈ పదవిని స్వీకరించారు. గతంలో ఆయన కేంద్ర సహాయ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2006–15 కాలంలో ఆయన కేంద్రబ్యాంకు గవర్నర్గా వ్యవహరించారు. రెండోదఫా గవర్నర్ పదవి స్వీకరించాక ఆయన విదేశీ రుణాలపై ఆధారపడడాన్ని తగ్గించే యత్నాలు చేశారు. సంక్షోభం ముదురుతున్నా బెయిలవుట్ను వ్యతిరేకించారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం ఆల్టైమ్ గరిష్టాలకు చేరింది. మితిమీరి కరెన్సీ ముదణ్రకు కబ్రాల్ అనుమతివ్వడమే ఇందుకు కారణమన్న ఆరోపణలున్నాయి. కబ్రాల్ వ్యతిరేకతను పట్టించుకోకుండాప్రభుత్వం ఇటీవల ఐఎంఎఫ్ను సాయం ఆర్థించింది. లాఠీ చార్జి, బాష్పవాయు ప్రయోగం ప్రధాని మహింద రాజపక్సే ఇంటిని చుట్టుముట్టిన ఆందోళనకారులను చెదరకొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జి, బాష్పవాయు ప్రయోగానికి దిగారు. కర్ఫ్యూ ఆదేశాలను లెక్కచేయకుండా దాదాపు 2వేల మందికి పైగా ఆందోళనకారులు తంగాలె లోని మహింద ఇంటిని చుట్టుముట్టారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని వీరు డిమాండ్ చేశారు. వీరిపై పోలీసులు బలపయ్రోగానికి దిగారు. నిజానికి ఈ ప్రాంతంలో రాజపక్సే కుటుంబానికి చాలా పట్టు ఉంది. అయితే సంక్షోభం ముదిరిపోయి జీవితాలు అస్థవ్యస్థమవుతుండడంతో సాధారణ ప్రజల్లో మహిందపై వ్యతిరేకత ప్రబలిందని నిపుణులు భావిస్తున్నారు. దేశంలో రాజపక్సే కుటుంబానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. గొటబయ రాజీనామా కోరుతూ ప్రజలు వీధుల్లో ఆందోళనకు దిగుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు గొటబయ ప్రకటించారు. -
శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన అధ్యక్షుడు రాజపక్సే
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే ఆ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్న దృష్యా ఎమర్జెన్సీని ప్రకటించినట్లు తెలుస్తోంది. శ్రీలంకలో పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆర్థిక సంక్షోభంతో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. Sri Lanka: లంక ఘోర ఆర్థికసంక్షోభం.. అర్ధరాత్రి అధ్యక్ష భవనం ముందు హింస! -
పగ తీర్చుకున్న కేకేఆర్ బౌలర్.. వీడియో వైరల్
ఐపీఎల్ 2022లో భాగంగా శుక్రవారం పంజాబ్ కింగ్స్, కేకేఆర్ మ్యాచ్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్కు మయాంక్ అగర్వాల్ రూపంలో ఆరంభంలోనే షాక్ తగిలింది. ఆ తర్వాత వచ్చిన బానుక రాజపక్స ఉన్న కాసేపు కేకేఆర్ బౌలర్లను హడలెత్తించాడు. 9 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 31 పరుగులు చేసిన రాజపక్స చివరికి శివమ్ మావి బౌలింగ్లో వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 4వ ఓవర్లో ఔటైన రాజపక్స అదే ఓవర్లోనే శివమ్ మావికి చుక్కలు చూపించాడు. ఓవర్ తొలి బంతికి ఫోర్ కొట్టిన మావి ఆ తర్వాత వరుసగా హ్యాట్రిక్ సిక్సర్లు సంధించాడు. దీంతో మావి షార్ట్ పిచ్ బంతి వేయగా.. రాజపక్స మరో సిక్సర్ సంధించే యత్నంలో మిడాఫ్లో సౌథీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అలా తన బౌలింగ్లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదిన రాజపక్సను ఔట్ చేసి మావి పగ తీర్చుకున్నాడు. ఈ సందర్భంగా గెట్ అవుట్ ఆఫ్ మై వే అంటూ మావి చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శివమ్ మావి- బానుక రాజపక్స్ వీడియో కోసం క్లిక్ చేయండి -
శ్రీలంకకు 3,230 కోట్ల సాయం
న్యూఢిల్లీ: శ్రీలంక నూతన అధ్యక్షుడు గోతబయ రాజపక్సతో ప్రధాని మోదీ ఢిల్లీలో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను మెరుగుపర్చుకోవడం, దౌత్య సంబంధాలను బలపరుచుకోవాల్సిన ఆవశ్యకతపై ఇరువురూ చర్చించారు. ఈ సమావేశం అనంతరం లంక ప్రభుత్వానికి సుమారు రూ.3,230 కోట్ల రుణ సహాయాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. గోతబయ రాజపక్స మూడు రోజుల పర్యటనలో భాగంగా గురువారం భారత్కి వచ్చారు. శ్రీలంకలోని మైనారిటీ తమిళుల ఆకాంక్షలూ, భద్రతాంశాలూ, వ్యాపార ఒప్పందాలూ, మత్స్యకారుల సమస్యలపై ఈ సమావేశం దృష్టిసారించింది. ఈ సందర్భంగా ప్రధాని మీడియాతో మాట్లాడుతూ... శ్రీలంక సత్వరాభివృద్ధి పథంలో పయనించేందుకు భారత్ సంపూర్ణ మద్దతునిస్తుందని చెప్పారు. శ్రీలంక అభివృద్ధికి, ఉగ్రవాదం అణచివేతకు రూ.3,230 కోట్ల సాయాన్ని ప్రకటించారు. ఉగ్రవాదాన్ని తిప్పికొట్టేందుకు శ్రీలంక పోలీసు అధికారులు భారత్లో శిక్షణ పొందుతున్నట్టు ప్రధాని వెల్లడించారు. లంక అధ్యక్షుడు గోతబయ మాట్లాడుతూ ఇరుదేశాల మధ్య చర్చలు ఫలవంతమయ్యాయనీ, ఆర్థిక సహకారం అంశాన్ని కూడా భారత ప్రధానితో చర్చించానని చెప్పారు. రాజపక్సకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాజ్భవన్లో ఘనంగా స్వాగతం పలికారు. -
శ్రీలంకకు 450 మిలియన్ డాలర్ల సాయం
న్యూఢిల్లీ : శ్రీలంక అభివృద్ధికి భారత్ పూర్తి సహకారం అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశ ఆర్థిక అభివృద్ధికి, ఉగ్రవాదాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు శ్రీలంకకు 450 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందజేయనున్నట్టు మోదీ ప్రకటించారు. ఇటీవల శ్రీలంక అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన గొటబాయా రాజపక్స.. తన తొలి విదేశీ పర్యటనలో భాగంగా గురువారం ఢిల్లీ చేరుకున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రధాని మోదీతో రాజపక్స భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల అభివృద్ధి, ఉగ్రవాదం నివారణకు చేపట్టాల్సిన చర్యలపై ఇరువురు నేతలు చర్చించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. శ్రీలంకతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి భారత్ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఏప్రిల్ 21 ఈస్టర్ రోజున శ్రీలంకలో జరిగిన దాడులను ఖండించిన మోదీ.. ఉగ్రవాదం పోరులో భాగంగా శ్రీలంకకు 50 మిలియన్ డాలర్లు అందజేయనున్నట్టు తెలిపారు. అలాగే శ్రీలంక ఆర్థిక వృద్ధి కోసం 400 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించారు. ఇండియన్ హౌసింగ్ ప్రాజెక్టు కింద శ్రీలకంలో ఇప్పటికే 46,000 గృహాలు నిర్మించామని.. భవిష్యత్తులో మరో 14,000 గృహాలు నిర్మిస్తామని తెలిపారు. శ్రీలంక ఎన్నికల్లో విజయం సాధించిన రాజపక్సకు అభినందనలు తెలిపారు. రాజపక్స మాట్లాడుతూ.. శ్రీలంక అభివృద్ధికి భారత్ ముందుకు వచ్చినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. నిఘా వర్గాలను మరింత శక్తివంతం చేసేందుకు ప్రధాని మోదీ 50 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి కృషి చేస్తానని తెలిపారు. కాగా, శుక్రవారం ఉదయం రాజపక్సకు రాష్ట్రపతి భవన్ వద్ద రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ సాదర స్వాగతం పలికారు. అనంతరం భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ను రాజపక్స కలిసి చర్చలు జరిపారు. -
లంక అధ్యక్షుడి అడుగులు ఎటువైపు?
కొలంబో: చైనాతో సన్నిహితంగా ఉండే రాజపక్స వంశీయులకు చెందిన గొటబాయ రాజపక్స శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో గెలవడంతో భారత్పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీలంకలో ఉన్న మైనార్టీలైన తమిళులు, ముస్లింలు అధికంగా ఉండే శ్రీలంక ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో రాజపక్సకు పెద్దగా ఓట్లు రాలేదు. దేశంలోని మెజార్టీగా ఉన్న సింహళ బౌద్ధుల ఓట్లతో గెలవడంతో భారత్తో బంధంపై అనుమానాలైతే ఉన్నాయి. అవినీతి, బంధుప్రీతి 2005–15 మధ్య గొటబాయ సోదరుడు మహేంద్ర రాజపక్స అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కుటుంబ అధిపత్య పాలనలో దేశం విలవిలలాడింది. అన్ని ముఖ్య పదవుల్ని కుటుంబ సభ్యులకే కట్టబెట్టారు. గొటబాయ రక్షణ శాఖ కార్యదర్శిగా ఉంటే, మరో ఇద్దరు సోదరులు కీలక పదవుల్లో ఉన్నారు. వీరి నలుగురిపై అవినీతి, ప్రజాస్వామ్య విలువల్ని హరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎల్టీటీఈ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడం, భారత్కు కనీసం సమాచారం ఇవ్వకుండానే చైనాకు చెందిన జలాంతర్గాముల్ని హిందూ సముద్ర జలాల్లోకి అనుమతినివ్వడం వంటివి అప్పట్లోనే కలకలం రేపాయి. మహేంద్ర రాజపక్స నలుగురు సోదరుల కుటుంబ పాలనతో విసిగిపోయిన ప్రజలు 2015 ఎన్నికల్లో మహేంద్ర రాజపక్సను గద్దె దింపారు. రాజపక్స హయాంలో శ్రీలంక, భారత్ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉండేవి. మరోవైపు, గొటబాయతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కొలంబోలో సమావేశమయ్యారు. 29న గొటబాయా భారత్కు రానున్నారు. చైనా రుణాలు భారీగా.. మహేంద్ర రాజపక్స అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనా నుంచి భారీగా రుణాలు తీసుకున్నారు. మౌలిక సదుపాయాల కల్పన, రేవులు, ఎయిర్పోర్టుల నిర్మాణం కోసం 700 కోట్ల డాలర్లకు పైగా రుణాలను తీసుకోవడంతో ఇప్పుడు చైనాతో సత్సంబంధాలు కొనసాగించక తప్పని పరిస్థితి. మౌలిక సదుపాయాల కల్పన పేరుతో రుణాలు ఇచ్చి, వాటిని చెల్లించకపోతే విమానాశ్రయాలు, ఓడరేవుల్ని చైనా లీజుకి తీసుకోవడం అంతర్జాతీయ సమాజంలో ఆందోళన పుట్టిస్తోంది. యూరప్, ఆసియా మధ్య వాణిజ్య బంధాలకు ప్రతీకగా నిలిచిన దక్షిణ శ్రీలంకలో హమ్బటన్టోటా పోర్ట్ నిర్మాణానికి రుణాలు చెల్లించలేక 2017లో లంక ప్రభుత్వం 99 ఏళ్ల పాటు చైనాకు లీజుకి ఇవ్వాల్సి వచ్చింది. హిందూ మహాసముద్రంలో భౌగోళికంగా శ్రీలంకకి ఉన్న అరుదైన పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చైనా చేస్తోంది. -
లంకలో మళ్లీ ‘రాజపక్స’
అయిదేళ్లక్రితం జరిగిన అధ్యక్ష, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమిపాలైన రాజపక్స కుటుంబానికే ఆదివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అధికార పీఠం దక్కింది. మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్స సోద రుడు, రక్షణశాఖ మాజీ మంత్రి గోతబయ రాజపక్స విపక్ష శ్రీలంక పొదుజన పెరమున (ఎస్ఎల్ పీపీ) అభ్యర్థిగా రంగంలోకి దిగి 52.25 శాతం మద్దతు చేజిక్కించుకుని సోమవారం ఆ దేశాధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. అధికార యునైటెడ్ నేషనల్ పార్టీ(యూఎన్పీ) 41.99 శాతం ఓట్లు మాత్రమే సాధించింది. మహోద్రిక్తంగా, నువ్వా నేనా అన్నట్టు సాగిన ఈ ఎన్నికల్లో రాజపక్స కుటుంబ పునరాగమనం ఊహించని పరిణామమేమీ కాదు. నిజానికి నిరుడు ఏప్రిల్లో ఈస్టర్ పర్వదినాన రాజధాని కొలంబోలోని పలుచోట్లా, ఉత్తర ప్రాంత నగరం బట్టికలోవలోని చర్చిలో ఉగ్రవాదులు దారుణ మారణహోమాన్ని సృష్టించి 300మందికి పైగా పౌరులను పొట్టనబెట్టు కున్నప్పుడే ఈ పునరాగమనానికి బీజం పడింది. మన దేశం ముందస్తుగా హెచ్చరించినా నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయిన లంక ప్రభుత్వం... అటు తర్వాత పెరిగిన విద్వేషాలను అదుపు చేయడంలో కూడా విఫలమైంది. ఉగ్రవాదులు జన్మతః ముస్లింలు గనుక ఆ వర్గానికి చెందినవారిపైనా, వారి వ్యాపార సంస్థలపైనా దుండగులు దాడులు చేశారు. బాధిత క్రైస్తవ వర్గాల ప్రజానీకం ముస్లింలపై దాడులు చేస్తారని ఆశించిన సింహళ తీవ్రవాద శక్తులు అలాంటిదేమీ జరగకపోవడంతో తామే స్వయంగా రంగంలోకి దిగాయి. ఉగ్రవాదులతో సంబంధాలున్నాయంటూ సింహళ తీవ్రవాద సంస్థలు పదే పదే ఆరోపణలు చేయడంతో తొమ్మిదిమంది మంత్రులు, ఇద్దరు గవర్నర్లు రాజీనామాలు చేశారు. ఈ పరిణామాల పర్యవసానంగా తలెత్తిన అశాంతి అంతిమంగా రాజపక్స కుటుం బానికే తోడ్పడుతుందని రాజకీయ పరిశీలకులు అంటూ వచ్చారు. చివరకు అదే నిజమైంది. తరచు విధ్వంసాలకు దిగే తమిళ టైగర్లను కూకటి వేళ్లతో పెకలించివేసిన తాము కావాలో...భారీ పేలుళ్లు జరుగుతున్నాయని తెలిసినా చేతగానితనాన్ని ప్రదర్శించిన ప్రస్తుత అధినేతలు కావాలో తేల్చుకోవాలని రాజపక్స సోదరులు చేసిన ప్రచారం ఓటర్లను బాగా ఆకట్టుకుంది. సింహళ–బౌద్ధ జాతీయవాదాన్ని తలకెత్తుకుని ఎన్నికల ప్రచార పర్వాన్ని దేశ భద్రత చుట్టూ తిప్పడంలో రాజపక్స సోదరులు విజయం సాధించారు. అయితే వారు కేవలం దేశ భద్రత గురించి మాత్రమే చెప్పి ఊరుకోలేదు. దిగజారిన దేశ ఆర్థికవ్యవస్థను మళ్లీ అభివృద్ధి పట్టాలెక్కిస్తామని, రైతులకు సబ్సిడీ లివ్వడం ద్వారా వ్యవసాయాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పన్నుల్ని గణనీయంగా తగ్గిస్తా మని చెప్పారు. ద్రవ్యోల్బణం, ఉపాధి లేమి, అధిక పన్నులు వగైరాలతో ఇబ్బందులు ఎదుర్కొం టున్న ప్రజానీకం ఆఖరికి శాంతిభద్రతలు కూడా కరువయ్యాయని ఆందోళనలో పడ్డారు. ఈ పరిస్థితి రాజపక్సకు కలిసొచ్చింది. దేశ జనాభాలో సింహళులు, క్రైస్తవులు 70శాతం ఉంటారు. ఈ రెండు వర్గాలనూ తనకు అనుకూలంగా మలచుకోవడంలో రాజపక్స విజయం సాధించారు. దానికితోడు యూఎన్పీ అభ్యర్థిగా సజిత్ ప్రేమదాస రాజకీయంగా అనామకుడు. ఆ పార్టీకి డిప్యూటీ నాయ కుడిగా ఉన్నా విధాన రూపకల్పనలో ఆయన పాత్ర దాదాపు శూన్యం. ఆ పనంతా ప్రధాని రణిల్ విక్రమసింఘే, ఆయనకు సన్నిహితంగా ఉండే అరడజనుమంది నేతలు చూసుకున్నారు. కనుకనే ఆ విధానాలపై వెల్లువెత్తిన విమర్శలకు ప్రేమదాస సమర్థవంతంగా జవాబు ఇవ్వలేకపోయారు. పర్య వసానంగా యూఎన్పీకి కంచుకోటలుగా ఉండే కొలంబో, కాండీ వంటిచోట్ల సైతం గోతబయ రాజపక్స పాగా వేయగలిగారు. మొత్తంగా లంకలో సింహళ పౌరుల జనాభా అధికంగా ఉండే దక్షిణ, పశ్చిమ, మధ్య శ్రీలంక ప్రాంతాల్లో గోతబయ రాజపక్సకు అత్యధిక ఓట్లు లభించగా...తమిళ జనాభా, ముస్లింలు ఎక్కువుండే ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో సజిత్కు 80 శాతం ఓట్లు వచ్చాయి. అయితే మహిందా రాజపక్స పాలనలో అమలైన అణచివేత విధానాలను ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేదు. వాటి అమలులో సోదరుడికి గొతబయ రాజపక్స రక్షణమంత్రిగా చేదోడువాదోడుగా ఉన్నారు. ఆ పదేళ్లకాలంలో అనేమంది తమిళ రాజకీయ నాయకులు హత్యలకు గురికాగా, వేలాది మంది పౌరులు, పలువురు పాత్రికేయులు అదృశ్యమయ్యారు. వారిలో అనేకమంది ఆచూకీ ఇప్పటికీ తెలియడంలేదు. టైగర్ల అణచివేత మాటున తమిళులపై సాగించిన హత్యలు, అకృత్యాలపై ఐక్య రాజ్యసమితి పర్యవేక్షణలో విచారణ జరిగింది. ప్రత్యేకించి గోతబయ రాజపక్సపై పలు అవినీతి కేసులు పెండింగ్లో ఉన్నాయి. తమిళులపై సాగించిన హింసాకాండకు సంబంధించి అమెరికా న్యాయస్థానాల్లో సివిల్ వ్యాజ్యాలు పెండింగ్లో ఉన్నాయి. 2009లో కొలంబో నగరంలో ఒక పత్రిక సంపాదకుడిని కాల్చిచంపిన కేసులో ఆయన ప్రమేయమున్నదని ఆరోపణలొచ్చాయి. మానవ హక్కుల ఉల్లంఘనల విషయంలో జవాబుదారీతనాన్ని నిర్ధారించి బాధ్యులపై చర్యలు తీసు కుంటామని నాలుగేళ్లక్రితం లంక ప్రభుత్వం హామీ ఇచ్చింది. సహజంగానే అలాంటి హామీలన్నీ ఇప్పుడు అటకెక్కుతాయి. పైకి ఏం చెప్పినా రాజపక్స సోదరుల మొగ్గు మొదటినుంచీ చైనావైపే ఉంటున్నది. టైగర్లను పూర్తిగా అణచివేశాక దేశవ్యాప్తంగా ప్రారంభించిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో అత్యధిక భాగం కాంట్రాక్టులు చైనా సంస్థలకే లభించాయి. అప్పట్లో దక్షిణ హంబన్టోటాలో నిర్మించిన ఓడరేవుకు అయిన వ్యయాన్ని భరించలేక చివరకు దాన్ని నిర్మించిన చైనా సంస్థకే శ్రీలంక 99 ఏళ్ల లీజుకిచ్చింది. రాజపక్స పాలనాకాలంలో చైనా జలాంతర్గాముల్ని కొలంబో రేవులో లంగరేయడానికి అనుమ తించినందుకు మన దేశం తీవ్ర అభ్యంతరం చెప్పింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల సంబంధాలు మున్ముందు ఎలా ఉంటాయోనన్న సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. తాను ప్రజానీకానికంతకూ ప్రాతినిధ్యం వహించే సమర్థపాలన అందిస్తానని గోతబయ అంటున్నారు. దాన్ని ఏమేరకు నిల బెట్టుకోగలరో చూడవలసి ఉంది. -
లంక ఎన్నికల్లో రాజపక్స విజయం
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడిగా గొటబాయ రాజపక్స (70) విజయం సాధించారు. తన ప్రత్యర్థి ప్రేమదాస రణసింఘేపై దాదాపు 13 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. లంకకు ఏడో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న గొటబాయ ఆ పదవిలో అయిదేళ్ల పాటు కొనసాగనున్నారు. లంకలోని ప్రాచీన నగరం అనురాధపురంలో ఆయన సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజపక్స కుటుంబం నుంచి 2005–15 మధ్య మహింద రాజపక్స అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన తమ్ముడే ఇప్పుడీ ఎన్నికల్లో గెలుపొందిన గొటబాయ. వివాదాస్పదుడిగానూ, ఎల్టీటీఈ తీవ్రవాదులను అణచివేసిన మిలిటరీ వార్ హీరోగానూ గొటబాయకు పేరుంది. నమ్మకాన్ని నిలబెడతా: గొటబాయ ఆదివారం వెలువడిన ఫలితాల్లో గొటబాయ 52.25 శాతం ఓట్లను (6,924,255) సాధించగా, ఆయన ప్రత్యర్థి ప్రేమదాస 41.99 శాతం ఓట్లను (5,564,239) సాధించారని ఎన్నికల కమిషన్ చైర్మన్ మహింద దేశప్రియ చెప్పారు. విజయం ఖరారు కాగానే గొటబాయ రాజపక్స.. ‘శ్రీలంక కోసం చేసే కొత్త ప్రయాణంలో దేశ ప్రజలూ భాగస్తులే. ఎన్నికల ప్రచారంలో మెలిగినట్లే శాంతియుతంగా సంబరాలు చేసుకుందాం. నన్ను ఎన్నుకున్న ప్రజలకు కృతజ్ఞుడినై ఉంటాను. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతాను’ అంటూ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రధాని రణిల్ విక్రమ సింఘే రాజీనామా చేసే అవకాశం ఉంది. ప్రధాన మంత్రిగా మాజీ అధ్యక్షుడు, గొటబాయ సోదరుడు మహింద రాజపక్స నియమితులు అయ్యే అవకాశం కనిపిస్తోంది. అభినందనలు తెలిపిన మోదీ.. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన గొటబాయ రాజపక్సకు భారత ప్రధాని మోదీ అభినందనలు చెప్పారు. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలపరిచేందుకు ఎదురుచూస్తున్నానని చెప్పారు. దీనిపై గొటబాయ స్పందించారు. మోదీకి, భారత ప్రజలకు కృతజ్ఙతలు చెప్పారు. త్వరలోనే మోదీని కలుస్తానని ట్వీట్ చేశారు. -
నేడు శ్రీలంక ప్రధాని రాజపక్స రాజీనామా!
కొలంబో: శ్రీలంకలో రెండు నెలలుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి త్వరలో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాని పదవికి మహింద రాజపక్స నేడు రాజీనామా చేయనున్నట్లు సమాచారం. పార్లమెంట్ను రద్దు చేస్తూ అధ్యక్షుడు సిరిసేన తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమంటూ గురువారం స్పష్టం చేసిన సుప్రీంకోర్టు.. ప్రధాని రాజపక్స, ఆయన మంత్రివర్గం తమ అధికారాలను నిర్వర్తించకుండా కోర్టు విధించిన స్టేను ఎత్తివేసేందుకు నిరాకరిస్తూ శుక్రవారం మరో కీలక తీర్పు వెలువరించింది. ‘దేశంలో రాజకీయ అస్థిరత తొలగిపోయేందుకు వీలుగా రాజపక్స తన పదవికి శనివారం రాజీనామా చేయనున్నారు. శ్రీలంక పొదుజన పెరమున(ఎస్ఎల్పీపీ), శ్రీలంక ఫ్రీడం పార్టీ(ఎస్ఎల్ఎఫ్పీ)లు మరికొన్ని పార్టీలతో కలిసి కొత్త కూటమి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు’ అంటూ రాజ పక్స కుమారుడు నమల్ శుక్రవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. రాజపక్స తప్పుకుంటే తమ నేతను తిరిగి ప్రధానిగా చేయడం మినహా అధ్యక్షుడు సిరిసేనకు మరో మార్గంలేదని విక్రమసింఘే మద్దతుదారులు అంటున్నారు. అయితే, విక్రమసింఘేతో విభేదాలున్నందున ఆయన్ను తిరిగి ప్రధానిగా నియమించేది లేదని సిరిసేన స్పష్టం చేస్తున్నారు. -
లంక పార్లమెంటులో ముష్టిఘాతాలు
కొలంబో: శ్రీలంక పార్లమెంట్ గురువారం యుద్ధ భూమిని తలపించింది. సభ్యులు పరస్పరం ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. చేతి కందిన వస్తువులను విసిరేసుకున్నారు. వెంటనే ఎన్నికలు జరపాలంటూ స్పీకర్ను కొందరు సభ్యులు చుట్టుముట్టగా మరికొం దరు ఆయనకు రక్షణగా నిలిచారు. ఒక సభ్యుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బుధవారం పార్లమెంట్లో జరిగిన బలపరీక్షలో ప్రధాని మహింద రాజపక్స ఓటమి పాలైన విషయం తెలిసిందే. గురువారం సభ సమావేశం కాగానే ఉద్వాసనకు గురైన ప్రధాని రణిల్ విక్రమసింఘే మాట్లాడుతూ.. దేశంలో వెంటనే ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్పై ఓటింగ్ జరపాలని కోరారు. ఇందుకు స్పీకర్ జయసూర్య అంగీకరించడంతో సభలో గొడవ మొదలైంది. రాజపక్స మాట్లాడేందుకు యత్నించగా సభలో విశ్వాసం కోల్పోయినం దున ప్రధానిగా కాకుండా కేవలం ఎంపీగానే ఆయన్ను గుర్తిస్తానని జయసూర్య ప్రకటిం చారు. ఓటింగ్కు సన్నద్ధమవుతున్న దశలో అధ్యక్షుడు సిరిసేన, రాజపక్స మద్దతుదారులైన కొందరు ఎంపీలు స్పీకర్ను చుట్టుముట్టి దాడికి యత్నించగా యూఎన్పీ సభ్యులు రక్షణగా నిలిచారు. ఈ క్రమంలో ఒక సభ్యుడు స్పీకర్ మైక్ను విరగ్గొట్టారు. మరొకరు డస్ట్బిన్ను, పుస్తకాలను ఆయనపైకి విసిరేశారు. విశ్వాస పరీక్షలో రాజపక్స ఓడినం దున తమదే అసలైన ప్రభుత్వమని విక్రమ సింఘేకు చెందిన యూఎన్పీ అంటోంది. అయితే, అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరి స్తున్నాననీ, ఇప్పటికీ రాజపక్సనే ప్రధాని అంటూ సిరిసేన స్పీకర్కు లేఖ రాయడం గమనార్హం. ప్రధానికి పార్లమెంట్లో మెజారిటీ ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. -
లంక పయనమెటు?
శ్రీలంకలో రాజకీయ సంక్షోభం ఊహించని మలుపు తిరిగింది. రెండేళ్ల ముందుగానే పార్లమెంట్ రద్దు కావడంతో వచ్చే జనవరి 5న మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. 225 మంది సభ్యుల పార్లమెంట్ను రద్దుచేయడంతో పాటు ఎన్నికల నిర్వహణకు అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తీసుకున్న నిర్ణయాన్ని అంతర్జాతీయ సమాజం తప్పుపట్టింది. ఈ నెల 14న విశ్వాస పరీక్ష నిర్వహించేందుకు స్పీకర్ కె.జయసూర్య చేస్తున్న ప్రయత్నాలకు బ్రేక్ పడింది. రాజపక్సే మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రావడం భారత్కు కూడా రుచించడంలేదు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన భారత్తో సంబంధాలకు తక్కువ ప్రాధాన్యమిచ్చి చైనాతో సన్నిహితంగా మెలిగారు. రాజపక్స మళ్లీ అధికారంలోకి వస్తే శ్రీలంకలో చైనా ఆధిపత్యం పెరుగుతుందని భారత్ ఆందోళనగా ఉంది. అస్థిరత మొదలైందిలా.. గత నెల 27న ప్రధాని విక్రమ సింఘేను అధ్యక్షుడు సిరిసేన అకస్మాత్తుగా పదవి నుంచి తొలగించి, మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్సను కొత్త ప్రధానిగా నియమించడంతో శ్రీలంక రాజకీయాల్లో అస్థిరత ఏర్పడింది. అధికారం కోసం విక్రమసింఘే, రాజపక్సల మధ్య కొనసాగుతున్న పోరుపై అనేక దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఎవరి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడాలనేదానిపై పార్లమెంట్లో ఓటింగ్కు అనుమతించాలంటూ సిరిసేనపై అమెరికా, ఐరాస, ఐరోపా దేశాల సంఘం (ఈయూ) ఒత్తిడి పెంచాయి. ఫిరాయింపులను ప్రోత్సహించి, తన పార్టీకి తగినంత బలాన్ని కూడగట్టేందుకే సిరిసేన పార్లమెంట్ను తొలుత సస్పెండ్ చేశారని భావించారు. పార్టీ మారేందుకు తమకు లక్షలాది డాలర్లు ఎరగా చూపారని కొందరు సభ్యులు పేర్కొన్నారు. తాను ప్రధానిగా నియమించిన రాజపక్స మెజారిటీని నిరూపించుకునే అవకాశాలులేవని తేలడంతో సిరిసేన పార్లమెంట్ రద్దుకు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. సంకీర్ణంలో లుకలుకలు... 2015లో సిరిసేన నాయకత్వంలోని శ్రీలంక ఫ్రీడం పార్టీ, విక్రమసింఘే ఆధ్వర్యంలోని యునైటెడ్ నేషనల్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ప్రభుత్వ పనితీరు, ఆర్థిక విధానాలు, ఓడరేవులను భారత్కు లీజుకిచ్చిన విషయంలో రెండు పార్టీల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. కొలంబోలోని ‘ఈస్ట్ కంటెనర్ టెర్మినల్’ను అభివృద్ధి చేసే బాధ్యతను భారత్కు అప్పగించాలని విక్రమ్సింఘే భావించగా, సిరిసేన ఆ ప్రతిపాదనని వ్యతిరేకించారు. రాజపక్స అధికారంలో ఉండగా మూడోసారి అధ్యక్షుడయ్యేందుకు(గతంలో రెండుసార్లు) వీలుగా రాజ్యాంగానికి 18వ సవరణ తీసుకువచ్చారు. దానిస్థానంలో రెండుసార్లకే అధికారం పరిమితం చేస్తూ సిరిసేన–విక్రమసింఘే ప్రభుత్వం 19వ సవరణ చేసింది. ఈ తాజా సవరణతో మళ్లీ అధ్యక్షుడయ్యే అవకాశం లేకపోవడంతో మహిందా రాజపక్స ప్రధాని పదవిపై కన్నేశారు. అదే సమయంలో విక్రమసింఘే, సిరిసేనల మధ్య ఏర్పడిన విభేదాలు ఆయనకు కలిసొచ్చాయి. పార్లమెంట్ రద్దుపై కోర్టుకెళ్తాం: యూఎన్పీ కొలంబో: శ్రీలంక పార్లమెంట్ను రద్దు చేస్తూ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తీసుకున్న నిర్ణయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు పదవీచ్యుత ప్రధాని విక్రమసింఘే నేతృత్వంలోని యునైటెడ్ నేషనల్ పార్టీ(యూఎన్పీ) తెలిపింది. ‘నియంతృత్వ పోకడల నుంచి రాజ్యాంగాన్ని, చట్టాన్ని పరిరక్షించుకునేందుకు కోర్టు జోక్యాన్ని కోరనున్నాం. అధ్యక్షుడు సిరిసేన నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా కోర్టులు, పార్లమెంట్, ఎన్నికల బరిలోనూ పోరాడతాం’ అని యూఎన్పీకి చెందిన మంగళ సమరవీర శనివారం తెలిపారు. ప్రధాని పదవి నుంచి విక్రమ సింఘేను తప్పిస్తున్నట్లు అక్టోబర్ 26వ తేదీన ప్రకటించిన అధ్యక్షుడు సిరిసేన..కొద్ది రోజుల్లోనే మాజీ అధ్యక్షుడు రాజపక్సను ప్రధానిగా నియమిస్తూ వివాదాస్పద నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రధాని నివాసం ఎదుట ఆందోళనకు దిగిన విక్రమసింఘే మద్దతుదారులు విక్రమసింఘే, సిరిసేన, రాజపక్స -
పార్లమెంటు భేటీకి సిరిసేన అంగీకారం
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన పార్లమెంటును వచ్చే వారం సమావేశపర్చే అవకాశముందని స్పీకర్ కరు జయసూర్య కార్యాలయం తెలిపింది. దేశంలో నెలకొన్న రాజ్యాంగ సంక్షోభానికి ప్రజాస్వామ్య పద్ధతిలోనే పరిష్కారం కనుగొనాలని చేసిన సూచనకు అధ్యక్షుడు ఓకే చెప్పారు. శ్రీలంక కొత్త ప్రధానిగా రాజపక్స నియామకంపై అటార్నీ జనరల్ జె.జయసూర్య న్యాయసలహా ఇచ్చేందుకు నిరాకరించారు. రాజ్యాంగంలోని 19వ అధికరణ ప్రకారం అధికారం లేకపోయినప్పటికీ ప్రధాని విక్రమసింఘేను పదవి నుంచి సిరిసేన తప్పించడాన్ని ఆయన తప్పుపట్టారు. మరోవైపు రాజపక్సను కొత్త ప్రధానిగా చైనా, బురుండి తప్ప మరేదేశాలు అంగీకరించకపోగా, సిరిసేనపై అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి పెరిగింది. -
మోదీ దూతకు ‘లంక’ వాత
లోక్సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నరేంద్ర మోదీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ఆహ్వానం మీదనే శ్రీలంక అధ్యక్షుని హోదాలో రాజపక్స ఢిల్లీ వచ్చారు. అంటే శ్రీలంక ఎన్నికల నేపథ్యంలో ఎనిమిది మాసాల ముందు మోదీ నుంచి రాజపక్సకు ఆహ్వానం వెళ్లింది. నడవడికలో, పాలనా నిర్వహణలో, అందుకు సంబంధించిన వ్యూహాలలోని కొన్ని సమాన ధర్మాలు కొందరు పాలకుల మధ్య బాంధవ్యం ఏర్పడేటట్టు చేస్తాయి. చేతిలో కత్తికి రెండువైపులా పదును ఉంటుంది. ఆ కత్తితో పండునూ కోయవచ్చు. దానితోనే మనిషి పీకనూ కోసేయవచ్చు. సాంకేతిక పరిజ్ఞానం కూడా ఇంతే. ఇటీవలి కాలంలో ఆసియా ఖండంలోనే ‘ప్రజాస్వామ్య’ దేశాలుగా పదే పదే చెప్పుకుంటున్న దేశాలలో శ్రీలంక ఒకటి. ఇది మన పొరుగు రాజ్యమే. ఈ దేశానికి రెండుసార్లు అధ్యక్షులుగా ఎన్నికై, వరసగా పదేళ్లు పదవిని నిర్వహించిన వ్యక్తి మహీంద రాజపక్స. రెండు రోజుల క్రితం జరిగిన ఎన్నికలలో మూడో దఫా కూడా అదే పీఠం అధిరోహించాలని కుతూహలపడిన రాజ పక్స ఘోరంగా ఓడిపోయారు. ‘ప్రజాస్వామ్యం’, ‘అభి వృద్ధి’ అని నినాదాలు ఇస్తూనే, ప్రజలను మభ్యపెడు తూనే మానవహక్కులను దారుణంగా అగౌరవ పరిచి నందుకే ఈ ఓటమి. దేశీయ మైనారిటీలైన తమిళులను ఊచకోత కోయించిన నాయకుడు రాజపక్స. నిజానికి శ్రీలంక ప్రభుత్వాలు తమిళులను అంతర్యుద్ధం దిశగా గుంజాయి. రెండు మూడు దశాబ్దాలుగా సైనికదాడు లతో అతలాకుతలం చేశాయి. దీనికి పరాకాష్ట రాజపక్స నిర్వాకం. ఆయనే ఈ పర్యాయం కూడా ఎన్నికలలో గెలుపు తథ్యమని భావించి భంగపడ్డాడు. ఫలితాలు ఎలా ఉన్నా, ఈ చరిత్రాత్మక ఎన్నికల కోలాహలంలో ఎక్కువమంది దృష్టికి రాకుండా మిగిలి పోయిన ఒక కీలక పరిణామం ఉంది. మైత్రీపాల చరిత్రాత్మక విజయం రాజపక్సను కాదని లంకవాసులు మైత్రీపాల సిరిసేనకు పట్టం కట్టారు. నిజానికి సిరిసేన రాజపక్స మంత్రివర్గ సభ్యుడే. లంక మంత్రివర్గంలో ఆరోగ్య, నీటిపారుదల, పార్లమెంటరీ వ్యవహారాల శాఖలను ఆయనే చూశారు. ఆ మధ్య వరకు ఇవే శాఖలను నిర్వహిస్తూ, రాజపక్స సహచరునిగా పనిచేసిన సిరిసేన తమిళ మైనారిటీల ఊచకోతలకు నిరసనగా పదవికి రాజీనామా చేశారు. ఇలాంటి ఊచకోతతో దేశాన్ని అధోగతికి నెట్టినందుకు నిరసనగానే పదవి నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటిం చారు కూడా. ఈ సిరిసేననే ఇప్పుడు పదవి వరించింది. జనవరి 9న ఆయన అధ్యక్షునిగా ప్రమాణం చేశారు. రాజపక్సకు పాఠం పాలకులు ఎన్ని తప్పుడు పనులైనా చేయవచ్చు. ప్రజా స్వామ్య వ్యతిరేకులుగా తయారుకావచ్చు. కానీ ప్రజలు మాత్రం ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల తమకు ఉన్న విశ్వా సాన్ని సడలించుకోరు. ఆ వ్యవస్థను రక్షించుకోవడానికి త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు కూడా. ఈ అం శాన్ని ఇటీవలనే భారత్, శ్రీలంకలలో జరిగిన ఎన్నికలు నిరూపించాయి. నాలుగైదు ప్రతిపక్షాలు న్యూడెమా క్రటిక్ ఫ్రంట్పేరుతో కూటమిగా ఏర్పడి, శ్రీలంక ఫ్రీడం పార్టీకి చెందిన సిరిసేన నాయకత్వంలో రాజపక్సపై పోరాడి చరిత్రాత్మక విజయం సాధించాయి. రాజపక్స ఓటమికి కంకణం కట్టుకున్న కూటమిలో శ్రీలంక మితవాద రాజకీయపక్షం యునెటైడ్ నేషనల్ పార్టీతో పాటు, జాతిక హేల ఉరు మాయ జనతా విముక్తి పెరుమున, మార్క్సిస్ట్ పార్టీలు కలిశాయి. జాతీ య మైనారిటీలు తమిళులకు, ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇతర ప్రముఖ పక్షాలు కూడా విపక్ష ఫ్రంట్నే సమర్థించాయి. మితిమీరిన విశ్వాసంతో గడువుకు రెండేళ్ల ముందే ఎన్ని కలు ప్రకటించిన రాజపక్స అధికార పీఠాన్ని వదిలి పెట్టడానికి నిజానికి సిద్ధంగా లేరు. దక్షిణాసియా దేశాలలో నియంత పోకడలను కలిగిన నాయకునిగా పేరు పొందిన రాజపక్సను ప్రజలు నిరాకరించారు. ఒకే గూటి పక్షులు 2014 మే నెలలో పూర్తయిన భారత లోక్సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నరేంద్ర మోదీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మోదీ ప్రమాణ స్వీకారో త్సవానికి ఆయన ఆహ్వానం మీదనే శ్రీలంక అధ్యక్షుని హోదాలో రాజపక్స ఢిల్లీకి వచ్చారు. అంటే శ్రీలంక ఎన్నికల నేపథ్యంలో ఎనిమిది మాసాల ముందు మోదీ నుంచి రాజపక్సకు ఆహ్వానం వెళ్లింది. నడవడికలో, పాలనా నిర్వహణలో, అందుకు సంబంధించిన వ్యూహా లలోని కొన్ని సమాన ధర్మాలు కొందరు పాలకుల మధ్య బాంధవ్యం ఏర్పడేటట్టు చేస్తాయి. అంతా అనుసరించే సాధారణ, ప్రజాస్వామిక మార్గంలో కాకుండా ప్రజలతో నేరుగా సంబంధాలు, రాజకీయ ప్రచారం ద్వారా కాకుండా సాంకేతిక పరి జ్ఞానం ఆసరాగా పుట్టుకొచ్చిన డిజిటల్ ప్రజాస్వామ్యం వక్రమార్గంలో సృష్టించే వ్యక్తి ఊదర ద్వారా (పర్సనలైజ్డ్ హైప్) ఓటర్లను ప్రలోభ పెట్టడం సులభసాధ్యమేనని ఆ ఎన్నికలు రుజువు చేశాయి. ఆ పంథాలో తొలిసారిగా భారతదేశంలో జరిగిన ఈ ప్రయోగం జయప్రదమైంది కూడా. ఇది వాస్తవం కాకపోతే 2014 సాధారణ ఎన్నికల ఫలితాలు ఆ రీతిలో సాధ్యమయ్యేవి కావు. ఆ ఎన్ని కలలో భారతీయ ఓటర్లను డిజిటల్ ఊదర ద్వారా ప్రలో భ పెట్టడానికి బైనరీ డిజిట్స్ ఆధారంగా (అంటే 0,1 సంఖ్యలతో) సోషల్ మీడియా నెట్వర్క్ పరిధిలో ఈ విచిత్ర ప్రయోగం జరిగింది. దీనితో ఎంతటి దగాకోరు ప్రచారాన్నయినా చేసుకునే వీలుంది. ఓటర్లను మోస గించే అవకాశం ఉంది. ఇదంతా సోషల్ నెట్వర్కింగ్ వేదికల ద్వారానే సాగుతుంది. అంటే ఫేస్బుక్, వాట్సప్, ట్వీటర్, యూట్యూబ్, లింక్డిన్ వగైరా. మొన్నటి ఎన్ని కలలో బీజేపీ విజయానికి మూలాలు ఈ వేదికలే. ఈ వ్యూహంలో ప్రధాన సూత్రధారి డాక్టర్ అరవింద్ గుప్తా. ఇతడు బీజేపీ ఐటీ విభాగానికి సీఈఓ. ఇలినాయిస్, షికాగో విశ్వవిద్యాలయాలలో పట్టభద్రుడైన గుప్తా, కాన్పూర్ ఐఐటీలో ప్రజ్ఞాపట్టభద్రుడు. మోదీకి అనుకూ లంగా, సోషల్ మీడియా వేదికగా, ఊదర ద్వారా పార్టీ విజయానికి బాటలు వేసినవాడు ఈ గుప్తాయే. ఇలాంటి పరిణామాలను ఊహించే కాబోలు, ‘‘సోషల్ మీడియా, నెట్వర్క్ అనేవి దగాకోరు, మోసపూరిత సాధనం’’ (‘బుల్షిట్’) అని 2012లోనే ప్రసిద్ధ అమెరికన్ మీడి యా విమర్శకుడూ, విశ్లేషకుడూ న్యూస్వీక్, న్యూయార్క్ టైమ్స్, లాస్ ఏంజెల్స్ టైమ్స్ సీనియర్ రచయిత బీజే మెండెల్సన్ (‘సోషల్ మీడియా ఈజ్ బుల్ షిట్’, న్యూయార్క్ ప్రచురణ) వెల్లడించాడు. సరిగ్గా ఇదే ప్రయోగాన్ని లంక అధ్యక్ష ఎన్నికలలో కూడా జరిపేం దుకు ప్రయత్నం జరిగింది. బెడిసికొట్టిన వ్యూహం రెండు నెలల్లో శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నా యని తెలియగానే డిజిటల్ మీడియా ప్రచారంతో రాజ పక్సకు విజయానికి దోహదం చేయడానికి అరవింద్ గుప్తా నవంబర్లో కొలంబో వెళ్లాడు! కొలంబో మీడి యా ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వకుండా ‘నేను ఏ దేశం ఎందుకు సందర్శిస్తానో ఇతరులకు అనవసరం’ అని (‘హిందూ’, 26-12-2014) గుప్తా తప్పుకున్నాడు. 2009 నాటి లోక్సభ ఎన్నికల పరాజయంతో డిజిటల్ మీడియా, కొత్త వ్యూహరచనలతో ఎన్నికల్లో పరోక్ష విజ యాలకు బీజేపీ ఏతామెత్తింది. ఆ పరోక్ష మార్గానికి కాషా య పార్టీ ఐదేళ్ల నాడే వ్యూహం పన్నింది. ఈ విషయాన్ని గుప్తాయే ఒప్పుకున్నారు! ఈ ప్రయోగం కిందిస్థాయిలో మనిషి ప్రవర్తనను అంచనా వేసుకోడానికి ఉపయోగ పడుతుందని గుప్తా ‘దైనిక సమాచార్’ పత్రికా యాజ మాన్యం‘ఎక్స్చేంజి 4 మీడియా’ పేరిట నిర్వహించిన సదస్సులో (సెప్టెంబర్ 5, 2014) వివరించాడు! ఈ ప్రయోగ లక్ష్యం, మాధ్యమం ఏదైనా అభ్యర్థుల గెలుపే దానికి ముఖ్యం. 2009 ఎన్నికల తర్వాత ‘(బీజేపీకి) దిశా, దశా కోల్పోయాం. పార్టీ సంక్షోభంలో పడింది. అందుకే ముందుగా వ్యూహం పన్నడం ఎంత అవస రమో గుర్తించాం. అప్పుడే విజయ సాధన వ్యూహానికి విత్తనాలు చల్లాం. 2010 లోనే ఇదంతా జరిగింది’ అని గుప్తా చెప్పాడు! దానికి అనుగుణంగానే ఎలక్టొరల్ బూత్లను విభజించాం; ఈ బూత్లను ఇంటర్నెట్ ద్వారా ఎలా సానుకూలం చేసుకోవాలో అధ్యయనం చేశాం. దానికి తగ్గట్టుగానే 22 లక్షల మంది ఆన్లైన్ ప్రచారకులకు వలంటీర్లుగా తర్ఫీదు ఇచ్చాం’ అని చెప్పాడు గుప్తా! సరిగ్గా ఈ పాఠాన్ని శ్రీలంకలో రాజపక్స పార్టీకీ, రాజపక్సకూ బోధించడానికీ బీజేపీ గుప్తాను పంపించి ఉంటుంది! ప్రత్యర్థుల ఇమేజిని మసిపూసి మారేడు కాయ చేయడం కోసం వెబ్సైట్లు తెరవడం సాఫ్ట్వేర్ బోగస్ కంపెనీల పని అని ఐటీ నిపుణులు వెల్లడించా రు. ఐటీ కంపెనీలు లేదా వెబ్సైట్ల దుర్వినియోగంతో కోరుకున్న వాడి పాప్యులారిటీ రేటింగ్ను ఎంతైనా పెరిగి నట్టు చూపించుకోవచ్చునని నిపుణుల అంచనా! 8 శాతం అభిప్రాయాన్ని 80 శాతం మంది అభిప్రాయంగా బైనరీ డిజిట్స్ మాయాజాలంతో చూపవచ్చునని నిపు ణులు తేల్చారు! ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయి కాబోలు! కాని మోదీ దూతగా రాజపక్సకు సాయంగా వెళ్లిన గుప్తాకు లంకేయుల వాత మాత్రమే మిగిలింది. అన్ని పాజిటివ్ ఓట్లు కాదు ఏది ఏమైనా, ప్రధాని మోదీ ఇకనైనా భారత-శ్రీలంక స్నేహ సంబంధాల పునరుద్ధరణ శాంతికి దోహదం చేస్తుందని చెప్పడమూ, శ్రీలంక అధ్యక్షునిగా సిరిసేన కూడా అదే కోరుకోవడమూ శుభసూచకం. ఇందుకు పునాది మాత్రం-భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి డి.రాజా చెప్పినట్టు ‘తమిళ జాతీయ మైనారి టీల సమస్యకు తగిన రాజకీయ పరిష్కారం వైపుగా సిరి సేన ప్రభుత్వం శ్రద్ధ వహించడం’. ప్రజాస్వామ్యంలో పాలకుల ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఓటర్లు చెప్పే తీర్పులు కొన్ని సందర్భాల్లో ఓట్లుగానే నమోద వుతాయి. కాని ఆ ఓటింగ్ను నూతన పాలక పక్షానికి పాజిటివ్ ఓటింగ్గా మాత్రం భావించరాదని చరిత్ర పాఠం. (వ్యాసకర్త మొబైల్: 9848318414) -
రాజపక్సను విచారిస్తాం
కొలంబో: ఓటమి అనంతరం అధికారాన్ని అంటిపెట్టుకుని ఉండటానికి సైనిక కుట్రకు వ్యూహం పన్నారనే ఆరోపణపై శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహీంద రాజపక్సపై ఆ దేశ కొత్తప్రభుత్వం విచారణ జరపాలని నిర్ణయించింది. రాజపక్స ప్రతిపాదనకు సైన్యాధినేతతో పాటు పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ తిరస్కరించినందునే ఆయన వెనక్కి తగ్గారని తెలిపింది. అన్నిపార్టీలకూ ఆహ్వానం: సిరిసేన జాతీయ సమైక్యతకు కృషిచేసేందుకు అన్ని రాజకీయ పార్టీలూ తన ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని లంక కొత్త అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన పిలుపునిచ్చారు. మైనారిటీలకు తగిన గుర్తింపునిస్తూ మతసామరస్యంకోసం పాటుపడతామని పార్టీలు ప్రతిజ్ఞ చేయాలని జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో చెప్పారు. ఎన్నిక హామీ ప్రకారం కార్యనిర్వహక అధికారాలను పార్లమెంటుకు అప్పగిస్తానన్నారు. -
లంకలో కొత్త నీరు!
అందరూ ఊహించినట్టే, సర్వేలన్నీ జోస్యం చెప్పినట్టే శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స అక్కడ జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. విపక్షానికి చెప్పుకోదగ్గ నాయకుడే లేని స్థితిని అదునుగా తీసుకుని, తనపై అంతకంతకూ పెరుగుతున్న అసంతృప్తిని పసిగట్టి... ఇప్పుడే ఎన్నికలకు వెళ్లడం ఉత్తమమని రాజపక్స భావించారు. పైగా ఆయనకు సంఖ్యా శాస్త్రంపై అపారమైన నమ్మకం. ఇటు సంవత్సరమూ, అటు తేదీ తన అదృష్ట సంఖ్య 8కి సరిపోయేలా ఉన్నాయి గనుక... జనవరి 8న ఎన్నికలు జరిగేలా ఆయన చూశారు. అన్నీ సరిపోయినా అధికార పీఠం అందుకోవడానికి తప్పనిసరైన జనం మద్దతు మాత్రం ఆయనకు లేకుండా పోయింది. ఇందుకు రెండే కారణాలు-ఆయన కుటుంబ పాలన, దానితో పెనవేసుకుపోయిన అవినీతి. రాజపక్స ఇద్దరు సోదరులు మంత్రులుకాగా, మరో సోదరుడు పార్లమెంటు స్పీకర్, కుమారుడు ఎంపీ. మొన్నటి నవంబర్లో ఎన్నికలు ప్రకటించిన రెండురోజుల తర్వాత అప్పటికి రాజపక్స ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా, నంబర్ టూ గా ఉన్న మైత్రిపాల సిరిసేన తన పదవికి రాజీనామా చేసి విపక్ష శిబిరంలో చేరి ఉండకపోతే ఇదంతా యథాతథంగా కొనసాగేదేమో! ఎల్టీటీఈని తుడిచిపెట్టడాన్ని స్వాగతించిన సింహళ బౌద్ధులు 2009 ఎన్నికల్లో రాజపక్స వెనక గట్టిగా నిలబడ్డారు. ఆ ఎన్నికల్లో మైనారిటీ వర్గాలైన తమిళులు (15.3శాతం), ముస్లింలు (9.3 శాతం), క్రైస్తవులు (7.4శాతం) అనేక కారణాలవల్ల చీలివున్నారు. మొత్తంగా 32 శాతంగా ఉన్న మైనారిటీలు ఆ ఎన్నికల్లో విడివడి ఉండటంతో రాజపక్స ఘనవిజయం సాధించగలిగారు. ఈసారి పరిస్థితి తారుమారైంది. మెజారిటీ సింహళుల్లో చీలిక వచ్చి ఎక్కువ మంది ఆయనకు వ్యతిరేకమయ్యారు. వీరి మద్దతును తిరిగి పొందడం కోసం ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. తాను తప్పుకుంటే మళ్లీ తమిళ టైగర్లు విజృంభిస్తారని హెచ్చరించారు. సింహళులకూ, ముస్లింలకూ మధ్య...సింహళులకూ, క్రైస్తవులకూ మధ్య ఘర్షణలు రెచ్చగొట్టాలని చూశారు. అయితే, ఇది ఫలించలేదు సరిగదా...మైనారిటీలతో సింహళులు కూడా జతకట్టారు. ఫలితంగా సిరిసేన 51.3 శాతం ఓట్లతో నెగ్గగలిగారు. ముస్లింలు, తమిళులు అధికంగా ఉండే ప్రాంతాల్లో సిరిసేన 70 శాతానికిపైగా ఓట్లు తెచ్చుకోగలగడం రాజపక్సపై ఆ వర్గాల్లో ఉన్న వ్యతిరేకతను తెలియజేస్తుంది. విపక్షాల అభ్యర్థిగా అధ్యక్ష పీఠాన్ని గెలుచుకున్న సిరిసేనకు అసలు అగ్నిపరీక్షలు ఇప్పుడు మొదలవుతాయి. ఆయన ముందుగా తన అధికారాలను తాను రద్దు చేసుకోవాల్సి ఉన్నది. తాను అధికారంలోకొచ్చిన వెంటనే దేశంలో నియంతృత్వానికి తావిస్తున్న అధ్యక్ష తరహా పాలనకు స్వస్తి పలుకుతానని సిరిసేన వాగ్దానం చేశారు. దేశంలో తిరిగి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నెలకొల్పుతానన్నారు. అధ్యక్ష తరహా పాలనలో ఉండే లొసుగులవల్లే ప్రభుత్వ ఖజానాను రాజపక్స అయినవారికి దోచిపెట్టారని సిరిసేన ప్రచారం చేసివున్నారు. దిగువ మధ్యతరగతి, పేద వర్గాలవారి బతుకులు దుర్భర ం చేస్తున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలనూ, ఇతర నిత్యావసరాల ధరలనూ తగ్గిస్తామని చెప్పారు. వీటితోపాటు రాజపక్స కుటుంబం చెప్పినట్టల్లా ఆడిన పోలీసు విభాగాన్ని పట్టాలెక్కించి దేశంలో చట్టబద్ధ పాలనను పునరుద్ధరించడం, న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని పునఃప్రతిష్టించి, రాజపక్స కారణంగా పదవి కోల్పోయిన షిరానీ బండారునాయకేను మళ్లీ చీఫ్ జస్టిస్గా నియమించడం వంటివి దేశ ప్రజలు సిరిసేన నుంచి తక్షణం ఆశిస్తున్నవి. ఇవిగాక ఆయన సమర్థతకు పరీక్షపెట్టే ఇతర అంశాలు చాలా ఉన్నాయి. రాజపక్స పాలనలో టైగర్ల అణచివేత పేరిట తమిళులపై సాగించిన దురంతాలపై ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో విచారణకు సిద్ధపడటం అందులో కీలకమైనది. సైన్యం అత్యాచారాల సమయంలో సిరిసేన కొద్దికాలం రక్షణ మంత్రిగా వ్యవహరించారు. ఇప్పుడు ఆయనను బలపరిచిన సింహళ జాతీయవాద పార్టీలు ఇలాంటి విచారణకు ససేమిరా అంటున్నాయి. అలాగే తమిళ పార్టీల ఆధ్వర్యంలో ఉన్న ఉత్తర తూర్పు ప్రాంత మండలికి అధికారాలను ఇచ్చేందుకు వీలుగా రాజ్యాంగాన్ని సవరించాలన్న డిమాండును నెరవేర్చడం సిరిసేనకు తలకు మించిన భారం. దీనికి సంబంధించిన 13వ రాజ్యాంగ సవరణను సింహళ పార్టీలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. సిరిసేనకు మద్దతిచ్చిన తమిళ పార్టీలు మాత్రం ఆ సవరణ తీసుకురావల్సిందేనంటున్నాయి. వీటన్నిటితోపాటు లంక ఆర్థిక వ్యవస్థతో పెనవేసుకుపోయిన చైనా ప్రభావాన్ని తగ్గించడం సిరిసేనకు పెను సవాలు. చైనాకు దగ్గరకావాలన్న ఉద్దేశంతో అధిక వడ్డీరేట్లపై ఆ దేశంనుంచి భారీ మొత్తంలో రాజపక్స రుణాలు తీసుకొచ్చారు. ఆయన ఓటమికి ఈ రుణభారం కూడా ఒక కారణం. భారత్కు వ్యతిరేకంగా ఒక్కొక్క దేశాన్నే చేరదీయాలన్న చైనా వ్యూహంలో భాగంగానే లంకకు భారీ మొత్తంలో రుణాలు అందజేసింది. ఆ దేశానికి చెందిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టింది. శ్రీలంక సైన్యం ఉపయోగిస్తున్న రక్షణ పరికరాల్లో 70 శాతం ‘మేడిన్ చైనా’ గుర్తువే. దీన్నంతటినీ తిరగదోడటం, భారత్కు సన్నిహితం కావడం సిరిసేనకు పెద్ద పరీక్షే. ఈ విషయంలో ఆయన ఏం చేస్తారన్న విషయంలో చైనా, భారత్లే కాదు...ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. మరోపక్క లంక గడ్డపైనుంచి భారత్ లక్ష్యంగా పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కార్యకలాపాలు కొంతకాలంగా సాగుతున్నాయి. రాజపక్స హయాంలో లంకలో పెరిగిన చైనా, పాక్ల పలుకుబడి తగ్గించాలని భారత్ కృతనిశ్చయంతో ఉన్నది. అందువల్లనే సిరిసేన నెగ్గిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు చెప్పడంతోపాటు భారత్ సందర్శించాలని ఆహ్వానించారు. లంకలో మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆ దేశంతో మన సంబంధాలు ఏ మేరకు మెరుగుపడగలవో చూడాల్సి ఉన్నది. -
ఫోర్త్ ఎస్టేట్ : శ్రీలంకలో కొత్త శకం
-
మైత్రిపాల సిరిసేనకు మోడీ అభినందనలు
న్యూఢిల్లీ : శ్రీలంక నూతన అధ్యక్షుడు సిరిసేనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో జరిగిన హోరా హోరీ పోరులో మైత్రిపాల సిరిసేన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మోదీ శుక్రవారం ఫోన్ చేసి సిరిసేనను అభినందించారు. కాగా శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కాగా ముస్లిం, తమిళులు మైత్రిపాల సిరిసేనకు పట్టం కట్టారు. రాజపక్సకు వ్యతిరేకంగా విపక్షాలను ఆయన ఏకతాటిపై తెచ్చారు. శుక్రవారం సాయంత్రం సిరిసేన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇక ఎల్టీటీఈని తుదముట్టించినా శ్రీలంకేయులు రాజపక్సను పట్టించుకోలేదు. మరోవైపు రాజపక్స తన ఓటమిని అంగీకరిస్తూ అధికార నివాసాన్ని వదిలారు. రెండేళ్ల ముందు ఎన్నికలకు వెళ్లినా రాజపక్సకు భంగపాటు తప్పలేదు. -
ఓటమిని అంగీకరించిన రాజపక్స
కొలంబో: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మహింద రాజపక్సకు గట్టి షాక్ తగిలింది. మైత్రిపాల సిరిసేన మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. ముందస్తు ఎన్నికలకు వెళితే గెలుపు గ్యారంటీ అన్న రాజపక్స సెంటిమెంట్ బెడిసి కొట్టింది. పదవీ కాలం ఇంకా రెండేళ్లు ఉండగానే రాజపక్స ఎన్నికలకు వెళ్లారు. మూడోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న కలలు కన్న ఆయనకు నిరాశ ఎదురైంది. ఓటమిని అంగీకరించిన రాజపక్స.. అధికార నివాసాన్ని విడిచి వెళ్లిపోయారు. విపక్ష కూటమి ఉమ్మడి అభ్యర్ధిగా బరిలోకి దిగిన సిరిసేన కొత్త అధ్యక్షుడిగా శుక్రవారం సాయంత్రం ప్రమాణం చేయనున్నారు. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. -
రాజపక్సే, మైత్రిపాల మధ్య గట్టి పోటీ!
కొలంబో: శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు గురువారం ముగిశాయి. ఓటర్లు భారీగా పోలింగ్లో పాల్గొన్నారు. అధ్యక్ష అభ్యర్థులు మహీంద్ర రాజపక్సే, మైత్రిపాల సిరిసేనల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో కూడా విజయం సాధించి ప్రస్తుత అధ్యక్షుడు మహీంద్ర రాజపక్సే వరుసగా మూడోసారి అధ్యక్షుడవుతారా? లేక ఆయనకు ప్రతర్థిగా మారిన స్నేహితుడు మైత్రిపాల సిరిసేన అధ్యక్ష పగ్గాలు చేపడతారా? అన్నది శుక్రవారం తేలనుంది. తమిళులు, ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అధిక శాతం ఓటింగ్ నమోదవడం విశేషం. మెజారిటీ సింహళ ఓటర్లు ఈ ఇద్దరు అభ్యర్థులకు సమానంగా మద్దతిస్తున్న నేపథ్యంలో తమిళుల, ముస్లింల ఓట్లు ఫలితంలో కీలకపాత్ర పోషిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కచ్చితమైన గణాంకాలు తెలియకపోయినా దేశవ్యాప్తంగా దాదాపు 65 శాతం నుంచి 70 శాతం పోలింగ్ నమోదయినట్లు అధికారులు అంచనా. ఈ ఎన్నికల్లో రాజపక్సేకు సిరిసేన గట్టి పోటీ ఇచ్చారు. సిరిసేన గెలిస్తే దేశంలో రాజకీయంగా పెనుమార్పులకు అది శ్రీకారమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, పోలింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలేవీ జరగలేదని అధికారులు పేర్కొన్నారు. అయితే కొన్ని చోట్ల ఓటర్లను అడ్డుకున్నారని సమాచారం. పోటీలో 19 మంది ఉన్నప్పటికీ, ప్రధాన పోటీ రాజపక్సే, సిరిసేనల మధ్యే ఉంది. విజయంపై ఇరువురు నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు. -
సుప్రభాత వేళ..నిరసనల హోరు
సమయం: బుధవారం వేకువజామున 3 గంటలు తిరుమల ఆలయంలో: ‘కౌసల్యా సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్ధతే!’ వేద పండితులు సుప్రభాత పఠనంతో వేంకటేశ్వరస్వామికి మేల్కొలుపు సేవ సాగుతోంది. ఆలయం వెలుపల :‘‘రాజపక్స డౌన్డౌన్.. నరహంతకుడు డౌన్డౌన్.. తమిళుల ఊచకోత కారకుడు రాజపక్సను ఉరితీయాలి’’ అంటూ ఎండీఎంకే కార్యకర్తల నిరసనహోరు. పోలీసుల రంగప్రవేశం. ముష్ఠిఘాతాలు. అరెస్ట్లు. ఇలాంటి ఉత్కంఠ పరిస్థితుల నడుమ శ్రీలంక దేశాధ్యక్షుడు రాజపక్స తిరుమల పర్యటన ముగిసింది. సాక్షి, తిరుమల: రాజపక్స తిరుమల పర్యటనను అడ్డుకుంటామని ఎండీఎంకే పార్టీ ముందుగానే ప్రకటించింది. ఆ విధంగానే పార్టీ కార్యకర్తలు బృందాలుగా విడిపోయారు. పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. తిరుపతిలోని అలిపిరి టోల్గేట్, తిరుమలలోని జీఎన్సీ టోల్గేట్ వద్ద తనిఖీలు క్షుణ్ణంగా చేశారు. అయినా బృందాలుగా విడిపోయిన ఎండీఎంకే కార్యకర్తలు యథేచ్ఛగా పార్టీ జెండాలు, నల్ల జెండాలతో తిరుమలకు చేరుకున్నారు. పక్కా ప్రణాళికతో వారు బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు లేపాక్షి కూడలి వద్దకు చేరుకున్నారు. ఒక్కసారిగా పార్టీ కండువాలు ధరించి నిరసనలకు దిగారు. ‘‘రాజపక్స డౌన్డౌన్.. నర హంతుకుడు డౌన్డౌన్, తమిళుల ఊచకోత కారకుడు రాజపక్సను ఉరితీయాలి’’ అంటూ ఎండీఎంకే కార్యకర్తలు రాజపక్సకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా షాక్కు గురైన పోలీసులు వెంటనే తేరుకుని దొరికినవారిని దొరికినట్టు అరెస్ట్ చేశారు. వాహనాల్లో నిరసనకారుల్ని ఎక్కించారు. ఎదురు తిరిగిన వారిపై ముష్ఠిఘాతాలు కురిపించారు. ఆ దృశ్యాలను చిత్రీకరిస్తున్న తమిళ మీడియా ప్రతినిధులను వారించారు. అయినా వారిపని వారు చేసుకోవడంతో ఆగ్రహంతో వారిపై కూడా పిడిగుద్దులకు దిగారు. కెమెరాలను లాగేయడంతో విరిగిపోయాయి. అడ్డు చెప్పిన మీడియా ప్రతినిధులను లాక్కెళ్లారు. నిరసన కారులను, తమిళ మీడియా ప్రతినిధులను ప్రత్యేకవాహనాల్లోకి ఎక్కించి పాపవినాశనానికి తరలించి వదలిపెట్టారు. తమిళమీడియా ప్రతినిధులపై పోలీసుల దాడిని తిరుమల, తిరుపతిలోని మీడియా ప్రతినిధుల సంఘాలు ముక్తకంఠంతో ఖండించాయి. రాజపక్స పర్యటనను విజయవంతం చేసిన పోలీసులు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స పర్యటన కేవలం పోలీసుల పర్యవేక్షణలో విజయవంతంగా ముగిసింది. ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ మరణం తర్వాత గత ఏడాది రాజపక్స తిరుమలకు వచ్చిన సందర్భంలో ఎదురైన సంఘటనలు తెలిసిందే. ఈ పర్యాయం కూడా అలాంటి పరిస్థితులే పునరావృత్తం అవుతాయని తెలిసినా ఏమాత్రం వెనకడుగు వేయలేదు. జిల్లా ఎస్పీ గోపినాథ్జట్టి, తిరుమల ఏఎస్పీ ఎంవీఎస్.స్వామి, ఇతర పోలీసు అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకుని రాజపక్స పర్యటనలో ఎలాంటి అపశ్రుతులు చోటు చేసుకోకుండా విజయవంతం చేశారు. ముగిసిన శ్రీలంక అధ్యక్షుడి పర్యటన జిల్లాలో రెండు రోజుల పర్యటన ముగించుకున్న శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్సకు రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకష్ణారెడ్డి, అర్బన్ జిల్లా ఎస్పీ గోపీనాథ్జట్టి ఘనంగా వీడ్కోలు పలికారు. బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆయన తిరుమల నుంచి రోడ్డుమార్గం ద్వారా ఉదయం 8.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ అటవీ శాఖమంత్రి, అర్బన్ ఎస్పీ, విమానాశ్రయం అధికారులు రాజపక్సకు ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం శ్రీలంక దేశపు ప్రత్యేక విమానంలో ఉదయం 9 గంటలకు రేణిగుంట విమనాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లారు. -
నిరసన
సాక్షి, చెన్నై: భారత్లో రాజపక్సను అడుగు పెట్టనీయకుండా చేయాలని కేంద్రంపై ఒత్తిడి పెంచుతూనే ఉన్నారు. అయినా రాజమార్గంలో రాజపక్స తిరుపతికి రావడం వెళ్లడం సాగుతోంది. అలాగే, పాలకులు సైతం ఆయనకు రెడ్ కార్పెట్తో ఆహ్వానం పలుకుతున్నారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం తిరుపతి పర్యటనకు వచ్చిన రాజపక్సకు వ్యతిరేకంగా రాష్ట్రంలో తమిళాభిమాన సంఘాలు, పార్టీలు పలు చోట్ల నిరసనలకు దిగాయి. నిరసనల హోరు: చెన్నై, కోయంబత్తూరు, తిరునల్వేలి, తేని, తూత్తకుడి, తంజావూరు, రామనాధపురం, కడలూరు, విరుదునగర్లలో ఆయా పార్టీలు, సంఘాల నేతృత్వలో వేర్వేరుగా నిరసనలు సాగాయి. రాజపక్స గో బ్యాక్ అన్న నినాదాలు మార్మోగాయి. రాజపక్సే దిష్టిబొమ్మల్ని తగల బెడుతూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం ముందుగానే అప్రమత్తమైంది. తమిళనాడు సరిహద్దుల్లో భద్రతను పెంచింది. చెన్నైలోని శ్రీలంక రాయబార కార్యాలయం, శ్రీలంక ఎయిర్ లైన్స్, బౌద్ధాలయూలకు భద్రత కల్పించారు. తిరుపతిలో రాజపక్సేకు నల్ల జెండాలు చూపించి నిరసన తెలియజేయడానికి వీసీకే, నామ్ తమిళర్ కట్చి, ఎండీఎంకే, తమిళర్వాల్వురిమై కట్చిల నేతలు ఇక్కడి నుంచి ఉదయాన్నే తరలి వెళ్లారు. అయితే, వీరిని తిరుపతి పరిసరాల్లో, ఆ రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రా పోలీసులు తమ వాళ్లను అరెస్టు చేయడాన్ని ఆయా సంఘాలు, పార్టీలు తీవ్రంగా ఖండించాయి. టీటీడీ ముట్టడి : రాజపక్సేను తిరుమలకు అనుమతించొద్దని నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ హెచ్చరించిన విషయం తెలిసిందే. రాజపక్సేకు ఆహ్వానం పలుకుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న కట్టుదిట్టమైన ఏర్పాట్లను, రాజపక్సే రాకను నిరసిస్తూ ఆ పార్టీ కార్యాకర్తలు టీ నగర్లోని టీటీడీ సమాచార కేంద్రం ముట్టడికి యత్నించారు. ఆ పార్టీ నాయకుడు అన్భు తెన్నరసు నేతృత్వంలో వంద మందికి కార్యకర్తలు ర్యాలీగా వెంకటనారాయణ రోడ్డు వైపుగా చొచ్చుకెళ్లే యత్నం చేశారు. వీరిని మార్గం మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. పోలీసు వలయాన్ని ఛేదిస్తూ సమాచార కేంద్రం వైపుగా దూసుకెళ్లేందుకు యత్నించారు. రాజపక్సేకు వ్యతిరేకంగా నినాదాలను హోరెత్తించిన కార్యకర్తలు, నాయకుల్ని చివరకు పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం టీటీడీ సమాచార కేంద్రం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. తిరుపతికి బయల్దేరిన తమిళర్వాల్వురిమై కట్చి నేత వేల్ మురుగన్ను ఆరంబాక్కం వద్ద పోలీసులు అరెస్టు చేయడంతో ఆ పార్టీ వర్గాలు ఆందోళనకు దిగారు. దీంతో జాతీయ రహదారిలో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. చివరకు ఆందోళనకారుల్ని చెదరగొట్టి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. రాజపక్సే కార్యక్రమాన్ని కవర్చేయడానికి వెళ్లిన తమిళ మీడియాను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం అందడంతో ఇక్కడి మీడియా వర్గాల్లో ఆగ్రహాన్ని రేపింది. ఆంధ్రప్రదేశ్ పోలీసుల చర్యల్ని తమిళ మీడియా ప్రతినిధులు ఖండించారు. -
రాజపక్సే గో బ్యాక్
యుద్ధం పేరుతో ఈలం తమిళుల్ని టార్గెట్ చేసి నరమేధం సృష్టించిన శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే తిరుపతి పర్యటనను వ్యతిరేకిస్తూ నిరసనలకు రాజకీయ పక్షాలు సిద్ధమయ్యాయి. రాష్ట్రంలోనూ, తిరుపతిలోనూ నల్ల జెండాల ప్రదర్శనకు నిర్ణయించాయి. తమిళ ద్రోహి రాజపక్సేను తెలుగు గడ్డపై అడుగు పెట్టనివ్వొద్దని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు నామ్ తమిళర్ కట్ట్చి నేత సీమాన్ విజ్ఞప్తి చేశారు. అడుగు పెట్టనిస్తే చెన్నైలోని టీటీడీ సమాచార కేంద్రాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. సాక్షి, చెన్నై : శ్రీలంకలో యుద్ధం పేరుతో సాగిన మారణ కాండ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈలం తమిళుల్ని నామరూపాలు లేకుండా చేసిన రాజపక్సేను అంతర్జాతీయ న్యాయ స్థానం బోనులో దోషిగా నిలబెట్టాలన్న కాంక్షతో తమిళాభిమాన సంఘాలు, రాజకీయ పక్షాలు ఉద్యమిస్తున్నాయి. అదే సమయంలో రాజపక్సేను భారత్లోకి అనుమతించ కూడదన్న డిమాండ్తో కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. అయితే, ఫలితం శూన్యం. ఓ వైపు రాజపక్సేను పొగడ్తలతో ముంచెత్తే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తుంటే, మరో వైపు భారత్ పర్యటనకు వచ్చే ఆయనకు రెడ్ కార్పెట్ ఆహ్వానం పలకడం జరుగుతూనే ఉన్నది. గో బ్యాక్: రెండు రోజుల పర్యటన నిమిత్తం రాజపక్సే తిరుపతికి వచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఆయ న పర్యటన వివరాల్ని కేంద్రం గోప్యంగా ఉంచినా, చివరి క్షణంలో బయటకు పొక్కింది. దీంతో రాజపక్సే గో బ్యాక్ అన్న నినాదాన్ని తమిళాభిమాన సంఘాలు, పార్టీలు అందుకున్నాయి. రాజపక్సేకు వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునిచ్చాయి. తమిళనాడులోనూ, తిరుపతిలోనూ నిరసనలకు నిర్ణయించాయి. ఎండీఎంకే నేత వైగో ఇచ్చిన పిలుపుతో ఆ పార్టీ నేత మాసిలామణి నేతృత్వంలో తిరుపతిలో నల్ల జెండాలతో నిరసనలు తెలిపేందుకు ఓ బృందం సిద్ధమైంది. శ్రీలంక తమిళుల పరిరక్షణ కమిటీ, తదితర తమిళాభిమాన సంఘాలు సైతం రాజపక్సేకు వ్యతిరేకంగా నల్ల జెండాల నిరసనలకు నిర్ణయించాయి. వీసీకే నేత తిరుమావళవన్ ఇచ్చిన పిలుపుతో ఆపార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ నేతృత్వంలో తిరుపతిలో నల్ల జెండాల ప్రదర్శనకు వ్యూహ రచన చేశారు. రాష్ట్రంలోనూ నిరసలనకు ఆ పార్టీ పిలుపు నివ్వడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. సీమాన్ హెచ్చరిక: నామ్ తమిళర్ కట్చి సైతం నిరసనలకు సిద్ధం అయింది. ఆ పార్టీ నేత సీమాన్ మీడియా తో మాట్లాడుతూ, ఏపీ సీఎం చంద్రబాబుకు హెచ్చరికలు జారీ చేశారు. తమిళల మనోభావాల్ని గౌరవిం చాలని విన్నవించారు. తమిళనాడులో తెలుగు వారు, తమిళులు సోదర భావంతో మెలుగుతున్నారని గుర్తు చేశారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మధ్య సత్సంబంధాలు మెరుగ్గా ఉన్నాయని వివరించారు. తమిళ ఈలంను సర్వనాశనం చేసిన వ్యక్తి ఆ రాష్ట్రంలోకి అడు గు పెడుతున్నారని, ఆయన్ను అడ్డుకోవాలని కోరారు. తమిళుల్ని యుద్ధం పేరుతో మట్టుబెట్టిన రాజపక్సేను, వారికి అనుకులంగా వ్యవహరించే వారిని తాము క్షమించే ప్రసక్తే లేదన్నారు. ఒక వేళ రాజపక్సేను అనుమతించిన పక్షంలో చెన్నైలోని టీటీడీ సమాచార కేం ద్రాన్ని ముట్టడిస్తామని, భారీ నిరసనతో తమ ఆగ్రహా న్ని వ్యక్తం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
శ్రీలంక అధ్యక్షుడికి భారతరత్న ఇవ్వండి
న్యూఢిల్లీ: సంచలన ప్రకటనలు, వ్యాఖ్యలతో ప్రత్యేకతను చాటుకునే బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వినూత్న ప్రతిపాదన చేశారు. శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపక్సేకు దేశ అత్యున్నత భారతరత్న అవార్డు ఇవ్వాలని అన్నారు. సుబ్రహ్మణ్య స్వామి భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. -
శ్రీలంకతో ‘ఢీ’ఎంకే
చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళ ఈళ ఆదరవాళర్ అమైప్పు (టెసో) పేరుతో డీఎంకే ఎన్నో ఏళ్లుగా నిరసనోద్యమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గత నెల 26వ తేదీన డీఎంకే కేంద్ర కార్యాలయమైన అన్నా అరివాలయంలో సమావేశమై సెప్టెంబరు 3వ తేదీన చెన్నైలో నిరసన చేపట్టాలని నిర్ణయించి పలు తీర్మానాలను చేసింది. తమిళ ఈలం సోదరులు ఆశించే ఆత్మగౌరవంతో కూడిన స్వేచ్ఛా జీవితం కల్పించాలని, శ్రీలంక ఆగడాలు, మానవహక్కుల ఉల్లంఘనపై ఐక్యరాజ్య సమితి నియమించిన విచారణ బృందం దేశంలో అడుగిడకుండా అడ్డుకున్న శ్రీలంక అధ్యక్షులు రాజపక్సేపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొనకుండా నిషేధం విధించాలని, ఐక్యరాజ్యసమితి విచారణ భారత్లో జరిపేలా చర్యలు తీసుకోవాలని తదితర తీర్మానాలను చేశారు. అలాగే శ్రీలంక స్వాధీ నంలో ఉన్న తమిళ జాలర్ల మరపడవలను విడిపించాలని, చేపల వేటపై స్వేచ్ఛను ప్రసాదించాలని తీర్మానం చేశారు. ఈ తీర్మానాల నేపధ్యంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు టెసో ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తిరువళ్లూరు, కాంచీపురం, చెన్నై జిల్లాల నుంచి బుధవారం తెల్లవారుజాము నుంచే టెసో కార్యకర్తలు చేపాక్కు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి హాజరయ్యూరు. డీఎంకే దక్షిణ చెన్నై కార్యదర్శి జే అన్బళగన్ స్వాగతోపన్యాసం, కోశాధికారి స్టాలిన్ ప్రారంభోన్యాసం చేశారు. సమష్టిగా పోరాడితేనే సాధ్యం : కరుణానిధి సంఘటిత పోరాటం ద్వారా మాత్రమే తమిళ ఈలం సోదరులకు విముక్తి సాధ్యమని టెసో అధినేత, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి పిలుపునిచ్చారు. టెసో ఆందోళన కార్యక్రమాల్లో చివరగా కరుణ ప్రసంగిస్తూ, దేశాన్ని గతంలో ఎందరో ప్రధానులు పాలించారు, గతంలో వారి కంటే బలమైన ప్రధానిగా ఖ్యాతిని దక్కించుకున్న మోడీ ఈలం తమిళుల సమస్యను పరిష్కరించి ఆ పేరును నిలబెట్టుకోవాలని అన్నారు. డీఎంకే, టెసో నేతలు చేసిన తీర్మానాల్లోని తీవ్రతను ప్రధాని అర్థం చేసుకోవాలని కోరారు. ఈలం సోదరులు శ్రీలంకలో బానిసజీవితాన్ని అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళులు తమిళులుగా బతకాలని మాత్రమే కోరుకుంటున్నారని, అయితే రాజపక్సే ఇందుకు నిరాకరిస్తున్నారని చెప్పారు. నిరసన వేదిక కు పక్కనే శ్రీలంక దాష్టీకాలను అనుకరిస్తూ కార్యకర్తలు చేసిన ప్రదర్శనలు హృదయాలను ద్రవింపజేశాయి. -
జయపై.. లంక కథనాన్ని ఖండిస్తున్నాం
ఉభయసభల్లో కేంద్రం వెల్లడి న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కించపరుస్తూ.. శ్రీలంక రక్షణ శాఖ వెబ్సైట్లో వచ్చిన కథనం సోమవారం పార్లమెంటు ఉభయసభలను కుదిపేసింది. ఏఐఏడీఎంకే సభ్యులు తీవ్ర గందరగోళం సృష్టించారు. ఇది ఒక్క తమిళనాడు సీఎంకు జరిగిన అవమానం కాదని యావత్ భారత్కు జరిగిన అవమానమని పేర్కొన్నారు. కేంద్రం దీనిపై తక్షణమే స్పందించి లంక అధ్యక్షుడు రాజపక్సేకు నిరసన తెలుపుతూ.. ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. సభాపతి ప్రాంగణాన్ని చుట్టుముట్టి ‘రాజపక్సే డౌన్.. డౌన్’ నినాదాలతో తీవ్ర ఆందోళనకు దిగారు. దీంతో లోక్సభ, రాజ్య సభలు వాయిదా పడ్డాయి. ఈ కథనాన్ని కేంద్రం ఖండిస్తుందని, లంక హైకమిషనర్కు విషయాన్ని వివరించి.. సమన్లు కూడా జారీ చేస్తామని విదేశాంగ మంత్రి సుష్మాసర్వాజ్ చెప్పారు. ఇదే అంశంపై లోక్సభలో మంత్రి వెంకయ్యనాయుడు స్పందిస్తూ.. ఈ కథనం ఆమోదయోగ్యం కాదని, ఈ విషయంలో ఎలాంటి తాత్సారానికీ తావులేదని పేర్కొన్నారు. సభ్యుల మనోభావాలను విదేశాంగ మంత్రికి విన్నవించనున్నట్టు చెప్పారు. అయితే, వెంకయ్య ప్రకటనతో సంతృప్తి చెందని ఏఐఏడీఎంకే సభ్యులు సభాపతి పోడియంను చుట్టుముట్టి రాజపక్సకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించడమే కాకుండా సభను వాయిదా వేయాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ను పట్టుబట్టారు. -
శ్రీలంక అధ్యక్షుడికి వ్యతిరేకంగా వైకో నిరసన
న్యూఢిల్లీ: మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సకు నిరసన తెలిపేందుకు యత్నించిన ఎండీఎంకే చీఫ్ వైకోను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఆయన పార్టీకి చెందిన దాదాపు వంద మంది కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఇక్కడి పార్లమెంట్ స్ట్రీట్లోకి వచ్చిన ఎండీఎంకే కార్యకర్తలు శ్రీలంక జాతీయ జెండాతో పాటు రాజపక్స ఫొటోలతో కూడిన బ్యానర్లను తగులబెట్టారు. ఎన్డీయే భాగస్వామిగా ఉన్న ఎండీఎంకే.. రాజపక్సకు ఆహ్వానం పలకడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీలంకలో తమిళుల హక్కులను అధ్యక్షుడు కాలరాశాడని వైకో ధ్వజమెత్తారు. రాజపక్స హాజరవడం వల్ల మోడీ ప్రమాణ స్వీకారోత్సవం పవిత్రత దెబ్బతింటుందని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీలంక విషయంలో యూపీఏ బాటలో ఎన్డీయే సాగవద్దని సూచించారు. -
నిరసనలతో తగ్గిన ‘స్టార్స్’
సాక్షి, చెన్నై: రాజపక్సేకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిం చడంతో మోడీ ప్రమాణ స్వీకారానికి సీఎం జయలలిత, రజనీ కాంత్, ఇళయదళపతి విజయ్ దూరమయ్యారు. అయినా, తమిళాభిమానుల్లో ఆగ్రహం చల్లారలేదు. రాజపక్సే రాకను నిరసిస్తూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగారు. భారత ప్రధానిగా నరేంద్ర మోడీ సోమవారం దేశ రాజధాని నగరం ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేను ఆహ్వానించడంతో తమిళనాట వ్యతిరేకత బయలు దేరింది. రాజపక్సే రాకను నిరసిస్తూ, సీఎం జయలలిత, డీఎంకే అధినేత ఎం కరుణానిధి, ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, ఎంఎంకే నేత జవహరుల్లాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈలం తమిళుల మద్దతు సంఘాలు, తమిళాభిమాన సంఘాలు ఆందోళన బాట పట్టాయి. చల్లారని ఆగ్రహం : నాలుగైదు రోజులుగా సాగుతూ వచ్చిన నిరసనలు ఆదివారం నుంచి హోరెత్తాయి. సోమవారం ఎండీఎంకే, వీసీకే, తమిళర్ వాల్వురిమై కట్చి, తమిళర్ ఇలంజర్ పేరవైలతో పాటుగా పలు సంఘాలు ఆందోళనలకు దిగాయి. పలు జిల్లా కోర్టుల్లో న్యాయవాదులు విధులను బహిస్కరించి రాజపక్సే గో బ్యాక్ అంటూ నినదించారు. చెన్నై కలెక్టరేట్లో ఎండీఎంకే నేత మల్లై సత్య నేతృత్వంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. రాజపక్సే చిత్ర పటాలను చెప్పులతో కొడుతూ, దిష్టిబొమ్మల్ని దహనం చేస్తూ నిరసన తెలియజేశారు. చేపాక్కంలో తమిళర్ వాల్వురిమై కట్చి నేత వేల్ మురుగన్ నేతృత్వంలో నిరసన దీక్ష చేపట్టారు. ఆర్ఎస్వైఎస్ నేతృత్వంలో నిరసన ర్యాలీ చేశారు. నల్ల జెండాల్ని చేత బట్టి, రాజపక్సే, మోడీల వ్యంగ్య చిత్రాలతో బ్యానర్లను చేత బట్టి నిరసన వ్యక్తం చేశారు. మనప్పారైలో ఎండీఎంకే నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. రాజపక్సే దిష్టిబొమ్మ దహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇన్స్పెక్టర్ ముత్తు పాండిపై ఆందోళనకారులు దాడికి దిగడంతో పోలీసులు లాఠీలకు పని పెట్టారు. విద్యార్థి విభాగాల నేతృత్వంలో రాష్ట్రంలో పలు చోట్ల రాస్తారోకోలు జరిగాయి. రాజపక్సే చిత్ర పటాల్ని దహనం చేస్తూ తమ నిరసన తెలియజేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో ఎండీఎంకే నేత వైగోను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. తగ్గిన ఁస్టార్స్రూ.: మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలంటూ సీఎం జయలిత, దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీ కాంత్, ఇళయదళపతి విజయ్తోపాటుగా రాష్ట్రానికి చెందిన బీజేపీ కూటమి మిత్రులకు ఆహ్వానాలు వచ్చాయి. అయితే, రాష్ట్రంలో బయలుదేరిన నిరసనలతో వీరంతా ఢిల్లీకి వెళ్లేనా అన్న ప్రశ్న బయలు దేరింది. కొందరు అయితే, సాహసించి ఢిల్లీకి బయలు దేరారు. అయితే, అందరి దృష్టి సీఎం జయలలిత, నటులు రజనీ కాంత్, విజయ్ల మీదే పడింది. ఢిల్లీకి వెళ్లొద్దంటూ విద్యార్థులు కొందరు పోయేస్ గార్డెన్లోని రజనీ కాంత్ ఇంటిని ముట్టడించేందుకు యత్నించడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఈ పరిణామాలతో స్టార్స్ తమ పర్యటన రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఢిల్లీ వెళ్లడానికి రజనీకాంత్ ఏర్పాట్లు చేసుకున్నారు. లింగాషూటింగ్ను రద్దు చేసుకుని చెన్నైకు వచ్చిన రజనీ కాంత్ ఢిల్లీ వెళ్తారన్న ప్రచారం సాగింది. అయితే, ఆయన తమిళుల మనోభావాలకు గౌరవం ఇచ్చి తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆయనకు బదులుగా సతీమణి ప్రేమలత ఢిల్లీకి వెళ్లినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. విజయ్ సైతం తన పర్యటన రద్దు చేసుకుని, చెన్నై శివారుల్లో జరుగుతున్న శక్తి షూటింగ్లో బిజీ అయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఢిల్లీ వెళ్లేందుకు ముందస్తుగా ఎలాంటి ఏర్పాట్లు చేసుకోలేదు. అయితే, మోడీ తనకు మంచి మిత్రుడు కావడంతో చివరి క్షణంలో ప్రత్యేక విమానంలో ఆమె ఢిల్లీ వెళ్తారన్న ప్రచారం సాగినా, ఆమె మాత్రం వెళ్లలేదు. బీజేపీ కూటమిలోని డీఎండీకే నేత విజయకాంత్, పీఎంకే నేత అన్భుమణి రాందాసు, జికే మణి, పుదియ నిధి కట్చి నేత ఏసీ షణ్ముగం, ఐజేకే నేత పచ్చ ముత్తు పారివేందన్, కొంగు దేశియ మక్కల్ కట్చి నేత ఈశ్వరన్లు ఢిల్లీకి ఉరకలు తీశారు. -
నల్ల జెండాలతో వైగో నిరసన!
-
మోడీ ప్రమాణానికి రజనీ దూరం!
చెన్నై: నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరుకావడం లేదని ఆయన సన్నిహితులు వెల్లడించారు. సోమవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో జరిగే ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలంటూ రజనీకాంత్ కు మోడీ ఆహ్వానించారు. చెన్నై నగరంలో లేకపోవడం కారణంగానే మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరుకావడం లేదని సన్నిహితులు వెల్లడించారు. మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సను ఆహ్వానించడంపై తమిళనాడులో దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే .గత రాత్రి తమిళ విద్యార్ధులు పెద్ద ఎత్తున రజనీకాంత్ ఇంటి ముందు ధర్నా నిర్వహించారు. దాంతో మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రజనీ హాజరుకాకూడదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రాజపక్స ఆహ్వనంపై డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలతోపాటు అన్ని రాజకీయపార్టీలు, సంస్థలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికలకు ముందు పోయెస్ గార్డెన్ లో రజనీకాంత్ ను నరేంద్రమోడీ కలిసి మద్దతు కోరిన సంగతి తెలిసిందే. -
నిరసనల హోరు
సాక్షి, చెన్నై : దేశ రాజధాని నగరం ఢిల్లీలో భారత ప్రధానిగా నరేంద్ర మోడీ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ఆహ్వానం మేరకు ఈ వేడుకకు హాజరయ్యేందుకు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే సిద్ధమయ్యారు. రాజపక్సేకు ఆహ్వానం పంపడంపై రాష్ట్రంలో వ్యతిరేకత బయలు దేరింది. ఎండీఎంకే, నామ్ తమిళర్ కట్చి, ఈలం తమిళుల మద్దతు సంఘాలు, శ్రీలంక తమిళుల పరిరక్షణ కమిటీ, తమిళాభిమాన సంఘాలు నిరసనలకు దిగారు.నిరసనల హోరు: ఆదివారం పలు చోట్ల నిరసనలు చోటు చేసుకున్నాయి. రాజపక్సే గో బ్యాక్ అన్న నినాదాలు మిన్నంటాయి. బీజేపీ తీరును నిరసిస్తూ నాయకులు విమర్శలు గుప్పించారు. మే -17 సంస్థ నేతృత్వంలో వళ్లువర్కోట్టం వద్ద భారీ నిరసన కార్యక్రమం జరిగింది. యుద్ధం పేరుతో తమిళులపై నరమేధం సాగించిన రాజపక్సేకు రెడ్ కార్పెట్ ఆహ్వానం ఏర్పాట్లను నిరసనకారులు తీవ్రంగా వ్యతిరేకించారు. యూపీఏ బాటలోనే బీజేపీ నడుస్తున్నదని, తమిళుల ఆగ్రహానికి బీజేపీ సర్కారుకు గురికాక తప్పదని హె చ్చరించారు. న్యాయ కళాశాలల విద్యార్థుల నేతృత్వంలో రాష్ట్రంలో పలు చోట్ల ఆందోళనలు జరిగా యి. జాలర్ల సంఘాలు నేతృత్వంలో సముద్ర తీర జిల్లాలో నల్ల జెండాల ప్రదర్శన జరిగింది. నామ్ తమిళర్ ఇయక్కం నేతృత్వంలో పలు చోట్ల నిరసన సభలు జరగ్గా, తమిళర్ ఇలంజర్ పేరవై నేతృత్వంలో ఢిల్లీలో ఆందోళన జరిగింది. మనిదనేయ మక్కల్ కట్చి సైతం నిరసనకు దిగింది. ఇక, సినీ దర్శకులు భారతీరాజా, గౌతమ్ మీనన్లు తమ గళాన్ని విప్పారు. రాజపక్సేకు ఆహ్వానం పంపడాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. ఢిల్లీ బాట: రాష్ట్రంలో ఈలం మద్దతు పార్టీలు, సంఘాలు నిరసనలు తెలియజేస్తుంటే, పలు పార్టీల నాయకులు ఢిల్లీ వెళ్లే పనిలో పడ్డారు. బీజేపీ కూటమిలోని డీఎండీకే, పీఎంకే నేతలు ఢిల్లీ బాట పట్టారు. ప్రమాణ స్వీకారానికి డీఎండీకే అధినేత విజయకాంత్తోపాటుగా మరొకరు, పీఎంకే నేత రాందాసు, అన్భుమణి ఢిల్లీకి వెళ్లినట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రానికి చెందిన బీజేపీ ముఖ్య నేతలు తమ నేత ప్రమాణ స్వీకారోత్సవం నిమిత్తం ఢిల్లీకి బయలు దేరారు. ఎండీఎంకే నేత వైగో ప్రమాణ స్వీకారాన్ని బహిష్కరించేందుకు సిద్ధమయ్యారు. నల్ల జెండాల ప్రదర్శన లక్ష్యంగా ఆయన ఢిల్లీ బయలుదేరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ప్రమాణ స్వీకారానికి దూరం కానున్నారు. తన దూతను కూడా పంపించే అవకాశాలు లేవంటూ సీఎంవో వర్గాలు పేర్కొంటున్నాయి. దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీ కాంత్, ఇళయ దళపతి విజయ్లకు ఆహ్వానం రావడంతో ఆ ఇద్దరు సోమవారం ఉదయాన్నే ఢిల్లీ వెళతారని సమాచారం.జాలర్ల విడుదలకు ఆదేశం: భారత్లో అడుగు పెట్టనున్న రాజపక్సే తమిళ జాలర్లను విడుదల చేయడానికి ఆదేశాలు జారీ చేశారు. శ్రీలంక చెరలో వందలాది మంది తమిళ జాలర్లు మగ్గుతున్న విషయం తెలిసిందే. అధికారిక లెక్కల మేరకు వస్తున్న సమాచారాలతో కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి వారిని విడిపించుకుంటూ వస్తున్నారు. అయితే, అనధికారికంగా ఆ దేశ చెరల్లో మగ్గుతున్న వారెందరో ఉన్నారు. వీరి వివరాలు, పూర్తి లెక్కలు మాత్రం ఇంత వరకు రాష్ట్ర ప్రభుత్వానికి అందలేదు. ఈ పరిస్థితుల్లో మోడీ ప్రమాణ స్వీకారానికి బయలు దేరిన రాజపక్సే పనిలో పనిగా తమ దేశ జైళ్లల్లో ఉన్న తమిళులందరినీ విడుదల చేయడానికి ఆదేశాలు ఇచ్చారు. అందర్నీ తమిళనాడుకు పంపించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీంతో ఆ దేశ జైళ్లలో ఉన్న జాలర్లకు సంబంధించిన బంధువులు, కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. భారత్తో సత్సంబంధాల మెరుగు లక్ష్యంగా రాజపక్సే ఉన్నారని, అందు వల్లే తమిళ జాలర్లను విడుదల చేయాలని ఆదేశించినట్టుగా ఆ దేశ మత్స్యశాఖ ప్రకటించింది. అయితే, శ్రీలంక చెరలో తమిళ జాలర్ల ఎందరు ఉన్నారో, ఎందరిని విడుదల చేయనున్నారో అన్న వివరాలను ప్రకటించక పోవడం గమనార్హం. -
‘రాజపక్సే’పై రగడ
చెన్నై, సాక్షి ప్రతినిధి : రాజపక్సేకు భారత్ ఆహ్వానం వ్యవహారంలో అభ్యంతరాలు, ఆగ్రహావేశాలు పెరుగుతున్నాయి. ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారానికి శ్రీలంక దేశాధ్యక్షుడు రాజపక్సేను బీజేపీ ఆహ్వానించడంపై కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలు ఏకమై నిరసన గళం వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఓటమే గుణపాఠం: కరుణ శ్రీలంకను స్నేహపూర్వక దేశంగా పరిగణిం చిన కాంగ్రెస్కు ఓటమితో గుణపాఠం చెప్పారని డీఎంకే అధినేత కరుణానిధి శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈలం తమిళులకు వ్యతిరేకంగా అసెంబ్లీలో జయలలిత తీర్మానం చేసిన రోజులను ప్రజలు మర్చిపోలేదని అన్నారు. ఈలం తమిళుల మృతదేహాలను గుట్టలుగాపోసి మానవహక్కులను కాలరాసిన రాజపక్సే సమక్షంలో కొత్త ప్రధానిగా మోడీ ప్రమాణం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా మించిపోయిందిలేదు, ఆహ్వానాన్ని మరోసారి పరిశీలించండని ఆయన కోరారు. బీజేపీ మిత్రపక్ష ఎండీఎంకే అధ్యక్షుడు వైగో తన అభ్యంతరాన్ని ఒక లేఖద్వారా మోడీ దృష్టికి తీసుకెళ్లారు. తమ పాలనపట్ల తమిళులకు ఉన్న నమ్మకాన్ని పోగొట్టకుండా ఓదార్పుగా సాగాలని కోరుతున్నట్లు అందులో పేర్కొన్నారు. రాజపక్సేకు పంపిన ఆహ్వానాన్ని పునఃపరిశీలించాలని ఆయన కోరారు. ఈలం తమిళుల విషయంలో బీజేపీ కూడా కాంగ్రెస్ బాటలోనే నడుస్తోందా అనే సందేహం కలుగుతోందని సమత్తువ మక్కల్ కట్చి అధినేత, నటులు శరత్కుమార్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వ్యాఖ్యానించారు. రాజపక్సేకు ఆహ్వానం పలకడం ద్వారా కాంగ్రెస్ చేసిన తప్పిదమే బీజేపీ చేస్తోందని భావిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పాండియన్ వ్యాఖ్యానించారు. శ్రీలంకతో భారత్కు స్నేహసంబంధాలు ఉంటేనే మంచిదని టీఎన్సీసీ అధ్యక్షులు జ్ఞానదేశికన్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఆకాశంలో శ్రీలంక విమానం పోతే నేలపై నల్లజెండాల ప్రదర్శన నిర్వహించిన నేతలంతా నేడు నోరుమెదపడం లేదని ఎద్దేవా చేశారు. నేడు జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు రాజపక్సే రాకను నిరసిస్తూ నామ్తమిళర్ కట్చి, తమిళగ వాళ్వురిమై కట్చి నేతలు శనివారం అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ముందు ప్రకటించినట్లుగా ఈనెల 26న కూడా ఆందోళన సాగుతుంది. పునఃపరిశీలనకు తావులేదు : బీజేపీ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నిర్మలాసీతారామన్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ శ్రీలంకను ఆహ్వానించలేదని అంగీకరిస్తాం కానీ, సమస్యల పరిష్కారానికి సరికొత్త విధానంలో మోడీ ముందుకు సాగుతున్నారని ఎందుకు భావించకూడదని ప్రశ్నించారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పేందుకే సార్క్ దేశాధినేతలతోపాటూ రాజపక్సేకు ఆహ్వానం పలికారని ఆమె అన్నారు. ప్రజాస్వామ్యంలో ఈ విధానం ఎంతో అవసరమని అన్నారు. బీజేపీ కూటమి ప్రశ్నలకు పార్టీ తప్పక బదులిస్తుందని ఆమె చెప్పారు. పాకిస్థాన్ ప్రధాని నవాజ్షరీఫ్, శ్రీలంక దేశాధ్యక్షుడు రాజపక్సేకు పంపిన ఆహ్వానాలను పునఃపరిశీలించే ప్రశ్నే లేదని ఆమె స్పష్టం చేశారు. మారితేనే సత్సంబంధాలు: జయ శ్రీలంకను ఆహ్వానించడం ద్వారా తమిళుల హృదయాలను గాయపరిచారని ముఖ్యమంత్రి జయలలిత ఆక్షేపించారు. యుద్ధం పేరుతో శ్రీలంక చేసిన దాష్టీకాలు ప్రపంచ దేశాలన్నింటికీ తెలుసన్నారు. రాజపక్సేను యుద్దనేరస్తుడిగా నిలబెట్టాలని గత ప్రభుత్వాన్ని కోరినా నిర్లక్ష్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలు ఆడియాశలయ్యూయని అన్నారు. రాజపక్సే రాక విషయంలో భారత్ తన వైఖరిని మార్చుకుంటే తమిళనాడుతో సత్సంబంధాలు ఉంటాయని ఆమె హెచ్చరించారు. -
కూటమిలో కలహం
చెన్నై, సాక్షి ప్రతినిధి:భారతీయ జనతా పార్టీ అధికార పీఠం అధిరోహించక ముందే ఆ కూటమిలో కలహాలు మొదలయ్యూయి. భారత ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి శ్రీలంక దేశాధ్యక్షుడు రాజపక్సేను ఆహ్వానించడమే ఇందుకు కారణం. మోడీ ప్రమాణం చేసే 26వ తేదీన రాష్ట వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. తమిళనాడు ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో శ్రీలంకతో వైరం ప్రధానమైంది. ఈలం తమిళుల ఊచకోత, తమిళ జాలర్లను తరచూ చెరపట్టడం, చేపల వేట సామగ్రిని ధ్వంసం చేయడం వంటి అంశాలపై తమిళులు ఆగ్రహంతో ఉన్నారు. గత ఏడాదిగా శ్రీలంక నుంచి భారత్లో ఎవ్వరు అడుగుపెట్టినా తమిళనాడు యావత్తు ముక్తకంఠంతో నిరసనగళమెత్తుతోంది. శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చిన రాజపక్సేకు తిరుపతిలో నల్లజెండాలతో స్వాగతం పలికేందుకు వెళ్లి తమిళ పార్టీల వారు అరెస్టయ్యారు. చెన్నై చేపాక్ స్టేడియంలో శ్రీలంక-చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ మ్యాచ్కు సీఎం జయలలిత అనుమతినివ్వలేదు. ఎటువంటి కారణాలతోనూ శ్రీలంకేయులు భారత్లో అడుగుపెట్టరాదని తమిళులు చెబుతున్నారు. సాగునీరు, తాగునీరు,విద్యుత్లోటు, కావేరి నదీ జలాలు, ముల్లై పెరియార్ డ్యామ్ వంటి అనేక సమస్యలు శ్రీలంక అంశం తరువాతనే. ఈ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకునే ప్రధాని పీఠం కోసం పోటీపడిన సీఎం జయలలిత, బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీ సైతం తమ ఎన్నికల ప్రచారంలో శ్రీలంక సమస్యనే ప్రధానంగా ప్రస్తావించారు. తాము అధికారంలోకి వస్తే శ్రీలంక సమస్యకు ప్రాధాన్యతనిస్తామని మోడీ హామీ ఇచ్చారు. అదే నమ్మకంతో బీజేపీని రెండు స్థానాల్లో (ఒకటి మిత్రపక్ష పీఎంకే) గెలిపించారు. తాజా పరిణామాలు హామీకి భిన్నంగా సాగుతున్నాయనే ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఈ నెల 26వ తేదీన నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి రాజపక్సేను ఆహ్వానించడంపై బీజేపీ మిత్రపక్షాలైన ఎండీఎంకే, పీఎంకే, డీఎండీకేలు నిరసనను ప్రకటించాయి. డీఎంకే అధినేత కరుణానిధి అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజపక్సే భారత్ రాక పార్టీ, ప్రభుత్వాలకు అతీతంగా తమిళుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని వారు పేర్కొన్నారు. గతంలో ఎన్డీఏ, యూపీఏ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు శ్రీలంకను ఆహ్వానించలేదని వారు గుర్తుచేశారు. రాజపక్సే భారత్లో అడుగుపెట్టడాన్ని ఎంత మాత్రం సహించేది లేదని వారు స్పష్టం చేశారు. రాజపక్సేకు పంపిన ఆహ్వానాన్ని బీజేపీ పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. చెన్నైలోని శ్రీలంక రాయబారి ప్రసాద్ కరియావాత్సతో ఈ అంశాన్ని ప్రస్తావించగా మోడీ ప్రమాణానికి హాజరుకావలసిందిగా రాజపక్సేకు ఆహ్వానం అందిందన్నారు. నిరసనలు మాటేమిటని ప్రశ్నించగా ఇది కేవలం ఒక రాష్ట్రానికి చెందినది కాదని, అంతర దేశాల మధ్య ఏర్పడిన అంశమని, తన పరిధిలో జవాబు చెప్పకూడదని ఆయన అన్నారు. రాజపక్సే రాక సమర్ధనీయం : పొన్ రాధాకృష్ణన్ నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారానికి రాజపక్సేను ఆహ్వానించడం సమంజసం, సమర్ధనీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పొన్రాధాకృష్ణన్ అన్నారు. గురువారం ఢిల్లీ నుంచి చెన్నై చేరుకున్న ఆయన విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. సార్క్ దేశాలకు పంపిన ఆహ్వానాల్లో భాగంగానే శ్రీలంకకూ అందిందని, దీనిని ప్రత్యేకంగా పేర్కొనాల్సిన అవసరం లేదని అన్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వం అనేక సార్లు రాజపక్సేకు రెడ్కార్పెట్ స్వాగతం పలికిందని పేర్కొన్నారు. ఆ రోజు మన్మోహన్ సింగ్, ఈ రోజు మోడీ ఆ స్థానంలో ఉన్నారని వివరించారు. హంతకుడు, డాక్టరు ఇద్దరి చేతుల్లోనూ కత్తి ఉంటుందని, ఒకరు ప్రాణంతీసేందుకు, మరొకరు ప్రాణం పోసేందుకు వాటిని వినియోగిస్తారని ఆయన చెప్పారు. శ్రీలంక విషయంలో మోడీ ఒక డాక్టరుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీ ప్రకారం తమిళనాడు, శ్రీలంక వివాదంపై మోడీ చర్చించే అవకాశం ఉందన్నారు. అమ్మ హాజరుపై అనుమానం రాజపక్సేకు ఆహ్వానంపై అన్నాడీఎంకే అధినేత్రి ముఖ్యమంత్రి జయలలిత గురువారం ఒక ప్రకటనలో నిరసన వ్యక్తం చేశారు. రాజపక్సేను ఆహ్వానించడం తమిళుల ఆత్మగౌరవాన్ని కించపరచడమే అవుతుందని వ్యాఖ్యానించారు. అందరితోపాటు అమ్మకు కూడా ఢిల్లీ వేడుకకు ఆహ్వానం అందింది. రాజపక్సే రాక ఖరారైన నేపథ్యంలో జయ హాజరవుతారా లేక బహిష్కరిస్తారా అనేది రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే గెలుపునకు కృషి చేసిన మక్కల్ వాళ్వురిమై అధినేత వేల్మురుగన్ గురువారం జయలలితను కలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజపక్సే భారత్ రాకను నిరసిస్తూ ఈ నెల 26వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
పాపం త్రిష
ఒక్కోసారి ఊహించని పరిణామాలతో మనసు అతలాకుతలం అవుతుంది. మంచికి పోతే చెడు ఎదురవుతుందని పెద్దలు చెబుతుంటారు. నటి త్రిష అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. శ్రీలంక తమిళులను ఊచకోత కోసిన ఆ ప్రభుత్వమన్నా, ఆ దేశ అధ్యక్షుడు రాజపక్సే అన్నా తమిళ సంఘాలు మండిపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఇటీవల అందాల తార త్రిష కెనడాలో రాజపక్సే మద్దతుదారులు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో త్రిష బెంబేలెత్తిపోయారు. నిజానికి త్రిష అక్కడ వికలాంగుల కోసం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారట. ఈ విషయాన్ని తన సన్నిహితులతో చెప్పుకుని ఆవేదన చెందారు. సరిగ్గా అలాంటి పరిస్థితిలో దేవుడు కరుణించాడో లేక ఆమె టైమ్ బాగుందో గాని కెనడాలోని కొన్ని తమిళ సంఘాలు త్రిష పాల్గొన్న కార్యక్రమం రాజపక్సే మద్దతుదారులు నిర్వహించింది కాదని వెల్లడించారుు. దీంతో రక్షించావుదేవుడా అంటూ త్రిష రిలాక్స్ అయ్యారట.