Results Released
-
తెలంగాణ గ్రూప్-4 ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-4 ఫలితాలు విడుదలయ్యాయి. 8,084 మంది అభ్యర్థులతో ప్రొవిజినల్ జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. పూర్తి వివరాలను వెబ్సైట్లో పొందుపర్చినట్లు కమిషన్ పేర్కొంది.8,180 పోస్ట్లకు డిసెంబర్ 2022లో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 9 లక్షల 51 వేల 321 మంది దరఖాస్తు చేసుకోగా జూలై 1, 2023న జరిగిన నియామక పరీక్ష నిర్వహించారు. సర్టిఫికేషన్ వెరిఫికేషన తర్వాత పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. -
తెలంగాణ DSC - 2024 ఫలితాలు విడుదల
-
గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 563 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి జూన్ 9న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా తెలంగాణ పబ్లిక్సర్విస్ కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. మెయిన్ పరీక్షలకు అభ్యర్థుల ఎంపిక 1:50 నిష్పత్తిలో చేపట్టినట్టు టీజీపీఎస్సీ తెలిపింది. 563 ఉద్యోగాలకుగాను 31,382 మంది అభ్యర్థులు మెయిన్ పరీక్షలకు ఎంపికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా, మల్టీజోన్లు, కమ్యూనిటీ రిజర్వేషన్ల వారీగా అభ్యర్థుల ఎంపిక చేపట్టారు. గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి మార్కులు, కటాఫ్ మార్కులు తదితర వివరాలను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు టీజీపీఎస్సీ కమిషన్ కార్యదర్శి ఇ.నవీన్నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. హాల్టికెట్లు పరీక్షలకు వారంరోజుల ముందు కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామన్నారు. టీజీపీఎస్సీ వెబ్సైట్లో ఫైనల్ కీ కూడా జూన్ 9న నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష ఫైనల్ కీని తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ ఆదివారం వెబ్సైట్లో అందుబాటులో పెట్టింది. గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో ఈ పరీక్ష నిర్వహించిన కమిషన్... ప్రిలిమినరీ కీతో పాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్ను అభ్యర్థుల లాగిన్లో అందుబాటులో ఉంచింది.ఆ తర్వాత అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన కమిషన్..విషయ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి వారితో చర్చించి తుది కీని తయారు చేసింది. ఈ కీని వెబ్సైట్లో అందుబాటులో పెట్టినట్టు కమిషన్ కార్యదర్శి ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల స్కాన్డ్ ఓఎంఆర్ పత్రాలు సైతం కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. -
AP: ఒక్క క్లిక్తో ఎడ్సెట్ ఫలితాలు
ఆంధ్రప్రదేశ్ ఎడ్సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఒక్క క్లిక్తో ఫలితాలు చూసుకోండిఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎడ్సెట్)–2024 ఫలితాలను విడుదల చేశారు. బీఈడీ, బీఈడీ(స్పెషల్) కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. 11384 మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి తరపున విశాఖపట్నం ఆంధ్రా యూనివర్శిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఎడ్ సెట్ నిర్వహించారు. -
TG: ఒక్క క్లిక్తో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు
ఒక్క క్లిక్తో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫస్ట్ ఇయర్ ఫలితాలు (జనరల్)ఒక్క క్లిక్తో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫస్ట్ ఇయర్ ఫలితాలు (ఒకేషనల్)ఒక్క క్లిక్తో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ సెకండ్ ఇయర్ ఫలితాలు (జనరల్)ఒక్క క్లిక్తో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ సెకండ్ ఇయర్ ఫలితాలు (ఒకేషనల్) తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. తెలంగాణ ఇంటర్ బోర్డు సోమవారం ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేసింది. మే 24న నుంచి జూన్ 3 వరకు తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల జరిగాయి. 4.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఫెయిల్ అయినవారితోపాటు ఇంప్రూమెంట్ కోసం పరీక్షలు రాసినవారు కూడా ఉన్నారు. -
నేడు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఇంటర్మిడియెట్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను మంగళవారం విడుదల చేయనున్నారు. తొలుత ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను ప్రకటించనున్నారు. మే 24 నుంచి ఈ నెల ఒకటో తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 1,37,587 మంది హాజరయ్యారు.సప్లి ఫలితాల కోసం క్లిక్ చేయండివోకేషనల్ సప్లి రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండిఇంటర్మిడియెట్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాలను తొలిసారి డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేసింది. ఈ నెల 26న ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలను ప్రకటించనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. -
రేపు టెట్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: 12న ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు వెల్లడి కాను న్నాయి. మే 20 నుంచి జూన్ 2 వరకు టెట్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 2,86,381 దరఖాస్తులు రాగా, 2,36,487 మంది హాజరయ్యారు.3న ప్రాథమిక ‘కీ’విడుదల చేశారు. అభ్యంతరాల అనంతరం ఈనెల 12న ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
TG: ఒక్క క్లిక్తో పాలిసెట్ ఫలితాలు
హైదరాబాద్: పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశానికి ఏటా నిర్వహించే పాలిసెట్ పరీక్ష ఫతాలు సోమవారం విడుదల అయ్యాయి. మాసబ్ ట్యాంక్లోని ఎస్బీటీఈటీ ఎస్.వీ భవన్లో తెలంగాణ ఎస్బీటీఈటీ చైర్మన్ బి. వెంకటేషం ఫలితాలను విడుదల చేశారు. మే 24న పాలిసెట్ రాత పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ఒక్క క్లిక్తో ఫలితాలు చూసుకోండి.. -
ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల
అనంతపురం: ఇంజినీరింగ్, బీ–ఫార్మసీ రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ ద్వారా అడ్మిషన్లు పొందడానికి నిర్వహించిన ఏపీ ఈసెట్–2024 ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రా రెడ్డి గురువారం విడుదల చేశారు. ఏపీ ఈసెట్ నిర్వహించిన జేఎన్టీయూ(అనంతపురం)లో గురువారం ఈ కార్యక్రమం జరిగింది. 8 దఫాలుగా ఏపీ ఈసెట్ను విజయవంతంగా నిర్వహించిన జేఎన్టీయూ(ఏ) ఈసెట్ నిర్వహణ కమిటీని ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి అభినందించారు.ఏపీ ఈసెట్కు రాష్ట్రవ్యాప్తంగా 37,767 మంది దరఖాస్తు చేసుకోగా.. 36,369 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 32,881 మంది(90.41 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అబ్బాయిలు 27,787 మంది దరఖాస్తు చేసుకోగా 26,693 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 23,849(91.68 శాతం) మంది అర్హత సాధించారు. అమ్మాయిలు 9,980 మంది దరఖాస్తు చేసుకోగా, 9,676 మంది హాజరయ్యారు. వీరిలో 9,032(93.34 శాతం) మంది ఉత్తీర్ణలుయ్యారు. ఈసెట్ ఫలితాల్లో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 1,071 మంది పరీక్ష రాయగా 1,002 (93.56 శాతం) మంది అర్హత సాధించారు. ఉదయం సెషన్లో మొత్తం 145 ప్రశ్నలకు గాను 272 అభ్యంతరాలు రాగా.. నాలుగు ఆమోదం పొందాయి.మధ్యాహ్నం సెషన్లో మొత్తం 171 ప్రశ్నలకు గాను 444 అభ్యంతరాలు రాగా 19 ఆమోదం పొందాయి. ఈ ప్రశ్నలకు జవాబు రాసిన వారికి మార్కులు లభించాయి. ఫలితాల విడుదల కార్యక్రమంలో ఏపీ సెట్స్ స్పెషల్ ఆఫీసర్ ఎం.సుధీర్రెడ్డి, ఏపీ ఈసెట్ చైర్మన్ జీవీఆర్ శ్రీనివాసరావు, కన్వీనర్ పీఆర్ భానుమూర్తి, జేఎన్టీయూ(ఏ) రెక్టార్ ఎం.విజయకుమార్, రిజిస్ట్రార్ సి.శశిధర్, పాలకమండలి సభ్యులు బి.దుర్గాప్రసాద్, డాక్టర్ ఎం.రామశేఖర్రెడ్డి పాల్గొన్నారు.వలంటీర్ శిల్ప స్టేట్ ఫస్ట్రణస్థలం: సీఎం జగన్ ఏర్పాటు చేసిన వలంటీర్ వ్యవస్థలో చేరి ప్రజలకు సేవ చేస్తున్న ఓ యువతి ఏపీ ఈసెట్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడలో వలంటీర్గా సేవలందిస్తున్న మైలపల్లి శిల్ప రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించింది. శిల్ప ప్రస్తుతం శ్రీకాకుళం మహిళా పాలిటెక్నిక్ ప్రభుత్వ కళాశాలలో డీ–ఫార్మసీ రెండో సంవత్సరం చదువుతోంది.ఇంజనీరింగ్ చదవాలనే ఆశయంతో ఆమె ఈసెట్ రాయగా.. బయో టెక్నాలజీ విభాగంలో ఫస్ట్ ర్యాంకు వచ్చిందని ఆమె తెలిపింది. ఆమె తండ్రి పేరు పోలీసు.. టైలర్గా పనిచేస్తుండగా.. తల్లి లక్ష్మి గృహిణి. కుమార్తెకు స్టేట్ ఫస్ట్ ర్యాంకు రావడంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. గ్రామస్తులు శిల్పను అభినందించారు. శిల్ప మాట్లాడుతూ.. బయోటెక్నాలజీలో ఇంజనీరింగ్ చేసి అత్యుత్తమంగా రాణించాలని అనుకుంటున్నట్లు ఆమె తెలిపారు. -
ఐసెట్, డీఈఈ సెట్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన డీఈఈ సెట్–2024 (డైట్ సెట్) ఫలితాలు విడుదలయ్యాయి. సెట్ కన్వీనర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మేరి చంద్రిక గురువారం విజయవాడలోని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. ఈనెల 24న డైట్ సెట్ నిర్వహించగా.. ఆరు రోజుల్లోనే మూల్యాంకనం పూర్తి చేసి ఫలితాలను ప్రకటించారు.ఈ పరీక్షకు 4,949 మంది అభ్యర్థులు హాజరవ్వగా, 3,191 మంది ఉత్తీర్ణులయ్యారు. మ్యాథమెటిక్స్ విభాగంలో విజయనగరం జిల్లాకు చెందిన బులుసు గ్రీష్మిత, ఫిజికల్ సైన్స్ విభాగంలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కేసన మీనాక్షి, బయోలాజికల్ సైన్స్ విభాగంలో వైఎస్సార్ జిల్లాకు చెందిన షేక్ రుక్సానా, సాంఘిక శాస్త్ర విభాగంలో చిత్తూరు జిల్లాకు చెందిన గుత్తా సునీల్కుమార్ మొదటి ర్యాంకులు సాధించి స్టేట్ టాపర్స్గా నిలిచారు.6 నుంచి వెబ్ కౌన్సెలింగ్ ప్రాథమిక పాఠశాలల్లో విద్యా బోధనకు ఉద్దేశించిన రెండేళ్ల డీఈఈ కోర్సుకు ఎంతో డిమాండ్ ఉంది. రాష్ట్రంలో 14 ప్రభుత్వ డైట్ కాలేజీలు ఉండగా వాటిలో 1,650 సీట్లు ఉన్నాయి. మరో 15 ప్రైవేటు డైట్ కాలేజీల్లో 1,500 సీట్లు కలిపి మొత్తంగా 3,150 సీట్లున్నాయి. డైట్ సెట్లో అర్హత సాధించిన అభ్యర్థులకు జూన్ 6 నుంచి 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్కు అవకాశం కల్పించినట్టు కన్వీనర్ మేరీ చంద్రిక తెలిపారు. జూన్ 20వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ఆమె వెల్లడించారు.ఏపీ ఐసెట్లో 96.70 శాతం మంది ఉత్తీర్ణతఅనంతపురం: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్–2024 ఫలితాలను గురువారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి విడుదల చేశారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ ఐసెట్ ఫలితాలను ఎస్కేయూలోని వీసీ కాన్ఫరెన్స్ హాలులో విడుదల చేశారు. ఏపీఐసెట్ చైర్మన్ ప్రొఫెసర్ కె.హుస్సేన్రెడ్డి, ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పి.మురళీకృష్ణ, ఎస్కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంవీ లక్ష్మయ్య, ఐసెట్ కమిటీ సభ్యులు ప్రొఫెసర్ సి.శోభాబిందు, ప్రొఫెసర్ కె.రాంగోపాల్ తదితరులు పాల్గొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 48,828మంది ఏపీ ఐసెట్కు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 44,447 మంది పరీక్షకు హాజరుకాగా, 42,984 మంది (96.70 శాతం) ఉత్తీర్ణత సాధించారు. పురుషులు 23,315మంది దరఖాస్తు చేసుకోగా, 21,033 మంది హాజరయ్యారు. వీరిలో 20,296 (97 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. మహిళలు 25,513 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 23,414 మంది పరీక్షకు హాజరుకాగా, 22,688 మంది (97.48 శాతం) ఉత్తీర్ణత సాధించారు.పురుషుల కంటే మహిళల ఉత్తీర్ణత శాతం అధికంగా ఉంది. తుది ‘కీ’లో కేవలం 2 ప్రశ్నలకు మాత్రమే 5 రకాల జవాబులు రావడంతో ఆ రెండు ప్రశ్నలు రాసినవారికి మార్కులు అదనంగా కలిపారు. 34 మంది అభ్యర్థులు స్క్రైబ్ సాయంతో పరీక్షలు రాశారు. ఫలితాల విడుదల అనంతరం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏపీఈఏపీసెట్ ఫలితాలు జూన్ 5, 6 తేదీల్లో విడుదల చేస్తామని తెలిపారు.ఏపీ ఐసెట్లో టాప్ –10 ర్యాంకర్లు -
Watch Live: తెలంగాణ EAMCET ఫలితాలు విడుదల..
-
లాసెట్లో 80.21 శాతం పాస్
సాక్షి, హైదరాబాద్: న్యాయవాద కోర్సుల్లో ప్రవేశానికి గత నెల ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్ లాసెట్–2023) ఫలితాలను ఉన్నత విద్య మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి గురువారం విడుదల చేశారు. వివరాలను ఆయన మీడియాకు వివరించారు. ఈ పరీక్షకు 43,692 మంది దరఖాస్తు చేసుకోగా, 36,218 మంది పరీక్ష రాశారని, ఇందులో 29,049 (80.21 శాతం) మంది అర్హత సాధించారని తెలిపారు. మొత్తం 120 మార్కులకు జరిగిన ఈ పరీక్షలో ఎస్సీ, ఎస్టీలకు 25 శాతం, ఇతరులకు 35 శాతం అర్హత మార్కులుగా నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల పరిధిలో 7,560 లా సీట్లున్నాయి. ఇందులో మూడేళ్ల లా కోర్సుల్లో 4,630, ఐదేళ్ల లా కోర్సులో 2 వేలు, పీజీ లా కోర్సులో 930 సీట్లున్నాయి. త్వరలో లాసెట్ కౌన్సెలింగ్ చేపడతామని లింబాద్రి వెల్లడించారు. విలేకరుల సమావేశంలో ఉన్నత విద్యామండలి కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్, లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ బి.వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 60 ఏళ్లు పైబడిన వాళ్లుకూడా... న్యాయవాద వృత్తి చేపట్టాలనే ఆకాంక్ష 16 ఏళ్ల నుంచి 60 ఏళ్లు పైబడిన వాళ్లలోనూ కనిపించింది. 60 సంవత్సరాలకు పైబడి మూడేళ్ల లాసెట్ రాసిన వాళ్లలో 185 మందికిగాను 149 మంది, ఐదేళ్ల లాసెట్లో 10కి 9 మంది, పీజీ లాసెట్లో 68 మందికి 65 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే మూడేళ్ల లాసెట్ రాసిన వాళ్లలో బీకాం నేపథ్యం ఉన్నవాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. బీకాం ప్రధాన కోర్సుగా ఉన్నవాళ్లు 8,164 మంది పరీక్ష రాయగా 5,861 మంది అర్హత సాధించారు. ఆ తర్వాత స్థానంలో బీఎస్సీ, బీటెక్ నేపథ్యం వాళ్లున్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన వాళ్లు 53 మంది లాసెట్ రాశారు. -
TS: ఎస్సై, కానిస్టేబుల్ తుది రాతపరీక్ష ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పోలీస్ నియామక తుది రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఎస్ఐ, కానిస్టేబుల్ తుది రాత పరీక్షల్లో 84 శాతం మంది అర్హత సాధించినట్లు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. కానిస్టేబుల్ సివిల్, ట్రాన్స్పోర్టు, ఎక్సైజ్ పోస్టులకు 98,218 మంది, కానిస్టేబుల్ ఐటీ అండ్ కమ్యునికేషన్కు 4,564మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. సివిల్ ఎస్సై 43,708 మంది, ఐటీ అండ్ కమ్యునికేషన్ ఎస్సై పోస్టులకు 729 మంది, డ్రైవర్, ఆపరేటర్ కానిస్టేబుల్ పోస్టులకు 1,779 మంది, ఫింగర్ ఫ్రింట్ బ్యూరో ఏఎస్సై పోస్టులకు 1,153 మంది, పోలీస్ ట్రాన్స్పోర్టు ఎస్సై పోస్టులకు 463 మంది, పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్కు 283 మంది ఎంపికయినట్టు రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. మంగళవారం రాత్రి నుంచి అభ్యర్ధులు సాధించిన మర్కుల వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. ఫైనల్ కీ, ఓఎంఆర్ షీట్లు వెబ్ సైట్లో తమ వ్యక్తిగత లాగిన్లో చూసుకోవచ్చని పేర్కొంది. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్కు అవకాశం కల్పించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 2 వేలు, ఇతర కమ్యూనిటీలు, నాన్ లోకల్ అభ్యర్థులు రూ. 3 వేలు చెల్లించి రీ కౌంటింగ్, రీవెరిఫికేషన్ చేసుకోవచ్చని సూచించారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ప్రక్రియ జూన్ 1వ తేదీ ఉదయం 8 గంటల నుంచి జూన్ 3వ తేదీ రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. చదవండి: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరోసారి కవిత పేరు.. -
టీఎస్ ఐసెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
సాక్షి , హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన టీఎస్ ఐసెట్–2022 ఫలితలు నేడు (ఆగస్టు 27) విడుదలయ్యాయి. ఈ ఫలితాలను కాకతీయ యూనివర్సిటీలో మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి విడుదల చేశారు. ఈ ఫలితాలతో పాటు ఫైనల్ కీ ని కూడా విడుదల చేశారు. ఈ టీఎస్ ఐసెట్ 2022 ఫలితాలను సాక్షి ఎడ్యుకేషన్.కామ్ ( www.sakshieducation.com )లో చూడొచ్చు. ఐసెట్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాకు చెందిన దంతాల పూజిత్ వర్థన్ మొదటి ర్యాంకు కైవసం చేసకోగా.. వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన అంబవరం ఉమేష్ చంద్రారెడ్డి రెండవ ర్యాంకు సాధించారు. అలాగే గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన కాట్రగడ్డ జితిన్ సాయికి మూడో ర్యాంకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా కేసముద్రానికి చెందిన వెలిశాల కార్తీక్ నాలుగో ర్యాంక్ సాధించారు. కాగా ఐసెట్ ప్రవేశ పరీక్షను జులై 27, 28 తేదీల్లో నాలుగు సెషన్లలో నిర్వహించారు. తెలంగాణతో పాటు ఏపీలో కూడా పలు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. టీఎస్ ఐసెట్-2022కు 75,952 మంది దరఖాస్తు చేసుకోగా.. 68,781 విద్యార్థులు పరీక్ష రశారు. వారిలో 61,613 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అర్హత సాధించిన అభ్యర్థుల్లో 30,409 మంది పురుషులు (89 శాతం), 31,201 మంది మహిళలు (89.34 శాతం) 3 ట్రాన్స్జెండర్లు (75 శాతం) ఉన్నారు. ఫలితాలు https://icet.tsche.ac.in అందుబాటులో ఉన్నాయి. టీఎస్ ఐసెట్-2022 ఫలితాలు కోసం క్లిక్ చేయండి -
తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: లాసెట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మధ్యాహ్నం 3.30 గంటలకు మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. మూడేళ్ల లా సెట్లో 74.76 శాతం, ఐదేళ్ల లా సెట్లో 68.57 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. పీజీ లా సెట్లో 91.10 శాతం ఉత్తీర్ణులయ్యారు. మూడేళ్లు, అయిదేళ్ల పీజీ లాసెట్ జూలై 21, 22 తేదీల్లో జరిగింది. కార్యక్రమంలో మండలి వైస్ చైర్మన్ వి.వెంకటరమణ, ఓయూ వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్ పాల్గొన్నారు. -
తెలంగాణ ఎంసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: గత నెలలో జరిగిన తెలంగాణ ఎంసెట్, ఈసెట్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ సెట్లో 90.7 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఎసెంట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో 80.41 శాతం, అగ్రికల్చర్ స్ట్రీమ్లో 88.34 శాతం ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి హైదరాబాద్ జేఎన్టీయూలో ఫలితాలను విడుదల చేశారు. ➤ టీఎస్ ఎంసెట్-2022 (ఇంజనీరింగ్) ఫలితాల కోసం క్లిక్ చేయండి ➤ టీఎస్ ఎంసెట్-2022 (అగ్రికల్చర్) ఫలితాల కోసం క్లిక్ చేయండి ➤ టీఎస్ ఈసెట్-2022 ఫలితాల కోసం క్లిక్ చేయండి ఇంజనీరింగ్: ఫస్ట్ ర్యాంక్-లక్ష్మీసాయి లోహిత్ సెకండ్ ర్యాంక్- సాయిదీపిక థర్డ్ ర్యాంక్- కార్తికేయ అగ్రికల్చర్: ఫస్ట్ ర్యాంక్- నేహ సెకండ్ ర్యాంక్-రోహిత్ థర్డ్ ర్యాంక్-తరుణకుమార్ గత నెల 18 నుంచి 20వ తేదీ వరకు ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగం, 30, 31 తేదీల్లో అగ్రి, మెడికల్ ఎంసెట్ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ విభాగానికి 1.52 లక్షలమంది, అగ్రి ఎంసెట్కు 80 వేలమంది హాజరయ్యారు. ఎంసెట్, ఈసెట్ ఫలితాల కోసం www.sakshieducation.com వెబ్సైట్కు లాగిన్ అవ్వొచ్చు. -
వైఎస్సార్ ఏఎఫ్యూ సెమిస్టర్ ఫలితాలు విడుదల
ఏఎఫ్యూ: కడపలోని డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో 2021–22 బ్యాచ్ కాలేజి ఆఫ్ ఫైన్ఆర్ట్స్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్, ఆర్కిటెక్చర్ విద్యార్థుల ప్రథమ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం విశ్వవిద్యాలయంలో ఇన్చార్జి వైస్ చాన్స్లర్ ఆచార్య మునగాల సూర్యకళావతి, రిజిస్ట్రార్ ఆచార్య ఇ.సి. సురేంద్రనాథ్రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరీక్ష ఫలితాలను సకాలంలో విడుదల చేయడం పట్ల పరీక్షల విభాగం అధ్యాపకులు, సిబ్బందిని వారు అభినందించారు. కార్యక్రమంలో డిప్యూటీ రిజిస్ట్రార్ రాజేష్కుమార్రెడ్డి, సూపరింటెండెంట్ వై. పవన్కుమార్రెడ్డి, పరీక్షల నిర్వహణ అధికారులు శ్రీలక్ష్మి, భారతి తదితరులు పాల్గొన్నారు. -
Telangana: పాలిసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: టెన్త్ ఉత్తీర్ణులకు ఇంజనీరింగ్, నాన్–ఇంజనీరింగ్, అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టీ కల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్–2022 ఫలితాలు బుధవారం వెలువడనున్నాయి. సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ ఫలితాలను ప్రకటిస్తారని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ విభాగం కార్యదర్శి డాక్టర్‘‘ సి.శ్రీనాథ్ తెలిపారు. ఉదయం 10.30 ఫలితాలు వెలువడతాయని, వెంటనే ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని ఆయన వెల్లడించారు. గత నెల 30న రాష్ట్రవ్యాప్తంగా 365 కేంద్రాల్లో పాలిసెట్ పరీక్ష జరిగింది. మొత్తం 1,13,979 మంది దరఖాస్తు చేసుకోగా, 1,04,432 (91.62 శాతం)మంది పరీక్షకు హాజరయ్యారు. పాలిసెట్ ఫలితాలు ‘సాక్షి’ వెబ్సైట్ www. sakshieducation.com లో అందుబాటులో ఉంటాయి. వెబ్సైట్కు లాగిన అయి, డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
టీజీసెట్–22 ఫలితాలు విడుదల
సాక్షి,హైదరాబాద్: సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదోతరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీసెట్–22 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. గురుకుల విద్యా సంస్థల పనితీరుపై మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆన్లైన్లో ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాలను టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్, టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్, ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ ఈఐఎస్, టీఆర్ఈఐఎస్ సొసైటీల వెబ్సైట్లలో అందుబాటులో ఉంచారు. ఈ నాలుగు సొసైటీల పరిధిలో ఐదో తరగతికి 48,440 సీట్లు ఉన్నాయి. వీటి భర్తీకి టీజీసెట్–22 నిర్వహించారు. మార్కుల ఆధారంగా అభ్యర్థులకు ప్రాధాన్యత ప్రకారం సీట్లు కేటాయించారు. ఈ పరీక్ష కోసం మొత్తంగా 1,47,324మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుని పరీక్ష రాశారు. ‘సహజ’ఉత్పత్తులను సరఫరా చేయండి రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థలు, సంక్షేమహాస్టళ్లకు ‘సహజ’ఉత్పత్తులు సరఫరా చేయాలని కొప్పుల ఈశ్వర్ సూచించారు. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన స్వయం సహాయకసంఘాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘సహజ’ద్వారా నిత్యావసరాలతోపాటు సబ్బులు, షాంపూలు, తలనూనెలు, కాస్మెటిక్స్ను ఉత్పత్తి చేస్తున్నారని వీటిని పరిశీలించి అన్ని గురుకులాలు, హాస్టళ్లకు సరఫరా చేసే అంశాన్ని పరిశీలించాలని సొసైటీ కార్యదర్శులకు ఆదేశించారు. -
NEET PG 2022 Result: నీట్ పీజీ ఫలితాలు విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: మే నెలలో నిర్వహించిన నీట్ పీజీ ప్రవేశ పరీక్ష-2022 ఫలితాలు విడదలయ్యాయి. పరీక్ష నిర్వహించిన 10 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు మాన్సుఖ్ మాండవీయ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఫలితాలు విడుదల చేయడంలో అధికారుల కృషిని కేంద్రమంత్రి ప్రశంసించారు. NEET-PG result is out! I congratulate all the students who have qualified for NEET-PG with flying colours. I appreciate @NBEMS_INDIA for their commendable job of declaring the results in record 10 days, much ahead of the schedule. Check your result at https://t.co/Fbmm0s9vCP — Dr Mansukh Mandaviya (@mansukhmandviya) June 1, 2022 నీట్ పీజీ ప్రవేశ పరీక్ష-2022 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
సివిల్స్ సర్విసెస్లో అమ్మాయిల హవా
-
AP: ఇంటర్ సప్లిమెంటరీపరీక్ష ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఇంటర్మీడియెట్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలను బోర్డు నిర్వహించింది. విద్యార్థులు ‘https:bie.ap.gov.in’ ద్వారా తమ షార్ట్ మార్కుల మెమోలను డౌన్లోడ్ చేసుకోవచ్చును. ఫలితాలకు సంబంధించిన గ్రీవెన్స్ను ‘ourbieap@gmail.com'’ ద్వారా లేదా 391282578 వాట్సాప్ నంబర్లకు సంప్రదించవచ్చని తెలిపారు. ఈ ఫలితాలను education.sakshi.com వెబ్సైట్లో చూడొచ్చు. ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల కోసం క్లిక్ చేయండి ఈ వెబ్సైట్లలో ఫలితాలు.. www.sakshieducation.com https:bie.ap.gov.in https://examresults.ap.nic.in https://results.apcfss.in -
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల
ఖరగ్పూర్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదలయ్యాయి. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను ఐఐటీ ఖరగ్పూర్ విడుదల చేసి.. ర్యాంకులు ప్రకటించింది. ర్యాంకుల ఆధారంగా 23 ఐఐటీలు సహా 114 విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందవచ్చు. మొత్తం 50 వేల సీట్లు, రేపటి నుంచి అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి.ఈ నెల 25న రిజిస్ట్రేషన్లు, 27న సీట్ల కేటాయింపు జరగనుంది. ఫలితాల కోసం క్లిక్ చేయండి -
నేడు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. జేఈఈ మెయిన్స్ ర్యాంకులు గత నెల 15వ తేదీన ప్రకటించారు. ఇందులో అర్హత సాధించిన వారు అడ్వాన్స్డ్ పరీక్ష రాశారు. జాతీయ స్థాయిలో 23 ఐఐటీలు, 32 జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలు (ఎన్ఐటీలు), 26 ట్రిపుల్ ఐటీ కాలేజీలతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక తోడ్పాటుతో నడిచే మరో 33 విద్యా సంస్థల్లో దాదాపు 50 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. కాగా దసరా రోజున వెలువడే జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకుల ఆధారంగానే ఈ సీట్లను భర్తీ చేస్తారు. దీని కోసం ఈ నెల 16వ తేదీ నుంచి జాయింట్ సీట్ అలొకేషన్ ఆథారిటీ (జోసా) కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించనుంది. అర్హత సాధించిన విద్యార్థులు అదే రోజు కౌన్సెలింగ్ కోసం పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ నెల 22, 24 తేదీల్లో జోసా మాక్ కౌన్సెలింగ్ నిర్వహించనుంది. తాము సాధించిన ర్యాంకుల ఆధారంగా ఎక్కడ సీటు వస్తుందో విద్యార్థులు తెలుసుకునేందుకు దీనిద్వారా వీలుంటుంది. ఇది ముగిసిన తర్వాత అధికారికంగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఈ నెల 25 వరకు వెబ్ ఆప్షన్లలో ఎన్నిసార్లయినా మార్పులు చేసుకోవచ్చు. 25వ తేదీ అర్ధరాత్రి తర్వాత దీని గడువు ముగుస్తుంది. 27న ఉదయం 10 గంటలకు తొలి రౌండ్ సీట్లు కేటాయిస్తారు. సీట్లు వచ్చిన అభ్యర్థులు ఈ నెల 30 నాటికి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నవంబర్ 1న రెండో విడత, 6న మూడో విడత, 10న నాల్గవ విడత, 10న నాల్గవ విడత, 14న ఐదవ విడత, 18న ఆరవ విడత కౌన్సెలింగ్ చేపడతారు. ఆఖరి విడతలో సీట్లు దక్కిన వాళ్ళు నవంబర్ 20 నాటికి రిపోర్ట్ చేయాలి. అటో ఇటో తేలిపోతుంది జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకులు ప్రకటించిన తర్వాత విద్యార్థులకు ఓ స్పష్టత వచ్చే వీలుంది. ఎంసెట్లో మంచి ర్యాంకులు పొందినవారు టాప్ టెన్ కాలేజీల్లో సీట్లు దక్కించుకున్నారు. వీరు జెఈఈ అడ్వాన్స్డ్లో కూడా మంచి ర్యాంకు సాధించి ఐఐటీ లేదా ఎన్ఐటీలో నచ్చిన బ్రాంచ్లో సీటు పొందగలిగితే రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో వచ్చిన సీటును వదులుకునే అవకాశం ఉంది. -
ఎంసెట్ అగ్రి, మెడికల్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ ఫలితాలు వెలువడ్డాయి. శనివారం జేఎన్టీయూహెచ్లోని యూజీసీ–హెచ్ఆర్డీసీ ఆడిటోరియంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ఫలితాలు విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఇంజనీరింగ్, అగ్రికల్చరల్–మెడికల్ స్ట్రీమ్ పరీక్షలు వేర్వేరుగా నిర్వహించారు. తొలుత ఇంజనీరింగ్ ఫలితాలు ప్రకటించారు. గత నెల 28, 29 తేదీల్లో జరిగిన అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ పరీక్షలకు సంబంధించి ఫలితాలను తాజాగా విడుదల చేశారు. ఎంసెట్ అగ్రికల్చరల్–మెడికల్ స్ట్రీమ్ కేటగిరీలో 78,981 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 63,857 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 59,113 మంది అర్హత సాధించారు. హాజరైన విద్యార్థుల్లో 92.57 శాతం మంది క్వాలిఫై అయ్యారు. తొలి 3 ర్యాంకులు బాలికలవే.. టీఎస్ ఎంసెట్–20 అగ్రికల్చరల్–మెడికల్ స్ట్రీమ్లో టాప్10 ర్యాంకుల్లో తొలి 3 ర్యాంకులను బాలికలే కైవసం చేసుకున్నారు. మిగతా 7 స్థానాల్లో బాలురు ఉన్నారు. టాపర్గా ఏపీకి చెందిన గుత్తి చైతన్య సింధు నిలిచారు. కేటగిరీల వారీగా పరిశీలిస్తే... ఈ పరీక్షల్లో బాలురు 20,127 మంది పరీక్షకు హాజరు కాగా 18,377 మంది (91.30%) అర్హత సాధించారు. 43,730 మంది బాలికలు పరీక్ష రాయగా 40,736 మంది (93.15%) అర్హత సాధించారు. ఎంసెట్ అగ్రి, మెడికల్ స్ట్రీమ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. -
సచివాలయం అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫలితాలు విడుదల
-
ఏపీ ఎంసెట్ 2019 ఫలితాలు విడుదల
-
ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్-2019 ఫలితాలను విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి ప్రిన్సిపల్ కార్యదర్శి విజయరాజు సోమవారం ఉదయం 11.30 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఎంసెట్లో 74.39 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. తెలుగు రాష్ట్రల నుంచి మొత్తం 2,82,711 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఎంసెట్ ఇంజనీరింగ్కు 1,85,711 మంది రాయగా.. 1,35,160 (74.39శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. వ్యవసాయ, వైద్య విభాగ పరీక్షకు 81,916 మంది విద్యార్థులు హాజరకాగా 68, 512 (83.64శాతం) మంది క్యాలీఫై అయినట్లు అధికారులు వెల్లడించారు. పులిశెట్టి రవిశ్రీ తేజ ఎంసెట్ ఇంజనీరింగ్లో స్టేట్ ర్యాంకు, వేద ప్రణవ్ రెండో ర్యాంకు సాధించారు. మెడికల్లో సుంకర సాయి స్వాతి స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించారు. ఆయా ర్యాంకుల వివరాలను విద్యార్థుల నంబర్లకు పంపనున్నట్లు విజయరాజు తెలిపారు. కాగా ఏపీ ఎంసెట్కు 36,698 మంది తెలంగాణ విద్యార్థులు పరీక్ష రాశారు. ( ఏపీ ఎంసెట్ ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి ) సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇంజనీరింగ్ టాప్టెన్ ర్యాంకర్లు 1. కరిశెటి రవి శ్రీతేజ 2.వేద ప్రణవ్ 3.గొర్తి భాను దత్తు 4. హేథవావ్య 5. బట్టెపాటి కార్తికేయ 6.రిషి షర్రష్ 7.సూర్య లిఖిత్ 8. అప్పలకొండ అభిజిత్ రెడ్డి 9. ఆర్యన్ లద్దా 10.హేమ వెంటక అభినవ్ అగ్రికల్చర్, మెడికల్ టాప్టెన్ ర్యాంకర్లు 1.సుంకర సాయి స్వాతి 2. దాసరి కిరణ్కుమార్ రెడ్డి 3. అత్యం సాయి ప్రవీణ్ గుప్తా 4. తిప్పరాజు రెడ్డి 5.జీ మాధురి రెడ్డి 6. గొంగటి కృష్ణ వంశీ 7. కంచి జయశ్రీ వైష్ణవీ వర్మ 8. భీ. సుభిక్ష 9. కొర్నెపాటి హరిప్రసాద్ 10. ఎంపటి కుశ్వంత్ -
ఏపీ ఈసెట్-2019 ఫలితాలు విడుదల
-
500కు 499 మార్కులు.. మళ్లీ వాళ్లే టాప్!
న్యూఢిల్లీ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) పన్నెండో తరగతి ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. ఈ ఏడాది 84.3 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని సంబంధిత అధికారులు తెలిపారు. అయితే ఎప్పటిలాగే ఈసారి కూడా ఉత్తీర్ణత శాతంలో విద్యార్థినులే ముందున్నారు. అదేవిధంగా మొదటి రెండు స్థానాల్లోనూ నిలిచి మరోసారి సత్తా చాటారు. 500 గానూ 499 మార్కులు సాధించిన ఇద్దరు విద్యార్థినులు హన్సికా శుక్లా, కరీష్మా అరోరా టాప్ స్కోరర్లుగా నిలిచారు. వీరిద్దరు ఉత్తరప్రదేశ్కు చెందిన వారే కావడం విశేషం. ఇక 498 మార్కులతో ముగ్గురు విద్యార్థినులు గౌరంగీ చావ్లా, ఐశ్వర్య(రిషికేశ్), భవ్య(హర్యానా) సంయుక్తంగా రెండో స్థానం సంపాదించారు. కాగా సీబీఎస్ఈ టాపర్గా నిలిచిన హన్సికకు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు.. ‘ సీబీఎస్ఈ పన్నెండో తరగతి ఫలితాల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన హన్సికా శుక్లాకు అభినందనలు’ అని ఆయన ట్వీట్ చేశారు. ఇక గతేడాది కూడా ఉత్తరప్రదేశ్కు చెందిన మేఘన శ్రీవాస్తవ 500 మార్కులకు గానూ 499 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలవగా, అదే రాష్ట్రానికి చెందిన మరో విద్యార్థిని అనౌష్క చంద్ర 498 మార్కులతో రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. -
సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాలు వెల్లడి
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ ప్రధాన పరీక్ష ఫలితాలను గురువారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) విడుదల చేసింది. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులు వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 నుంచి దేశ రాజధానిలోని యూపీఎస్సీ కార్యాలయంలో ప్రారంభమయ్యే ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. దీనికి హాజరయ్యే అభ్యర్థులు తమ వయస్సు, విద్యార్హతలు, కుల ధ్రువీకరణ తదితర అవసరమైన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను అందజేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 60 మంది ఎంపికైనట్లు శిక్షణా సంస్థలు అంచనా వేస్తున్నాయి. మెయిన్స్లో అర్హత పొందని వారి మార్కులను ఇంటర్వ్యూలు పూర్తయిన 15 రోజుల్లోగా యూపీఎస్సీ వెబ్సైట్లో ఉంచుతుంది. -
యూజీసీ–నెట్ ఫలితాల విడుదల
న్యూఢిల్లీ: జూలై 8న దేశవ్యాప్తంగా నిర్వహించిన యూజీసీ–నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్) ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) మంగళవారం విడుదలచేసింది. పరీక్ష రాసేందుకు దేశవ్యాప్తంగా 11,48,235 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా అందులో 8,59,498 మంది పరీక్ష రాశారు. వీరిలో 55,872 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హత సాధించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుతోపాటు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కు దరఖాస్తు చేసుకునేందుకు 3,929 మంది అర్హత సాధించారు. ఈసారి పరీక్షల విధానంలో మార్పులు తెచ్చారు. 84 సబ్జెక్టులకు పరీక్ష నిర్వహించారు. మూడు పేపర్ల విధానాన్ని వదిలేసి రెండు పేపర్లకు పరీక్ష చేపట్టారు. -
సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాల విడుదల
న్యూఢిల్లీ: ఐఏఎస్, ఐపీఎస్ తదితర సర్వీసుల ఎంపికకు నిర్వహించిన సివిల్ సర్వీసెస్–2018 ప్రిలిమ్స్ ఫలితాలను యూపీఎస్సీ శనివారం విడుదల చేసింది. మెయిన్స్కు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. తెలంగాణ నుంచి సుమారు 12 వేల మంది ఈ పరీక్షకు హాజరు కాగా, 600 మంది మెయిన్స్కు అర్హత పొందారు. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 7 వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. దానికి మూడు వారాల ముందు ఈ–అడ్మిట్ కార్డులు, టైం టేబుల్ను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. ప్రిలిమ్స్ గట్టెక్కిన అభ్యర్థులు మెయిన్స్కు దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యేకంగా డిటెయిల్డ్ అప్లికేషన్ ఫారం(డీఏఎఫ్)ను నింపాలి. ఈ నెల 23 నుంచి ఆగస్టు 6 మధ్య యూపీఎస్సీ వెబ్సైట్లో ఆ ఫారం అందుబాటులో ఉంటుంది. -
నేడు ఓయూసెట్ ఫలితాలు
హైదరాబాద్: ఓయూసెట్–2018 ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. క్యాంపస్లోని గెస్ట్హౌస్లో మధ్యాహ్నం 12గంటలకు వీసీ ప్రొఫెసర్ రాంచంద్రం ఫలితాలను విడుదల చేయనున్నట్లు పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ కిషన్ తెలిపారు. ఉస్మానియా వెబ్సైట్తో పాటు, ఇతర సైట్లలో కూడా ఫలితాలను చూడవచ్చన్నారు. గతనెల 4 నుంచి 13 వరకు జరిగిన ఓయూసెట్కు 71 వేల మంది అభ్యర్థులు హాజరైన విషయం విదితమే. సివిల్ సర్వీసెస్కు ఉచిత శిక్షణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ పరీక్షల (ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ) కోసం ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నారు. హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో ఉన్న గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్లో నిర్వహించే ఈ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 9 నెలల శిక్షణలో భాగంగా హాస్టల్ వసతి కల్పిస్తామని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ వి.సర్వేశ్వర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. http://studycircle.cgg.gov.in వెబ్సైట్ ద్వారా ఈ నెల 5 నుంచి వచ్చే నెల 4 వరకు రిజిస్టర్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 040–27540104 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
ఎస్జీటీ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లోని టీచర్ పోస్టుల భర్తీలో భాగంగా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టుల రాత పరీక్షల ఫలితాలను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. 8 మీడియాలకు సంబంధించిన 82,537 మంది అభ్యర్థుల ర్యాంకులను ప్రకటిం చింది. వాటిని తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. హాల్టికెట్ నంబర్, బుక్లెట్ సిరీస్ వంటి వాటికి సంబంధించి తప్పుడు బబ్లింగ్ చేసిన వారిని రిజెక్ట్ చేశామని, మెరిట్ జాబితాలో చేర్చలేదని పేర్కొంది. కోర్టును ఆశ్రయించి, జాబితాలో చేర్చాలని కోర్టు ఇచ్చిన వారి పేర్లను మాత్రమే చేర్చామని వెల్లడించింది. కోర్టు తుది తీర్పునకు లోబడి వారి ర్యాంకింగ్ ప్రకటిస్తున్నట్లు తెలిపింది. రెండు, మూడు రోజుల తర్వాత జిల్లాల వారీగా ఆయా కేటగిరీల్లో పోస్టులకు 1:3 రేషియోలో అభ్యర్థుల మెరిట్ జాబితాలను ప్రకటించేందుకు టీఎస్పీఎస్సీ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం టీచర్ల బదిలీల ప్రక్రియ కొనసాగుతున్నందున జిల్లాల్లో వెరిఫికేషన్ చేపట్టే పరిస్థితి లేదని విద్యాశాఖ ఇప్పటికే తెలిపింది. వెరిఫికేషన్కు 1:3 రేషియోలో అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసి ఉంచాలని, వారు ఎప్పుడు అడిగితే అప్పుడు జిల్లా కలెక్టర్లకు పంపించేలా టీఎస్పీఎస్సీ సిద్ధం చేస్తోంది. అభ్యర్థుల వివరాలిలా.. మీడియం అభ్యర్థులు తెలుగు 52,452 ఇంగ్లిష్ 27,924 ఉర్దూ 2,033 కన్నడ 54 మరాఠీ 44 హిందీ 28 బెంగాళీ 1 తమిళ్ 1 -
సీబీఎస్ఈ: టాప్లో బస్ డ్రైవర్ కొడుకు
సాక్షి, న్యూఢిల్లీ: పట్టుదలగా ప్రయత్నిస్తే ఫలితాలు వాటంతటవే వస్తాయని మరోసారి రుజువైంది. ఢిల్లీ ట్రాన్స్పోర్టు కార్పోరేషన్లో పనిచేస్తున్న బస్ డ్రైవర్ కొడుకు శనివారం విడుదలైన సీబీఎస్ఈ ఫలితాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచాడు. ఖరీదైన, ‘హైటెక్’ ప్రైవేటు విద్యాలయాల్లో చదివితేనే ర్యాంకులు వస్తాయనే అపోహను పటాపంచలు చేశాడు. శనివారం విడుదలైన సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో ఢిల్లీకి చెందిన ప్రిన్స్ కుమార్ 500 మార్కులకు 485 సాధించి సైన్స్ విభాగంలో ప్రభుత్వ పాఠశాలల్లో టాపర్గా నిలిచాడు. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి ట్విటర్లో స్పందిస్తూ.. కుమార్ ప్రభుత్వ విద్యాలయాల పట్ల నమ్మకాన్ని పెంచాడని అభినందించారు. ద్వారకా ప్రాంతంలోని సెక్టార్ 10లో గల రాజ్కియా ప్రతిభా వికాస్ విద్యాలయలో విద్యనభ్యసిస్తున్న కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో ప్రభుత్వం విద్యా పునర్వైభవానికి చర్యలు తీసుకుంటోందని చెప్పాడు. ‘మా పాఠశాలలో సౌకర్యాలు చాలా బాగున్నాయి. నా విజయంలో నిపుణులైన మా ఉపాధ్యాయుల సహకారం మరువలేనిది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన వర్గాల పిల్లలు ఎక్కువగా చేరుతుంటారు. మా వెన్నుతట్టి ప్రోత్సహిస్తే ఫలితాలు బాగుంటాయ’ని కుమార్ తెలిపాడు. తమ పాఠశాలలో పనిచేసే మాస్టార్లు ప్రైవేటు బడుల్లో పనిచేసే వారికంటే ఉన్నత విద్యావంతులని కుమార్ వెల్లడించాడు. ఎలక్ర్టానిక్స్ అండ్ కమ్యునికేషన్స్లో ఇంజనీరింగ్ చేస్తానని కుమార్ తెలిపాడు. హ్యూమనిటీస్ విభాగంలో 95.6 శాతం మార్కులతో చిత్రా కౌశిక్ మొదటి స్థానంలో నిలవగా, కామర్స్ విభాగంలో 96.2 శాతం మార్కులతో ప్రాచి ప్రకాశ్ టాపర్గా నిలిచారు. విద్యా శాఖను పర్యవేక్షిస్తున్న సిసోడియా వారిని ట్విటర్లో అభినందించారు. మంచి ఫలితాలతో ఎంతో మంది అమ్మాయిలకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. 168 ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదైందని సిసోడియా ఆనందం వ్యక్తం చేశారు. కాగా, సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో ఈసారి ఉత్తీర్ణత పెరిగింది. గతేడాది 82.02 శాతంగా ఉన్న ఉత్తీర్ణత ఈ యేడు 83.01 శాతానికి పెరిగింది. Very proud moment, just congratulated Prince Kumar,topper of Delhi Govt school, Science stream in Class 12, Son of a DTC bus driver has got 97% with 100/100 in Maths, 99/100 Eco, 98/100 in Chemistry #DelhiEducationRevolution pic.twitter.com/IeaxhNpX9m — Manish Sisodia (@msisodia) May 26, 2018 It was also touching moment to speak to Prachi Prakash and her family, topper of Delhi Govt school, Commerce stream in Class 12 Daughter of a small private company executive, Prachi got 96.2% with 100/100 in Eco, 99/100 in Math, #DelhiEducationRevolution pic.twitter.com/lQ4eqCXAi8 — Manish Sisodia (@msisodia) May 26, 2018 Was wonderful to talk to a very excited Chitra Kaushik, topper of Delhi Govt school, Arts stream in Class 12 Daughter of an ASI in Delhi Police, she got 95.6% with 100/100 in History, 97/100 in Pol. Science#DelhiEducationRevolution pic.twitter.com/1xr4qZkXOV — Manish Sisodia (@msisodia) May 26, 2018 -
500కు 499 మార్కులు..!
సాక్షి, న్యూఢిల్లీ : గత నెల రోజులుగా విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) పన్నెండో తరగతి ఫలితాలను శనివారం వెల్లడించారు. అయితే ఎప్పటిలాగే ఈసారి కూడా ఉత్తీర్ణత శాతంలో విద్యార్థినులే ముందున్నారు. అదేవిధంగా మొదటి మూడు స్థానాల్లోనూ నిలిచి మరోసారి సత్తా చాటారు. ఉత్తరప్రదేశ్కు చెందిన మేఘన శ్రీవాస్తవ 500 మార్కులకు గానూ 499 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలవగా, అదే రాష్ట్రానికి చెందిన మరో విద్యార్థిని అనౌష్క చంద్ర 498 మార్కులతో రెండో స్థానంలో నిలిచారు. రాజస్థాన్కు చెందిన చాహత్ బోద్రాజ్ 497 మార్కులు సాధించి మరో ఆరుగురు విద్యార్థినులతో సంయుక్తంగా మూడో స్థానాన్ని ఆక్రమించారు. అసలు ఊహించలేదు... సీబీఎస్ఈ ఆలిండియా టాపర్ మేఘన శ్రీవాత్సవ మీడియాతో మాట్లాడుతూ.. ‘ టాపర్గా నిలవడానికి నేను ప్రత్యేకంగా ట్యూషన్కి కూడా వెళ్లలేదు. మంచి మార్కులు వస్తాయని ఊహించాను. కానీ టాపర్గా నిలుస్తాననుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. సంవత్సరమంతా ఎంతో కష్టపడి చదివాను. అందుకు ఫలితంగా నేడు నా కల నిజమైంది. హార్డ్వర్క్ చేయడంతోపాటు.. నిలకడ, నిబద్ధత కూడా చాలా ముఖ్యం. ఒత్తిడికి లోనైతే ఏమీ సాధించలేమంటూ’ తన విజయ రహస్యాన్ని వెల్లడించారు. హ్యుమానిటీస్ అభ్యసించిన తాను సైకాలజిస్ట్ కావాలనుకుంటున్నానని మేఘన తెలిపారు. మరో విద్యార్థిని చాహత్ బోద్రాజ్ కూడా సైకాలజిస్ట్గా మంచి పేరు తెచ్చుకోవడమే తన ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. కాగా ఫలితాల్లో త్రివేండ్రం (97.32 శాతం), చెన్నై (93.87 శాతం), ఢిల్లీ (89 శాతం) తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగింది. 2017లో 82.02మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, ఈ ఏడాది 83.01 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అయితే ఈసారి కూడా 88.31 శాతం ఉత్తీర్ణతో విద్యార్థినులే ముందంజలో ఉండగా.. విద్యార్థులు 78.09 శాతం ఉత్తీర్ణత సాధించారు. -
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
సాక్షి, న్యూఢిల్లీ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) 12వ తరగతి పరీక్షా ఫలితాలను శనివారం వెల్లడించారు. 12వ తరగతి పరీక్షల్లో మొత్తం 83.1 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఘజియాబాద్కు చెందిన మేఘనా శ్రీవాత్సవ (499/500) టాపర్గా నిలిచారు. ఫలితాల్లో త్రివేండ్రం (97.32 శాతం), చెన్నై (93.87 శాతం), ఢిల్లీ (89 శాతం) తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. కాగా గత ఏడాది కంటే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగింది. 2017లో 82.02మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, ఈ ఏడాది 83.01 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మరోవైపు ఎప్పటిలాగానే ఉత్తీర్ణతలో విద్యార్థినులే ముందంజలో ఉన్నారు. -
ఏపీ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు
సాక్షి, విశాఖ : ఏపీ ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రా యూనివర్శిటీలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో జూనియర్ ఇంటర్ పరీక్ష ఫలితాలను శుక్రవారం మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. 62శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో కృష్ణాజిల్లా ప్రథమ స్థానం, పశ్చిమ గోదావరి రెండో స్థానం, గుంటూరు జిల్లా మూడో స్థానంలో నిలవగా 48 శాతం ఉత్తీర్ణతతో వైఎస్సార్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ.. మార్కులు ఇవ్వడం వల్ల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అటువంటి ఆత్మహత్యలను నియంత్రించేందుకు గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు.సుమారు నాలుగు లక్షల ఎనభైవేలమంది పరీక్షకు హాజరు కాగా వారిలో 2,95, 891 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత రెండు శాతం తగ్గింది. ఇక ఉత్తీర్ణత సాధించిన వారిలో బాలికలే పైచేయిగా నిలిచారు. పరీక్ష ఫలితాలను ప్రభుత్వం 44 వెబ్సైట్లలో అందుబాటులో ఉంచింది. వీటితో పాటు www.sakshieducation.com వెబ్సైట్లోను పరీక్షా ఫలితాలను చూడవచ్చు. ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు (జనరల్) - ఇక్కడ చూడండి ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు (వొకేషనల్) - ఇక్కడ చూడండి -
తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు విడుదల
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్మీడియెట్ ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇంటర్ బోర్డు కార్యాలయ ఆవరణలో ఉదయం 9 గంటలకు ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్లో 62.35 శాతం ఉత్తీర్ణులు కాగా, సెకండియర్లో 67.25 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. యథావిధిగా ఈసారి కూడా ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో బాలికలే పైచేయిగా నిలిచారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సారి ఉత్తీర్ణత శాతం పెరిగినట్లు తెలిపారు. రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ దరఖాస్తుకు ఏప్రిల్ 20 వరకు గడువు విధించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇకపై ప్రభుత్వ కళాశాలల్లో జేఈఈ, నీట్లకు ప్రత్యేక కోచింగ్ ఇవ్వనున్నట్లు కడియం శ్రీహరి తెలిపారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 14వ తేదీ వరకు జరిగిన పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,63,546 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 4,55,635 మంది ఫస్టియర్ కాగా.. 5,07,911 మంది సెకండియర్ విద్యార్థులున్నారు. ఇంటర్ ఫస్టియర్లో 2,84,224 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అలాగే 4,29,378 మంది విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాయగా, వీరిలో 2,88,772 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ఫస్టియర్లో 62.35 శాతం విద్యార్థులు ఉత్తర్ణత ఫస్టియర్లో బాలికలు 69 శాతం, బాలురు 55.66 శాతం ఉత్తీర్ణత ఫస్టియర్లో మేడ్చల్ జిల్లా ప్రథమ, రంగారెడ్డి జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింది ఇంటర్ సెకండియర్లో 67.25 శాతం ఉత్తీర్ణత సెకండియర్లో బాలికలు 73.25, బాలురు 61 శాతం ఉత్తీర్ణత ఫలితాల్లో కొమరం భీం జిల్లా తొలి, రంగారెడ్డి జిల్లా ద్వితీయ స్థానాల్లో నిలిచాయి 40 శాతం ఉత్తీర్ణతతో మహబూబాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్థులు 87 శాతం ఉత్తీర్ణత సాంఘిక సంక్షేమ కళాశాలల్లో 86 శాతం ఉత్తీర్ణత ప్రభుత్వ కాలేజీల్లో 70 శాతం, ప్రైవేట్ కాలేజీల్లో 69 శాతం ఉత్తీర్ణత ‘టీఎస్బీఐఈ సర్వీసెస్’ మొబైల్ యాప్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు. జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు తమ కాలేజీల వారీ ఫలితాలను తమ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఉపయోగించి http://admi.tsbie.cgg.gov. in వెబ్సైట్లో పొందవచ్చు. ఫలితాల కోసం www.sakshieducation.com -
తమిళ దర్శకుల సంఘం ఎన్నికలు
తమిళసినిమా: తమిళ దర్శకుల సంఘం ఎన్నికలు ఆదివారం ఉదయం స్థానిక వడపళనిలోని మ్యూజిక్ అసోసియేషన్ ఆవరణలో జరిగాయి. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ ఎన్నికలు ప్రస్తుత నిర్వాహకుల గడువు ముగియడంతో ఆదివారం ఎన్నికల అధికారి మాజీ మేజిస్ట్రేట్ బాలసుబ్రహ్మణ్యం సమక్షంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో దర్శకుడు విక్రమన్ అధ్యక్షతన పుదు వసంతం జట్టు, పుదియ అలైగళ్ జట్లు పోటీ పడ్డాయి. అయితే పుదు వసంతం జట్టుకు చెందిన దర్శకుడు విక్రమన్ అధ్యక్షుడుగాను, ఆర్కే సెల్వమణి కార్యదర్శిగాను పోటీలేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా, కోశాధికారి, ఉపాధ్యక్షుడు, ఉపకార్యదర్శి, కార్యవర్గ సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగాయి. పుదు వసంతం జట్టులో ఉపాధ్యక్షుడు పదవికి కేఎస్ రవికుమార్, ఆర్వీ ఉదయకుమార్, ఉపకార్యదర్శి పదవికి రమేష్ఖన్నా, మనోజ్కుమార్, ఎ.వెంకటేశ్, అరివళగ¯Œలు, కోశాధికారి పదవికి పేరరసు పోటీ బరిలో ఉన్నారు. కార్యవర్గ సభ్యుల పదవులకు చిత్రా లక్ష్మణన్, మనోబాలా, సుందర్ సి, ఎళిల్, లింగుస్వామి, కదిర్, ఆర్.కన్నన్, ఏకాంబవానన్, తంబిరాజన్, ఆర్కే కన్నన్, ముత్తువడుగు, భూమినాథన్ పోటీ పడ్డారు. అదేవిధంగా పుదియ అలైగల్ జట్టులో కోశాధికారి పదవికి జగదీశన్, ఉపాధ్యక్షుడి పదవికి సుబ్రమణ్య శివ, ఉపకార్యదర్శి పదవులకు బాలమురళీ వర్మ, ఐదుకోవివాన్, నాగరాజన్, మణికంఠన్, రామకృష్ణన్ పోటీపడ్డారు. ఇండిపెండెంట్ అభ్యర్థి రాందాస్ పోటీలో నిలబడ్డారు. సంఘంలో మొత్తం 3,400 మంది సభ్యులుండగా అందులో 2,300 సభ్యులకు మాత్రమే ఓటు హక్కు ఉంది. వీరందరూ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల ఫలితాలు ఆదివారం అర్ధరాత్రి తరువాత విడుదలయ్యాయి. -
టీఎస్ లాసెట్-2017 ఫలితాలు విడుదల
వరంగల్ : తెలంగాణ రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో మూడేళ్ల, ఐదేళ్ల, పీజీ న్యాయశాస్త్ర కోర్సుల్లో ఈ విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్-2017 ఫలితాలు శనివారం విడుదల అయ్యాయి. ఫలితాలను కేయూ ఉపకులపతి ఆచార్య ఆర్.సాయన్న శనివారం ఉదయం 9 గంటలకు హన్మకొండలోని విశ్వవిద్యాలయ న్యాయ కళాశాలలో విడుదల చేశారు. మొత్తం 87 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రెండు శాతం ఉత్తీర్ణత పెరిగింది. లాసెట్ను మూడోసారి కాకతీయ విశ్వవిద్యాలయమే నిర్వహించింది. -
ఏఈవో గ్రేడ్-2 ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్ : అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ - గ్రేడ్-2 (ఏఈవో) పోస్టుల ఫలితాలను టీఎస్పీఎస్సీ సోమవారం ప్రకటించింది. వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్న 1,311 పోస్టులకు రెండు దఫాలుగా రాత పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షల్లో ఎంపికైన 1,258 మంది అభ్యర్థుల జాబితాను టీఎస్పీఎస్సీ వెబ్సైట్ (tspsc.gov.in)లో పొందవచ్చని తెలిపింది. రెండు నోటిఫికేషన్లలో 9 జిల్లాల వారీగా ఎంపికైన అభ్యర్థుల సంఖ్య ఇలా ఉన్నాయి. జిల్లా 4/2016 నోటిఫికేషన్ 19/2015 నోటిఫికేషన్ ఆదిలాబాద్ 141 35 కరీంనగర్ 64 68 ఖమ్మం 62 29 మహబూబ్నగర్ 209 34 మెదక్ 111 19 నల్గొండ 121 45 నిజమాబాద్ 116 15 రంగారెడ్డి 5 26 వరంగల్ 146 12 మొత్తం 975 283. -
తెలంగాణ ఈ సెట్ ఫలితాలు విడుదల
హైదరాబాద్: తెలంగాణ ఈ సెట్-2016 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి శనివారం సాయంత్రం విడుదల చేశారు. మొత్తం 26,408 మంది పరీక్ష రాయగా.. 24,731మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఫలితాల కోసం క్లిక్ చేయండి -
సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఫలితాలు విడుదల
గోదావరిఖని: సింగరేణిలో 471 జూనియర్ అసిస్టెంట్ (క్లర్క్) ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలను ఆదివారం ప్రకటించారు. జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఈనెల 11న ఈ పరీక్ష నిర్వహించారు. ఆదివారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో జేఎన్టీయూ కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ విశ్వనాథ్ సింగరేణి రిక్రూట్మెంట్ సెల్ జీఎం సి.మల్లయ్యపంతులుకు ఫలితాలను అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 170 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 70,509 మంది హాజరుకాగా, వీరిలో 96% మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాల్లో మొత్తం 150 మార్కులకు 90.66 మార్కులు సాధించి ఆది లాబాద్ జిల్లాకు చెందిన మాటేటి కృష్ణ మొదటి స్థానంలో నిలిచాడు. ఫలితాలను సింగరేణి వెబ్సైట్లో పెట్టామని రిక్రూట్మెంట్ సెల్ జీఎం తెలిపారు. తప్పొప్పులపై తమ విజ్ఞప్తులను ఈ నెల 28 వరకు రిక్రూట్మెంట్ సెల్ దృష్టికి తీసుకురావాలని కోరారు. వీరు ఈ నెల 10కి ముందు తీసిన సర్టిఫికెట్ల ఆధారాలతో రావాలని సూచించారు. ఆ తర్వాతే తుది జాబితా విడుదల చేస్తామన్నారు. -
అంబేద్కర్ వర్సిటీ ప్రవేశపరీక్ష ఫలితాల విడుదల
బంజారాహిల్స్(హైదరాబాద్): డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం డిగ్రీ అర్హత పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం విశ్వ విద్యాలయం గత నెల 30న అర్హత పరీక్షను నిర్వహించింది. మొత్తం 14,403 మంది అభ్యర్ధులు పరీక్ష రాయగా ఇందులో 12,487 మంది ఉత్తీర్ణులైనట్లు అధికారులు వెల్లడించారు. ఫలితాలను అంబేద్కర్ వర్సిటీ వెబ్సైట్లో చూసుకోవచ్చని, అడ్మిషన్లకు ఈ నెల 25 చివరి తేదీ అని వారు తెలిపారు. -
తెలంగాణ ఎడ్సెట్ ఫలితాల విడుదల
హైదరాబాద్: తెలంగాణ ఎడ్సెట్ - 2015 ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి గురువారం విడుదల చేశారు. సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఆయన ఫలితాలు వెల్లడించారు. పరీక్ష రాసిన వారిలో 99.04 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్టు ఆయన తెలిపారు. ఎడ్సెట్ ఫలితాలను www.edcet.org అనే వెబ్సైట్లో చూడవచ్చని ఎడ్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ప్రసాద్ తెలిపారు. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. -
నేడు ఈ సెట్ పరీక్ష ఫలితాలు విడుదల
అనంతపురం(యూనివర్సిటీ): అనంతపురంలోని జేఎన్టీయూలో శుక్రవారం ఈసెట్ (ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ పరీక్ష ) ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఏపీ కన్వీనర్ ఆచార్య పిఆర్ భానుమూర్తి తెలిపారు. -
బాలికలదే పైచేయి
ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల విశాఖపట్నం: ఈసారి ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఈ పరీక్ష ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం విశాఖపట్నంలో విడుదల చేశారు. ఈ పరీక్షల్లో రాష్ట్రవ్యాప్తంగా 91.42 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక ఫలితాల్లో వైఎస్సార్ జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది. ఆ జిల్లాలో 98.54 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. రెండు, మూడు స్థానాలను తూర్పుగోదావరి (96.75శాతం), పశ్చిమగోదావరి(95.15శాతం) జిల్లాలు దక్కించుకున్నాయి. సీఎం చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లా 71.29 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. జూన్ 18 నుంచి టెన్త్ సప్లమెంటరీ పరీక్షలు: పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలను జూన్ 18వ తేదీ నుంచి జూలై 1వ తేదీ వరకూ నిర్వహించనున్నారు. బుధవారం పరీక్షల షెడ్యూల్ను వెల్లడించారు. పరీక్ష ఫీజును జూన్ 2వ తేదీ లోపు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు చెల్లించాల్సి ఉంటుంది. -
నేడు ఇంటర్ ద్వితీయ ఫలితాలు
-
నేడు ఇంటర్ ద్వితీయ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సర ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. విద్యాశాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సోమవారం ఉదయం 10 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయంలో ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలను విద్యార్థులు www.sakshieducation.com, http://examresults.tc.nic.in, http://re sults.cgg.gov.in తదితర వెబ్సైట్ల నుంచి పొందవచ్చు. కళాశాలల ప్రధానోపాధ్యాయులు తమ కళాశాల ఫలితాలను - http://bie.telangana.cgg.gov.in వెబ్సైట్ నుంచి పొందవచ్చు. దీనికి సంబంధిత కళాశాలలకు బోర్డు కేటాయించిన యూజర్ ఐడీ, పాస్వర్డ్ను వినియోగించాలి. మార్చి 9 నుంచి 27 వరకు జరిగిన ఇంటర్ ద్వితీయ వార్షిక పరీక్షలకు 5,06,789 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 4.77 లక్షల మంది హాజరయ్యారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులు 3,78,972 మంది ఉండగా 93,567 మంది ప్రైవేటు విద్యార్థులున్నారు. ఒకేషనల్ విభాగంలో మరో 34 వేల మంది పరీక్షలు రాశారు. ఇలా కూడా తెలుసుకోవచ్చు ఈ-సేవ ఆధ్వర్యంలోని పరిష్కారం కాల్సెంటర్ నెంబర్కు కాల్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్ నుంచి 1100, ఇతర ల్యాండ్లైన్లు/ మొబైల్ ఫోన్ల నుంచి 18004251110 నెంబర్కు కాల్ చేస్తే ఫలితాలు చెబుతారు. ఈ-సేవ, మీ-సేవ, రాజీవ్ సిటిజన్ సెంటర్స్, ఏపీఆన్లైన్ సెంటర్ల నుంచి సైతం ఫలితాలను పొందవచ్చు. ఐవీఆర్ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పా న్స్ సిస్టమ్) ద్వారా ఎయిర్టెల్ వినియోగదారులు 5207051, వొడాఫోన్ వినియోగదారులు 58888511, అన్నిఫోన్ల వినియోగదారులు 58888కు కాల్ చేసి ఫలితాలు పొందవచ్చు. -
ఈసారి కూడా బాలికలదే హవా..
-
ఈసారి కూడా బాలికలదే హవా..
హైదరాబాద్ : ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం పరీక్షల ఫలితాల్లో బాలికలే పైచేయిగా నిలిచారు. బాలురు కన్నా బాలికల ఉత్తీర్ణత 16శాతం ఎక్కువగా ఉంది. ఒకేషనల్ కోర్సులో కూడా బాలికలే ప్రథమంగా నిలిచారు. మరోవైపు ఫలితాల్లో 71 శాతంతొ రంగారెడ్డి జిల్లా తొలి స్థానంలో ఉండగా, 43 శాతంతో నల్గొండ జిల్లాలో చివరి స్థానంలో నిలిచింది. ఏప్రిల్ 26 నుంచి మార్కుల జాబితా పొందవచ్చు. -
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ రోజు ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. జనరల్, వొకేషనల్ విద్యార్థులు తమ మార్కులను, గ్రేడ్లను వెబ్సైట్లలో పొందవచ్చు. 4,31,361మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 2,39,954 మంది ఉత్తీర్ణులయ్యారు. 55.62శాతం నమోదు కాగా, బాలికలు 61.68%, బాలురు 49.60% ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫస్టియర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీకి ఫీజు కట్టాల్సిన చివరి తేదీ మే 1. మే 25 నుంచి జూన్ 1 వరకూ ఫస్టియర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఇక ఒకేషనల్లో మొత్తం 53.56 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. కాగా కాగా ద్వితీయ సంవత్సర ఫలితాలను ఈ నెల 28న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
లాసెట్ ఫలితాల విడుదల
సాక్షి, తిరుపతి: రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించిన లాసెట్ - 2014 ఫలితాలను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం విడుదల చేశారు. తిరుపతిలోని ఎస్వీయూ సెనేట్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే వెంకటరమణ, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఎల్.వేణుగోపాల్రెడ్డి, వర్సిటీ వీసీ రాజేంద్ర, లాసెట్ కన్వీనర్ వి.ఆర్.సి.కృష్ణయ్య పాల్గొన్నారు. మూడేళ్ల కోర్సుకు 17,656 మంది దరఖాస్తు చేసుకోగా 14,929 మంది అర్హత సాధించారు. ఐదేళ్ల కోర్సుకు 4,376 మంది దరఖాస్తు చేసుకోగా 3,156 మంది అర్హత సాధించారు. అలాగే పీజీ లాసెట్ కు 1,707 మంది దరఖాస్తు చేయగా 1,596 మంది అర్హత సాధించారు. త్వరలోనే ఆయా కోర్సుల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటిస్తామని లాసెట్ కన్వీనర్ కృష్ణయ్య తెలిపారు. టాప్ ర్యాంకర్లు హైదరాబాదీలే.. లాసెట్ - 2014 ఫలితాలకు సంబంధించి పీజీ లాసెట్లో హైదరాబాద్కు చెందిన మిథున్కుమార్, టి.పద్మ మొదటి రెండు ర్యాంకులు సాధించారు. అలాగే మూడు సంవత్సరాల కోర్సుల్లో ఎస్.ప్రవీణ్ (నల్లగొండ), కె.శ్రీకాంత్రెడ్డి (గుంటూరు)లు ఒకటి, రెండో ర్యాంకులు సాధించారు. ఐదు సంవత్సరాల కోర్సులో అదిలాబాద్కు చెందిన వి.గంగాధర్ మొదటి ర్యాంకు, ఎం.వి.సూర్యకళ్యాణ్ రెండవ ర్యాంకు సాధించారు. సీమాంధ్ర నవ నిర్మాణంలో భాగంగా తిరుపతిని విద్యాకేంద్రంగా మార్చనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. తిరుపతి, విశాఖపట్నంలలో ఐఐటీఆర్ సంస్థలు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ఎల్ఎల్ఎం చేస్తా: మిథున్ లాసెట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ప్రస్తుతం హైకోర్టులో న్యాయవాదిగా పనిచే స్తున్నా. చాలామంది ఇంజనీరింగ్, మెడిసిన్లకే పరిమితం అవుతారు. ‘లా’ లో ఉన్న ఆనందం మరి ఏ ఇతర దాంట్లో ఉండదు. భారత రాజ్యాంగంపై ఎల్ఎల్ఎం చేస్తాను. పట్టలేని ఆనందం: పద్మ లాసెట్లో రాష్ట్రంలోనే రెండో ర్యాంక్ రావడం ఎంతో సంతోషాన్నిచ్చింది. అది కూడా ‘సాక్షి’ ప్రతినిధి ద్వారా తెలుసుకున్నా. నాగార్జున యూనివర్సిటీలో ఎల్ఎల్బీలో గోల్డ్ మెడల్ సాధించాను. ప్రస్తుతం కేవి రంగారెడ్డి లా కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. బియాస్ నది దుర్ఘటన నుంచి నా కొడుకు రమన్తేజ కూడా బయటపడటంతో పట్టలేనంత ఆనందంగా ఉంది. -
పదో తరగతి ఫలితాల విడుదల
-
ఎక్సైజ్ కానిస్టేబుల్ రాత పరీక్షా ఫలితాలు విడుదల
హైదరాబాద్: ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షా ఫలితాలను మంత్రి పార్ధసారధి విడుదల చేశారు. ఈ పోస్టులకు 26౦6 మంది ఎంపికయ్యారు. ఎంపికైనవారిలో 1766 మంది పురుషులు, 840 మంది మహిళలు ఉన్నారు. మార్చి 31న ఈ పరీక్ష నిర్వహించారు. 4 లక్షల 56వేల మంది ఈ పరీక్ష రాశారు.