refugees
-
పాలస్తీనా శరణార్థులను అక్కున చేర్చుకోండి
వాషింగ్టన్: ఇజ్రాయెల్ దాడులతో గాజాలో సర్వం కోల్పోయి శరణార్థులుగా మారిన పాలస్తీనా పౌరుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. జోర్డాన్, ఈజిప్టుతోపాటు ఇతర అరబ్ దేశాలు వారికి ఆశ్రయ మివ్వాలని సూచించారు. వారి బాగోగులు చూసుకోవాలన్నారు. ఇజ్రాయెల్కు 2 వేల పౌండ్ల బరువైన బాంబుల సరఫరాను నిలిపివేస్తూ బైడెన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేశానని వెల్లడించారు. వాటిని శనివారమే ఇజ్రాయెల్కు అందజేశామని చెప్పారు.గాజాను శుభ్రం చేయాలి గాజా పూర్తిగా విధ్వంసానికి గురైన ప్రాంతమని, శిథిలాలను తొలగించి, శుభ్రం చేయాల్సిన అవసరం ఉందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. కనుక ఎక్కువ మంది ప్రజలు బయటకు వెళితే కార్యాచరణ తేలికవుతుందన్నారు. గాజా పౌరులకు మరోచోట ఇళ్లు నిర్మించి ఇస్తే, అక్కడ వారు శాంతియుతంగా జీవనం సాగించగలరన్నారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహూ కార్యాలయం ఇంకా స్పందించలేదు. మరోవైపు హమాస్–ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్కు అమెరికా బాంబులు సరఫరా చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. మిగిలిన బందిలందరినీ విడుదల చేయకపోతే హమాస్పై మళ్లీ దాడులు ప్రారంభిస్తామని ఇజ్రాయెల్ ఇప్పటికే హెచ్చరించింది. అసలు వ్యూహం అదేనా? పాలస్తీనా శరణార్థులు అరబ్ దేశాలు అనుమతించాలనడం, ఇజ్రాయెల్కు అమెరికా బాంబులు సరఫరా చేయడం వెనుక మరో వ్యూహం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. బందీల విడుదల పూర్తయిన తర్వాత గాజా నుంచి పాలస్తీనా పౌరులను బయటకు తరలించి, హమాస్ స్థావరాలను పూర్తిగా నేలమట్టం చేయా లన్నదే అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహం కావొచ్చని తెలుస్తోంది. గాజా నుంచి హమాస్ మిలిటెంట్లను పూర్తిస్థాయిలో నిర్మూలించాలని ఆ రెండు దేశాలు యోచిస్తున్నాయి. -
వెనక్కి పంపేస్తున్నాం.. మాకు వద్దే వద్దు
మెక్సికో గుండా శరణార్థులుగా చొరబడిన వారందరినీ వెనక్కి పంపేస్తామంటూ అమెరికన్లకు ఇచ్చిన వాగ్దానాన్ని డొనాల్డ్ ట్రంప్ నెరవేర్చాలని చూస్తుంటే అందుకు మెక్సికో ససేమిరా అంటోంది. మా గడ్డ మీదుగా వచ్చినంత మాత్రాన వాళ్లంతా మెక్సికన్లుకాబోరని తెగేసి చెబుతోంది. అయినాసరే విమానాల్లో తరలిస్తామంటే ఆ విమానాలను ల్యాండింగ్ కానివ్వబోమని స్పష్టంచేసింది. దీంతో ఈ శరణార్థులను ఎక్కడి పంపాలో, వీళ్లని ఏం చేయాలా అని అమెరికా తల పట్టుకుంది. అసలేం జరిగింది? చాన్నాళ్లుగా శరణార్థులుగా అమెరికాలోకి అక్రమంగా వలసవస్తున్న వారిని గత అమెరికా ప్రభుత్వాలు అనుమతించాయి. కానీ ట్రంప్ అధ్యక్షుడయ్యాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. డాక్యుమెంట్లు లేకుండా శరణు కోరుతూ అక్రమంగా వస్తే ఎవ్వరినీ అనుమతించబోమని ట్రంప్ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఇప్పటికే వచ్చిన వారినీ పంపేస్తామని ప్రకటించింది. గ్వాటెమాల నుంచి వచ్చిన వాళ్లను ఇటీవలే వెనక్కి పంపింది. ఒక్కోదాంట్లో 80 మంది శరణార్థులున్న రెండు సైనిక విమానాలు శుక్రవారమే గ్వాటెమాలకు వెళ్లి అక్కడ వదిలేసి వచ్చాయి. ఇదే తరహాలో ‘‘మెక్సికో వాళ్లు మెక్సికోలోనే ఉండాలి. అమెరికాలో కాదు’’అనే అర్థంలో గతంలో అమలుచేసిన ‘రిమేన్ ఇన్ మెక్సికో’విధానాన్ని ట్రంప్ యంత్రాంగం తెరమీదకు తెచ్చింది. మెక్సికో వెళ్లి శరణార్థులను వదిలేసి రావాలని ట్రంప్ ప్రభుత్వం గత వారం నిర్ణయించింది. సీ–17 భారీ సైనిక సంబంధ సరకు రవాణా విమానంలో వారిని మీ దేశానికి తీసుకొస్తున్నట్లు మెక్సికోకు అమెరికా సమాచారమిచ్చింది. ఇది తెల్సిన వెంటనే మెక్సికో ఘాటుగా స్పందించింది. ‘‘మా దేశం గుండా మీ దేశంలోకి వచ్చినంత మాత్రాన వాళ్లంతా మెక్సికన్లు అయిపోరు. వాళ్లలో అక్రమంగా మెక్సికోకు వచ్చి చివరకు అమెరికా సరిహద్దుదాకా వచ్చి శరణు కోరిన వారు ఉన్నారు. ఒకవేళ వాళ్లందరినీ విమానంలో మా దేశానికి పంపిస్తే ఆ విమానాన్ని ల్యాండ్ కానివ్వం. అమెరికాతో మాకు సత్సంబంధాలున్నాయి. వలస విషయంలోనూ అంతే. అయినా తప్పదనుకుంటే ఆ శరణార్థుల్లో మెక్సికో జాతీయులను మాత్రం తిరిగి పంపడానికి అనుమతిస్తాం’’అని మెక్సికో విదేశాంగ శాఖ స్పష్టంచేసింది. క్షీణించిన సత్సంబంధాలు మెక్సికో సరిహద్దు వద్ద భద్రతను కట్టుదిట్టంచేస్తానని, ఓ యాప్ ద్వారా స్లాట్ బుక్చేసుకుని ఇంటర్వ్యూ తర్వాత శరణార్థి హోదాలో అమెరికాలోకి వచ్చే విధానానికి చరమగీతం పాడుతున్నట్లు ట్రంప్ అధికారంలోకి రాగానే ప్రకటించారు. అందుకు తగ్గట్లే సరిహద్దు వద్ద వేలాది మందిగా అదనపు బలగాలను మొహరించారు. మెక్సికో గుండా అత్యంత ప్రమాదకర కొత్తరకం మాదకద్రవ్యాలు అమెరికాలోకి స్మగ్లింగ్ చేస్తున్నారంటూ అక్కడి డ్రగ్ ముఠాలను ఉగ్రసంస్థలుగా ప్రకటించారు. మెక్సికో వస్తూత్పత్తులపై ఫిబ్రవరి నుంచి అదనంగా 25 శాతం పన్నులు విధిస్తానని ట్రంప్ ప్రకటించారు. వెనక్కి పంపిస్తామన్న ట్రంప్ ప్రభుత్వ అభ్యర్థనను మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ తిరస్కరించారు. మూకుమ్మడి తిరుగుటపాలు ఒప్పకోబోమని, అయినా ప్రతిభ గల మెక్సికన్ శరణార్థులు అమెరికా ఆర్థికాభివృద్ధికి దోహదపడతారని ఆమె హితవు పలికారు. దీంతో అమెరికా, మెక్సికో సత్సంబంధాలు క్షీణించాయి. 2021లోనూ అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సేనలు నిష్క్రమించినప్పుడు అక్కడి వేర్వేరు దేశస్తులను తమ తమ దేశాలకు అమెరికా తమ సైనిక విమానాల్లో తరలించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈ ఏడాది.. పిల్లల పాలిట పెనుశాపమే!
పిల్లల పాలిట చరిత్రలో ఎన్నడూ లేనంతటి దారుణ సంవత్సరంగా నిలిచింది 2024. యుద్ధాలు, ఘర్షణల కారణంగా ప్రపంచవ్యాప్తంగా బాలలు భారీ సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. ఏకంగా 47.3 కోట్ల మంది బాలలు సంఘర్షణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఆరుగురిలో ఒకరి కంటే ఎక్కువ మంది కల్లోల ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఒకప్పుడు పేదరికం, కరువు, వంటివాటితో అల్లాడే పిల్లలు ఇప్పుడు ఘర్షణల్లో సమిధలవుతున్నారు. చదువు మాట అటుంచి వారికి పోషకాహారమే గగనమైపోయింది! గాజా, సూడాన్, ఉక్రెయిన్ సహా ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలతో బాలలు విపరీతంగా సతమతమవుతున్నట్టు ఐరాస బాలల సంస్థ యునిసెఫ్ తాజాగా పేర్కొంది. గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో 15 నెలల్లో కనీసం 17,492 మంది బాలలు మరణించినట్లు తెలిపింది...! మునుపెన్నడూ లేనంతంగా ఎక్కువ మంది పిల్లలు సంఘర్షణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. బలవంతంగా నిరాశ్రయులవుతున్నారు. ఘర్షణలో మరణిస్తున్న, గాయపడుతున్న పిల్లల సంఖ్య పెరిగింది. పాఠశాలలపై బాంబుల వర్షం కురుస్తోంది. ఇళ్లు ధ్వంసమయ్యాయి. కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. భద్రత మాట పక్కకు పెడితే.. ప్రాథమిక అవసరాలు తీర్చుకునే అవకాశమూ ఉండటం లేదు. వాళ్లు ఆడుకోవడం, నేర్చుకోవడం ఎప్పుడో మరిచారు. ఈ యుద్ధాలు పిల్లల హక్కులను హరిస్తున్నాయి. ఇక, ప్రాణాలను కాపాడే వ్యాక్సిన్లు, పోషకాహారం విలాసంగా మారాయి. ‘‘ప్రపంచంలో అనియంత్రిత యుద్ధాలకు ఒక తరం పిల్లలు బలవుతున్నారు. యుద్ధ ప్రాంతాల్లోని పిల్లలు మనుగడ కోసం పోరాటమే చేస్తున్నారు. దానికి తమ బాల్యాన్ని పణంగా పెడుతున్నారు. సర్వహక్కులు కోల్పోతున్నారు. ఇది దారుణం’’ అని యునిసెఫ్ డైరెక్ట్ కేథరిన్ రస్సెల్ వాపోయారు. గణాంకాలు చెబుతున్న విషాదాలు.. యునిసెఫ్ నివేదిక ప్రకారం ప్రపంచ జనాభాలో పిల్లలు 30 శాతం ఉన్నారు. వారిలో 47.3 కోట్ల మంది యుద్ధ ప్రభావింత ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ప్రతి ఆరుగురిలో ఒకరు సంఘర్షణ ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్నారని అంతర్జాతీయ ఏజెన్సీ తెలిపింది. 1990లలో సుమారు 10 శాతం మంది బాలలు సంఘర్షణ ప్రాంతాల్లో ఉండగా ఇప్పుడది ఏకంగా రెట్టింపుకు, అంటే 19 శాతానికి పెరిగింది. ఈ యుద్ధాల కారణంగా 2023 చివరి నాటికి 4.7 కోట్ల మంది పిల్లలు నిర్వాసితులయ్యారు. 2024లో హై తీ, లెబనాన్, మయన్మార్, పాల స్తీనా, సూడాన్ నుంచి అత్యధికంగా శరణార్థులుగా వెళ్లారు. ప్రపంచ శరణార్థుల జనాభాలో సుమారు 40 శాతం బాలలే. ఆయా దేశాల్లో నిర్వాసితులయినవారిలో బాలలు 49 శాతమున్నారు. 2023 నుంచి ఇప్పటిదాకా 22,557 మంది పిల్లలపై రికార్డు స్థాయిలో 32,990కు పైగా తీవ్రమైన హక్కుల ఉల్లంఘనలు జరిగాయి. ముఖ్యంగా బాలికల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సంఘర్షణ ప్రాంతాల్లో అత్యాచారాలు, లైంగిక హింస పెచ్చరిల్లాయి. ప్రమాదకర స్థాయిలో యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో విద్యకు తీవ్ర అంతరాయం కలిగింది. సంఘర్షణ ప్రభావిత దేశాలలో 52 మిలియన్లకు పైగా పిల్లలు పాఠశాలకు దూరంగా ఉన్నారు. విద్యా మౌలిక సదుపాయాల విధ్వంసం, పాఠశాలల సమీపంలో అభద్రతా భావం వల్ల ఈ ప్రాంతాల్లో పరిస్థితులు మరింత దిగజారాయి. ఈ పిల్లల్లో పోషకాహార లోపం కూడా ప్రమాదకర స్థాయికి పెరిగింది. యుద్ధం పిల్లల ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. యుద్ధాలు జరుగుతున్న దేశాల్లోని పిల్లల్లో 40శాతం మంది టీకాలు అందడం లేదు. వారి మానసిక ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. హింస, విధ్వంసం, కుటుంబ సభ్యులను కోల్పోవడం వల్ల పిల్లల్లో నిరాశ పెరిగింది. పిల్లల్లో ఆగ్రహావేశాలు పెరిగాయి. విచారం, భయం వంటి వాటితో బాధపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గాజాలో శరణార్థులపై ఇజ్రాయెల్ దాడులు..26 మంది మృతి
గాజా:ఇజ్రాయెల్- హమాస్ల మధ్య యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడుల్లో పాలస్తీనా పౌరులు మరణిస్తూనే ఉన్నారు. తాజాగా గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 26 మంది శరణార్థులు మృతి చెందారు. ఈమేరకు పాలస్తీనా వైద్యాధికారులు వెల్లడించారు. మంగళవారం(డిసెంబర్ 10) అర్ధరాత్రి ఇజ్రాయెల్ సరిహద్దులోని బీట్ లాహియాలో దాడులు జరిగాయి.శరణార్థులు ఆశ్రయం పొందుతున్న శిబిరంపై దాడి జరగడంతో 19 మంది మరణించారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ఉండటం గమనార్హం. మరోవైపు సెంట్రల్ గాజాలోని ఓ శరణార్థి శిబిరంపైనా దాడి జరిగింది. ఈ దాడిలో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు గాజా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, ఈ దాడికి సంబంధించి ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేయడంతో సుమారు 1,200 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఇప్పటివరకు జరిపిన దాడుల్లో 40 వేల మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. -
స్కూలు, క్లినిక్లపై ఇజ్రాయెల్ దాడి
డెయిర్ అల్–బలాహ్/బీరుట్: గాజాపై ఇజ్రాయెల్ దాడులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. గురువారం ఒక స్కూలు, క్లినిక్లపై జరిగిన దాడుల్లో కనీసం 34 మంది ప్రాణాలు కోల్పోగా, 69 మంది గాయపడ్డారు. శరణార్థులు తలదాచుకుంటున్న డెయిర్ అల్– బలాహ్లోని స్కూలు భవనంపై ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడిలో 28 మంది చనిపోగా, 54 మంది గాయపడ్డారు. మృతుల్లో ఒక చిన్నారి, ఏడుగురు మహిళలున్నట్లు అల్ అక్సా మారి్టర్స్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. శరణార్థులకు సాయం అందించే విషయమై ఓ సంస్థ ప్రతినిధులు శిబిరం నిర్వాహకులతో చర్చిస్తున్న సమయంలో భవనంపై దాడి జరిగినట్లు ప్రత్యక్ష సాకు‡్ష్యలు తెలిపారు. ఉదయం 11.20 గంటల సమయంలో ఘటన జరిగినప్పుడు స్కూలు భవనంలో సుమారు 3 వేల మంది ఉన్నట్లు పాలస్తీనియన్ రెడ్ క్రీసెంట్కు చెందిన రిస్క్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ హిషామ్ అబూ హోలీ తెలిపారు. దాడి తీవ్రతకు మృతదేహాలు ముక్కముక్కలు ముక్కలై చెల్లా చెదురుగా పడిపోయాయన్నారు. ఛిద్రంగా మారిన శరీర భాగాలనే ఏరి ఆస్పత్రికి తరలించినట్లు అక్కడి భయానక పరిస్థితిని హిషామ్ వివరించారు. మృతుల్లో ఆరేళ్ల చిన్నారి నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు ఉన్నారన్నారు. మొత్తం మూడంతస్తులకు గాను ఒకటో ఫ్లోర్లో శిబిరం పరిపాలన సిబ్బంది ఉండగా, మిగతా రెండంతస్తుల్లోనూ శరణార్థులే తలదాచుకుంటున్నారన్నారు. మొదటి అంతస్తు లక్ష్యంగా చేసుకుని దాడి జరిగినట్లు భావిస్తున్నామన్నారు. కానీ, దాడి తీవ్రతకు రెండు, మూడు అంతస్తులు సైతం తీవ్రంగా దెబ్బతిన్నట్లు వివరించారు. మరో ఘటనలో..గాజా నగరం పశి్చమాన ఉన్న అల్–రిమల్ క్లినిక్పై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన లక్షిత దాడిలో ఆరుగురు చనిపోగా మరో 15 మంది గాయపడ్డారని గాజాలోని అంబులెన్స్ సరీ్వస్ ప్రతినిధి పరేస్ అవాద్ తెలిపారు. బీరుట్పై ఇజ్రాయెల్ దాడి: 11 మంది మృతి బీరుట్: సెంట్రల్ బీరుట్పై ఇజ్రాయెల్ గురువారం చేసిన రెండు వేర్వేరు దాడుల్లో 11 మంది మృతి చెందారని, 48 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్యశాఖ వెల్లడించింది. రస్ అల్–నబాలో ఓ ఎనిమిది అంతస్తుల భవనంపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించగా.. అపార్ట్మెంట్ కిందిభాగం దెబ్బతింది. -
లెబనాన్ నిరాశ్రయులు.. పది లక్షలు!
లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో లక్షల మంది నిరాశ్రయులవుతున్నారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల భయంతో సురక్షిత ప్రాంతాలకు తరలుతున్నారు. లక్షలాది మంది సరిహద్దులు దాటి సిరియాకు చేరుకుంటున్నారు. ఇప్పటిదాకా ఏకంగా 10 లక్షల మంది ప్రాణ భయంతో పారిపోయినట్టు ప్రధాని నజీబ్ మికాటీ ఆదివారం తెలిపారు. ఆరో వంతు జనభా దేశం దాటుతోంది. లెబనాన్లో ఇదే అతి పెద్ద వలస ఇదే’’ అని ఆవేదన వెలిబుచ్చారు. గాజా యుద్ధానికి ఏడాది అవుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ తన దృష్టిని లెబనాన్పైకి మార్చింది. హమాస్కు మద్దతు ఇస్తున్నట్లు హెజ్బొల్లా ప్రకటించడంతో ఈ దాడులు తీవ్రమయ్యాయి. హెజ్బొల్లా స్థావరాలపై దాడుల తర్వాత ప్రజలు ఇళ్లలో ఉండటం లేదు. చాలా మంది వీధులు, సముద్రతీర కార్నిష్, పబ్లిక్ స్క్వేర్లు, తాత్కాలిక షెల్టర్లలో రాత్రంతా ఉంటున్నారు. కుటుంబాలకు కుటుంబాలు వీధుల్లోనే నిద్రిస్తున్నాయి. దహియాలో ఎక్కడ చూసినా నేలమట్టమైన భవనాలు, శిథిలాలతో నిండిన వీధులు, పొగ, ధూళి మేఘాలు కనిపిస్తున్నాయి. లెబనాన్ రాజధానికి ఎగువన ఉన్న పర్వతాల వరకు ప్రజలు పసిపిల్లలు, కొన్ని వస్తువులను వెంటపెట్టుకుని ర్యాలీగా వెళ్లారు. 50 వేల మందికి పైగా సిరియాకు వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల చీఫ్ ఫిలిప్పో గ్రాండి తెలిపారు. సిరియాకే ఎందుకు? నిరాశ్రయులైన లెబనాన్ ప్రజలు శరణార్థులుగా సిరియాకు వెళ్తున్నారు. లెబనాన్ ప్రజలు సిరియాకు వెళ్లాలంటే డాక్యుమెంట్లు అవసరం లేదు. దీంతో ప్రతి గంటకు వందలాది మంది సిరియాకు వెళ్తున్నారు. పిల్లలు సిరియాలోకి వెళ్తుంటే తండ్రులు ఏడుస్తూ వీడ్కోలు పలుకుతున్న దృశ్యం కంటతడి పెట్టిస్తోంది. యూకేకు సంపన్నులులెబనాన్లో దాడుల దృష్ట్యా విమానాశ్రయం చుట్టూ భయానక వాతావరణం నెలకొంది. చాలా విమానాలు రద్దయ్యాయి. దీంతో యూకేకు ఓకే ఒక కమర్షియల్ ఫ్లైట్ రాకపోకలు సాగిస్తోంది. మధ్య తరగతి, సంపన్న వర్గాలకు చెందినవారు లెబనాన్ను విడిచి యూకే లాంటి దేశాలకు వెళ్తున్నారు. -
గాజాలో 22 మంది మృతి
డెయిర్ అల్ బలాహ్: గాజాలోని జైటూన్ ప్రాంతంలో శరణార్థులు తలదాచుకుంటున్న పాఠశాల భవనంపై ఇజ్రాయెల్ ఆర్మీ శనివారం జరిపిన దాడిలో కనీసం 22 మంది చనిపోగా మరో 30 మంది గాయపడ్డారు. వీరిలో 13 మంది చిన్నారులు, ఆరుగురు మహిళలున్నారని గాజా ఆరోగ్య శాఖ పేర్కొంది. ఈ స్కూల్లో హమాస్ కమాండ్ సెంటర్ నడుస్తోందని ఇజ్రాయెల్ ఆరోపించింది. రఫాపై దాడిలో మరో నలుగురు చనిపోయారని హమాస్ పేర్కొంది. -
Israel-Hamas war: రక్తమోడుతున్న గాజా
డెయిర్ అల్ బలాహ్: ఇజ్రాయెల్ సైన్యం యథేచ్ఛగా జరుపుతున్న దాడులతో గాజా ప్రాంతం రక్తమోడుతోంది. శనివారం ఉదయం జవైదా పట్టణంలోని ఓ నివాసంతోపాటు పక్కనే ఉన్న శరణార్థులు తలదాచుకున్న భవనంపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడిలో సమీ జవాద్ అల్ ఎజ్లా, అతడి కుటుంబంలోని 18 మంది మృత్యువాతపగా, మరో వ్యక్తి గాయపడ్డారు. మృతులను సమీ ఇద్దరు భార్యలు, 2 నుంచి 22 ఏళ్ల వయస్సున్న 11 మంది సంతానం, వారి అమ్మమ్మ, మరో ముగ్గురు బంధువులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఇజ్రాయెల్ నుంచి గాజాలోకి చేపలు, మాంసం తరలించే ప్రక్రియకు సమీ సమన్వకర్తగా వ్యవహరించేవాడని, చాలా మంచి వ్యక్తని చెప్పారు. ఘటన సమయంలో రెండు భవనాల్లో కలిపి 40 మంది వరకు ఉన్నట్లు వివరించారు. ఇలా ఉండగా, సెంట్రల్ గాజాలోని మఘాజీ శరణార్థి శిబిరం చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేయాల్సిందిగా ఇజ్రాయెల్ ఆర్మీ శనివారం పాలస్తీనియన్లను హెచ్చరించింది. ఆ ప్రాంతం వైపు నుంచే తమ భూభాగం మీదికి మిలిటెంట్లు రాకెట్లు ప్రయోగిస్తున్నారని పేర్కొంది. -
బంగ్లా దేశీయులకు ఆశ్రయం ఇస్తాం: సీఎం మమత
కోల్కతా: బంగ్లాదేశ్ నుంచి వచ్చే శరణార్థులుకు తమ రాష్ట్రం ఆశ్రయం కల్పిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఆదివారం అధికార టీఎంసీ నిర్వహించిన అమరవీరుల దినోత్సవ ర్యాలీలో సీఎం మమత పాల్గొని మాట్లాడారు.‘‘ బంగ్లాదేశ్ పొరుగున ఉన్న దేశం.. కావున ఆ దేశం గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేను. బంగ్లాదేశ్ గురించి భారత ప్రభుత్వం మాట్లాడాలి. అయితే నిస్సహాయులైన ప్రజలు (బంగ్లాదేశ్కు చెందినవారు) బెంగాల్ తలుపు తడితే మాత్రం.. తాము కచ్చింతంగా ఆ ప్రజలకు ఆశ్రయం కల్పిస్తాం. ఐక్యరాజ్య సమితిలోనే దీనిపై నిర్మానం చేయబడి ఉంది. శరణార్థులును పొరుగుదేశం వాళ్లు గౌరవించాలని అందులో ఉంది. బంగ్లాదేశ్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో ఇబ్బంది పడుతున్న బెంగాల్ ప్రజల బంధువులకు తాము పూర్తి సహకారం అందిస్తాం’ అని సీఎం మమత తెలిపారు.Mamata Banerjee at her Best. Biggest Mass Leader West Bengal has ever seen. #ShahidDibas pic.twitter.com/QMk0H9XeNg— The Enigmous (@_TheEnigmous) July 21, 2024 ఈ ర్యాలీలో పాల్గొన్న సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ లోక్సభ ఎన్నికల ప్రదర్శనపై సీఎం మమత ప్రశంసలు కురిపించారు.‘‘ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఎక్కువ కాలం అధికారంలో ఉండలేదు. ఇది స్థిరమైన ప్రభుత్వం కాదు.. త్వరలోనే కూలిపోయింది. మీరు (అఖిలేష్) ఇచ్చిన లోక్ససభ ఎన్నికల ప్రదర్శనకు యూపీలో బీజేపీ ప్రభుత్వం రాజీనామా చేయాలి. కానీ, సిగ్గులేని బీజేపీ ప్రభుత్వం.. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ఇంకా అధికారంలోనే కొనసాగుతోంది’’ అని బీజేపీపై విమర్శలు గుప్పించారామె.అనంరతం ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మాట్లాడారు. ‘‘ప్రశ్చిమ బెంగాల్ ప్రజల వలే యూపీ ప్రజలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఢిల్లీలో అధికారంలో కూర్చున్నవారి అధికారం కొన్నిరోజుల మాత్రమే ఉంటుంది. కేంద్రంలోని ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది’’ అని అన్నారు. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వ అనుకూల విద్యార్థి సంఘాలకు చెందిన విద్యార్థులు, రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న ఆందోళనకారుల మధ్య జరిగిన హింసలో ఇప్పటివరకు 151 మంది ప్రాణాలు కోల్పోయారు. బంగ్లాదేశ్లో సంక్షోభం నెలకొన్న ఈ సమయంలో బెంగాల్ సీఎం మమత చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. -
బతుకు చితికి.. గూడు చెదిరి... వలస బాట
పుట్టిన నేల.. పెరిగిన ఊరు.. ఇవే మనిషి అస్తిత్వం. కానీ యుద్ధం, హింస ప్రజలను నిరాశ్రయులను చేస్తోంది. అధికార దాహం, అహంకార ధోరణి కోట్ల మందిని సొంత నేలకే పరాయివాళ్లుగా మారుస్తోంది. గత పదేళ్లలో ప్రపంచ జనాభాలో ప్రతి 69 మందిలో ఒకరు చొప్పున ఏకంగా 12 కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. వీరిలో చాలామంది తలదాచుకునేందుకు కూడా దిక్కులేక శరణార్థులుగా మారాల్సి వస్తోంది. ప్రాణాలను చేతబట్టుకుని విదేశాల బాట పట్టాల్సిన దుస్థితి దాపురిస్తోంది...! – సాక్షి, నేషనల్ డెస్క్సంఘర్షణ, హింస, మానవ హక్కుల ఉల్లంఘనల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 11.7 కోట్ల మందికి పైగా నిరాశ్రయులైనట్టు ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషన్ (యూఎన్హెచ్సీఆర్) వెల్లడించింది. వీరిలో 6.83 కోట్ల మంది సంఘర్షణలు, ఇతర సంక్షోభాల కారణంగా సొంత దేశాల్లోనే ఇతర ప్రాంతాలకు చెదిరిపోయారు. దాదాపు 4.5 కోట్ల మంది పొట్ట చేత పట్టుకుని శరణార్థులుగా విదేశాలకు వలస వెళ్లారు. 2024 తొలి నాలుగు నెలల్లో ఇది మరింత పెరిగింది.పదేళ్లకోసారి రెట్టింపు.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1951లో ఐరోపాలోని శరణార్థుల హక్కులను పరిరక్షించేందుకు ఐక్యరాజ్యసమితి శరణార్థుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. 1967లో శరణార్థుల కన్వెన్షన్ ఆవిర్భవించినప్పుడు 20 లక్షల మంది శరణార్థులున్నారు. ⇒ 1980 నాటికి కోటికి చేరిన శరణార్థులు ⇒ 1990 నాటికి రెండు కోట్లకు చేరిన సంఖ్య⇒ 2021 చివరి నాటికి 3 కోట్లను మించిన శరణార్థులు⇒ తాజాగా 11 కోట్లు దాటేసిన వైనం2020 నుంచి వేగంగా...⇒ 2022లో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక 2023 చివరి నాటికి 60 లక్షల మంది ఉక్రేనియన్లు నిరాశ్రయులయ్యారు. వీరిలో చాలామంది దేశం విడిచి వెళ్లారు. ⇒ 2023లో సుడాన్లో సైన్యం, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య ఘర్షణలు శరణార్థుల సంఖ్యను 10.5 లక్షలు పెంచాయి. ⇒ ఇక ఇజ్రాయెల్ దాడులతో గాజాలో గతేడాది చివరి మూడు నెలల్లో 10.7 లక్షల మంది నిరాశ్రయులై వలస వెళ్లారు.ఎక్కడి నుంచి వస్తున్నారు?⇒ ప్రపంచవ్యాప్తంగా నమోదైన దాదాపు 4.5 కోట్ల మంది శరణార్థులలో దాదాపు మూడొంతులు (72 శాతం) ఐదు దేశాల నుంచే వచ్చారు.అఫ్గానిస్తాన్ 64 లక్షలు సిరియా 64 లక్షలు వెనెజులా 61 లక్షలు ఉక్రెయిన్ 60 లక్షలు పాలస్తీనా 60 లక్షలుఆశ్రయమిస్తున్న దేశాలు?⇒ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 శాతం మంది శరణార్థులు తమ స మీప పొరుగు దేశాల్లోనే బతుకీడుస్తున్నారు. ⇒ ఇరాన్, పాకిస్తాన్లోని శరణార్థులందరూ అఫ్గాన్లే. ⇒ టర్కీలో ఎక్కువ మంది శరణార్థులు సిరియన్లు.దేశం శరణార్థులు ఇరాన్ 38 లక్షలు తుర్కియే 33 లక్షలు కొలంబియా 29 లక్షలు జర్మనీ 26 లక్షలు పాకిస్తాన్ 20 లక్షలు -
శరణార్థులపై పాక్ పంజా
నిన్నటి వరకూ ఎత్తుకుని ముద్దాడినవారు హఠాత్తుగా విసిరికొడితే...? ఇప్పుడు పాకిస్తాన్లో తలదాచుకుంటున్న అఫ్గానిస్తాన్ శరణార్థులు ఇలాంటి దుఃస్థితిలోనే పడ్డారు. ఇజ్రాయెల్ గడ్డపై హమాస్ దాడుల పర్యవసానంగా దాదాపు నెలరోజుల నుంచి గాజా స్ట్రిప్లో మారణహోమం సాగుతోంది. నిరాయుధ పౌరులు వేలాదిమంది పిట్టల్లా నేలరాలుతున్నారు. ఈ పరిణామాలపై అరబ్బు ప్రపంచం భగ్గుమంటోంది. కానీ ఈమూల ప్రాణాలు అరచేతపట్టుకుని వచ్చిన శరణార్థులను బలవంతంగా వెనక్కి పంపించటానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. వారిని నరకకూపంలోకి నెట్టడం అన్యాయమని అనేకులు నచ్చజెబుతున్నా, తీవ్ర పర్యవసానాలుంటాయని తాలిబన్లు బెదిరిస్తున్నా పాక్ పాలకులు లక్ష్యపెట్టడం లేదు. చట్టవిరుద్ధంగా వుంటున్న 17 లక్షలమంది శరణార్థుల్లో సోమవారం నాటికి లక్షా 70 వేలమందిని పంపించామని పాక్ ప్రకటించింది. శరణా ర్థుల సమస్య పూర్తిగా పాకిస్తాన్ స్వయంకృతం. నిన్నటివరకూ తన మిత్రులైన తాలిబన్లతో వైరం తెచ్చుకుని, పెరుగుతున్న నేరాలకూ, అధోగతిలో వున్న దేశ ఆర్థికవ్యవస్థకూ అఫ్గాన్ శరణార్థులను కారణంగా చూపి వదుల్చుకోవాలని చూడటం పాకిస్తాన్ సైన్యం కపటనీతికి అద్దం పడుతుంది. 80వ దశకంలో అఫ్గాన్పై సోవియెట్ యూనియన్ సైన్యం దురాక్రమణకు దిగినప్పుడు అమెరికా అండతో అఫ్గాన్కు అండగా నిలిచినట్టు నటించింది పాకిస్తానే. ఆ వంకన వచ్చిపడిన నిధులు అన్నివిధాలా అక్కరకొచ్చాయి. సోవియెట్ దళాలు నిష్క్రమించాక తాలిబన్ల ఏలుబడి మొదలైనప్పుడు వారితో చెట్టపట్టాలేసుకుని వారి అరాచకాలకు అండదండలందించింది, వారిని ఉసిగొల్పి మన దేశాన్ని చికాకుపరిచింది కూడా పాకిస్తానే. 2001లో తమ దేశంపై ఉగ్రదాడి జరిగాక అమెరికా ఆగ్రహించి అఫ్గాన్పై దండయాత్రకు దిగింది. తాలిబన్లను తొలగించి తమ అనుకూలురను ప్రతిష్టించింది. అనంతరకాలంలో పరిమిత ప్రాంతాల్లోనైనా అంతో ఇంతో సాధారణ పరిస్థితులుండేవి. మహిళలు చదువుకోవటానికి, వృత్తి ఉద్యోగాలు చేసుకోవటానికి వీలుండేది. మన దేశం, మరికొన్ని దేశాలు అఫ్గాన్లో అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాయి. ఇదంతా పాకిస్తాన్కు కంటగింపైంది. అఫ్గాన్లో తమ హవా సాగటం లేదన్న దుగ్ధతో పాకిస్తాన్ అక్కడ ఏదోవిధంగా పాలకులను చికాకుపరిచేది. చివరకు అమెరికాలో ట్రంప్ హయాం వచ్చాక చడీచప్పుడూ లేకుండా తాలిబన్ల తరఫున ఆయనతో రాయబారాలు జరిపి, వారు పూర్తిగా మారిపోయారని నమ్మబలికింది. ఆ తర్వాతే అమెరికా మంచి తాలిబన్లు, చెడ్డ తాలిబన్లు అంటూ వర్గీకరించి అఫ్గాన్ నుంచి నిష్క్రమించేందుకు దారులు వెదుక్కొంది. ఈ క్రమం అంతటా పాకిస్తాన్ ఆడిన ప్రమాదకర క్రీడ అడుగడుగునా కనబడుతూనే వుంది. తీరా రెండేళ్లక్రితం తాలిబన్ల పాలన మొదలయ్యాక ఇద్దరికీ చెడింది. పాక్ సైన్యం చేతుల్లో కీలుబొమ్మలు కావటానికి తాలిబన్లు ససేమిరా అనటం, తమ సహజ వనరులను పాక్ పెట్టుబడిదారులకు దోచిపెట్టడానికి అంగీకరించకపోవటం సైన్యానికి ఆగ్రహం కలిగించింది. శరణార్థులను వెనక్కు పంపటంలోని ఆంతర్యం అదే. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం పాకిస్తాన్లోని అఫ్గాన్ శరణార్థుల సంఖ్య 13 లక్షలు. మరో 8 లక్షల 80 వేలమంది చట్టబద్ధంగా అక్కడుంటున్నారు. వీరిలో 2021లో మళ్లీ తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్నాక ప్రాణభయంతో వచ్చినవారు దాదాపు 6 లక్షలమంది. వీరుగాక 1980 ప్రాంతంలో సోవియెట్ దురాక్రమణ సమయంలో వచ్చిన 3 లక్షలమంది శరణార్థులున్నారు. కానీ పాక్ సైన్యం లెక్కలు వేరేలా వున్నాయి. 17 లక్షలమంది శరణార్థులు అక్రమంగా వుంటున్నారని అది చెబుతోంది. ఎవరి లెక్కలు ఏమైనా శరణార్థుల్లో అనేకులు దశాబ్దాలుగా ఉపాధి వెదుక్కొని ఇస్లామాబాద్ మొదలుకొని కరాచీ వరకూ అనేక నగరాల్లో స్థిరపడి అక్కడే తమకంటూ గూడు ఏర్పర్చుకున్నారు. ఆ సమాజంలో భాగమయ్యారు. వారి పిల్లలు చదువుకుంటున్నారు. ఉపాధి వెదుక్కున్నారు. కొందరు ఆస్తులు కూడబెట్టుకున్నారు. కానీ హఠాత్తుగా పాకిస్తాన్ సైన్యం పోలీసులు, సైన్యం విరుచుకుపడి వారి అధికారిక పత్రాలు స్వాధీనం చేసుకుని పొమ్మంటే ఏమై పోవాలి? తనకు అనుకూలంగా వున్నప్పుడు సమస్యను చక్కగా వినియోగించుకుని, తాలిబన్లతో తకరారు తలెత్తాక ఇన్ని లక్షలమందిని కట్టుబట్టలతో గెంటేయాలని చూడటం ఏం న్యాయం? ఇప్పుడు దేశవ్యాప్తంగావున్న అఫ్గాన్ శరణార్థులను సరిహద్దుల్లోని తోర్ఖాం ప్రాంతానికి తరలించి నరకాన్ని తలపించే గుడారాల్లో కుక్కుతోంది. కొందరిని బలూచిస్తాన్ వైపున్న చమన్వైపు తరలిస్తోంది. ఒకపక్క అమానవీయంగా ఇన్ని లక్షలమందిని నరక కూపంలోకి నెడుతూ స్వచ్ఛందంగా పోతున్నారని సైన్యం తప్పుడు ప్రచారం చేస్తోంది. 1950 ప్రాంతం తర్వాత దేశంనుంచి ఇంత పెద్దయెత్తున జనం తరలిపోవటం ఇదే ప్రథమమని పాకిస్తాన్ మీడియా చెబుతోంది. ఉగ్రవాదం విషయంలో పాక్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరే దేశంలో ఆత్మాహుతి దాడులు, ఇతర నేరాలు పెరగటానికి కారణం. తాము మద్దతుగా నిలిచిన తాలిబాన్లే అడ్డం తిరగటంతో సైన్యానికి దిక్కుతోచటం లేదు. దానికితోడు దేశంలో పౌర ప్రభుత్వంతో పొసగటం లేదు. ఇమ్రాన్ను ప్రధాని పదవి నుంచి దించినా అంతా అనుకున్నట్టు జరగలేదు. త్వరలో ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. దేశం దివాలా తీసింది. ఈ పరిస్థితుల్లో సకల క్లేశాలకూ శరణార్థులను బాధ్యులుగా చూపి, బలిపశువుల్ని చేయటం దుర్మార్గం. అంతర్జాతీయ చట్టాలను గౌరవించి శరణార్థుల విషయంలో కనీస మానవీయత ప్రదర్శించటం అవసరమని పాక్ సైన్యమూ, పాలకులూ గుర్తించాలి. -
దేశం విడిచి వెళ్లండి
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్ నుంచి పాకిస్థాన్కు అక్రమంగా వచ్చిన శరణార్థులు వెంటనే దేశం వీడి వెళ్లాలంటూ పాక్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాలిబన్ల పరిపాలనతో విసిగి వేసారిపోయిన అఫ్గాన్లు లక్షల సంఖ్యలో చట్టవిరుద్ధంగా పాక్కు చేరుకున్నారు. అలా వచ్చిన వారు 17 లక్షల మంది ఉంటారని ప్రభుత్వం అంచనా వేసింది. వారందరూ నవంబర్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. రెండు దేశాల సరిహద్దుల్లో ఇటీవల కాలంలో దాడులు పెరిగిపోతున్నాయి. అఫ్గాన్లో తాలిబన్ల కనుసన్న ల్లో ఉన్న ఉగ్రవాదులే దాడులకు పాల్పడుతున్నారని పాక్ ఆరోపి స్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నవంబర్ 1లోగా అక్రమంగా వచ్చిన వారంతా వెళ్లకపోతే భద్రతా బలగాలతో వారిని దేశం నుంచి బహిష్కరిస్తామని పాకిస్థాన్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. -
అక్కడంతా మృత్యుభయం! మురికివాడలో శరణార్ధుల గోస
ఇజ్రాయెల్ ఆక్రమిత ఉత్తర వెస్ట్బ్యాంక్లోని జెనిన్ శరణార్థుల శిబిరం 20 సంవత్సరాల తర్వాత మళ్లీ ప్రపంచవ్యాప్తంగా ప్రముఖంగా వార్తల్లోకి వచి్చంది. జెనిన్ క్యాంప్లో ఉగ్రవాదులను ఎరివేయడానికి ఇజ్రాయెల్ సైన్యం చేపట్టిన ఆపరేషన్ ఎట్టకేలకు ముగిసింది. లక్ష్యం నెరవేరిందని ఇజ్రాయెల్ చెబుతోంది. జెనిన్ రెఫ్యూజీ క్యాంప్నకు దాదాపు ఏడు దశాబ్దాల కన్నీటి చరిత్ర ఉంది. ఇజ్రాయెల్ సైన్యం, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ల మధ్య ఘర్షణలకు ఈ ప్రాంతం వేదికగా మారుతుండడంతో శరణార్థులకు కష్టాలు ఎదురవుతున్నాయి. చెల్లాచెదురై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇజ్రాయెల్ మిలటరీ ఆపరేషన్ వల్ల గత 3 రోజుల్లో వేలాది మంది జెనిన్ క్యాంప్ విడిచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో అసలు ఈ క్యాంప్ ఎందుకు ఏర్పాటయ్యిందో, ఇక్కడి పరిస్థితులేమిటో తెలుసుకుందాం.. శరణార్థుల గడ్డ.. మిలిటెంట్ల అడ్డా అమెరికాతోపాటు పశి్చమ దేశాల అండతో 1948లో యూదుల కోసం ఇజ్రాయెల్ ఆవిర్భవించింది. విస్తీర్ణంలో చిన్నదైనా తన చుట్టుపక్కల దేశాల భూభాగాలను బలప్రయోగంతో ఆక్రమించుకోవడం మొదలుపెట్టింది. ప్రాచీన కాలంలో ఆ ప్రాంతాలన్నీ యూదు రాజ్యంలో అంతర్భాగమేనని వాదించింది. అలా పొరుగు దేశమైన పాలస్తీనాపై కన్నేసింది. ఇజ్రాయెల్ సైన్యం దాడులను తట్టుకోలేక పాలస్తీనా పౌరులు సొంత ఊళ్లు వదిలేసి శరణార్థులుగా మారి వలసబాట పట్టారు. అంతర్జాతీయ సమాజం ఒత్తిడి మేరకు ఇజ్రాయెల్ ప్రభుత్వం 1950వ దశకంలో పాలస్తీనా శరణార్థుల కోసం వెస్ట్బ్యాంక్లో పలు శిబిరాలను ఏర్పాటు చేసింది. అందులో ఒకటి జెనిన్ రెఫ్యూజీ క్యాంప్. నిజానికి ఇదొక మురికివాడ అని చెప్పొచ్చు. పేదరికానికి, ఆకలి చావులకు మారుపేరు. పాలస్తీనా మిలిటెంట్లు తమ కార్యకలాపాల కోసం జెనిన్ను అడ్డాగా మార్చుకున్నారు. తరచుగా ఇజ్రాయెల్పై దాడులకు పాల్పడుతున్నారు. మిలిటెంట్ల చర్య స్వాతంత్య్రం కోసం జరుగుతున్న సాయుధ తిరుగుబాటు అని పాలస్తీనా సానుభూతిపరులు చెబుతుండగా, అది ముమ్మాటికీ ఉగ్రవాదమేనని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. పాలస్తీనియన్ మిలిటెంట్ కమాండ్ సెంటర్లు జెనిన్లో ఉన్నాయని అంటోంది. వేలాది మందికి ఆవాసం జెనిన్ క్యాంప్ పాలస్తీనా శరణార్థులతో కిక్కిరిసిపోయి కనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతం 18,000 మంది నివసిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి. అసలైన లెక్క ఎంతన్నది తెలియదు. ఐక్యరాజ్యసమితి పాలస్తీనియన్ రెఫ్యూజీ ఏజెన్సీ అందించిన సమాచారం ప్రకారం 14,000 మంది ఉంటున్నారు. 2020 నాటి పాలస్తీనా ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం 12,000 మంది శరణార్థులు నివసిస్తున్నారు. యుద్ధానికి దారితీసిన ఆత్మాహుతి దాడి జెనిన్ క్యాంప్లో 2002లో జరిగిన ఘర్షణలో 50 మందికిపైగా పాలస్తీనా జాతీయులు, 23 మంది ఇజ్రాయెల్ సైనికులు బలయ్యారు. యూదు సెలవు దినం సందర్భంగా మతపరమైన వేడుక కోసం గుమికూడిన యూదు జాతీయులపై మిలిటెంట్లు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 30 మంది యూదు జాతీయులు మరణించారు. దాంతో మిలిటెంట్ల భరతం పట్టడానికి ఇజ్రాయెల్ సైన్యం వెస్ట్బ్యాంక్పై విరుచుకుపడింది. పాలస్తీనాలోకి సైతం సైన్యం అడుగుపెట్టింది. రమల్లా నగరంలో అప్పటి పాలస్తీనా అధినేత యాసర్ ఆరాఫత్ ఇంటిని చుట్టుముట్టింది. ఇజ్రాయెల్ సైనికులు, పాలస్తీనా మిలిటెంట్ల నడుమ కొన్ని రోజులపాటు హోరాహోరీగా యుద్ధంకొనసాగింది. ఇరువైపులా ప్రాణనష్టంతో యుద్ధం ముగిసింది. జెనిన్ క్యాంప్ అప్పటి నుంచి నివురుగప్పిన నిప్పులా మారింది. 20 ఏళ్ల తర్వాత మళ్లీ భారీ సైనిక ఆపరేషన్ జరిగింది. దీనివెనుక పలు కారణాలు కనిపిస్తున్నారు. మిలిటెంట్ల దుశ్చర్యపై ఆగ్రహావేశాలు రెండు వారాల క్రితం జెనిన్ క్యాంప్లో మిలిటెంట్లు రెచి్చపోయారు. జెనిన్ నుంచి ఇజ్రాయెల్ భూభాగంపైకి రాకెట్ ప్రయోగించారు. దీంతో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఏడుగురు ఇజ్రాయెల్ జవాన్లు గాయపడ్డారు. వారిని హెలికాప్టర్లలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మిలిటెంట్ల దుశ్చర్యంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ చేతగానితనంలోనే ఉగ్రవాదులు రెచి్చపోతున్నారంటూ ఇజ్రాయెల్లో ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూపై ఒత్తిడి పెరిగింది. దానికితోడు వెస్ట్బ్యాంక్లోని ఇజ్రాయెల్ సెటిలర్స్లో ఎక్కువమంది నెతన్యాహూ మద్దతుదారులే ఉన్నారు. మిలిటెంట్లను కఠినంగా అణచివేయాలంటూ వారు సైతం ఒత్తిడి తెచ్చారు. దాంతో జెనిన్ క్యాంప్లో సైనిక ఆపరేషన్కు నెతన్యాహూ గ్రీన్సిగ్నల్ ఇచ్చేశారు. ఈ నెల 3వ తేదీన ఇజ్రాయెల్ సైన్యం రంగంలోకి దిగింది. జెనిన్లో శరణార్థుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. ముష్కరుల స్థావరాలుగా భావిస్తున్న ప్రాంతాలపై డ్రోన్లతో దాడులు చేసింది. ప్రజల దృష్టిని మళ్లించేందుకేనా? ఇటీవలి కాలంలో బెంజమిన్ నెతన్యాహూ రాజకీయంగా కొంత బలహీనపడ్డారు. ఆయన తీసుకొచ్చిన వివాదాస్పద న్యాయ వ్యవస్థ సంస్కరణ బిల్లుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వెస్ట్బ్యాంక్లో జెనిన్తోపాటు ఇతర ప్రాంతాల్లో సాయుధ ముఠాలు బలం పుంజుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల దృష్టిని మళ్లించాల్సిన అవసరం ఆయనకు ఏర్పడిందని రాజకీయ నిపుణులు అంటున్నారు. అందుకే జెనిన్ క్యాంప్లో సైనిక ఆపరేషన్కు ఆదేశాలు ఇచ్చారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -సాక్షి, నేషనల్ డెస్క్ -
పాలస్తీనా ఉగ్రవాదుల ఏరివేత.. ఇజ్రాయెల్ భారీ సైనిక ఆపరేషన్
జెనిన్: శరణార్థుల శిబిరాల్లో మాటు వేసిన పాలస్తీనా ఉగ్రవాదులను ఏరివేయడం, వారి ఆయుధాలను స్వాదీనం చేసుకోవడమే లక్ష్యంగా వెస్ట్బ్యాంక్పై ఇజ్రాయెల్ సేనలు విరుచుకుపడుతున్నాయి. వెస్ట్బ్యాంక్లోని జెనిన్ శరణార్థుల క్యాంప్లో సోమవారం నుంచి విస్తృతంగా సోదాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం సైతం దాడులు కొనసాగాయి. దీంతో వేలాది మంది పాలస్తీనా శరణార్థులు సురక్షిత ప్రాతాలకు తరలివెళ్తున్నారు. దాదాపు 4,000 మంది పాలస్తీనా శరణార్థులు బయటకు వెళ్లిపోయారని జెనిన్ నగర మేయర్ నిడాల్ అల్–ఒబిడీ చెప్పారు. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో ఇప్పటిదాకా 10 మంది మరణించారు. వారంతా ఉగ్రవాదులేనని ఇజ్రాయెన్ సైన్యం చెబుతున్నప్పటికీ ఇంకా నిర్ధారణ కాలేదు. పెద్ద సంఖ్యలో ఆయుధాలు స్వాదీనం చేసుకున్నామని, జెనిన్ క్యాంప్లో మసీదు కింద ఉన్న సొరంగాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. జెనిన్ క్యాంప్లో ఈ స్థాయిలో సైనిక ఆపరేషన్ జరుగుతుండడం గత 20 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. వెస్ట్బ్యాంక్లోని ఇజ్రాయెల్ వాసులపై ఇటీవలి కాలంలో దాడులు జరుగుతున్నాయి. గతనెలలో జరిగిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. అంతేకాకుండా పాలస్తీనా ఉగ్రవాదుల కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. దీంతో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూపై అంతర్గతంగా ఒత్తిడి పెరిగింది. తమ పౌరులకు ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదులను ఏరివేయాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు తమ సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. ఇజ్రాయెల్ దాడులను వ్యతిరేకిస్తూ వెస్ట్బ్యాంక్లు పాలస్తీనా పౌరులు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. జెనిన్ సిటీపై పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాదులకు గట్టిపట్టుంది. వెస్ట్బ్యాంక్, తూర్పు జెరూసలేం, గాజా స్ట్రిప్ను 1967లో జరిగిన యుద్ధంలో పాలస్తీనా నుంచి ఇజ్రాయెల్ స్వా«దీనం చేసుకుంది. వాటిని తిరిగి తమకు అప్పగించాలని పాలస్తీనా డిమాండ్ చేస్తోంది. ఇజ్రాయెల్ సైనిక వాహనం వద్ద బాంబు పేలుడు దృశ్యం -
బోటుల్లో ఐరోపాకు చేరిన ఆఫ్రికా అక్రమ చొరబాటుదారులు
ఇటలీ: గడిచిన 24 గంటల్లో ఆసియా, ఆఫ్రికా, మధ్య ఆసియా దేశాల నుండి వేల సంఖ్యలో వలసదారులు బోటుల్లో ఐరోపాలోని ఆయా దేశాలకు చేరుకున్నట్లు తెలిపాయి ఇటలీ ఇమిగ్రేషన్ వర్గాలు. ఇటలీ ఇమిగ్రేషన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆఫ్రికా, ఆసియా దేశాలకు చెందిన శరణార్థులు పడవల్లో తమ దేశానికి చేరుకున్నారని తెలిపారు. కిక్కిరిసిన బోటులో ప్రయాణం చేసిన కారణంగా కొంతమంది బోటులోనే చనిపోగా మిగిలినవారు కాలాబ్రియా కోస్తాకు, లంపెడుసా తీరానికి చేరుకున్నారని అన్నారు. Meanwhile, another overloaded boatload of illegal immigrants from North Africa is making its way across the Mediterranean to Europe and the UK. pic.twitter.com/pDOagytGr6 — UK Justice Forum 🇬🇧 Latest Video News Updates! (@Justice_forum) June 29, 2023 ఇటీవలే భారీగా వలసదారులను ఎక్కుంచుకుని ఐరోపా వైపుగా వచ్చిన ఇలాంటి ఒక పడవ బోల్తాపడి నీటమునిగిన విషయం తెలిసిందే. తరచుగా ఈ ప్రమాదాలు జరుగుతున్నా కూడా అక్కడి అధికారులు వలసలను ఆపి ప్రమాదాలను నివారించే ప్రయత్నమైనా చేయడం లేదు. Boats full of African invaders landing straight onto the beach in Italy today. pic.twitter.com/ZaylKNpps6 — Faith (@Sarah77929529) June 28, 2023 ఇది కూడా చదవండి: నాహేల్ మృతి.. కంటిమీద కునుకులేని ఫ్రాన్స్..! వీడియో బయటకు -
గ్రీస్లో పడవ మునక.. 79 మంది జలసమాధి
గ్రీస్: ఏథెన్స్: బతుకుదెరువు కోసం వలసపోతున్న డజన్లకొద్దీ శరణార్థుల ప్రాణాలు సముద్రంలో కలిసిపోయాయి. దక్షిణగ్రీస్ సముద్రజలాల్లో వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తాపడటంతో కనీసం 79 మంది జలసమాధి అయ్యారు. డజన్లకొద్దీ జనం జాడ గల్లంతయ్యింది. పెలోపోన్నీస్ ప్రాంతం నుంచి తీరానికి 75 కిలోమీటర్లదూరంలో సముద్రంలో మంగళవారం రాత్రివేళ జరిగిన ఈ దుర్ఘటనలో ఇప్పటికే 104 మంది కాపాడామని అధికారులు తెలిపారు. విషయం తెల్సుకున్న అధికారులు పెద్ద ఎత్తున గాలింపు కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. కాపాడిన వారిలో ఆరోగ్యం విషమంగా ఉన్న వారిని వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. 78 మంది మరణించారని అధికారులు చెబుతున్నా ఇంకా ఎంతమంది మరణించి ఉంటారనేది తెలియట్లేదు. ఆరు తీర గస్తీ నౌకలు, ఒక నావికాదళ యుద్ధనౌక, ఒక సైనిక రవాణా విమానం, వాయుసేన హెలికాప్టర్, ఇంకా కొన్ని ప్రైవేట్ పడవలు, డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలను భారీ ఎత్తున కొనసాగిస్తున్నారు. తూర్పు లిబియా దేశంలోని తోబ్రక్ ప్రాంతం నుంచి ఈ శరణార్థుల పడవ బయల్దేరి ఇటలీకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. తమ దేశానికి ఇలా ఒక వలసదారుల పడవ వస్తోందని ముందే గ్రీక్ అధికారులకు ఇటలీ అధికారులు సమాచారం ఇచ్చారు. వలసదారులను కలామటా నౌకాశ్రయానికి తరలించి అక్కడ ఐక్యరాజ్యసమితి శరణార్థి ఏజెన్సీ ఏర్పాటుచేసిన శిబిరాల్లో ప్రథమ చికిత్స అందించారు. లిబియా అదుపులో వేలాది మంది శరణార్థులు అక్రమంగా ఇలా ప్రయాణం సాగిస్తున్న వారిపై గతంలోనే లిబియా సర్కార్ తన అప్రమత్తతను కనబరిచింది. ఈజిప్ట్, పాకిస్తాన్, సిరియా, సూడాన్ తదితర దేశాలకు వేలాది మంది శరణార్థులు సముద్ర జలాల్లో అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకుంది. ఈజిప్ట్కు చెందిన వారిని వెంటనే భూమార్గంలో తిరిగి వారి దేశానికి పంపేసింది. లిబియా దక్షిణ ప్రాంతంలో చూస్తే రాజధాని ట్రిపోలీసహా పలు ప్రాంతాల్లోని శరణార్థి హబ్లలో సోదాలు చేసి దాదాపు 1,800 మందిని అదుపులోకి తీసుకుందని ఐక్యరాజ్యసమితి శరణార్థి ఏజెన్సీ తెలిపింది. మధ్యధరా సముద్ర జలాల్లో స్థానిక తీర గస్తీ పెట్రోలియం దళాల కంటపడకుండా ఉండేందుకు చాలా మంది స్మగ్లర్లు పెద్ద సైజు పడవలను సమకూర్చుకుని అంతర్జాతీయ జలాల వెంట అక్రమంగా శరణార్థులను తరలిస్తున్నారు. ఆదివారం ఇదే మధ్యధరా సముద్ర జలాల్లో తమను కాపాడండంటూ అమెరికా తయారీ పడవలో వెళ్తున్న 90 మంది శరణార్థులు అత్యవసర సందేశం ఇచ్చారు. ఇది కూడా చదవండి: ఆ నరమాంస భక్షకిని భద్రపరుస్తారట! -
తీర ప్రాంతంలో విషాదం.. 34 మంది జలసమాధి
ఆంటనానారివో(మడగాస్కర్): బతుకుదెరువు కోసం సముద్రమార్గంలో విదేశానికి వలసవెళ్తున్న శరణార్థులు ప్రమాదవశాత్తు జలసమాధి అయ్యారు. శనివారం రాత్రి వాయవ్య మడగాస్కర్ తీరం దగ్గర్లోని హిందూ సముద్రజలాల్లో జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మడగాస్కర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఫ్రాన్స్ అధీనంలోని మయోటే ద్వీపానికి చేరుకునేందుకు మడగాస్కర్ దేశంలోని అంబిలోబే, టమతమే, మజుంగా ప్రాంతాలకు చెందిన 58 మంది శరణార్థులు ఒక పడవలో బయల్దేరారు. మార్గమధ్యంలో నోసీ బే అనే ద్వీపం సమీపంలో హిందూ సముద్రజలాల్లో పడవ మునిగింది. ఈ ప్రమాదంలో నీట మునిగిన 34 మంది మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. 24 మందిని అక్కడి మత్స్యకారులు కాపాడారు. మయోటే అనేది పేదరికం కనిపించే చిన్న ద్వీపాల సముదాయం. అంతకుమించిన నిరుపేదరికంతో మగ్గిపోతున్న మడగాస్కర్లో కంటే మయోటేలో జీవనం కాస్త మెరుగ్గా ఉంటుందని శరణార్థులు అక్కడికి వలసపోతుంటారని అధికారులు చెప్పారు. -
శరణార్థుల గోడు పట్టదా?
రోహింగ్యా శరణార్థుల అంశం మళ్ళీ పతాక శీర్షికలకెక్కింది. అధికారంలో ఉన్నవారికి ఈ కాందిశీ కుల పట్ల అనుసరించాల్సిన వైఖరిలో స్పష్టత లేదని మరోసారి రుజువైంది. మురికివాడల్లోని 1100 మంది రోహింగ్యాలను ఢిల్లీ శివార్లలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు ఉద్దేశించిన నివాసాల్లోకి తరలించి, ప్రాథమిక వసతులు కల్పించి, పోలీసు భద్రత కల్పిస్తామంటూ కేంద్ర గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఆగస్ట్ 17న ట్వీట్ చేశారు. కానీ, అమిత్ షా సారథ్యం లోని హోమ్ శాఖ తక్షణమే రంగంలోకి దిగి, ‘‘చట్టవిరుద్ధమైన రోహింగ్యా విదేశీయులకు’’ ఆ నివాసాలివ్వాలంటూ ఎలాంటి ఆదేశాలూ జారీ చేయలేదని వివరణనిచ్చింది. కొద్ది గంటల తేడాలో ఒకే అంశంపై రెండు మంత్రిత్వశాఖలు రెండు రకాలుగా స్పందించడం విడ్డూరం. కాందిశీకుల అంశంపై దేశంలో జాతీయ స్థాయిలో ఓ చట్టం అవసరమని తాజా వివాదం మరోసారి గుర్తుచేస్తోంది. గతంలో యూపీ నీటిపారుదల శాఖ స్థలంలో ఉంటున్న నివాసాలు ప్రభుత్వం నోటీసిచ్చిన మరునాడే అనూహ్యంగా అగ్నికి ఆహుతయ్యాక, ఢిల్లీ శివారులోని ఓ ఇస్లామిక్ ఛారిటీకి చెందిన స్థలంలో తాత్కాలిక నివాసాల్లో, దగ్గరలో మరుగుదొడ్లు కూడా లేని దుర్భరస్థితిలో రోహింగ్యాలు బతుకులు వెళ్ళదీస్తున్నారు. వారికి కనీస వసతులు కల్పిస్తామని సర్కార్ 2021లోనే అంది. ఆ పరిణామ క్రమంలోనే దౌత్యవేత్త, సీనియర్ మంత్రి పూరీ తాజా ట్వీట్ వచ్చింది. తీరా విశ్వహిందూ పరిషత్ సహా అధిక సంఖ్యాక హిందూ సమర్థకుల విమర్శలకు వెరచి, ప్రభుత్వం ప్లేటు ఫిరాయిం చడం శోచనీయం. రోహింగ్యా అనేది పశ్చిమ మయన్మార్ (బర్మా)లోని రఖైన్ ప్రావిన్స్కు చెందిన సమూహం. ముస్లిమ్లైన వీరు బెంగాలీలోని ఓ మాండలికంలో మాట్లాడతారు. మయన్మార్ వీరిని ‘నివాసిత విదేశీయులు’ అనీ, ‘సహచర పౌరుల’నీ పేర్కొంటోంది. 2012 నుంచి వరుస హింసా కాండలతో వీరు మయన్మార్ను వదిలిపోవాల్సి వచ్చింది. 5 లక్షల మంది సౌదీ అరేబియాకు పారి పోయారు. 2017లో మళ్ళీ మయన్మార్ సైన్యం దాడులతో, లక్షలాది రోహింగ్యాలు బంగ్లాదేశ్లో తలదాచుకున్నారు. 2012లో 1200 మంది తొలి బృందం శరణార్థులుగా ఢిల్లీకి వచ్చింది. అయితే, 2018 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు భారత్ మొత్తం 12 మంది శరణార్థుల్ని మయన్మార్కు తిప్పి పంపింది. ఇది రోహింగ్యాల అంశంపై గళం విప్పుతున్న ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ బృందం లెక్క. వారందరూ స్వచ్ఛందంగా తిరిగి వెళ్ళారని సర్కారు వారి మాట. కానీ, ఐరాస శరణార్థి సంస్థ స్వతంత్రంగా ఆ సంగతి నిర్ధారించుకొనేందుకు పదే పదే అభ్యర్థించినా, అనుమతి నిరాకరించడం గమనార్హం. మన దేశంలో మొత్తంగా 40 వేల మంది రోహింగ్యా కాందిశీకులు ఉన్నారు. వారిలో 5700 మంది జమ్మూలో, మిగిలినవారు తెలంగాణ, పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్లలో తలదాచుకున్నారు. అయితే వీరిలో 16 వేల మందే ఐరాస శరణార్థి సంస్థ వద్ద నమోదు చేసుకున్నారు. రోహింగ్యాలు దేశభద్రతకు ముప్పు అని చిత్రీకరిస్తూ మెజారిటీ వర్గీయులు పోనుపోనూ స్వరం పెంచుతున్నారు. రోహింగ్యాలకు వ్యతిరేకంగా ఎంత గట్టిగా మాట్లాడితే, అంత ఎక్కువగా జాతీయతావాదులనే కీర్తి దక్కుతుందని భావిస్తున్నారు. నిజానికి, 1951 నాటి ఐరాస అంతర్జాతీయ శరణార్థుల ఒప్పందంపై కానీ, కాందిశీకుల హోదాకు సంబంధించిన 1967 నాటి ప్రోటోకాల్పై కానీ భారత్ సంతకం చేయలేదు. కాబట్టి, అవతలి దేశంలో పీడనకు గురవుతారని తెలిసీ రోహింగ్యాలను మయన్మార్కు బలవంతాన పంపేయడం చట్టప్రకారం సరైనదేనని వాదించవచ్చు. అందుకు మునుపటి సుప్రీమ్ కోర్ట్ తీర్పుల్నీ ఉదాహరణగా చూపవచ్చు. కానీ, తెలిసి తెలిసీ అలా పంపరాదన్నదే సంతకాలతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ చట్టంలో అందరూ అనుసరించే సంప్రదాయం, ధర్మం. న్యాయస్థానం సైతం ఈ నిస్సహాయులకు అండగా నిలవకపోవడం విషాదం. హోమ్శాఖ 2011లో జారీ చేసిన ‘ప్రత్యేక వ్యవహార సూత్రాలు’ మినహా ఇప్పటికీ మన దేశంలో అంతర్జాతీయ ఆదర్శాలకు తగ్గట్టు శరణార్థులకు ఓ జాతీయ చట్టమంటూ లేకపోవడమే దీనికి కారణం. శశిధరూర్ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టినా రాజకీయ ఏకాభిప్రాయం లేక, లాభం లేకపోయింది. ఇప్పటికీ పాకిస్తానీ హిందువులు, శ్రీలంక తమిళులు, టిబెటన్లు దేశంలోని శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఏ ప్రాంతానికీ చెందని ఇలాంటివారు దేశంలో 2.89 లక్షల మంది ఉన్నారు మరి, ఐరాస గుర్తింపుకార్డులిచ్చిన రోహింగ్యాల పట్ల పాలకులు అదే తరహా వైఖరి చూపడానికి ఇబ్బందేమిటి? పదేళ్ళుగా ఈ గడ్డపైనే ఉంటున్న సాటి మనుషులుగా రోహింగ్యాలు మెరుగైన జీవితం గడిపేలా చూడడం మానవత్వం. ఆ మేరకు గతంలో చేసిన బాసలకు భారత్ కట్టుబడాలి. వేదికలపై ‘వసుధైక కుటుంబం’ లాంటి కబుర్లు చెప్పే పాలకులు తీరా చేతల్లో తద్భిన్నంగా వ్యవహరిస్తే ఎలా? శరణార్థులపై విదేశాంగ విధానాల్లో ఒక మాట, దేశంలో రాజకీయ లబ్ధి కోసం వారినే ‘చెదలు’ అని ఈసడిస్తూ మరోమాట మాట్లాడడం ఏ రకంగా సమర్థనీయం? రోహింగ్యాలంటే తీవ్రవాదులే అన్న భావన ఎవరు, ఎందుకు కల్పిస్తున్నారు? ‘అంతర్జాతీయ శరణార్థుల ఒప్పందా’న్ని భారతదేశం గౌరవిస్తుంది. జాతి, మతం, ధార్మిక విశ్వాసాల సంబంధం లేకుండా అందరికీ ఆశ్రయమిస్తుంది’ అనే మంత్రి గారి మాట ఉత్తుత్తిదేనా? శరణు కోరినవారిని కాపాడమనే శ్రీరాముడే ఆదర్శం అనే పాలకులు ఆలోచించాలి. -
World Refugee Day: బతుకు జీవుడా
ఉక్రెయిన్పై రష్యా దండయాత్రతో శరణార్థి సంక్షోభం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రష్యా సైన్యం నుంచి ఏ క్షణం ఎటు వైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయంతో ప్రాణాలరచేతుల్లో పెట్టుకొని కట్టుబట్టలతో కన్న భూమిని విడిచి వెళ్లిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏడాదికేడాది పెరిగిపోతున్న శరణార్థుల్ని చూసే దిక్కు లేక దుర్భర జీవితాన్ని కొనసాగిస్తున్నారు. శరణార్థుల దుస్థితిపై అవగాహన కల్పించడానికి, వారిని అన్ని విధాలా ఆదుకోవడానికి ఐక్యరాజ్య సమితి ప్రతీ ఏడాది జూన్ 20న ప్రపంచ శరణార్థుల దినం నిర్వహిస్తోంది. 10 కోట్లు.. అక్షరాలా పది కోట్లు మంది ప్రపంచవ్యాప్తంగా.. ఉన్న ఊరుని విడిచి పెట్టి మెరుగైన జీవితాన్ని వెతుక్కుంటూ వెళ్లిపోయారు. యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఆఫ్ రెఫ్యూజీస్ (యూఎన్హెచ్సీఆర్) తేల్చిన లెక్కలు ఇవి. యుద్ధాలు, అంతర్గత ఘర్షణలు, వాతావరణ మార్పులు, ఆకలి కేకలు, అణచివేత, హింసాకాండ, మానవహక్కుల హననం వంటి కారణాలు దశాబ్ద కాలంగా శరణార్థుల సంఖ్యను పెంచేస్తున్నాయి. కరోనా సంక్షోభం, ఉక్రెయిన్పై రష్యా దాడి, శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంతో బలవంతంగా వలస బాట పట్టినవారు ఎందరో ఉన్నారు. ఏటికేడు శరణార్థుల సంఖ్య ఎలా పెరుగుతోందంటే వీళ్లందరూ ఒకే ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటే అది ప్రపంచంలో అతి పెద్ద జనాభా కలిగిన 14వ దేశంగా అవతరిస్తుంది. అందులోనూ ఉక్రెయిన్పై రష్యా దండయాత్రతో ప్రపంచవ్యాప్తంగా శరణార్థుల సంఖ్య రికార్డు స్థాయికి చేరుకుంది. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం 2021 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 8.9 కోట్ల మంది శరణార్థులు ఉంటే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత వారి సంఖ్య 10 కోట్లు దాటేసింది ప్రపంచాన్ని కుదిపేసిన సంక్షోభాలు ఉక్రెయిన్ ఉక్రెయిన్పై రష్యా ఈ ఏడాది ఫిబ్రవరి 24 నుంచి చేస్తున్న భీకరమైన దాడులతో ఇప్పటివరకు 50 లక్షల మందికిపైగా శరణార్థులుగా ఇతర దేశాలకు వెళ్లిపోయారు. ఇక అంతర్గతంగా చెట్టుకొకరు పుట్టకొకరుగా వెళ్లిపోయిన వారు 80 లక్షల మంది వరకు ఉంటారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శరణార్థి సంక్షోభం రికార్డు స్థాయికి చేరుకుంది ఇప్పుడే. పోలండ్, రష్యా, రుమేనియా వంటి దేశాలు ఉక్రెయిన్ శరణార్థులను అక్కున చేర్చుకుంటున్నాయి. వారి అవసరాలు తీరుస్తున్నాయి. సిరియా దాదాపుగా పదేళ్ల పాటు అంతర్యుద్ధంతో నలిగిపోయిన సిరియాలో 2021 చివరి నాటికి 67 లక్షల మంది సిరియన్లు శరణార్థులుగా ఇతర దేశాలకు వెళ్లిపోయారు. లెబనాన్, జోర్డాన్, ఇరాక్, ఈజిప్టు, టర్కీ దేశాల్లో వీరంతా బతుకులీడుస్తున్నారు. అఫ్గానిస్తాన్ ఈ దేశం నుంచి నిరంతరం శరణార్థులుగా ఇతర దేశాలకు వెళ్లేవారు చాలా ఎక్కువ. ప్రతీ పది మందిలో ఒకరు అక్కడ జీవనం సాగించలేక ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారు. కనీసం 26 లక్షల మంది శరణార్థి శిబిరాల్లోనే పుట్టారు. సూడాన్ దక్షిణ సూడాన్లో నిరంతర ఘర్షణలతో ఇల్లు వీడి వెళ్లిన వారి సంఖ్య 40 లక్షలు ఉంటే, 26 లక్షల మంది దేశం విడిచి వేరే దేశాలకు వెళ్లిపోయారు. మయన్మార్ మయన్మార్లో రోహింగ్యాలను మైనార్టీల పేరుతో ఊచకోత కోస్తూ దేశం నుంచి తరిమి కొట్టడంతో ఏకంగా 10 లక్షల మంది ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లిపోయారు. ఆదుకోవడం ఎలా? శరణార్థులుగా ఇతర దేశాలకు వెళుతున్న వారికి కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ అందించడానికి ఆయా దేశాలు ఎంతో చేస్తున్నాయి. కానీ కేవలం అవి చేస్తే సరిపోవు. వారికి విద్య, ఆరోగ్యం, ఉపాధి, కుటుంబం , స్థిరత్వం అన్నింటికంటే గుర్తింపు కూడా అత్యంత ముఖ్యం. ఇల్లు, దేశం విడిచి వెళ్లిన శరణార్థి ఇతర దేశాల్లో స్థిరపడడానికి కనీసం 20 ఏళ్లు వేచి చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం నిధుల కొరత. శరణార్థులు కొత్త జీవితం గడపడానికి అవసరమైన నిధులు అందడం లేదు. ప్రతీ ఏడాది మానవీయ సంక్షోభాలు లెక్కకు మించి వస్తూ ఉండడంతో కనీసం వెయ్యి కోట్ల డాలర్లు (రూ.77,000 కోట్లు) లోటు ఉంది. యెమెన్, అఫ్గానిస్తాన్, సూడాన్లో శరణార్థులుగా మారిన వారిలో మూడో వంతు మందికి కూడా సాయం అందలేదని యూఎన్ లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ కాకుండా నిత్యం శరణార్థుల్ని పుట్టించే 30 ఘర్షణాత్మక ప్రాంతాలు ప్రపంచంలో ఉన్నాయి. శరణార్థుల్లో సగానికి సగం మంది పిల్లలే ఉండడం ఆందోళనకరం. వారిలో ఒక్క శాతం మందికి కూడా సాయం అందడం లేదు. సంపన్న దేశాలు ఇకనైనా శరణార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. –సాక్షి, నేషనల్ డెస్క్ -
పగవారికీ రావొద్దీ కష్టం.. ఈయూ సాయం మరువలేనిది.. గణాంకాలివే!
రష్యా నిర్దాక్షిణ్యంగా కురిపిస్తున్న బాంబుల వర్షానికి గూడు చెదిరిపోయింది. శిథిల దృశ్యాలను చూస్తూ గుండె పగిలిపోతోంది. యుద్ధం ఊరు విడిచి వెళ్లిపొమ్మంటోంది. మగవాళ్లు దేశ రక్షణ కోసం ఆగిపోతుంటే మహిళలు పిల్లాపాపలతో, కట్టుబట్టలతో వలసబాట పట్టారు. వీరిని యూరప్ అక్కున చేర్చుకుంటోంది... కనీవినీ ఎరుగని మానవీయ సంక్షోభంతో ఉక్రెయిన్ అల్లాడిపోతోంది. రష్యా దాడి మొదలైనప్పటి నుంచి దేశం విడిచిన వారి సంఖ్య 33 లక్షలు దాటేసింది. వీరిలో 90 శాతం మంది మహిళలు, పిల్లలే ఉన్నారు. లక్షలాది మంది సరిహద్దుల్లో పడిగాపులు కాస్తున్నారు. ఇక దేశంలో నిరాశ్రయులైన వారు 65 లక్షల దాకా ఉంటారని ఐరాస హక్కుల మండలి అంచనా. ‘‘ఎప్పుడు ఏ బాంబు వచ్చి మీద పడుతుందో తెలియని దుర్భర పరిస్థితుల్లో ఉన్న జనం వలస బాట పట్టారు. యుద్ధం ఆగితే తప్ప వలసలు ఆగేలా లేవు’’ అని యూఎన్హెచ్ఆర్సీ చీఫ్ ఫిలిప్పో గ్రాండీ అన్నారు. ఉక్రెయిన్లో మహిళల కష్టాలు వర్ణనాతీతం! ‘‘కరెంట్ లేదు. ఇంట్లో వండుకోవడానికి ఏమీ లేవు. నరకం భరించలేక నానాకష్టాలకోర్చి వలస వచ్చా’’ అని ఓల్హా అనే మహిళ కన్నీరుమున్నీరైంది. శరణార్థులుగా మారితే అల్లకల్లోలం ఉక్రెయిన్ వలసలను చూసి ఇతర దేశాల్లోని శరణార్థులూ చలించిపోతున్నారు. ఈ బాధలు పగవారిక్కూడా వద్దని 13 ఏళ్లప్పుడే సిరియా నుంచి అమెరికా వలస వచ్చిన నిడా అల్జబౌరిన్ చెప్పింది. చిన్నవయసులో శరణార్థులుగా మారితే జీవితం అల్లకల్లోలమవుతుందని ఆవేదన వెలిబుచ్చింది. చిన్నారులను నేరస్తుల ముఠాలు ఎత్తుకెళ్లే ప్రమాదముందని యునిసెఫ్ హెచ్చరించింది. యూరోపియన్ యూనియన్ సాయం ఇలా ఉక్రెయిన్ ప్రాణాలరచేతుల్లో పెట్టుకొని వస్తున్న వారిని యూరోపియన్ యూనియన్ అక్కున చేర్చుకుంటోంది. ఎక్కడికక్కడ రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రభుత్వపరంగా నిత్యావసరాలు అందిస్తోంది. మంచి ఆహారం, వైద్య సదుపాయాలతో పాటు సంక్షేమాన్ని కూడా చూస్తోంది. పిల్లలకు స్కూళ్లలో సీట్లు కూడా ఇవ్వనుంది. 27 ఈయూ దేశాలు శరణార్థులకు మూడేళ్ల పాటు ఉండే అవకాశం కల్పించాయి. అమెరికాలోకి శరణార్థులెవరూ రాకపోయినా మానవతా సాయం కింద ఉక్రెయిన్కు ఇప్పటికే 400 కోట్లకు డాలర్లకు పైగా అందించింది. అందులో 104 కోట్ల డాలర్లు శరణార్థులకు ప్రత్యేకించింది. ► ఉక్రెయిన్ నుంచి అత్యధికంగా పోలండ్కు 20 లక్షల మందికి పైగా వలస వెళ్లారు ► 5 లక్షల మంది రుమేనియాకు వెళ్లారు ► మాల్దోవాకు 4 లక్షల మంది వెళ్లారు. ఇక్కడ్నుంచి వేరే దేశాలకు వెళ్తున్నారు. ► 3 లక్షల మంది హంగరీ వెళ్లినట్టు గణాంకాలు చెప్తున్నాయి ► స్లొవేకియాకు 2.5 లక్షల మంది వెళ్లారు – నేషనల్ డెస్క్, సాక్షి -
అఫ్గానిస్తానీల దరఖాస్తులు 736
న్యూఢిల్లీ: ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 11 మధ్య 736 మంది అఫ్గానిస్తానీల దరఖాస్తులు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని శరణార్థుల విభాగం (యూఎన్హెచ్సీఆర్)లో నమోదయ్యాయని బుధవారం వెల్లడించింది. ఇవి భారత్లో ఉండేందుకు అఫ్గాన్వాసులు పెట్టుకున్న దరఖాస్తులని చెప్పింది. భారత్లో ఉన్న అఫ్గానిస్తాన్ వాసుల వీసాలు ముగిసిన వారు, తిరిగి వెళ్లాల్సిన వారు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది. యూఎన్హెచ్సీఆర్ వద్ద ఉన్న డేటా ప్రకారం మొత్తం 43,157 మందికి భారత్ నుంచి సాయం అందాల్సిన అవసరం ఉందని, అందులో 15,559 మంది అఫ్గాన్ శరణార్థులని చెప్పింది. 2021లో కొత్తగా భారత్ వచ్చిన వారు విద్యార్థి, వ్యాపారవేత్త, సాధారణ, మెడికల్ వీసాలను ఇచ్చే ప్రక్రియ తిరిగి ప్రారంభమవ్వాలని చూస్తున్నారని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కావడం లేదని యూఎన్హెచ్సీఆర్ తెలిపింది. శరణార్థుల కోసం 24/7 హెల్ప్ లైన్ ప్రారంభించినట్లు తెలిపింది. రోజుకు 130కి పైగా ఫోన్ కాల్స్ వస్తున్నట్లు తెలిపింది. -
అమెరికా స్థావరాల్లో అఫ్గాన్ శరణార్థులు
సంక్షోభంలో ఉన్న అఫ్గానిస్తాన్ నుంచి భయంతో వలస వస్తున్న శరణార్థుల కోసం అమెరికా మరో మూడు మిలటరీ బేస్లను కేటాయించింది. ఇప్పటికే మధ్యప్రాచ్యం, యూరప్లో శరణార్థుల కోసం కేటాయించిన స్థావరాలతో పాటు తాజాగా మెరైన్ కార్ప్స్ బేస్, ఫోర్ట్ పికెట్, హోలోమ్యాన్ ఎయిర్బేస్లను సైతం వీరి కోసం కేటాయిస్తున్నట్లు యూఎస్ ప్రతినిధి జాన్ కిర్బే చెప్పారు. అఫ్గాన్ స్పెషల్ వీసా ఉన్న దరఖాస్తుదారులు, వారి కుటుంబసభ్యులు, రిస్కు ఎదుర్కొంటున్న వ్యక్తులను అఫ్గాన్ నుంచి తరలించే ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నామని, ఈ మిషన్ కు అదనపు మద్దతు కోసం కొత్త బేస్లను కేటాయించామని కిర్బే తెలిపారు.చదవండి: అమెరికా, చైనా మధ్య తొలిసారి సైనిక చర్చలు దీంతో అఫ్గాన్ శరణార్థుల కోసం అమెరికా స్వదేశంలో కేటాయించిన స్థావరాల సంఖ్య ఏడుకు చేరిందన్నారు. ఇవి కాకుండా ఖతార్, బహ్రెయిన్, జర్మనీల్లో అమెరికాకు మరో 10 స్థావరాలున్నాయని ఆయన వివరించారు. అమెరికాలోని అన్ని స్థావరాలు కలిసి 70 వేల మందికి ఆశ్రయం కల్పించగలవని కిర్బే చెప్పారు. శరణార్థులకు ఆశ్రయం కల్పించే విషయంలో మిలటరీకి హోమ్ల్యాండ్ శాఖ, ఆరోగ్య శాఖ సహాయం చేస్తున్నాయని వివరించారు. సరిహద్దు దేశాలేవీ అఫ్గానిస్తాన్ పౌరులను రానీయకపోవడంతో వీరంతా అమెరికా ఆశ్రయం కోసం ఎదురు చూస్తూ విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నారు. చదవండి: విమానాశ్రయాన్ని దిగ్బంధిస్తున్న తాలిబన్లు ఏ బేస్లో ఎంతమంది? జర్మనీలోని రమ్స్టెయిన్ బేస్కు గతవారం దాదాపు 7,500మంది శరణార్థులు వచ్చారు. ఈ బేస్ సామర్ధ్యం 12వేలని అధికారులు చెప్పారు. బహ్రెయిన్లోని ఇసా ఎయిర్బేస్లో 5 వేల మందికి ఆశ్రయం కల్పించే యత్నాలు జరుగుతున్నాయి. ఫోర్ట్ బ్లిస్లో 650 మందికి ఆవాసం కల్పించారు. దీని సామర్థ్యం పదివేలని అధికారులు చెప్పారు. ఫోర్ట్ డిక్స్లో 9,500 మందికి టెంట్ హౌస్ల్లో నివాసం కల్పించారు. అయితే కొన్ని బేస్ల్లో పరిస్థితి ఘోరంగా ఉందని అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. అల్ ఉదైద్ బేస్లో పరిస్థితి నరకం కన్నా హీనంగా ఉందని, ఎలుకలు తిరుగుతున్నాయని అధికారులు చెప్పారు. మరోవైపు మిలటరీ బేస్ల్లో శరణార్థు లకు తాత్కాలిక నివాసం కల్పిస్తున్నారు కానీ, తర్వాత వీరిని ఎక్కడకు తరలిస్తారన్న విషయమై అమెరికా స్పష్టత ఇవ్వలేదు. కొన్ని రాష్ట్రాల గవర్నర్లు వీరికి శాశ్వత ఆవాసం కల్పించేందుకు ముందుకువస్తున్నారు. ఈ బేస్లను అధ్యక్షుడు బైడెన్ సందర్శించాల్సి ఉన్నా, కాబూల్ పేలుళ్ల కారణంగా వాయిదా పడింది. సరిహద్దు దేశాలు మానవతా ధృక్పధంతో శరణార్థులకు ఆశ్రయం కల్పించాలని ఐరాస కోరింది. –నేషనల్ డెస్క్, సాక్షి -
శరణార్థులుగా మరో 5 లక్షల మంది అఫ్గాన్లు
జెనీవా: అఫ్గానిస్తాన్ను తాలిబన్లు కైవసం చేసుకున్న అనంతర పరిణామాలతో మరో 5 లక్షల మంది ప్రజలు స్వదేశాన్ని వీడే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితికి చెందిన శరణార్థుల విభాగం యూఎన్హెచ్సీఆర్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికీ ఆ దేశంలో అనిశ్చితి కొనసాగుతోందని, రానున్న రోజుల్లో పరిస్థితులు మరింతగా దిగజారి 5.15 లక్షల మంది వరకు ప్రజలు శరణార్థులుగా మారే ప్రమాదముందని పేర్కొంది. వీరికి ఆహారంతోపాటు తగు వసతులు కల్పించేందుకు సుమారు 30 కోట్ల డాలర్లు అవసరమని అంచనా వేసింది. ఇప్పటికే ఇరాన్, పాకిస్తాన్ తదితర దేశాల్లో 22 లక్షల మంది అఫ్గాన్లు శరణార్థులుగా నమోదై ఉన్నారని తెలిపింది. ‘ఎన్నికైన ప్రభుత్వం కుప్పకూలి, దేశంలో హింస పెచ్చరిల్లిపోవడంతో ఆ ప్రభావం సామాన్య పౌరులపై తీవ్రంగా పడుతోంది. వారంతా ఉన్న చోటును వదిలి వేరే సురక్షిత ప్రాంతాలను వెదుక్కుంటూ మరోచోటుకు తరలివెళ్తున్నారు. అంతర్యుద్ధం కారణంగా కేవలం ఈ ఏడాదిలోనే 5.58 లక్షల మంది ఇలా తరలివెళ్లారు. ఇలా వెళ్లిన వారిలో ప్రతి ఐదుగురిలో నలుగురు మహిళలు, చిన్నారులే. పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాల్చి.. అంతర్గతంగా, విదేశాలకు తరలివెళ్లే వారి సంఖ్య ముందుముందు మరింత పెరిగే ప్రమాదముంది. అఫ్గాన్ ప్రజలకు రానున్నవి చీకటి రోజులు’ అని యూఎన్ హెచ్సీఆర్ ఆసియా పసిఫిక్ రెఫ్యూజీ నెట్వర్క్ సీఈవో నజీబా వజెదాఫోస్ట్ శుక్రవారం వర్చువల్ మీడియా కాన్ఫరెన్స్లో తెలిపారు. -
ఈ భూమిపై మాకింత చోటేది?
ప్రపంచం ఓ కుగ్రామం అయిపోయింది. ఒకప్పుడు విదేశీయుల ఏలుబడిలో ఉన్న దేశాలు స్వాతంత్య్రం సాధించుకున్నాయి. తమ పాలకులను, ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నాయి. కానీ కొన్ని దేశాల్లోని ప్రజలకు ఆ స్వాతంత్య్ర ఫలాలు అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి. బాధ వస్తే కన్నీళ్లు కార్చడం, ఆకలి వేస్తే పొట్ట చేత పట్టుకోవడం అక్కడ ప్రజలకు సర్వసాధారణం. ఎందుకంటే.. ప్రపంచంలోని అనేక దేశాల్లో నిరంతరం జరుగుతున్న యుద్ధాలు, అంతర్గత పోరాటాలు, జాతుల మధ్య ఘర్షణలు, హింస, సైనిక పోరాటాలతో ఎంతోమంది నిరాశ్రయులవుతున్నారు. అలాంటి అభాగ్యులు ఆశ్రయం కోసం సొంత దేశాన్ని విడిచి పరాయి దేశంలో 'శరణార్థులు'గా మారుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది నిరాశ్రయులై, ఏ దేశ పౌరసత్వం, గుర్తింపునకూ నోచుకోవడం లేదు. నివాసం, విద్య, ఆరోగ్యం, ఉద్యోగ, ఉపాధి, ఆహారం కొరతతో అనునిత్యం సంఘర్షణకు గురవుతున్నారు. 2001 నుంచి ఐక్యరాజ్య సమితి, 100కి పైగా దేశాలు జూన్ 20న ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని జరుపుతున్నాయి. మరి ఆ కన్నీటి గాథలు ఓసారి తెలుసుకుందాం! యూఎన్హెచ్సీఆర్ ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 65.3 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వీరిలో 21 మిలియన్లకు పైగా ప్రజలు శరణార్థులుగా వివిధ దేశాలకు వలస వెళ్లారు. ఇప్పటికీ 10 మిలియన్ల మందికి సరియైన ఉందామంటే గూడు లేదు. రోజుకు సగటున 42,500 మంది రక్షణ కోసం తమ ఇళ్లను వదిలి ఆ దేశంలోని వివిధ ప్రాంతాలకు, ఇతర దేశాలకు వెళ్తున్నారు. గత సంవత్సరం 13.9 మిలియన్ల మంది కొత్తగా నిరాశ్రయులయ్యారు. ఇక సిరియాలో అంతర్యుద్ధం అక్కడి ప్రజల జీవితాల్లో అత్యంత భయంకరమైన మానవతా సంక్షోభానికి దారితీసింది. ప్రస్తుతం 11 మిలియన్లకు పైగా సిరియన్లు నిరాశ్రయులయ్యారు. ఇది సిరియా జనాభాలో 45శాతం. ప్రపంచంలోని 86శాతం శరణార్థులకు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. గత దశాబ్దంలో వివిధ దేశాలకు శరణార్థులుగా వేళ్లే వారి సంఖ్య 16 శాతం పెరిగింది. ప్రపంచంలోని అతిపెద్ద శరణార్థుల శిబిరం కెన్యాలోని దాదాబ్లో ఉంది. అక్కడ దాదాపు 3,29,000 మందికి పైగా శరణార్థులు ఆశ్రయం పొందుతున్నారు. అయితే గతంలో భద్రతాపరమైన ప్రమాదాల కారణంగా దాదాబ్ శరణార్థుల శిబిరాన్ని మూసివేస్తామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 20 మిలియన్ల శరణార్థులలో 18 ఏళ్లలోపు ఉన్నవారు 51 శాతం. రెండవ ప్రపంచ యుద్థ తరువాత అత్యధిక సంఖ్యలో బాలలు శరణార్థులుగా మారడం ఇదే ప్రథమం. ఇక 2016లో జరిగిన రియో ఒలంపిక్స్ పోటీలో మొట్టమొదటిసారిగా ‘‘శరణార్థుల జట్టు’’ పోటీ పడింది. ఈ జట్టులో ఇథియోపియా, దక్షిణ సూడాన్, ది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సిరియా దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాల్లోని శరణార్థుల్లో ప్రధానభాగం సిరియా, అఫ్గానిస్థాన్, దక్షిణ సూడాన్, పాలస్తీనా, ఇరాక్, ఉగాండా, సోమాలియా, మయన్మార్లలోనే ఉన్నారు. ఇప్పటికీ సిరియాను 'శరణార్థుల ఉత్పత్తి దేశం'గా పిలుస్తారు. ప్రపంచీకరణ కారణంగా దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య, విదేశాంగ దౌత్య సంబంధాలు, భూభాగ సరిహద్దుల అంశాల్లో కట్టుదిట్టమైన విధానాలను అవలంబిస్తున్నారు. కొన్ని దేశాల్లో సరిహద్దు భూభాగంలో ఇనుప కంచెల ఏర్పాటు, గట్టి భద్రత, పౌరసత్వ గుర్తింపు తనిఖీ, నియంత్రణ కోసం గస్తీ బలగాలను పెద్దఎత్తున మోహరిస్తున్నారు. ప్రధాన రహదారులనూ మూసివేస్తూ, శరణార్థులు చొరబడకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే ఐరాస చొరవతో ప్రపంచంలోని అన్ని దేశాలతో చర్చలు జరిపి, ఆయా దేశాల నుంచి శరణార్థులుగా వలస వెళ్లిన వారిని తిరిగి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాధితులకు ప్రాణరక్షణ, పునరావాసం, విద్య, వైద్యం, ఆహారం, మందులు, ఉద్యోగ, ఉపాధి వంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించి, జనజీవన స్రవంతిలో కలిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. చదవండి: కరోనా మృతుల కుటుంబాలకు అంత పరిహారం ఇవ్వలేం: కేంద్రం -
సర్కారు ఎవరిదో నిర్ణయించేది ఆ రెండు జిల్లాలే!
కోల్కతా: నార్త్ 24 పరగణ, సౌత్ 24 పరగణ.. పశ్చిమబెంగాల్లో ఈ రెండు జిల్లాలు తృణమూల్ కాంగ్రెస్కు కంచుకోటలు. ఈ కోటలను బద్దలు కొట్టి టీఎంసీ ఓటమికి బాటలు వేయాలనేది బీజేపీ ప్రణాళిక. ఈ రెండు జిల్లాల్లో మరోసారి అత్యధిక స్థానాలు గెలుపొందడం ద్వారా మరోసారి అధికారంలోకి రావాలన్నది టీఎంసీ ఆలోచన. మొత్తం 294 స్థానాల అసెంబ్లీలో ఈ రెండు జిల్లాలకు కలిపి 64 సీట్లు ఉన్నాయి. నార్త్ 24 పరగణలో 33, సౌత్ 24 పరగణలో 31 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సౌత్ 24 పరగణలో మైనారిటీల ప్రాబల్యం ఎక్కువ. ఈ రెండు జిల్లాలకు బంగ్లాదేశ్తో సరిహద్దులున్నాయి. శరణార్థుల జనాభా కూడా ఇక్కడ ఎక్కువ. 1980లో 24 పరగణ జిల్లాను అప్పటి లెఫ్ట్ ప్రభుత్వం రెండు జిల్లాలుగా విభజించింది. మొదట్లో ఈ ప్రాంతంలో వామపక్షాలకు గట్టి పట్టు ఉన్నప్పటికీ క్రమంగా టీఎంసీ పుంజుకుని, లెఫ్ట్ బలాన్ని తగ్గించేసింది. నందిగ్రామ్, సింగూర్ ఉద్యమాలు ఈ ప్రాంతంలో టీంఎసీని మరింత బలోపేతం చేశాయి. 2011, 2016 ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో దాదాపు అన్ని స్థానాలను టీఎంసీ గెల్చుకుంది. 2016లో నార్త్ పరగణలో 27, సౌత్ పరగణలో 29 స్థానాలను టీఎంసీ గెల్చుకుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో నార్త్ పరగణలో బీజేపీ కొంతవరకు ప్రభావం చూపగలిగింది. ‘బెదిరింపులతో, ప్రలోభాలతో 2019 ఎన్నికల్లో బీజేపీ కొంత ప్రభావం చూపింది. కానీ ఆ తరువాత మేం జాగ్రత్తపడ్డాం. పార్టీ బలోపేతానికి తగిన చర్యలు తీసుకున్నాం’ అని నార్త్ 24 పరగణ జిల్లా టీఎంసీ అధ్యక్షుడు జ్యోతిప్రియొ తెలిపారు. పార్టీలో పెరుగుతున్న అంతర్గత విబేధాలు, మత ఘర్షణల కారణంగా రెండు జిల్లాల్లోనూ టీఎంసీ బలం కొంత తగ్గింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రచారాస్త్రంగా చేపట్టి, శరణార్ధులను ఆకర్షించి 2019 లోక్సభ ఎన్నికల్లో నార్త్ 24 పరగణ జిల్లాలో ఉన్న ఐదు స్థానాల్లో రెండింటిని బీజేపీ గెల్చుకోగలిగింది. అలాగే, అక్కడ ప్రబలంగా ఉన్న మథువా వర్గంలో పట్టు సాధించింది. నార్త్ 24 పరగణలోని 14 అసెంబ్లీ స్థానాల్లో మథువాలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఈ రెండు జిల్లాల నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు సహా పెద్ద ఎత్తున పార్టీ నేతలు బీజేపీలో చేరడం టీఎంసీకి ఆందోళనకరంగా మారింది. కొత్తగా వచ్చిన ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్) సౌత్ 24 పరగణ జిల్లాలో టీఎంసీకి చెందిన మైనారిటీ ఓట్లను చీల్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఐఎస్ఎఫ్ కాంగ్రెస్, లెఫ్ట్లతో కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల ప్రచారం సాయంతో నార్త్ 24 పరగణలో 60% సీట్లను సాధిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ధీమాగా ఉన్నారు. -
పౌరసత్వం ఇచ్చి తీరుతాం..
కోల్కతా: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కింద దేశంలోని శరణార్థులందరికీ కేంద్ర ప్రభుత్వం పౌరసత్వం ఇచ్చి తీరుతుందని.. అప్పటివరకు వెనకడుగు వేసేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్షా స్పష్టం చేశారు. సీఏఏ శరణార్థులకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించింది మాత్రమేనని.. దీనివల్ల ఏ ఒక్క వ్యక్తి తన పౌరసత్వాన్ని కోల్పోడని ఉద్ఘాటించారు. తృణమూల్ కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు సీఏఏపై అసత్య ప్రచారాన్ని చేస్తూ.. మైనారిటీలు, శరణార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. పౌరసత్వం కోసం శరణార్థులు పత్రాలు చూపించాలని ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. కోల్కతాలో ఆదివారం నిర్వహించిన ఓ పబ్లిక్ ర్యాలీలో పాల్గొన్న అమిత్షా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ధ్వజమెత్తారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ప్రచారం చేసి.. మమత అల్లర్లకు ఆజ్యం పోస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని దళితులు, వెనుకబడిన మతువా కులాలకు పౌరసత్వం రాకుండా మమత అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దమ్ముంటే పౌరసత్వ చట్ట అమలును ఆపాలని మమతకు సవాల్ విసిరారు. శరణార్థులకు పౌరసత్వం ఇవ్వాలని ప్రధాని మోదీ ఆలోచిస్తుంటే మమత సహా ప్రతిపక్షాల నేతలు వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. 2021లో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజార్టీతో విజయం సాధించి.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఆర్ నోయ్ అన్యాయ్ (ఇక అన్యాయాన్ని సహించం)’అనే ప్రచారాన్ని అమిత్షా ప్రారంభించారు. ర్యాలీలో ‘గోలీమారో’నినాదాలు.. షహీద్ మినార్ గ్రౌండ్లో జరిగిన అమిత్షా ర్యాలీలో కొందరు బీజేపీ కార్యకర్తలు ‘గోలీమారో’అని నినాదాలు చేశారు. దీనికి సంబంధించి కోల్కతా పోలీసులను వివరణ కోరగా.. స్పందించేందుకు నిరాకరించారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. భారత్లో మెరుగైన రక్షణ విధానం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో మెరుగైన రక్షణ విధానాన్ని రూపొందించిందని అమిత్షా పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని స్పష్టం చేశారు. 10 వేల ఏళ్ల చరిత్రలో భారత్ ఎలాంటి దాడులూ జరపలేదని.. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయన్నారు. ఎవరైనా తమ భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించినా.. జవాన్లు, ప్రజల మీద దాడులకు యత్నించినా.. భారత్ గట్టిగా బదులిస్తుందని పేర్కొన్నారు. రాజర్హాట్లో జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) 29వ స్పెషల్ కంపోసిట్ గ్రూప్ (ఎస్సీజీ) కాంప్లెక్స్ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్షా మాట్లాడుతూ.. ఎన్ఎస్జీ అంటే ఉగ్ర వ్యతిరేక దళంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని అన్నారు. -
'ఆ' చట్టంలో శ్రీలంక తమిళులు ఎక్కడా?
ముంబై: సవరించిన పౌరసత్వ చట్టం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు మాత్రమే ఎందుకు రూపొందించారని, శ్రీలంక తమిళులకు ఎందుకు వీలు కల్పించలేదని కేంద్ర ప్రభుత్వం తీరుపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ధ్వజమెత్తారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పౌరసత్వం సవరణ చట్టం (సీఏఏ), ప్రతిపాదిత జాతీయ పౌర గణాంక పట్టిక (ఎన్నార్సీలు) దేశాన్ని తీవ్రంగా కుదిపేస్తున్న సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి మాత్రమే అని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. సీఏఏ, ఎన్నార్సీలను కేవలం మైనారిటీలే కాదు, దేశంలో ఏకత్వం(ఐక్యత), దేశ అభివృద్ధిని కాంక్షించే వారు కూడా వ్యతిరేకిస్తున్నారని చెప్పుకొచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పౌరసత్వ చట్టం సమాజంలో మతపరమైన ఇబ్బందులను సృష్టించడంతో పాటు దేశ ఐక్యత, సామరస్యాన్ని దెబ్బతీస్తుందని విమర్శించారు. సీఏఏ కేంద్రం తీసుకొచ్చిన చట్టం కావచ్చు, కానీ దాని అమలు రాష్ట్ర ప్రభుత్వాలచే చేయబడుతుందని అన్నారు. ఇప్పటికే ఈ చట్టాన్ని అమలు చేయడాన్ని బిహార్తో సహా ఎనిమిది రాష్ట్రాలు నిరాకరించాయి. ఇక మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే వైఖరిని అవలంబించాలని పవార్ పేర్కొన్నారు. సవరించిన చట్టం ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి హింసేతర కారణల వల్ల భారత్కు వచ్చే ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడాన్ని తప్పుబడుతూ దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. -
పౌరసత్వ బిల్లు ఆమోదంపై స్పందించిన ఆరెస్సెస్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు బుధవారం పార్లమెంట్లో ఆమోదం పొందడంతో రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆరెస్సెస్) జనరల్ సెక్రటరీ భయ్యాజీ జోషి.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అభినందించారు. రాజకీయాలను పక్కన పెట్టి అందరూ.. బీజేపీ సారథ్యంలో కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన సాహసోపేతమైన నిర్ణయాన్ని స్వాగతించాలని కోరారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లో మతపరమైన వేధింపులు, హింసను ఎదుర్కొని భారత్కు వచ్చే హిందువులను చొరబాటుదారులుగా కాకుండా శరణార్థిగా గుర్తించాలని ఆరెస్సెస్ ఎప్పుడూ ఆకాంక్షించేదని అన్నారు. దేశ విభజన జరిగినప్పుడు.. మతపరమైన ప్రాతిపదికన విభజన జరగాలనే డిమాండ్ ఉందని, అయితే భారతదేశానికి 'మతతత్వ దేశంగా' ఏర్పాటు చేసే ఆలోచన అప్పట్లో లేదన్నారు. కానీ, చివరకు దేశం ఈ సమస్యపైనే విభజించబడిందని పేర్కొన్నారు. మన నాయకులు కూడా ఈ విషయాన్ని అంగీకరించారని అన్నారు. మతపరమైన కారణాల వల్ల విభజన జరగకపోతే, ఆ తరువాత చాలా ఉదంతాలు చోటుచేసుకొనేవి కాదని ఈ సందర్భంగా ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి జోషి తెలిపారు. नागरिकता संशोधन कानून का प्रस्ताव लोकसभा और राज्यसभा में रखा गया और वह बहुमत से पारित हुआ। इस पहल के लिए, इस साहसिक कदम के लिए, हम केंद्र सरकार का और विशेषतः प्रधानमंत्री और गृहमंत्री जी का हृदय से अभिनंदन करते हैं, उनको धन्यवाद देते हैं। - सरकार्यवाहhttps://t.co/UfcVpZLDID pic.twitter.com/dUgs9Kvu12 — RSS (@RSSorg) December 12, 2019 ‘మైనార్టీలకు ఎటువంటి అన్యాయం చేయబోమని పాకిస్తాన్, బంగ్లాదేశ్లు ఇస్లామిక్ దేశాలుగా ప్రకటించుకున్నప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన జనాభా లెక్కలను ఒకసారి నిశితంగా పరిశీలిస్తే.. అక్కడ తగ్గుతున్న మైనార్టీ జనాభాను అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యక్తులు ఎక్కడికి వలస వెళ్లారనే సందేహం తలెత్తుతుంది. అక్కడి మైనారిటీలో చాలామంది భారతదేశానికి వచ్చారు. దానికి ప్రధాన కారణం ఏమిటంటే భారత్లో వారికి సంపూర్ణ భద్రతతో పాటు రక్షణ’ లభించడమని అని భయ్యాజీ అన్నారు. అయితే చట్టంలోని లొసుగుల కారణంగా వారు ఏళ్ల తరబడి భారత పౌరసత్వాన్ని కోల్పోయారు. వేధింపులకు గురై వచ్చిన వారిని 'చొరబాటుదారులు' కాక శరణార్థులు అని పిలిస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు. ఇతర దేశాల నుంచి వస్తున్న మైనారిటీలకు పౌరసత్వ సవరణ బిల్లుతో భారత పౌరులుగా మారి.. దేశంలో ఆత్మ గౌరవంతో పాటు పౌర హక్కుల ప్రయోజనాలను పొందుతారని ఆనంద పడుతున్నాను. ఇక వారి శరణార్థి జీవితం ముగింపు పలకనుంది అన్నారు. ఈ బిల్లు పౌరసత్వం కల్పించేదే కానీ.. పౌరసత్వాన్ని లాక్కొనేది కాదని, ముస్లింలు ఎలాంటి భయాందోళలకు గురికావాల్సిన అవసరం లేదని ఇప్పటికే అమిత్ షా స్పష్టం చేశారని అన్నారు. కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో పౌరసత్వ సవరణ బిల్లుపై వస్తున్న వదంతుల కారణంగా అట్టుడుకుతున్నాయని.. అక్కడి ప్రజల సందేహాలను తీర్చడానికి కేంద్రం చర్యలు తీసుకుంటుందనే నమ్మకం ఉందని జోషి ఆశాభావం వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ బిల్లుతో శరణార్థులు ప్రశాంతంగా జీవిస్తారని హర్షం వ్యక్తం చేశారు. త్వరలో పౌరసత్వ చట్టంపై అవగాహన కార్యక్రమాలు న్యూఢిల్లీ: వివాదస్పద పౌరసత్వ సవరణ బిల్లు చట్టాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, పౌరసత్వ బిల్లుపై దేశవ్యాప్తంగా ప్రజలకు అర్థమయ్యేరీతిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టనుంది. పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఈ విషయంపై వివరణ ఇస్తూ.. పౌరసత్వ సవరణ బిల్లుతో సుమారు 2 కోట్ల మంది శరణార్థులకు భారత పౌరసత్వం లభించనుందన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసిన వెంటనే.. శనివారం నుంచి పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మత ఘర్షనలు, హింస కారణంగా డిసెంబరు 31, 2014కు ముందు భారత్కు వచ్చిన ముస్లిమేతరులను అక్రమ చొరబాటుదారులుగా ఉన్నవారిని ఈ మేరకు భారతీయపౌరులుగా గుర్తించబడతారు. -
బైబై ఇండియా..!
భారత్ను వీడి విదేశాల్లో ఆశ్రయం పొందాలనుకుంటున్న భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అంతర్యుద్ధం, రాజకీయ సంక్షోభం వంటి సమస్యలు లేకపోయినా విదేశాల్లో ఆశ్రయం కోరుతున్న భారతీయుల సంఖ్య భారీగా పెరిగినట్లు ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషన్ తెలిపింది. 2008–18 మధ్యకాలంలో ఇలా విదేశాలను ఆశ్రయిస్తున్నవారి సంఖ్య ఏకంగా 996.33 శాతానికి ఎగబాకిందని వెల్లడించింది. ఇలా ఆశ్రయం కోరుతున్నవారిలో అత్యధికులు అమెరికా, కెనడా దే శాలవైపు మొగ్గుచూపుతున్నారని పేర్కొంది. సాధారణంగా అంతర్యుద్ధం, రాజకీయ అస్థిరత ఇతర కారణాలతో ప్రజలు ప్రాణాలను అరచేతపెట్టుకుని పారిపోతుంటారు. ఈ తరహా సమస్యలు ఏవీ లేకపోయినా భారత్ నుంచి భారీగా వలసలు పెరగడంపై నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల క్రితం పరిస్థితి వేరు... పదేళ్ళ క్రితం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉండేది. 2008–09 మధ్యకాలంలో అమెరికా, కెనడాల ఆశ్రయాన్ని కోరుతూ కేవలం 282 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. కానీ గత పదేళ్ళలో ఈ సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయి 22,967కి చేరుకుంది. 2018లో అమెరికా ఆశ్రయాన్ని కోరుకున్న భారతీయుల సంఖ్య 28,489కు పెరగ్గా, కెనడా ఆశ్రయాన్ని కోరుకున్న వారి సంఖ్య 5,522కు చేరుకుంది. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం అమెరికా, కెనడాల తర్వాత భారతీయులు ఆశ్రయం కోరిన దేశాల్లో దక్షిణాఫ్రికా(4,329), ఆస్ట్రేలియా(3,584), దక్షిణకొరియా(1,657), జర్మనీ(1,313) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ అభివృద్ధి చెందిన దేశాలు కాబట్టి వలస వెళ్లారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ పేదరికం, అంతర్యుద్ధం, విపరీతమైన హింస ఉండే యెమెన్, సూడాన్, బోస్నియా, బురుండి వంటి దేశాలను కూడా భారతీయులు ఆశ్రయం కోరడం అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులను విస్మయంలో పడేస్తోంది. 2018లో ఇలాంటి 57 దేశాల్లో భారతీయులు ఆశ్రయాన్ని కోరడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భారత్లో నెలకొన్న అసహనం కారణంగానే ఇలా ప్రజలు విదేశీ ఆశ్రయం కోరుతున్నారని మరికొందరు వాదిస్తున్నారు. భారత్కు వస్తున్నవారు తక్కువే... ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ను ఆశ్రయిస్తోన్న శరణార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉండటం గమనార్హం. అంతర్జాతీయంగా 35.03 లక్షల మంది శరణార్థులు వేర్వేరు దేశాల్లో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నవారు 11,957 మంది(0.34 శాతం) మాత్రమే. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం 2018 చివరికినాటికి భారత్ 1.95 లక్షల మంది శరణార్థులకు ఆశ్రయం ఇచ్చింది. ప్రాంతాలవారీగా చూసుకుంటే పాకిస్తాన్ 14.04 లక్షల మంది విదేశీయులకు ఆశ్రయం ఇచ్చింది. వీరిలో అత్యధికులు ఆఫ్గన్లు. 9.06 లక్షల మందితో బంగ్లాదేశ్ రెండో స్థానంలో నిలిచింది. రోహింగ్యాలు వీరిలో అత్యధికంగా ఉన్నారు. -
శరణార్థులకు ‘ఉగ్ర’ సెగ
కొలంబో/కల్మునయ్: శ్రీలంకలో ఈస్టర్ రోజున ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమం కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. చర్చిలు, శ్రీలంకలో ఆశ్రయం పొందుతున్న విదేశీ శరణార్థులకు వేధింపులు ఎక్కువయ్యాయి. తమ దేశం వదిలి వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ సహా 15 దేశాలకు చెందిన 1,600 మంది మైనారిటీ మతస్తులు శ్రీలంకలో ఆశ్రయం పొందుతున్నారు. వీరిలో అత్యధికులు పాకిస్తాన్కు చెందిన క్రైస్తవులే ఉన్నారు. నెగంబో పట్టణంలో వీరికి ప్రభుత్వం తాత్కాలిక ఆశ్రయం కల్పించింది. అయితే ఇదే పట్టణంలోని సెయింట్ సెబాస్టియన్ చర్చిని ఉగ్రమూకలు లక్ష్యంగా చేసుకోవడంతో పరిస్థితి దిగజారిపోయింది. ఈ శరణార్థులను వేధింపులకు గురిచేయడంతో పాటు వీరికి ఇళ్లు అద్దెకు ఇచ్చిన యజమానులను కొందరు స్థానికులు బెదిరిస్తున్నారు. మరోవైపు కల్మునయ్, సమ్మంతురై, చావలకడే ప్రాంతాలు మినహా దేశమంతటా రాత్రిపూట కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. బుల్లెట్లు అయిపోవడంతోనే ఆత్మాహుతి కల్మునయ్ పట్టణంలో ఆత్మాహుతి దాడికి పాల్పడింది తమ సభ్యులేనని ఐసిస్ ప్రకటించుకుంది. అబూ హమ్మద్, అబూ సుఫియాన్, అబూ అల్క్వాలు భద్రతా బలగాలతో పోరులో బుల్లెట్లు అయిపోవడంతో తమనుతాము పేల్చేసుకున్నారని వెల్లడించింది. మరోవైపు ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించిన నేపథ్యంలో పోలీసులు, భద్రతాబలగాలు దేశమంతటా విస్తృతంగా సోదాలు జరుపుతున్నాయి. ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా 106 మంది అనుమానితుల్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. షాంగ్రీలా హోటల్లో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఇద్దరు ఉగ్రవాదుల అన్న ఇర్ఫాన్ అహ్మద్ను అరెస్ట్ చేశామన్నారు. అలాగే తమిళ మాధ్యమంలో బోధించే ఓ స్కూల్ టీచర్(40)ను కూడా అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. సదరు టీచర్ నుంచి 50 సిమ్కార్డులు, నిషేధిత సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. శుక్రవారం జరిగిన ఆపరేషన్లో వరుస బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి జహ్రన్ హషీమ్ భార్య ఫాతిమా, కుమార్తె రుసైనాను ఉగ్రవాదుల స్థావరం నుంచి కాపాడామన్నారు. అలాగే నేషనల్ తౌహీద్ జమాత్ నడుపుతున్న ఓ స్కూలులో ప్రిన్సిపాల్, వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మరో డాక్టర్ను అరెస్ట్ చేశామన్నారు. ఆ ముగ్గురిదీ ఒకే కుటుంబం శ్రీలంకలోని కల్మునయ్ శుక్రవారం ఎన్టీజే ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి గురించి ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. భద్రతాబలగాలతో కాల్పుల సందర్భంగా తమను తాము పేల్చేసుకున్న ముగ్గురు ఉగ్రవాదులు ఒకే కుటుంబానికి చెందినవారని తేలింది. దాదాపు 15 మందిని బలికొన్న ఈ ఘటనలో ఉగ్రవాది మొహమ్మద్ హషీమ్, ఆయన కుమారులు జైనీ హషీమ్, రిల్వాన్ హషీమ్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా విద్వేషాన్ని రెచ్చగొడుతూ మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
మెక్సికో సరిహద్దుకు భారీగా అమెరికన్ దళాలు
వలసల విషయంలో మరింత కఠిన వైఖరి అవలంభించాలని ట్రంప్ సర్కారు నిర్ణయించింది. మెక్సికో సరిహద్దు భద్రతలో చురుకైన పాత్ర పోషించేందుకు మిలటరీ హెలికాప్టర్లు సహా 5,200కు పైగా దళాలను పంపనున్నట్టు సోమవారం ప్రకటించింది. నవంబరు 6న జరగనున్న మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో – తన మద్దతుదారులను ఆకట్టుకునేందుకు ట్రంప్ ‘అక్రమ వలస’ల అంశాన్ని అతి పెద్ద ఎజెండాగా మలచుకున్నారు. సరిహద్దుల భద్రతనే దేశ భద్రతగా స్పష్టీకరించారు. అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ దీన్నొక రాజకీయ స్టంటుగా వ్యాఖ్యానించింది. రిపబ్లికన్లు సెనేట్పై పట్టు కోల్పోయినట్టయితే.. అధికారంలో వుండే మిగిలిన రెండేళ్లలో తన విధానాలు కొనసాగించడం ట్రంప్కు కష్టమే. ఈ నేపథ్యంలోనే ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయన అక్రమ వలసపై విరుచుకుపడుతున్నారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ ఇటీవల జరిపిన సర్వే ప్రకారం – 75శాతం రిపబ్లికన్ ఓటర్లు అక్రమ వలసలను అతిపెద్ద సమస్యగా భావిస్తున్నారు. (డెమోక్రాటిక్ పార్టీ ఓటర్లలో ఇలా భావించే వారు 19 శాతం) వలసదార్లను తిప్పికొట్టే విషయంలో మిలటరీ తనదైన ప్రత్యేక పాత్ర పోషించబోతున్నట్టు ట్రంప్ ట్విటర్ ద్వారా ప్రకటించారు. దక్షిణ సరిహద్దు గుండా అమెరికాలోకి ప్రవేశించబోతున్న సమూహాల్లో – కొందరు దుష్టులు, అనేక ముఠాలవాళ్లు వున్నారన్న ట్రంప్.. వలసదార్లు తరలిరావడాన్ని దేశంపై జరుగుతున్న దండయాత్రగా అభివర్ణించారు. శరణుకోరి వచ్చే వారి కోసం టెంట్ సిటీలు నిర్మిస్తామని, మిలియన్ డాలర్లు ఖర్చుబెట్టి ఎలాంటి నిర్మాణాలూ చేపట్టబోమని ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వూ్యలో ఆయన పేర్కొన్నారు. సరిహద్దు గుండా దేశంలో ప్రవేశించే వలసదార్లపై ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ను ప్రయోగించడంపై కూడా ట్రంప్ సర్కారు పరిశీలన జరుపుతోంది. జాతీయ భద్రతా కారణాలపై కొందరు వలసదార్లకు ఆశ్రయమివ్వకుండా తిరస్కరించేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తుంది. మెక్సికోకు బెదిరింపులు గ్వాటిమాలా, హోండురాస్, ఎల్ సాల్విడార్ నుంచి మెక్సికో గుండా అమెరికాలోకి ప్రవేశించజూస్తున్న వలసదార్లను ఆ దేశం గనుక అడ్డుకోనట్టయితే, సరిహద్దులోకి మిలటరీని తరలిస్తామని, దక్షణ సరిహద్దును మూసివేస్తామని ఇటీవలే ట్రంప్ ప్రకటించారు. వలసదార్లను అడ్డుకోనట్టయితే పెండింగ్లో వున్న ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నుంచి వెనక్కి మళ్లుతామని కూడా ఆయన బెదిరించారు. ఈ నేపథ్యంలో వలసదార్లను అడ్డుకునేందుకు.. మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నిటో భారీగా పోలీసులను రంగంలోకి దించారు. గత వారం వలసదార్ల ముందు ఒక ఒప్పంద ప్రతిపాదన కూడా చేశారు. మెక్సికో దక్షిణాది రాష్ట్రాలైన ఓక్సాకా, చిపాస్లో వుండేట్టయితే.. వారికి తాత్కాలిక వర్క్ పరిమిట్లు ఇస్తామని, పాఠశాలల్లో చేరేందుకు, వైద్య సాయం పొందేందుకు వీలు కల్పిస్తామని ప్రకటించారు. అత్యధిక వలసదార్లు దీన్ని కొట్టిపడేశారు. అమెరికా సరిహద్దులోకి వెళ్లేందుకే వారు మొగ్గు చూపారు. శరణార్ధుల సుదీర్ఘ యాత్ర.. అమెరికాలోకి ప్రవేశించేందుకు హోండురాస్లోని శాన్ పెడ్రో సులా నుంచి 15 రోజుల కిందట బయలుదేరిన 3000 నుంచి 7000 మంది శరణార్ధులు 600 మైళ్లు దాటినట్టు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అమెరికా సరిహద్దుల్లోకి ప్రవేశించాలంటే వీరు ఇంకా 2,200 మైళ్లు ప్రయాణించాల్సివుంది. అమెరికానే తమకు ఆశావహమైన దేశమనీ, అక్కడే సురక్షితంగా వుండగలమనీ భావిస్తున్న ఈ శరణార్ధులు – ఉత్సాహం తెచ్చుకునేందుకు పాటలు పాడుకుంటూ.. నినాదాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. -
శరణం గచ్ఛామి
టైమ్ మ్యాగజైన్ తాజా ముఖచిత్రం చూశారా? గులాబీ రంగు చొక్కాతో ఓ అమ్మాయి గుక్కతిప్పుకోకుండా ఏడుస్తూంటే.. ఎదురుగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిలబడి ఉంటాడు. ఆ చిన్నారి తల్లి ఓ శరణార్థి. బతుకీడ్చేందుకు సరిహద్దు దాటింది. అవకాశాల స్వర్గమంటున్న అమెరికాలో కాలుపెట్టి దొరికిపోయింది. ఒక్క అమెరికా మాత్రమే కాదు.. యుద్ధ వాతావరణంతో నిండిన ఏ దేశ సరిహద్దులు చూసినా ఇదే తీరు. పొట్టచేత పట్టుకుని దేశాలు దాటేందుకు ప్రయత్నిస్తున్న వారు ఎందరో..! ఆ మూడు దేశాల్లోనే సగం మంది! సరిహద్దులు దాటివచ్చిన శరణార్థులకు పెద్ద మనసుతో ఆశ్రయం కల్పించిన దేశాల్లో టర్కీ, బంగ్లాదేశ్, ఉగాండా ముందు వరసలో ఉన్నాయి. భారత్ కూడా అత్యధికంగా శరణార్థుల్ని అక్కున చేర్చుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శరణార్థుల్లో సగం మందికిపైగా ఈ మూడు దేశాల్లోనే ఆశ్రయం పొందుతున్నారని తాజా నివేదిక వెల్లడించింది. అమెరికా వంటి ధనిక దేశాలు శరణార్థులపై అక్రమ వలసదారులన్న ముద్ర వేసి సరిహద్దుల్లో ఆపేస్తూ, గోడలు నిర్మిస్తామని హెచ్చరికలు చేయడం, తల్లిదండ్రుల నుంచి చిన్నారుల్ని వేరు చేయడం వంటి అమానవీయ చర్యలకు పాల్పడటంతో నిరాశ్రయుల్ని ఆదుకునే వారే కరువయ్యారు. ఈ మూడు దేశాలు శరణార్థుల ఆశ్రయానికి ముందుకు రాకపోతే నిరాశ్రయులకు భద్రత కరువై మానవత్వమే మంట గలిసే పరిస్థితి రావడమే కాదు, వివిధ దేశాల్లో సుస్థిరత కూడా దెబ్బతినేదన్న అంచనాలు ఉన్నాయి. ఉన్న ఊరు పొమ్మంటోంది. తలదాచుకోవడానికి జన్మభూమిలో జానెడు జాగా కూడా లేదు. నిరంతర ఘర్షణలు, యుద్ధ వాతావరణం, ఉగ్రవాదుల దాడులు, మతపరమైన వేధింపులు, కరువు పరిస్థితులు.. కారణాలు ఏవైతేనేం పొట్టచేత పట్టుకుని స్వదేశాన్ని విడిచి వెళ్లిపోతున్న వారి సంఖ్య ఎక్కువైపోతోంది. ప్రపంచవ్యాప్తంగా శరణార్థుల దుర్భర పరిస్థితులు గుండెల్ని మెలిపెడుతున్నాయి. జూన్ 20న ప్రపంచ శరణార్థుల దినాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్య సమితికి చెందిన శరణార్థుల సంస్థ(యూఎన్హెచ్సీఆర్), అంతర్గత నిర్వాసితుల పర్యవేక్షణా కేంద్రం సంయుక్తంగా ఒక నివేదికను విడుదల చేశాయి. ఆ నివేదిక ప్రకారం 2017లో అత్యధికంగా శరణార్థులు సొంత దేశాలు విడిచి వెళ్లారు. శరణార్థుల సంఖ్యలో 13 శాతం పెరుగుదల నమోదైంది. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 6.85 కోట్ల మంది నిర్వాసితులైతే, వారిలో 2.54 కోట్ల మంది వేరే దేశాల్లో శరణార్థులుగా ఆశ్రయం పొందారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ స్థాయిలో శరణార్థుల సంఖ్య పెరిగింది గత ఏడాదే. ప్రతీ రెండు సెకన్లకి ఒకరు నిర్వాసితులుగా మారుతూ ఉండటం పరిస్థితుల తీవ్రతను తెలియజేస్తోంది. శరణార్థుల్లో ఎక్కువ మంది సిరియా, అఫ్గానిస్తాన్, దక్షిణ సూడాన్ తదితర దేశాల వారేనని ఈ నివేదిక వెల్లడించింది. 52 శాతం చిన్నారులే ప్రపంచవ్యాప్తంగా ఉన్న శరణార్థుల్లో 52 శాతం మంది చిన్నారులే. 2009లో శరణార్థుల్లో 41 శాతం మంది బాలలు ఉంటే, అదిప్పుడు 52 శాతానికి పెరిగింది. దక్షిణ సూడాన్, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుంచి ఎక్కువ మంది పిల్లలు శరణార్థులుగా మారడం ఆందోళన కలిగిస్తోంది. కారణాలివే.. - 2011లో సిరియాలో అధ్యక్షుడు అసద్కు వ్యతిరేకంగా మొదలైన తిరుగుబాటు అంతర్యుద్ధానికి దారి తీసింది. తిరుగుబాటుదారులకు అమెరికా మద్దతు పలకడం, రష్యా, ఇరాన్ అసద్ వైపు నిలబడటంతో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఆ పరిస్థితుల్లో సిరియా నుంచి 56 లక్షల మంది టర్కీ, లెబనాన్, జోర్డాన్, జర్మనీలకు శరణార్థులుగా వెళ్లారు. - అఫ్గానిస్తాన్లో దీర్ఘకాలంగా నెలకొన్న యుద్ధవాతావరణం, తాలిబన్ల అరాచకాల కారణంగా ప్రపంచంలోనే శరణార్థులు ఎక్కువగా ఉన్న రెండో దేశంగా మారింది. పాకిస్తాన్, ఇరాన్ వంటి దేశాలకు శరణార్థులుగా వెళ్లిన వారి సంఖ్య 26 లక్షల వరకూ ఉందని అంచనా. - దక్షిణ సూడాన్లో నెలకొన్న దుర్భర కరువు పరిస్థితులు, ఆహార కొరత, అంతర్యుద్ధం కారణంగా శరణార్థుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికీ దేశంలోని సగం మంది జనాభాకి కడుపు నిండే పరిస్థితి లేదు. ఆ దేశం నుంచి 14 లక్షల మంది ఉగాండా, ఇథియోపియా వంటి దేశాలకు శరణార్థులుగా వెళ్లారు. - మయన్మార్లో రోహింగ్యాలు ఎదుర్కొన్న వివక్ష ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సైనిక, భద్రతా దళాల వేధింపులు తట్టుకోలేక రోహింగ్యాలు పొరుగునే ఉన్న బంగ్లాదేశ్కు వెల్లువలా వచ్చారు. 2017లో మయన్మార్ నుంచి 12 లక్షల మంది ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బంగ్లాదేశ్కు వెళ్లిపోయారు. - 1991 నాటి అంతర్యుద్ధ ప్రభావం ఇప్పటికీ సోమాలియాను వెంటాడుతోంది. అత్యంత నిరుపేద దేశంగా మారింది. 2012లో అంతర్జాతీయ మద్దతుతో ప్రభుత్వం ఏర్పడినా షబాబ్ అనే ఉగ్రవాద సంస్థ చేసిన దాడులతో కల్లోలం ఏర్పడింది. అల్ కాయిదా వంటి సంస్థలు కూడా దాడులకు దిగడంతో 10 లక్షల మంది కెన్యా, ఇథియోపియా వంటి దేశాలకు శరణార్థులుగా వెళ్లిపోయారు. ఏయే దేశాల నుంచి.. సిరియా, అఫ్గానిస్తాన్, దక్షిణ సూడాన్, మయన్మార్, సోమాలియా, వియత్నాం ఏయే దేశాలకు వెళుతున్నారు.. (శరణార్థులు ఎక్కువగా సరిహద్దు దేశాలకు వెళ్లడానికే ఇష్టపడుతున్నారు) టర్కీ, బంగ్లాదేశ్, ఉగాండా, పాకిస్తాన్, లెబనాన్, ఇరాన్ - రోజుకి సగటున 44,500 మంది దేశం విడిచి వెళుతున్నారు. - ప్రతీ రెండు సెకన్లకి ఒకరు నిర్వాసితులుగా మారుతున్నారు. - శరణార్థుల్లో 52 శాతం మంది చిన్నారులే. - ప్రపంచవ్యాప్తంగా ఉన్న శరణార్థుల్లో సగానికి పైగా టర్కీ, బంగ్లాదేశ్, ఉగాండాలో తలదాచుకుంటున్నారు. - అమెరికా శరణార్థుల్ని దరికి రానివ్వట్లేదు. గతేడాది 60 వేల మందికే ఆశ్రయమిచ్చింది. - భారత్కు శరణార్థులు వరదలా వస్తున్నారు. ఏకంగా 20 లక్షల మందికి ఆశ్రయం కల్పిం చింది. వీరిలో చైనా(ముఖ్యంగా టిబెట్ నుంచి), శ్రీలంక నుంచే అత్యధికులు వచ్చారు. పౌరసత్వం ఫర్ సేల్..! వివిధ దేశాల్లో అత్యంత సంపన్నులు, మల్టీ మిలియనీర్లు ఒకటికి మించి ఎక్కువ దేశాల పాస్పోర్టులు కలిగి ఉండటం ఓ అత్యున్నత హోదాకు చిహ్నం. ముఖ్యంగా 21వ శతాబ్దపు ధనికస్వామ్యంలో మూడు, నాలుగు దేశాల పౌరసత్వాలున్న వారు కూడా ఉన్నారు. ఐరోపా సంఘం(ఈయూ) లోని పలు దేశాలతోపాటు దాదాపు పాతిక దేశాల్లో పౌరసత్వం పొందవచ్చు.. అయితే దానికీ ఓ రేటు ఉంది సుమా..! గ్లోబల్ మార్కెట్లో సిటిజన్షిప్ బై ఇన్వెస్ట్మెంట్(సీఐపీ) ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు బాగా డిమాండున్న బిజినెస్. తక్కువలో తక్కువ రూ.68 లక్షలు(లక్ష అమెరికన్ డాలర్లు) మొదలుకుని 2.5 మిలియన్ యూరోల(సుమారు రూ.20 కోట్లు) వరకు వివిధ స్కీంల కింద ఖర్చవుతుంది. ఆయా దేశాల్లో ఆస్తుల కొనుగోలు లేదా వ్యాపారాల్లో పెట్టుబడులు, ప్రభుత్వ బాండ్ల కొనుగోలు లేదా నేరుగా నగదు విరాళాలు ఇవ్వడం ద్వారా పౌరసత్వాన్ని, పాస్పోర్ట్ను పొందవచ్చు. కొన్ని దేశాల్లోనైతే ఒకేసారి సిటిజన్షిప్ ఇవ్వకుండా ‘గోల్డెన్ వీసా’పథకాల నిర్వహణ ద్వారా ఐదేళ్ల తర్వాత పౌరసత్వాన్ని ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. మనది భిన్నమైన పరిస్థితి.. భారత్లోని వివిధ జాతీయ బ్యాంకుల నుంచి రూ.వేల కోట్ల అప్పులు తీసుకుని, వాటిని చెల్లించకుండా విదేశాలకు పారిపోతున్న వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ఐపీఎల్ మాజీ సారథి లలిత్ మోదీ, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ అధినేత విజయ్మాల్యా, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఈ కోవలోకే వస్తున్నారు. దర్యాప్తు సంస్థలకు అందకుండా తప్పించుకుని తిరుగుతూ విదేశాల్లో ఆశ్రయం పొందుతున్న నీరవ్ మోదీ వద్ద ఆరు పాస్పోర్టులున్నాయి. ప్రస్తుతం డొమినికా, సెయింట్ లూసియా, ఆంటిగ్వా, గ్రేనెడా, సెయింట్ కిట్స్, మాల్టా, సైప్రస్లో లక్ష డాలర్ల నుంచి 2.4 మిలియన్ డాలర్లలోపు పెట్టుబడులు పెడితే 3, 4 నెలల్లోనే సిటిజన్షిప్ను అందజేస్తున్నాయి. రెండు దేశాల్లో పౌరసత్వాన్ని కలిగి ఉండటానికి భారత్లో అనుమతి లేదు కాబట్టి, దేశం వెలుపల శాశ్వతనివాసం పొందడానికి అనేక మంది సిద్ధపడుతున్నారు. మరో దేశ పౌరసత్వం కోరకుండానే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నారు. కరీబియన్ దీవుల్లో ప్రభుత్వ నిధికి లక్ష డాలర్లు విరాళమిస్తే చాలు పౌరసత్వం లభిస్తుంది. అంతేకాకుండా ఈ పాస్పోర్టుల ద్వారా వీసాలు లేకుండానే 120 దేశాల్లో పర్యటించేందుకు వీలుంటుంది. కరెన్సీ డాలర్లలోనే ఉంటుంది కాబట్టి విదేశాల్లో వచ్చే ఆదాయంపై పన్నులేమి పడవు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులతో.. తమ దేశ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి కొన్ని నెలల్లోనే పౌరసత్వం అందిస్తున్న దేశాలు చాలానే ఉన్నాయి. సైప్రస్లో 20 లక్షల యూరోలు పెట్టుబడి పెడితే చాలు సిటిజన్ షిప్ వచ్చేస్తుంది. మనదేశం నుంచి 2017లో ఏడు వేల మంది శ్రీమంతులు ఇతర దేశాలకు మకాం మార్చినట్టు న్యూవరల్డ్ వెల్త్ నివేదిక ఇటీవల వెల్లడించింది. -
అమెరికా ఆశ్రయం కోరిన 7000 మంది భారతీయులు
సాక్షి, న్యూఢిల్లీ : గత ఏడాది 7000 మందికి పైగా భారతీయులు అమెరికాలో ఆశ్రయం కోరారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల ఏజెన్సీ నివేదిక వెల్లడించింది. 2017లో అమెరికాను ఆశ్రయం కోరిన వారి సంఖ్య అత్యధికంగా ఉందని ఏజెన్సీ పేర్కొంది. 2017 నాటికి ప్రపంచవ్యాప్తంగా 6.8 కోట్ల మంది వలసబాట పట్టారని ఐరాస శరణార్ధుల ఏజెన్సీ తన వార్షిక నివేదికలో తెలిపింది. వీరిలో 1.6 కోట్ల మంది కేవలం గత ఏడాదిలోనే వలసలకు లోనయ్యారని పేర్కొంది. రోజుకు 44,500 మంది ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళుతున్నారని, ప్రతి రెండు సెకన్లకూ ఓ వ్యక్తి వేరే ప్రాంతానికి వెళుతున్నారని నివేదిక వెల్లడించింది. యుద్ధాలు, హింస, ప్రాసిక్యూషన్ల కారణంగా వరుసగా ఐదో ఏడాది 2017లో అత్యధికంగా వలసలు చోటుచేసుకున్నాయని పేర్కొంది. కాంగో సంక్షోభం, సూడాన్ యుద్ధం, రోహింగ్యా శరణార్ధుల వ్యవహారంతో వలసలు పెరిగాయని విశ్లేషించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచే వలసలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. -
ఆలియా
‘తాతయ్యా... ఎవరు వీళ్లు?’ అంది మెడ చుట్టూ గట్టిగా చేతులు వేసి.‘ఏడవకు. వాళ్లంతా చెడ్డవాళ్లు’ అని చెప్పాడు తాతయ్య. ‘చనిపోయాక కూడా చెడ్డవాళ్లేనా తాతయ్యా..’ ఏడుపు ఆపుకుంటూ అడిగింది ఆలియా! ఈసారి తాతయ్య ఏడుపును ఆపుకున్నాడు. పైనెక్కడో స్వర్గం ఉంటే ఉండనివ్వండి. ఎవరిక్కావాలది భూమ్మీద మనకో ఇల్లుంటే! సొంతఇల్లేం కాదు. సొంత మనుషులతో ఉన్న ఇల్లు. అది చాలు. దేవుణ్ణే దిగిరమ్మని పిలిచి ఆతిథ్యం ఇవ్వొచ్చు. దేవుణ్ణి ఇల్లంతా తిప్పి చూపించవచ్చు. ‘దేవుడా ఇది హాలు. అది కిచెన్. ఇదిగో నీ గది. అందులో నీ పటం. తినని రోజు ఉంటుందేమో. నీ పటం ముందు నిలబడని రోజు ఉండదు మాకు’ అని ఆయనక్కూడా కాస్త కుంకుమ అద్దొచ్చు. దేవుణ్ణి కాసేపలా మొక్కల మధ్యలోకి తీసుకెళ్లొచ్చు. దేవుడు ఊరికే చూస్తుంటాడు. అతిథి కదా. అది మన ఇల్లు కదా! ఆలియాకు కూడా ఇలాంటి ఇల్లే ఉండేది. ఆలియా ఏడేళ్ల పిల్ల. అలెప్పోలో వాళ్ల ఇల్లు. సిరియా! ఆ ప్రాంతంలోనే కొంత దూరంలో నానమ్మ, తాతయ్యల ఇల్లు. రెండు స్వర్గాలు ఆలియాకు. ఓ రోజు ఆలియాను చంకనేసుకుంది తల్లి. ‘ఎక్కడికమ్మా!’.. అడిగింది ఆలియా. ‘ఇల్లొదిలి వెళ్లిపోతున్నాం’ అంది. ఇల్లొదిలి వెళ్లిపోతున్నామనే చెప్పింది. ఊరొదిలీ, దేశం వదిలీ వెళ్లిపోతున్నాం అని చెప్పలేదు. ముందు నానమ్మ వాళ్లింట్లో వదిలిపెట్టింది. అక్కడ మళ్లీ తాతయ్య ఆలియాను చంకనేసుకున్నాడు. తాతయ్య కూడా అమ్మ చెప్పినట్లే చెప్పాడు. ‘మనం ఇల్లొది వెళ్లిపోతున్నాం’ అని! రెండిళ్లూ పోయాయి. పోయిన స్వర్గాల గురించి ఆలోచించే వయసా అది. వెళ్లిన చోట ఇంకో స్వర్గం. అంతే కదా పిల్లలు. కొత్త ప్రదేశాల కన్నా కూడా కొత్త ప్రదేశాలకు కదలడాన్ని ఇష్టపడతారు. తాతయ్య భుజం ఎక్కి కూర్చుంది ఆలియా. కుటుంబం అంతా నడుస్తోంది. నడుస్తోంది. నడుస్తోంది. దారి పొడవునా తాతయ్య కాళ్లకు మనుషులు తగులుతున్నారు. మనుషులు కాదు. తునాతునకలైన మనుషులు. కాళ్లూ చేతులు లేనివి కొన్ని. తలలూ మొండేలు లేనివి కొన్ని. మనవరాలికి నేల కనిపించకుండా ఆకాశాన్ని చూపిస్తున్నాడు తాతయ్య. ఎంతసేపని ఆకాశంలోకే చూస్తుంది. ఆమె చూపు నేలను తాకింది. పెద్దగా ఏడుపందుకుంది ఆలియా. ‘తాతయ్యా... ఎవరు వీళ్లు?’ అంది మెడ చుట్టూ గట్టిగా చేతులు వేసి. ‘ఏడవకు. వాళ్లంతా చెడ్డవాళ్లు’ అని చెప్పాడు తాతయ్య. ‘చనిపోయాక కూడా చెడ్డవాళ్లేనా తాతయ్యా..’ ఏడుపు ఆపుకుంటూ అడిగింది ఆలియా! ఈసారి తాతయ్య ఏడుపును ఆపుకున్నాడు. ఇప్పుడు లెబనాన్లోని దేమర్లో ఉంటోంది ఆలియా, తాతయ్య.. ఇంకా అమ్మ, నాన్న. అలెప్పోలో తన స్నేహితురాలిని వదిలొచ్చి సరిగ్గా ఏడాది అవుతోంది ఆలియా. ఆ స్నేహితురాలి పేరు రవుయా. తనను మర్చిపోలేకపోతోంది. కలిసి ఆడుకునేవారు. కలిసి స్కూలుకు వెళ్లేవారు. కొన్ని పావురాలు ఉండేవి. వాటిల్లో కొన్ని గుడ్లు కూడా పెట్టాయి. ఆ పావురాలకు ఆలియా గింజలు వేసేది. ఇప్పుడు వాటన్నిటినీ తలుచుకుని బెంగపడుతోంది. వాటి గురించి దేవుణ్ణి ప్రార్థిస్తోంది. వాటి గురించే కాదు, ఆ రోజు తాతయ్య భుజం మీద నుంచి చూసిన మృతదేహాల గురించి కూడా! ఇప్పుడు తెలుస్తోంది ఆలియాకు అలñ ప్పోలో తనకు రెండు స్వర్గాలు ఉండేవని. శరణార్థులకు అందే సహాయం ఆలియా కుటుంబానికి కూడా అందుతోంది. మంచి తిండి ఉంది. మంచి బట్టలు ఉన్నాయి. మంచి స్వర్గమే లేదు. ఆలియా ఓ పిల్లి పిల్లను పెంచుకుంటోంది. అదెప్పుడూ ఆలియా ఒంటి మీదే ఉంటుంది. ఆ పిల్లితో ఆలియా ఎప్పుడూ అంటుండే మాట.. ‘అలా మ్యామ్ మ్యావ్ మంటూ అరవకు. త్వరలోనే మన ఇంటికి మనం వెళ్లిపోతాం’ అని! ఈ రోజు ‘ప్రపంచ శరణార్థుల దినం’. ప్రపంచం మొత్తం మీద రెండు కోట్ల ఇరవై లక్షల మంది శరణార్థులు ఉన్నారు. ఆలియాకు ఉన్నట్లే.. రెండు కోట్ల ఇరవై లక్షల కథలున్నాయి. – మాధవ్ శింగరాజు -
రోహింగ్యాలకు మయన్మార్ పిలుపు
కాక్స్ బజార్ : మయన్మార్ నుంచి ఇతర దేశాలకు వలస వెళ్లిన ఏడు లక్షల రోహింగ్యా ముస్లింలు తిరిగి స్వచ్ఛందంగా మయన్మార్ రావచ్చని ఈ దేశ జాతీయ భద్రత సలహాదారుడు థాంగ్ తన్ తెలిపారు. సింగపూర్లో జరుగుతున్న ప్రాంతీయ భద్రతాదళ సమావేశంలో థాంగ్ మాట్లాడుతూ.. ‘రోహింగ్యా ముస్లింలు స్వచ్ఛందంగా మయన్మార్ తిరిగి రావచ్చు. వారు మేం వస్తున్నాం అంటే మా దేశం వారికి స్వాగతం పలుకుతుంది. ఐక్యరాజ్యసమితి బాధ్యతలను కాపాడటానికి రఖైన్ రాష్ట్రంలో నివసిస్తున్న రోహింగ్యా ముస్లింలను తమ దేశానికి ఆహ్మానించాల్సిన అవసర ఉందని’ ఆయన పేర్కొన్నారు. 2017 నుంచి మయన్మార్లో నివసిస్తున్న రోహింగ్యా ముస్లింలను ఆ దేశ సైన్యం చిత్రహింసలకు గురిచేసిన విషయం తెలిసిందే. సైన్యం నుంచి తప్పించుకుని పారిపోయిన రోహింగ్యాలు ఎక్కువగా బంగ్లాదేశ్లో ఆశ్రయం పొందారు. బంగ్లాదేశ్లో ఆశ్రయం పొందుతున్న రోహింగ్యాలను మయన్మార్ రావటానికి వీలుగా యూఎన్ఓ రూపొందించిన అవగాహన పత్రంపై థాంగ్ తన్ సంతకం చేశారు. -
సరిహద్దుల్లో శరణార్థులు !
ఉన్న ఊరు పొమ్మంటోంది. నిలువ నీడ లేకుండా చేస్తోంది. చీటికి మాటికి ఎన్నికలతో నెలకొన్న రాజకీయ అనిశ్చితి, గంటకో హత్యతో వీధుల్లో నెత్తుటి ఏళ్లు, ఎటు చూసినా హింసాత్మక వాతావరణం, కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న గృహహింసతో వాళ్లంతా పొట్ట చేత పట్టుకొని అమెరికాకు బయల్దేరారు. మధ్య అమెరికాలోని హోండరస్, ఎల్ సల్వాడర్ వంటి దేశాల నుంచి మార్చి 25న 400 మంది వలసదారులు మూటముల్లె సర్దుకొని పిల్లా పాపలతో బతుకు తెరువు వెతుక్కుంటూ ప్రయాణం మొదలు పెట్టారు. నెల రోజుల పాటు ఎన్నో వ్యయప్రయాసల కోర్చి కొంత దూరం కాలినడకన, మరికొంతదూరం వాహనాల్లో ఎలాగైతేనేం అమెరికా, మెక్సికో సరిహద్దులకి చేరుకున్నారు. ఒక స్వచ్ఛంద సంస్థ వీరికి సహకారం అందించడమే కాదు, అమెరికాలో ఆశ్రయానికి చట్టపరంగానే అనుమతులు కోరింది. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యాక మారిన పరిస్థితులతో వాళ్లని సరిహద్దుల్లోనే అధికారులు నిలిపివేశారు. ఒక్క వంతెన దాటితే చాలు, వాళ్లకి నిశ్చింతగా ఆశ్రయం దొరికి ఉండేది, కానీ అమెరికా అధికారులు వాళ్లపై పిడుగులాంటి వార్త పడేశారు. ఇప్పటికే పరిమితికి మించి శరణార్థుల్ని దేశంలోకి అనుమతినిచ్చామని, కొత్త వాళ్లకి ఇక ప్రవేశం కష్టమేనని అధికారులు తేల్చేశారు. అలా ఆశ్రయం కోరి వచ్చిన వారిలో మహిళలు, చిన్నారులే ఎక్కువ మంది ఉండడంతో వారంతా దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారు. చిన్న పిల్లలతో ఎక్కడికి వెళ్లాలో తెలీక, ఎవరి దగ్గర తలదాచుకోవాలో అర్థం కాక ఆ వంతెన దగ్గరే పడిగాపులు కాస్తున్నారు. రోడ్ల మీదే నిద్రపోతున్నారు. అమెరికా ఆశ్రయం ఇచ్చేవరకు తాము ఈ ప్రాంతం నుంచి కదిలేది లేదని తేల్చి చెప్పేశారు. శరణార్థులపై ట్రంప్ కఠిన వైఖరి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కాక ముందు నుంచే మెక్సికో నుంచి వచ్చే వలసలపై కన్నెర్ర చేస్తూనే ఉన్నారు. వారంతా రేపిస్టులు అని, సరిహద్దుల్లో గోడ కట్టేస్తానంటూ తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆశ్రయం కోరి వచ్చిన వారిపై కఠిన వైఖరినే అవలంబిస్తున్నారు. మధ్య అమెరికా దేశాల నుంచి శరణార్థుల ప్రయాణం ప్రారంభమైన దగ్గర్నుంచే ట్రంప్ ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. దేశ భద్రతను దెబ్బతీయడానికే స్మగ్లర్లు, నేరచరిత్ర ఉన్నవారే తమ తమ దేశంలోకి చొచ్చుకు వస్తున్నారని, వారి నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలంటూ హోమ్ల్యాండ్ సెక్యూరిటీకి ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి శరణార్థులకు ఎక్కువగా ఆశ్రయం ఇస్తున్న దేశం అమెరికాయే. అమెరికా చట్టాల ప్రకారం విదేశీయులు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్, అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ ద్వారా ఆశ్రయం కోరవచ్చు. వారు శరణార్థుల గత చరిత్రని పరిశీలించాక అనుమతిలిస్తున్నాయి. తర్వాత తర్వాత నెమ్మదిగా వారు అమెరికా పౌరసత్వాన్ని కూడా పొందుతున్నారు. గత ఏడాది ఆఖరి మూడు నెలల్లోనే 30 వేల మంది శరణార్థులు తమకు ఆశ్రయం కావాలంటూ దరఖాస్తు చేసుకోగా వారిలో 20 వేల మంది వరకు అక్రమంగానే దేశంలోకి ప్రవేశించారు. ఇలా ఒక ప్రవాహంలా వస్తున్న శరణార్థులపై అమెరికా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. దుర్భరమైన పరిస్థితుల్ని తప్పించుకోవడానికో, బతుకు తెరువు కోసమో కాకుండా మంచి ఉద్యోగాలు చేసి లగ్జరీ లైఫ్ కోసమే వారంతా వస్తున్నారని, అలాంటి వారికి ఎందుకు ఆశ్రయం ఇవ్వాలంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తల్లీ బిడ్డల్ని వేరు చేస్తున్నారు శరణార్థుల్ని భయభ్రాంతులకి లోను చేస్తే అమెరికా వైపు కూడా కన్నెత్తి కూడా చూడరని ట్రంప్ ప్రభుత్వం రకరకాల వ్యూహాలను అమలు చేస్తోంది. సరిహద్దుల్లోనే తల్లిదండ్రుల నుంచి వారి బిడ్డల్ని వేరు చేస్తోంది. ఆ బిడ్డలు ఎంత పసివాళ్లు అన్నది కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. పత్రాలు లేవనో, మరేదో సాకు చూపించి పసిగుడ్డుల్ని కూడా బలవంతంగా తల్లిదండ్రుల నుంచి లాక్కొని హోమ్స్కి తరలిస్తున్నారు. గత ఏడాది హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శిగా పని చేసిన జాన్ ఎఫ్ కెల్లీ తొలిసారిగా ఈ వ్యూహాన్ని అమలు చేశారు. అక్రమ వలసల్ని అడ్డుకోవాలంటూ వైట్ హౌస్ నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేకే తాము ఇలాంటి చర్యలకు దిగుతున్నామంటూ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ సమర్థించుకుంటోంది. గత కొన్ని నెలల్లోనే వందల సంఖ్యలో పిల్లల్ని తల్లిదండ్రుల నుంచి వేరుచేశారు. వలసదారుల్ని అడ్డుకోవడానికి ఇలా బిడ్డల్ని వేరు చేస్తే, ఆ చిన్నారులపై మానసికంగా ఎలాంటి ప్రభావం చూపిస్తోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
అక్రమ గుర్తింపు కార్డులు: బర్మా శరణార్థుల అరెస్ట్
సాక్షి, పహాడీషరీఫ్: భారత పౌరసత్వానికి సంబంధించి అక్రమంగా గుర్తింపు కార్డులు కలిగి ఉన్న తొమ్మిది మంది బర్మా శరణార్థులను బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి శనివారం రిమాండ్కు తరలించారు. ఎస్సై మక్బూల్ జానీ వివరాల ప్రకారం.. బర్మా దేశానికి చెందిన మహ్మద్ నూర్ అలియాస్ నూర్ మహ్మద్(52) తన కుటుంబంతో 2013లో బాలాపూర్ అల్ జాబ్రీ కాలనీకి వచ్చి నివాసం ఉంటున్నాడు. ఇటీవల ఇతడు దళారులను ఆశ్రయించి ఓటర్ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, పాస్పోర్టు, పాన్ కార్డులను సంపాదించాడు. సమాచారం అందుకున్న బాలాపూర్ పోలీసులు దాడులు చేసి నూర్ మహ్మద్తో పాటు భార్య షాన్జిద్దా(45), పిల్లలు మహ్మద్ జావెద్(22), నౌరీ అమీన్(17), ఫౌజియా(17), ఫయాజుల్ హసన్(13), నజిముల్ హసన్ను అరెస్ట్ చేశారు. వీరితో పాటు ఇదే కాలనీలో అక్రమంగా గుర్తింపు కార్డులు పొందిన మహ్మద్ హాశీం(17), అస్మా బేగం(22)లను కూడా అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి తొమ్మిది ఆధార్ కార్డులు, రెండు పాస్పోర్టులు, రెండు ఓటర్ గుర్తింపు కార్డులు, రెండు పాన్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. -
లిబియాలో శరణార్థులు గల్లంతు!
పారిస్: లిబియా నుంచి యూరోప్కు అక్రమ వలసదారులతో వెళ్తున్న ఓ పడవ మధ్యధరా సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 90 మంది శరణార్థులు గల్లంతైనట్లు సమాచారం. గల్లంతైన వారిలో 10 మంది మృతదేహాలు లిబియా తీర పట్టణమైన జవారా ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. వీరిలో 8 మంది పాకిస్తానీయులు, ఇద్దరు లిబియాకు చెందిన వారు ఉన్నట్లు భావిస్తున్నారు. పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కటం వల్లే పడవ మునిగిపోయిందని ప్రాథమికంగా నిర్ధారించినట్లు అంతర్జాతీయ వలస సంస్థకు చెందిన ప్రతినిధి ఒలివియా హెడన్ తెలిపారు. గల్లంతైన వారిలో ఎక్కువ మంది పాక్కు చెందిన వారే ఉన్నారని ఆమె పేర్కొన్నారు. -
మంచు తుపాను : గడ్డకట్టుకుపోయి ప్రాణాలు వదిలారు
లెబనాన్ : దేశంలో రావణకాష్టంలా రగులుతున్న అంతర్యుద్ధం కోరల నుంచి దూరంగా వెళ్లి బ్రతకాలనుకున్న సిరియా శరణార్ధులపై ప్రకృతి కన్నెర్రజేసింది. సిరియాను వదిలి లెబనాన్లో ప్రవేశించాలంటే సరిహద్దులోని పర్వతాలను దాటాల్సివుంటుంది. సరిహద్దును జాగ్రత్తగా దాటేందుకు శరణార్థుల గ్రూపు ఇద్దరు స్మగ్లర్లతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సిరియా నుంచి బయల్దేరిన శరణార్థులు గ్రూపు లెబనాన్ సరిహద్దులోని మన్సా వద్దకు వెళ్లేసరికి పెను మంచు తుపాను ప్రారంభమైంది. దీంతో గ్రూపులోని వారందరూ చెల్లాచెదురయ్యారు. కొందరు మంచు తుపాను ధాటికి గడ్డకట్టుకుపోయి సజీవ సమాధి అయ్యారు. మృతుల్లో పసిపిల్లలు కూడా ఉండటం మరింత బాధాకరం. ఘటనపై సమాచారం అందుకున్న లెబనీస్ పౌర రక్షణ అధికారులు శనివారం మంచులో కూరుకుపోయిన 15 మంది శరణార్థుల మృతదేహాలను వెలికి తీశారు. శరణార్థులను ప్రమాదంలో వదిలేసిన ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. 2011లో సిరియా అంతర్యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకూ 10 లక్షల మంది సిరియన్లు లెబనాన్కు వలస వెళ్లారు. 2015లో దేశంలో ప్రవేశించే శరణార్థులపై లెబనాన్ ఆంక్షలు విధించింది. -
ఇక కఠిన పరీక్షలు తప్పవా?
సాక్షి, వాషింగ్టన్ : ట్రావెల్ బ్యాన్ విషయంలో ఫెడరల్ కోర్టు తీర్పుతో భంగపడ్డ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో నిర్ణయానికి సిద్ధమయ్యారు. శరణార్థులను విషయంలో మరిన్ని కఠిన ఆంక్షలు విధించేందుకు ప్రణాళికలు రచించారు. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వారిని తమ దేశంలోకి అనుమతించాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రభావంతో మహిళలు, పిల్లలపైనే ఎక్కువ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. శరణార్థు ముప్పు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని వారి భద్రతను పలుస్థాయిలో దఫాలుగా పరిశీలించి తమ దేశంలోకి అనుమతిస్తుంది. ఈ క్రమంలో బయోగ్రఫిక్, బయోమెట్రిక్ డేటా ద్వారా శరణార్థులు డేటాను పరిశీలిస్తారు. ఇంటెలిజెన్స్ డేటా బేస్లో ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇంతకాలం మహిళలు, పిల్లల విషయంలో నిబంధనల సడలింపు ఉన్నప్పటికీ.. ఇకపై ఊపేక్షించాల్సిన అవసరం లేదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయంట. సెక్యూరిటీ స్కీనింగ్ విషయంలో పురుషులను మాత్రమే అన్ని విధాలుగా పరిశీలించి పంపేవారు. కొత్త నిబంధనల కారణంగా ఇకపై వారిని క్షణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎదైనా తప్పులు దొర్లితే మాత్రం వారిని అనుమతించరన్న మాట. ఇక ఈ అంశంపై స్పందించేందుకు వైట్హౌజ్ ప్రతినిధులు నిరాకరించగా.. ఇది కేవలం 120 రోజులకు సంబంధించిన సమీక్షేనంటూ ఓ అధికారి చెబుతున్నారు. ఇక 2016 నుంచి మొత్తం 85,000 మంది శరణార్థులు అమెరికాలో తలదాచుకుంటుండగా.. వీరిలో 72 శాతం మహిళలు, పిల్లలే ఉన్నారు. గత ప్రభుత్వాలు పురుషులతోనే(ఉగ్రవాద సంస్థల్లో చేరే అవకాశం) ఎక్కువ ముప్పు ఉందని భావించింది. కానీ, ట్రంప్ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో వారికి సమస్యలు తప్పేలా కనిపించటం లేదు. ఇదిలా ఉంటే శరణార్థులను కట్టడి చేయటంలో ట్రంప్ సఫలం అవుతున్నాడనే చెప్పొచ్చు. గతంలో ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఏడాదికి 1.10,000 శరణార్థులు అమెరికాలో అడుగుపెట్టగా.. ట్రంప్ అధికారంలోకి వచ్చిన ఈ పది నెలల కాలంలో కేవలం 50,000 మందిని మాత్రమే అనుమతించారు. ఇక వచ్చే ఏడాదికి ఆ సంఖ్యన మరో 5 వేలకు తగ్గించాలన్నది ట్రంప్ ఆలోచనగా కనిపిస్తోంది. -
పడవ మునక.. 40 మంది గల్లంతు
పోర్ట్ ఔ ప్రిన్స్(హైతీ): వలసదారులతో వెళ్తున్న పడవ మునిగిపోయిన ఘటనలో 40 మంది గల్లంతయ్యారు. హైతీ ఉత్తర తీరంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఏడుగురిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 50 మందితో లాటోర్ట్యూ దీవి నుంచి బ్రిటన్ ఆధీనంలోని ప్రొవిడెన్సియల్స్ దీవివైపు బయలుదేరిన పడవ ఆదివారం మునిగిపోయింది. సమాచారం అందుకున్న తీరరక్షక దళం సిబ్బంది ఏడుగురిని కాపాడి ఆస్పత్రికి తరలించారు. మిగతా వారి జాడ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. వీరంతా హైతీ నుంచి సమీపంలోని బ్రెజిల్, చిలీ, బహమాస్ దేశాలకు వలస వెళ్తున్నారు. పేదరికం కారణంగా హైతీలో ప్రజలు వలసబాట పడుతున్నారు. -
అమెరికా ‘శరణార్థుల’ కోత
వాషింగ్టన్: వచ్చే ఏడాదికి తమ దేశంలోకి అనుమతించే శరణార్థుల సంఖ్యలో భారీగా కోతపెట్టాలని అమెరికా నిర్ణయించింది. కేవలం 45 వేల మందిని మాత్రమే శరణార్థులుగా అనుమతించాలని అమెరికా హోం ల్యాండ్ భద్రత అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 2016లో అనుమతించిన శరణార్థుల సంఖ్యలో ఇది దాదాపు సగం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయగానే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ ఈ విషయాన్ని అమెరికన్ కాంగ్రెస్కు అధికారికంగా వెల్లడించనున్నారు. తాజా ప్రతిపాదన మేరకు అక్టోబర్ నుంచి అమల్లోకి రానున్న 2018 ఆర్థిక సంవత్సరంలో ఆఫ్రికా నుంచి 19 వేలు, తూర్పు ఆసియా నుంచి 5 వేలు, యూరప్, మధ్య ఆసియా నుంచి 2 వేలు, లాటిన్ అమెరికా, కరీబియన్ దీవుల నుంచి 1500, ఎన్ఈఎస్ఏ (నియర్ ఈస్ట్ సౌత్ ఏసియా) దేశాల నుంచి 17 వేల మందిని అనుమతిస్తారు. ప్రతిపాదన వివరాల్ని అమెరికా అధికారి వెల్లడిస్తూ.. ‘వచ్చే ఏడాది శరణార్థుల సంఖ్యను తగ్గిస్తున్నాం. అలాగే కొత్తగా వచ్చేవారి తనిఖీల అంశంపై వచ్చే నెల్లో సమీక్ష పూర్తయ్యేలా ప్రణాళిక సిద్ధం చేశాం’ అని పేర్కొన్నారు. అమెరికా ప్రజల భద్రతే తమకు ముఖ్యమని, ఆ దిశగానే ఈ నిర్ణయమని ఆయన చెప్పారు. మానవతా సాయంలో అమెరికా ఇప్పటికీ ప్రపంచంలో ముందు వరుసలో ఉందని, గతేడాది రూ. 44,800 కోట్లకు పైగా సాయం చేసిందని ఆ అధికారి వెల్లడించారు. 2017లో సిరియాకు రూ. 9 వేల కోట్ల మానవతా సాయం అందించామని తెలిపారు. అయితే అమెరికా నిర్ణయాన్ని ఆ దేశ కాంగ్రెస్ చట్ట సభ్యులు, మానవ హక్కుల కార్యకర్తలు తప్పుపట్టారు. ‘శరణార్థుల సంఖ్యపై 45 వేల పరిమితి ఆమోదయోగ్యం కాదు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న మానవతా సంక్షోభం నేపథ్యంలో ఇలా పరిమితి విధించడం ఏమాత్రం సరికాదు’ అని సెనేటర్ డియన్నె ఫెయిన్స్టెన్ అన్నారు. ఈ నిర్ణయం అమానవీయమని మరో సెనేటర్ టామ్ కార్పర్ పేర్కొన్నారు. 2016లో 85 వేల శరణార్థులు: 2016లో 84,995 మంది శరణార్థులకు అమెరికా ఆశ్రయమివ్వగా.. ఈ ఏడాది ఆ సంఖ్యను 50 వేలకు తగ్గించారు. నిజానికి ప్రపంచంలో ఎక్కువమంది శరణార్థులకు ఆశ్రయమిస్తున్న దేశం అమెరికానే.. 1980లో 2 లక్షలకు పైగా శరణార్థులు అమెరికాలో అడుగుపెట్టారు. 1975 నుంచి ఇప్పటివరకూ 30 లక్షలకు పైగా శరణార్థులకు అమెరికా ఆహ్వానం పలికింది. కాగా ఐక్యరాజ్యసమితిలో శరణార్థుల హైకమిషనర్ లెక్క మేరకు ప్రపంచవ్యాప్తంగా 2.25 కోట్ల మంది శరణార్థులు ఉండగా.. 6.56 కోట్ల మంది నిర్వాసితులుగా మారారు. కొత్త పన్ను విధానాలు: ట్రంప్ కొత్త పన్ను విధానాల్ని ప్రతిపాదించారు. మధ్య తరగతి ప్రజలే లక్ష్యంగా ప్రస్తుతమున్న పన్ను శ్లాబుల్ని మూడు(10, 25, 35)కు తగ్గించాలని ప్రతిపాదించారు. పన్ను మినహాయింపుల్ని కూడా రెండింతలు చేయాలని, బిజినెస్ పన్ను రేటును 15 శాతానికి తగ్గించాలనీ సూచించారు. ఈ ప్రతిపాదనల్ని అమెరికన్ కాంగ్రెస్ ఆమోదిస్తేనే అమల్లోకి వస్తాయి. ఏ దేశం నుంచి ఎంతమందికి అనుమతి ఆఫ్రికా 19,000 తూర్పు ఆసియా 5,000 యూరప్, మధ్య ఆసియా 2,000 లాటిన్ అమెరికా, కరీబియన్ దీవులు 1,500 నియర్ ఈస్ట్ సౌత్ ఏసియా దేశాలు 17,000 ట్రంప్ వ్యాఖ్యల్ని తోసిపుచ్చిన జుకర్బర్గ్ ఫేస్బుక్ ట్రంప్ వ్యతిరేకమని అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యల్ని ఆ సంస్థ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ తోసిపుచ్చారు. ప్రతి రోజూ ప్రజల్ని ఏకం చేసేందుకు ఫేస్బుక్ కృషిచేస్తుందని, ప్రజల ఆలోచనలకు ఫేస్బుక్ వేదికని ఆయన పేర్కొన్నారు. 2016 అమెరికా ఎన్నికల సమయంలో తటస్థంగా ఉండేందుకే ఫేస్బుక్ ప్రయత్నించిందని జుకర్బర్గ్ గుర్తుచేశారు. -
‘180 మందిని సముద్రంలోకి తోసేశారు’
దుబాయ్: యెమెన్ సమీపంలో గురువారం దారుణం చోటుచేసుకుంది. స్థానిక అధికారులు అరెస్టు చేస్తారన్న భయంతో స్మగ్లర్లు అక్రమంగా యెమెన్కు తరలిస్తున్న 180 మంది ఆఫ్రికన్లను సముద్రంలోకి తోసేయడంతో ఆరుగురు మృతి చెందగా..దాదాపు 50 మంది గల్లంతయ్యారు. ప్రస్తుతం గాయాలతో యెమెన్ దక్షిణ తీరానికి చేరుకున్న 25 మంది శరణార్థులకు చికిత్స అందిస్తున్నట్లు ఐరాస అంతర్జాతీయ వలస వ్యవహారాల సంస్థ(ఐఓఎం) తెలిపింది. శరణార్థుల్లో ఇథియోపియోకు చెందిన యువతీయువకులే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. బుధవారం కూడా మనుషులను అక్రమరవాణా చేస్తున్న స్మగ్లర్లు యెమెన్ తీరం సమీపంలో సోమాలియా,ఇథియోపియాకు చెందిన 120 మంది శరణార్థులను సముద్రంలోకి తోసేయడంతో 50 మంది మృతి చెందగా, 22 మంది గల్లంతయ్యారని ఐఓఎం పేర్కొంది. తీరానికి కొట్టుకువచ్చిన 29 మృతదేహాలను మిగిలిన శరణార్థులు పూడ్చిపెట్టారని వెల్లడించింది. -
శరణార్థులపై ట్రంప్ మరో పిడుగు
-
శరణార్థులపై ట్రంప్ మరో పిడుగు
► వీసాల జారీపై అగ్రరాజ్యం ఆంక్షలు ► రక్తసంబంధీకులు అమెరికాలో ఉంటేనే వీసా ► 6 దేశాల పౌరులకు మరిన్ని కష్టాలు వాషింగ్టన్: ఉగ్రవాద బాధిత దేశాల నుంచి అమెరికా వచ్చే శరణార్థులపై తాత్కాలిక నిషేధానికి (ట్రావెల్ బ్యాన్) అమెరికా అత్యున్నత న్యాయస్థానం ఓకే చెప్పిన అనంతరం అగ్రరాజ్యం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు ముస్లిం దేశాల కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త వీసా నిబంధనలు తీసుకొచ్చారు. అమెరికాలోని వ్యాపారాలు లేదా కుటుంబాలతో సంబంధం ఉన్న శరణార్థులందర్ని, ముఖ్యంగా ఆరు ముస్లిం దేశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనలు తీసుకొచ్చినట్టు ట్రంప్ కార్యాలయం బుధవారం పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం ఇప్పటికే జారీచేసిన వీసాలు యథాతథంగా కొనసాగుతాయి. అయితే ఉగ్రవాదం అధికంగా ఉన్న సిరియా, సుడాన్, సోమాలియా, లిబియా, ఇరాన్, యెమెన్ దేశాల నుంచి వీసాలకు దరఖాస్తు చేసుకునేవారికి మాత్రం ఆంక్షలు ఉంటాయి. ఇప్పటికే వారికి అమెరికాలో తల్లిదండ్రులు, పిల్లలు, భాగస్వామి, అల్లుడు, కోడలు, తోబుట్టువులు ఉన్నారని నిరూపించుకుంటేనే వీసా జారీ చేస్తారు. అంతేగాక అన్ని దేశాల శరణార్థులకు ఇవి వర్తిస్తాయని, కొన్ని సడలింపులతో వీటిని తీసుకొచ్చినట్టు వెల్లడించింది. తాతలు, మునిమనవళ్లు, కాబోయే భర్తలు, అత్త, మామ, కజిన్స్ వంటి ఇతర కుటుంబ సభ్యుల విషయంలో సన్నిహిత సంబంధాలను పరిగణనలోకి తీసుకోమని హోంశాఖ విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ కొత్త నిబంధనలు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. అమెరికాలోని అన్ని శాఖలకు వీటిని పంపించారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారస్తులు/నిపుణులకు అమెరికాతో సంబంధాలున్నాయని, వాటన్నింటిన్నీ పరిగణనలోకి తీసుకొని ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్టు హోంశాఖ పేర్కొంది. జర్నలిస్టులు, విద్యార్థులు, వర్కర్లు, లెక్చరర్లు తగిన ఆహ్వానంతో వస్తే వీసా ఇస్తారు. ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్ ఉన్నవారిని కూడా ట్రావెల్ బ్యాన్ నుంచి వారిని మినహాయిస్తారు. ఆరు ముస్లిం దేశాల శరణార్థుల రాకపై నిషేధం విధిస్తూ గతంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ విషయం కోర్టుల వరకు వెళ్లింది. ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులపై కింది కోర్టులు అభ్యంతరం చెప్పగా, సుప్రీంకోర్టు మాత్రం ఆమోదం తెలిపింది. హెచ్1బీ వీసాదారుల జీతాలు పెంచండి వాషింగ్టన్: హెచ్1బీ వీసాలపై అమెరికా వచ్చిన ఐటీ నిపుణుల కనీస వేతనాలను 60 వేల నుంచి 80 (దాదాపు 3.88 లక్షలు) వేల డాలర్లకు పెంచాలని ఈ దేశ కార్మికశాఖ కార్యదర్శి అలెగ్జాండర్ అకోస్టా భారత ఐటీ కంపెనీలకు సూచించారు. అమెరికా ఉద్యోగుల స్థానంలో హెచ్1బీ వీసాదారులను నియమించడాన్ని అడ్డుకుంటామని ఆయన పార్లమెంటరీ కమిటీకి తెలిపారు. కనీస వేతనాలను పెంచి ఉంటే సమస్య చాలా వరకు పరిష్కారమయ్యేదని అన్నారు. ఈ విషయంలో పార్లమెంటు చొరవ తీసుకోవాలని అకోస్టా కోరారు. ఈ విషయమై ఆయన ఒక ఉదాహరణ చెబుతూ షికాగో కేంద్రంగా నడిచే ఫార్మా కంపెనీ 150 మంది స్వదేశీ ఉద్యోగులను తొలగించి, హెచ్1బీ వీసాదారులను నియమించుకుందన్నారు. కొత్త ఉద్యోగులకు కూడా పాతవాళ్లే శిక్షణ ఇచ్చారని విమర్శించారు. -
ఆరు ముస్లిం దేశాలకు అమెరికా కొత్త రూల్స్
వాషింగ్టన్ : ట్రావెల్ బ్యాన్కు అమెరికా అత్యున్నత న్యాయస్థానం ఓకే చెప్పిన అనంతరం ఆరు ముస్లిం దేశాల కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త వీసా నిబంధనలు తీసుకొచ్చారు. అమెరికాలోని వ్యాపారాలు లేదా కుటుంబాలతో సంబంధమున్న శరణార్థులందర్ని, ముఖ్యంగా ఆ ఆరు ముస్లిం దేశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనలు తీసుకొచ్చినట్టు ట్రంప్ కార్యాలయం బుధవారం పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం ఇప్పటికే జారీచేసిన వీసాలు రద్దు చేయబడవని స్టేట్ డిపార్ట్మెంట్ పేర్కొంది. కానీ సిరియా, సుడాన్, సోమాలియా, లిబియా, ఇరాన్, యెమెన్ ప్రాంతాల నుంచి అప్లయ్ చేసుకునే కొత్త వీసాదారులకు మాత్రం ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. వారు కచ్చితంగా ఇప్పటికే అమెరికాలో ఉన్న తల్లిదండ్రులతో, పిల్లలతో, భాగస్వామితో, అల్లుడు, కోడలు లేదా ఇతర తోబుట్టువులతో ఉన్న సంబంధాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుందని స్టేట్ డిపార్ట్మెంట్ పేర్కొంది. అంతేకాక అన్ని దేశాల శరణార్థులకు ఇవి వర్తిస్తాయని, కొన్ని సడలింపులతో వీటిని తీసుకొచ్చినట్టు వెల్లడించింది. తాతలు, మునిమనవళ్లు, సోదరుడు, సోదరీమణులు, కాబోయే భర్తలు,ఆంటీ, అంకుల్స్, కజిన్స్ వంటి ఇతర కుటుంబ సభ్యుల విషయంలో సన్నిహిత సంబంధాలను పరిగణలోకి తీసుకోమని స్టేట్ డిపార్ట్మెంట్ తన గైడ్ లైన్సులో పేర్కొంది. ఈ కొత్త నిబంధనలు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. అమెరికాలోని అన్ని డిపార్ట్మెంట్లకు వీటిని పంపించడం జరిగింది. వ్యాపారస్తులకు లేదా నిపుణులకు అమెరికాతో సంబంధాలున్నాయని, వాటన్నింటిన్నీ పరిగణలోకి తీసుకొని ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్టు స్టేట్ డిపార్ట్మెంట్ పేర్కొంది. జర్నలిస్టులు, విద్యార్థులు, వర్కర్లు, లెక్చరర్లు సరియైన ఆహ్వానంతో వస్తే, లేదా ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్తో అమెరికాను సందర్శించాల్సి వస్తే, ట్రావెల్ బ్యాన్ నుంచి వారిని మినహాయిస్తున్నట్టు వెల్లడించింది. వ్యాపారాలు లేదా నిపుణులకు ఉన్న సంబంధాలను పరిగణలోకి తీసుకొని, వారు ట్రావెల్ బ్యాన్ నుంచి తప్పించుకోవడానికి చట్టబద్ధమైన సంబంధాన్ని అధికారికంగా, డాక్యుమెంట్ రూపంలో నిరూపించుకోవాలని స్టేట్ డిపార్ట్మెంట్ పేర్కొంది. జర్నలిస్టులు, విద్యార్థులు, వర్కర్లు, లెక్చరర్లు సరియైన ఆహ్వానంతో వస్తే, లేదా ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్తో అమెరికాను సందర్శించాల్సి వస్తే, ట్రావెల్ బ్యాన్ నుంచి వారిని మినహాయిస్తున్నట్టు వెల్లడించింది. అయితే ఈ మినహాయింపు కావాలని నిబంధనలు తప్పించుకోవాలనుకుని, అమెరికన్ వ్యాపారాలతో లేదా విద్యాసంస్థలతో సంబంధాలు కోరుకునే వారికి వర్తించవని తేల్చిచెప్పింది. డొనాల్డ్ ట్రంప్ గతంలో జారీచేసిన ఆరు ముస్లిం దేశాలపై తాత్కాలిక ట్రావెల్ బ్యాన్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ విషయం కోర్టుల వరకు వెళ్లింది. ట్రంప్ జారీచేసిన ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై కింద కోర్టులు అభ్యంతరం చెప్పగా, సుప్రీంకోర్టు మాత్రం ఓకే చెప్పింది. -
అధినేతలే శరణార్థులైతే!!
దేశాధినేతలు అందునా అగ్రరాజ్యాల అధినేతలు అధికార దర్పం ప్రదర్శించడంలో ఏమాత్రం వెనక్కుతగ్గరు. అడుగు తీసి అడుగు వేస్తే అంగరక్షకులు, వందిమాగధులు, అనుచరగణాల మధ్య రాచఠీవి ఒలకబోస్తుంటారు. కానీ.. అభాగ్యులు, అన్నార్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పిల్లాపాపలతో శరణార్థులై వస్తుంటే వారికి ఆశ్రయం ఇవ్వడంపై సిద్ధాంత చర్చలతో రాద్ధాంతం చేస్తుంటారు. ఈలోగా ఆ అభాగ్యులు ఎందరో మధ్యధరా సముద్రంలోనో, మధ్యవర్తుల అకృత్యాలకో బలైపోతున్నారు. ముఖ్యంగా సిరియా శరణార్థుల దైన్యం మాటలలో చెప్పలేనిది. ఆ సిరియాకు చెందిన అబ్దల్లా అల్ఒమారి అనే చిత్రకారుడు ప్రపంచ దేశాల అధినేతల మీద తన నిరసనను తన చిత్రాల ద్వారా చూపించారు. 'మీరు కూడా మనుషులే... మీరు కూడా అభాగ్యులు కాగలరు.. మీరు శరణార్థులైతే ఎలా ఉంటారో చూడండి...' అంటూ వారి చిత్రపటాలు గీశారు. అధికారం అందించే రాజలాంఛనాలలో అనునిత్యం తేలియాడే ఆ నాయకుల చిత్రాలను.. జన్మభూమిని విడనాడి సర్వస్వం కోల్పోయి చెల్లాచెదురైన కుటుంబ సభ్యుల కోసం వెదుకులాడుతూ, తలదాచుకునేందుకు కాస్త చోటు కోసం అల్లాడుతూ, ఆకలి తీర్చుకోవడానికి పిడికెడు మెతుకుల కోసం బారులు తీరే దీనుల రూపంలో గీసి చూపించాడు. ఈ చిత్రాలు సామాజిక మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ఒబామా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్, బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్, జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఉత్తర కొరియా పాలకుడు కిమ్జాంగ్ ఉన్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహని, హిజ్బుల్లా సెక్రటరీ జనరల్ హసన్ నస్రల్లా, టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్సిసి, ఫ్రాన్స్ మాజీ అధ్యక్షులు నికొలస్ సర్కోజీ, ఫ్రాంకోయ్ హోలాండ్ తదితరులను శరణార్థులుగా చిత్రించారు. ప్రస్తుతం బెల్జియంలోని బ్రసెల్స్ లో నివసిస్తున్న అబ్దల్లా 'వల్నరబిలిటీ సిరీస్' పేరుతో గీసిన ఈ చిత్రాల్లో.. ముఖ్యంగా ఒక చంటిపాపను భుజాన ఎత్తుకుని, ఆచూకీ లేని తన కుటుంబ సభ్యుల ఫొటోను చేతిలో చూపిస్తూ దీనంగా కనిపిస్తున్న ట్రంప్ చిత్రం, 'నాకు సాయం చేయండి' అని రాసిన కాగితాన్ని ప్రదర్శిస్తూ అత్యంత దీనంగా కనిపిస్తున్న పుతిన్ చిత్రం, కాగితం పడవను నెత్తిన పెట్టుకుని నీటిలో నానిపోయిన అసద్ చిత్రంతో పాటు.. అధినేతలందరూ ప్లేట్లు, గిన్నెలె చేతుల్లో పట్టుకుని తిండి కోసం వరుసలో నిల్చున్న చిత్రాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. -సాక్షి నాలెడ్జ్ సెంటర్ ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్సిసి జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ఒబామా సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ ఫ్రాన్స్ మాజీ అధ్యక్షులు నికొలస్ సర్కోజీ ఉత్తర కొరియా పాలకుడు కిమ్జాంగ్ ఉన్ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ఒబామా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తదితరులు -
సిరియాలో చితికిపోతున్న బాల్యం
బీరుట్: అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో చిన్నారులు సమిధలవుతున్నారని యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్(యూనిసెఫ్) తేల్చిచెప్పింది. గతేడాది దాడుల్లో 652 మంది చిన్నారులు చనిపోయారని తెలిపింది. సిరియాలో సంక్షోభం మొదలై ఆరేళ్లు పూర్తైన సందర్భంగా యూనిసెఫ్ ఈ వివరాలను వెల్లడించింది. యుద్ధంలో ప్రభుత్వం, తిరుగుబాటుదారులు స్కూళ్లు, ఆసుపత్రులు, ఆట స్థలాలు, పార్కులపై విచక్షణారహితంగా దాడులు చేస్తున్నారని యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్యుద్ధం వల్ల దాదాపు 17 లక్షల మంది చిన్నారులు చదువుకు దూరమవగా, మరో 23 లక్షల మంది పిల్లలు పశ్చిమాసియాలో శరణార్థులుగా బతుకు వెళ్లదీస్తున్నారని తెలిపింది. -
శరణార్థులకు స్వాగతం!
న్యూయార్క్: అమెరికా ప్రజాస్వామ్యం, స్వాతంత్య్రానికి ప్రతీకగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ వద్ద శరణార్థులకు స్వాగతం అంటూ మంగళవారం ఓ బ్యానర్ వెలిసింది. బ్యానర్ను గమనించిన వెంటనే నేషనల్ పార్క్ రేంజర్స్ దానిని తొలగించారు. అయితే.. అప్పటికే దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించాయి. దేశాధ్యక్షుడు ట్రంప్ వలస వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న నేపథ్యంలో.. కనిపించిన ఈ బ్యానర్పై నెటీజన్లు పాజిటీవ్గా స్పందించారు. ఈ బ్యానర్ను తామే ఏర్పాటు చేశామని ఆల్ట్ లేడీ లిబర్టీ అనే సంస్థ ప్రకటించుకుంది. ఈ మేయిల్ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో.. 'దాదాపు అమెరికన్లందరి పూర్వికులు వేరువేరు ప్రాంతాలకు చెందినవారు. వలసదారులు, శరణార్థులే ఈ దేశాన్ని గొప్పగా మార్చారు. అంతేగానీ వలస వ్యతిరేక విధానాలు ఈ దేశాన్ని గొప్పగా చేయవు. ముస్లింలు, శరణార్థులు, వలసదారులు అందరూ దేశంలోకి ఆహ్వానితులే' అని ఆల్ట్ లేడీ లిబర్టీ గ్రూప్ వెల్లడించింది. అలాగే..దేశాల మధ్య గోడలు, మత ప్రాతిపదికన నిషేధం విధించడం లాంటివి మన విలువలకు వ్యతిరేకం అని ప్రకటనలో పేర్కొన్నారు. -
‘ట్రంప్తో నేను మాట్లాడాను.. ఒప్పుకున్నారు’
కాన్బెర్రా: ఎంతమంది శరణార్థులకు అమెరికా ఆశ్రయం ఇస్తుందనే విషయం, అంగీకరిస్తుందనే సమాచారం ఇప్పుడే తెలియదని ఆస్ట్రేలియా ప్రధాని మాల్కోమ్ టర్న్బుల్ అన్నారు. ప్రస్తుతం పసిఫిక్ ఐలాండ్లోని క్యాంపుల్లో చాలామంది శరణార్థులు ఉన్నారని, వారిలో ట్రంప్ పాలన వర్గం ఎంతమందికి అవకాశం ఇస్తుందని తెలియదన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఈ వారాంతంలో ట్రంప్తో ఫోన్లో మాట్లాడానని, ఒబామా పరిపాలన వర్గం గతంలో శరణార్థులకు ఆశ్రయం ఇచ్చేందుకు అంగీకరించిందని, దానికి కట్టుబడి ఉండాలనే విషయం తాను ట్రంప్తో చెప్పానని, అందుకు ఆయన కూడా ఒప్పుకున్నారని, అయితే, ఎంతమందికనే విషయంలో స్పష్టతనివ్వలేదని చెప్పారు. అక్కడ ఉన్న శరణార్ధుల్లో ముస్లింలే ఎక్కువగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. మరోపక్క, శ్వేత సౌదం అధికార ప్రతినిధి ఈ విషయంపై స్పందిస్తూ దేశంలో ఉన్న శరణార్థులను మరోసారి తనిఖీలు చేస్తామని, కొత్తగా అనుమతిచ్చేవారికి అత్యంత కఠినమైన నిబంధనల మధ్య వెరిఫికేషన్ ఉంటుందని, అమెరికాకు ఉగ్రదాడి నుంచి ముప్పు ఉన్నందునే ఈ పనిచేస్తామని స్పష్టం చేశారు. -
సముద్ర తీరంలో 180 మంది జలసమాధి!
-
180 మంది జలసమాధి!
లిబియాలో సముద్ర తీరంలో ప్రమాదం రోమ్: ఐరోపా దేశాల్లో వలసల బతుకులు అర్ధంతరంగా ముగిసిపోతున్నాయి. మరుభూమిగా మారిన తమ దేశంలో బతుక లేక... మర పడవల్లో పొరుగు దేశాలకు పయనమవుతున్న శరణార్థులు మధ్యధరా సముద్రంలో జలసమాధి అవుతున్నారు. తాజాగా లిబియా నుంచి ఇటలీకి వెళుతున్న శరణార్థుల్లో 180 మంది మధ్యధరా సముద్రంలో గల్లంతయ్యారు. తూర్పు ఆఫ్రికాకు చెందిన వీరంతా మరణించారని భావిస్తున్నారు. ఏడాది ఆరంభంలో ఇది అతిపెద్ద విషాదం. శనివారం లిబియా తీరంలో బయలుదేరిన టూటైర్ పడవ... సముద్రంలో ఐదు గంటలు ప్రయాణించింది. ఆ సమయంలో మోటారు చెడిపోయింది. క్రమంగా పడవలోకి నీళ్లు రావడం మొదలుపెట్టాయి. ఒక్కొక్కరుగా ప్రయాణికులు నీటిలో మునిగిపోయారని ప్రత్యక్ష సాక్షుల కథనం ఆధారంగా అధికారులు తెలిపారు. కాగా, ప్రమాదం నుంచి తప్పించుకున్న 38 మంది వలసదారులు మంగళవారం ట్రపానిలోని సిసిలియాన్ నౌకాశ్రయానికి చేరుకున్నారు. గత ఏడాది వేలాది మంది వలస బాటలో ప్రాణాలు కోల్పోయారు. అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎం), ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ (యూఎన్హెచ్సీఆర్) ప్రతినిధులు, రెస్క్యూ బృందాలు మృతదేహాల కోసం గాలిస్తున్నాయి. 2016లో దాదాపు 1.81 లక్షల మంది శరణార్థులు ఇటలీ తీరానికి చేరినట్టు లెక్కలు చెబుతున్నాయి. -
శరణార్థులకి చోటివ్వని ధనిక దేశాలు
లండన్: ప్రపంచవ్యాప్తంగా సగానికి పైగా శరణార్థులకు కేవలం పది దేశాలు మాత్రమే ఆశ్రయమిస్తున్నాయని అంతర్జాతీయ సంస్థ అమ్నెస్టీ తెలిపింది. చాలా ధనిక దేశాలు శరణార్థులను అక్కున చేర్చుకునేందుకు ముందుకు రావట్లేదని, ఇది సిగ్గుపడాల్సిన విషయమని పేర్కొంది. ఇప్పటికైనా దీని పరిష్కారం కోసం దేశాల అధినేతలంతా చర్చించాలని కోరింది. ప్రతి ఏటా 10 శాతం మంది శరణార్థులకి నివాసం చూపించడం ద్వారా ఈ సమస్యను అధిగమించగలమని అమ్నెస్టీ తెలిపింది. శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి నియమించిన కమిషన్(యూఎన్హెచ్సీఆర్) గణాంకాల ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా 2.1 కోట్ల శరణార్థులుండగా వీరిలో 56 శాతం మంది ఈ పది దేశాల్లోనే ఉన్నారని వెల్లడించింది. శరణార్థులకు ఆశ్రయమిచ్చే దేశాలుగా జోర్డాన్, టర్కీ, పాకిస్తాన్, లెబనా, ఇరాన్, ఇథియోపియా, కెన్యా, ఉగాండా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కోంగో, చాడ్లు ఉన్నాయి. -
శరణార్థులపై కల్పిత భయాలు
ట్రంప్, తదితర రిపబ్లికన్ నేతలు సిరియన్ శరణార్థుల పట్ల అమెరికన్లలో ప్రవేశపెడుతున్న కల్పిత భయాలు ఉగ్రవాదంకంటే ప్రమాదకరంగా మారుతూ, సగటు అమెరికన్ స్పందనను విదేశీయత వైముఖ్యంవైపు నెడుతున్నాయి. ఒర్లాండో పట్టణంలో జూన్ 12న జరిగిన మారణ కాండ నేపథ్యంలో, ముస్లింలు దేశంలోకి ప్రవేశించ కుండా అమరికా నిషేధం విధించాలంటూ.. రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పదవికి నామినీ అయిన డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు. గే క్లబ్లో కాల్పులకు పాల్పడ్డ షూటర్ అమెరికన్ పౌరుడే అయి నప్పటికీ, ముస్లింలకు ప్రవేశ నిషేధంపై 2015 డిసెంబర్ నుంచి చేస్తూవస్తున్న సిఫార్సులను ట్రంప్ పునరుద్ఘాటిం చారు. అమెరికాకు వచ్చిన 10 వేలమంది సిరియన్ శరణార్థులకు పునరావాసం కల్పించాలని ఒబామా పాలనా యంత్రాంగం తీసుకున్న నిర్ణయం పైనే ట్రంప్ నేరుగా గురిపెట్టారు. ముస్లింల ప్రవేశాన్ని నిషేధించ డంపై ట్రంప్ తదితరులు ఇస్తున్న బహిరంగ ప్రకటనలు అమెరికన్లలో శరణార్థులపై భయాలను రేకెత్తించి ఉండ వచ్చు కాని ఆ భయాలకు ఎలాంటి చారిత్రక సమర్థనా లేదనే చెప్పాలి. గత సంవత్సరం పారిస్లో ఉగ్రవాద దాడుల తర్వాత, మధ్య ప్రాచ్య దేశాలనుంచి వలస వస్తున్న వారితో దేశ భద్రతకు ప్రమాదం కలగనుందని పలు వ్యాసాలను అమెరికన్ మీడియా ప్రచురించింది. ఇతరదేశాలు, ప్రాంతాల నుంచి వలస వచ్చే శరణా ర్థుల పట్ల ఆమోదం తెలపడానికి సంబంధించి అమెరి కాకు సుదీర్ఘ, సంక్లిష్ట చరిత్ర ఉంది. 1840లలో బంగాళా దుంపల పంట వైఫల్యంతో తీవ్ర కరువు బారిన పడిన ఐరిష్ కేథలిక్కులు, నల్లమందు యుద్ధాల క్రమంలో చైనీయులు, 19వ శతాబ్ది చివరలో చెలరేగిన జాతి ఘర్షణల నుంచి తప్పించుకోజూసిన తూర్పు యూరప్ యూదులు, 1910లో అంతర్యుద్ధ క్రమంలో పారిపో యిన మెక్సికన్లు, నాజీల పాలన నుంచి తప్పుకున్న జర్మనీ యూదులు, 1960లలో క్యూబన్ ప్రజలు, 1970 లలో వియత్నమీయులు ఏదో ఒకరకంగా శరణార్థు లుగా అమెరికాకు వలస వచ్చేశారు. ఇలా వలస వచ్చిన వివిధ ప్రజా బృందాలు అమె రికాలో కుదురుకునే క్రమంలో తీవ్ర వివక్షను ఎదుర్కొ న్నాయి. వారి ప్రొటెస్టెంటేతర సంప్రదాయాలు, వారి జాతే దీనికి ప్రధాన కారణం. ఇది 19వ శతాబ్ది చివరలో, 20వ శతాబ్ది ప్రారంభంలో జాతీయతా రూపం దాల్చింది (ఆంగ్లేతర జాతీయులను తక్కువ జాతి జీవు లుగా గుర్తించడం మొదలైంది). మొదట చైనీయులకు, తర్వాత తూర్పు, దక్షిణ యూరప్ జాతీయులకు వ్యతిరేకంగా అమెరికన్లలో ఏర్పడిన దురభిప్రాయాలు ఎంత బలపడ్డాయంటే, అమెరికన్ కాంగ్రెస్ 1880లలో చైనీయుల మినహాయింపు చట్టాన్ని, 1920లలో వలస నిరోధ చట్టాన్ని ఆమోదించింది. ఈ రెండో చట్టం అమెరికాలోకి పశ్చిమ యూరపేతర జాతుల ప్రవాహాన్ని గణనీయంగా నిరోధించింది. స్థానిక అమెరికన్ల నుంచి వివక్షను తీవ్రంగా ఎదుర్కొన్నప్పటికీ, ఈ శరణార్థి బృందాలు, వారి సంతానం అమెరికా సమాజంలో ఒక విడదీయరాని భాగంగా మారిపోయాయి. అమెరికన్ చరిత్రలో శరణార్థుల పట్ల సామాజిక ఆందోళనకు సంబంధించిన అత్యంత ఆసక్తిగొలిపే ఉదాహరణల్లో ‘జర్మన్ ఫార్టీయైటర్స్’ ఒకటి. 1848లో ప్రజాస్వామ్యం కోసం జరిగిన యూరోపియన్ విప్లవాల వైఫల్యంతో ఏర్పడే నిర్బంధం గురించిన సకారణ భయాలతో ఈ దేశాల నుంచి పలువురు శరణార్థులు సామూహికంగా అమెరికాకు వలస వచ్చేశారు. వీరిలో జర్మనీ ఉద్యమకారులు ఇతరుల కంటే రాడికల్గా ఉండేవారు. స్వేచ్ఛా చింతనాపరులైన వీరు అమెరికా సంస్థలను, ప్రత్యేకించి క్రిస్టియానిటీని తీవ్రంగా విమ ర్శించేవారు. వీరి విమర్శల తీవ్రతకు జడిసిన నాటి ఛాందసవాద ‘విగ్’ పార్టీ, దాని విదేశీయతా విముఖత లోంచి పుట్టుకొచ్చిన ‘అమెరికన్ పార్టీ’.. రెండూ ‘అమెరికా అమెరికన్లకే’ అనే నినాదాన్ని మొదలెట్టాయి. అయితే వలస ప్రజలు పలువురు అమెరికన్లలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నప్పటికీ, ‘జర్మన్ ఫార్టీ యైటర్స్’ గా పేరొందిన వారు వలస వచ్చిన బృందాలన్నింటి కంటే ఎక్కువగా చైతన్యంతో కూడిన బృందంగా ఉండేవారు. వీరు స్థానిక కమ్యూనిటీలకు నేతృత్వం వహించేవారు. ఉత్తమ ప్రభుత్వ విద్య, బానిసత్వ రద్దు తదితర ప్రగతిశీల సంస్కరణలను ప్రబోధించేవారు. 1917లో అమెరికా, జర్మనీపై యుద్ధం ప్రకటించేనాటికి ఈ జర్మన్ ఫార్టీ యైటర్స్కి చెందిన పిల్లలు, తదనంతర తరం పిల్లలు, వీరితో పాటు జర్మనీ వలస ప్రజలను అమెరికాయేతరులుగా, జాతికి ప్రమాదకారులుగా అమె రికన్ ప్రజానీకం భావించింది. నాటి ఉడ్రోవిల్సన్ పాలనా యంత్రాంగంతోపాటు పలువురు అమెరికన్ నేతలు అనధికారికంగా ఇదే అభిప్రాయానికి వచ్చేశారు. యుద్ధకాలంలో జర్మన్ అమెరికన్లపట్ల భయం అనేది ఉన్మాద స్థాయికి చేరింది. వారు ఆహారంలో, తాగేనీళ్లలో విషం కలిపేందుకు, ఫ్యాక్టరీల్లో, వంతెనలపై బాంబులు పెట్టడానికి కుట్ర పన్నుతున్నారని పలురకాల పుకార్లు వ్యాపింపజేశారు. వీటిలో ఏ ఒక్క పుకారు కూడా నిజం కాలేదనుకోండి. పైగా జర్మన్ అమెరికన్లు తాము కొత్తగా నివాసమేర్పర్చుకున్న ప్రాంతం పట్ల విశ్వాసం ప్రదర్శిం చినట్లు చారిత్రక రికార్డులు కూడా ఉన్నాయి. చారిత్రక దృక్పథం రీత్యా కూడా సిరియన్, తదితర శరణార్థుల పట్ల ఈ కొత్త భయం చాలావరకు అసంబ ద్ధమైనదనే చెప్పాలి. గతంలోని వలస బృందాలు, అమె రికా సామాజిక చట్రానికి ప్రమాదకారులుగా ముద్ర పడిన బృందాలు కూడా అమెరికా పౌరులలో కీలక సభ్యులుగా తమను తాను నిరూపించుకున్నారు. మధ్య ప్రాచ్య శరణార్థుల పట్ల భయాలు వ్యక్తం చేస్తున్నవారు అమెరికా సంస్కృతి, దాని సంస్థలు ప్రత్యేకించి దాని ప్రభుత్వ విద్యా సంస్థలలోని ఏకీకరణ శక్తిని నిర్లక్ష్యం చేస్తున్నాయనిపిస్తోంది. శరణార్థుల గురించి అధికంగా ఆందోళన చేస్తున్న రాజకీయ నేతల్లో చాలామంది... పిల్లల్లో తరాలుగా ప్రజాస్వామిక భావాలను ప్రవేశ పెడుతూ వచ్చిన ప్రభుత్వ విద్యా వ్యవస్థను సమర్థించ డంలో ఏకకాలంలో విఫలమవడం గమనార్హం. పైగా వీరు ప్రైవేట్గా నిర్వహిస్తూ, లాభాపేక్షే పరమావధిగా కలిగిన పాఠశాలల పట్ల మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్, తదితర రిపబ్లికన్ నేతలు సిరియన్ శరణార్థుల పట్ల అమెరికన్లలో ప్రవేశపెడు తున్న కల్పిత భయాలు బీభత్సాన్ని సృష్టించడానికి మించిన ప్రమాదకరంగా మారుతున్నాయి. ప్రపంచ మానవతావాద సంక్షోభం పట్ల అమెరికా స్పందనను విదేశీయతా వైముఖ్యం వైపు నెడుతున్నాయి. పాల్ జె రామ్సే, ప్రముఖ అమెరికన్ రచయిత (కామన్డ్రీమ్స్.ఓఆర్జీ.... సౌజన్యంతో) -
బీచ్కు కొట్టుకొచ్చిన 104 మృతదేహాలు
ట్రిపోలీ: లిబియాలోని జ్వారాలో సముద్రతీరానికి సుమారు 104 మంది శరణార్థుల మృతదేహాలు కొట్టుకువచ్చాయి. గురువారం సాయంత్రం తీర ప్రాంతానికి చాలా మృతదేహాలు కొట్టుకువచ్చాయని .. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని నావికాదళ అధికారులు శుక్రవారం తెలిపారు. ఇతర దేశాలకు వెళ్తోన్న 700 మంది శరణార్థులు ప్రయాణిస్తున్న బోటు మునిగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు దాదాపు 340 మంది కాపాడామని గ్రీక్ కోస్ట్ గార్డ్ అధికార ప్రతినిధి నికోస్ లగాడియానోస్ తెలిపారు. మిగతా శరణార్థులు మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. -
ఆశ్రయానికి నో.. రెండు కోట్లు ఇచ్చేందుకు ఓకే!
లండన్: శరణార్థులను తమ గ్రామంలోకి అనుమతివ్వకుండా అందుకు ప్రతిగా కోట్ల రూపాయల ఫైన్ చెల్లించేందుకు స్విట్జర్లాండ్ లోని ఓ గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు రూ.1,96,17,606 వారికి చెల్లిస్తామని ప్రకటించారు. డబ్బు అయితే, వారి జీవనోపాధికి పనికొస్తుందని ఆ గ్రామ అధికారి ప్రకటించాడు. మొత్తం 50 వేల మంది సిరియా ప్రాంతానికి చెందిన శరణార్థులను తమ దేశంలోకి అనుమతించేందుకు స్విట్జర్లాండ్ నిర్ణయించింది. అందులో భాగంగా ఆయా గ్రామాల్లో వారిని సర్దేందుకు గ్రామానికి పదిమంది చొప్పున నిర్ణయించారు. అంతకంటే ముందు ఆ గ్రామంలో శరణార్ధులపై అభిప్రాయ సేకరణ చేస్తారు. అందులో భాగంగా దాదాపు 300మంది మిలియనీర్లు, 20,000మంది జనాభాతో ఉన్న స్విట్జర్లాండ్ లోని ''లీలి' అనే గ్రామంలో అభిప్రాయ సేకరణ చేపట్టగా వారు శరణార్థులకు ఆశ్రయం ఇచ్చేందుకు నిరాకరించి డబ్బు సహాయం చేస్తామని చెప్పారు. ఒక వేళ తాము ఆశ్రయం ఇస్తే అలాగే ఇతరులు కూడా ఆశపడి తమ గ్రామానికి వస్తారని, అలా కాకుండా డబ్బు సహాయం చేయడం ద్వారా శరణార్థి శిబిరాల్లో ఉంటున్న వారికి భవిష్యత్ అందించినట్లవుతుందని అభిప్రాయపడ్డారు. వారి భాష తీరు కూడా వేరని, పిల్లల చదువులు వంటి సమస్యలు వస్తాయని తెలిపారు. -
శరణార్థుల పయనం ఎటువైపు..?
ప్రపంచ దేశాలలో ముఖ్యమైన సమస్యల్లో వలస ఒకటని చెప్పవచ్చు. కొన్ని దేశాల వారు బతుకుదెరువు కోసం వలస వెళతారు. మరికొన్ని దేశాల ప్రజలు రక్షణ కరువైందని శరణార్థులుగా మారతారు. ఏది ఏమైతేనేం.. పొరుగు గడ్డకు పరుగులు తీయడం మాత్రం తప్పనిసరిగా మారింది. అయితే పొరుగు దేశాల ప్రజలు తమ దేశంలో ప్రవేశిస్తే తమ ఉద్యోగ, పని అవకాశాలు దెబ్బతింటాయని చాలా దేశాల అధినేతలతో సహా ప్రజలు భావిస్తుంటారు. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ శరణార్థులపై ఓ సర్వే నిర్వహించింది. శరణార్థులుగా వచ్చిన వారు ఉద్యోగాలు తెచ్చుకుని వలస దేశాలలో జీవనం కొనసాగించడం, వారి స్థితిగతులు మెరుగుపడుతున్నాయా అనే ఇతర ముఖ్యమైన అంశాలపై ఈ సర్వేలో కొన్ని వాస్తవాలు వెల్లడయ్యాయి. శరణుకోరి వచ్చిన వారిని అక్కున చేర్చుకుంటున్న దేశాలలో 85 పాయింట్లతో చైనా అగ్రస్థానం ఆక్రమించింది. ఆ తర్వాతి స్థానాల్లో జర్మనీ(2), యూకే(3), కెనడా(4), ఆస్ట్రేలియా(5), స్పెయిన్(6), గ్రీస్(7), జోర్డాన్(8), అమెరికా(9), చిలీ(10) ఉండగా.. భారత్ 12వ స్థానంలో నిలిచింది. ప్రతి వంద మందిలో 80పైగా వ్యక్తులకు ఆశ్రయమిస్తున్న దేశాలు కేవలం మూడు మాత్రమే ఉండటం గమనార్హం. -
ప్రాణ భయంతో లక్షమంది పరుగు!
డెమాస్కస్: సిరియాలో ఎప్పటి నుంచో అదుపులేకుండా జరుగుతున్న యుద్దం కారణంగా అక్కడి పాలస్తీయునులంతా కూడా ప్రాణభయంతో పరుగులు పెట్టారని, పలు దేశాలకు వలస వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి నివేదిక ఒకటి తెలిపింది. సిరియాలో యుద్ధ వాతవరణానికి ముందు 5,60,000మంది పాలస్తీనా వాసులు ఉండేదని.. యుద్ధ ప్రారంభం అయ్యాక దాదాపు 1,20,000మంది ప్రాణభయంతో దేశాన్ని విడిచి వెళ్లినట్లు ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఎజెన్సీ ఫర్ పాలస్తీనా రెప్యూజీస్(యూఎన్ఆర్ డబ్ల్యూఏ) వెల్లడిచింది. ఇలా వెళ్లిపోయిన వారిలో 45 వేలమంది లెబనాన్, 15 వేలమంది జోర్డాన్ కు, సగంమందికిపైగా టర్కీ మీదుగా యూరప్ వెళ్లిపోయారని వివరించింది. -
కష్టకాలంలో మానవీయ స్పర్శ
బైలైన్ శరణార్థుల విషయంలో యూరప్ మడిగట్టుకుని ఉండలేదని, ఉదాసీనంగా లేదా శత్రుపూరితంగా వ్యవహరించజాలదని పోప్ అన్నారు. ఆయన మత విశ్వాసం ఇతరులను కలుపుకుని పోయేది. మనుషుల బాధల పట్ల ఆయనకున్న పట్టింపు మత విశ్వాసాల సరిహద్దు గోడలను అధిగమించినది. అసలు చెప్పుకోవాల్సిన కథనాలే అతి తరచుగా వార్తల్లో పడి కొట్టుకుపోతుంటాయి. ఉదయం నుంచి రాత్రి వరకు సాగే సుదీర్ఘ సమాచార కవాతులో వార్తలు సైతం కళ్ల ముందు కదలాడుతూ పోయే శీర్షికలుగా మారిపోతాయి. వాటి ప్రాముఖ్యతను కొలిచే పాటి తీరిక, శ్రద్ధ ఎవరికి ఉంటుంది? ఏప్రిల్ 16న ఒక ప్రాముఖ్యత గల ఘటన జరిగింది. ఆ కథనం పూర్తిగా కాకపోయినా, చాలా వరకు దాన్ని చేరవేసే క్రమంలో కొట్టుకుపోయింది. రోమన్ కేథలిక్కుల మత పెద్దయైన హోలీ ఫాదర్ పోప్ ఫ్రాన్సిస్, యుద్ధ విధ్వంసానికి గురైన సిరియా వంటి ముస్లిం దేశాల శరణార్థులను కలుసు కున్నారు. నేడు మరుపున పడిపోయిన ఒకప్పటి సుప్రసిద్ధ గ్రీకు ద్వీపం లెస్బోస్లో ఈ కలయిక జరిగింది. యూరప్ అంచున ఉన్న గ్రీస్, రెండు శతాబ్దాల స్వతంత్ర అస్తిత్వం తర్వాత... మళ్లీ ఆ ఖండపు ముఖ ద్వారంగా మారింది. అయి తే, యూరోపియన్లు మాత్రం గ్రీస్, యూరప్కు రక్షణను కల్పించే అడ్డుగోడగా నిలవా లనే కోరుకున్నారు. ఒకప్పు డు, అట్టోమన్-తురుష్క సేనలు గ్రీస్ను స్థావరంగా చేసుకుని బాల్కన్ దేశాల లోకి చొరబడుతూ, అక్కడి నుంచి శక్తివంతమైన యూరోపియన్ రాజ్యాలపైకి దృష్టిని సారిస్తూ ఉండేవి. నేడు యుద్ధ బీభత్సానికి గురైన ముస్లిం దేశాల ప్రజలు టర్కీని ఆనుకుని ఉన్న లెస్బోస్ను జర్మనీ, స్కాండినేవియాలకు, సుదూరంలోని బ్రిటన్కు చేర్చే హార్బర్గా మార్చారు. 16, 17 శతాబ్దాలలోని యూరోపియన్ దర్బారులు అట్టోమన్ సామ్రాజ్య శక్తి యురేసియా, మధ్యధరా ఆఫ్రికా ప్రాంతాలకు విస్తరించడం గురించి సహేతుకంగానే ఆందోళ న చెందుతుండేవి. పాశ్చాత్య నాటకకర్తలే ఆనాటి జనరంజ క ప్రసార మాధ్యమాల శాసకులు. వారు తురుష్కులను యూరప్ నాగరికతను, సంపదను, సౌందర్యాన్ని కాలరాచి వేయడానికి వేచి చూస్తున్న రాక్షసులుగా చిత్రించారు. ఉదారవాద మేధావి షేక్స్పియర్ ఇందుకు మినహాయింపు. ఈసారి యూరప్లో భయాన్ని రేకెత్తించినది అరబ్బుల వంపు తిరిగిన ఖడ్గాల దండయాత్ర కాదు, వచ్చిపడే జనాభా దండు. ఈ సారి గుంపులు గుంపులుగా వచ్చి పడ్డవారు వేగాశ్వ పదఘట్టనల సంరంభంతో రాలేదు. దుర్బలమైన పడవల్లో శరణార్థులై వచ్చారు. అలా వచ్చే సాధారణ ప్రజలు, పౌరులుగా మారగలుగుతారు. కాబట్టి నేటి ప్రజాస్వామ్య యుగంలో వారు సైతం సైనికులంత గానూ ఆందోళనను రేకెత్తిస్తున్నారు. యూరోపియన్ ప్రభుత్వాలు తొలుత ఈ శరణార్థుల వెల్లువను చూసి బెంబేలెత్తిపోయాయి. మానవీయ స్పందన లకు, పెరుగుతున్న ప్రజాగ్రహానికి మధ్యన అవి ఇరుక్కు పోయి మ్రాన్పడిపోయినట్టనిపించింది. టర్కీతో తీవ్ర దౌత్య కృషి, సరిహద్దు రక్షణ చర్యలను పటిష్టం చేయడం కలసి వాటికి కొంత ఉపశమనాన్ని కలుగజేశాయి. అయితే ఎవరికీ చెందని భారీ శరణార్థుల జనాభా సరిహద్దుల మధ్యన చిక్కుకు పోయి మిగిలింది. తమ మాతృ భూమికి తిరిగి వెళ్లడమనే ఆలోచనకే వారు భయకంపితులౌతున్నారు. అలాంటి ఆపత్కాలంలో పోప్ ఫ్రాన్సిస్ లెస్బోస్లోని ఒక శరణార్థుల శిబిరాన్ని స్వయంగా సందర్శించారు. ఇది, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత మానవ మహా విపత్తని ఆయన అన్నారు. పోప్ మాటలను ఆచితూచి జాగ్రత్తగా వాడటమే కాదు, ఎంతో ఆలోచన చేసిన తర్వాత నే కార్యాచరణకు దిగారు. లండన్ నుంచి వెలువడే ‘సండే టైమ్స్’ పత్రికలో వెలువడ్డ క్రిస్టియన్ లాంబ్ కథనం ప్రకారం... పోప్ శరణార్థులకు మద్దతును వాగ్దానం చేసి వారి సౌఖ్యం కోసం ప్రార్థన చేశారు. డజను మంది ముస్లిం శరణార్థులను వాటికన్ నగరంలోకి స్వీకరించారు. (ఆ 12 మంది డమాస్కస్కు, ఐఎస్ఐఎస్ అదుపులో ఉన్న డయర్ ఎజ్జార్ పట్టణానికి చెందినవారు). దీన్ని మీరు సంకేతాత్మక మైనదిగా కొట్టి పారేయవచ్చు. కానీ, అది సామాన్యుల హృదయాల్లో మారు మోగే శక్తివంతమైన ప్రేమాస్పద చర్య. లాంబ్ కథనానికి జోడించిన అందమైన ఫొటోలో ఒక పిల్లాడు నవ్వుతున్న ఆ మతాధిపతి చేతిని ముద్దాడుతుం డగా.. అతని తల్లి ఉద్వేగంతో కన్నీటిని బిగబడుతూ కనిపి స్తుంది. చెప్పాల్సిన అవసరం ఉన్న దయనీయ కథనాలు ఎన్నో ఉన్న మాట నిజమే. కానీ, ఆశ కూడా ఒక కథనమే. నిజమే, పోప్ ముస్లింలకు స్నేహ హస్తాన్ని చాస్తున్నా రు. ఇంతకు ముందు కూడా ఆయన ఈ పని చేశారు, ఇక ముందూ చేస్తారు. ఆయన మత విశ్వాసం ఇతరులను కలుపుకుని పోయేది. మనుషుల బాధల పట్ల ఆయనకున్న పట్టింపు మత విశ్వాసాల సరిహద్దు గోడలను అధిగమించి నది. నూర్ ఇస్సా, హస్సన్ అనే ఇంజనీర్ల జంట వారి రెండేళ్ల కొడుకు వంటి కుటుంబాల విషయంలో యూరప్ మడిగట్టుకుని ఉండలేదని, ఉదాసీనంగా లేదా శత్రుపూరి తంగా వ్యవహరించజాలదని కూడా ఆయన చెబుతున్నారు. ఆ ముగ్గురి కుటుంబం ఇకపై డమాస్కస్లో కాక వాటికన్ లోనే జీవిస్తుంది. ఐదేళ్ల క్రితం లేదా రెండు, మూడేళ్ల క్రితం సైతం వారు తమ మనుగడలో అలాంటి మలుపు వస్తుం దని ఊహించలేదు. వారెన్నడూ సిరియా వదిలి పోవాలని అనుకోనేలేదు. అత్యంత నిర్దాక్షిణ్యమైన యుద్ధం కారణంగా తీవ్ర విధ్వంసానికి భయంకరమైన ఒంటరితనానికి గురై ఉన్నవారిని వారి దేశం నుంచి తరిమేశారు. అయినా వారు అదృష్టవంతులు. అంతకంటే భిన్నమైన జీవితం కోసం అన్వేషణలో వారిలాంటి వేలాది మంది ప్రాణాలను కోల్పో యారు. యూరప్ ఈ విషాదాన్ని అర్థం చేసుకోలేదని అనడం సమంజసం కాదు. చాలా ప్రభుత్వాలు తాము చేయగలిగినదంతా చేశాయి. ఈ విషయంలో చేసిన కృషికి గానూ జర్మన్ చాన్స్లర్ ఏంజెలా మర్కెల్ వచ్చే ఎన్నికల్లో మూల్యం చెల్లించాల్సి రావచ్చునేమోగానీ, చరిత్రలో ఆమె ఎన్నటికీ గుర్తుండిపోతారు. కానీ, ఇంకా ఆ నరకంలో తేలుతున్న వారిని ప్రపంచం మరచిపోలేదు. ప్రపంచంలోనే అత్యంత సుప్రసిద్ధ మతానికి పెద్ద అయిన పోప్ మనం వినడానికి సిద్ధంగా లేని ఒక విషయా న్ని కూడా చెప్పారు. మానవత్వానికి అర్థం తెలుసుకోకపోతే మానవులు ఇక మానవులే కారు. నేటి మన నేతల పట్ల సంశయాత్మక దృష్టితో చూడటం ఫ్యాషన్గా మారింది. తర చుగా అందుకు సమంజసమైన కారణాలను సైతం చూపు తుంటారు. మతం, సంశయాత్మకతకు వ్యతిరేకంగా హామీని కల్పించే బీమా కాదు. భగవదాంశ సంభూతునిగా భావించే మత పెద్దే ఆ భగవంతునిలో విశ్వాసాన్ని ప్రదర్శించడాన్ని చూసినప్పుడు... మనం ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవడం, ఆయన దృక్పథాన్ని ప్రశంసించడం తప్పదు. వ్యాసకర్త: ఎం.జె. అక్బర్ (సీనియర్ సంపాదకులు) పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి -
ప్రాణాలు పణంగా!
ఎలాగోలా యూరోప్లోకి అడుగుపెట్టాలని శరణార్థులు ప్రాణాలను పణంగా పెట్టి సముద్రాన్ని దాటుతుంటారు. ఎందరో ప్రాణాలు కోల్పోతుంటారు కూడా. అదృష్టవశాత్తు అవతలి ఒడ్డు చేరితే శరణార్థి శిబిరాల్లో తలదాచుకొని... శరణార్థిగా గుర్తింపు పొందడానికి దరఖాస్తు చేసుకొని... అది లభించేదాకా నెలల తరబడి వేచిచూడాలి. ఏదోరకంగా యూరోప్లో అడుగుపెట్టాలన్న వీరి ఆరాటాన్ని సొమ్ము చేసుకుంటున్న స్మగ్లర్లు పోలీసులకు చిక్కకుండా వివిధ మార్గాల్లో వీరిని సరిహద్దులు దాటిస్తున్నారు. మొరాకో నుంచి స్పెయిన్లోకి ప్రవేశించడానికి కొందరు శరణార్థులు చేసిన సాహసమే ఈ చిత్రాలు. ఒకతను కారు వెనకవైపు బంపర్ కింద తాళ్లు కట్టుకొని వేలాడితే... మరొకతను డ్రైవర్ పక్కనున్న సీటును తొలగించి... అచ్చు కుర్చీలా తాను కూర్చొని పైనుంచి లెదర్ సీట్ కవర్స్ వేసుకున్నాడు. తనిఖీలో చిక్కిన వీరి చిత్రాలను స్పెయిన్ విడుదల చేసింది. -
రూ.8 వేల కోట్ల భూముల కేసు..
♦ ఏజీ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ♦ ప్రైవేటు వ్యక్తులకు 323 ఎకరాల కేటాయింపు ఉత్తర్వులు కొట్టివేత ♦ ఈ కుంభకోణంపై దర్యాప్తు చేయాలని సర్కారుకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పొప్పాలగూడలోని రూ.8 వేల కోట్ల విలువ చేసే 323 ఎకరాల కాందిశీకుల భూములకు సంబంధించి జరుగుతున్న సుదీర్ఘ న్యాయ పోరాటంలో తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించింది. రమేష్ పరశురాం మల్పానీ, మరికొందరికి భూములు కేటాయింపులో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో అప్పటి ప్రధాన భూ పరిపాలన కమిషనర్(సీసీఎల్ఏ) తన అధికార పరిధి దాటి వ్యవహరించారన్న అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలతో హైకోర్టు ఏకీభవిస్తూ.. ఆ కేటాయింపులను కొట్టేసింది. ఈ కేటాయింపులు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని తేల్చి చెప్పింది. ఈ కేటాయింపులు చట్టవిరుద్ధమని, సీసీఎల్ఏ తన అధికార పరిధి విస్మరించారని, రికార్డుల్లోని వాస్తవాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా కేటాయింపులు జరిపారని ఆక్షేపించింది. ఈ మొత్తం వ్యవహారాన్ని భూ కుంభకోణంగా అభివర్ణించిన హైకోర్టు దీనిపై విచారణ జరపాలని, ఇందులో పాత్ర ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్తో కూడిన ధర్మాసనం శుక్రవారం 200 పేజీల తీర్పు వెలువరించింది. 2006 నుంచి కేసు విచారణ తాము దేశ విభజన సమయంలో ఇక్కడికి వచ్చి స్థిరపడ్డామని, అందువల్ల తమకు పరిహారం కింద కొంత మొత్తంలో నిర్వాసిత వ్యక్తుల పరిహారం, పునరావాస చట్టం(డీపీసీఆర్) 1954 కింద భూములు కేటాయించాలని రమేష్ పరశురాం మల్పానీ తదితరులు 2003లో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి సీసీఎల్ఏ అంగీకరిస్తూ వారికి రంగారెడ్డి జిల్లా పొప్పాలగూడ వద్ద 323 ఎకరాలు కేటాయించారు. దీనిని సవాలు చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ 2006లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పటి నుంచి విచారణ జరుపుతూ వస్తున్న ధర్మాసనం ఇటీవల తుది విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తెలంగాణ ఏజీ రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ పరశురాం మల్పానీ తదితరులకు జరిపిన కేటాయింపులు అన్యాయమని తెలిపారు. నిర్వాసితుల వారసుల హోదాలో 47 సంవత్సరాల తరువాత పరశురాం మల్పానీ భూ కేటాయింపుల కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. నిర్వాసితుల చట్టం కింద పరశురాం పూర్వీకులకు పరిహారం చెల్లించడం జరిగిందని, వారికి ఎటువంటి పరిహారం పెండింగ్లో లేదని ఆయన కోర్టుకు నివేదించారు. ఈ విషయాలన్నీ రికార్డుల్లో ఉన్నప్పటికీ, అప్పటి సీసీఎల్ఏ నిబంధనలకు విరుద్ధంగా భూ కేటాయింపులు జరిపారని తెలిపారు. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. ఈ కేటాయింపుల వెనుక కంటికి కనిపించని వ్యవహారాలు తెరవెనుక ఎన్నో జరిగాయని, విజ్ఞాపన పత్రాల ఆధారంగా ఇంత భారీ స్థాయిలో భూములను కేటాయించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. అన్ని రికార్డులను పరిశీలించిన తర్వాత ఈ కేటాయింపుల విషయంలో తెరవెనుక వ్యక్తులు కీలక పాత్ర పోషించారని వ్యాఖ్యానించింది. వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా జరిపిన ఈ కేటాయింపులను రద్దు చేస్తున్నామని ప్రకటించింది. ప్రభుత్వ భూములకు ధర్మకర్తగా ఉన్న ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేసి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. -
ఏజియన్ సముద్రంలో మరో విషాదం
ఇస్తాంబుల్: వలసదారుల విషాదం కొనసాగుతోంది. కిక్కిరిసిన పడవల్లో పొట్టచేతబట్టుకొని దేశాలు దాటడానికి ప్రయత్నిస్తున్న ఆశాజీవులు సముద్ర ప్రయాణం మధ్యలోనే సమిధలౌతున్నారు. సిరియా, అఫ్ఘాగనిస్థాన్, మయన్మార్ల నుంచి 53మంది వలసదారులతో గ్రీస్ ద్వీపాలకు వెళ్తున్న పడవ శనివారం ఉదయం ఏజియన్ సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 43 మందిని టర్కీ తీరప్రాంత రక్షణ సిబ్బంది రక్షించగా.. ఐదుగురు చిన్నారులతో సహా 10 మంది మృతి చెందారు. ఏజియన్ సముద్రంలో జరిగిన పడవ ప్రమాదాల్లో ఒక్క 2015లోనే 3000 మంది వలసదారులు మృతి చెందగా, మరో 80 వేల మందిని టర్కీ తీరప్రాంత రక్షణ సిబ్బంది రక్షించారంటే ప్రమాదాల తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో తెలుస్తోంది. గురువారం గ్రీస్ ద్వీపం సామోస్ సమీపంలో జరిగిన ప్రమాదంలో 10 మంది చిన్నారులతో సహా 24 మంది వలసదారులు మృతి చెందిన విషయం తెలిసిందే. -
ప్రపంచం వారిని ఆదుకోవాలి
కెదార్ ర్యాపిడ్స్: ప్రపంచం మొత్తం సిరియా శరణార్థులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి, ప్రస్తుతం ఆ దేశ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న హిల్లరీ క్లింటన్ అన్నారు. ప్రతి ఒక్కరం శరణార్థులకు సహాయం చేయాలని కోరుకోవాలని చెప్పారు. సివిల్ వార్ నుంచి బయటపడి తమ ప్రాణాలు కాపాడుకోవాలని యూరప్ దేశాలవైపు వస్తున్నవారికి రక్షణగా నిలవాలని సూచించారు. ఒక వేళ శరణార్థులకు ఆశ్రయం ఇవ్వలేని పరిస్థితి ఏ దేశానికి ఉంటుందో ఆ దేశాలు వారికి ఆర్థికపరమైన సహాయం అందించాలని కోరారు. ముఖ్యంగా పెట్రోలియం సంపద ఎక్కువగా ఉండి సంపన్న దేశాలుగా ఉన్న గల్ఫ్ దేశాలు ఈ విషయంలో ముందుకు రావాలని సూచించారు. -
గ్రీస్కు మరో తలపోటు
తాహతుకు మించి అప్పులు చేసి రుణదాతల నుంచి ఒత్తిడి ఎదుర్కొని.. కొత్త అప్పుతో తిరిగి తన ప్రస్థానాన్ని ప్రారంభించిన గ్రీస్కు మరో తలపోటు పెరిగింది. అంతర్యుద్ధంతో అట్టుడికిపోతోన్న లిబియా, సిరియా, ఆఫ్ఘన్ లాంటి దేశాల నుంచి పెద్ద సంఖ్యలో శరణార్థులు గ్రీస్కు తరలిరావడమే ఇందుకు కారణం. ఇప్పటికే సంక్షేమ పథకాలు, పెన్షన్లలో భారీ కోతలు విధించి ఎలాగోలా కాలం నెట్టుకొస్తున్న సైప్రస్ ప్రభుత్వం.. వెల్లువలా దూసుకొస్తున్న వలసలను ఎలా అడ్డుకోవాలో అర్థంకాక మిన్నకుండిపోయింది. దీంతో ఆ దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే అవకాశాలున్నాయని ఐక్యరాజ్య సమితి హెచ్చరికలు జారీచేసింది. ఐక్యరాజ్యసమితి శరణార్థుల సహాయ కమిషన్ (యూఎన్హెచ్సీఆర్) అధికార ప్రతినిధి విలియం స్ప్లిండ్లర్ మంగళవారం జెనీవాలో మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. గడిచిన వారం రోజుల్లోనే దాదాపు 21 వేల మంది శరణార్థులు గ్రీస్ లోకి ప్రవేశించారని, జనవరి 1 నుంచి ఆగస్టు 14 వరకు గ్రీస్కు వచ్చిన వలసదారుల సంఖ్య 15 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. వీరంతా ఏజియన్ సముద్రం గుండా గ్రీస్ ద్వీపాల్లోకి ప్రవేశిస్తున్నారు. ప్రధాన భూభాగానికి తోడు దాదాపు 6 వేల ద్వీపాలు కూడా గ్రీస్ దేశంలో భాగంగా ఉన్నాయి. చెల్లాచెదురుగా విస్తరించిన ఈ ద్వీపాల వద్ద సైన్యాల మోహరింపు పరిమిత స్థాయిలో ఉండటం కూడా వలసదారుల పనిని సులువు చేసింది. సాధారణంగా శరణార్థులు లిబియా తీరం నుంచి మధ్యదారా సముద్రం గుండా యూరప్కు చేరుకుంటారు. అయితే గత కొద్దికాలంగా ఆ మార్గంలో పడవ ప్రమాదాలు జరిగి భారీ సంఖ్యలో శరణార్థులు చనిపోయారు. దీంతో యూరప్ కు వలసపోయేందుకు శరణార్థులు కొత్త కొత్త మార్గాలను కనిపెడుతున్నారు. అటు ద్వీపాలతోపాటు ప్రధాన భూభాగంలోనూ భద్రతను కట్టుదిట్టం చేసి వలసలను నిరోధించకపోతే గ్రీస్కు మరిన్ని కష్టాలు తప్పవంటున్నారు విలియం స్ప్లిండ్లర్. -
పెనం నుంచి పొయ్యి లోకి.... శరణార్థుల బతుకులు
-
అధికారం ఇవ్వండి.. పౌరసత్వం ఇస్తాం
గువాహటి: రానున్న ఎన్నికల్లో అసోంలో బీజేపీ అధికారంలోకి వస్తే బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన హిందువులకు భారతీయ పౌరసత్వం ఇస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. గత కొంత కాలంగా మత పరమైన సమస్యల కారణంగా చాలామంది హిందువులు బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారని వారందరిని బీజేపీ ఆదరిస్తుందని చెప్పారు. ఒక్కసారి తమ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఆ చర్యల వేగవంతం చేస్తామని తెలిపారు.అంతే కాకుండా, ఒక్క అసోంలోని బంగ్లా హిందువులకే కాకుండ దేశ వ్యాప్తంగా వలస వచ్చిన హిందువులకు భారత పౌరసత్వం ఇస్తామని చెప్పారు. తమ ఆలోచనలో ఏమాత్రం తప్పు లేదని, వారు కూడా అసోంతోపాటు ఉత్తర భారత అభివృద్ధికి పాటుపడుతున్నవారైనందున వారి తరుపున ఈ విషయంపై పోరాడి పౌరసత్వం ఇస్తామని చెప్పారు. గతంలో ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలకు డబ్బులు చెల్లించామని, కానీ అవి మాత్రం ఓట్లను ఆశించి అలాంటి చర్యలకు దిగడం లేదని అన్నారు.