Shraddakapur
-
ప్రభాస్ సాహో హీరోయిన్ ఎంత సింపుల్ గా ఉందొ చూడండి
-
హిందీ ఆమె
అమలాపాల్ ముఖ్యపాత్రలో నటించిన లేడీ ఓరియంటెడ్ థ్రిల్లర్ చిత్రం ‘ఆడై’. తెలుగులో ‘ఆమె’గా విడుదలైన ఈ చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్లో రీమేక్ చేయటానికి రెడీ అవుతున్నారు ఆ చిత్రదర్శకుడు రత్నకుమార్. గతేడాది విడుదలైన ఈ చిత్రానికి మంచి మార్కులే పడ్డాయి. హిందీ రీమేక్లో కథానాయికగా శ్రద్ధాకపూర్ నటిస్తారని సమాచారం. మరి ఒరిజినల్ వెర్షన్లో అమలా చేసిన బోల్డ్ సీన్ (నగ్నంగా నటించారు) ను రీమేక్లో శ్రద్ధాకపూర్ చేస్తారా? అనేది చూడాలి. బాలీవుడ్లోని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. -
మా అమ్మాయిని షూటింగ్కి పంపను
‘‘పని ఎంత ముఖ్యమో నాకు బాగా తెలుసు. అయితే ప్రాణాలను పణంగా పెట్టేంత ముఖ్యం కాదని నా అభిప్రాయం. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నేనైతే బయటికి వెళ్లి పని (షూటింగ్) చేయను. మా అమ్మాయి (శ్రద్ధాకపూర్)ని కూడా షూటింగ్ చేయడానికి అనుమతించను’’ అంటున్నారు బాలీవుడ్ బడా విలన్ శక్తీ కపూర్. ‘ఇక సినిమా, టీవీ షూటింగ్స్ చేసుకోవచ్చు’ అని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సినీపరిశ్రమవారికి అనుమతి ఇస్తున్నాయి. కొన్ని నియమ నిబంధనలు కూడా విధించాయి. మహారాష్ట్రలో షూటింగులు మొదలయ్యాయి కూడా. అయితే ఎన్ని జాగ్రత్తలు పాటించినా షూటింగ్స్లో పాల్గొనడం అంత శ్రేయస్కరం కాదంటున్నారు శక్తీ కపూర్. ‘‘భయం (కరోనా) అనేది మనల్ని ఇంకా వదిలిపెట్టలేదు. మనతోపాటే ఉంది. ముందు ముందు మరింత ప్రమాదం పొంచి ఉంది. అందుకే నా పిల్లలను మాత్రం బయటకు పంపను. ఇండస్ట్రీలోని మా గ్రూప్లో ఉన్న కొంతమందితో ‘ఆరోగ్యపరమైన సమస్య వచ్చి హాస్పిటల్లో చేరి బిల్లులు కట్టేకన్నా కొంతకాలం వేచి ఉండటం మంచిది’ అని చెప్పాను. ఎందుకంటే బయటి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి’’ అన్నారు శక్తీ కపూర్. కరోనా బారినపడినవారి సంఖ్య పెరుగుతుండటంతో హాస్పటల్స్లో బెడ్స్ కొరత ఏర్పడుతోంది. ఇదే విషయం గురించి శక్తీ కపూర్ మాట్లాడుతూ – ‘‘హాస్పిటల్స్లో బెడ్స్ లేవు. పైగా హాస్పిటల్లో జాయిన్ అయితే బిల్ బాంబ్లా మోత మోగిపోతుంది. చికిత్స చేయించుకుని హాస్పటల్ బిల్ కట్టలేకపోవడంతో ఒక వ్యక్తిని తాడుతో కట్టేశారని ఈ మధ్య న్యూస్లో చూశాను. దీని గురించి ఓ వీడియో చేయబోతున్నాను. ప్రపంచం చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. మానవీయత అనేది లేదేమో అనిపిస్తోంది’’ అన్నారు. -
కుందేలు దంతాలతో క్యూట్గా శ్రద్ధా కపూర్
చిన్ననాటి తీపి గుర్తులను తన అభిమానులతో ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు సాహో నటి శ్రద్ధా కపూర్. క్యూట్ స్మైల్తో ఉన్న చిన్ననాటి ఫోటోను శ్రద్ధా పోస్ట్ చేయడంతో అభిమానులు లైకులతో ముంచెత్తుతున్నారు. కుందేలులాంటి దంతాలతో ఉన్నప్పటి ఫోటో అంటూ శ్రద్ధా పెట్టిన కామెంట్కి సో క్యూట్ అంటూ పలువురు సినీ ప్రముఖులతోపాటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ ఫోటో షేర్ చేసిన ఒక్కరోజులోనే దాదాపు 23 లక్షల మంది లైక్ చేశారు. View this post on Instagram जब मेरे खरगोश जैसे दांत थे।🐰🦷🤓 #BeforeBraces A post shared by Shraddha (@shraddhakapoor) on Apr 20, 2020 at 4:51am PDT -
గుమ్మడికాయ కొట్టారు
‘భాగీ’ ఫ్రాంచైజీలో వస్తోన్న మూడో సినిమా ‘భాగీ3’. ఇందులో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించారు. హీరోయిన్గా శ్రద్ధాకపూర్ కనిపిస్తారు. అహ్మద్ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రితేష్ దేశ్ముఖ్ కీలక పాత్ర పోషించారు. ఇందులో రితేష్, టైగర్ ష్రాఫ్ బ్రదర్స్లా నటించారు. ‘భాగీ’ తొలి భాగంలో జంటగా నటించిన టైగర్, శ్రద్ధా ‘భాగీ 3’ కోసం తిరిగి కలిశారు. అలాగే ‘భాగీ 2’లో హీరోయిన్గా నటించిన దిశా పటానీ ‘భాగీ 3’లో ఓ స్పెషల్ సాంగ్ చేశారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. ఈ ఏడాది ఏప్రిల్లో సినిమా విడుదల కానుంది. -
ముద్దంటే ఇబ్బందే!
ప్రభాస్కి మొహమాటం ఎక్కువ. ‘రొమాంటిక్ సన్నివేశాలు, ముఖ్యంగా లిప్లాక్ సన్నివేశాలకు ఇబ్బందిపడతాను’ అంటున్నారు. ‘సాహో’ ప్రమోషన్స్లో భాగంగా ఈ విషయం గురించి ప్రభాస్ మాట్లాడుతూ – ‘‘నాకు చాలా సిగ్గు ఎక్కువ. అందుకే ముద్దు సన్నివేశాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ సన్నివేశాల్లో యాక్ట్ చేస్తున్నంతసేపు చాలా కష్టంగా అనిపిస్తుంటుంది’’ అన్నారు. ‘సాహో’ సినిమాలో శ్రద్ధాతో ఓ ముద్దు సన్నివేశం ఉండగా గతంలో ‘బాహుబలి 2’లో అనుష్కతో ఓ చిన్న ముద్దు సన్నివేశంలో నటించారు ప్రభాస్. -
జీవితం భలే మారిపోయింది
‘‘తొలిసారి ప్రభాస్తో కలిసి పనిచేశా. అందరూ ఆయన్ని డార్లింగ్ డార్లింగ్ అంటారు. అలా ఎందుకంటారో ‘సాహో’ సినిమా చేసినప్పుడు తెలిసింది’’ అన్నారు మురళీ శర్మ అన్నారు. ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా సుజీత్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ‘సాహో’ నేడు విడుదలవుతోంది. ఈ చిత్రంలో పోలీస్ పాత్ర చేసిన మురళీ శర్మ చెప్పిన విశేషాలు. ► ‘సాహో’ తొలిరోజు షూటింగ్ లంచ్టైమ్లో ‘ఇంటి భోజనం నాకు చాలా ఇష్టం’ అన్నాను. ఆ తర్వాత 60 రోజుల పాటు ప్రభాస్గారి ఇంటి నుంచి నాకు భోజనం వచ్చేది. నాకే కాదు.. పదిమందికి సరిపడే పెద్ద క్యారియర్లో భోజనం వచ్చేది. గుత్తి వంకాయ కూర ఎంత బాగుంటుందంటే చెప్పడానికి మాటల్లేవ్. నిజంగా ప్రభాస్ మంచి మనిషి.. యూనివర్సల్ డార్లింగ్. ► ‘భాగమతి’ సినిమా టైమ్లో సుజీత్ ‘సాహో’ కథ చెప్పాడు. తనది మంచి బ్రెయిన్. కథని అద్భుతంగా రాసుకున్నాడు. వంశీ, ప్రమోద్, విక్కీ చాలా ప్యాషనేట్ నిర్మాతలు. ఎప్పుడూ సెట్లో ఉండి సినిమా ఎలా వస్తోంది? ఏంటి? అని చూసుకునేవారు. యూవీ క్రియేషన్స్ నాకు హోమ్ బ్యానర్లాంటిది. ‘అభినేత్రి’ సినిమాకి మూడు భాషల్లో డబ్బింగ్ చెప్పా. ఇప్పుడు ‘సాహో’కి కూడా. ఓ సినిమాని ఒకేసారి పలు భాషల్లో చేయడం, డబ్బింగ్ చెప్పడం ఓ ప్రయోగం. ఏ భాషలో అయినా భావోద్వేగాలు ఒక్కటే.. భాష మాత్రం వేరు. ► ఏ సక్సెస్కి అయినా ప్రిపరేషన్ ముఖ్యం. నా పాత్రకి ముందుగానే నేను ప్రిపేర్ అవుతా. ఇటీవల ‘ఎవరు, రణరంగం’ చిత్రాల్లోనూ మంచి పాత్రలు చేశా. ప్రతి పాత్రనీ ఎంజాయ్ చేస్తా. తండ్రి పాత్ర చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ‘భలే భలే మగాడివోయ్’ తర్వాత నా జీవితం మారిపోయింది. ► నేను పుట్టి, పెరిగింది ముంబైలో. మా అమ్మగారు తెలుగువారే. ‘అతిథి’ చిత్రంలో నాకు చాన్స్ వచ్చింది. బిగినింగ్లోనే మహేశ్బాబులాంటి సూపర్స్టార్తో, అంత పెద్ద సినిమాలో మంచి పాత్ర చేస్తాననుకోలేదు. ‘మా అబ్బాయి కృష్ణగారి అబ్బాయి సినిమాలో చేస్తున్నాడు’ అని మా అమ్మ అందరికీ చెప్పుకున్నారు. తెలుగు, తమిళ్, మరాఠీ, హిందీ భాషలను మేనేజ్ చేసుకుంటున్నాను. ప్రస్తుతం ‘అల.. వైకుంఠపురములో’, శర్వానంద్తో ఓ సినిమా చేస్తున్నా. మారుతిగారితో ఓ చిత్రం చేశా. సందీప్ కిషన్–నాగేశ్వర్రెడ్డిగారి సినిమా దాదాపు పూర్తి కావస్తోంది. ‘అతిథి’ తర్వాత మహేశ్బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేశా. -
విడుదలైన సాహో రొమాంటిక్ పాట!
సాహో సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఆ సినిమాకు సంబంధించిన ఒక్కోవార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రంలోని మూడు పాటలను ఒక్కొక్కట్టిగా రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను ఊరిస్తూ వస్తున్న చిత్రబృందం తాజాగా ‘బేబీ వోంట్ యూ టెల్ మీ’ పాటను విడుదల చేసింది. హీరో ప్రభాస్ ‘సాహో నుంచి రొమాంటిక్, మెలోడియస్ పాట విడుదల’ అంటూ తన ఇన్స్టాగ్రామ్లో ఈ పాటకు సంబంధించిన ఫస్ట్ లుక్ను పోస్ట్ చేశాడు. ఈ పాటకు విడుదలైన ఒక్క గంటలోనే నాలుగు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇప్పటికే ఓ రొమాంటిక్ సాంగ్ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ మరో పాటను విడుదల చేసింది. ‘బేబీ వొంట్ యూ టెల్ మీ’ అంటూ సాగనున్న ఈ పాటకు మనోజ్ యాదవ్ లిరిక్స్ని అందించాడు. శంకర్ , ఎహాన్స్, లాయ్ త్రయంలు హీందీ వెర్షన్లో ఈ పాటను కంపోస్ చేయగా శంకర్ మహదేవన్, రవి మిష్రా, అలిస్సా మన్డొన్సా ఆలపించారు. అందమైన సాహిత్యంతో కూడిన పాట సన్నివేశాలను అస్ట్రియాలోని పలు అద్భతమైన సుందర ప్రదేశాల్లో చిత్రీకరించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హీరో ప్రభాస్, శ్రద్ధలు పోలీసుల పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఆగష్టు 30న విడుదల చేయనున్నారు. View this post on Instagram New symphony from Saaho with romance and lots more is out now. Hope you all like it! #Saaho #SaahoOnAugust30 @shraddhakapoor @sujeethsign @neilnitinmukesh @apnabhidu @chunkypanday @arunvijayno1 @mandirabedi @maheshmanjrekar @sharma_murli @vennelakish @uvcreationsofficial @bhushankumar @tseries.official @officialsaahomovie A post shared by Prabhas (@actorprabhas) on Aug 25, 2019 at 11:24pm PDT -
లైటింగ్ + షాడో = సాహో
లార్జర్ దాన్ లైఫ్ సినిమాలను ‘విజువల్ వండర్’ అని సంబోధిస్తుంటారు. దర్శకుడు మెదడులో అనుకున్న కథను సినిమాటోగ్రాఫర్ తన కెమెరాతో స్క్రీన్ పై చూపిస్తాడు. మన కంటే ముందే తన లెన్స్తో సినిమా చూసేస్తాడు కెమెరామేన్. ‘సాహో’ లాంటి భారీ సినిమాని తన కెమెరా కన్నుతో ముందే చూసేశారు చిత్ర ఛాయాగ్రాహకుడు మది. ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా సుజీత్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 30న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ‘సాక్షి’కి మది ప్రత్యేకంగా చెప్పిన ‘మేకింగ్ ఆఫ్ సాహో’ విశేషాలు. ► 350 కోట్ల భారీ బడ్జెట్ సినిమా చేసే చాన్స్ తరచు రాదు. ప్రభాస్తో గతంలో ‘మిర్చి’ చేశాను. స్వతహాగా ఆయన హ్యాండ్సమ్గా ఉంటారు. ‘మిర్చి’లో స్టైలిష్గా చూపించే అవకాశం నాకు దక్కింది. ఇప్పుడు ‘సాహో’లో మరిన్ని షేడ్స్లో ప్రభాస్ని చూపించాను. దర్శకుడు సుజీత్ తీసిన ‘రన్ రాజా రన్’కి వర్క్ చేశాను. యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ నాకు మంచి స్నేహితులు. ‘సాహో’ లాంటి విజువల్ వండర్కి పని చేయడం అద్భుతమైన అవకాశం. విజువల్గా ఈ సినిమా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ► ఇలాంటి భారీ సినిమాకు హోమ్ వర్క్ లేకుండా డైరెక్ట్గా సెట్లో దిగలేం. ‘సాహో’ సినిమాకు ప్రీ–ప్రొడక్షన్ వర్క్, ప్రీ–డిజైన్ వర్క్ చాలా ఎక్కువ చేశాం. అవుట్పుట్ ఎలా వస్తుందో? అని ముందే రఫ్గా చూసుకున్నాం. కెమెరామేన్, యాక్షన్ డైరెక్టర్, వీఎఫ్ఎక్స్ టీమ్ అందరం కలిసి టీమ్గా వర్క్ చేశాం. ► ‘సాహో’ బహుభాషా చిత్రం. ఒక భాషలో ఓ సన్నివేశం తీయగానే అదే సన్నివేశాన్ని యాక్టర్స్ అందరూ వేరే భాషలో నటించాలి. దానికి లైటింగ్ చాలా ముఖ్యం. అందుకే సన్నివేశానికి సంబంధించిన వాతావరణాన్ని మొత్తం లైటింగ్తో సృష్టించాం. అప్పుడు కంటిన్యూటీ మొత్తం మా కంట్రోల్లోనే ఉంటుంది. కొన్ని సన్నివేశాలకు లైటింగ్ సృష్టించడానికి రెండు మూడు రోజులు పట్టేది. ► ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ పలు షేడ్స్లో ఉంటుంది. కథకు తగ్గట్టు క్యారెక్టర్ మారినప్పుడల్లా లైటింగ్ కూడా మార్చాలి. మామూలుగా ఏ సినిమాకైనా 4కెడబ్లు్య (కిలో వాట్స్), 6కెడబ్లు్య లేకపోతే 9కెడబ్లు్య లైటింగ్ వాడతాం. కానీ, ‘సాహో’కి మాత్రం హై ఇంటెన్సిటీ లైటింగ్ వాడాం. 16కెడబ్లు్య నుంచి 18కెడబ్లు్య లైటింగ్ వాడాం. దాన్నిబట్టి ఈ కథ మైలేజ్ని ఊహించుకోవచ్చు. చెప్పాలంటే సినిమా మొత్తం లైటింగ్, షాడో ఓరియంటెడ్గా ఉంటుంది. కథకు, సినిమాటోగ్రఫీకి వారధిలా లైటింగ్ నిలిచిందని చెప్పొచ్చు. ► ఈ సినిమాకు ఒకటి రెండు కాదు కొత్త కొత్త కెమెరా పరికరాలు చాలా ఉపయోగించాం. సుమారు 7–8 కెమెరా హెడ్స్ను వాడాం. ఈవో కార్, స్కార్పియో రిమోట్ హెడ్ కెమెరాలు, స్పెషల్ జీఎఫ్8 కెమెరాలు, 2 జిమ్మీ జిబ్స్, మాక్సిమస్ కెమెరా హెడ్ (అన్నింటి కంటే కొంచెం ఖరీదైన పరికరం ఇది). వెబ్రేషన్స్ను అదుపులో ఉంచే జింబల్ హ్యాండ్ కెమెరాలు, చాప్మ్యాన్ డాలీ, జీఎఫ్ఎమ్ క్రేన్ ఇవన్నీ ఉపయోగించాం. హాలీవుడ్ యాక్షన్ మాస్టర్ కెన్నీ బేట్స్తో సంభాషించి కొన్ని పరికరాలను జర్మనీ నుంచి తీసుకువచ్చాం. సన్నివేశానికి అనుగుణంగా, క్వాలిటీకి రాజీపడకుండా కెమెరాలు వాడాం. ► అబుదాబిలో షూట్ చేసిన యాక్షన్ సన్నివేశాలకు ప్రతిరోజు సెట్లో 14 కెమెరాలు వరకూ ఉండేవి. మెయిన్ కెమెరాలు 7, ఇతర కెమెరాలు 7. సుమారు 25 రోజులు ఆ యాక్షన్ సీక్వెన్స్ని చిత్రీకరించాం. నా టీమ్ మొత్తం 60 మంది. అబుదాబి షెడ్యూల్లో దాదాపు 80మంది కెమెరా డిపార్ట్మెంట్కే వర్క్ చేశారు. ఫోకస్ పుల్లర్స్, లైటింగ్ డిపార్ట్మెంట్, క్రేన్స్ ఇలా ఒక్కో విభాగం చూసుకున్నారు. అందులో 20 శాతం ఫారిన్ వాళ్లు కూడా పని చేశారు. ఫారిన్ వాళ్లతో పని చేసే సమయంలో ఓ ఇబ్బంది ఉంది. అదేంటంటే కమ్యూనికేషన్. ఒక్కో డిపార్ట్మెంట్కు టెక్నికల్ పదాలు ఒక్కోలా ఉంటాయి. యాక్షన్ వాళ్ల టెక్నికల్ పదాలు ఒకలా ఉంటాయి. కెమెరా వాళ్లవి ఒకలా ఉంటాయి. వాళ్లకు అర్థం అయ్యేలా చెప్పడం కూడా చిన్న చాలెంజే (నవ్వుతూ). ► ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల్లో నలిగిపోయినవన్నీ ఒరిజినల్ ట్రక్కులు, కార్లు. ముందు డమ్మీలతో ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత ఒరిజినల్ కార్స్, ట్రక్స్ని బద్దలు కొట్టారు. సినిమాలో ఎంత మోతాదులో యాక్షన్ ఉందో.. అంతే ప్రాముఖ్యత లవ్స్టోరీకి కూడా ఉంటుంది. యాక్షన్ సన్నివేశాలకు ఒక మూడ్ ఉంటుంది. ప్రేమ సన్నివేశాలు ఒక మూడ్. ఈ వ్యత్యాసాన్ని స్క్రీన్ మీద చూపించడం చాలా ఎంజాయ్ చేశాను. ప్రభాస్, శ్రద్ధాకపూర్ ► అబుదాబి ఫైట్ ఎపిసోడ్ కాకుండా గన్ఫైట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. డమ్మీ బులెట్స్తో షూట్ చేసినప్పటికీ ఈ ఎఫెక్ట్ కొత్తగా ఉంటుంది. కెమెరా మూమెంట్స్ అన్నీ గన్ పాయింట్కి చాలా దగ్గరగా ఉంటాయి. అటు కెమెరాకి ఇటు మాకు ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ ఫైట్ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ► భారీ యాక్షన్ సినిమా చేస్తున్నప్పుడు ప్రమాదాలు అనివార్యం. కానీ మే మాత్రం ఎవరి లైఫ్నీ రిస్క్ చేయదలచుకోలేదు. యాక్షన్ సన్నివేశాల్లో కారు 150 కి.మీ. ల వేగంతో వెళ్తుందంటే అంత స్పీడ్తో కెమెరా ఫాలో కానక్కర్లేదు. మనకు టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఉపయోగించుకున్నాం. అలా టెక్నాలజీ హెల్ప్తో ఎవరికీ ఏ ప్రమాదమూ జరగలేదు. 225 రోజులు వర్కింగ్ డేస్ ఉన్నప్పటికీ ఒక్క కెమెరా పరికరానికి డ్యామేజ్ జరగలేదు. అదే పెద్ద విశేషం. పెద్ద పెద్ద ట్రక్కులను, కార్లను మాత్రమే డ్యామేజ్ చేశాం (నవ్వుతూ). టోటల్గా ‘సాహో’ మాకో మంచి అనుభూతి. రేపు ప్రేక్షకులకు కూడా మంచి అనుభూతి అవుతుంది. ► అబుదాబి వాతావరణం భిన్నంగా ఉంటుంది. అక్కడ ఎండ 45 డిగ్రీలు పైనే. అబుదాబి షెడ్యూల్లో చాలామంది వడదెబ్బకు గురయ్యారు. మాలో కొంతమందికి చర్మం ఊడొస్తుండేది. అనూహ్యంగా ఇసుక తుఫానులు కూడా వస్తుండేవి. అలాంటి సమయాల్లో మమ్మల్ని మేం కాపాడుకుంటూనే మా ఖరీదైన కెమెరాలను కూడా జాగ్రత్త చేసేవాళ్లం. ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు అందించడానికి చాలా కష్టపడతాం. అవుట్పుట్ చూశాక ఆ కష్టాలన్నీ మర్చిపోతాం. ► ఈ సినిమా చిత్రీకరణకు 230 రోజులు పట్టింది. అది కూడా 8 రోజులు టెస్ట్ షూట్, 50 రోజుల లైటింగ్ అరేంజ్మెంట్ను మినహాయించి. ► ‘సాహో’ కోసం సుమారు 60 సెట్లను ఏర్పాటు చేశారు. ఈ సెట్లన్నీ హైదరాబాద్, పూణే, ముంబై, అబుదాబి, యూరోప్లో వేశారు. ► 350 కోట్ల బడ్జెట్లో కెమెరా డిపార్ట్మెంట్కు కేటాయించిన బడ్జెట్ సుమారు 25 కోట్లు (కెమెరామేన్ల రెమ్యూనరేషన్లు మినహాయించి). – గౌతమ్ మల్లాది -
పంద్రాగస్టుకు ట్రైలర్?
‘సాహో’ ప్రమోషన్స్ మస్త్ స్పీడ్ మీద ఉన్నాయి. రోజుల వ్యవధిలో కొత్త పోస్టర్స్ను విడుదల చేస్తూ ‘సాహో’ సందడి మొదలుపెట్టింది చిత్రబృందం. తాజాగా ‘సాహో’ చిత్రానికి సంబంధించి మరో కొత్త యాక్షన్ పోస్టర్ను విడుదల చేశారు ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సాహో’. ఇందులో శ్రద్ధాకపూర్ కథానాయికగా నటించారు. భారీ బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రాన్ని వంశీ, ప్రమోద్, విక్రమ్లు నిర్మించారు. గతంలో ‘షేడ్స్ ఆఫ్ సాహో ఛాప్టర్ 1’, ‘షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2’లతో పాటు టీజర్ను కూడా ‘సాహో’ చిత్రబృందం విడుదల చేసింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను పంద్రాగస్టుకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. జాకీష్రాఫ్, నీల్నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, ‘వెన్నెల’ కిశోర్, ప్రకాష్ బెల్వాది తదితరులు నటించిన ఈ చిత్రం ఆగస్టు 30న విడుదల కానుంది. -
స్టెప్పుల సాహో
ఫారిన్ ప్రదేశాలలో అద్భుతమైన పాటలను అదిరిపోయే స్టెప్పులతో పూర్తి చేశారు ప్రభాస్. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సాహో’. వంశీ, ప్రమోద్, విక్రమ్లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవల యూరప్లో ప్రారంభమైన ఈ సినిమా షెడ్యూల్లో రెండు పాటలను చిత్రీకరించారు. ఒక పాటను ఆస్ట్రియాలో, మరో పాటను కురేషియాలో చిత్రీకరించినట్లు చిత్రబృందం వెల్లడించింది. కురేషియాలో చిత్రీకరించిన పాటలో సుమారు యాభైమంది కురేషియన్ మోడల్స్తో ప్రభాస్ కాలు కదిపారు. అలాగే ఓ పాటలో ప్రభాస్తో హిందీబ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్టెప్పులేశారని సమాచారం. ఈ సినిమాకు జిబ్రాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు. సాహో చిత్రం ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. -
మరో రీమేక్లో?
తెలుగులో హిట్ అయిన సినిమాలను బాలీవుడ్లో రీమేక్ చేయడం కామన్. టాలీవుడ్ హిట్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’తో షాహిద్ కపూర్ ఇటీవల భారీ హిట్ అందుకున్నారు. షాహిద్ గత చిత్రాల అత్యధిక వసూళ్లను సైతం ‘కబీర్సింగ్’ తొలి వారంలోనే దాటనుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు తెలుగు చిత్రం ‘జెర్సీ’ హిందీ రీమేక్లో నటించనున్నారని బాలీవుడ్ టాక్. నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. క్రికెట్ నేపథ్యంలో వచ్చిన ‘జెర్సీ’ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులకూ అలరిస్తుందని ప్రముఖ దర్శక–నిర్మాత కరణ్ జోహార్ అనుకున్నారట. అందుకే ఈ చిత్రం రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారనే మాట వినిపిస్తోంది. తెలుగు ఒరిజినల్ వెర్షన్ను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలోనే హిందీ రీమేక్ చేయనున్నారట. -
మా ప్రపంచంలోకి రండి
సాహో ప్రపంచం ఎలా ఉండబోతోందో చూపించడానికి మేం రెడీ అయ్యాం అంటోంది చిత్రబృందం. ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో’. శ్రద్ధా కపూర్ కథానాయిక. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్కీ నిర్మిస్తున్నారు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ను ఈనెల 13న రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. సినిమాలోని శ్రద్ధా కపూర్ లుక్ను విడుదల చేశారు. షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. నీల్ నితిన్ ముఖేశ్, అరుణ్ విజయ్, ఎవలిన్ శర్మ, లాల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది. -
ఇట్స్ సాహో టైమ్
‘స్ట్రీట్డ్యాన్సర్ త్రీడీ’, ‘చీఛోరే’, ‘భాగీ 3’, ‘సాహో’ ఇలా వరుస సినిమాల షూటింగ్స్తో బిజీ బిజీగా ఉంటున్నారు బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్. ఒక్కో సినిమా కోసం ఒక్కో లొకేషన్కి వెళ్తున్నారీ భామ. ప్రస్తుతం ‘సాహో’ సినిమా షూటింగ్లో పాల్గొనడం కోసం హైదరాబాద్ వచ్చారామె. ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తున్నారు. హైదరాబాద్లోని ఓ స్టూడియోలో వేసిన సెట్లో హీరో హీరోయిన్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తు న్నారని తెలిసింది. నైట్ షూట్ జరుగుతోంది. ఇలా ప్రస్తుతం శ్రద్ధాకు ‘సాహో’ టైమ్ వచ్చింది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేస్తున్నారు. హైదరాబాద్లో శ్రద్ధా ల్యాండ్ అవడానికి ముందు ‘స్ట్రీట్డ్యాన్సర్ త్రీడీ’ చిత్రం కోసం దుబాయ్ వెళ్లొచ్చారు శ్రద్ధా. ఇందులో వరుణ్ ధావన్ హీరో. ఈ సంగతు లన్నీ పక్కనపెడితే.... సౌత్ కొరియన్ మూవీ ‘మిస్గ్రానీ’ బాలీవుడ్ రీమేక్లో శ్రద్ధాకపూర్ హీరోయిన్గా నటించబోతున్నారని తాజా బాలీవుడ్ ఖబర్. -
సర్ప్రైజ్ వచ్చేసింది
‘డార్లింగ్స్ రేపు మీ అందరికీ ఓ సర్ప్రైజ్ ఉంది’ అని సోమవారం అభిమానులను ఉద్దేశించి ప్రభాస్ అన్నారు. అంతే... ఆ సర్ప్రైజ్ ఏమై ఉంటుందా? అనే చర్చ మొదలైంది. ‘సాహో’ కొత్త పోస్టర్ అని, టీజర్ రిలీజ్ అని, మేకింగ్ వీడియో అని రకరకాలుగా ఊహించుకున్నారు. కొందరి ఊహను ప్రభాస్ నిజం చేస్తూ మంగళవారం తన తాజా చిత్రం ‘సాహో’ కొత్త పోస్టర్ను రిలీజ్ చేసి, సినిమా రిలీజ్ డేట్ను కూడా కన్ఫార్మ్ చేశారు. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సాహో’. ఇందులో శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తున్నారు. వంశీ, ప్రమోద్లు నిర్మిస్తున్నారు. మంగళవారం విడుదలైన ‘సాహో’ కొత్త పోస్టర్లో సీరియస్ అండ్ ఇంటెన్స్ లుక్స్తో ప్రభాస్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. ‘‘ఆల్రెడీ రిలీజ్ చేసిన ‘షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1, షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2’ వీడియోలకి మంచి స్పందన లభించింది. తాజాగా విడుదల చేసిన ప్రభాస్ కొత్త పోస్టర్కు అంతే అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 15న సినిమాను విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాతలు అన్నారు. -
క్యా బాత్ హై
‘బాహుబలి ’ సినిమా విడుదలైన రెండేళ్లకు ‘బాహుబలి 2’ వచ్చింది. ‘బాహుబలి 2’ చిత్రం విడుదలై రెండేళ్లు దాటింది. తమ అభిమాన హీరో కొత్తచిత్రం కోసం ప్రభాస్ ఫ్యాన్స్ కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. ‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘సాహో’. ఈ చిత్రానికి ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ‘బాహుబలి’తో ప్రభాస్కి ఉత్తరాదిలోనూ మంచి గుర్తింపు వచ్చింది. దీంతో ‘సాహో’ సినిమాకి ఆయన స్వయంగా హిందీలో డబ్బింగ్ చెప్పి, ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయనున్నారు. ఇందుకోసం సోనీ అనే టీచర్ని పెట్టుకుని నెలపాటు హిందీ భాష నేర్చుకున్నారట ప్రభాస్. హిందీ తొలుత కొంచెం కష్టంగా అనిపించినా తర్వాత నుంచి అలవాటైపోయిందట. ఇక ఆయన డబ్బింగ్ చెప్పటమే మిగిలి ఉంది. కాగా ‘సాహో’కి సంబంధించిన భారీ యాక్షన్ ఎపిసోడ్ని ఇటీవల ముంబయిలో చిత్రీకరించారు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుందట. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ఆగస్ట్ 15న ‘సాహో’ ని ప్రేక్షకులముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్రబృందం. నీల్ నితిన్ ముఖేష్, జాకీష్రాఫ్ వంటి బాలీవుడ్ నటులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శంకర్–ఇషాన్–లాయ్, కెమెరా: మధి. -
నానీగారి నమ్మకం చూసి భయమేసేది
‘‘మనందరం సక్సెస్ అయన ఒక్క వ్యక్తినే గుర్తు పెట్టుకుంటాం. ఎంతో టాలెంట్ ఉన్నా వివిధ కారణాల వల్ల సక్సెస్ కాలేకపోయిన వాళ్ల కథ చెప్పాలనిపించింది. ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ కంటే తొంభైతొమ్మిది మంది ఫెయిల్యూర్ కథే మా ‘జెర్సీ’’ అని గౌతమ్ తిన్ననూరి అన్నారు. నాని, శ్రద్ధా శ్రీనాద్ జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన చిత్రం ‘జెర్సీ’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మంచి టాక్తో ప్రదర్శింపబడుతోంది అని చిత్రబృందం పేర్కొంది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి పలు విశేషాలు పంచుకున్నారు. ► ‘మళ్ళీ రావా’ తర్వాత స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో సినిమా చేయాలా? వేరే ఏదైనా జానర్లో సినిమా చేద్దామా? అనుకున్నాను. క్రికెట్ కామెంటేటర్ హర్షా బోగ్లే ఓ షోలో ‘‘సచిన్ టెండూల్కర్లా టాలెంట్ ఉన్న క్రికెటర్స్ ఇండియాలో చాలామందే ఉన్నారు. సచిన్ మాత్రమే అంత గొప్పవాడు ఎందుకయ్యాడంటే అతని యాటిట్యూడ్ వల్లే’’ అని మాట్లాడారు. 99 మంది ఫెయిల్యూర్స్ అనే పాయింట్ నాకు స్ఫూర్తినిచ్చింది. ఈ చిత్రం కోసం స్పెషల్గా రీసెర్చ్ అంటూ ఏమీ చేయలేదు. ► నానీగారు మొదటి నుంచి ఈ సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నారు. ఆయన 22 సినిమాలు చేశారు. ఆయనకో అవగాహన ఉంది. కానీ నాకిది రెండో సినిమా. గొప్ప సినిమా చే స్తున్నాం అనే ఫీలింగ్ కాకుండా కంటెంట్ పరంగా తృప్తినిచ్చింది. మిక్సింగ్ థియేటర్లో వర్క్ పూర్తయ్యాక కొన్నిసార్లు ఇది నేను రాసుకొన్న కథేనా? మేము తీసిందేనా? అనేంతగా వర్క్ శాటిస్ఫ్యాక్షన్ ఇచ్చింది. అలాగే నానీగారి నమ్మకం చూసి ఒక్కోసారి భయం వేసేది. ► ఇందులో నానీగారు, విశ్వంత్ తప్ప క్రికెట్ మ్యాచ్ సీన్స్లో కనిపించిన మిగతా వాళ్లంతా క్రికెట్ ప్లేయర్లే. వాళ్లందరికీ యాక్టింగ్లో కోచింగ్ ఇచ్చాం. రెగ్యులర్ సీన్ తీయడం, గ్రౌండ్లో మ్యాచ్ షూట్ చేయడం డిఫరెంట్. ఒక్క నిమిషం విజువల్స్ రావడానికి కనీసం ఒకటిన్నర రోజు పట్టేది. స్టోరీ బోర్డ్ ముందే రెడీ చేసుకోవటం వల్ల షూటింగ్ ఈజీ అయ్యింది. సాధారణంగా డే–నైట్ మ్యాచ్లో వైట్ బాల్తో ఆడతారు. సినిమా మొత్తం హీరోను వైట్ డ్రెస్లోనే చూపించాలన్న ఉద్దేశంతో రెడ్ బాల్ ఉపయోగించి. సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాం. ► ‘మజిలీ’ దర్శకుడు శివనిర్వాణ, నేను క్లోజ్. మా ఇద్దరి సినిమాలు క్రికెట్ బ్యాక్డ్రాప్ స్టోరీ అని మాట్లాడుకున్నాం. ఇద్దరి కథలకు చాలా తేడా ఉంది. ► శ్రద్ధా శ్రీనాథ్ అద్భుతంగా యాక్ట్ చేసింది. నాని కొడుకుగా నటించిన రోనిత్ని ఓ ఫోటోషూట్లో చూసి అప్రోచ్ అయ్యాం. తను బాగా ఎనర్జిటిక్. నానీ గారు ఒకవేళ ఈ కథ చెయ్యకపోతే వేరే ఎవరన్నా తమిళ హీరోకి చెప్పేవాడినేమో. నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి ఇంకా ఏం ఆలోచించలేదు. -
ఇట్స్ రొమాంటిక్ టైమ్!
‘సాహో’ చిత్రం అనగానే అందరికీ యాక్షన్ అంశాలే గుర్తుకొస్తాయి. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ఈ చిత్రం టీజర్, ఫస్ట్ లుక్లతో పాటు ‘షేడ్స్ ఆఫ్ సాహో, షేడ్స్ ఆఫ్ సాహో 2’ వీడియోస్లో కూడా యాక్షన్ అంశాలే ఎక్కువగా కనిపించాయి. అయితే... ‘సాహో’లో మంచి రొమాంటిక్ యాంగిల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్లు నిర్మిస్తున్న చిత్రం ‘సాహో’. ఇందులో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవల వీరిద్దరిపై ఓ పాటను చిత్రీకరించినట్లు తెలిసింది. అయితే.. ప్రభాస్, శ్రద్ధాకపూర్ కలిసి ఉన్న ఫొటో ఒకటి నెట్టింట్లో చెక్కర్లు కొడుతోంది. ఇది ‘సాహో’ చిత్రంలోనిదేనని అనుకుంటున్నారు. పైన ఉన్న ఫొటో అదే. ఈ ఏడాది పంద్రాగస్టుకు ఈ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి శంకర్–ఎహసన్–లాయ్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ చిత్రంతో పాటు ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సంగతి ఇలా ఉంచితే... ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్చరణ్ పాత్రల పరిచయం ప్రభాస్ వాయిస్ ఓవర్తో ఆరంభం అవుతుందన్న ప్రచారం జరుగుతోంది. -
సాహో జ్ఞాపకాలు
ఒక్కో సినిమాకు ఏడాది వరకూ సమయాన్ని కేటాయిస్తుంటారు స్టార్స్. ఆ ప్రయాణంలో ఆ సినిమా స్పెషల్గా మారుతుంటుంది. కొందరు ఆ సినిమాలో ఏదో వస్తువును ఆ ప్రయాణానికి గుర్తుగా దాచుకుంటారు. ప్రస్తుతం ప్రభాస్ కూడా సాహో జ్ఞాపకాలను ఓ కారు, బైక్లో చూసుకోనున్నారట. ప్రభాస్ హీరోగా సుజిత్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘సాహో’. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. శ్రద్ధాకపూర్ కథానాయిక. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఈ సినిమాకు పని చేస్తున్నారు. ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురి చేసే యాక్షన్ సన్నివేశాల కోసం ఎన్నో స్పోర్ట్స్ బైక్లు, కార్లు ఈ చిత్రానికి ఉపయోగించిన సంగతి తెలిసిందే. చాలా శాతం వరకూ యాక్షన్ సన్నివేశాలను డూప్ సహాయం లేకుండా ప్రభాసే చేస్తున్నారు. ఈ సినిమాలో వాడిన ఓ బైకు, కారును ‘సాహో’ గుర్తుగా తన దగ్గర పెట్టుకోనున్నారట ప్రభాస్. ఆగస్ట్ 15న రిలీజ్ కానున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడీ, తమిళ నటుడు అరుణ్ విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శంకర్ ఎహాసన్ లాయ్. -
జపాన్లో సాహో
‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఇంటర్నేషనల్ లెవల్కి చేరిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సాహో’. సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్లు నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హిందీ వెర్షన్ను బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ రిలీజ్ చేస్తున్నారు. ఇండియాలో రిలీజ్ అయిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ సినిమాను జపనీస్లో కూడా రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు నిర్మాతలు. ఆల్రెడీ జపాన్లోని ఓ లోకల్ డిస్ట్రిబ్యూటర్కు ‘సాహో’ రైట్స్ను కూడా ఇచ్చేశారని తెలిసింది. ‘బాహుబలి’ చిత్రం కూడా జపాన్లో విడుదలైన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇక... ‘సాహో’ చిత్రం షూటింగ్ విశేషాలకు వస్తే.... ఈ చిత్రంలో ఆస్ట్రేలియన్–బ్రిటిష్ పాప్ సింగర్, నటి కైలీ మినాగ్ ఓ స్పెషల్ సాంగ్లో నర్తించబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. దాదాపు పదేళ్ల క్రితం అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘బ్లూ’ సినిమాలోని ‘చిగ్గీ.. విగ్గీ’ అనే స్పెషల్ సాంగ్లో కనిపించారు కైలీ. ‘సాహో’ చిత్రంలో శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తున్నారు. జాకీష్రాఫ్, మందిరాబేడీ, నీల్నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు శంకర్–ఎహాసన్–లాయ్ సంగీతం అందిస్తున్నారు. -
మిసెస్ అవుతారా?
ప్రస్తుతం మిస్గా ఉన్న బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ 2020లో మిసెస్గా మారనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాదిలో ఆమె ఏడడుగులు వేసే ఆలోచనలో ఉన్నారని ముంబై సమాచారం. వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు 33 ఏళ్ల శ్రద్ధాకపూర్. పెళ్లి చేసుకోవడానికి ఇది సరైన సమయం అని కుటుంబ సభ్యులు భావించడంతో శ్రద్ధ కూడా వాళ్ల అభిప్రాయంతో ఏకీభవించారట. కొంతకాలంగా ఫొటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో ఆమె డేటింగ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె పబ్లిక్గా అంగీకరించకపోయినా ప్రేమలో ఉన్నారన్నది ఓపెన్ సీక్రెట్ అని బాలీవుడ్ టాక్. ఇప్పుడు ఈ ప్రేమను పెళ్లి వరకూ తీసుకువెళ్లాలని, 2020లో పెళ్లి చేసుకోవాలనే ప్లాన్లో ఉన్నారట. బాలీవుడ్లో హీరోయిన్ల షాదీ పరంపరలో శ్రద్ధాకపూర్ కూడా జాయిన్ అవ్వనున్నారు. మరి మిసెస్ అయ్యాక సినిమాలను మిస్ అవుతారా? ఊరుకోండి. -
ప్రయాణం అద్భుతంగా సాగింది
ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జైట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’. సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వంశీ, ప్రమోద్లు నిర్మిస్తున్నారు. శ్రద్ధాకపూర్ కథానాయిక. జాకీ ష్రాఫ్, మురళీ శర్మ, అరుణ్ విజయ్, ఎవలీన్ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో అరుణ్ విజయ్ తన పార్ట్ షూటింగ్ను పూర్తి చేశారు. ‘‘ఇలాంటి వండర్ఫుల్ టీమ్లో భాగం అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రయాణాన్ని ఓ మంచి జ్ఞాపకంగా చేసినందుకు ప్రభాస్, సుజీత్, యూవీ క్రియేషన్స్ సంస్థ, నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ థ్యాంక్స్. ఆగస్ట్ 15 నుంచి థియేటర్స్లో అద్భుతమైన అనుభూతిని పొందడానికి రెడీగా ఉండండి’’ అని అరుణ్ విజయ్ పేర్కొన్నారు. -
మేలో పూర్తి
‘బాహుబలి’ చిత్రం తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా ‘సాహో’. సుమారు 300 కోట్ల వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ సైన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. శ్రద్ధా కపూర్ కథానాయిక. మూడు పాటలు, ఓ యాక్షన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ మినహా, మిగతా షూటింగ్ మొత్తం మే నెలలోపు పూర్తి చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సమాచారం. వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఎక్కువ ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా సమాంతరంగా ప్లాన్ చేయనున్నారట. మురళీశర్మ, జాకీ ష్రాఫ్, ఎవ్లీన్ శర్మ, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, మందిర బేడీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంగీతం: శంకర్ ఎహాసన్ లాయ్, కెమెరా: మది. -
ఉద్ఘర్ష మంచి అనుభూతిని కలిగిస్తుంది
కన్నడ పరిశ్రమలో వినూత్న సినిమాలతో పేరు పొందారు దర్శకుడు సునీల్ కుమార్ దేశాయ్. ఆయన తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం ‘ఉద్ఘర్ష’. అనూప్ సింగ్ ఠాకూర్, తాన్యా హోప్, ధన్సిక, శ్రద్ధా కపూర్ ముఖ్య పాత్రల్లో నటించారు. దేవరాజ్ నిర్మించిన ఈ చిత్రం కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ మర్డర్ మిస్టరీ ట్రైలర్ లాంచ్ బెంగళూర్లో జరిగింది. ‘కిచ్చ’ సుదీప్ వాయిస్ ఓవర్ అందించిన ఈ ట్రైలర్ను కన్నడ చాలెంజింగ్ స్టార్ దర్శన్, నటి ప్రేమ విడుదల చేశారు. ఈ సందర్భంగా అనూప్ సింగ్ మాట్లాడుతూ – ‘‘నా కెరీర్లో మోస్ట్ చాలెంజింగ్ పాత్ర ఇది. సినిమా చేయడంలో కొంచెం ఆలస్యం అయింది. అయినా ఎక్కడా నా కాన్ఫిడెన్స్ కోల్పోకుండా చూసుకున్నారు దర్శకుడు దేశాయ్. ఆయన సినిమాలో పని చేయడం గర్వంగా ఫీల్ అవుతున్నాను. గొప్ప థ్రిల్లర్ను చూశారన్న అనుభూతిని పొందుతారు’’ అన్నారు. ‘‘సునీల్గారి సినిమా అనగానే ఓకే అన్నాను. సునీల్కుమార్గారితో ఆల్రెడీ ‘రే’ అనే సినిమా చేశాను. ఇందులో నా క్యారెక్టర్ ఏంటో చెప్పకూడదు. సస్పెన్స్. కానీ కచ్చితంగా షాక్ అవుతారు’’ అన్నారు హర్షిక పొన్నాడ ‘‘కన్నడ నేర్చుకొని మరీ డబ్బింగ్ చెప్పాడు ఠాకూర్. తనని అభినందించి తీరాలి’’ అన్నారు దర్శన్. ‘‘వాయిస్ ఓవర్ అందించిన సుదీప్కు థ్యాంక్స్. టీమ్ అందరూ కష్టపడ్డాం. సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సునీల్కుమార్ దేశాయ్. -
బూమ్...!
పెద్ద క్రైమ్ జరిగింది. దోషులను పట్టుకునేందుకు ఇంటెలిజెన్స్ బ్యూరో విభాగం పక్కా స్కెచ్ వేసింది. ఈ స్కెచ్ ఏంటి? దోషులు ఎలా పట్టుపడ్డారు? అనే అంశాలను వెండితెరపై చూడాల్సిందే. ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సాహో’. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ ఈ సినిమాతో సౌత్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆదివారం ఆమె బర్త్డే సందర్భంగా ‘షేడ్స్ ఆఫ్ సాహో 2’ వీడియోను రిలీజ్ చేశారు. ఇంతకుముందు ప్రభాస్ బర్త్డే సందర్భంగా ‘షేడ్స్ ఆఫ్ సాహో 1’ వీడియోను విడుదల చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. తాజా వీడియో చివర్లో ప్రభాస్ బూమ్ అని స్టైలిష్గా పలకడం హైలైట్గా చెప్పుకోవచ్చు. ఇక‘షేడ్స్ ఆఫ్ సాహో 2’ ప్రభాస్, శ్రద్ధా కపూర్ మరింత స్టైలిష్గా కనిపించారు. విజువల్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇంటర్నేషనల్ క్రైమ్ నేపథ్యంలో సినిమా ఉంటుందని ‘షేడ్స్ ఆఫ్ సాహో’ వీడియోలను చూస్తోంటే అర్థం అవుతోంది. ఈ సినిమాలో శ్రద్ధాకపూర్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్గా కనిపిస్తారని తెలుస్తోంది. ఇక ప్రభాస్ క్యారెక్టర్లో షేడ్స్ ఉన్నాయట. దొంగ, పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో ప్రభాస్ కనిపిస్తారని అంచనా. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాను వంశీ, ప్రమోద్లు నిర్మిస్తున్నారు. మలయాళం నటుడు లాల్, జాకీష్రాఫ్, మందిరాబేడీ, ఎవెలిన్శర్మ, అరుణ్విజయ్, నీల్ నితిన్ ముఖేష్, మురళీశర్మ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు శంకర్ ఎహెసన్ లాయ్ త్రయం సంగీతం అందిస్తున్నారు. ‘సాహో’ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. -
మరింత భయం
రాజ్కుమార్ రావు, శ్రద్ధా కపూర్ జంటగా గతేడాది విడుదలైన హిందీ చిత్రం ‘స్త్రీ’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ హారర్ సినిమాకు సీక్వెల్ చేయనున్నారనే వార్తలు కూడా వచ్చాయి. ప్రస్తుతానికైతే సీక్వెల్ ప్రస్తావనను పక్కన పెడితే రాజ్కుమార్ రావు మళ్లీ ఓ హారర్ సినిమా చేయడానికి అంగీకరించారు. ‘స్త్రీ’కి ఒక నిర్మాతగా వ్యవహరించిన దినేష్ విజనే ఈ సినిమాను నిర్మించనున్నారు. మేలో షూటింగ్ స్టార్ట్ చేస్తారని తెలిసింది. ఇందులో వరుణ్శర్మ కీలకపాత్ర చేయనున్నారు. ఈ చిత్రానికి ‘ఫక్రీ’ ఫ్రాంచైజీ ఫేమ్ మృగ్దీప్ లమ్బా దర్శకత్వం వహిస్తారు. ఇందులో హీరోయిన్ ఫిక్స్ కాలేదు. ఈ చిత్రానికి ‘రూహ్ అఫ్జా’ అనే టైటిల్ పెట్టాలను కుంటున్నారు. ‘స్త్రీ’ కన్నా ఈ సినిమా ఇంకా భయపెట్టే విధంగా స్క్రీన్ప్లే ఉంటుందట. -
వారధిపై వీరబాదుడు
బాంద్రా–వర్లీ వారధి ఎక్కడ ఉంది? అంటే ముంబైలో అని చెబుతారు. కానీ ఇప్పుడీ వారధి హైదరాబాద్లో ఉందంటే ఆశ్చర్యపోవడం ఖాయం. అవును.. బాంద్రా–వర్లీ పీ లింక్ బ్రిడ్జ్ని ‘సాహో’ టీమ్ హైదరాబాద్లో రీ–క్రియేట్ చేశారని సమాచారం. ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్లు నిర్మిస్తున్న సినిమా ‘సాహో’. ఇందులో శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ముంబైలోని బాంద్రా–వర్లీ సీ లింక్ బ్రిడ్జ్ దగ్గర కీలక సన్నివేశాలను చిత్రీకరించాలట. రద్దీగా ఉండే ఆ ఏరియాలో షూటింగ్ అంటే కష్టమే. అందుకే హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియోలో సెట్ వేయిస్తున్నారని తెలిసింది. ఈ సెట్ కోసం దాదాపు 20 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నారట. ఈ సినిమా మొత్తం బడ్జెట్ 300 కోట్లు అయితే.. అందులో దాదాపు 120 కోట్ల రూపాయలను యాక్షన్ సీక్వెన్స్, గ్రాఫిక్స్ వర్క్ కోసమే ఖర్చు చేస్తున్నారని టాక్. ఇప్పుడు బాంద్రా–వర్లీ సీ లింక్ వారధిపై ఓ భారీ చేజింగ్ సీన్ను ప్లాన్ చేశారట. ఈ చేజ్లో హీరో ప్రభాస్తో పాటు విలన్ నీల్ నితిన్ ముఖేష్ కీలకంగా ఉంటారని తెలిసింది. ‘ట్రాన్స్ఫార్మర్స్’ సిరీస్, ‘పెరల్ హార్బర్’ వంటి హాలీవుడ్ సినిమాలకు యాక్షన్ కొరియోగ్రఫీ చేసిన కెన్నీ బేట్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్ అబ్బురపరిచేలా ఉంటాయట. మార్చి నెలాఖరుకల్లా మొత్తం షూటింగ్ను కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ‘సాహో’ టీమ్ ఉన్నట్లు తెలిసింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. -
లాకింగ్ అండ్ పాపింగ్!
యూకేలో ఉండే ఆ పాకిస్థానీ అమ్మాయి, పంజాబ్ కుర్రాడు డ్యాన్స్లో పోటీపడాల్సి వచ్చింది. ఒకరు విజేతగా నిలుస్తారు. ఆ తర్వాత వీరిద్దరికీ పోటీగా మరో డ్యాన్సర్ సవాల్ విసిరాడు. ఫైనల్గా విజేత ఎవరు? అనే విషయం తెలుసుకోవాలంటే చాలా టైమ్ పడుతుంది. కానీ ఈ సినిమా లండన్ షెడ్యూల్ చిత్రీకరణ కోసం మాత్రం టైమ్ దగ్గర పడింది. రెమో డిసౌజా దర్శకత్వంలో వరుణ్ ధావన్, శ్రద్ధాకపూర్, నోరా ఫతేహీ ముఖ్య తారలుగా రూపొందుతున్న సినిమాకు ‘స్ట్రీట్ డ్యాన్సర్స్ 3’ అనే టైటిల్ ఖరారు చేశారు. అలాగే ఈ సినిమాలో వరుణ్ ధావన్, శ్రద్ధాకపూర్లకు చెందిన లుక్స్ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో పంజాబ్ కుర్రాడి పాత్రలో వరుణ్ ధావన్, పాకిస్థానీ అమ్మాయి పాత్రలో శ్రద్ధాకపూర్ నటిస్తున్నారు. ఈ సినిమా కోసం శ్రద్ధా ఐదురకాల కొత్త డ్యాన్సులు నేర్చుకున్నారు. ‘అఫ్రో, లాకింగ్ అండ్ పాపింగ్, క్రంప్, టుట్టింగ్ అండ్ యానిమేషన్, అర్బన్’.. ఈ ఐదు రకాల నృత్యాలను యూకేలో ఉంటున్న భారతీయ నృత్యకారుడు ప్రశాంత్ షిండే, టానియా టోరియాల నుంచి నేర్చుకున్నారు. శ్రద్ధాకి డ్యాన్స్ నేర్పించడం కోసం ఈ ఇద్దరూ ఇండియా వచ్చారు. ఇక ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ఈ నెల 10న లండన్లో జరగనుంది. మార్చి 25 వరకు ఈ షెడ్యూల్ జరుగుతుంది. ఇంతకుముందు రెమో డిసౌజా దర్శకత్వంలోనే 2013లో ‘ఏబీసీడీ’ (ఏనీ బడీ కేన్ డ్యాన్స్), 2015లో ‘ఏబీసీడీ 2’ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. ‘స్ట్రీట్ డ్యాన్సర్స్ 3’ చిత్రాన్ని ఈ ఏడాది నవంబర్ 8న విడుదల చేయాలనుకుంటున్నారు. -
అటు డ్యాన్స్... ఇటు ఫైట్
డ్యాన్స్ మూమెంట్స్ను బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత డైరెక్టర్ యాక్షన్ అనగానే ఫైట్ స్టార్ట్ చేస్తున్నారు బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్. ఏంటి? ఆమె కన్ఫ్యూజ్ అయ్యారా? అని ఆలోచించకండి. ఎందుకంటే శ్రద్ధా ఫుల్ క్లారిటీతోనే అలా చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే... ప్రస్తుతం ‘సాహో’ మూవీ యాక్షన్ సీన్స్లో పాల్గొంటున్నారామె. ఈ సినిమా షాట్ గ్యాప్లో డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేది రీసెంట్గా సైన్ చేసిన ‘ఏబీసీడీ 3’ చిత్రం కోసమే. రెమో డిసౌజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ధావన్ కథానాయకుడు. నోరా ఫతేహి కీలక పాత్ర చేస్తారు. తొలుత ఈ సినిమాలో కత్రినా కైఫ్ను కథానాయికగా తీసుకున్నారు. కానీ, సల్మాన్తో కత్రినా చేస్తున్న ‘భారత్’ సినిమా డేట్స్ ‘ఏబీసీడీ 3’తో క్లాష్ అవడం.. కత్రినా తప్పుకోవడంతో శ్రద్ధా లైన్లోకి వచ్చారు. ఈ సినిమా సెట్స్పైకి వెళ్లడానికి ఎక్కువ టైమ్ లేకపోవడంతో ‘సాహో’ సెట్లోనే డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారట శ్రద్ధా కపూర్. శ్రద్ధా మాత్రమే కాదు.. వరుణ్ ధావన్ కూడా డ్యాన్స్ రిహార్సల్స్ చేస్తున్నారు. అయితే ఆయన ముంబైలో.. శ్రద్ధా మాత్రం ఏ షూటింగ్లో ఉంటే అక్కడే. ‘సాహో, ఏబీసీడీ 3’ సినిమాలే కాకుండా ‘చిఛోరే, సైనా’ చిత్రాలతో బిజీగా ఉన్నారామె. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సాహో’ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. -
యాక్టింగ్కు గుడ్ బై
... అంటున్నారు బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్. అదేంటీ అనుకుంటున్నారా? ఆమె ఇక నటించను అని చెప్పింది ఈ ఏడాదిలో మాత్రమే. కొత్త ఏడాది స్టార్ట్ కావడానికి ఇక రెండు రోజులే ఉన్నాయి కదా. అందుకే సరదాగా అలా అన్నారన్నమాట. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘సాహో’. ఇందులో శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవల జరిగిన ఈ సినిమా షూట్లో ఆమె దాదాపు 15 గంటలు పాల్గొన్నారు. ‘‘సాహో’ సినిమా సెట్లో ఒక రోజులో 15గంటలు పాల్గొన్నాను. 2018కి ఇక షూటింగ్ ముగిసింది. ఈ ఏడాది ఇక నటించను’’ అని పేర్కొన్నారు శ్రద్ధాకపూర్. నీల్నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, ఎవెలిన్ శర్మ, మురళీ శర్మ, ‘వెన్నెల’ కిశోర్ తదితరులు నటించిన ‘సాహో’ చిత్రం 2019 ఆగస్టు 15న విడుదల కానుంది. అలాగే బాలీవుడ్లో శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ కూడా వచ్చే ఏడాది క్రిస్మస్కు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇవి కాకుండా హిందీ చిత్రాలు ‘ఛిచోరే, సైనా’తో బిజీగా ఉన్నారామె. -
హలో.. సాహో!
ముంబై, హైదరాబాద్ల మధ్య చక్కర్లు కొడుతున్నారు హీరోయిన్ శ్రద్ధాకపూర్. హిందీ చిత్రాలు ‘చిచోరి, సైనా’ల కోసం ముంబై స్టూడియోల చుట్టూ తిరుగుతున్న ఆమె ‘సాహో’ కోసం హైదరాబాద్ వచ్చారు. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సాహో’. ఇందులో కథానాయికగా నటిస్తున్నారు శ్రద్దా. రీసెంట్గా యాక్షన్ షెడ్యూల్ను కంప్లీట్ చేసిన టీమ్ తాజాగా స్టార్ట్ అయిన కొత్త షెడ్యూల్లో హీరో, హీరోయిన్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఈ షెడ్యూల్లో పాల్గొనడానికే శ్రద్ధా హైదరాబాద్లో వాలిపోయారు. నీల్నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, మురళీ శర్మ కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు మది కెమెరామేన్. వంశీ, ప్రమోద్లు నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. -
షో టైమ్ ఫిక్సయింది
‘బాహుబలి’ సిరీస్ తర్వాత మళ్లీ డార్లింగ్ ప్రభాస్ను ఎప్పుడు స్క్రీన్పై చూద్దామా అని ఆయన ఫ్యాన్స్తో పాటు మొత్తం దేశంలో ఉన్న సినీ అభిమానులందరూ ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రభాస్ను చూసేయొచ్చు అంటోంది యూవీ క్రియేషన్స్. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘సాహో’.శ్రద్ధా కపూర్ కథానాయిక. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 300కోట్ల భారీ వ్యయంతో ఈ చిత్రం రూపొందుతోంది. వచ్చే ఏడాది ఇండిపెండెన్స్ డే స్పెషల్గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ‘‘ఇట్స్ షో టైమ్. ‘సాహో’ను 2019 ఆగస్ట్ 15న రిలీజ్ చేస్తున్నాం’’ అని పేర్కొంది. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఈ సినిమాకు పని చేస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడీ, మురళీ శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శంకర్ ఎహసాన్ లాయ్, కెమెరా: మది. -
ఉతుకుడే ఉతుకుడు!
విలన్స్ను ఉతికారేశారు ప్రభాస్. ఆ ఉతుకుడు ఏ రేంజ్లో ఉంది? అనేది వెండితెరపై చూడాల్సిందే. ఈ యాక్షన్ను హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ బాబ్ బ్రోన్ డిజైన్ చేశారట. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సాహో’. శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తున్నారు. హైదరాబాద్లో జరుగుతున్న ఈ సినిమా తాజా యాక్షన్ షెడ్యూల్ పూర్తయింది. ‘‘మరో యాక్షన్ ఎపిసోడ్ను కంప్లీట్ చేశాం. యాక్షన్ డైరెక్టర్స్ బాబ్ బ్రోన్, పెన్జాంగ్లు అమేజింగ్గా వర్క్ చేశారు’’ అని డైరెక్టర్ సుజిత్ పేర్కొన్నారు. ఈ యాక్షన్ షెడ్యూల్లో శ్రద్ధా కూడా పాల్గొన్నారు. సో.. ఈ సినిమాలో ఆమె కూడా కొన్ని ఫైట్స్ను చేసి ఉంటారని ఊహించవచ్చు. ఆ మధ్య అబుదాబిలో ఓ సూపర్ చేజింగ్ ఫైట్ని షూట్ చేసింది ‘సాహో’ టీమ్. హైదరాబాద్లో తీసిన ఈ తాజా యాక్షన్ సీన్స్ కూడా హై ఓల్టేజ్లో ఉంటాయట. త్వరలో రొమేనియాలో కూడా ఓ చేజింగ్ ఫైట్ను ప్లాన్ చేశారట. దీన్ని బట్టి ఈ సినిమాలో యాక్షన్కు పెద్దపీట వేసినట్లు అర్థం అవుతోంది. నీల్నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, ‘వెన్నెల’ కిశోర్, మురళీ శర్మ, ఎవెలిన్ శర్మ కీలక పాత్రలు చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్లు నిర్మిస్తున్న ఈ ట్రైలింగ్వల్ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
అమ్మాయి.. ఆంటీ!
ఈ ఏడాది ‘స్త్రీ, బట్టీగుల్ మీటర్ చాలు’ సినిమాల సక్సెస్తో జోరు మీద ఉన్నారు కథానాయిక శ్రద్ధా కపూర్. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్ సైనాలోనూ శ్రద్ధానే టైటిల్ రోల్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో హిందీ చిత్రం ‘చిచోరే’కి పచ్చజెండా ఊపారు శ్రద్ధా. రీసెంట్గా హాలీడేని ఎంజాయ్ చేసిన శ్రద్ధా ఇప్పుడు ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. సుశాంత్సింగ్ రాజ్పుత్, వరుణ్ శర్మ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో సాగే ఈ సినిమాలో కాలేజ్ అమ్మాయిగా, మిడిల్ ఏజ్డ్ మహిళగా రెండు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నారు శ్రద్ధా. అంటే.. అమ్మాయిగా, ఆంటీగా కనిపిస్తారన్న మాట. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల చేయాలనుకుంటున్నారు. అలాగే ప్రభాస్ ‘సాహో’ సినిమాతో ఈ బాలీవుడ్ బ్యూటీ సౌత్కి ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఇలా వరుస ప్రాజెక్ట్స్తో బిజీ బిజీగా ఉన్నారు శ్రద్ధా. -
చెడు అలవాట్లు దూరం
బ్యాడ్మింటన్ ఆడుతుంటే చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ దూరమౌతున్నాయి అంటున్నారు శ్రద్ధా కపూర్. ఈ బ్యూటీ బ్యాడ్మింటన్ రాకెట్ ఎందుకు పట్టుకున్నారో మీకు తెలుసు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పాత్ర పోషిస్తున్నారామె. ఈ పాత్ర కోసం శ్రద్ధ రోజూ గంటల కొద్దీ బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ విషయం చెబుతూ – ‘‘ప్రాక్టీస్ కోసం ఉదయాన్నే నిద్ర లేస్తున్నాను. దాంతో రోజును పొడిగించుకున్నట్టే. ఉదయం లేవడం భలే ఉంది. ఈ సినిమా పూర్తయినా ఈ ఆటను, ఈ అలవాటుని అస్సలు వదలను’’ అని పేర్కొన్నారు శ్రద్ధా కపూర్. సైనా నెహ్వాల్ బయోపిక్ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. -
షేడ్స్ చూపిస్తాం
‘సాహో, సాహో’ అంటూ తన గురించి మాత్రమే విన్నాం. మరి తను ఎలా ఉంటాడు? ఏం చేస్తుంటాడు? అన్నది మాత్రం తెలియదు. ఇప్పుడు ‘సాహో’ పాత్రలోని షేడ్స్ను ప్రేక్షకులకు చూపించనున్నారు చిత్రబృందం. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘సాహో’. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఇందులో శ్రద్ధా కపూర్ కథానాయిక. ఇవాళ ప్రభాస్ బర్త్డే సందర్భంగా ‘సాహో’ సినిమాలో ఆయన క్యారెక్టర్కు సంబంధించిన వీడియోను ‘షేడ్స్ ఆఫ్ సాహో’గా రిలీజ్ చేయనున్నారు. ఈ వీడియోను మంగళవారం ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనుంది చిత్రబృందం. అలాగే ఈ వీడియో సిరీస్లో ఈ భారీ బడ్జెట్ సినిమాకు సంబంధించిన విశేషాలు పంచుకుంటారట. అరుణ్ విజయ్, నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ కీలక పాత్రల్లో కనిపించనున్న ‘సాహో’ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. -
పకడో పకడో
విలన్స్ను పట్టుకోవడానికి చేజింగ్కి రెడీ అవుతున్నారు ప్రభాస్. మరి ఈ చేజింగ్కి కారణం తెలియాలంటే ‘సాహో’ సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘సాహో’. శ్రద్ధా కపూర్ కథానాయిక. యువీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఓ చేజింగ్ సన్నివేశం కోసం రొమేనియా వెళ్లానున్నారట చిత్రబృందం. ప్రభాస్, నీల్ నితిన్ ముఖేష్లపై ఈ చేజింగ్ సన్నివేశాలను చిత్రీకరిస్తారట. సుమారు వారానికిపైగా ఈ షెడ్యూల్ ఉంటుందని టాక్. ఈ నెల 23న ప్రభాస్ బర్త్డే సందర్భంగా ‘సాహో’ సినిమా అప్డేట్ ఇస్తామని చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. పోస్టర్తో పాటు, చిత్రం మేకింగ్ వీడియోని రిలీజ్ చేస్తారని వినికిడి. -
మరో కొత్త ప్రయాణం
నితేష్ తివారీ దర్శకత్వంలో వచ్చిన ‘దంగల్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే. ఆమిర్ ఖాన్, ఫాతిమా సనా షేక్, జైరా వసీమ్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం చైనా, జపాన్ దేశాల్లో కూడా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ఇప్పుడు నితేష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం చిత్రీకరణ ముంబైలో ఆదివారం మొదలైంది. ఈ చిత్రానికి ‘ఛిచ్చోరే’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ‘‘ఈ రోజు నా జీవితంలో ప్రత్యేకమైనది. ఎందుకుంటే నా తాజా సినిమా షూటింగ్ మొదలైంది. కొత్త ప్రయాణం’’ అని పేర్కొన్నారు తివారీ. సాజిద్ నడియాద్వాలా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హీరో హీరోయిన్లుగా ఎవరు నటిస్తున్నారన్న విషయాన్ని నితేష్ బయటపెట్టలేదు. కానీ సుశాంత్సింగ్ రాజ్పుత్, శ్రద్ధాకపూర్, ప్రతీక్ బబ్బర్, వరుణ్ శర్మ పేర్లు వినిపిస్తున్నాయి. -
గెలుపు కోసం...
బరిలో దిగిన ఇద్దరు ఆటగాళ్లూ ప్రతిభావంతులైనప్పుడు గేమ్ భలే మజాగా ఉంటుంది. ఇలాంటి గేమ్లో పాయింట్ గెలుచుకోవడానికి ఇద్దరూ చెమటోడ్చాల్సిందే. అదే చేస్తున్నట్లున్నారు కథానాయిక శ్రద్ధాకపూర్. ఆ విషయం ఇక్కడున్న ఫొటోను చూస్తూంటే అర్థం అవుతుంది. ప్రముఖ హైదరాబాదీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా హిందీలో ‘సైనా’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. టైటిల్ పాత్రలో శ్రద్ధాకపూర్ నటిస్తున్నారు. అమోల్ గుప్తే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు చిత్రబృందం. -
భాగ్యనగరం టు ముంబై
ప్రభాస్ అభిమానులంతా వెయిటింగ్. కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. ఎందుకు? అంటే... ప్రభాస్ పుట్టినరోజు కోసం. వచ్చే నెల 23న ఈ యంగ్ రెబల్ స్టార్ పుట్టినరోజు. ఆ రోజు ‘సాహో’ టీజర్ రూపంలో గిఫ్ట్ ఇస్తారన్నది అభిమానుల అంచనా. చిత్రబృందం కూడా ఫ్యాన్స్కి స్వీట్ షాకివ్వాలనుకుంటోందట. ఆ సంగతలా ఉంచితే.. ప్రస్తుతం హైదరాబాద్లో ‘సాహో’ షూటింగ్తో బిజీగా ఉన్న ప్రభాస్ త్వరలో ముంబై వెళ్లనున్నారు. కొత్త హిందీ సినిమా ఏదైనా ఒప్పుకుని, ఆ షూటింగ్ కోసం అనుకుంటారేమో. అదేం కాదు. ‘సాహో’ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను ముంబైలో చిత్రీకరించడానికి ప్లాన్ చేశారట. ముందు అబుదాబీలో భారీ షెడ్యూల్ చేసిన ఈ చిత్రబృందం దాదాపు నెల రోజుల నుంచి హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుతోంది. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తు్తన్నారు. సుజిత్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. -
ఎంత కష్టం వచ్చిందో
ఒక్క సినిమా. కష్టమేమో రెండు సినిమాలంత అట. ఒక భాషలో చేసిన వెంటనే ఇంకో భాషలో యాక్ట్ చేయాలి. దానికోసం రెండు భాషల్లో డైలాగ్స్ గుర్తు పెట్టుకోవాలి. ప్రస్తుతం శ్రద్ధా కపూర్ ఇదే చేస్తున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏదంటే ‘సాహో’. సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సాహో’. శ్రద్ధా కపూర్ ఇందులో కథానాయిక. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ, ప్రమోద్ నిర్మాతలు. ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ భారీ చిత్రం షూటింగ్ కోసం రెండు సినిమాల కష్టం పడాల్సిందే అంటున్నారు శ్రద్ధా. ఈ విషయం గురించి మాట్లాడుతూ – ‘‘సాహో అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్. పెద్ద సెట్స్, లొకేషన్స్ చేంజ్లు ఉన్నాయి. అలాగే ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రం కావడంతో ప్రతీ సీన్ రెండు సార్లు యాక్ట్ చేయాలి. ఒకసారి తెలుగులో యాక్ట్ చేస్తాం. అది బాగా వస్తే మళ్లీ అదే సీన్ని హిందీలో చేయాలి. అలా కాకపోతే మరోలా. ఈ సినిమా కోసం నా లైన్స్ నేనే గుర్తు పెట్టుకుంటున్నా. కొత్త భాషలో డైలాగ్స్ గుర్తు పెట్టుకోవడం చాలా కొత్త ఎక్స్పీరియన్స్లా ఉంది. చాలా టైమ్ కూడా పడుతుంది. పేరుకి ఒక్క సినిమా అయినా కష్టం రెండు సినిమాలది. అయినా ఎంత కష్టపడ్డా రిజల్ట్ ఆ కష్టాన్ని మర్చిపోయేలా చేస్తుంది’’ అని పేర్కొన్నారు. నీల్ నితిన్ ముఖేశ్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, ఎవెలిన్ శర్మ ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో రిలీజ్ కానుంది. -
స్క్రీన్ టెస్ట్
1. నాని ఇప్పటివరకు ఎన్ని చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారో తెలుసా? ఎ) 3 బి) 5 సి) 1 డి) 6 2. నాటి తరం హీరోలు కృష్ణ, కృష్ణంరాజులు ఎన్ని చిత్రాల్లో కలిసి నటించారో కనుక్కోండి? ఎ) 12 బి) 21 సి) 9 డి) 15 3. మణిపాల్ యూనివర్సిటీలో జర్నలిజం పూర్తి చేసిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఎవరో తెలుసుకుందామా? ఎ) అనూ ఇమ్మన్యుయేల్ బి) నిత్యామీనన్ సి) నివేథా థామస్ డి) మంజిమా మోహన్ 4. సౌత్లో చాలా సినిమాలు చేసి, నార్త్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న టబు హాలీవుడ్ సినిమాల్లోనూ నటించారు. ఆమె ఏ భాషలో మొదట హీరోయిన్గా నటించారో తెలుసా? ఎ) తమిళ బి) ఇంగ్లీషు సి) మలయాళం డి) తెలుగు 5. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ‘అలా మొదలైంది’ చిత్రసంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) యం.యం.కీరవాణి బి) కల్యాణి మాలిక్ సి) సాయికార్తీక్ డి) శేఖర్ చంద్ర 6. ‘చెల్లుబోయిన చిట్టిబాబు’ అనే పేరుతో నటించి 2018 బ్లాక్బస్టర్ మూవీస్లో నిలిచిన ఈ హీరో ఎవరో తెలుసా? (సి) ఎ) విజయ్ దేవరకొండ బి) నాని సి) రామ్చరణ్ డి) అల్లు అర్జున్ 7. ‘బాహుబలి’ చిత్రంలో అస్లాం ఖాన్ పాత్రను పోషించిన నటుడెవరో కనుక్కోండి? ఎ) నాజర్ బి) సుదీప్ సి) ప్రభాకర్ డి) సుబ్బరాజు 8. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ‘మేఘ సందేశం’ చిత్రంలో ఓ సింగర్ తన నిజమైన పేరుతోనే ఓ పాత్ర చేశారు. ఎవరా సింగర్? ఎ) యస్పీ బాలసుబ్రమణ్యం బి) కె.జే.ఏసుదాస్ సి) మను డి) మంగళంపల్లి బాలమురళీ కృష్ణ 9 మేడమ్ స్పీకర్ అని ‘భరత్ అనే నేను’ సినిమాలో మహేశ్బాబు ఏ ఆర్టిస్ట్ను ఉద్దేశించి సంబోధిస్తారో తెలుసా? ఎ) జయలలిత బి) అపూర్వ సి) రజిత డి) ప్రియా 10. ఎన్టీఆర్ బయోపిక్లో హెచ్.ఎమ్. రెడ్డి పాత్రలో నటిస్తున్న ప్రముఖ నటుడెవరో తెలుసా? ఎ) కైకాల సత్యనారాయణ బి) జయప్రకాశ్ రెడ్డి సి) కోట శ్రీనివాసరావు డి) నరేశ్ 11. ‘పేపర్బాయ్’ చిత్రంతో తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టిన నటి పేరు ఏంటి? ఎ) ప్రియ వడ్లమాని బి) రియా సుమన్ సి) నందితా శ్వేతా డి) నభా నటేశ్ 12. ‘ఎక్స్క్యూజ్మి మిస్టర్ మల్లన్న... ఒక కాఫీ తాగుదాం ఆవోనా...’ పాట ‘మల్లన్న’ చిత్రం లోనిది. ఈ పాటలో ‘మల్లన్న’ పాత్రధారి విక్రమ్ను ఆట పట్టించిన కథానాయిక ఎవరో గుర్తుందా? ఎ) సదా బి) సమంత సి) శ్రియ డి) సంగీత 13. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో ఫేమస్ అయిన హీరో పేరేంటో తెలుసా? ఎ) ప్రిన్స్ బి) కార్తికేయ సి) నందు డి) వైభవ్ 14. శ్రీ అమ్మయంగార్ అయ్యప్పన్ ఈ ప్రముఖ నటి అసలు పేరు. ఎవరామె? ఎ) సుజాత బి) సుహాసిని సి) రాధిక డి) శ్రీదేవి 15. ‘బాహుబలి’ చిత్రంలో హీరో ప్రభాస్కు అమ్మగా నటించారు రమ్యకృష్ణ. ఇప్పుడు మరో హీరోకు అత్తగా ఆమె నటించిన ఓ సినిమా రిలీజ్కి రెడీ అయింది. ఆ హీరో ఎవరు? ఎ) అఖిల్ బి) మంచు విష్ణు సి) నాగచైతన్య డి) ఆది 16. ‘అనుకోకుండా ఒక రోజు’ చిత్రదర్శకుడెవరో కనుక్కోండి? ఎ) చంద్ర సిద్ధార్థ బి) చంద్రశేఖర్ యేలేటి సి) చందు మొండేటి డి) శేఖర్ కమ్ముల 17. ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ (మా) ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? ఎ) రాజేంద్ర ప్రసాద్ బి) నరేశ్ సి) శివాజీ రాజా డి) శ్రీకాంత్ 18. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘రాజీ’లో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) శ్రద్ధా కపూర్ బి) కరీనా కపూర్ సి) సోనమ్ కపూర్ డి) ఆలియా భట్ 19. ఈ ఫొటోలోని ప్రముఖ నటుడెవరో కనిపెట్టండి? ఎ) చిత్తూరు వి .నాగయ్య బి) యస్వీ రంగారావు సి) కాంతారావు డి) ముక్కామల 20. ఈ ఫొటోలోని బాల నటుడు ఇప్పుడొక పెద్ద నటుడు చెప్పగలరా? ఎ) మంచు మనోజ్ బి) అఖిల్ సి) ఆది డి) మహేశ్బాబు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) బి 3) బి 4) డి5) బి 6) సి 7) బి 8) డి 9) ఎ 10) ఎ 11) బి 12) సి 13) బి 14) డి 15) సి 16) బి 17) సి 18) డి 19) బి 20) ఎ నిర్వహణ: శివ మల్లాల -
వచ్చేశానోచ్
...అంటున్నారు బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్. ఇంతకీ ఎక్కడికి వచ్చారంటే ‘సాహో’ సెట్లోకి. బాలీవుడ్లో చేస్తున్న ‘బట్టీ గుల్ మీటర్ చాలు’ కోసం ‘సాహో’ సినిమాకు చిన్న బ్రేక్ ఇచ్చారు శ్రద్ధ. అక్కడ షెడ్యూల్ కంప్లీట్ అవ్వడంతో మళ్లీ ఇక్కడికి రిటర్న్ అయ్యారు. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తారని సమాచారం. ప్రభాస్తో పాటు కొన్ని స్టంట్స్ కూడా చేస్తారట. అంతేకాదండోయ్ ‘సాహో’ చిత్రకథ అంతా శ్రద్ధా పాయింట్ నుంచే నడుస్తుందట. ప్రస్తుతం ‘సాహో’ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
సమ్మర్లో సాహో?
హాటైన సమ్మర్లో దీటైన యాక్షన్తో థియేటర్లోకి వచ్చి ఆడియన్స్ను కూల్ చేయాలనుకుంటున్నారట ‘సాహో’ టీమ్. ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్లు నిర్మిస్తున్న సినిమా ‘సాహో’. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమాలో కీలకమైన మూడో షెడ్యూల్ హైదరాబాద్లో జరుగుతోంది. గతేడాది ‘బాహుబలి–2’ రిలీజ్ టైమ్లో ‘సాహో’ టీజర్ను రిలీజ్ చేశారు. ‘ఇన్ థియేటర్స్ 2018’ అని టీజర్ చివర్లో వస్తుంది. కానీ, ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాదని ఆల్రెడీ చిత్రబృందం పేర్కొంది. మరి రిలీజ్ ఎప్పుడు? అంటే వచ్చే ఏడాది ఏప్రిల్ లాస్ట్ వీక్లో అనే వార్తలు వినిపిస్తున్నాయి. ‘బాహుబలి –2’ కూడా ఏప్రిల్ 28న విడుదలైంది. సో.. ఈ సెంటిమెంట్గా కూడా ఆలోచిస్తున్నారట టీమ్. గత ఏడాది ప్రభాస్ బర్త్ డే సందర్భగా ‘సాహో’ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఈ ఏడాది బర్త్డేకి సెకండ్ టీజర్ విడుదల కానుందన్న ప్రచారం జరుగుతోంది. అరుణ్ విజయ్, నీల్ నితిన్ ముఖేష్, ఎవెలిన్ శర్మ, మురళీ శర్మ నటిస్తున్న ఈ చిత్రానికి బాలీవుడ్ త్రయం శంకర్–ఎహాసన్–లాయ్ సంగీతం అందిస్తున్నారు. -
స్పెషల్ గెస్ట్
షాహిద్ కపూర్ హీరోగా నటిస్తోన్న ‘బట్టీ గుల్ మీటర్ చాలు’ సినిమా సెట్లోకి ఓ స్పెషల్ గెస్ట్ ఎంటరయ్యారు. ఆ గెస్ట్ ఫేమస్ హీరోనో లేక డైరెక్టర్నో కాదు. షాహిద్ ముద్దుల తనయ మిషా కపూర్. ‘టాయ్లెట్: ఏక్ ప్రేమ్ కథ’ ఫేమ్ శ్రీ నారాయణ్సింగ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బట్టీ గుల్ మీటర్ చాలు’. షాహిద్ కపూర్, శ్రద్ధా కపూర్, యామీ గౌతమ్లు ముఖ్య తారలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. షాహిద్, శ్రద్ధాలపై సాంగ్ను చిత్రీకరించారు. రీసెంట్గా ఈ సెట్లోకే స్పెషల్ గెస్ట్గా వచ్చారు మిషా. ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్నట్లు ఇంకోమాట.. త్వరలో మీషాకు తోడుగా తమ్ముడు లేక చెల్లి రానున్నారు. అదేనండీ.. ప్రస్తుతం షాహిద్ కపూర్ వైఫ్ మీరా రాజ్పుత్ ప్రెగ్నెంట్ అని చెప్తున్నాం. -
లాయర్గా...
రీసెంట్గా డైలీ కోర్టు మెట్లు ఎక్కుతున్నారు హీరోయిన్ యామీ గౌతమ్. అయితే సినిమా కోసం. ‘టాయ్లెట్: ఏక్ ప్రేమ్ కథ’ ఫేమ్ శ్రీనారాయణ్సింగ్ దర్శకత్వంలో పవర్ కట్ ప్రాబ్లమ్స్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘బట్టీ గుల్ మీటర్ చాలు’. షాహిద్ కపూర్, శ్రద్ధా కపూర్, యామీ గౌతమ్ ముఖ్య తారలుగా నటిస్తున్నారు. హీరో షాహిద్ కపూర్ దొంగగా నటిస్తున్న ఈ సినిమాలో యామీ గౌతమ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నటిస్తున్నారట. ఈ పాత్ర కోసం ఆమె ఆల్రెడీ రియల్గా ముంబై హైకోర్టుకు వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారట. ప్రస్తుతం ముంబైలో వేసిన కోర్టు సెట్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా షూట్లోనే లాయర్గా పాల్గొంటున్నారు యామీ గౌతమ్. మరి.. లాయరమ్మగా యామీ కోర్టులో ఏ రేంజ్లో వాదించారో చూడాలి. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో విడుదల కానుంది. అన్నట్లు ‘నువ్విలా, గౌరవం, యుద్ధం’ సినిమాలతో యామీ తెలుగు తెరపై మెరిసిన విషయం గుర్తుండే ఉంటుంది. -
కౌంట్డౌన్ స్టార్ట్
బుల్లెట్ల వర్షం కురిసింది. కార్లు, ట్రక్కులు క్రాష్ అయ్యాయి. దాదాపు 70 కోట్లు ఖర్చు అయ్యాయి. ఇదీ సింపుల్గా దుబాయ్లో జరిగిన ‘సాహో’ సెకండ్ షెడ్యూల్ గురించి. మరి..నెక్ట్స్ షెడ్యూల్లో ఏం ప్లాన్ చేశారు? అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మరో పది రోజులు ఆగాల్సిందే. అంటే థర్డ్ షెడ్యూల్కి కౌంట్డౌన్ మొదలైంది అని చెబుతున్నాం. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్లు నిర్మిస్తున్న సినిమా ‘సాహో’. శ్రద్ధా కపూర్ కథానాయిక. ఈ సినిమా మూడో షెడ్యూల్ వచ్చే నెల 11 నుంచి హైదరాబాద్లో మొదలు కానుంది. ప్రభాస్తో పాటు ముఖ్య తారలపై కీలక సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేశారని సమాచారం.‘‘అబుదాబిలో సెకండ్ షెడ్యూల్ను కంప్లీట్ చేశాం. జూలై 11నుంచి హైదరాబాద్లో థర్డ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, లాల్, ఎవెలిన్ శర్మ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్న ‘సాహో’ సినిమాకు బాలీవుడ్ త్రయం శంకర్, ఎహసాన్, లాయ్ సంగీతం అందిస్తున్నారు. దాదాపు 300 కోట్ల బడ్జెట్తో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. -
సెప్టెంబర్లో స్టార్ట్
ఉదయం ఐదు గంటలకే నిద్ర లేస్తున్నారు బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్. రెడీ అయిపోయి స్కూల్కి వెళ్తున్నారట. ఈ వయసులో స్కూల్ ఏంటీ? అంటే.. బుక్స్తో కుస్తీ పడే స్కూల్ కాదండీ.. బ్యాడ్మింట¯Œ స్కూల్. బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోపిక్లో శ్రద్ధా యాక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ అవ్వాల్సింది. కానీ లేట్ అవుతూ వస్తోంది. ఫైనల్లీ ఈ సెప్టెంబర్లో స్టార్ట్ కానుందట. అమోల్ గుప్తా దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో సైనా నెహ్వాల్ని తలపించడం కోసమే ఎర్లీ మార్నింగ్ ట్రైనింగ్ స్టార్ట్ చేశారు శ్రద్ధా. ఈ రెండు నెలలు ఫుల్ ట్రైనింగ్లో గడపనున్నారామె. ప్రస్తుతం ప్రభాస్ సరసన శ్రద్ధా ‘సాహో’లో చేస్తోన్న సంగతి తెలిసిందే. -
8 నిమిషాలు.. 70 కోట్లు
కాలం విలువైనది అని పెద్దలు చెబుతుంటారు. అవును ఎంత విలువైనది అంటే.. విలువైనదే కానీ కచ్చితంగా ఇంత అని చెప్పలేం. కానీ ‘సాహో’ చిత్రబృందాన్ని అడిగితే మాత్రం ఒక నిమిషం విలువ ఎనిమిదిన్నర కోట్లు. ఎనిమిది నిమిషాలు సుమారు 70 కోట్లు అంటున్నారు. బాబోయ్ అంతా! అంటే అవును మరి... కేవలం ఎనిమిది నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ కోసం సుమారు 70 కోట్లు వెచ్చించారట ‘సాహో’ చిత్రబృందం. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ థ్రిల్లర్ ‘సాహో’. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. శ్రద్ధా కపూర్ కథానాయిక. దుబాయ్లో ఈ చిత్రానికి సంబంధించిన భారీ యాక్షన్ షెడ్యూల్ చిత్రీకరించిన సంగతి తెలిసిందే. అక్కడ యాక్షన్ ఎపిసోడ్ తీశారు. అయితే ఆ ఎపిసోడ్ లెంగ్త్ ‘ఎనిమిది నిమిషాలు’ అన్నది తాజా ఖబర్. ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం దాదాపు వంద రోజులు ప్రీ–ప్రొడక్షన్ వర్క్ జరిపారట యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్. ఈ ఫైట్ సీక్వెన్స్లో ప్రత్యేకమైన కారుని కూడా ఉపయోగించారట కెన్నీ బేట్స్. సుమారు ఎనిమిది నిమిషాల నిడివి ఉన్న ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం 70 కోట్లు ఖర్చు చేసిందట చిత్రబృందం. ఈ భారీ యాక్షన్ కోసమే 28 కార్లు, 5 ట్రక్కులను క్రాష్ చేశారు. శంకర్ ఎహాసన్ లాయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2019 ప్రథమార్ధంలో రిలీజ్ కానుంది. -
యాక్షన్ టు లవ్
‘‘ఇటీవల వరుసగా అన్నీ యాక్షన్ ఫిల్మ్స్, ఫిజికల్గా ఎక్కువ స్ట్రెయిన్ అయ్యే సినిమాలనే చేస్తున్నాను. అందుకే కొంచెం రూట్ మార్చాలనుకుంటున్నాను’’ అంటున్నారు ప్రభాస్. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘సాహో’ షూటింగ్లో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఇందులో శ్రద్ధాకపూర్ కథానాయిక. 300 కోట్ల భారీ వ్యయంతో ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ‘మిర్చి’, ‘బాహుబలి, సాహో’.. ఇలా కంటిన్యూస్గా యాక్షన్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ కెరీర్ ఫేజ్ని కొంచెం షిఫ్ట్ చేయాలనుకుంటున్నారట. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ– ‘‘ఈ మధ్య ‘సాహో’ కోసం దుబాయ్లో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తీశాం. రియల్గా ఫైట్ చేయాల్సిందే. డూప్లకు స్కోప్ లేదు. అందుకే ఈ సినిమా తర్వాత కొంచెం రిలాక్సింగ్ మోడ్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను. యాక్షన్ నుంచి లవ్కి షిఫ్ట్ అవుతున్నా. రాధాకృష్ణ డైరెక్షన్లో చేయబోతున్నది మంచి లవ్స్టోరీ. ఇది యూరోప్లో జరిగే లవ్స్టోరీ. నాలోని డిఫరెంట్ యాంగిల్ని చూస్తారు. యాక్షన్ హీరోగా వెళుతున్న నా గ్రాఫ్లో కొంచెం చేంజ్ రావడానికి ఈ సినిమా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు ప్రభాస్. -
తిరిగిచ్చేయాలి
‘‘మనం ధనిక కుటుంబం నుంచి వచ్చామా లేదా సెలబ్రిటీలమా అన్నది కాదు ముఖ్యం. ప్రతీ ఒక్కరూ ఎంతో కొంత తిరిగి ఇవ్వడం నేర్చుకోవాలి’’ అంటున్నారు బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్. కెరీర్ బిగినింగ్ నుంచి కూడా సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారామె. ప్రస్తుతం ఓ ఛారిటీలో భాగం అవుతున్నారీ బ్యూటీ. ఆ విషయం గురించి శ్రద్ధా మాట్లాడుతూ – ‘‘ఈసారి బోలెడన్ని బట్టలు డొనేట్ చేయనున్నాను. యాక్టర్గా మాకు చాలా కంపెనీల నుంచి బట్టలు వస్తుంటాయి. అందులో మిగిలినవన్నీ నా వంతు సాయంగా డొనేట్ చేయనున్నాను. మనందరికీ తిండీ, బట్టా, గూడు వంటి కనీస వసతులున్నాయి అని ఆనందించాలి. అలాగే ప్రతి ఒక్కరూ తమకు తోచినంతలో ఎంతో కొంత ప్రేమను పంచాలి’’ అని పేర్కొన్నారామె. శ్రద్ధా ప్రస్తుతం ప్రభాస్తో ‘సాహో’ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. -
నేను చాలా ఫాస్ట్
అమ్మాయిలు షాపింగ్కు వెళితే గడియారం అలా తిరిగిపోతుందంటారు. కానీ రోజులు మారాయి. ఇప్పుడు అబ్బాయిలు కూడా షాపింగ్లో గంటలు గంటలు గడుపుతున్నారు. అయితే కొంతమంది అబ్బాయిలు మాత్రం టీ–20లో బ్యాట్స్మెన్లా ఫటాఫట్ ధనాధన్ స్టైల్ని ఫాలో అవుతారు... గంటలో షాపింగ్ను ముగించేస్తారు. ప్రభాస్ కూడా ఇలాంటి టైపే. ‘సాహో’ షెడ్యూల్ కోసం ప్రభాస్ దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడి షాపింగ్ మాల్స్లో ‘సాహో’ టీమ్లో కొందరు షాపింగ్ చేస్తే, ప్రభాస్ మాత్రం ‘నో షాపింగ్’ అంటున్నారు. ఈ సందర్భంగా తన షాపింగ్ అలవాటు గురించి ప్రభాస్ చెబుతూ –‘‘ఎంత పెద్ద మాల్కి వెళ్లినా నేను తొందరగానే షాపింగ్ ముగించేస్తా. నాక్కావాల్సినవి చాలా ఫాస్ట్గా సెలెక్ట్ చేసేసుకుంటా. మాగ్జిమమ్ గంటలోపే నాకు కావాల్సినవి కొనుక్కుంటాను. షాపింగ్కు డబ్బు ఎక్కువ పెడుతున్నానా? తక్కువ ఖర్చు చేస్తున్నానా? అని ఆలోచించను’’ అని పేర్కొన్నారు ప్రభాస్. ఇక ‘సాహో’ సినిమా విషయానికొస్తే.. సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్లు ఈ చిత్రాన్ని నిర్మి స్తున్నారు. ఇందులో శ్రద్ధా కపూర్ కథానాయిక. రీసెంట్గా అబుదాబి షెడ్యూల్ను కంప్లీట్ చేసిన ఈ టీమ్ నెక్ట్స్ షెడ్యూల్ను వచ్చే నెల సెకండ్ వీక్లో హైదరాబాద్లో ప్లాన్ చేస్తోందని టాక్. -
కోర్ట్ చుట్టూ యామీ
కోర్ట్ చుట్టూ తిరగనున్నారు బాలీవుడ్ భామ యామీ గౌతమ్. అయ్యో.. ఏం కేస్లో ఇరుకున్నారు పాపం? అనుకోకండి. కోర్ట్కి వెళ్తుంది కేస్ మీద కాదు. క్యారెక్టర్ ప్రిపరేషన్ కోసం. షాహిద్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా శ్రీ నారయణ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘బట్టి గుల్ మీటర్ చాలు’. ఇందులో యామీ గౌతమ్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. గ్రామాల్లో కరెంట్ కష్టాల గురించి ఈ సినిమా డిస్కస్ చేయనుందట. ఇందులో యామీ గౌతమ్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్రను కరెక్ట్గా పోషించడం కోసం ప్రిపరేషన్లో భాగంగా కోర్ట్కు హాజరవ్వాలనుకుంటున్నారట యామీ. వచ్చే నెలలో షెడ్యూల్ స్టార్ట్ అయ్యేసరికి రెండు మూడు కోర్ట్ హియరింగ్స్ అయినా అటెండ్ అవ్వాలనుకుంటున్నారట యామీ. పాత్ర పట్ల తనకున్న డెడికేషన్కి చూసి ఆశ్చర్యపోతున్నారట ‘బట్టి గుల్...’ చిత్రబృందం. -
37 కార్లు... 5 ట్రక్కులు క్రాష్
హెడ్డింగ్ చూసి ఇంత విధ్వంసం ఎక్కడ జరిగింది? అనుకుంటున్నారా? ‘సాహో’ షూటింగ్లో. ప్రస్తుతం దుబాయ్లో ‘సాహో’ సినిమాకు సంబంధించిన చేజింగ్ సీక్వెన్స్ 90 కోట్ల ఖర్చుతో చిత్రీకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ చేజ్ కోసం సుమారు 37 కార్లు, 5 భారీ ట్రక్కులను షూటింగ్లో భాగంగా క్రాష్ చేశారట. ప్రభాస్ హీరోగా ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజిత్ డైరెక్షన్లో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘సాహో’. ఇందులో శ్రద్ధా కపూర్ కథానాయిక. ఈ యాక్షన్ షెడ్యూల్ గురించి ‘యూఏఈ’ మీడియాతో చిత్రబృందం మాట్లాడుతూ –‘‘ఇలాంటి ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తీద్దాం అనే ప్లాన్ ఉన్నప్పుడు హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ దగ్గరకు వెళ్లాం. దుబాయ్లో లొకేషన్స్ చూశాక కెన్నీ బేట్స్ యాక్షన్స్ సీన్స్లో ఎక్కువ పోర్షన్ రియలిస్టిక్గా షూట్ చేద్దాం అని డిసైడ్ అయ్యారు. ఆల్మోస్ట్ 90 శాతం స్క్రీన్ మీద చూపించేదంతా రియల్. ఇందులో చూపించే కార్లు, గాల్లో ఎగిరే కార్లు అన్నీ రియలే. జనరల్గా 70 శాతం సీజీ. 30 శాతం రియల్ ఉంటుంది. కానీ మేం వీలున్నంత వరకూ రియలిస్టిక్ సీన్స్ చూపించదలుచుకున్నాం’’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కెన్నీ బేట్స్తో పాటు మరికొందరు వరల్డ్ ఫేమస్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ కూడా ఈ చిత్రానికి పని చేయనున్నారు. నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్. ఎవలిన్ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ 2019లో థియేటర్లలోకి రానుంది. -
ఆన్ పబ్లిక్ డిమాండ్...
ఎవెలిన్ శర్మ... ఈ జర్మన్ బ్యూటీ గురించి తెలుగు ఆడియన్స్కు అంతగా తెలియదు. కానీ ‘సాహో’ సినిమాలో నటిస్తుండటంతో టాలీవుడ్ ఆడియన్స్కు ఇప్పుడిప్పుడే కాస్త దగ్గరవుతున్నారు. కొందరు నెటిజన్లు ప్రభాస్తో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పెట్టమని ఆమెని అడిగారట. ‘‘హాయ్... పబ్లిక్ డిమాండ్. మై హీరో ప్రభాస్తో ఫొటో దిగాను. ఆయన్ని ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేయమని రిక్వెస్ట్ చేశాను. ప్రభాస్ ట్విట్టర్ అకౌంట్ను స్టార్ట్ చేయాలనుకున్నవాళ్లు ఈ పోస్ట్ను రీ ట్వీట్ చేయండి’’ అని సరదాగా అంటూ ప్రభాస్తో దిగిన ఫొటోను షేర్ చేశారు ఎవెలిన్. ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శక త్వంలో వంశీ, ప్రమోద్లు నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘సాహో’. ఇందులో శ్రద్ధా కపూర్ కథానాయిక. ఎవెలిన్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ∙ఎవెలిన్ శర్మ, ప్రభాస్ -
వచ్చేశానోచ్
యాహూ... ‘సాహో’ సెట్కు వచ్చేశానోచ్ అని సంబరపడిపోతున్నారు హీరోయిన్ శ్రద్ధా కపూర్. ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్లు నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అబుదాబిలో జరుగుతోంది. ఆదివారం ‘సాహో’ సెట్లో శ్రద్ధా కపూర్ జాయిన్ అయ్యారు. ప్రజెంట్ అక్కడ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బెట్స్ సారథ్యంలో యాక్షన్ సీక్వెన్స్ను తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు ‘సాహో’ సెట్లో శ్రద్ధా జాయిన్ అవుతున్నారంటే.. ఫైట్ సీన్స్లో ఆమె కూడా ఉంటారని ఊహించవచ్చు. మరి.. శ్రద్ధా ఏవైనా స్టంట్స్ చేస్తారా? అన్నది థియేటర్స్లో చూడాలి. అరుణ్ విజయ్, నీల్ నితిన్ముఖేష్, ఎవెలిన్ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. -
20 నిమిషాలు.. 40 కోట్లు.. 50 రోజులు
కార్లు గాల్లో ఎగరటానికి కొబ్బరికాయ కొట్టేశారు.. బాంబులు బ్లాస్ట్ అవ్వడానికి బోణీ చేసేశారు ‘సాహో’ చిత్రబృందం. ప్రభాస్ హీరోగా ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘సాహో’. శ్రద్ధాకపూర్ కథానాయిక. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కీలకమైన కార్ చేజ్ సీక్వెన్స్ను దుబాయ్లో శనివారం స్టార్ట్ చేశారు. 20 నిమిషాల ఈ చేజ్ కోసం దాదాపు 40 కోట్లు ఖర్చు పెట్టనున్నారట చిత్రబృందం. ఈ ఫైట్ సీక్వెన్స్ను సుమారు 50 రోజులు షూట్ చేస్తారని సమాచారం. అంటే.. 50 రోజుల పాటు ప్రభాస్ ఇండియాలో ఉండరన్నమాట. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఈ స్పెషల్ ఫైట్ సీక్వెన్స్ను డిజైన్ చేశారు. సాబు సిరిల్ ఆర్ట్ డిపార్ట్మెంట్ టీమ్ గత నెలరోజుల నుంచి దుబాయ్లోనే ఉంటున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా 2019లో రిలీజ్ కానుంది. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేశ్, అరుణ్ విజయ్, ఎవెలిన్ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం శంకర్–ఎహాసన్–లాయ్, కెమెరా:మది. -
ఆహా.. ఓహో... సాహో
...లో భలే చాన్స్ అంటూ టీమ్కి మరో బాలీవుడ్ బ్యూటీ ఎవెలిన్ శర్మ హాయ్ చెప్పారు. ‘ఏ జవానీ హై దివానీ, జబ్ హ్యారీ మెట్ సెజల్’ చిత్రాలతో పాటు మరికొన్ని హిందీ సినిమాల్లో నటించారు ఎవెలిన్. ఆల్రెడీ బీటౌన్ నుంచి శ్రద్ధా కపూర్ ‘సాహో’ లో హీరోయిన్గా చేస్తున్నారు. మరి.. ఎవెలిన్ సెకండ్ హీరోయినా? అంటే ఆ విషయం మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ సినిమాలో తన క్యారెక్టర్ కోసం ఎవెలిన్ ఆల్రెడీ పది కిలోలు బరువు కూడా తగ్గారు. అంతేకాదు ప్రేక్షకులు అబ్బురపోయేలా సినిమాలో కీలకమైన యాక్షన్ స్టంట్స్ చేయబోతున్నారట ఎవెలిన్. ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్లు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్న చిత్రం ‘సాహో’. ఇందులో నీల్నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్ కీలక పాత్రలు చేస్తున్నారు. హిందీ వెర్షన్ను టీ–సిరీస్ అధినేత భూషణ్కుమార్ రిలీజ్ చేయనున్నారు. అబుదాబి షెడ్యూల్లో ‘సాహో’ టీమ్తో ప్రభాస్ ఈ నెల 21న జాయిన్ అవ్వనున్నారు. ‘‘మాటలు రావడం లేదు. హ్యాపీగా ఉంది. నా లైఫ్లో మోస్ట్ హ్యాపీ పార్ట్ ఇది. యాక్షన్ రోల్ చేయాలనుకుంటున్న టైమ్లో మెగా ఫిల్మ్ ‘సాహో’లో చాన్స్ దొరికింది. టీమ్తో జాయిన్ అవ్వడానికి ఎగై్జటింగ్గా ఎదురు చూస్తున్నా. ‘సాహో’ టీమ్లో నన్ను మెంబర్ని చేసినందుకు సుజీత్, ప్రభాస్ అండ్ టీమ్కి «థ్యాంక్స్’’ అన్నారు ఎవెలిన్ శర్మ. ‘సాహో’ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ‘సాహో’ కొబ్బరికాయ కథ ఇది! అన్నా.. అప్డేట్ చెప్పు? దుబాయ్ షెడ్యూల్ ఎప్పుడు? ఇదిగో ఇలాగే ప్రభాస్ ఫ్యాన్స్ ‘సాహో’ డైరెక్టర్ సుజీత్కు ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు. ‘‘బాస్.. దుబాయ్లో ‘సాహో’ షెడ్యూల్ స్టార్ట్ అయినప్పుడు కొబ్బరికాయ కొట్టే ఫొటో పెడతాను’’ అని కొన్ని రోజుల క్రితం చెప్పారు సుజీత్. అన్నట్లుగానే ‘సాహో’ షెడ్యూల్ శనివారం స్టార్ట్ కాబోతోందని కొబ్బరికాయ ఫొటోను ట్వీటర్లో పెట్టి, అప్డేట్ ఇచ్చారు సుజీత్. -
సాహోరే యాక్షన్
దుబాయ్లో షూటింగ్ జరగనుంది. 20 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించబోతున్నారు. కొన్ని రోజులుగా ‘సాహో’ సినిమా షూటింగ్ గురించి తెలిసిన సమాచారం ఇదే. ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ షూట్ ఎప్పుడు మొదలవుతుంది? ఎంతమంది టెక్నీషియన్స్ ఇందులో పాల్గొంటున్నారు? అన్న విషయాలు బయటకు రాలేదు. ప్రభాస్ హీరోగా ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సాహో’. శ్రద్ధాకపూర్ కథానాయిక. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దుబాయ్లో జరగబోయే భారీ యాక్షన్ సీక్వెన్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు. ► ఈనెల 12న ఈ యాక్షన్ ఎపిసోడ్ షూట్ స్టార్ట్ చేయనున్నారు. లొకేషన్స్ వెతకడం కోసం గత ఆరు నెలల్లో 8 సార్లు దుబాయ్ వెళ్లారు. వెళ్లిన వారిలో ఆర్ట్ డైరెక్టర్ సాబు శిరిల్ కూడా ఉన్నారు. విశేషం ఏంటంటే.. ఈ షూట్ ప్రిపరేషన్ కోసం నెలన్నరగా ఆర్ట్ డిపార్ట్మెంట్ టీమ్ దుబాయ్లోనే ఉంటున్నారు. ► ఈ యాక్షన్ పార్ట్ ఆర్ట్ డిజైన్ కోసం దాదాపు 300 మంది ఆర్ట్ టీమ్ (పెయింటర్స్, కార్పెంటర్స్, డిజైనర్స్, వెల్డర్స్) వర్క్ చేసింది. దీన్నిబట్టి దుబాయ్లో ఎంత భారీ సెట్ వేసి ఉంటారో ఊహించవచ్చు. నిజానికి ప్రీ–ప్రొడక్షన్ వర్క్లో భాగంగా హైదరాబాద్లో ఈ సెట్కి సంబంధించిన చాలా వర్క్ చేశారు. ఆ తర్వాతే అక్కడే సెట్ వేయడం మొదలుపెట్టారు. ఈ సెట్కి కావాల్సిన మెటీరియల్ను 4 కంటైనర్లలో ఇక్కణ్ణుంచి దుబాయ్కి తీసుకువెళ్లారు. ► దుబాయ్లో యాక్షన్ ఎపిసోడ్లో ఏం షూట్ చేయాలో అని దర్శకుడు సుజిత్, కెమెరామేన్ మది, హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ అందరూ కలిసి ఒక 16 రోజులు డిస్కస్ చేసుకున్నారు. ► న్నీ బేట్స్ టీమ్లో లాస్ ఏంజెల్స్, లండన్కు చెందిన 120 మంది ఉన్నారు. ఈ టీమ్ అంతా షూట్లో పాల్గొంటున్నారు. వీళ్లంతా రోప్స్, క్రాషింగ్, బ్లాస్టింగ్లో నిపుణులు. వీళ్లంతా ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం వర్క్ చేయనున్నారు. అదండీ విషయం. ఈ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారంటే ఈ యాక్షన్ ఎపిసోడ్ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. -
స్క్రీన్ టెస్ట్
► బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ తెలుగులో ఒక ప్రముఖ హీరో సరసన నటిస్తోంది. ఎవరా హీరో? ఎ) ప్రభాస్ బి) మహేశ్బాబు సి) ఎన్టీఆర్ డి) వరుణ్తేజ్ ► ‘ఆపద్బాంధవుడు’ చిత్రంలో చిరంజీవి నాటకాలు వేస్తూ, ఓ దేవుని పాత్రను పోషించాడు? అది ఏ దేవుని పాత్రో తెలుసా? ఎ) రాముడు బి) కృష్ణుడు సి) శివుడు డి) వెంకటేశ్వరస్వామి ► అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా పేరు ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. ఈ సినిమాలో ఆయన పక్కన నటిస్తున్న హీరోయిన్ ఎవరు? ఎ) రాశీ ఖన్నా బి) రకుల్ప్రీత్ సి) అనూ ఇమ్మాన్యుయేల్ డి) పూజా హెగ్డే ► ‘కుమారి 21 ఎఫ్’ చిత్రం ద్వారా హెబ్బాపటేల్ ఫేమస్ అయ్యారు. కొందరు అదే తనకు మొదటి సినిమా అనుకుంటారు. అంతకుముందే హెబ్బా ఒక మంచి సినిమాలో నటించింది. ఆ సినిమా పేరేంటి? ఎ) అలా ఎలా బి) అనగనగా ఓ రాత్రి సి) అనగనగా ఓ ఊరిలో డి) అనుకోకుండా ► రామ్చరణ్ నటిస్తున్న ‘రంగస్థలం’ చిత్రం ఏ కాలానికి సంబంధించిన కథో తెలుసా? ఎ) 1960 బి) 1985 సి) 1990 డి) 1970 ► ‘నిన్ను కోరి’ చిత్రం ద్వారా పేరు తెచ్చుకున్న దర్శకుడు శివ నిర్వాణ తాజా చిత్రంలో నాగచైతన్య హీరోగా నటిస్తున్నాడు. మరి చైతన్య ప్రక్కన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) సమంత బి) కాజల్ అగర్వాల్ సి) లావణ్యత్రిపాఠి డి) అనుపమ పరమేశ్వరన్ ► పూజా హెగ్డే సరసన తెలుగులో నటించిన మొదటి హీరో ఎవరు? ఎ) అల్లు అర్జున్ బి) సాయిధరమ్ తేజ్ సి) వరుణ్ తేజ్ డి) అల్లు శిరీష్ ► హీరో రామ్కు సొంత నిర్మాణ సంస్థ ఉంది. ఆ సంస్థ పేరు స్రవంతి మూవీస్. కానీ ఆయన హీరోగా పరిచయమైన నిర్మాణ సంస్థ పేరేంటి? ఎ) శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బి) 14 రీల్స్ సి) బొమ్మరిల్లు డి) సురేశ్ ప్రొడక్షన్స్ ► ‘అంతం, రాత్రి’ సినిమాల ద్వారా దర్శకుడు రామ్గోపాల్ వర్మ ఒక నూతన సంగీత దర్శకుడిని తెలుగు తెరకు పరిచయం చేశాడు. ఎవరతను? ఎ) యం.యం.కీరవాణి బి) మణిశర్మ సి) రమణ గోగుల డి) సందీప్ చౌతా ► దర్శకునిగా ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చిన యస్.వి.కృష్ణారెడ్డి ఓ పండగ పేరుతో విడుదలైన సినిమా ద్వారా హీరోగా మారారు. ఆ సినిమా పేరేంటి? ఎ) విజయదశమి బి) దీపావళి సి) సంక్రాంతి డి) ఉగాది ► నటుడు ఉదయ్ కిరణ్ని సిల్వర్ స్క్రీన్కి పరిచయం చేసిన దర్శకుడెవరో తెలుసా? ఎ) వీవీ వినాయక్ బి) విజయ్ భాస్కర్ సి) తేజ డి) త్రివిక్రమ్ ► ‘జతకలిసే.. జతకలిసే జగములు రెండు జతకలిసే’ పాట రచయిత ఎవరు? ఎ) సిరివెన్నెల సీతారామశాస్త్రి బి) శ్రీమణి సి) రామజోగయ్య శాస్త్రి డి) అనంత శ్రీరామ్ ► ‘మనం పెరిగే కొద్దీ మన చుట్టూ ఉన్న మనుషులు మారొచ్చు.. ప్రపంచం మారొచ్చు కానీ ఒక్కటి మాత్రం ఎప్పటికీ మారదు శైలు, నేను నిన్ను చూసిన ప్రతిసారి ప్రేమలో పడటం’ అనే డైలాగ్ ‘నేను శైలజ’ సినిమాలోనిది. ఈ సినిమా స్టోరీ రైటర్ ఎవరో కనుక్కోండి? ఎ) సంపత్ నంది బి) కోన వెంకట్ సి) కిషోర్ తిరుమల డి) పరుచూరి బ్రదర్స్ ► ‘వాల్పోస్టర్’ అనే సినిమా బ్యానర్ను ప్రారంభించిన ప్రముఖ హీరో ఎవరు? ఎ) కల్యాణ్రామ్ బి) నాని సి) మంచు మనోజ్ డి) ‘అల్లరి’ నరేశ్ ► ట్విట్టర్ అనే సామాజిక మాధ్యమంలో దర్శకుడు ఆర్జీవి చాలా ఫేమస్. ఆయన ట్విట్టర్ ఐడీ ఏంటో తెలుసా? ఎ) జూమ్ఇన్ ఆర్జీవి బి) ఐయామ్ ఆర్జీవి సి) దిస్ ఈజ్ ఆర్జీవి డి) ఆర్జీవి జూమ్ఇన్ ► నటి కీర్తీ సురేశ్ అమ్మగారు మేనక కూడా తెలుగులో నటించారు. ఆమె నటించిన సినిమాలో ఇప్పటి స్టార్ హీరో నటì ంచారు. ఆ హీరో ఎవరో తెలుసా? ఎ) బాలకృష్ణ బి) చిరంజీవి సి) నాగార్జున డి) వెంకటేశ్ ► ఈ ఫొటోలోని చిన్నారి ఇప్పుడు ప్రముఖ హీరోయిన్. ఆమె ఎవరు? ఎ) హన్సిక బి) రకుల్ప్రీత్సింగ్ సి) సమంత డి) తాప్సీ ► ఎన్టీఆర్, జయసుధ నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిది? ఎ) మనుషులంతా ఒక్కటే బి) యుగపురుషుడు సి) మహాపురుషుడు డి) మేజర్ చంద్రకాంత్ ► తెలుగులో లేడీ సూపర్స్టార్గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) రాధ బి) రాధిక సి) విజయశాంతి డి) సుహాసిని ► ‘బాహుబలి’లో రమ్యకృష్ణ పాత్రకు మొదట ఓ ప్రముఖ హీరోయిన్ను అనుకొన్నారు. కొన్ని కారణాల వల్ల ఆమె ఆ పాత్రను చేయలేకపోయారు. ఎవరా హీరోయిన్? ఎ) టబూ బి) శ్రీదేవి సి) రేఖ డి) మాధురీ దీక్షిత్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) సి 3) సి 4) ఎ5) బి 6) ఎ 7) సి 8) సి 9) బి 10) డి 11) సి 12) సి 13) సి 14) బి15) డి 16) బి 17) ఎ 18) సి 19) సి 20) బి -
మార్పు లేదు!
కాదు.. కాదు.. దుబాయ్లోనే. లేదు... లేదు.. హైదరాబాద్లోనే ఫిక్స్. ఇది.. ‘సాహో’ చిత్రంలోని చేజింగ్ సీక్వెన్స్ గురించి ఫిల్మ్నగర్లో జరుగుతున్న చర్చ. ప్రభాస్ హీరోగా ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్లు నిర్మిస్తున్న సినిమా ‘సాహో’. ఇందులో శ్రద్ధాకపూర్ కథానాయిక. ఈ సినిమాలో ఇంటర్నేషనల్ థీఫ్ నుంచి పోలీస్ ఇన్ఫార్మర్గా మారే వ్యక్తి క్యారెక్టర్లో ప్రభాస్ నటిస్తున్నారన్నది తాజా ఖబర్. ఇందులో ఎంతో కీలకమైన చేజింగ్ యాక్షన్ సీక్వెన్స్కు ఆల్మోస్ట్ 10 కోట్లకు పైనే ఖర్చు చేస్తున్నారట. ఈ చేజింగ్ సీన్స్ను దుబాయ్లో షూట్ చేయాలనుకున్నారు. హాలీవుడ్ కొరియోగ్రాఫర్ కెన్నీ బెట్స్ పర్యవేక్షణలో దర్శకుడు సుజీత్ లొకేషన్స్ను కూడా సెర్చ్ చేశారు. కానీ అనుకున్న సమయానికి షూట్ స్టార్ట్ కాలేదు. దీంతో హైదరాబాద్లో ఈ షెడ్యూల్ను ప్లాన్ చేశారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. కానీ.. ఈ షెడ్యూల్ ఈ నెల ఎండింగ్లో దుబాయ్లోనే జరుగుతుందని ఈ సినిమాలో నటిస్తున్న బాలీవుడ్ యాక్టర్ నీల్ నితిన్ ముఖేష్ పేర్కొన్నారు. ‘సాహో’ గురించి ఆయన మాట్లాడుతూ – ‘‘నాకు తెలిసి దుబాయ్ షెడ్యూల్లో చేంజ్ ఏమీ లేదు. ఈ మంత్ ఎండింగ్లో దుబాయ్ షెడ్యూల్ స్టార్ట్ కావచ్చు. బుర్జ్ ఖలీఫా, అబుదాబిలో ‘సాహో’ టీమ్తో వర్క్ చేయడానికి ఆసక్తిగా ఎదరుచూస్తున్నాను’’ అని నీల్ అన్నారు. -
సీరియస్ లుక్స్!
ఇన్సెట్లో ఉన్న ఫొటో చుశారుగా! కథానాయిక శ్రద్ధాకపూర్ ఎంత సీరియస్ లుక్స్ ఇస్తున్నారో! ఇంతకీ..ఈ లుక్స్ ‘సాహో’ చిత్రంలోనివేనట. ప్రభాస్ హీరోగా ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న సినిమా ‘సాహో’. ఇందులో శ్రద్ధాకపూర్ కథానాయిక. గతేడాది అక్టోబర్లో ‘సాహో’ చిత్రంలోని ప్రభాస్ ఫస్ట్ లుక్ను చిత్రబృందం అధికారికంగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే..‘సాహో’లో శ్రద్ధాకపూర్ లుక్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఇన్సెట్లో ఉన్న ఫొటో వైరల్ అయ్యింది. శ్రద్ధాకపూర్ మేకప్ ఆర్టిస్ట్ శ్రద్ధా నాయక్ అకౌంట్ నుంచి ఈ ఫొటో వైరల్ అయ్యిందట. త్వరలోనే ‘సాహో’ టీమ్ దుబాయ్లో చేజింగ్ సీన్స్ను చిత్రీకరించబోతున్నారని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం దుబాయ్లో అనుమతి దొరకలేదు. సో.. ఆ చేజింగ్ సీన్స్ను హైదరాబాద్లోనే భారీ బడ్జెట్తో సెట్వేసి చిత్రీకరిస్తారు అని అభిప్రాయపడుతున్నారు. మరి..ఈ షెడ్యూల్ ఎక్కడ జరుగుతుందనే దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది. -
లాయర్.. ఓ దొంగ... ఓ అమ్మాయి!
కామన్ పీపుల్ ఫేస్ చేస్తోన్న ఎలక్ట్రిసిటీ పవర్ ప్రాబ్లమ్స్ను బేస్ చేసుకుని ‘టాయ్లెట్: ఏక్ ప్రేమ్కథ’ ఫేమ్ శ్రీ నారాయణ్ సింగ్ దర్శకత్వంలో హిందీలో రూపొందుతున్న చిత్రం ‘బట్టీ గుల్ మీటర్ ఛాలు’. షాహిద్ కపూర్, శ్రద్ధాకపూర్, యామీ గౌతమ్ ముఖ్య తారలుగా నటిస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్ ఉత్తరాఖండ్లో స్టారై్టంది. ఉత్తరాఖండ్ సీయం త్రివేంద్ర సింగ్ రావత్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. ఈ సినిమాలో లలితా నౌటియాల్ అలియాస్ నౌటీ క్యారెక్టర్లో శ్రద్ధా కపూర్ కనిపించనున్నారు. నౌటీ లుక్ను చిత్రబృందం విడుదల చేసింది. సినిమాలో యామీ గౌతమ్ లాయర్గా నటిస్తుండగా, పవర్ను దొంగలించే రోల్లో షాహిద్ కనిపించనున్నారని బాలీవుడ్ టాక్. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ కూడా ఉందండి. అదేంటంటే.. సినిమాలో షాహిద్కపూర్ మాత్రమే కాదు.. శ్రద్ధాకపూర్ని ఇంకో హీరో కూడా ప్రేమిస్తారట. దాంతో ట్రయాంగిల్ లవ్స్టోరీ స్టార్ట్ అవుతుందని బాలీవుడ్ సమాచారం. జనరల్గా ఇక్కడున్న ఫొటోలో కనిపిస్తున్నట్లుగా శ్రద్ధా చాలా గ్లామరస్గా కనిపిస్తారు. కానీ ఈ సినిమాలో మాత్రం డీ–గ్లామరస్ పాత్రలో కనిపించనున్నారట. ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
తొలి అడుగు ముగిసింది
ఎవరిది అంటే.. రాజ్కుమార్ రావ్ అండ్ టీమ్ ది. ఎందుకు అంటే.. థియేటర్లో నవ్విసూ,్త భయపెట్టడానికి. ఎలా అంటే మాత్రం సిల్వర్ స్క్రీన్పై చూడాల్సిందే అంటున్నారు ‘స్త్రీ’ చిత్రబృందం. రాజ్కుమార్ రావ్, శ్రద్ధా కపూర్ జంటగా అమర్ కౌశిక్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘స్త్రీ’. దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే కథను అందించారు. ఈ సినిమా షూటింగ్ చందేరీలో జరిగింది. మంగళవారంతో ఫస్ట్ షెడ్యూల్ను కంప్లీట్ చేశారు. ‘‘బ్యూటిఫుల్ టౌన్ చందేరిలో ఫస్ట్ షెడ్యూల్ను కంప్లీట్ చేశాం. సెట్లో అందరం ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తున్నాం. మోస్ట్ అమేజింగ్ టీమ్తో వర్క్ చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు రాజ్కుమార్ రావ్. -
నన్నడిగితే నాకేం తెలుసు!
తమిళసినిమా: ఆ విషయం నాకేం తెలుసు ఆయన్నే అడగండి అంటోంది నటి శ్రద్ధాకపూర్. ఇంతకీ ఈ అమ్మడు చెప్పేదేంటో చూద్దామా. బాహుబలి సిరీస్ తరువాత నటుడు ప్రభాష్ నటిస్తున్న తాజా చిత్రం సాహో. భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధాకపూర్ నాయకిగా నటిస్తోంది. ఇందుకు గానూ ఈ బ్యూటీ రూ.3 కోట్లు పారితోషికం పుచ్చుకుంటోందట. బాహుబలి చిత్రం తరువాత ప్రభాష్ మార్కెట్ ప్రపంచ స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. దీంతో సాహో చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకే మొదట దక్షిణాది భాషలకు చెందిన నటీమణుల్లో ఒకరిని హీరోయిన్గా ఎంపిక చేయాలని భావించినా, ఇతర భాషల్లోనూ సాహోను విడుదల చేయాలని భావించడంతో నటి శ్రద్ధాకపూర్ను ఎంపిక చేశారు. ఈ చిత్రంతో ఈ భామ దక్షిణాది చిత్రపరిశ్రమకు పరిచయం కాబోతోందన్నమాట. నటుడు ప్రభాష్ గురించి చెప్పమని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు శ్రద్ధాకపూర్ బదులిస్తూ ఆయన మంచి నటుడు మాత్రమే కాదు మంచి మనసున్న మనిషి అని కితాబిచ్చేసింది. అంతే కాదు ప్రభాస్తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది. నటుడు ప్రభాస్, అనుష్క గురించి రకరకాల గ్యాసిప్స్ ప్రచారంలో ఉన్న విషయం తలిసిందే. వారిద్దరూ ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారనే ప్రచారం హోరెత్తుతోంది. అయితే పుకార్లకు పుల్స్టాప్ పెట్టేలా ఇటీవల ప్రభాస్ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని, అంతకు మించి తమ మధ్య ఏమీ లేదని స్పష్టంగా చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభాస్ వివాహం గురించి తనను అడుగుతున్నారని నటి శ్రద్ధాకపూర్ పేర్కొంది. అయితే ఆ విషయం గురించి తనకేమీ తెలియదని ఆయన్నే అడగాలని చెప్పింది. -
బాహుబలి బన్ గయా పోలీస్!
కత్తి పట్టిన బాహుబలి తుపాకీ పడితే! బాణాలు వేసిన బాహుబలి బుల్లెట్స్ పేల్చితే! సైన్యంతో యుద్ధం చేసిన బాహుబలి చేజింగ్కి వెళితే ఎలా ఉంటుంది? ‘సాహో’ సినిమాలా ఉంటుందట. ప్రభాస్ హీరోగా ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ, ప్రమోద్లు నిర్మిస్తున్న సినిమా ‘సాహో’. ఇందులో శ్రద్ధాకపూర్ కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమాలోని చేజింగ్ సీన్స్ను తెరకెక్కిస్తున్నారని ఫిల్మ్నగర్ సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘సాహో’ చిత్రంలో ప్రభాస్ పోలీస్ పాత్ర పోషిస్తున్నారని టాక్. అంటే.. బాహుబలి బన్గయా పోలీస్ అన్నమాట. దొంగ–పోలీస్ బ్యాక్డ్రాప్లో సినిమా కథనం సాగుతుందట. అంతేకాదండోయ్.. ప్రభాస్ క్యారెక్టర్లో కూడా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయన్నది ఫిల్మ్నగర్ టాక్. అసలు ప్రభాస్ క్యారెక్టర్.. పోలీస్గా ఉన్న దొంగా? లేక దొంగగా ఉన్న పోలీస్నా? అనే డౌట్ బ్యాక్డ్రాప్లో కథ సాగుతుందట. ఈ సినిమాలోని యాక్షన్ స్టంట్స్ను హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బెట్స్ డిజైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. శనివారంతో హైదరాబాద్లో షెడ్యూల్ కంప్లీట్ అయింది. ఫిబ్రవరి 25న ప్రారంభమయ్యే తదుపరి షెడ్యూల్ 60 రోజుల పాటు దుబాయ్లో జరుగుతుంది. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ‘సాహో’ చిత్రాన్ని ఈ ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
స్క్రీన్ టెస్ట్
► ఎన్టీఆర్–జయప్రద ఫేమస్ సాంగ్ ‘ఓలమ్మి తిక్క రేగిందా..’ పాటను ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘యమదొంగ’ చిత్రంలో రీమిక్స్ చేశారు. ఆ పాటలోని ‘మేల్ వాయిస్’ ఎవరిదో తెలుసా? ఎ) యం.యం. కీరవాణి బి) ఎస్.ఎస్.రాజమౌళి సి) జూ. యన్టీఆర్ డి) యస్పీ బాలసుబ్రహ్మణ్యం ► ‘డాడీస్ లిల్ గాళ్’ అనే టాటూ ఏ ప్రముఖ బాలీవుడ్ నటి చేతిపై ఉంటుంది? ఎ) ప్రియాంకా చోప్రా బి) దీపికా పదుకోన్ సి) విద్యాబాలన్ డి) కరీనాకపూర్ ► సమయం లేదు మిత్రమా! శరణమా? రణమా? ఈ డైలాగ్ను రాసిన రచయిత ఎవరో తెలుసా? ఎ) జనార్థన మహర్షి బి) సాయిమాధవ్ బుర్రా సి) క్రిష్ డి) పరుచూరి బ్రదర్స్ ► నాకు ఓల్డ్ స్టైల్ రొమాన్సే (1990ల్లో) ఇష్టం అని చెప్పే హీరోయిన్ ఎవరు? ఈ హీరోయిన్ తండ్రి కూడా పెద్ద హీరోనే. తండ్రి తనకు రొమాంటిక్ స్టోరీలు చెప్పేవారని ఆమే చెప్పారు. ఎ) శ్రుతీహాసన్ బి) కీర్తీ సురేష్ సి) కార్తీక డి) వరలక్ష్మీ ► మరియప్పన్ అనే క్రీడాకారుని జీవితం ఆధారంగా ఓ చిత్రం (బయోపిక్) తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తానని ప్రకటించారు. మరియప్పన్ ఏ క్రీడకు చెందినవాడు? ఎ) క్రికెట్ బి) బాక్సింగ్ సి) లాంగ్ జంప్ డి) హై జంప్ ► ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న భామ ఎవరో కనుక్కోండి? ఎ) శ్రద్ధా కపూర్ బి) కంగనా రనౌత్ సి) ఇలియానా డి) రకుల్ ప్రీత్ ► ‘దేవదాసు’ చిత్రానికి మొదట అనుకొన్న హీరోయిన్ సావిత్రి కాదు. మరి ఎవరై ఉంటారో కనుక్కోండి? ఎ) భానుమతి బి) యస్. వరలక్ష్మి సి) అంజలీదేవి డి) ‘షావుకారు’ జానకి ► ‘శంకరాభరణం’ చిత్రంలో మంజు భార్గవి కొడుకు పాత్రలో నటించింది ఓ అమ్మాయి. తర్వాత కాలంలో ఆమె నటిగా చాలా పాత్రలు పోషించారు. ఆమె పేరేంటి? ఎ) శ్రీలక్ష్మీ బి) తులసి సి) ప్రగతి డి) రజిత ► యలవర్తి నాయుడమ్మ భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచిన శాస్త్రవేత్త. ఆయన మనవరాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నటుడెవరు? ఎ) నాని బి) రామ్చరణ్ సి) కల్యాణ్రామ్ డి) ఆది ► ‘మనం దేన్నైతే అసహ్యించుకుంటామో దేవుడు అందులోంచి ముంచి లేపుతాడు’ అనేది ‘మహానుభావుడు’ సినిమాలో డైలాగ్. సినిమాలో ఈ డైలాగ్ను ఏ కమెడియన్ చెప్తాడు? ఎ) భద్రం బి) ‘వేన్నెల’ కిశోర్ సి) టిల్లు వేణు డి) రఘుబాబు ► ‘దాన వీర శూర కర్ణ’ సినిమా దర్శకుడెవరు? ఎ) కమలాకర కామేశ్వరరావు బి) కె.వి. రెడ్డి సి) విఠలాచార్య డి) ఎన్టీ రామారావు ► ప్రభాస్ తన మొదటి చిత్రం ‘ఈశ్వర్’తో మొదలుకొని ‘బాహుబలి’ రెండు పార్టులతో కలిపి ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా? ఎ) 18 బి) 21 సి) 14 డి) 25 ► ‘ఆకలేస్తే అన్నం పెడతా మూడొస్తే ముద్దుల్ పెడతా చిన్నోడా..’ అనే పాటను పాడింది ఎవరు? ఎ) శ్రేయా ఘోషల్ బి) గీతా మాధురి సి) మమతా మోహన్దాస్ డి) దామిని ► యస్.యస్. రాజమౌళి పుట్టినరోజు అక్టోబర్ 10న. అదే రోజు పుట్టిన టాప్ హీరోయిన్ ఎవరు? ఎ) రాశీఖన్నా బి) కాజల్ అగర్వాల్ సి) శ్రియ డి) రకుల్ప్రీత్ సింగ్ ► కమల్హాసన్ నటించిన ‘దశావతారం’ సినిమా దర్శకుడెవరు? ఎ) కె.యస్. రవికుమార్ బి) పి.వాసు సి) సురేశ్కృష్ణ డి) లింగుస్వామి ► ‘అబ్బ దబ్బ జబ్బ..’ అనే డైలాగ్ చాలా పాపులర్. ఈ డైలాగ్లో నటించిన లేడీ కమెడియన్ శ్రీలక్ష్మీ. ఆమెకు జోడీగా నటించిందెవరు? ఎ) ఏవీయస్ బి) బ్రహ్మానందం సి) ధర్మవరపు డి) సుధాకర్ ► 2017లో రిలీజైన సినిమాకు 2016వ సంవత్సరానికి నేషనల్ అవార్డు లభించింది.ఆ సినిమా పేరేంటి? ఎ) ౖఖñ దీ నం 150 బి) గౌతమిపుత్ర శాతకర్ణి సి) బాహుబలి డి) శతమానం భవతి ► నటుడు వెంకటేశ్ ఎవరి సిద్ధాంతాలను నమ్ముతారో తెలుసా? ఎ) స్వామి వివేకానంద బి) రమణ మహర్షి సి) రామకృష్ణ పరమహంస డి) స్వామి పరిపూర్ణానంద ► 19. ఈ ఫొటోలోని లక్ష్మణుని పాత్రలో నటించిన నటుడెవరో గుర్తుపట్టండి ? ఎ) కాంతారావు బి) హరనాథ్బాబు సి) శోభన్బాబు డి) చలం ► ఈ ఫోటోలోని ప్రముఖ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి? ఎ) నిత్యామీనన్ బి) అనుష్క సి) భావన డి) కాజల్ అగర్వాల్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) సి 2) ఎ 3) బి 4) ఎ 5) డి 6) ఎ 7) డి 8) బి 9) ఎ 10) బి 11) డి 12) ఎ 13) సి 14) డి 15) ఎ 16) బి 17) బి 18) బి 19) ఎ 20) ఎ -
సూపర్ హ్యాపీ
ఆయనో లాయర్. అందరి కేసులను వాదించి ఓ పరిష్కారం చూపిస్తూ ఉంటాడు. పవర్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు, వాళ్లు విధించే బిల్లుల మీద పోరాటం చేసే కామన్ మేన్కి ఈ లాయర్ ఏ విధంగా సహకరించాడనే కథాంశంతో రూపొందుతున్న సినిమా ‘బట్టి గుల్ మీటర్ చలే’. ‘టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ’ ఫేమ్ శ్రీ నారాయణ్ సింగ్ దర్శకుడు. ఈ సినిమాలో షాహిద్ కపూర్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో కథానాయికగా శ్రద్ధా కపూర్ని తీసుకున్న విషయం తెలిసిందే. ఇంకో హీరోయిన్గా యామీ గౌతమ్ని సెలెక్ట్ చేసుకున్నారు చిత్రబృందం. ‘‘ఈ సినిమాలో భాగం కావటం సూపర్ హ్యాపీగా ఉంది. షూటింగ్ కోసం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను’’ అని పేర్కొన్నారు యామీ గౌతమ్. అందరి సమస్యలు పరిష్కరించే లాయర్గారు ఈ ఇద్దరి భామల మధ్య ఎలాంటి సమస్యగా మారాడు? ఇద్దరికీ ఎలాంటి సమాధానం ఇచ్చాడు? అంటే ఆగస్ట్ వరకూ ఆగాల్సిందే అంటున్నారు చిత్రబృందం. ఈ నెలాఖరున సెట్స్ పైకి వెళ్లనున్నఈ సినిమా ఆగస్ట్ 31న విడుదలకానుంది. -
ఆమె డెడికేషన్ సూపర్
‘‘ఆమె డెడికేషన్, హార్డ్ వర్కింగ్ నేచర్ కచ్చితంగా అభినందనీయం’’ అని తన కో–స్టార్ శ్రద్ధా కపూర్ని పొగడ్తల్లో ముంచెత్తారు ‘బాహుబలి’ ప్రభాస్. సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ, ప్రమోద్లు నిర్మిస్తున్న ‘సాహో’లో ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికి రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. హీరోయిన్ శ్రద్ధా కపూర్ గురించి ప్రభాస్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో శ్రద్ధాను కేవలం పాటల్లో కనిపించటం కోసం, డాన్స్ సీక్వెన్స్ కోసం తీసుకోలేదు. తన పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. శ్రద్ధా స్వయంగా కొన్ని స్టంట్స్ కూడా ఫెర్ఫామ్ చేయబోతున్నారు. తను మా టీమ్లో జాయిన్ అయినందుకు టీమ్ అంతా చాలా సంతోషంగా ఉంది’’ అని శ్రద్ధా కపూర్పై ప్రశంసల వర్షం కురిపించేశారు ప్రభాస్. ప్రస్తుతం లాస్ ఏంజిల్స్లో హాలిడేలో ఉన్న ప్రభాస్ జనవరిలో హైదరాబాద్ తిరిగి రానున్నారు. వచ్చిన వెంటనే 45 రోజులు లాంగ్ షెడ్యూల్లో పాల్గొననున్నార ట. ఈ షెడ్యూల్ను జనవరి 5 నుంచి ప్లాన్ చేశారని సమాచారం. ఇదిలా ఉంటే ‘రాజా రాణి, అదిరింది’ చిత్రాల దర్శకుడు అట్లీతో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నట్టు కోలీవుడ్ టాక్. అదే విధంగా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణతో కూడా ఒక సినిమా చేయనున్నారు ప్రభాస్. మరి ఏ సినిమా ముందు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి. -
కిడ్నాపర్ల చెరలో...
ఒక పాత డెన్. అందులో ఎవరూ లేరు. ఇంతలో అక్కడికి ఓ కార్ వచ్చి ఆగింది. అందులో నుంచి హీరోయిన్ శ్రద్ధా కపూర్ని కొందరు రౌడీలు బయటికి లాక్కొని వచ్చారు. చేతులు కట్టేసి ఉన్నాయి. హెల్ప్.. హెల్ప్ అని అరవడానికి వీల్లేకుండా నోటిని ఓ క్లాత్తో కట్టేశారు. ఆ గూండాల నుంచి తప్పించుకోవడానికి శ్రద్ధా విశ్వప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండాపోయింది. ఆ రౌడీలు తనని డెన్లోకి లాక్కొని వెళ్లారు. మేటర్ చదువుతుంటే శ్రద్ధాని ఎవరో కిడ్నాప్ చేశారని అర్థమవుతోంది కదూ. ఇంతకీ శ్రద్ధాని ఎవరు కిడ్నాప్ చేశారు? అంటే ‘సాహో’ చూడాల్సిందే. ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సాహో’. ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్ని కిడ్నాప్ చేసే సన్నివేశాన్ని ప్రస్తుతం హైదరాబాద్లో షూట్ చేస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వంశీ, ప్రమోద్, విక్కీ నిర్మిస్తోన్న ఈ భారీ చిత్రం వచ్చే ఏడాదిలో విడుదల కానుంది. -
షిఫ్ట్ టు హైదరాబాద్
సాహో చేజ్ వాయిదా పడిందా? అంటే.. ‘అవును’! అనే ఆన్సర్ ఇప్పుడు ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది. చేజ్ తీసే టైమ్లో చేంజ్ ఉండొచ్చేమో కానీ క్యాన్సిల్ అయ్యే స్కోప్ మాత్రం లేదంటున్నారట చిత్రబృందం. ప్రభాస్ హీరోగా ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ డైరెక్షన్లో రూపొందుతున్న చిత్రం ‘సాహో’. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్లు నిర్మిస్తోన్న ఈ సినిమాలో బీటౌన్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కథానాయిక. చేజ్తో కూడిన యాక్షన్ సీక్వెన్స్ను దుబాయ్లో షూట్ చేయడానికి ఈ చిత్రబృందం ప్లాన్ చేశారు. సుజీత్ లొకేషన్స్ వేట కూడా కంప్లీట్ చేశారు. అయితే అక్కడి గవర్నమెంట్ పర్మిషన్స్ ప్రాబ్లమ్స్ వల్ల దుబాయ్ షెడ్యూల్ ప్రజెంట్ వాయిదా పడిందనేది ఫిల్మ్నగర్ సమాచారం. అంతేకాదు సినిమా లేట్ కాకుండా ఉండేందుకు ఫ్రెష్ షెడ్యూల్ను హైదరాబాద్లో స్టార్ట్ చేయాలనుకుంటున్నారట. జనవరిలో ఈ షెడ్యూల్ మొదలవుతుందట. సో.. ‘సాహో’ టీమ్ అంతా దుబాయ్ టు హైదరాబాద్ షిఫ్ట్ అయిందన్నమాట. -
రన్ సాహో రన్
లొకేషన్ వేట కంప్లీట్ అయ్యింది. దుబాయ్లో షూట్ స్పాట్ని ఫిక్స్ చేశారు. హీరో ప్రభాస్ ఆట మొదలు పెట్టి విలన్స్ను వేటాడడమే బ్యాలెన్స్. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘సాహో’. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ, ప్రమోద్లు నిర్మిస్తోన్న ఈ సినిమాలో బీటౌన్ బ్యూటీ శ్రద్ధాకపూర్ కథానాయిక. ‘సాహో’లో కీలకమైన చేజింగ్ సీన్స్ను చిత్రబృందం దుబాయ్లో ప్లాన్ చేశారు. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బెట్స్ నేతృత్వంలో సాగే ఈ సీన్ ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ ఉంటుందట. ఇంతకీ ఈ సాహో రన్ ఎందుకు? ఎవరి కోసం జరుగుతుందనేది మాత్రం ప్రజెంట్ సస్పెన్స్. ప్యాలెస్ లాంటి హోటళ్లు, పడవంత కార్లు, ఎల్తైన బిల్డింగ్స్ వంటి ఏరియాల్లో ఈ చేజ్ ఉండదు. కొండ ప్రాంతాల్లో ప్లాన్ చేశారని సమాచారం. -
అక్క ఎక్కడ?
కృతీ సనన్కి ఒక చెల్లెలు ఉన్నారు. పేరు నూపుర్ సనన్. ఈ అక్కాచెల్లెళ్లిద్దరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. పార్టీలు చేసుకున్న ఫొటోలు, షికారుకెళ్లినప్పుడు దిగిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటుంటారు. అయితే ఇప్పుడు కృతీ తన అక్క ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారట. చిన్నప్పుడు తిరనాళ్లల్లో ఆమె అక్క తప్పిపోయారనుకుంటున్నారా? అదేం కాదు. కృతీ తెలుసుకోవాలనుకుంటున్నది ఆన్ స్క్రీన్ తన అక్కగా నటించబోయే అమ్మాయి గురించి. ‘‘నా అక్క ఎవరో త్వరగా చెప్పండి. తనతో తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి’’ అని దర్శకుడు విశాల్ భరద్వాజ్ను సతాయిస్తున్నారట కృతి. ‘‘సోనాక్షి సిన్హా, శ్రద్ధా కపూర్, వాణీ కపూర్, భూమి పెడ్నేకర్ని సంప్రదించాను. ఇంకొన్ని పేర్లు అనుకుంటున్నాను. మీ అక్కయ్యను త్వరలోనే ఫైనలైజ్ చేస్తా’’ అని కృతీ సనన్ను బుజ్జగిస్తున్నారట విశాల్. అక్కాచెల్లెళ్ల గొడవలను బేస్ చేసుకుని బాలీవుడ్లో ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నారు దర్శకుడు విశాల్ భరద్వాజ్. హిందీలో ‘హైదర్, రంగూన్’ వంటి చిత్రాలను రూపొందించారాయన. తన తాజా చిత్రంలో చెల్లెలి పాత్రకు కృతీ సనన్ ఓకే చేశారు. మరి.. కృతి అక్క ఎవరో వేచి చూద్దాం. -
నో కక్కా... నో ముక్క... న్యూ ఇయర్ నుంచి వెజ్జే!
లంచ్ అయితే ఏంటి? డిన్నర్ అయితే ఏంటి? కొంతమందికి కక్కాముక్కలు లేకపోతే నోట్లో ముద్ద దిగదు! బీటౌన్ బ్యూటీ శ్రద్ధా కపూర్ మరీ అంత నాన్–వెజ్ లవరో? కాదో? తెలీదు గానీ... ముద్దల్లో కక్కాముక్కల్ని కలుపుకుని శ్రద్ధగా తినేవారు. సారీ.. తింటుంటారు! బట్, నెక్ట్స్ ఇయర్ నుంచి నాన్–వెజ్కి ‘నో’ చెప్పేశారు. శ్రద్ధాలో మార్పుకు కారణం ‘పెటా’ (జంతు సంరక్షణ సంస్థ). వెజిటేరియన్లో ఎన్ని రుచికరమైన వంటలు ఉన్నాయో.. రెసిపీలతో ఓ పుస్తకాన్ని శ్రద్ధాకి పంపించారు ‘పెటా’ నిర్వాహకులు. అవన్నీ చూసి... ‘‘థ్యాంక్స్ ‘పెటా’. 2018లో వెజ్జే ప్రయత్నిస్తా’’ అన్నారు. ప్రభాస్కి జోడీగా ‘సాహో’లో నటిస్తున్న ఈ సుందరి షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు కక్కాముక్కలు తెగ లాగించేశారు. ప్రభాస్ అండ్ కో ఆతిథ్యం అటువంటిది మరి! చికెన్–మటన్, చేపలు–పీతలు... లంచ్లో ఆల్మోస్ట్ 20 టు 25 ఐటమ్స్ వడ్డించారు. అవన్నీ ఫొటోలు తీసి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లలో పెట్టారీమె. బహుశా... అవన్నీ చూసే శ్రద్ధాకు ‘పెటా’ వాళ్లు ఈ వెజ్ రెసిపీలు పంపారంటారా? ఏమో! ఈ సంగతి పక్కన పెడితే... సోమవారం చిల్డ్రన్స్డే (బాలల దినోత్సవం) సందర్భంగా ఉదయం ముంబైలోని ప్రభాదేవి మున్సిపల్ స్కూల్కి వెళ్లిన శ్రద్ధా, చాలాసేపు అక్కడి పిల్లలతో కబుర్లు చెబుతూ, ఆటలు ఆడుతూ గడిపారు. సాయంత్రం హైదరాబాద్లో జరిగిన అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. -
స్క్రీన్ టెస్ట్
► చిరంజీవి నటించిన ‘పసివాడి ప్రాణం’ సినిమాలో బాల నటుడిగా నటించింది, బాబు కాదు పాప. ఈ పాప పేరు ఏంటి? ఎ) సుజిత బి) సుహాసిని సి) సురభి డి) హారతి ► ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం చిత్రంలో అర్ధరూపాయి కోసం ఐస్పై నిలబడే బాలనటుడు ఎవరు? ఎ) హర్షిత్ బి) హాశ్రిత్ సి) తేజ.సజ్జా డి) బాలాదిత్య ► 2017వ సంవత్సరపు బాలల చలన చిత్రోత్సవంలో ‘అప్పూ’ అనే చిత్రం ద్వారా సందడి చేసిన బాల నటుడు శ్రీసాయి శ్రీవంత్. చిత్ర దర్శకుని పేరేంటో కనుక్కోండి... ఎ) అల్లాణి శ్రీధర్ బి) అక్కినేని కుటుంబరావు సి) కె. మోహన్ డి) ‘డాడి’ శ్రీనివాస్ ► యన్టీఆర్తో బడిపంతులు సినిమాలో మనవరాలుగా నటించిన ఈ బాల నటి తర్వాత కాలంలో ఆయన పక్కన చాలా సినిమాల్లో డ్యూయట్లు పాడింది. ఎవరామె? ఎ) విజయనిర్మల బి) జయసుధ సి) శ్రీదేవి డి) జయప్రద ► చిన్నారి పెళ్లికూతురు హిందీ టీవీ సీరియల్ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ నటి తెలుగు హీరో రాజ్తరుణ్తో రెండు సినిమాలలో నటించింది. ఆమె ఎవరు? ఎ) అవికాగోర్ బి) శ్వేతా బసు ప్రసాద్ సి) ఉల్కాగుప్తా డి) శ్రియా శర్మ ► అఖిల్ బాలనటునిగా నటించిన సినిమా ఏమిటి? ఎ) సిసింద్రీ బి) బాలరామాయణంసి) డాడి డి) అంజలి ► మణిరత్నం దర్శకత్వం వహించిన ‘అంజలి’ అనే సినిమాలో బాలనటిగా నటించింది షామిలి. ఆమె అక్క షాలిని. ఓ హీరోని పెళ్లి చేసుకుంది. ఆ హీరో పేరేంటి? ఎ) విజయ్ బి) అజిత్ సి) విక్రమ్ డి) సూర్య ► ‘కుక్క కావాలి’ అంటూ ‘చిత్రం’ సినిమాలో మారాం చేసే పాత్రను పోషించిన బాలనటి చేతన ఇప్పుడు హీరోయిన్గా పరిచయమైంది. ఈమె ఒక నటుని కూతురు. ఆ నటుడెవరు? ఎ) సాయికుమార్ బి) చిన్నా సి) ఉత్తేజ్ డి) గణేశ్ ► ‘మమతల కోవెల’ అనే చిత్రంలో హీరో కూతురిగా నటించిన బాలనటి తర్వాత కాలంలో తెలుగు, తమిళ, కన్నడ, హింది భాషల్లో హీరోయిన్గా నటించింది? ఆమె ఎవరై ఉంటారు? ఎ) రాశి బి) నిత్యామీనన్ సి) రోహిణి డి) మీనా ► ఏ దర్శకుని కొడుకు మొదట బాలనటుడిగా నటించి ‘ఆంధ్రాపోరి’అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు? ఎ) కృష్ణ వంశీ బి) పూరి జగన్నాథ్ సి) గుణశేఖర్ డి) యన్ శంకర్ ► ‘కోయి మిల్ గయా’ అనే హిందీ సినిమాలో హృతిక్రోషన్తో నటించిన బాల నటి ఎవరు.ఆమె తెలుగు,తమిళ సినిమాల్లో ఇప్పుడు హ్యాపెనింగ్ హీరోయిన్. ఎవరామె? ఎ) జెనీలియా బి) హన్సిక సి) శ్రద్ధా కపూర్ డి) నిషా అగర్వాల్ ► ‘తల్లో మల్లె పూలు పెట్టుకోవాలి’ అంటూ ఈ బుడతడు చెప్పిన డైలాగ్ ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ చిత్రం లోనిది. ఇప్పుడు అతను హీరో అయ్యాడు. అతని పేరేంటి? ఎ) కౌశిక్ బి) నాగ అన్వేష్ సి) బాలాదిత్య డి) మనోజ్ నందం ► వెంకటేశ్ బాల నటునిగా నటించిన చిత్రంపేరేంటో కనుక్కోండి... ఎ) ప్రేమాభిషేకం బి) మేఘ సందేశం సి) ప్రేమనగర్డి) శ్రీరంగనీతులు ► శివాజి గణేశన్ మరియు రజనీకాంత్లతో చాలా సినిమాల్లో బాల నటించిన అల్లరిపిల్ల ఎవరై ఉంటారు? తర్వాత కాలంలో ఆమె చాలా పెద్ద హీరోయిన్గా చాలా సినిమాల్లో నటించింది? ఎ) మీనా బి) సుహాసిని సి) సిమ్రాన్ డి) రమ్యకృష్ణ ► ఈ దర్శకుడు బాల నటుడుగా చాలా సినిమాల్లో నటì ంచాడు? హీరో సుమంత్కు బ్లాక్ బాస్టర్ హిట్ను అందించాటు? అతని పేరేంటì ? ఎ) చక్రి బి) సూర్యకిరణ్ సి) భీమినేని శ్రీనివాసరావు డి) అనిల్ రావిపూడి ► భంగిమ అంటూ ‘సాగర సంగమం’ సినిమాలో ఫోటోలు తీసిన ఈ బాలనటుడు గుర్తున్నాడా? తర్వాత కమల్హాసన్ నటించిన ‘ఈనాడు’సినిమాకు ఆ బాల నటుడే దర్శకత్వం వహించాడు. అతనెవరు? ఎ) శ్రీనివాస చక్రవర్తి బి) శ్రీరామ్ ఆదిత్య సి) చక్రి చిగురుపాటి డి)చక్రి తోలేటి ► బాల నటునిగా కూడా మంచి క్రేజ్ ఉన్న నటుడు తరుణ్, హీరోగా నటించిన తొలి సినిమా ఏది? ఎ) ప్రియమైన నీకు బి) నువ్వులేక నేనులేను సి) నువ్వేకావాలి డి) నువ్వే నువ్వే ► ఈ ఫోటో లోని అందాల అభినేత్రిసావిత్రితో ఉన్న ఈ బాలనటుణ్ణి గుర్తుపట్టండి? తర్వాత ఆయన లోకనాయకుడయ్యాడు? ఎ) కమల్ హాసన్ బి) నాగార్జున సి) కార్తీక్ డి) సురేశ్ ► మేజర్ చంద్రకాంత్ చిత్రంలో యన్టీఆర్ మనవడిగా నటించిన బాల నటుడు ఇప్పుడు రాకింగ్ స్టార్. ఎవరతను? ఎ) విష్ణు బి) మనోజ్ సి) ఆది పినిశెట్టి డి) ఆది సాయికుమార్ ► ఈ ఫోటోలో రామునిగా నటించిన బాల నటుడు ఎవరో గుర్తుపట్టండి? ఎ) కళ్యాణ్రామ్ బి) జూనియర్ యన్టీఆర్ సి) తారకరత్న డి) మోహనకృష్ణ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) డి 3) సి 4) సి5) ఎ 6) ఎ 7) బి 8) సి 9) ఎ10) బి 11) బి 12) బి13) సి 14) ఎ 15) బి 16) డి 17) సి 18) ఎ19) బి 20) బి -
ఇంట్లో ఉన్నట్టే...
హైదరాబాద్లో ఉంటే ఇంట్లో ఉన్నట్టే ఉందని శ్రద్ధాకపూర్ చెబుతున్నారు. ప్రభాస్ అండ్ కో ఆతిథ్యం అటువంటిది మరి! చేపలు–పీతలు, చికెన్–మటన్, పనీర్–పుట్టగొడుగులు... ఒకటా? రెండా? ఆల్మోస్ట్ ఇరవైఐదు ఐటమ్స్, ప్రతి రోజూ భోజనంలో శ్రద్ధాకు వడ్డించారు. షాట్ టు షాట్, షూటింగులో గ్యాప్స్ మధ్య బోర్ కొట్టకుండా ఉండడానికి సెట్లోనే చిన్న గేమింగ్ జోన్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో ‘సాహో’ షూటింగ్ చేసినన్ని రోజులూ శ్రద్ధాకు ఫుడ్ అండ్ ఫన్ ఫెస్టివలే. ప్రభాస్ హీరోగా ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ‘సాహో’ సినిమా ఫస్ట్ షెడ్యూల్ మంగళవారంతో ముగిసింది. ముంబయ్ వెళుతూ వెళుతూ తనకు బాధగానూ, సంతోషంగానూ ఉందని శ్రద్ధాకపూర్ పేర్కొన్నారు. ‘‘సాహో’ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. అద్భుతమైన టీమ్తో పని చేయడం గొప్ప అనుభూతి. హైదరాబాద్లో ఉంటే ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది’’ అన్నారామె. -
ఒప్పందం కుదిరింది!
‘ఆప్ కా నామ్ క్యా హై’... అంటే మీ పేరేంటి? అని అర్థం. కొంచెం కొంచెం హిందీ వచ్చినవాళ్లకు ఈ ప్రశ్న కచ్చితంగా తెలుస్తుంది. అంతకు మించి మాట్లాడమంటే... సైలెంట్ అయిపోవాల్సిందే. ఇక తెలుగు తెలియనివాళ్లకు అయితే ఇది కూడా తెలియదు. హిందీ రాని ప్రభాస్, తెలుగు రాని శ్రద్ధాకపూర్ ఈ కోవకే చెందుతారు. తాజాగా సెట్స్ మీద ఉన్న ‘సాహో’లో ప్రభాస్ సరసన ఈ శ్రద్ధా కథానాయికగా కమిట్ అయిన విషయం తెలిసిందే. సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్లు ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం దర్శకుడు సుజిత్ చాలా మంది యాక్టర్లు, టెక్నీషియన్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రభాస్ మాత్రం శ్రద్ధాకపూర్తో ఓ డీల్ సెట్ చేసుకున్నారట. ‘ సాహో’ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న సంగతి తెలిసిందే.ప్రభాస్కు హిందీ అంతగా రాదు. శ్రద్ధాకపూర్కు తెలుగు తెలీదు. సో...సెట్లో లాంగ్వేజ్ ప్రాబ్లమ్ రాకుండా ప్రభాస్కు శ్రద్ధా హిందీ నేర్పిస్తే, శ్రద్ధాకు ప్రభాస్ తెలుగు నేర్పించేలా ఇద్దరూ డీల్ చేసుకున్నారట. అయితే తెలుగు వెర్షన్ ‘సాహో’లో శ్రద్ధాకు డబ్బింగ్ వేరే వారు చెబుతారు. అలాగే హిందీ వెర్షన్లో ప్రభాస్కు వేరే వారు డబ్బింగ్ చెబుతారు. అంతే కదా.. కొన్ని నెలలు భాష నేర్చుకున్నంత మాత్రాన డబ్బింగ్ చెప్పలేరు కదా.