Shreyas Iyer
-
IPL 2025: ఆ ఐదుగురు రాణిస్తే.. పంజాబ్ కింగ్స్ కల సాకారం!
పంజాబ్ కింగ్స్ జట్టు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభ సీజన్ (2008) నుంచి ఇప్పటి వరకూ చెప్పుకోదగ్గ రీతిలో రాణించలేకపోయింది. ఆ జట్టు ఫలితాలను పరిశీలించినట్లయితే ఐపీఎల్ చరిత్రలో రెండుసార్లు మాత్రమే ప్లేఆఫ్స్ చేరుకుంది. మొదటిసారి 2008లో.. ఆ తర్వాత 2014 సీజన్లో టాప్-4లో నిలిచింది. 2014లో ఫైనల్కు చేరుకుని బెంగళూరులో జరిగిన టైటిల్ పొరులో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో పరాజయం చవిచూసింది.శ్రేయస్ అయ్యర్కి కెప్టెన్సీ బాధ్యతలుఆ రెండు సీజన్లను మినహాయిస్తే ఒక దశాబ్దం పాటు కింగ్స్ ప్లేఆఫ్స్కు కూడా చేరుకోలేకపోయింది. నిరంతరం కోచ్లు, కెప్టెన్లను మార్చడం కూడా కింగ్స్ ప్రదర్శన పై కోలుకోని దెబ్బతీసింది. పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ గత 17 సీజన్లలో పదహారు మంది కెప్టెన్లు, పది 10 మంది కోచ్లను మార్చింది. ఈసారి కూడా భారీ మార్పులతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది.ఈసారి 2024లో కోల్కతా నైట్ రైడర్స్ను ముందుండి నడిపించి మూడో ఐపీఎల్ టైటిల్ను కట్టబెట్టిన భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కోసం భారీగా ఖర్చు చేసింది. ఏకంగా రూ 26.75 కోట్లతో శ్రేయస్ అయ్యర్ ని కనుగోలు చేసి అతనికి కెప్టెన్సీ బాధ్యతలు కట్టబెట్టింది. హెడ్కోచ్ గా మాజీ ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ను ఎంచుకుంది.వేలంలో పంజాబ్ కింగ్స్ ఎలా రాణించింది?ఇక వేలానికి ముందు ఇద్దరు అన్క్యాప్డ్ ఆటగాళ్లు శశాంక్ సింగ్ మరియు ప్రభ్సిమ్రాన్ సింగ్ ని రెటైన్ చేసారు. ఇక వేలంలో ఏకంగా రూ 112 కోట్లు ఖర్చు చేశారు. ముందుగా శ్రేయస్ అయ్యర్ కోసం భారీగా ఖర్చు చేశారు. తర్వాత అర్ష్దీప్ సింగ్ను రూ 18 కోట్లకు తిరిగి తీసుకున్నారు. అదే మొత్తానికి భారత మాజీ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ను కొనుగోలు చేశారు.ఇంకా ఆస్ట్రేలియా ఆల్ రౌండర్లు గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్. న్యూజిలాండ్ పేసర్ మార్కో యాన్సెన్, ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన అజ్మతుల్లా ఒమర్జాయ్ల చేరడంతో ఆల్ రౌండ్ విభాగాన్ని బాగా బలోపేతం చేసినట్లు కనిపిస్తోంది.కింగ్స్ జట్టులో నేహాల్ వధేరా, వైశక్ విజయ్కుమార్, యష్ ఠాకూర్ వంటి కొంతమంది యువ మరియు ఉత్తేజకరమైన ఆటగాళ్లను కూడా ఉన్నారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లో ముంబై విజయంలో కీలక పాత్ర వహించిన సూర్యాంష్ షెడ్గే, ముషీర్ ఖాన్ కూడా జట్టులో చేరారు. వీరంతా ఇటీవలి కాలంలో అందరి దృష్టిని ఆకర్షించారు.ఈ సీజన్లో కింగ్స్కు లాకీ ఫెర్గూసన్ ప్రధాన పేసర్లలో ఒకడిగా ఉండే అవకాశముంది. ఇంకా విదేశీయ ఆటగాళ్లు జోష్ ఇంగ్లిస్, ఆరోన్ హార్డీ, జేవియర్ బార్ట్లెట్ జట్టుకు మరింత నాణ్యతను జోడిస్తారు. మొత్తమ్మీద సీనియర్, యువ ఆటగాళ్లతో, కొత్త కెప్టెన్తో జట్టు కొత్త తరహా వ్యూహంతో సిద్ధంగా ఉంది.పంజాబ్ కింగ్స్ జట్టు లో ప్రధాన ఆటగాళ్లుశ్రేయస్ అయ్యర్ఛాంపియన్స్ ట్రోఫీ లో నిలకడ గా రాణించి భారత్ విజయంలో కీలక పాత్ర వహించిన శ్రేయస్ అయ్యర్ పై పంజాబ్ కింగ్స్ భారీ ఆశలు పెట్టుకుంది. ఈ ముంబై బ్యాటర్ గత సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ ను ముందుండి నడిపించి టైటిల్ సాధించిపెట్టాడు.ఇప్పుడు కింగ్స్ కూడా శ్రేయాస్ అయ్యర్ నుంచి అదే కానుక కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్తో ఉన్న ఈ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కింగ్స్కు ప్రధాన ఆటగాళ్లలో ఒకడు అనడంలో సందేహం లేదు.యుజ్వేంద్ర చాహల్ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఈ స్పిన్ బౌలర్ కొత్త సీజన్లో కింగ్స్తో కలిసి తనదైన ముద్ర వేయాలని చూస్తున్నాడు. భారత్ జట్టులో స్థానం కోల్పోయినప్పటికీ చాహల్ స్పిన్ మాయాజాలాన్ని తక్కువగా అంచనా వేయలేం.అర్ష్దీప్ సింగ్టీ20 ఫార్మాట్ లో భారత్ తరుపున నిలకడగా రాణిస్తున్న ఈ ఎడమచేతి వాటం పేస్ బౌలర్ పంజాబ్ కింగ్స్ బౌలింగ్ కి సారధ్యం వహించే అవకాశముంది. గత కొన్ని సీజన్లలో ఐపిఎల్ లో నిరంతరం వికెట్లు సాధిస్తూ భారత్ జట్టులోకి చొచ్చుకొచ్చిన అర్ష్దీప్ మరోసారి తన ప్రతిభని నిరూపించుకోవాలని భావిస్తున్నాడు. ప్రస్తుత అర్ష్దీప్ ఫామ్ పంజాబ్కు కీలకం అవుతుంది.గ్లెన్ మాక్స్వెల్2014లో పంజాబ్ ప్లేఆఫ్స్ చేరుకున్న సమయంలో మాక్స్వెల్ కూడా జట్టులో ఉన్నాడు. మళ్లీ మాక్స్వెల్ అదే తరహా లో మెరుపులు మెరిపిస్తాడని కింగ్స్ భావిస్తోంది. అతను నాలుగో స్థానంలో బ్యాటింగ్ కి వచ్చి పెద్ద పాత్ర పోషిస్తాడని భావిస్తున్నారు.మార్కస్ స్టోయినిస్ఈ సీజన్లో స్టోయినిస్ తన అల్ రౌండ్ ప్రతిభ కనబరుస్తాడని కింగ్స్ ఏంతో ఆశలు పెట్టుకుంది. టాప్లో పరుగులు చేయడం, బౌలింగ్ లో కూడా కీలక పాత్ర వహిస్తాడని పంజబ్ గట్టి నమ్మకంతో ఉంది.పంజాబ్ కింగ్స్ జట్టుశ్రేయస్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, మార్కస్ స్టోయినిస్, నేహాల్ వధేరా, గ్లెన్ మాక్స్వెల్, వైశాక్ విజయ్కుమార్, యష్ ఠాకూర్, హర్ప్రీత్ బ్రార్, విష్ణు వినోద్, మార్కో జాన్సెన్, లాకీ ఫెర్గూసన్, జోష్ ఇంగ్లిస్, జేవియర్ బార్ట్లెట్, కుల్దీప్ సేన్, పైలా అవినాష్, సూర్యాంష్ షెడ్గే, ముషీర్ ఖాన్, హర్నూర్ పన్ను, ఆరోన్ హార్డీ, ప్రియాంష్ ఆర్య, అజ్మతుల్లా ఒమర్జాయ్. -
ట్రోఫీ గెలవడమే మా లక్ష్యం.. అతడు ఎంతో సపోర్ట్గా ఉంటాడు: అయ్యర్
ఐపీఎల్-2025 సీజన్లో పంజాబ్ కింగ్స్కు సారథ్యం వహించేందుకు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సిద్దమయ్యాడు. పంజాబ్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్తో మరోసారి కలిసి పనిచేసేందుకు అయ్యర్ ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికే జట్టుతో కలిసిన శ్రేయస్.. ధర్మశాలలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంపులో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.అదే విధంగా ఈ ఏడాది సీజన్లో కెప్టెన్గా అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రేయస్ ప్రత్యేకంగా దృష్టి సారించాడు. తాజాగా ఈ మెగా ఈవెంట్ ప్రారంభానికి ముందు విలేకరుల సమావేశంలో మాట్లాడిన అయ్యర్.. హెడ్ కోచ్ పాంటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు. పాంటింగ్ తనను అద్బుతమైన ఆటగాడిగా భావిస్తున్నాడని అయ్యర్ చెప్పుకొచ్చాడు."రికీ(పాంటింగ్) అందరికి చాలా సపోర్ట్గా ఉంటాడు. అతడితో నాకు మంచి అనుబంధం ఉంది. తొలిసారి అతడితో కలిసి పనిచేసినప్పుడే, నేను గొప్ప ఆటగాడిగా ఎదుగుతానని నాతో అన్నాడు. అంతేకాకుండా టీ20 ఫార్మాట్లో నేను బాగా రాణించగలన్న నమ్మకం కలిగించాడు. పాంటింగ్ ప్రతీ ప్లేయర్కు ఇచ్చే కాన్ఫిడెన్స్ వేరే స్థాయిలో ఉంటుంది. ట్రోఫీని గెలవడమే మా లక్ష్యం. ఈ ఏడాది సీజన్లో మెరుగ్గా రాణించేందకు ప్రయత్నిస్తాము. ఈ సీజన్లో ప్రతీ మ్యాచ్ను కీలకంగా భావించి ముందుకు వెళ్తాము. నెట్స్లో కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాము" అని అయ్యర్ పేర్కొన్నాడు. అదేవిధంగా పాంటింగ్ కూడా అయ్యర్ను పొగడ్తలతో ముంచెత్తాడు.శ్రేయస్ గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడు"శ్రేయస్ మంచి కెప్టెనే కాదు.. గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడు కూడా. అతడు ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్ అన్న విషయం మనకు తెలుసు. అతడితో ఇంకా మేము ఎక్కువగా చర్చించలేదు. ఎందుకంటే శ్రేయస్ మూడు రోజుల కిందటే క్యాంపులో చేరాడు.కెప్టెన్గా తన పనిని అయ్యర్ ప్రారంభించాడు. మా తొలి మ్యాచ్కు అన్ని విధాల సిద్దంగా ఉంటామని" పాంటింగ్ వెల్లడించాడు. కాగా వీరిద్దరూ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కలిసి పనిచేశారు. కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో అయ్యర్ను రూ. 26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. కాగా ఐపీఎల్-18 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో ఈడెన్గార్డెన్స్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్రైడర్స్ జట్లు తలపడనున్నాయి.చదవండి: ధనశ్రీకి చహల్ కౌంటర్?.. ఆ మాటలకు అర్థం ఏమిటి? మధ్యలో ఆమె! -
IPL 2025: సూపర్ ఫామ్ను కొనసాగించిన శ్రేయస్ అయ్యర్
ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు పంజాబ్ కింగ్స్ నయా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సూపర్ ఫామ్ను కొనసాగించాడు. నిన్న (మార్చి 19) జరిగిన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో విధ్వంసకర హాఫ్ సెంచరీ (41 బంతుల్లో 85 పరుగులు) విరుచుకుపడ్డాడు. పంజాబ్ కింగ్స్ టీమ్-ఏ, టీమ్-బిగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడగా.. టీమ్-బి శ్రేయస్ అయ్యర్ ప్రాతినిథ్యం వహించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రేయస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 205 పరుగులు చేసింది. శ్రేయస్ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ప్రదర్శించిన ఫామ్ను కొనసాగించాడు. అనంతరం ఛేదనలో టీమ్-ఏ కూడా పర్వాలేదనిపించింది. ఆ జట్టుకు ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్సిమ్రన్ సింగ్ మెరుపు ఆరంభాన్ని అందించారు. వీరిద్దరు పోటీ పడి బౌండరీలు, సిక్సర్లు బాదారు. ఆర్య 72, ప్రభ్సిమ్రన్ 66 పరుగులు చేసి ఔటైన అనంతరం టీమ్-ఏ కష్టాల్లో పడింది. ఆతర్వాత వచ్చిన బ్యాటర్లు పెద్ద స్కోర్లు చేయలేకపోవడంతో టీమ్-ఏ నిర్ణీత ఓవర్లలో 198 పరుగులు మాత్రమే చేయగలిగింది. తద్వారా శ్రేయస్ టీమ్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమ్-ఏ ఓడిపోయినా ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్సిమ్రన్ సింగ్ ఫామ్లోకి రావడం పంజాబ్ కింగ్స్కు శుభసూచకం. ఈ ఇద్దరే రానున్న సీజన్లో పంజాబ్ ఇన్నింగ్స్లు ప్రారంభిస్తారు. ఈ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో మరో అద్భుత ప్రదర్శన నమోదైంది. శ్రేయస్ టీమ్లో భాగమైన అర్ష్దీప్ సింగ్ 4 ఓవర్లలో కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. సీజన్ ప్రారంభానికి ముందు పంజాబ్కు ఇది కూడా శుభసూచకమే. మొత్తంగా ముగ్గురు బ్యాటర్లు, ఓ బౌలర్ ప్రాక్టీస్ మ్యాచ్లో ఫామ్ను ప్రదర్శించడం పంజాబ్ కింగ్స్కు తమ తొలి మ్యాచ్ ముందు మంచి బూస్టప్ను ఇస్తుంది. ఐపీఎల్ 2025 సీజన్ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుండగా... పంజాబ్ కింగ్స్ మార్చి 25న గుజరాత్ టైటాన్స్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈసారి పంజాబ్ కింగ్స్ గతంలో ఎప్పుడూ లేనంత పటిష్టంగా కనిపిస్తుంది. ఆ జట్టు బ్యాటింగ్ విభాగాన్ని చూస్తే ఎంతటి బౌలర్లైనా ఉలిక్కి పడాల్సిందే.శ్రేయస్ అయ్యర్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, శశాంక్ సింగ్, జోస్ ఇంగ్లిస్, ప్రభ్సిమ్రన్ సింగ్, ఆరోన్ హార్డీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జన్సెన్ రూపంలో ఆ జట్టులో డైనమైట్లు ఉన్నారు. బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తున్నా.. బ్యాటింగ్ బలగం చూసి పంజాబ్ను టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా చెప్పవచ్చు.తొలి మ్యాచ్తో పంజాబ్ ఎదుర్కోబోయే గుజరాత్ ఈ సీజన్లో కొత్తగా కనిపిస్తుంది. జోస్ బట్లర్, గ్లెన్ ఫిలిప్స్ లాంటి విధ్వంసకర బ్యాటర్ల చేరికతో ఆ జట్టు బ్యాటింగ్ విభాగం కూడా ప్రమాదకరంగా కనిపిస్తుంది. శుభ్మన్ గిల్ నేతృత్వంలో ఆ జట్టు టైటిల్ గెలిచేందుకు ఉరకలేస్తుంది. గుజరాత్ బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా కనిపిస్తుంది. రబాడ, సిరాజ్, ఇషాంత్ శర్మ, ప్రసిద్ద్ కృష్ణ, గెరాల్డ్ కొయెట్జీ లాంటి అంతర్జాతీయ స్థాయి పేసర్లతో కళకళలాడుతుంది. ప్రపంచ మేటి స్పిన్నర్ రషీద్ ఖాన్ ఆ జట్టులో ఉండనే ఉన్నాడు. అతనితో పాటు కొత్తగా వాషింగ్టన్ సుందర్ స్పిన్ విభాగంలో చేరాడు. దేశీయ ఆటగాళ్లు సాయి సుదర్శన్, రాహుల్ తెవాతియా, షారుఖ్ ఖాన్, మహిపాల్ లోమ్రార్ గుజరాత్కు అదనపు బలాన్ని ఇస్తున్నారు.పంజాబ్ కింగ్స్శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నేహల్ వధేరా, ప్రియాన్ష్ ఆర్య, హర్నూర్ సింగ్, పైలా అవినాశ్, ముషీర్ ఖాన్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, శశాంక్ సింగ్, ఆరోన్ హార్డీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జన్సెన్, సూర్యాంశ్ షేడ్గే, ప్రవీణ్ దూబే, జోస్ ఇంగ్లిస్, ప్రభ్సిమ్రన్ సింగ్, విష్ణు వినోద్, హర్ప్రీత్ బ్రార్, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్, లోకీ ఫెర్గూసన్, విజయ్కుమార్ వైశాక్, కుల్దీప్ సేన్, యశ్ ఠాకూర్, జేవియర్ బార్ట్లెట్గుజరాత్ టైటాన్స్శుభ్మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాతియా, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్, రషీద్ ఖాన్, మహిపాల్ లోమ్రార్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, షారుఖ్ ఖాన్, నిషాంత్ సింధు, అర్షద్ ఖాన్, కరీమ్ జనత్, వాషింగ్టన్ సుందర్, జయంత్ యాదవ్, జోస్ బట్లర్, కుమార్ కుషాగ్రా, అనూజ్ రావత్, గెరాల్డ్ కొయెట్జీ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, ఇషాంత్ శర్మ, కగిసో రబాడ, కుల్వంత్ కేజ్రోలియా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ -
‘రేపు మీ బౌలింగ్ను చితక్కొడతాను చూడు!.. అన్నంత పని చేశాడు’
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)పై ఒకప్పటి సహచర ఆటగాడు, అతడి స్నేహితుడు అమన్ ఖాన్ (Aman Khan) ప్రశంసలు కురిపించాడు. అయ్యర్లో ఆత్మవిశ్వాసం మెండు అని.. ఓ మ్యాచ్లో చెప్పి మరీ తమ జట్టు బౌలింగ్ను చితక్కొట్టాడని గుర్తు చేసుకున్నాడు. ప్రత్యర్థి ఎవరన్న అంశంతో సంబంధం లేకుండా దూకుడుగా ముందుకు సాగుతాడని కొనియాడాడు.పునరాగమనంలో సూపర్ హిట్కాగా గాయం సాకు చూపి రంజీ మ్యాచ్ ఆడకుండా తప్పించుకున్నాడన్న ఆరోపణలతో శ్రేయస్ అయ్యర్ గతేడాది సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. జాతీయ జట్టుకు దూరమైన అతడు.. కఠిన శ్రమకోర్చి దేశవాళీ క్రికెట్లో తనను తాను మరోసారి నిరూపించుకున్నాడు.ముంబై తరఫున బరిలోకి దిగి రంజీ (ఫస్ట్ క్లాస్), విజయ్ హజారే ట్రోఫీ (వన్డే), సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (టీ20)లలో విధ్వంసకర ఇన్నింగ్స్తో పరుగుల సునామీ సృష్టించాడు. ఈ క్రమంలో తిరిగి జాతీయ జట్టుకు ఎంపికైన శ్రేయస్ అయ్యర్.. ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లోనూ అదరగొట్టాడు.దుబాయ్ వేదికగా జరిగిన ఈ వన్డే టోర్నమెంట్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన అయ్యర్.. టీమిండియా చాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా 243 పరుగులు సాధించి భారత్ తరఫున టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025 మెగా వేలంలో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ భారీ ధర పలికిన విషయం తెలిసిందే.రూ. 26.75 కోట్లుపంజాబ్ కింగ్స్ ఏకంగా రూ. 26.75 కోట్లకు శ్రేయస్ అయ్యర్ను కొనుగోలు చేసి.. కెప్టెన్గా నియమించింది. గతేడాది కోల్కతా నైట్ రైడర్స్ను చాంపియన్గా నిలిపిన అతడిని ఈసారి తమ సొంతం చేసుకుని పగ్గాలు అప్పగించింది. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ గురించి కోల్కతా మాజీ ఆల్రౌండర్ అమన్ ఖాన్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.రేపు మీ బౌలింగ్ను చితక్కొడుతాను చూడు‘‘విజయ్ హజారే మ్యాచ్కు ముందు.. నేను, శ్రేయస్ డిన్నర్కు వెళ్లాం. ప్రత్యర్థులుగా పోటీ పడటం గురించి చర్చిస్తూ సరదాగా గడిపాము. శ్రేయస్ ముంబైకి ఆడుతుంటే.. నేను పాండిచ్చేరికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మరుసటి రోజు మ్యాచ్ గురించి చెబుతూ.. ‘రేపు మీ బౌలింగ్ను చితక్కొడుతాను చూడు’ అన్నాడు.పదహారు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతోఅన్నట్లుగానే సెంచరీ చేశాడు. కేవలం 133 బంతుల్లోనే 137 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిగతా ముంబై బ్యాటర్లంతా పరుగులు రాబట్టేందుకు ఆపసోపాలు పడుతున్న వేళ శ్రేయస్ అయ్యర్ మాత్రం ముందు రోజు రాత్రి నాకేం చెప్పాడో అది చేసి చూపించాడు’’ అని అమన్ ఖాన్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు.కాగా గతేడాది విజయ్ హజారే మ్యాచ్లో భాగంగా పాండిచ్చేరితో తలపడ్డ ముంబై.. 82 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన వేళ శ్రేయస్ బ్యాట్ ఝులిపించాడు. పదహారు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో శతక్కొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2022స సీజన్లో శ్రేయస్ కెప్టెన్సీలో కేకేఆర్ తరఫున అమన్ ఖాన్ ఆడాడు. తాము తప్పకుండా టైటిల్ గెలుస్తామని అతడు తరచూ చెప్పేవాడని.. అన్నట్లుగానే 2024లో కోల్కతాను చాంపియన్గా నిలిపాడని అమన్ ఖాన్ గుర్తు చేసుకున్నాడు. ఆటగాళ్లపై అరవడం, మైదానంలో దూకుడుగా కనిపించడం శ్రేయస్ శైలి కాదని.. కూల్గానే తను అనుకున్న ఫలితం రాబట్టడంలో అతడు దిట్ట అని ప్రశంసించాడు.చదవండి: ముగ్గురు టీమిండియా కెప్టెన్లు.. అది నా అదృష్టం: హార్దిక్ పాండ్యా -
IPL 2025: డైనమైట్లతో నిండిన పంజాబ్ బ్యాటింగ్ విభాగం.. వీరిని ఆపతరమా..?
ఈ ఏడాది ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ విభాగం విధ్వంసకర డైనమైట్లతో నిండుకుని ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ జట్టు బ్యాటింగ్ విభాగం అత్యంత పటిష్టంగా, ప్రమాదకరంగా కనిపిస్తుంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదలు మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, శశాంక్ సింగ్, జోస్ ఇంగ్లిస్, ప్రభ్సిమ్రన్ సింగ్, ఆరోన్ హార్డీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జన్సెన్.. ఇలా జట్టు మొత్తం విధ్వంసకర వీరులే ఉన్నారు.బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తున్నా.. బ్యాటింగ్ బలగం చూసి పంజాబ్ను టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా చెప్పవచ్చు. జట్టులో చాలామంది మిడిలార్డర్ బ్యాటర్లు ఉండటంతో తుది జట్టు కూర్పు సమస్యగా మారవచ్చు. ఓపెనర్లుగా జోస్ ఇంగ్లిస్, ప్రభ్సిమ్రన్ సింగ్ రావచ్చని అంచనా. వన్డౌన్లో శ్రేయస్ అయ్యర్, నాలుగో స్థానంలో నేహల్ వధేరా, ఐదో ప్లేస్లో శశాంక్ సింగ్ బ్యాటింగ్కు దిగే అవకాశం ఉంది.ఆరో స్థానంలో మ్యాక్స్వెల్, ఏడో ప్లేస్లో అజ్మతుల్లా ఒమర్జాయ్/మార్కో జన్సెన్, బౌలర్లుగా అర్షదీప్ సింగ్, లోకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చహల్, జేవియర్ బార్ట్లెట్ తుది జట్టులో ఉండవచ్చు.కాగా, ఈ నెల 22 నుంచి ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం కానుండగా... పంజాబ్ కింగ్స్ మార్చి 25న గుజరాత్ టైటాన్స్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.లీగ్ ఆరంభం నుంచి ఒక్కసారి కూడా ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయిన పంజాబ్ కింగ్స్... ఈసారి తమ చిరకాల స్వప్నం నెరవేర్చుకోవాలనే లక్ష్యంతో ఉంది. గతేడాది కోల్కతా నైట్రైడర్స్ను చాంపియన్గా నిలిపిన శ్రేయస్ అయ్యర్ ఈసారి పంజాబ్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ హెడ్కోచ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో పంజాబ్ తమ టైటిల్ కల నేరవేర్చుకుంటుందేమో చూడాలి. ఐపీఎల్ 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టు..శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నేహల్ వధేరా, ప్రియాన్ష్ ఆర్య, హర్నూర్ సింగ్, పైలా అవినాశ్, ముషీర్ ఖాన్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, శశాంక్ సింగ్, ఆరోన్ హార్డీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జన్సెన్, సూర్యాంశ్ షేడ్గే, ప్రవీణ్ దూబే, జోస్ ఇంగ్లిస్, ప్రభ్సిమ్రన్ సింగ్, విష్ణు వినోద్, హర్ప్రీత్ బ్రార్, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్, లోకీ ఫెర్గూసన్, విజయ్కుమార్ వైశాక్, కుల్దీప్ సేన్, యశ్ ఠాకూర్, జేవియర్ బార్ట్లెట్ -
కెప్టెన్ల మార్పు.. ఎవరి జీతం ఎంత?.. అతి చవగ్గా దొరికిన సారథి అతడే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పద్దెమినిదవ ఎడిషన్ ఆరంభానికి రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్తో శనివారం (మార్చి 22) ఐపీఎల్-2025కి తెరలేవనుంది. ఇక ఈ సీజన్కు ముందు మెగా వేలం జరగడంతో జట్లలో చాలా మార్పులే చోటుచేసుకున్నాయి.చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ తప్ప.. మిగిలిన ఐదు జట్లు తమ కెప్టెన్లను కూడా మార్చేశాయి. లక్నో సూపర్ జెయింట్స్ టీమిండియా స్టార్ రిషభ్ పంత్ (Rishabh Pant) కోసం రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లు ఖర్చు చేసి.. అతడిని తమ సారథిగా నియమించుకుంది.మరోవైపు.. పంజాబ్ కింగ్స్ కూడా ఈసారి కెప్టెన్ కోసం భారీగానే ఖర్చుపెట్టింది. భారత జట్టు మిడిలార్డర్ స్టార్, ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ను రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఈ ఇద్దరు టీమిండియా స్టార్లు క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లుగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. మరి మిగిలిన జట్ల కెప్టెన్లు, వారి జీతాలు ఈసారి ఎలా ఉన్నాయో చూద్దామా?కోల్కతా నైట్ రైడర్స్2012, 2014 2024లో చాంపియన్గా నిలిచిన జట్టు. గతేడాది తమకు ట్రోఫీ అందించిన శ్రేయస్ అయ్యర్ను వదులుకున్న కేకేఆర్.. ఈసారి అనూహ్య రీతిలో ఓ వెటరన్ ప్లేయర్ను తమ కెప్టెన్గా నియమించింది.మెగా వేలం-2025లో తొలి రౌండ్లో అమ్ముడుపోకుండా మిగిలి పోయిన అజింక్య రహానేను రూ. 1.5 కోట్లకు కొని.. పగ్గాలు అప్పగించింది. అతడికి డిప్యూటీగా యువ ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్కు బాధ్యతలు ఇచ్చింది. ఐపీఎల్-2025 కెప్టెన్లలో అతి తక్కువ జీతం అందుకున్న కెప్టెన్ రహానేనే కావడం గమనార్హం. అన్నట్లు వెంకటేశ్ అయ్యర్ జీతం రూ.23.75 కోట్లు.సన్రైజర్స్ హైదరాబాద్గతేడాది రన్నరప్గా నిలిచిన సన్రైజర్స్ ఈసారీ తమ కెప్టెన్గా ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్ను కొనసాగించింది. అయితే, గతేడాది అతడికి రూ. 20.50 కోట్ల మేర ముట్టజెప్పిన ఫ్రాంఛైజీ.. ఈసారి రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకోవడం గమనార్హం.రాజస్తాన్ రాయల్స్ఐపీఎల్ తొట్టతొలి విజేతగా చరిత్ర సృష్టించిన రాజస్తాన్ రాయల్స్ గత కొన్నేళ్లుగా టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ సామ్సన్ను తమ కెప్టెన్గా కొనసాగిస్తోంది. ఈసారి కూడా ‘పింక్’ జట్టును సంజూ ముందుండి నడిపించనున్నాడు. ఇందుకోసం రూ. 18 కోట్ల జీతం అందుకుంటున్నాడు.చెన్నై సూపర్ కింగ్స్మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో ఏకంగా ఐదు ట్రోఫీలు గెలిచిన చెన్నై.. గతేడాది నుంచి రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ఆడుతోంది. ఈసారీ అతడినే కెప్టెన్గా కొనసాగించిన సీఎస్కే.. ఇందుకోసం అతడిని రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకుంది.ఢిల్లీ క్యాపిటల్స్ఈసారి కెప్టెన్ను మార్చిన ఫ్రాంఛైజీల జాబితాలో ఢిల్లీ ఒకటి. గతేడాది రిషభ్ పంత్ కెప్టెన్సీలో ఆడిన ఢిల్లీ.. ఈసారి టీమిండియా వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ నాయకత్వంలో బరిలోకి దిగనుంది. ఇందుకోసం తమ కెప్టెన్కు రూ. 16.50 కోట్ల మేర చెల్లిస్తోంది.గుజరాత్ టైటాన్స్అరంగేట్ర సీజన్లో తమకు టైటిల్ అందించిన హార్దిక్ పాండ్యా జట్టును వీడిన తర్వాత.. అంటే గతేడాది టీమిండియా నయా సూపర్ స్టార్ శుబ్మన్ గిల్కు పగ్గాలు అప్పగించింది. వేలానికి ముందు గిల్ను రూ. 16.5 కోట్లకు రిటైన్ చేసుకున్న గుజరాత్ ఈసారీ అతడినే సారథిగా కొనసాగిస్తోంది.ముంబై ఇండియన్స్ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మను కాదని.. గతేడాది హార్దిక్ పాండ్యాను ఏరికోరి కెప్టెన్ను చేసిన ముంబై ఘోర పరాభవం చవిచూసింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. అయితే, ఈసారీ అతడికి మరో అవకాశం ఇచ్చిన అంబానీల యాజమాన్యంలోని ముంబై... పాండ్యాను రూ. 16.35 కోట్లకు రిటైన్ చేసుకుంది.రాయల్ చాలెంజర్స్ బెంగళూరుఎంత క్రేజ్ ఉన్నా ఒక్క టైటిల్ కూడా గెలవని జట్టుగా పేరొందిన ఆర్సీబీ.. ఈసారి ఊహించని రీతిలో రజత్ పాటిదార్ను సారథిగా నియమించింది. విరాట్ కోహ్లి మరోసారి పగ్గాలు చేపడతాడనే ప్రచారం జరిగగా.. బెంగళూరు ఫ్రాంఛైజీ ప్రకటనతో అది జరగదని తేలింది. అన్నట్లు వేలానికి ముందు రూ. 11 కోట్లకు పాటిదార్ను ఆర్సీబీ రిటైన్ చేసుకుంది. ఐపీఎల్-2025 కెప్టెన్లలో రహానే తర్వాత తక్కువ జీతం ఆర్సీబీ సారథికే!చదవండి: వాళ్లను చూస్తేనే చిరాకు.. బుమ్రా, రబడ మాత్రం వేరు: డేల్ స్టెయిన్ -
IPL: వారెవ్వా..! అప్పుడు బాల్ బాయ్.. ఇప్పుడు టైటిల్ గెలిచిన కెప్టెన్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఒకప్పుడు బాల్ బాయ్గా ఉన్న పిల్లాడు.. కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. అంతేనా.. టైటిల్ గెలిచిన మొనగాడు కూడా అతడు!.. అంతేకాదండోయ్.. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన రెండో ఆటగాడు కూడా! ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది.. అవును.. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer).సారథిగా సూపర్ హిట్ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో భారత్ ట్రోఫీ గెలవడంలో కీలకంగా వ్యవహరించిన శ్రేయస్.. ప్రస్తుతం ఐపీఎల్-2025 సన్నాహకాల్లో మునిగిపోయాడు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా జట్టును ఫైనల్ వరకు చేర్చిన ఈ ముంబైకర్.. గతేడాది కోల్కతా నైట్ రైడర్స్ను చాంపియన్గా నిలిపాడు. గౌతం గంభీర్ తర్వాత కోల్కతాకు ట్రోఫీ అందించిన రెండో కెప్టెన్గా నిలిచాడు.అయితే, మెగా వేలానికి ముందు శ్రేయస్ అయ్యర్ కేకేఆర్తో తెగదెంపులు చేసుకోగా.. పంజాబ్ కింగ్స్ అతడిని ఏకంగా రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసి.. పగ్గాలు అప్పగించింది. పంజాబ్ టైటిల్ కలను తీర్చాలని గత ప్రదర్శనను పునరావృతం చేస్తూ ఈసారి పంజాబ్ టైటిల్ కలను ఎలాగైనా తీర్చాలని శ్రేయస్ పట్టుదలగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా జియోహాట్స్టార్తో ముచ్చటించిన ఈ కెప్టెన్ సాబ్ గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.అప్పుడు బాల్ బాయ్ని‘‘మా వీధిలో క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేసేవాళ్లం. అప్పట్లో (2008) నేను ముంబై అండర్-14 జట్టుకు ఆడుతున్నాడు. ముంబై జట్టులో ఉన్న పిల్లలందరినీ ఐపీఎల్లో బాల్ బాయ్స్గా తీసుకువెళ్లారు.నేను కాస్త బిడియస్తుడిని. ఎవరితోనూ ఎక్కువగా కలవను. అయినా సరే.. అదృష్టవశాత్తూ వారిలో ఒకడిగా నాకూ అవకాశం దక్కింది. అప్పట్లో నా ఫేవరెట్ క్రికెటర్ రాస్ టేలర్ను దగ్గరగా చూడాలని అనుకునేవాడిని.సర్.. నేను మీకు వీరాభిమానినిఅనుకోకుండా ఆరోజు అవకాశం వచ్చింది. ఆయన దగ్గరకు వెళ్లి.. ‘సర్.. నేను మీకు వీరాభిమానిని’ అని చెప్పాను. ఆయన నా మాటలకు నవ్వులు చిందించడంతో పాటు థాంక్యూ కూడా చెప్పారు. అలా మన అభిమాన క్రికెటర్లను కలిసినపుడు గ్లోవ్స్ లేదంటే బ్యాట్ అడగటం పరిపాటి. నాకూ ఆయనను బ్యాట్ అడగాలని అనిపించినా సిగ్గు అడ్డొచ్చింది.ఓ మ్యాచ్లో ఇర్ఫాన్ పఠాన్ లాంగాన్లో ఫీల్డింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆయన మా పక్కకు వచ్చి కూర్చుని.. మ్యాచ్ ఆస్వాదిస్తున్నారా అని అడిగారు. అవును.. మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పాను. అప్పట్లో ఇర్ఫాన్ భాయ్ క్రేజ్ తారస్థాయిలో ఉండేది. పంజాబ్ జట్టులోని అందగాళ్లలో ఆయనా ఒకరు. యువీ పాను కూడా అప్పుడు దగ్గరగా చూశాం. ఈ జ్ఞాపకాలు నా మనసులో ఎల్లప్పుడూ నిలిచిపోతాయి’’ అని శ్రేయస్ అయ్యర్ తన మనసులోని భావాలు పంచుకున్నాడు.2015లో ఎంట్రీకాగా ఐపీఎల్ తొలి సీజన్ 2008లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా తాను రాస్ టేలర్ (RCB)ని తొలిసారి కలిసినట్లు అయ్యర్ వెల్లడించాడు. కాగా శ్రేయస్ అయ్యర్ 2015లో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. నాటి ఢిల్లీ డేర్డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) తరఫున తన తొలి మ్యాచ్ ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఇప్పటి వరకు ఐపీఎల్లో 115 మ్యాచ్లు పూర్తి చేసుకున్నాడు.మొత్తంగా 3127 పరుగులు సాధించడంతో పాటు కెప్టెన్గా టైటిల్ సాధించాడు. ప్రస్తుతం పంజాబ్ కెప్టెన్గా ఉన్న శ్రేయస్ అయ్యర్ మార్చి 25న గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్తో తాజా సీజన్ను మొదలుపెట్టనున్నాడు.చదవండి: వాళ్లను చూస్తేనే చిరాకు.. బుమ్రా, రబడ మాత్రం వేరు: డేల్ స్టెయిన్ -
CT 2025: కేఎల్ రాహుల్, శ్రేయస్లకు దక్కని చోటు.. కెప్టెన్గా అతడు!
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ ఆథర్టన్ తన.. ‘ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’ను ప్రకటించాడు. ఇందులో టీమిండియా నుంచి ముగ్గురికి మాత్రమే స్థానమిచ్చిన అతడు.. కేఎల్ రాహుల్ను విస్మరించాడు. అంతేకాదు శ్రేయస్ అయ్యర్ను కూడా పక్కనపెట్టాడు.ఇక ఓపెనింగ్ జోడీగా అఫ్గనిస్తాన్ యువ స్టార్ ఇబ్రహీం జద్రాన్(Ibrahim Zadran), న్యూజిలాండ్ యంగ్స్టర్ రచిన్ రవీంద్ర(Rachin Ravindra)లను మైఖేల్ ఆథర్టన్ ఎంచుకున్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్గా ఆస్ట్రేలియా ఆటగాడు జోష్ ఇంగ్లిస్ను ఎంపిక చేసుకున్న ఈ మాజీ సారథి.. కెప్టెన్గా కివీస్ నాయకుడు మిచెల్ సాంట్నర్కు స్థానమిచ్చాడు.అత్యుత్తమ ఇన్నింగ్స్ అతడిదేఇక గ్రూప్ దశలోనే తమ జట్టు నిష్క్రమించినప్పటికీ జో రూట్కు ఈ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్లో ఆథర్టన్ చోటు కట్టబెట్టాడు. ఇంగ్లండ్ నుంచి ఒకే ఒక్క ఆటగాడిగా రూట్కు ఈ మాజీ బ్యాటర్ స్థానం ఇచ్చాడు. తన జట్టు ఎంపిక గురించి మైఖేల్ ఆథర్టన్ స్కై స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. ‘‘ఈ టోర్నీలో నేను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్ జద్రాన్ బ్యాటింగ్ నుంచి వచ్చింది.అందుకే రచిన్ రవీంద్రతో పాటు ఓపెనింగ్ జోడీగా జద్రాన్ను ఎంచుకున్నా. ఇక వన్డౌన్లో విరాట్ కోహ్లి, రూట్ నాలుగో స్థానంలో ఉండాలి. వికెట్ కీపర్ బ్యాటర్గా నా ఓటు జోష్ ఇంగ్లిస్కే. ఇంగ్లండ్తో మ్యాచ్లో అతడు అద్భుత నైపుణ్యాలు కనబరిచాడు.సారథి అతడేఇక ఆరోస్థానంలో ఆల్రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్కు నేను స్థానం ఇస్తాను. అతడు బ్యాట్తో బాల్తో రాణించగలడు. అతడు జట్టులో ఉంటే సమతూకంగా ఉంటుంది. ఇక నా ఏడో ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్. మిచెల్ సాంట్నర్ను నా జట్టుకు కెప్టెన్గా ఎంచుకుంటాను. ఇద్దరు సీమర్లు మహ్మద్ షమీ, మ్యాట్ హెన్రీలకు చోటిస్తా. సాంట్నర్తో పాటు మరో స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తిని ఎంచుకుంటా’’ అని మైఖేల్ ఆథర్టన్ వెల్లడించాడు.కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్ ట్రోఫీ మార్చి 9న దుబాయ్లో ముగిసింది. ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్ను ఓడించి విజేతగా అవతరించింది. ఈ వన్డే టోర్నమెంట్లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ ఆడగా.. వన్డే ప్రపంచకప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ ఆడాయి.రాహుల్,శ్రేయస్ అదరగొట్టారుఇక ఈ మెగా టోర్నీలో అఫ్గన్ ఓపెనర్ జద్రాన్ ఇంగ్లండ్పై వీరోచిత శతకం బాదాడు. 117 పరుగులు సాధించి టోర్నీ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. మరోవైపు.. రచిన్ రెండు శతకాల సాయంతో 263 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. కోహ్లి పాకిస్తాన్పై అజేయ శతకం చేయగా.. షమీ బంగ్లాదేశ్పై, వరుణ్ న్యూజిలాండ్పై ఐదు వికెట్ల ప్రదర్శన చేశారు. అయితే, టీమిండియా మిడిలార్డర్లో దిగి కీలక ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్(243 రన్స్), కేఎల్ రాహుల్(140 రన్స్)లకు మాత్రం ఆథర్టన్ చోటివ్వకపోవడం గమనార్హం. కాగా ఇంగ్లండ్ తరఫున ఆథర్టన్ 115 టెస్టులు, 54 వన్డేలు ఆడాడు. ప్రస్తుతం కామెంటేటర్గా కొనసాగుతున్నాడు.మైఖేల్ ఆథర్టన్ ఎంచుకున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ -2025 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్:ఇబ్రహీం జద్రాన్, రచిన్ రవీంద్ర, విరాట్ కోహ్లి, జో రూట్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), అజ్మతుల్లా ఒమర్జాయ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మ్యాట్ హెన్రీ, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి.చదవండి: BGT: ‘నేను జట్టులో ఉంటే కచ్చితంగా గెలిచేవాళ్లం.. ఇంగ్లండ్తో సిరీస్కు రెడీ’ -
KKR SWOT: అతడిపై భారం!.. బలాలు, బలహీనతలు ఇవే
గతేడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) విజేతగా నిలిచింది కోల్కతా నైట్ రైడర్స్(KKR). తద్వారా మూడోసారి టైటిల్ను కైవసం చేసుకుంది. ఇక ఈసారి లీగ్ ఆరంభ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర(RCB)తో కేకేఆర్ తలపడనుంది. సొంతమైదానం ఈడెన్ గార్డెన్స్లో మార్చి 22న ఈ మ్యాచ్ జరుగనుంది.అయితే, గత సంవత్సరం జట్టుని ముందుండి నడిపించిన శ్రేయస్ అయ్యర్ ఈసారి తప్పుకోవడంతో అతని స్థానంలో అనుభవజ్ఞుడైన అజింక్య రహానే బాధ్యతలు స్వీకరించాడు. దీనితో నైట్ రైడర్స్ కొత్త తరహా జట్టుతో ఈ సారి రంగ ప్రవేశం చేయబోతోంది. నైట్ రైడర్స్పై ఒత్తిడి ఈ నేపథ్యంలో మళ్ళీ టైటిల్ నిలబెట్టుకోవాలన్న ఆశాభావంతో ఉన్న నైట్ రైడర్స్పై సహజంగానే ఒత్తిడి ఉంటుంది. మూడుసార్లు ఛాంపియన్గా నిలిచిన ఈ జట్టు బ్యాటింగ్ ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ను రూ.23.75 కోట్లకు తిరిగి కొనుగోలు చేసింది. ఫ్రాంఛైజీ అతనికి వైస్ కెప్టెన్గా అదనపు బాధ్యతను కూడా అప్పగించింది.ఇక బంగ్లాదేశ్లో ఫాస్ట్ బౌలింగ్ విప్లవానికి బీజాలు నాటడంలో విజయం సాధించిన వెస్టిండీస్ మాజీ పేసర్ ఒట్టిస్ గిబ్సన్ను నైట్ రైడర్స్ ఇటీవల తమ బౌలింగ్ కోచ్గా నియమించింది. అతడు రావడం ప్లస్ పాయింట్తాజాగా దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ అన్రిచ్ నోర్జే జట్టులో చేరుతున్నట్టు జట్టు అధినేత, నటుడు షారుఖ్ ఖాన్ రెండ్రోజుల క్రితం ప్రకటించాడు. 2025 వేలంలో నైట్ రైడర్స్ రూ. 6.50 కోట్లకు నోర్జేను తిరిగి కొనుగోలు చేసింది.ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫ్రాంచైజీలోకి వచ్చిన నోర్జే అనుభవం, అపార వేగంతో బౌలింగ్ చేయగల సత్తా ఉంది. ఇంకా జట్టులో సునీల్ నరైన్, ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ లో భారత్ విజయంలో కీలక భూమిక వహించిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వంటి సీనియర్లు ఉన్నారు. వీరితో పాటు వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, ఉమ్రాన్ మాలిక్ వంటి వర్ధమాన బౌలర్లతో బలీయంగానే కనిపిస్తోంది. రహానేకు కెప్టెన్గా బాధ్యతలు.. గొ ప్ప రికార్డు లేదుఐపీఎల్లో కెప్టెన్గా అత్యుత్తమ రికార్డులు లేనందున రహానేపై పెద్ద భారమే కనిపిస్తోంది. గతంలో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) కు 24 మ్యాచ్లలో నాయకత్వం వహించిన రహానే వాటిలో తొమ్మిది మ్యాచ్లలో మాత్రమే విజయాన్ని రుచిచూశాడు. 15 మ్యాచ్లలో ఓడిపోయాడు. ఐపీఎల్లో కెప్టెన్గా రహానే రికార్డు ఏ విధంగానూ ఆశాజనకంగా లేదు.ఇక వ్యక్తిగతంగా చూస్తే రహానే 25 మ్యాచ్ల్లో ఆడి 25.34 సగటుతో 583 పరుగులు మాత్రమే చేశాడు. అతను హైదరాబాద్ వేదికపై 2019లో సన్రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్లో తన అత్యధిక స్కోరు 70 ని నమోదు చేసుకున్నాడు. కానీ రహానెకి నైట్ రైడర్స్ కొత్త ఫ్రాంచైజీ ఏమీ కాదు. 2022లో నైట్ రైడర్స్ కి ప్రాతినిధ్యం వహించిన రహానే ఏడు మ్యాచ్ల్లో 103.90 స్ట్రైక్ రేట్తో 133 పరుగులు చేశాడు. కాబట్టి గొప్ప రికార్డులేమీ లేని కెప్టెన్ ఉండటం ఒక బలహీనతగా పరిణమించింది అనడంలో సందేహం లేదు.వేలంలో నైట్ రైడర్స్ ఎలా రాణించింది?వేలానికి ముందు వెంకటేష్ అయ్యర్ను విడుదల చేసిన తర్వాత, నైట్ రైడర్స్ అతన్ని అధిక ధరకు కొనుగోలు చేసింది. గత సీజన్లో అగ్రశ్రేణి బ్యాటర్లలో ఒకరైన ఇంగ్లాండ్కు చెందిన ఫిల్ సాల్ట్ను తిరిగి కొనుగోలు చేయడానికి కూడా ప్రయత్నించింది. సాల్ట్ లేకపోయినా, నైట్ రైడర్స్ వద్ద క్వింటన్ డి కాక్, రహ్మానుల్లా గుర్బాజ్ల రూపంలో ఇద్దరు మంచి వికెట్టుకీపర్లు ఉన్నారు. సన్రైజర్స్ జట్టు నుంచి తప్పుకున్న తర్వాత తన కెరీర్ను పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఉమ్రాన్ మాలిక్ను కూడా నైట్ రైడర్స్ కనుగోలుచేసింది.ఐపీఎల్ 2025 వేలంలో కొన్న ఆటగాళ్లు:వెంకటేష్ అయ్యర్ (రూ. 23.75 కోట్లు), రహ్మానుల్లా గుర్బాజ్ (రూ. 2 కోట్లు), క్వింటన్ డి కాక్ (రూ. 3.60 కోట్లు), ఆంగ్క్రిష్ రఘువంశీ (రూ. 3 కోట్లు), అన్రిచ్ నార్ట్జే (రూ. 6.50 కోట్లు), వైబ్హవ్ 8 కోట్లు. మయాంక్ మార్కండే (రూ. 30 లక్షలు), రోవ్మన్ పావెల్ (రూ. 1.50 కోట్లు), మనీష్ పాండే (రూ. 75 లక్షలు), స్పెన్సర్ జాన్సన్ (రూ. 2.80 కోట్లు), లువ్నిత్ సిసోడియా (రూ. 30 లక్షలు), అజింక్యా రహానె (రూ. 30 లక్షలు), అనీక్లీ ఎ. 4 లక్షలు (రూ. 1.50 లక్షలు), అనూక్లీ రోయ్ లక్షలు (రూ. 1.50 లక్షలు), 2 కోట్లు), ఉమ్రాన్ మాలిక్ (రూ. 75 లక్షలు).ప్రధాన ఆటగాళ్లు:వరుణ్ చక్రవర్తి: ఛాంపియన్స్ ట్రోఫీలో తొమ్మిది వికెట్లతో రెండవ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. నైట్ రైడర్స్ తరఫున 82 వికెట్లు తీసిన వరుణ్ ఈ సీజన్లో కీలక పాత్ర పోషిస్తాడని భావిస్తున్నారు.సునీల్ నరైన్: వెస్టిండీస్ ఆల్ రౌండర్ గత సీజన్లో అత్యంత విలువైన ఆటగాడిగా అవార్డు గెలుచుకున్న నరైన్ 17 వికెట్లు పడగొట్టడమే కాకుండా, 34.85 సగటుతో 488 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు.ఆండ్రీ రస్సెల్: ఆండ్రీ రస్సెల్ దశాబ్ద కాలంగా నైట్స్ తరఫున కీలక ఆటగాడిగా ఉన్నాడు. అందువల్ల యాజమాన్యం అతనిపై విశ్వాసం చూపించింది. గత సంవత్సరం రస్సెల్ 222 పరుగులు చేసి 19 వికెట్లు పడగొట్టి, నైట్ రైడర్స్ టైటిల్ సాధనలో కీలక పాత్ర పోషించాడు.అజింక్య రహానే: అజింక్య రహానేకు చాలా అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ లో అపార అనుభవం ఉంది.చదవండి: IPL 2025: అతడి గురించి ఎవరూ మాట్లాడమే లేదు.. మూడో స్థానంలో ఆడిస్తారా? -
అతడు అద్భుతం.. కానీ ఆ విషయంలో అసంతృప్తి: భారత మాజీ బ్యాటర్
టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)పై భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్సర్కార్ ప్రశంసలు కురిపించాడు. ఈ ముంబైకర్ ఇప్పటికైనా తనలోని నైపుణ్యాలను గుర్తించాడని.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్లో అతడు బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతమని కొనియాడాడు.అయితే, న్యూజిలాండ్(India vs New Zealand)తో ఫైనల్లో శ్రేయస్ అయ్యర్ అవుటైన తీరు మాత్రం తనకు నచ్చలేదంటూ దిలీప్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అదే విధంగా.. కేఎల్ రాహుల్(KL Rahul) ఆట తీరును సైతం ఈ మాజీ బ్యాటర్ ప్రశంసించాడు. అంతేకాదు.. ఐదుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలన్న సెలక్టర్ల నిర్ణయం సరైందని నిరూపితమైందంటూ మేనేజ్మెంట్ వ్యూహాలను మెచ్చుకున్నాడు.కాగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్ ట్రోఫీ మార్చి 9న ముగిసిన విషయం తెలిసిందే. ఈ మెగా వన్డే టోర్నమెంట్కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వగా.. టీమిండియా మాత్రం భద్రతా కారణాల దృష్ట్యా తమ మ్యాచ్లన్నీ దుబాయ్లోనే ఆడింది. న్యూజిలాండ్పై గెలుపొంది ట్రోఫీని ముద్దాడిఈ నేపథ్యంలో గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్లను చిత్తు చేసిన రోహిత్ సేన.. ఆఖరిగా న్యూజిలాండ్పై జయకేతనం ఎగురువేసింది. ఈ క్రమంలో గ్రూప్-ఎ టాపర్గా సెమీస్ చేరి.. అక్కడ ఆస్ట్రేలియాను ఓడించింది.ఈ క్రమంలో ఫైనల్లోనూ అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్పై గెలుపొంది ట్రోఫీని ముద్దాడింది. ఈ టోర్నీలో ఆడిన ఐదు మ్యాచ్లలోనూ అజేయంగా నిలిచి చాంపియన్గా అవతరించింది. ఈ విజయాల్లో మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన శ్రేయస్ అయ్యర్ది కీలక పాత్ర. ఐదు ఇన్నింగ్స్లో కలిపి అతడు 243 పరుగులు చేసి.. భారత్ తరఫున టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు.మరోవైపు.. వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. తనకు అచ్చొచ్చిన ఐదో స్థానంలో కాకుండా ఆరో స్థానంలో ఆడాల్సి వచ్చింది. అక్షర్ పటేల్ కోసం తన నంబర్ను త్యాగం చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ అద్భుతంగా రాణించాడు. మొత్తంగా 140 పరుగులు చేసిన ఈ కర్ణాటక ఆటగాడు.. ముఖ్యంగా ఆసీస్తో సెమీస్లో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.అయ్యర్ అద్భుతంఈ నేపథ్యంలో దిలీప్ వెంగ్సర్కార్ మాట్లాడుతూ.. ‘‘అయ్యర్ అద్భుతంగా ఆడాడు. కానీ ఫైనల్లో అతడు అవుటైన విధానం నాకు అసంతృప్తిని మిగిల్చింది. తను ఆఖరి వరకు అజేయంగా నిలిచి విజయంతో ముగించి ఉంటే బాగుండేది. ఏదేమైనా ఇప్పటికైనా అతడు తన నైపుణ్యాలను గుర్తించి.. అందుకు న్యాయం చేసినందుకు సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నాడు.ఇక కేఎల్ రాహుల్ గురించి కూడా ప్రస్తావిస్తూ.. ‘‘ఆరో నంబర్లో వచ్చి కూడా కొన్ని ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయినా.. లెఫ్ట్- రైట్ కాంబినేషన్ల కోసమని అక్షర్ పటేల్ను రాహుల్ స్థానమైన ఐదో నంబర్లో పంపడం నాకేమీ నచ్చలేదు’’ అని దిలీప్ వెంగ్సర్కార్ తెలిపాడు.సెలక్టర్లకు క్రెడిట్ ఇవ్వాలిఅదే విధంగా.. ‘‘టీమిండియా విజయంలో సెలక్టర్లకు తప్పకుండా క్రెడిట్ ఇవ్వాలి. ఆస్ట్రేలియా సిరీస్లో రోహిత్ శర్మ వైఫల్యం తర్వాత కూడా అతడిని కెప్టెన్గా కొనసాగించారు. అంతేకాదు.. చాంపియన్స్ ట్రోఫీలో ఐదుగురు స్పిన్నర్లను ఆడించాలన్న వారి నిర్ణయం కూడా సరైందని నిరూపితమైంది’’ అని దిలీప్ వెంగ్సర్కార్ బీసీసీఐ సెలక్షన్ కమిటీని ప్రశంసించాడు.కాగా చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత స్పిన్ దళంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలతో పాటు ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. వీరిలో సుందర్ ఒక్కడే పూర్తిస్థాయిలో బెంచ్కే పరిమితమయ్యాడు. ఇదిలా ఉంటే.. కివీస్తో ఫైనల్లో మిచెల్ సాంట్నర్ బౌలింగ్లో లాంగాన్ మీదుగా షాట్కు యత్నించి రచిన్ రవీంద్రకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.చదవండి: అదే జరిగితే బుమ్రా కెరీర్ ముగిసినట్లే: కివీస్ మాజీ పేసర్ స్ట్రాంగ్ వార్నింగ్ -
ట్రోఫీ గెలిచినా.. కోరుకున్న గుర్తింపు దక్కలేదు: శ్రేయస్ అయ్యర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో అత్యధిక టైటిళ్లు గెలిచిన కెప్టెన్లుగా రోహిత్ శర్మ(Rohit Sharma), మహేంద్ర సింగ్(MS Dhoni) కొనసాగుతున్నారు. ముంబై ఇండియన్స్ను ఏకంగా ఐదుసార్లు చాంపియన్గా నిలిపిన ఘనత హిట్మ్యాన్కు దక్కగా.. అతడి తర్వాత ఐదుసార్లు ట్రోఫీ గెలిచిన సారథిగా ధోని చరిత్రకెక్కాడు. చెన్నై సూపర్ కింగ్స్ నాయకుడిగా ఈ ఫీట్ నమోదు చేశాడు.విన్నింగ్ కెప్టెన్ల జాబితాలోఇక గతేడాది కోల్కతా నైట్ రైడర్స్(KKR)ను విజేతగా నిలపడం ద్వారా మరో టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్ కూడా విన్నింగ్ కెప్టెన్ల జాబితాలో చోటు సంపాదించాడు. గౌతం గంభీర్ తర్వాత కేకేఆర్ను చాంపియన్గా నిలిపిన రెండో సారథిగా నిలిచాడు. అతడి సారథ్యంలో కోల్కతా గతేడాది అద్భుత విజయాలు సాధించింది.లీగ్ దశలో పద్నాలుగింట తొమ్మిది మ్యాచ్లు గెలిచి టాపర్గా ప్లే ఆఫ్స్ చేరిన కేకేఆర్.. క్వాలిఫయర్-1లో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. టైటిల్ పోరులోనూ మరోసారి సన్రైజర్స్తో తలపడి పైచేయి సాధించి.. విజేతగా అవతరించింది. దీంతో ఓవరాల్గా మూడోసారి కేకేఆర్ ఈ క్యాష్ రిచ్లీగ్లో విన్నర్గా నిలిచింది.అయితే, ఈ విషయంలో తనకు రావాల్సినంత గుర్తింపు దక్కలేదంటున్నాడు శ్రేయస్ అయ్యర్. ఐపీఎల్లో టైటిల్ సాధించినా తను కోరుకున్నట్లుగా ఏదీ జరుగలేదని పేర్కొన్నాడు. కాగా శ్రేయస్ ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ మెగా వన్డే టోర్నమెంట్లో ఐదు ఇన్నింగ్స్లో కలిపి 243 పరుగులతో టీమిండియా తరఫున టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు.తద్వారా భారత్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్రశసంలు అందుకుంటున్నాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో కేకేఆర్ను విజేతగా నిలిపినప్పటికీ వేలానికి ముందు ఫ్రాంఛైజీ శ్రేయస్ అయ్యర్ను రిటైన్ చేసుకోలేదు. దీంతో ఇరువర్గాల మధ్య విభేదాలు తలెత్తాయనే వార్తలు వచ్చాయి.ఈ నేపథ్యంలో ఐపీఎల్-2025 మెగా వేలంలో పాల్గొన్న శ్రేయస్ అయ్యర్ ఊహించని ధరకు అమ్ముడయ్యాడు. పంజాబ్ కింగ్స్ అతడి కోసం ఏకంగా రూ. 26.75 కోట్లు ఖర్చు చేసింది. కేకేఆర్తో పోటీపడి అయ్యర్ను భారీ ధరకు తమ సొంతం చేసుకుంది. ఐపీఎల్-2025లో తమ కెప్టెన్గా నియమించింది.కోరుకున్న గుర్తింపు దక్కలేదుఈ క్రమంలో చాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత శ్రేయస్ అయ్యర్ గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. ‘‘ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత కూడా నేను కోరుకున్నంత.. నాకు దక్కాల్సినంత గుర్తింపు దక్కలేదని అనిపిస్తోంది. అయితే, వ్యక్తిగతంగా నా ప్రదర్శన, కెప్టెన్సీ పట్ల నేను సంతృప్తిగా ఉన్నాను.ఎవరూ లేనపుడు కూడా మనం సరైన, న్యాయమైన దారిలో వెళ్తేనే విలువ. వ్యక్తిగా మనకు అన్నింటికంటే నిజాయితీ అతి ముఖ్యమైనది. అలాగని నాకు ఎవరి మీదా అసహనం, అసంతృప్తి లేదు. ఐపీఎల్ ఆడినందు వల్లే చేదు జ్ఞాపకాల నుంచి బయటపడ్డాను. అదృష్టవశాత్తూ టైటిల్ కూడా గెలిచి మనుపటిలా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాను’’ అని శ్రేయస్ అయ్యర్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు.క్రెడిట్ మొత్తం అతడి ఖాతాలోకే కాగా ప్రస్తుతం టీమిండియా హెడ్కోచ్గా ఉన్న గంభీర్ గతేడాది కేకేఆర్ మెంటార్గా వ్యవహరించాడు. కోల్కతా టైటిల్ గెలిచిన క్రెడిట్ మొత్తం అతడి ఖాతాలోకే వెళ్లిందన్నది బహిరంగ రహస్యమే. ఈ విజయం తర్వాతే అతడిని భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రధాన కోచ్గా నియమించింది. ఒక్కసారి కూడా కోచ్గా పని చేసిన అనుభవం లేకపోయినా గంభీర్పై నమ్మకం ఉంచింది. అయితే, టెస్టుల్లో అతడి మార్గదర్శనంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్వాష్.. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఓడిన భారత్.. చాంపియన్స్ ట్రోఫీలో మాత్రం విజేతగా నిలిచింది.చదవండి: CT: ఇండియా-‘బి’ టీమ్ కూడా ఫైనల్ చేరేది: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ -
అద్భుతంగా రాణించాను.. టెస్టు రీఎంట్రీకి సిద్ధం
టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) టెస్టుల్లో పునరాగమనంపై దృష్టి సారించాడు. దేశవాళీ టోర్నమెంట్లలో తాను అద్భుతంగా రాణించానని.. అందుకే తాను తిరిగి జాతీయ జట్టుకు ఆడతాననే ధీమా వ్యక్తం చేశాడు. కాగా వన్డే ప్రపంచకప్-2023 తర్వాత క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడ్డాడనే కారణంతో బీసీసీఐ(BCCI) శ్రేయస్ అయ్యర్పై వేటు వేసిన విషయం తెలిసిందే. దేశవాళీ క్రికెట్ ఆడాలన్న నిబంధనలను గాయం సాకు చూపి తప్పించుకున్నాడని భావించిన బోర్డు.. అయ్యర్ వార్షిక కాంట్రాక్టును రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ముంబై తరఫున దేశీ బరిలో దిగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. గతేడాది శ్రీలంకతో వన్డే సిరీస్ సందర్భంగా టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు.ఇక తాజాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో సత్తా చాటిన శ్రేయస్ అయ్యర్.. ఈ వన్డే టోర్నీలో భారత్ తరఫున టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి ఐదు ఇన్నింగ్స్లో కలిపి 243 పరుగులు సాధించాడు. తద్వారా ఈ మెగా ఈవెంట్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో న్యూజిలాండ్ స్టార్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ రచిన్ రవీంద్ర(263) తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు.ఇదిలా ఉంటే.. వన్డేల్లో తానేంటో మరోసారి నిరూపించుకున్న శ్రేయస్ అయ్యర్.. టీమిండియా టెస్టు రీఎంట్రీకి తాను సిద్ధమనే సంకేతాలు ఇచ్చాడు. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో మాట్లాడుతూ.. ‘‘టెస్టుల్లో పునరాగమనం చేయాలని ఉంది. వీలైనంత ఎక్కువగా క్రికెట్ ఆడాలని భావిస్తున్నా.నేను ఉత్తమంగా రాణించానుదేశవాళీ టోర్నమెంట్లో నేను ఉత్తమంగా రాణించాను. అయితే, నా చేతుల్లో ఏమీ లేదు. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. కానీ ఈ విషయం గురించి పదే పదే ఆలోచించను. దాని వల్ల అనసవరంగా నా మెదడుపై ఒత్తిడి పెరుగుతుంది.అనుకున్నది జరుగకపోతే మానసికంగానూ కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ క్షణాన్ని ఆస్వాదిస్తా. విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటా. సమయం వచ్చినపుడు అవకాశం అదే తలుపుతడుతుంది. ముందుగా చెప్పినట్లు నేను భవిష్యత్తు, గతం గురించి ఎక్కువగా ఆలోచించే మనిషిని కాను. ప్రస్తుతం నేను ఇలా ఉండటానికి కారణం అదే’’ అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. కాగా చివరిసారిగా అయ్యర్ గతేడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్తో టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇక ఇప్పటి వరకు మొత్తంగా టీమిండియా తరఫున 14 టెస్టులు ఆడిన ఈ ముంబైకర్ 811 పరుగులు చేశాడు. ఇంగ్లండ్తో సిరీస్ నాటికి!?ఇందులో ఓ శతకం కూడా ఉంది. ఇక తాజా రంజీ ట్రోఫీ సీజన్లో శ్రేయస్ అయ్యర్.. ఆడిన ఐదు మ్యాచ్లలోనే ఏకంగా 480 పరుగులు సాధించాడు. ఇక టీమిండియా జూన్లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇందులో భాగంగా స్టోక్స్ బృందంతో టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్ నాటికి అయ్యర్ పునరాగమనం చేసే అవకాశాలు లేకపోలేదు.చదవండి: CT: ఇండియా-‘బి’ టీమ్ కూడా ఫైనల్ చేరేది: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ -
CT 2025: జట్టును ప్రకటించిన ఐసీసీ.. రోహిత్కు దక్కని చోటు
పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy) ఎడిషన్ మార్చి 9న దుబాయ్లో ముగిసింది. టైటిల్ పోరులో న్యూజిలాండ్తో తలపడ్డ టీమిండియా జయకేతనం ఎగురవేసి ట్రోఫీని ముద్దాడింది. గ్రూప్ దశలో మూడు.. సెమీస్, ఫైనల్ గెలిచి అజేయంగా ఈ వన్డే టోర్నమెంట్ను ముగించింది.ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) తాజాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ను ప్రకటించింది. ఈ పదకొండు మంది సభ్యుల జట్టులో భారత్ హవా కొనసాగింది. టీమిండియా నుంచి ఈ జట్టులో ఏకంగా ఐదుగురు క్రికెటర్లు స్థానం సంపాదించారు.పాకిస్తాన్కు మొండిచేయిమరోవైపు.. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగి గెలుపన్నదే లేకుండా నిష్క్రమించిన పాకిస్తాన్కు మొండిచేయి ఎదురైంది. అంతేకాదు.. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్ల నుంచి కూడా ఒక్క ఆటగాడూ ఐసీసీ జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు. ఇక టీమిండియా తర్వాత న్యూజిలాండ్ నుంచి అత్యధికంగా నలుగురు ఐసీసీ ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కించుకున్నారు. అదే విధంగా అఫ్గనిస్తాన్ నుంచి ఇద్దరు ఇందులో ఉన్నారు. అయితే, ఇందులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మాత్రం చోటు దక్కకపోవడం గమనార్హం. ఈ జట్టుకు సారథిగా కివీస్ నాయకుడు మిచెల్ సాంట్నర్ ఎంపికయ్యాడు.నాలుగు వికెట్ల తేడాతో ఓడించికాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ పోటీపడగా.. టీమిండియా, కివీస్ సెమీస్ చేరాయి. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, అఫ్గనిస్తాన్ బరిలో దిగగా.. ఆసీస్, ప్రొటిస్ జట్లు సెమీ ఫైనల్లో అడుగుపెట్టాయి.ఈ క్రమంలో తొలి సెమీస్ మ్యాచ్లో భారత్- ఆసీస్ను... రెండో సెమీస్లో కివీస్ ప్రొటిస్ను ఓడించి ఫైనల్కు చేరుకున్నాయి. ఈ క్రమంలో దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో రోహిత్ సేన సాంట్నర్ బృందాన్ని నాలుగు వికెట్ల తేడాతో ఓడించి చాంపియన్గా అవతరించింది. ఈ మ్యాచ్లో 76 పరుగులతో రాణించిన భారత సారథి రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవగా.. మొత్తంగా రెండు శతకాల సాయంతో 263 పరుగులు సాధించిన కివీస్ యువ ఆటగాడు రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కింది.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’రచిన్ రవీంద్ర(న్యూజిలాండ్), ఇబ్రహీం జద్రాన్(అఫ్గనిస్తాన్), విరాట్ కోహ్లి(ఇండియా), శ్రేయస్ అయ్యర్(ఇండియా), కేఎల్ రాహుల్(ఇండియా), గ్లెన్ ఫిలిప్స్(న్యూజిలాండ్), అజ్మతుల్లా ఒమర్జాయ్(అఫ్గనిస్తాన్), మిచెల్ సాంట్నర్(కెప్టెన్, న్యూజిలాండ్), మ్యాట్ హెన్రీ(న్యూజిలాండ్), వరుణ్ చక్రవర్తి(ఇండియా)12వ ఆటగాడు: అక్షర్ పటేల్(ఇండియా)చాంపియన్స్ ట్రోఫీ-2025లో వీరి ప్రదర్శన👉రచిన్ రవీంద్ర- రెండు శతకాల సాయంతో 263 రన్స్. స్పిన్ బౌలర్గానూ రాణించిన రచిన్. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా ఎంపిక👉ఇబ్రహీం జద్రాన్- ఒక సెంచరీ సాయంతో 216 పరుగులు. ఇంగ్లండ్పై అఫ్గన్ గెలుపొందడంలో కీలక పాత్ర👉విరాట్ కోహ్లి- ఒక శతకం సాయంతో 218 పరుగులు. పాకిస్తాన్పై అజేయ సెంచరీ. వన్డేల్లో అత్యంత వేగంగా పద్నాలుగు వేల మార్కు అందుకున్న క్రికెటర్గా ప్రపంచ రికార్డు.👉శ్రేయస్ అయ్యర్- రెండు అర్ధ శతకాల సాయంతో 243 రన్స్. టీమిండియా చాంపియన్గా నిలవడంతో కీలక మిడిలార్డర్ బ్యాటర్గా రాణింపు.👉కేఎల్ రాహుల్- 140 పరుగులు. వికెట్ కీపర్గానూ సేవలు.👉గ్లెన్ ఫిలిప్స్- 177 పరుగులు. రెండు వికెట్లు, ఐదు క్యాచ్లు.👉అజ్మతుల్లా ఒమర్జాయ్- 126 రన్స్, ఏడు వికెట్లు.👉మిచెల్ సాంట్నర్- 4.80 ఎకానమీతో తొమ్మిది వికెట్లు👉మహ్మద్ షమీ- 5.68 ఎకానమీతో తొమ్మిది వికెట్లు. ఇందులో ఓ ఫైవ్ వికెట్ హాల్.👉మ్యాట్ హెన్రీ- 5.32 ఎకానమీతో పది వికెట్లు👉వరుణ్ చక్రవర్తి- 4.53 ఎకానమీతో తొమ్మిది వికెట్లు👉అక్షర్ పటేల్- 4.35 ఎకానమీతో ఐదు వికెట్లు.చదవండి: అతడు మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు.. ఓడినా గర్వంగానే ఉంది: కివీస్ కెప్టెన్ View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
తప్పులు సరిదిద్దుకుని.. ‘టాప్’ రన్ స్కోరర్గా.. మాటలకు అందని అనుభూతి!
తొలిసారి ఐసీసీ ట్రోఫీని ముద్దాడిన అనుభూతిని మాటల్లో వర్ణించలేనంటున్నాడు టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer). ప్రస్తుతం తన కాళ్లు నేలమీద నిలవడం లేదని.. ఇంతకంటే గొప్ప భావన మరొకటి ఉండదంటూ ఆనందంలో మునిగితేలుతున్నాడు. డ్రెస్సింగ్ రూమ్లో సహచర ఆటగాళ్ల సంతోషం చూసి తన మనసు గాల్లో తేలిందని ఉద్వేగానికి లోనయ్యాడు.అనూహ్య పరిస్థితుల్లో జట్టుకు దూరంకాగా వన్డే ప్రపంచకప్-2023లో అద్భుతంగా రాణించిన శ్రేయస్ అయ్యర్.. ఆ తర్వాత అనూహ్య పరిస్థితుల్లో జట్టుకు దూరమయ్యాడు. దేశవాళీ క్రికెట్ ఆడాలన్న బీసీసీఐ నిబంధనలు ఉల్లంఘించాడన్న ఆరోపణలతో సెంట్రల్ కాంట్రాక్టు(BCCI Cetral Contract) కూడా కోల్పోయాడు. అయితే, ఈ ముంబైకర్ తనకు ఎదురైన చేదు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని తనను తాను సరిదిద్దుకున్నాడు.తప్పులు సరిదిద్దుకుని..బోర్డు ఆదేశాలను పాటిస్తూ ముంబై తరఫున దేశీ క్రికెట్ బరిలో దిగిన శ్రేయస్.. కఠినశ్రమ, అంకితభావంతో తనను నిరూపించుకున్నాడు. వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో విధ్వంసకర బ్యాటింగ్తో విరుచుకుపడ్డ ఈ ముంబై ఆటగాడు... దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కెప్టెన్గా వ్యవహరించి టైటిల్ గెలిచాడు. రంజీల్లో సత్తా చాటి తన విలువను చాటుకున్నాడు.అంతేకాదు.. ఐపీఎల్-2024(IPL 2024)లో కోల్కతా నైట్ రైడర్స్ సారథిగా వ్యవహరించి.. జట్టును చాంపియన్గా నిలిపాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ జట్టులో పునరాగమనం చేసిన శ్రేయస్ అయ్యర్.. స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో సూపర్ ఫామ్తో పరుగులు రాబట్టాడు. తొలి వన్డేకు మోకాలి నొప్పి కారణంగా విరాట్ కోహ్లి దూరం కాగా.. అతడి స్థానంలో తుదిజట్టులో చోటు దక్కించుకుని జట్టుకు విజయాలు అందించాడు.జట్టుకు వెన్నెముకలా నిలిచిఈ క్రమంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఎంపికైన జట్టులో స్థానం సంపాదించిన శ్రేయస్ అయ్యర్ ఇక్కడా అద్బుతంగా రాణించాడు. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో రాణిస్తూ జట్టుకు వెన్నెముకలా నిలిచాడు. ఈ వన్డే టోర్నమెంట్లో మొత్తంగా టీమిండియా ఆడిన ఐదు మ్యాచ్లలో కలిపి శ్రేయస్ 48.60 సగటుతో 243 పరుగులు రాబట్టాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి.20 పరుగుల తేడాతో..తద్వారా ఈ టోర్నీలో టీమిండియా తరఫున టాప్ రన్ స్కోరర్గా నిలిచిన శ్రేయస్ అయ్యర్.. ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన రచిన్ రవీంద్రకు 20 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. రచిన్ రెండు శతకాల సాయంతో 263 పరుగులు సాధించి ఓవరాల్గా అత్యధిక పరుగుల వీరుడిగా నిలవగా.. శ్రేయస్ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.ఇక ఆదివారం నాటి ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్ను ఓడించడంలోనూ శ్రేయస్ అయ్యర్ది కీలక పాత్ర. కివీస్ విధించిన 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ శుబ్మన్ గిల్(31), విరాట్ కోహ్లి(1) రూపంలో కీలక వికెట్లు కోల్పోయిన వేళ.. రోహిత్ శర్మ(76)తో కలిసి శ్రేయస్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. మొత్తంగా 62 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 48 పరుగులు సాధించాడు. మిగతా వాళ్లలో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్(33 బంతుల్లో 34 నాటౌట్), హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 18), రవీంద్ర జడేజా(6 బంతుల్లో 9 నాటౌట్) రాణించారు. తద్వారా మరో ఓవర్ మిగిలి ఉండగానే రోహిత్ సేన టార్గెట్ పూర్తి చేసి నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.మాటలకు అందని అనుభూతిఅనంతరం చాంపియన్గా నిలిచిన భారత్కు ట్రోఫీతో పాటు విన్నింగ్స్ మెడల్స్ అందించారు. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘‘ఈ అనుభూతిని మాటల్లో ఎలా వర్ణించాలో తెలియడం లేదు. నేను గెలిచిన మొదటి ఐసీసీ ట్రోఫీ ఇదే. ఈ టోర్నమెంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి ఫైనల్ వరకు మా జట్టు జైత్రయాత్ర అమోఘం.నిజం చెప్పాలంటే.. నేను ఒత్తిడిలోనే మరింత గొప్పగా రాణించగలను. సవాళ్లను ఎదుర్కోవడం నాకు భలే మజాను ఇస్తుంది. ఈ టోర్నమెంట్లో నాకు అద్భుత ఆరంభం లభించింది. దానిని అలాగే కొనసాగించాను. అయితే, భారీ స్కోర్లు సాధించలేకపోయాను. అయినప్పటికీ జట్టు విజయాలకు నా ప్రదర్శన దోహదం చేసింది కాబట్టి ఆనందంగానే ఉన్నాను. ఇంతకంటే సంతృప్తి, సంతోషం మరొకటి ఉండదు’’ అని హర్షం వ్యక్తం చేశాడు.చదవండి: అతడు మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు.. ఓడినా గర్వంగానే ఉంది: కివీస్ కెప్టెన్ -
కోహ్లి, గిల్ కాదు.. అతడే సైలెంట్ హీరో: రోహిత్ శర్మ
భారత క్రికెట్ జట్టు ఏడాది తిరగకముందే మరో ఐసీసీ టైటిల్ను తమ ఖాతాలో వేసుకుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా టీమిండియా నిలిచింది. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత జట్టు.. ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా అవతరించింది. అయితే ఈ మెగా టోర్నీలో భారత తరపున అత్యంత కీలకమైన ప్రదర్శన చేసిన ఆటగాడు ఎవరంటే? కొంతమంది ఫైనల్లో 76 పరుగులు చేసిన రోహిత్ శర్మ పేరు చెబుతుంటే.. మరి కొంతమంది పాక్పై సెంచరీ, సెమీస్లో హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లి పేరు చెబుతున్నారు. వీరిద్దరూ కాకపోతే కేవలం మూడు మ్యాచ్ల్లో 9 వికెట్ల వికెట్లు పడగొట్టిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పేరును ఎంచుకుంటున్నారు.. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం.. మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) అందరికంటే అద్బుతంగా ఆడాడని ప్రశించాడు. అయ్యర్ ఒక సైలెంట్ హీరో అని హిట్మ్యాన్ కొనియాడాడు.సూపర్ శ్రేయస్..అవును.. ఈ మెగా టోర్నీ అసాంతం శ్రేయస్ అయ్యర్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ టోర్నీలో జట్టు కష్టాల్లో ఉన్న ప్రతీసారి అతడు ముందుకు వచ్చి ఆదుకున్నాడు. మిడిలార్డర్లో భారత జట్టు వెన్నెముకగా నిలిచాడు. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లోనూ అయ్యర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మ ఔటయ్యాక అక్షర్ పటేల్తో కలిసి నాలుగో వికెట్కు 61 పరుగుల మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఒకవేళ ఈ భాగస్వామ్యం రాకపోయింటే పరిస్థితి మరో విధంగా ఉండేది. ఓవరాల్గా శ్రేయస్ 5 మ్యాచ్ల్లో 243 పరుగులు చేశాడు. ఈ టోర్నమెంట్లో భారత్ తరపున అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు."శ్రేయస్ అయ్యర్ మాకు సైలెంట్ హీరో. అతడు మిడిలార్డర్లో చాలా కీలకమైన ఆటగాడు. ఈ మ్యాచ్లో నేను ఔటయ్యాక అయ్యర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అక్షర్తో భాగస్వామ్యం నెలకొల్పాడు. ప్రతీ మ్యాచ్లోనూ తన వంతు పాత్ర పోషించాడు. అతడు ఒత్తిడిలో ఇంకా అద్బుతంగా ఆడుతాడని" రోహిత్ శర్మ పేర్కొన్నాడు.అప్పుడు వేటు.. ఇప్పుడు ప్రమోషన్కాగా గతేడాది అయ్యర్ తన కెరీర్లో కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాడు. దేశవాళీ క్రికెట్లో ఆడాలన్న తమ ఆదేశాలను ధిక్కరించడంతో అయ్యర్ను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బీసీసీఐ తప్పించింది. అంతేకాకుండా అతడు జాతీయ జట్టుకు కూడా దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడి పని అయిపోయింది అంతా భావించారు. కానీ అయ్యర్ మాత్రం పడిలేచిన కేరటంలా తిరిగొచ్చాడు.దేశవాళీ క్రికెట్లో అద్బుతమైన ప్రదర్శన కనబరచడంతో అతడిని సెలక్టర్లు తిరిగి జాతీయ జట్టులోకి తీసుకున్నారు. తన రీ ఎంట్రీలో అయ్యర్ దుమ్ములేపుతున్నాడు. ఈ క్రమంలో అతడికి తిరిగి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించుకుంది. త్వరలోనే బీసీసీఐ అధికారికంగా ప్రకటించనుంది.చదవండి: ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్.. ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే? -
టీమిండియాకు అసలుసిసలైన మొనగాడు
-
'రోహిత్, కోహ్లి కాదు.. ఫైనల్లో అతడే గేమ్ ఛేంజర్'
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్ను ముద్దాడేందుకు టీమిండియా అడుగుదూరంలో నిలిచింది. దుబాయ్ వేదికగా ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్తో భారత్ తాడోపేడో తెల్చుకోనుంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో తుది మెట్టుపై బోల్తా పడిన భారత జట్టు.. ఈసారి మాత్రం ఎలాగైనా విజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది. అందుకు తగ్గట్టు ఫైనల్ మ్యాచ్ కోసం రోహిత్ సేన ప్రత్యేక వ్యూహాలను రచిస్తోంది. హెడ్కోచ్ గౌతం గంభీర్ నేతృత్వంలో భారత జట్టు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ సైతం ఛాంపియన్స్ ట్రోఫీ-2000 ఫైనల్ ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది.2000లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కివీస్ చేతిలో మెన్ ఇన్ బ్లూ ఓటమి చవిచూసింది. అయితే అప్పటికంటే ఇప్పుడు భారత జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా కన్పిస్తోంది. టీమిండియాను ఓడించడం అంత సులువు కాదు. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ సబా కరీం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు."ఛాంపియన్స్ ట్రోఫీ-2025ను గెలుచుకునేందుకు భారత్కు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. ప్రస్తుత భారత జట్టులో అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన తర్వాత మరోసారి 2017లో భారత్కు టైటిల్ను సొంతం చేసుకునే అవకాశం లభించింది. కానీ ఆ ఎడిషన్లో భారత్ తుది మెట్టుపై బోల్తా పడింది.కానీ ఈసారి మాత్రం టీమిండియా వద్ద అద్బుతమైన స్పిన్నర్లు ఉన్నారు. ఈ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టుకు శ్రేయస్ అయ్యర్ కీలకంగా మారనున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు ఎక్స్ ఫ్యాక్టర్లగా మారుతారని నేను అనుకోవడం లేదు. వారిద్దరూ అనుభవజ్ఞులైన ఆటగాళ్లు అయినప్పటికి.. న్యూజిలాండ్ బౌలర్ల ముందు కాస్త బలహీనంగా కన్పించే ఛాన్స్ ఉంది. అయితే ఈ సీనియర్ ద్వయం నుంచి ఫైటింగ్ నాక్స్ ఆశించవచ్చు.ప్రస్తుత జట్టుపై మాత్రం నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇంగ్లండ్ను 3-0 తేడాతో ఓడించి ఈ మెగా టోర్నీలో అడుగుపెట్టారు. ఇక్కడ కూడా గ్రూపు మ్యాచ్లన్నీ గెలిచి.. ఆ తర్వాత సెమీస్లో ఆస్ట్రేలియాపై విజయం సాధించి ఫైనల్కు చేరుకున్నారు. రోహిత్ శర్మ అండ్ కో మంచి రిథమ్లో కన్పిస్తున్నారు.అయితే బ్లాక్ క్యాప్స్ను ఓడించడం అంత సలువు కాదు. గతంలో చాలా టోర్నమెంట్లలో చివరవరకు వచ్చి ఓటములను ఎదుర్కొన్నారు. అయితే ఐసీసీ టోర్నీల్లో మాత్రం భారత్పై వారికి మంచి రికార్డు ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయమని" స్టార్స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరీం పేర్కొన్నాడు.చదవండి: పాతికేళ్ల పరాజయానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా? -
Champions Trophy 2025: శ్రేయస్ అయ్యర్కు ప్రమోషన్
టీమిండియా స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు ప్రమోషన్ లభించనుందని తెలుస్తుంది. శ్రేయస్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ను తిరిగి దక్కించుకోనున్నాడని సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో అద్భుత ప్రదర్శనల తర్వాత బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. శ్రేయస్ గతేడాది మార్చిలో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ను కోల్పోయాడు. 2023 వన్డే వరల్డ్కప్లో అంచనాలకు మించి రాణించినప్పటికీ బీసీసీఐ అతని కాంట్రాక్ట్ను పునరుద్దరించలేదు. గత మార్చిలో శ్రేయస్తో పాటు ఇషాన్ కిషన్ కూడా బీసీసీఐ కాంట్రాక్ట్ను కోల్పోయాడు.శ్రేయస్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయాక టీమిండియాలో స్థానాన్ని కూడా చేజార్చుకున్నాడు. అయితే దేశవాలీ టోర్నీల్లో అద్భుతంగా రాణించి గోడకు కొట్టిన బంతిలా తిరిగి జట్టులో చోటు సంపాదించాడు. రీఎంట్రీలో శ్రేయస్ మరింత రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో 4 మ్యాచ్లు ఆడి 79.92 స్ట్రయిక్రేట్తో 195 పరుగులు చేశాడు. శ్రేయస్ ప్రదర్శనల ఆధారంగా టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో అజేయంగా ఫైనల్కు చేరింది.ఈ టోర్నీలో శ్రేయస్ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అత్యంత కీలకమైన ఇన్నింగ్స్లు ఆడాడు. మొదటి బ్యాటింగ్తో పాటు ఛేదనలోనూ సత్తా చాటాడు. బంగ్లాదేశ్తో జరిగిన తొలి మ్యాచ్లో నిరాశపరిచిన (17 బంతుల్లో 15) శ్రేయస్.. ఆతర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీతో (67 బంతుల్లో 56) మెరిశాడు. చివరి గ్రూప్ మ్యాచ్లో న్యూజిలాండ్పై మరో హాఫ్ సెంచరీ చేసిన శ్రేయస్.. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో విరాట్ కోహ్లితో కలిసి కీలక ఇన్నింగ్స్ (45) ఆడి భారత విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనల తర్వాత శ్రేయస్కు ఎందుకు సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వకూడదని చర్చ మొదలైంది. దీంతో బీసీసీఐ శ్రేయస్కు తిరిగి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చి గౌరవించుకోవాలని భావిస్తుంది. బీసీసీఐ మరికొద్ది రోజుల్లో అధికారికంగా సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించనుంది. సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలోకి కొత్తగా వరుణ్ చక్రవర్తి వచ్చే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే. సెమీస్లో ఆసీస్ను మట్టికరిపించిన భారత్ తుది సమరానికి అర్హత సాధించింది. మరోవైపు న్యూజిలాండ్ సెమీస్లో సౌతాఫ్రికాను చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది. భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ ఈనెల 9వ తేదీన దుబాయ్ వేదికగా జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది.ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తలపడటం ఇది రెండో సారి. 2000 ఎడిషన్లో ఇరు జట్లు ఎదురెదురుపడగా.. న్యూజిలాండ్ భారత్ను ఓడించి తమ తొలి ఐసీసీ టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ ఇరు జట్లు ఇనాగురల్ డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ (2019-2021) తలపడ్డాయి. ఈసారి కూడా న్యూజిలాండ్ భారత్ను ఓడించి తమ రెండో ఐసీసీ టైటిల్ను ఎగరేసుకుపోయింది. న్యూజిలాండ్, తమ రెండు ఐసీసీ టైటిళ్లను భారత్పైనే గెలవడం విశేషం. -
‘ఆ ఇద్దరు రాణిస్తే ట్రోఫీ మనదే.. కివీస్ ప్రధాన టార్గెట్ అతడే’
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)ఫైనల్లో టీమిండియా- న్యూజిలాండ్(India vs New Zealand) అమీతుమీ తేల్చుకోనున్నాయి. పాతికేళ్ల తర్వాత మరోసారి ఈ రెండు జట్లు ఈ మెగా వన్డే టోర్నీ టైటిల్ పోరులో తలపడనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. నాడు కివీస్ టీమిండియాపై పైచేయి సాధించి ఐసీసీ నాకౌట్ ట్రోఫీ గెలవగా.. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం అన్ని విభాగాల్లోనూ భారత్ పటిష్టంగా కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో ఈసారి ఫైనల్ మామూలుగా ఉండబోదని ఇరుజట్ల అభిమానులు ఈ రసవత్తర పోరు కోసం ఎదురుచూస్తున్నారు. దుబాయ్ వేదికగా ఆదివారం భారత్- కివీస్ తలపడబోతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఎక్స్’ ఫ్యాక్టర్ అతడేటైటిల్ సమరంలో టీమిండియా తరఫున మిడిలార్డర్ శ్రేయస్ అయ్యర్ ‘ఎక్స్’ ఫ్యాక్టర్ అవుతాడని అంచనా వేసిన ఈ మాజీ ఓపెనర్.. శుబ్మన్ గిల్ కూడా కీలకం కాబోతున్నాడని పేర్కొన్నాడు. ఏదేమైనా ఈసారి కివీస్ బౌలర్లు ప్రధానంగా శ్రేయస్ అయ్యర్నే టార్గెట్ చేస్తారని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘న్యూజిలాండ్పై వన్డేల్లో శ్రేయస్ అయ్యర్ ఒక్కసారి మాత్రమే 30 కంటే తక్కువ పరుగులు చేశాడనుకుంటా. అదొక్కటి మినహా ప్రతిసారీ అతడు కివీస్పై బాగానే రన్స్ రాబట్టాడు. కాబట్టి ఈసారి అతడినే ఎక్కువగా టార్గెట్ చేస్తారనిపిస్తోంది.మిడిల్ ఓవర్లలో వాళ్లు బాగా బౌలింగ్ చేస్తున్నారు. మిచెల్ సాంట్నర్, బ్రాస్వెల్ లేదంటే రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్.. ఈ నలుగురే ఎక్కువగా బరిలోకి దిగవచ్చు. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ స్పిన్ బాగా ఆడతాడు కదా! అందుకే అతడిని త్వరగా పెవిలియన్కు పంపేందుకు ఈ స్పిన్ బౌలర్లు ప్రయత్నిస్తారు. అతడిపైనే దృష్టి పెడతారు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.కివీస్తో ఆటంటే శ్రేయస్కు మజాకాగా న్యూజిలాండ్తో వన్డేల్లో ఇప్పటి వరకు ఎనిమిది ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్.. సగటున 70.38తో 563 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. ఇక కివీస్పై శ్రేయస్ అత్యల్ప స్కోరు 33. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా పైవిధంగా స్పందించాడు.ఇక ఓపెనింగ్ బ్యాటర్ శుబ్మన్ గిల్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘బంగ్లాదేశ్పై సెంచరీ చేయడం ద్వారా ఈ ఐసీసీ టోర్నీలో గిల్ బిగ్బ్యాంగ్తో ముందుకు వచ్చాడు. పాకిస్తాన్పై కూడా మెరుగ్గా ఆడాడు. అయితే, ఆ తర్వాత అతడు కాస్త వెనుకబడ్డాడు. ఫైనల్లో బ్యాట్ ఝులిపిస్తేనే జట్టుకు, అతడికి ప్రయోజనకరంగా ఉంటుంది. మరో విరాట్ కావాలంటే గిల్ ఫైనల్లో తన ముద్రను వేయాలి. శ్రేయస్ అయ్యర్, శుబ్మన్ గిల్ గనుక రాణిస్తే చాంపియన్స్ ట్రోఫీ మనదే అని రాసిపెట్టుకోవచ్చు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. డబుల్ సెంచరీ వీరుడుకాగా కివీస్పై గిల్కు కూడా గొప్ప రికార్డు ఉంది. ఇప్పటి వరకు కివీస్పై పదకొండు ఇన్నింగ్స్లో అతడు 592 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు ఉండగా.. హైదరాబాద్లో 2023లో డబుల్ సెంచరీ(208) కూడా కివీస్పైనే సాధించాడు. చదవండి: కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్బై? ఆటగాడిగా కొనసాగింపు? బీసీసీఐ నిర్ణయం? -
ఐటం సాంగ్తో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన శ్రేయస్ అయ్యర్ సోదరి (ఫోటోలు)
-
సూపర్ ఫామ్లో టీమిండియా స్టార్.. ‘ఐటం సాంగ్’తో సోదరి బాలీవుడ్ ఎంట్రీ
టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నాడు. దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపిన ఈ ముంబై బ్యాటర్.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో అదే జోరును కొనసాగిస్తున్నాడు. విలువైన ఇన్నింగ్స్ ఆడుతూ భారత్ ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు.ఈ వన్డే టోర్నమెంట్లో భాగంగా తొలుత బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ కాస్త నిరాశపరిచాడు. కేవలం 15 పరుగులే చేసి నిష్క్రమించాడు. అయితే, సెమీస్ చేరాలంటే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో కీలకమైన మ్యాచ్లో మాత్రం హాఫ్ సెంచరీతో మెరిశాడు. 67 బంతుల్లో 56 పరుగులు చేసి విరాట్ కోహ్లి(100 నాటౌట్) మంచి భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గెలిపించడంలో భాగమయ్యాడు.ఆకాశమే హద్దుగాఆ తర్వాత గ్రూప్ దశలో ఆఖరుగా న్యూజిలాండ్తో మ్యాచ్లో అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 98 బంతులు ఎదుర్కొని 79 పరుగులతో టీమిండియా ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్లోనూ శ్రేయస్ అయ్యర్ రాణించాడు. జట్టు విజయానికి పునాది వేసే క్రమంలో 45 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో జయభేరి మోగించిన టీమిండియా ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే.‘ఐటం’ సాంగ్తో బాలీవుడ్లో ఎంట్రీఇదిలా ఉంటే.. భారత్- ఆసీస్ మధ్య మ్యాచ్ చూసేందుకు శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ట అయ్యర్(Shresta Iyer) కూడా దుబాయ్ స్టేడియానికి వచ్చింది. తన తమ్ముడిని ఉత్సాహపరుస్తూ కెమెరాల దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో శ్రేష్టకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. కొరియోగ్రాఫర్, ప్రొఫెషనల్ డాన్సర్ అయిన శ్రేష్ట.. ఓ ‘ఐటం’ సాంగ్తో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది.ఒకరేమో టీమిండియా స్టార్.. మరొకరు బాలీవుడ్ స్టార్‘సర్కారీ బచ్చా’ అనే సినిమాలో ‘అగ్రిమెంట్ కర్లే’ అంటూ సాగే పాటకు జోష్గా స్టెప్పులేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘ఒకరేమో టీమిండియా స్టార్.. మరొకరు బాలీవుడ్ స్టార్’’ అంటూ అక్కాతమ్ముళ్ల ప్రతిభను మెచ్చుకుంటున్నారు. ఇక ఆసీస్పై భారత్ విజయానంతరం శ్రేష్ట మ్యాచ్ వీక్షిస్తున్న ఫొటోలతో పాటు.. సెలబ్రిటీలతో దిగిన ఫొటోలను ఇన్స్టా స్టోరీలో షేర్ చేసింది.కాగా ముంబైలో 1994లో జన్మించిన శ్రేయస్ అయ్యర్ 2017లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 14 టెస్టులు, 68 వన్డేలు, 51 టీ20లు ఆడి ఆయా ఫార్మాట్లలో 811, 2752, 1104 పరుగులు సాధించాడు. మరోవైపు.. శ్రేయస్ అక్క శ్రేష్ట అయ్యర్ 1990లో జన్మించింది. వీరి తండ్రి సంతోష్ అయ్యర్- కేరళకు చెందినవారు కాగా.. తల్లి రోహిణి అయ్యర్ స్వస్థలం మంగళూరు. వీరు ముంబైలో స్థిరపడ్డారు. ఇక అక్కాతమ్ముళ్లు శ్రేష్ట- శ్రేయస్లకు ఒకరంటే మరొకరి ఎనలేని ప్రేమ. సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని ఇద్దరూ బయటపెడుతుంటారు. చదవండి: శుబ్మన్ గిల్ చేసిన ‘తప్పు’..! టీమిండియాకు శాపమయ్యేది! ఎందుకంటే.. View this post on Instagram A post shared by Panorama Music (@panoramamusic) -
మాపై ఒత్తిడి లేదు.. ఇది సాధారణ మ్యాచ్ మాత్రమే: శ్రేయస్ అయ్యర్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో దుమ్ములేపుతున్న భారత జట్టు మరో కీలక సమరానికి సిద్దమైంది. ఈ మెగా టోర్నీ తొలి సెమీఫైనల్లో దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా తాడోపేడో తెల్చుకోనుంది. ఐసీసీ టోర్నీల్లో తమకు కొరకరాని కొయ్యగా మారిన ఆస్ట్రేలియాను ఈసారి ఎలాగైనా ఓడించి ముందుకు వెళ్లాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది.డబ్ల్యూటీసీ ఫైనల్-2023 ఫైనల్తో పాటు అదే ఏడాది జరిగిన వన్డే వరల్డ్కప్ ఫైనల్లోనూ భారత్ను ఆసీస్ ఓడించింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్లో ఆసీస్ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు. టీమిండియా ప్రస్తుతం అన్ని విభాగాల్లో పటిష్టం కన్పిస్తోంది. లీగ్ స్టేజిలో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ భారత్ అద్భుత ప్రదర్శనతో విజయ భేరి మోగించింది.అదే జోరును సెమీస్లోనూ కొనసాగించాలని టీమిండియా భావిస్తోంది. ఈ క్రమంలో ఆసీస్తో మ్యాచ్కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. అదేవిధంగా గతేడాదిగా తాను ఎదుర్కొన్న గడ్డు పరిస్థితుల గురుంచి కూడా అయ్యర్ మా"కష్టం కాలం ఎప్పుడూ శాశ్వతంగా ఉండదు. నాలాంటి వాడికి ఇటువంటి కఠిన దశలను ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు. కష్ట కాలంలో మనల్ని ఎవరూ ఆదుకోరు. అటువంటి సమయాల్లో మనల్ని మనం నమ్ముకుంటే ఫలితం ఉంటుంది. ఎవరిపైనా ఆధారపడకుండా ఎలా నడుచుకోవాలో గతేడాది కాలం నాకు నేర్పించింది. ఇక సెమీస్ ఫైనల్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను. మాపై ఎటువంటి ఒత్తడి లేదు. ఇది ఒక సాధరణ మ్యాచ్ మాత్రమే. ఈ మ్యాచ్లో గెలవాలనే కోరిక మరింత రెట్టింపు అయింది" అంటూ బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అయ్యర్ పేర్కొన్నాడు. కాగా దేశీవాళీ క్రికెట్లో ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించడంతో అయ్యర్ తన సెంట్రల్ కాంట్రాక్ట్ను కోల్పోయాడు.అయితే ఆ తర్వాత తన మనసు మార్చకుని రంజీల్లో ఆడడంతో అయ్యర్ తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు. తన పునరాగమనంలో అయ్యర్ దుమ్ములేపుతున్నాడు. ఈ మెగా టోర్నీలో మూడు మ్యాచ్ల్లో రెండు హాఫ్ సెంచరీలు శ్రేయస్ సాధించాడు.చదవండి: అతడితో మనకు తల నొప్పి.. తొందరగా ఔట్ చేయండి: భారత మాజీ క్రికెటర్ -
IPL 2025: కొత్త కెప్టెన్ పేరును ప్రకటించిన కేకేఆర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ఫ్రాంఛైజీ కోల్కతా నైట్ రైడర్స్ కీలక ప్రకటన చేసింది. తమ కొత్త కెప్టెన్గా టీమిండియా వెటరన్ క్రికెటర్ అజింక్య రహానే(Ajinkya Rahane)ను నియమించినట్లు సోమవారం ప్రకటించింది. అదే విధంగా.. వెంకటేశ్ అయ్యర్(Venkatesh Iyer)కు కూడా కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలిపింది.‘‘అజింక్య రహానే వంటి ఆటగాడు.. తన అనుభవం, పరిణతితో గొప్ప నాయకుడు అవుతాడని చెప్పేందుకు మేము సంతోషిస్తున్నాం. ఇక వెంకటేశ్ అయ్యర్ కూడా కేకేఆర్ నాయకత్వ విభాగంలో భాగంగా ఉంటాడు. వీరిద్దరు కలిసి కేకేఆర్ మరోసారి చాంపియన్గా నిలిచేందుకు.. టైటిల్ నిలబెట్టుకునేందుకు సహకారం అందిస్తారని పూర్తిగా విశ్వసిస్తున్నాం’’ అని కోల్కతా ఫ్రాంఛైజీ తమ ప్రకటనలో పేర్కొంది. కాగా ఐపీఎల్-2025లో కేకేఆర్కు రహానే కెప్టెన్గా వ్యవహరించనుండగా.. వైస్ కెప్టెన్గా వెంకటేశ్ అయ్యర్ సేవలు అందించనున్నాడు.గతేడాది శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోకాగా గౌతం గంభీర్ కెప్టెన్సీలో 2012, 2014లో చాంపియన్గా నిలిచిన కోల్కతా జట్టు.. పదేళ్ల తర్వాత గతేడాది మరోసారి ట్రోఫీని ముద్దాడిన విషయం తెలిసిందే. టీమిండియా మిడిలార్డర్ స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో కేకేఆర్ పద్నాలుగింట తొమ్మిది మ్యాచ్లు గెలిచి ప్లేఆఫ్స్ చేరింది.క్వాలిఫైయర్-1లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును ఓడించి ఫైనల్ చేరుకున్న కోల్కతా.. ఫైనల్లోనూ ఇదే ఫలితం పునరావృతం చేసింది. ప్యాట్ కమిన్స్ బృందాన్ని ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి విజేతగా అవతరించింది. ఈ మ్యాచ్లో వెంకటేశ్ అయ్యర్(26 బంతుల్లో 52 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడి మరో 57 బంతులు మిగిలి ఉండగానే జట్టు విజయాన్ని ఖరారుచేశాడు.విన్నింగ్ కెప్టెన్ను కోల్పోయిఅయితే, ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు శ్రేయస్ అయ్యర్తో పాటు వెంకటేశ్ అయ్యర్ కేకేఆర్ ఫ్రాంఛేజీని వీడగా.. వెంకటేశ్ను కోల్కతా మళ్లీ భారీ ధర పెట్టి దక్కించుకుంది. అతడి కోసం ఏకంగా రూ. 23.75 కోట్లు ఖర్చు చేసింది. అయితే, శ్రేయస్ అయ్యర్ను పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేయడంతో కేకేఆర్ తమ విన్నింగ్ కెప్టెన్ను కోల్పోయింది. ఇదిలా ఉంటే.. రూ. 1.50 కోట్లతో అజింక్య రహానేను కొనుక్కున్న కేకేఆర్ అతడిని సారథిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా టీమిండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్గా పనిచేసిన రహానే.. దేశవాళీ క్రికెట్లో ముంబైకి విజయవంతమైన కెప్టెన్గా కొనసాగుతున్నాడు.ఇక ఐపీఎల్లో ఇప్పటి వరకు 185 మ్యాచ్లు ఆడిన రహానే రెండు శతకాల సాయంతో 4642 పరుగులు చేశాడు. మరోవైపు.. వెంకటేశ్ అయ్యర్ 50 మ్యాచ్లలో 1326 రన్స్ సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, 11 అర్థ శతకాలు ఉన్నాయి.ఐపీఎల్-2025లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు, ఏ ఆటగాడు ఎంత ధరపలికాడంటే..రింకూ సింగ్ (రూ. 13 కోట్లు) సునిల్ నరైన్ (రూ. 12 కోట్లు) ఆండ్రీ రసెల్ (రూ. 12 కోట్లు) వరుణ్ చక్రవర్తి (రూ. 12 కోట్లు) హర్షిత్ రాణా (రూ. 4 కోట్లు) రమణ్దీప్ సింగ్ (రూ.4 కోట్లు) వెంకటేశ్ అయ్యర్ (రూ.23.75 కోట్లు) ఆన్రిచ్ నోర్జే (రూ.6.50 కోట్లు) క్వింటన్ డికాక్ (రూ.3.60 కోట్లు) అంగ్కృష్ రఘువన్షీ(రూ.3 కోట్లు) స్పెన్సర్ జాన్సన్ (రూ. 2.80 కోట్లు) రహ్మనుల్లా గుర్బాజ్ (రూ.2 కోట్లు) మొయిన్ అలీ (రూ. 2 కోట్లు) వైభవ్ అరోరా (రూ.1.80 కోట్లు) రోవ్మన్ పావెల్ (రూ.1.50 కోట్లు) అజింక్య రహానే (రూ. 1.50 కోట్లు) మనీశ్ పాండే (రూ. 75 లక్షలు) ఉమ్రన్ మాలిక్ (రూ. 75 లక్షలు) అనుకూల్ రాయ్ (రూ. 40 లక్షలు) మయాంక్ మర్కండే (రూ. 30 లక్షలు) లవ్నిత్ సిసోడియా (రూ. 30 లక్షలు) చదవండి: BCCI: ‘రోహిత్ లావుగా ఉన్నాడు.. కెప్టెన్గానూ గొప్పోడు కాదు ’.. స్పందించిన బీసీసీఐ -
కుప్పకూలిన న్యూజిలాండ్..44 పరుగులతో టీమిండియా గెలుపు (ఫొటోలు)
-
ఐదో స్థానానికి ఎగబాకిన విరాట్.. టాప్-10లో నలుగురు టీమిండియా బ్యాటర్లు
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో (ICC ODI Rankings) భారత బ్యాటర్ల హవా కొనసాగింది. టాప్-10లో ఏకంగా నలుగురు భారత బ్యాటర్లు చోటు దక్కించుకున్నారు. శుభ్మన్ గిల్ (Shubman Gill) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. రోహిత్ (Rohit Sharma) మూడు, విరాట్ (virat Kohli) ఐదు, శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తొమ్మిది స్థానాల్లో ఉన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్పై సెంచరీ చేయడంతో విరాట్ ఓ స్థానాన్ని మెరుగుపర్చుకుని ఐదో స్థానానికి చేరాడు. తాజా ర్యాంకింగ్స్లో ఛాంపియన్స్ ట్రోఫీ సెంచరీ హీరోలు గణనీయంగా లబ్ది పొందారు. విల్ యంగ్ 8 స్థానాలు మెరుగుపర్చుకుని 14వ స్థానానికి.. బెన్ డకెట్ 27 స్థానాలు మెరుగుపర్చుకుని 17వ స్థానానికి.. రచిన్ రవీంద్ర 18 స్థానాలు మెరుగుపర్చుకుని 24వ స్థానానికి.. టామ్ లాథమ్ 11 స్థానాలు మెరుగుపర్చుకుని 31వ స్థానానికి.. జోస్ ఇంగ్లిస్ 18 స్థానాలు మెరుగుపర్చుకుని 88వ స్థానానికి చేరారు. టాప్-10లో భారత బ్యాటర్లతో పాటు బాబర్ ఆజమ్ (2), హెన్రిచ్ క్లాసెన్ (4), డారిల్ మిచెల్ (6), హ్యారీ టెక్టార్ (7), చరిత్ అసలంక (8), షాయ్ హోప్ (10) ఉన్నారు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టాప్-10లో కుల్దీప్ (3వ స్థానం) మినహా భారత్కు ప్రాతినిథ్యం లేదు. లంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ టాప్లో కొనసాగుతుండగా.. రషీద్ ఖాన్ రెండో స్థానంలో ఉన్నాడు. కేశవ్ మహారాజ్, బెర్నాల్డ్ స్కోల్జ్, మ్యాట్ హెన్రీ, మిచెల్ సాంట్నర్, గుడకేశ్ మోటీ, షాహీన్ అఫ్రిది, ఆడమ్ జంపా టాప్-10లో ఉన్నారు. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టాప్-10లో ఎలాంటి మార్పులు లేవు. మొహమ్మద్ నబీ, సికందర్ రజా, అజ్మతుల్లా ఒమర్జాయ్, మెహిది హసన్ మిరాజ్, రషీద్ ఖాన్, మిచెల్ సాంట్నర్, మ్యాక్స్వెల్, బ్రాండన్ మెక్ముల్లెన్, రవీంద్ర జడేజా, గెర్హార్డ్ ఎరాస్మస్ టాప్-10లో కొనసాగుతున్నారు. ఈ వారం ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో ఒకే ఒక చెప్పుకోదగ్గ మార్పు జరిగింది. న్యూజిలాండ్ ఆటగాడు మైఖేల్ బ్రేస్వెల్ ఏకంగా 26 స్థానాలు మెరుగుపర్చుకుని 11వ స్థానానికి చేరాడు.జట్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా ఎవరికీ అందనంత ఎత్తులో టాప్ ప్లేస్లో కొనసాగుతుంది. ఆసీస్, పాకిస్తాన్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్ ఆతర్వాతి స్థానాల్లో నిలిచాయి. -
IPL 2025: కేకేఆర్ కెప్టెన్గా నేను రెడీ!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)-2025 మెగా వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్ల జాబితాలో వెంకటేశ్ అయ్యర్(Venkatesh Iyer) మూడో స్థానంలో ఉన్నాడు. కోల్కతా నైట్ రైడర్స్(KKR) తరఫున గతేడాది రాణించిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్ను.. వేలంపాటకు ముందు ఫ్రాంఛైజీ వదిలేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో రూ. 2 కోట్ల కనీస ధరతో ఆక్షన్లోకి వచ్చిన అతడి కోసం కేకేఆర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పోటీపడ్డాయి.ఈ క్రమంలో ఏకంగా రూ. 23.75 కోట్లకు కోల్కతా వెంకటేశ్ అయ్యర్ను తమ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో కేకేఆర్ కెప్టెన్సీ రేసులో ఈ మధ్యప్రదేశ్ క్రికెటర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్కు పగ్గాలు అప్పగించేందుకు యాజమాన్యం సుముఖంగా ఉందనే వార్తలు వస్తున్నాయి.కెప్టెన్ అనే ట్యాగ్ అవసరం లేదుఈ విషయంపై వెంకటేశ్ అయ్యర్ స్వయంగా స్పందించాడు. నాయకుడిగా బాధ్యతలు నిర్వర్తించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ మనసులోని మాటను వెల్లడించాడు. కెప్టెన్గా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘కచ్చితంగా.. నేను వందశాతం సిద్ధంగా ఉన్నాను. నిజానికి కెప్టెన్సీ అనేది ఒక ట్యాగ్ మాత్రమే.నాయకుడిగా ఉండటం అనేది మాత్రం గొప్ప విషయం. డ్రెసింగ్రూమ్లో లీడర్ ఉండాలంటే కెప్టెన్ అనే ట్యాగ్ అవసరం లేదని నేను నమ్ముతాను. మన ప్రదర్శనతో సహచర ఆటగాళ్లకు స్ఫూర్తినివ్వాలి. మైదానం లోపలా, వెలుపలా రోల్ మోడల్లా ఉండాలి. మధ్యప్రదేశ్ జట్టులో నేను ప్రస్తుతం అదే పాత్ర పోషిస్తున్నాను.గళం విప్పే స్వేచ్ఛ ఉన్నపుడేమధ్యప్రదేశ్ జట్టుకు నేనేమీ కెప్టెన్ను కాదు. అయితే, నా అభిప్రాయాలకు, సూచనలకు అక్కడి నాయకత్వం విలువనిస్తుంది. నాకు అలాంటి వాతావరణం అంటే చాలా ఇష్టం. మనం జట్టులోకి కొత్తగా వచ్చామా.. మనల్ని వాళ్లు రూ. 20 లక్షలు లేదంటే రూ. 20 కోట్లు పెట్టి కొనుగోలు చేశారా అన్నది ముఖ్యం కాదు.. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా మన గళం విప్పే స్వేచ్ఛ ఉన్నపుడే అంతా బాగుంటుంది’’ అని వెంకటేశ్ అయ్యర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో చెప్పుకొచ్చాడు.కాగా ఐపీఎల్-2021 సీజన్లో కేకేఆర్ తరఫున క్యాష్ రిచ్ లీగ్లో ఎంట్రీ ఇచ్చాడు వెంకటేశ్ అయ్యర్. మొదట కేకేఆర్ అతడిన రూ.20లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. అయితే, ఆ ఎడిషన్లో అద్బుతంగా రాణించడంతో 2022 వేలానికి ముందు రూ. 8 కోట్లకు అయ్యర్ను రిటైన్ చేసుకుంది. ఆ తర్వాత మరో రెండేళ్ల పాటు తమ జట్టుకే ప్రాతినిథ్యం వహించిన వెంకటేష్ను ఐపీఎల్-2025 వేలంలోకి విడిచిపెట్టి.. భారీ ధరకు తిరిగి జట్టులో చేర్చుకుంది. కాగా ఐపీఎల్లో వెంకటేష్ ఇప్పటివరకు ఆడిన 50 మ్యాచ్లలో 1326 పరుగులు చేశాడు.శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోఇదిలా ఉంటే.. గతేడాది శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో కేకేఆర్ చాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, వేలానికి ముందు అతడు జట్టును వీడగా.. పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ. 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. దీంతో కేకేఆర్ కెప్టెన్సీ పోస్టు ఖాళీ కాగా.. వెంకటేశ్ అయ్యర్తో పాటు అజింక్య రహానే కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మార్చి 22న ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్- ఆర్సీబీ మధ్య మ్యాచ్తో ఐపీఎల్-2025 సీజన్కు తెరలేవనుంది. చదవండి: Ind vs NZ: ‘కివీస్తో మ్యాచ్లో అతడికి విశ్రాంతి ఇవ్వండి’ -
‘పాకిస్తాన్లో గెలిచి ఉంటే బాగుండేది’.. ఇచ్చిపడేసిన శ్రేయస్ అయ్యర్
టీమిండియా విజయాన్ని తక్కువ చేసేలా మాట్లాడిన పాకిస్తాన్ జర్నలిస్టుకు శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) గట్టి కౌంటర్ ఇచ్చాడు. వేదిక ఏదైనా పాక్పై గెలుపు తమకు ఎల్లప్పుడూ మధురంగానే ఉంటుందని.. ఆదివారం నాటి మ్యాచ్లో తనకు మజా వచ్చిందంటూ అతడికి తమ జట్టు ఓటమిని గుర్తు చేశాడు.కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ఆతిథ్య హక్కులను డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) నిరాకరించగా.. ఐసీసీ జోక్యంతో హైబ్రిడ్ విధానంలో టోర్నీ జరుగుతోంది. తటస్థ వేదికైన దుబాయ్లో భారత జట్టు తమ మ్యాచ్లు ఆడుతోంది.42.3 ఓవర్లలోనే..ఇందులో భాగంగా తొలుత బంగ్లాదేశ్ను ఓడించిన రోహిత్ సేన.. తాజా మ్యాచ్లో పాకిస్తాన్ను చిత్తు చేసి సెమీస్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్ పాక్ను 241 పరుగులకు కట్టడి చేసింది. ఇక 42.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి పాక్పై గెలుపొందింది.ఈ విజయంలో విరాట్ కోహ్లి(100 నాటౌట్)తో పాటు శుబ్మన్ గిల్(46), శ్రేయస్ అయ్యర్(56)లది కూడా కీలక పాత్ర. ఈ నేపథ్యంలో విజయానంతరం శ్రేయస్ మీడియా సమావేశంలో మాట్లాడగా.. ఓ పాకిస్తానీ జర్నలిస్టు.. దుబాయ్లో గాకుండా పాకిస్తాన్లో పాకిస్తాన్ను ఓడించి ఉంటే ఇంకా బాగుండేది కదా అని ప్రశ్నించాడు.ఇరుజట్లకు తటస్థ వేదికే..సదరు జర్నలిస్టు మాటల్లోని వ్యంగ్యాన్ని అర్థం చేసుకున్న శ్రేయస్ అయ్యర్ హుందాగానే కౌంటర్ వేశాడు. ‘‘పాకిస్తాన్లో నేను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కాబట్టి అక్కడ గెలిస్తే ఆ అనుభూతి ఎలా ఉంటుందో నాకు తెలియదు. అయితే, దుబాయ్ అనేది ఇరుజట్లకు తటస్థ వేదికే.ఇక భారత్- పాక్ మ్యాచ్ అంటే అంచనాలు భారీగానే ఉంటాయి. అయినా మేము దుబాయ్లో ఎక్కువగా మ్యాచ్లు ఆడలేదు. ఏదైతేనేం ఈ మ్యాచ్లో పాకిస్తాన్ను ఓడించాము కదా. అదే ఓ మధురానుభూతి. బయట నుంచి వచ్చే ఒత్తిడిని అధిగమించి మరీ మా పని పూర్తి చేశాం.నేనైతే ఈ విజయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నా. పాకిస్తాన్పై ఇది నాకు మూడో మ్యాచ్. ఇందులో గెలవడం ఎంతో మజాన్నిచ్చింది’’ అని శ్రేయస్ అయ్యర్ సమాధానమిచ్చాడు. సొంతగడ్డపై పాక్ బలమైన జట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ దేశ జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలను తన మాటలతో ఇలా తిప్పికొట్టాడు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025: టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ స్కోర్లు👉వేదిక: దుబాయ్👉టాస్: పాకిస్తాన్.. తొలుత బ్యాటింగ్👉పాకిస్తాన్ స్కోరు- 241(49.4) ఆలౌట్👉భారత్ స్కోరు- 244/4 (42.3)👉ఫలితం: పాక్ను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: విరాట్ కోహ్లి(100 పరుగులు నాటౌట్).చదవండి: Virat Kohli: ఇదేం తీరు కోహ్లి? ఇలాంటివి అవసరమా?.. మండిపడ్డ గావస్కర్ -
ఇదేం తీరు కోహ్లి? ఇలాంటివి అవసరమా?.. మండిపడ్డ గావస్కర్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) తీరుపై భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్(Sunil Gavaskar) అసహనం వ్యక్తం చేశాడు. పాకిస్తాన్(India vs Pakistan)తో మ్యాచ్లో అనవసర చర్య ద్వారా వికెట్ కోల్పోయే ప్రమాదం తెచ్చుకున్నాడని.. అయితే, అదృష్టవశాత్తూ బయటపడటంతో తాము ఊపిరి పీల్చుకున్నామన్నాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా భారత్ ఆదివారం పాకిస్తాన్తో తలపడింది.దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడిన రోహిత్ సేన తొలుత ఫీల్డింగ్ చేసింది. బౌలర్ల విజృంభణ కారణంగా దాయాదిని 241 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనను దూకుడుగా ఆరంభించిన టీమిండియా.. మిడిల్ ఓవర్లలో మాత్రం ఆచితూచి నిలకడగా ఆడింది. సెంచరీ మార్కు.. విన్నింగ్ షాట్ముఖ్యంగా ఓపెనర్ శుబ్మన్ గిల్(46), నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(56)లతో కలిసి విరాట్ కోహ్లి అద్భుత భాగస్వామ్యాలు నెలకొల్పాడు.ఏ దశలో నిర్లక్ష్యపు షాట్లకు యత్నించకుండా.. సహచర బ్యాటర్లతో చక్కగా సమన్వయం చేసుకుంటూ ఇన్నింగ్స్ నిర్మించాడు. ఈ క్రమంలో అర్ధ శతకం పూర్తి చేసుకున్న కోహ్లి.. దానిని శతకంగా మలిచాడు. అంతేకాదు బౌండరీ బాది సెంచరీ మార్కు అందుకున్న ఈ రన్మెషీన్.. టీమిండియాను గెలుపుతీరాలకు చేర్చాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లిపై భారత్తో పాటు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.అయితే, బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కోహ్లి చేసిన ఓ పని మాత్రం సునిల్ గావస్కర్కు ఆగ్రహం తెప్పించింది. భారత ఇన్నింగ్స్లో 21 ఓవర్ను పాక్ బౌలర్ హ్యారిస్ రవూఫ్ వేయగా.. ఐదో బంతికి కోహ్లి సింగిల్ తీశాడు. ఈ క్రమంలో సురక్షితంగానే క్రీజులోకి చేరుకున్న కోహ్లి.. ఆ తర్వాత ఓవర్ త్రో కాబోతున్న బంతిని తన చేతితో ఆపేశాడు.నిజానికి అక్కడ దగ్గర్లో పాకిస్తాన్ ఫీల్డర్లు ఎవరూ లేరు. ఒకవేళ ఓవర్ త్రో అయినా ఓ అదనపు పరుగు వచ్చేది. అయినా, ఎంసీసీ నిబంధనల ప్రకారం ఓ బ్యాటర్ బంతి లైవ్లో ఉన్నపుడు దానిని తన మాటలు, చేతల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా అతడు అలా చేసినట్లు భావించి ఫీల్డింగ్ చేస్తున్న జట్టు అప్పీలు చేస్తే.. సదరు బ్యాటర్ను అవుట్గా ప్రకటించవచ్చు.అబ్స్ట్రక్ట్ ఫీల్డ్ నిబంధన కింద..కోహ్లి విషయంలో ఒకవేళ పాక్ జట్టు ఈ విషయంలో అప్పీలుకు వెళ్లి ఉంటే పరిస్థితి చేజారిపోయేదని గావస్కర్ అన్నాడు. కామెంట్రీ సమయంలో.. ‘‘అతడు తన చేతితో బంతిని ఆపాడు. ఒకవేళ పాకిస్తాన్ గనుక అప్పీలు చేస్తే ఏమయ్యేది?.. అబ్స్ట్రక్ట్ ఫీల్డ్ నిబంధన కింద అతడు అవుటయ్యేవాడేమో?!.. కానీ వాళ్లు అలా చేయలేదు. ఎందుకంటే.. అక్కడ దగ్గర్లో ఫీల్డర్ లేడు.అంతేకాదు ఓవర్ త్రో ద్వారా అదనపు పరుగు రాకుండా ఉండిపోయిందని భావించి ఉండవచ్చు. నిజానికి మిడ్వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఆటగాడు డైవ్ చేస్తే బాగుండేది. కానీ ముందుకు వెళ్లిపోతున్న బంతిని కోహ్లి జోక్యం చేసుకుని మరీ ఆపడం సరికాదు. అదృష్టవశాత్తూ ఎవరూ అప్పీలు చేయలేదు కాబట్టి సరిపోయింది’’ అని గావస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. కాగా 21వ ఓవర్ ముగిసే సరికి కోహ్లి కేవలం 41 పరుగుల వద్ద ఉండటం గమనార్హం. ఇక ఈ మ్యాచ్లో 111 బంతులు ఎదుర్కొన్న కోహ్లి సరిగ్గా 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వన్డేల్లో అతడికి ఇది 51వ సెంచరీ కాగా.. అంతర్జాతీయ కెరీర్లో 82వది కావడం విశేషం. సచిన్ టెండ్కులర్ వంద సెంచరీల రికార్డుకు కోహ్లి ఇంకా 18 శతకాల దూరంలో ఉన్నాడు.చాంపియన్స్ ట్రోఫీ-2025: భారత్ వర్సెస్ పాకిస్తాన్ స్కోర్లు👉పాకిస్తాన్- 241(49.4) ఆలౌట్👉భారత్- 244/4 (42.3)👉ఫలితం: పాక్ను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన భారత్.చదవండి: ‘ఏంటిది?’.. రిజ్వాన్ చర్యకు హర్షిత్ రాణా రియాక్షన్ వైరల్.. గంభీర్ కూడా! -
ఆ ఇద్దరి విషయంలో అగార్కర్తో గంభీర్ గొడవ.. ఆఖరికి!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఎంపిక చేసిన జట్టు విషయంలో టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar)- హెడ్కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) మధ్య విభేదాలు తలెత్తాయా? ఇద్దరు ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇచ్చే అంశమై ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదా? అదే వాగ్యుద్దానికి దారి తీసిందా? అంటే జాతీయ మీడియా వర్గాల నుంచి అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది.కాగా దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత మరోసారి చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు రంగం సిద్ధమైంది. పాకిస్తాన్(Pakistan) వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఈ మెగా టోర్నమెంట్ మొదలుకానుంది. అయితే, భద్రతా కారణాల వల్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) టీమిండియాను అక్కడికి పంపడం లేదు. యశస్వి జైస్వాల్పై వేటుఈ నేపథ్యంలో అనేక పరిణామాల అనంతరం తటస్థ వేదికైన దుబాయ్లో భారత్ తమ మ్యాచ్లు ఆడేందుకు ఐసీసీ అనుమతినిచ్చింది. ఇక ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్కు జనవరి 18న తమ ప్రాథమిక జట్టును ప్రకటించిన బీసీసీఐ.. ఫిబ్రవరి 11న ఫైనల్ టీమ్ను ఖరారు చేసింది. తొలుత ఈ జట్టులో స్థానం దక్కించుకున్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్పై వేటు వేసిన యాజమాన్యం.. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి అవకాశం ఇచ్చింది. మొదటి ప్రాధాన్యం దక్కాలని గంభీర్ వాదనఅదే విధంగా వెన్నునొప్పి కారణంగా ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టోర్నీకి దూరం కాగా.. హర్షిత్ రాణాను జట్టులో చేర్చింది. అయితే, వికెట్ కీపర్ విషయంలో మాత్రం గంభీర్- అగార్కర్ మధ్య తీవ్రమైన చర్చ జరిగినట్లు సమాచారం. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం... సీనియర్ అయిన కేఎల్ రాహుల్కు మొదటి ప్రాధాన్యం దక్కాలని గంభీర్ వాదించగా.. అగార్కర్ మాత్రం రిషభ్ పంత్కు పెద్దపీట వేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇక ఆఖరికి గంభీర్ తన మాటను నెగ్గించుకున్నట్లు ఇంగ్లండ్తో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్ ద్వారా నిరూపితమైనట్లు తెలుస్తోంది. స్వదేశంలో ఇంగ్లండ్తో మూడు వన్డేల్లోనూ కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ బ్యాటర్గా బరిలోకి దిగగా.. పంత్ బెంచ్కే పరిమితమయ్యాడు. కాగా ఈ సిరీస్ను 3-0తో టీమిండియా క్లీన్స్వీప్ చేసిన తర్వాత గౌతం గంభీర్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం మా నంబర్ వన్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ మాత్రమే అని చెప్పగలను.రిషభ పంత్కు కూడా అవకాశాలు వస్తాయి. అయితే, కేఎల్ రాహుల్ రికార్డు బాగుంది. అందుకే అతడి వైపు మొగ్గుచూపాం. ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లను ఒకేసారి ఆడించలేము కదా!’’ అని పేర్కొన్నాడు. శ్రేయస్ అయ్యర్ విషయంలోనూఇక కేఎల్ రాహుల్తో పాటు శ్రేయస్ అయ్యర్ విషయంలోనూ గంభీర్.. అగార్కర్తో వాదనకు దిగినట్లు తెలుస్తోంది. దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపిన ఈ ముంబై బ్యాటర్ను తప్పక ఎంపిక చేయాలని గౌతీ పట్టుబట్టగా.. అగార్కర్ మాత్రం అతడి పట్ల సుముఖంగా లేనట్లు సమాచారం. ఇంగ్లండ్తో తొలి వన్డే తర్వాత శ్రేయస్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్నిస్తున్నాయి కూడా! తాను తొలుత తుదిజట్టులో లేనని.. విరాట్ కోహ్లి మోకాలి నొప్పి కారణంగానే తనకు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కిందని శ్రేయస్ అయ్యర్ వెల్లడించాడు.ఏది ఏమైనా ఇంగ్లండ్తో వన్డేలో సిరీస్లో మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మూడు వన్డేల్లో వరుసగా 59, 44, 78 పరుగులు సాధించాడు. ఇక జట్టుకూర్పులో తన నిర్ణయానికే కట్టుబడి ఉన్న గంభీర్.. అగార్కర్తో విభేదించినప్పటికీ ఘన విజయం సాధించడం జట్టుకు సానుకూలాంశంగా మారింది.అయితే, లెఫ్ట్- రైట్ కాంబినేషన్ల కోసం అక్షర్ పటేల్ను బ్యాటింగ్ ఆర్డర్లో ఐదో స్థానానికి ప్రమోట్ చేసి.. కేఎల్ రాహుల్ను ఆరో నంబర్ ఆటగాడిగా పంపడం బెడిసికొట్టింది. దీంతో మూడో వన్డేలో కేఎల్ రాహుల్ను తన రెగ్యులర్ స్థానమైన ఐదో నంబర్లో పంపగా.. 29 బంతుల్లోనే 40 పరుగులతో దంచికొట్టాడు.చదవండి: చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా స్టార్ దూరం!? -
అద్భుత ఫామ్.. అతడిని ఆపతరమా!.. ప్రత్యర్థి జట్ల బౌలర్లకు చుక్కలే!
చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్(ICC Champions Trophy 2025)కు ముందు ఇంగ్లండ్పై క్లీన్స్వీప్ విజయం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కి సంతృప్తిని మిగిల్చింది. విజయానంతరం మాట్లాడుతూ.. "ఈ సిరీస్లో మేము ఏదైనా పొరపాటు చేశామని నేను భావించడం లేదు. అయితే జట్టు సమిష్టిగా మరింత మెరుగ్గా ఆడాలని నేను భావిస్తున్నాను. ఇందుకు సంబంధించిన కొన్ని విషయాలున్నాయి. తప్పకుండా జట్టు మరింత మెరుగ్గా ఆడాలని నేను కోరుకుంటున్నాను" అని రోహిత్ వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనం.అయ్యర్ అద్భుత ఫామ్ వాస్తవానికి... ఇంగ్లండ్తో జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్లో భారత్ బ్యాటింగ్ అన్ని విధాలా ఆకట్టుకుంది. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మోకాలి నొప్పి కారణంగా తొలి వన్డే నుంచి వైదొలగడంతో.. తుదిజట్టులోకి వచ్చాడు అయ్యర్. అద్భుత రీతిలో రాణించి మరోసారి టీమిండియా మిడిలార్డర్కు వెన్నెముక గా నిలిచాడు.ఇంగ్లండ్ జట్టులో మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్, సాకిబ్ మహమూద్ వంటి అగ్రశ్రేణి పేస్ బౌలర్లున్నారు. వారిని ఎదుర్కొని రాణించడం ఆషామాషీ విషయం కాదు. ఇందుకు అనుగుణంగా తన స్టాన్స్ ని కూడా మార్పు చేసుకొని అయ్యర్ తన మునుపటి ఫామ్ ని ప్రదర్శించాడు. అయ్యర్ ఫామ్ ఫిబ్రవరి 19న ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ జట్టుకి కొత్త ఉత్సాహాన్నిస్తుందనడంలో సందేహం లేదు.భారత్ జట్టులో నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చే అయ్యర్ పై మిడిల్ ఓవర్లలో నిలకడగా పరుగులు సాధించాల్సిన బాధ్యత ఉంటుంది. గతం లో 2023 ప్రపంచ కప్లో అద్భుతంగా రాణించిన అయ్యర్ తర్వాత అనూహ్యంగా జట్టులో స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత గాయాల కారణంగా గత సంవత్సరం ఒక్క రంజీ ట్రోఫీ మ్యాచ్ కూడా ఆడకపోవడంతో తన కేంద్ర కాంట్రాక్టును కోల్పోవడంతో శ్రేయస్ అయ్యర్ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.చలించని దృఢ సంకల్పంఅయితే అయ్యర్ దృఢ సంకల్పం ఎప్పుడూ చలించలేదు. దేశవాళీ వైట్-బాల్ టోర్నమెంట్లలో నిలకడగా రాణించి 188.52 స్ట్రైక్ రేట్తో 345 పరుగులతో, 2024-25 సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్ లో ఐదు ఇన్నింగ్స్లలో 131.57 సగటుతో 325 పరుగులు చేశాడు.కేవలం ఒకే ఒక్కసారి అవుట్ అయ్యాడు. దేశవాళీ టౌర్నమెంట్లలో మళ్ళీ మునుపటి రీతిలో రాణిస్తుండంతో మళ్ళీ భారత్ జట్టులో స్థానం సంపాదించాడు. తొలి వన్డేలో కోహ్లి గాయంతో ఇలా కీలకమైన బ్రేక్ దొరికింది. దాంతో చెలరేగిపోయిన అయ్యర్ జట్టుకి తన అవసరం ఎలాంటితో చూపించి సత్తా చాటుకున్నాడు. ఇంగ్లండ్పై అద్భుతమైన ప్రదర్శనఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో భారత్ 3-0 తో విజయం సాధించడంలో అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్లో వరుసగా 59 పరుగులు (తొలి వన్డే) , 44 (రెండో వన్డే), 78 పరుగులు సాధించాడు. విరాట్ కోహ్లీ గాయపడిన కారణంగానే తాను ఈ సిరీస్ లోని తొలి వన్డే లో ఆడగలిగానని అయ్యర్ వెల్లడించాడు. అయితే ఆ అవకాశాన్ని అయ్యర్ రెండు చేతులతో అందిపుచ్చుకున్నాడు.అందుకే కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చిన తర్వాత కూడా అయ్యర్ స్థానం జట్టులో పదిలంగా నిలిచింది. ఇంగ్లండ్తో జరిగిన చివరి మ్యాచ్లో 78 పరుగులతో అయ్యర్ వన్డేల్లో తన 20వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో అయ్యర్ ఐదు సెంచరీలు కూడా చేసాడు. మొత్తం 65 వన్డేల్లో 48.18 సగటుతో 2,602 పరుగులు సాధించాడు. ఇక 2023 ప్రపంచ కప్ లో అయ్యర్ అద్భుతంగా రాణించి 66.25 సగటుతో 113.24 స్ట్రైక్ రేట్తో 530 పరుగులు చేశాడు. ఇంతటి అపార అనుభవం ఉన్న అయ్యర్ మళ్ళీ మునుపటి రీతిలో రాణిస్తుండంతో చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో భారత్ బ్యాటింగ్ను నిలువరించడం ప్రత్యర్థి జట్లకు అంత తేలికైన విషయం కాదు. చదవండి: CT 2025: సురేశ్ రైనా ఎంచుకున్న భారత తుదిజట్టు... వరల్డ్కప్ వీరులకు నో ఛాన్స్! -
అహ్మదాబాద్లో అదరగొట్టిన భారత బ్యాటర్లు.. ఇదే తొలిసారి
ఇంగ్లండ్తో మూడో వన్డే(India vs England)లో భారత బ్యాటర్లు అదరగొట్టారు. ఫలితంగా అహ్మదాబాద్లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. తద్వారా నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ ఖాతాలో అతిపెద్ద స్కోరు(Highest ODI total) నమోదైంది. కాగా రోహిత్ సేన ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా నాగ్పూర్, కటక్ వన్డేల్లో ఇంగ్లండ్ను నాలుగేసి వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం మూడో వన్డేలోనూ గెలిచి వైట్వాష్ చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగింది.అయితే, ఈ మ్యాచ్లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆరంభంలోనే కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma) వికెట్ రూపంలో టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. గత వన్డేలో సెంచరీ(119)తో చెలరేగిన హిట్మ్యాన్ మూడో వన్డేలో మాత్రం ఒక్క పరుగే చేసి మార్క్వుడ్ బౌలింగ్లో వెనుదిరిగాడు.ఎట్టకేలకు ఫామ్లోకిఈ నేపథ్యంలో మరో ఓపెనర్ శుబ్మన్ గిల్కు జతైన వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. మూడుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 55 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 52 పరుగులు చేశాడు. అప్పటికే, హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గిల్.. దానిని శతకంగా మార్చుకున్నాడు.గిల్ శతకంమొత్తంగా 102 బంతులు ఎదుర్కొన్న శుబ్మన్ గిల్ 14 ఫోర్లు, 3 సిక్స్లు బాది.. 112 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(64 బంతుల్లో 78 రన్స్) అద్భుత అర్ధ శతకంతో మెరిశాడు. మరోవైపు.. తన రెగ్యులర్ స్థానమైన ఐదో నంబర్లో వచ్చిన కేఎల్ రాహుల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.కేవలం 29 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టి 40 పరుగులు సాధించాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్. మిగతా వాళ్లలో ఎవరూ పెద్దగా రాణించలేదు. ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా(17), అక్షర్ పటేల్(13), వాషింగ్టన్ సుందర్(14).. పేసర్లు హర్షిత్ రాణా(13), అర్ష్దీప్ సింగ్(2), కుల్దీప్ యాదవ్(1*) నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు.అవయవ దానం గురించిఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 356 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో రైటార్మ్ లెగ్బ్రేక్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. పేసర్లు మార్క్ వుడ్ రెండు, గస్ అట్కిన్సన్ ఒకటి, పార్ట్ టైమ్ స్పిన్నర్ జో రూట్ ఒక వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా టీమిండియా- ఇంగ్లండ్ క్రికెటర్లు అవయవ దానం గురించి అవగాహన కల్పించే చేసే క్రమంలో గ్రీన్ ఆర్మ్ బ్యాండ్తో బరిలోకి దిగడం విశేషం.అహ్మదాబాద్లో వన్డేల్లో అత్యధిక స్కోర్లుసౌతాఫ్రికా వర్సెస్ ఇండియా- 2010లో 365/2ఇండియా వర్సెస్ ఇంగ్లండ్- 2025లో 356ఇండియా వర్సెస్ వెస్టిండీస్- 2002లో 325/5వెస్టిండీస్ వర్సెస్ ఇండియా- 2002లో 324/4 పాకిస్తాన్ వర్సెస్ ఇండియా- 2007లో 319/7.చదవండి: చరిత్ర సృష్టించిన కోహ్లి.. భారత తొలి బ్యాటర్గా అరుదైన రికార్డువారెవ్వా!.. శుబ్మన్ గిల్ ప్రపంచ రికార్డు -
ఆఖరికి అతడికి జట్టులో స్థానమే లేకుండా చేశారు? ఇదేం పద్ధతి?
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)కి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తమ జట్టును ఖరారు చేసింది. ప్రాథమిక జట్టులో రెండు మార్పులు చేస్తూ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal)ను తప్పించిన యాజమాన్యం.. జట్టులో కొత్తగా ఇద్దరు బౌలర్లకు చోటిచ్చింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) బీసీసీఐ సెలక్టర్ల తీరును విమర్శించాడు. జైస్వాల్పై వేటు వేయడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఈ మాజీ ఓపెనర్.. సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్ను పక్కనపెట్టడాన్నీ తప్పుబట్టాడు.యశస్వి జైస్వాల్పై వేటుకాగా జనవరి 18న బీసీసీఐ చాంపియన్స్ ట్రోఫీకి తమ ప్రాథమిక జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో యశస్వి జైస్వాల్తో పాటు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేర్లు కూడా ఉన్నాయి. అయితే, బుమ్రా వెన్నునొప్పి నుంచి కోలుకోకపోవడంతో ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు. ఇక చాంపియన్స్ ట్రోఫీకి తమ జట్టును ఖరారు చేసేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఆయా బోర్డులకు ఫిబ్రవరి 12 వరకు గడువు ఇవ్వగా.. మంగళవారం రాత్రి బీసీసీఐ కీలక ప్రకటన చేసింది.యశస్వి జైస్వాల్పై వేటు వేయడంతో పాటు బుమ్రా ఈ టోర్నీ నుంచి తప్పుకొన్నట్లు తెలిపింది. వీరి స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణాతో పాటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిలను ప్రధాన జట్టుకు ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా భారత జట్టు గురించి ‘ఎక్స్’ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ఆఖరికి అతడికి జట్టులోనే స్థానమే లేకుండా చేశారుఈ మేరకు.. ‘‘బుమ్రా గైర్హాజరీ కారణంగా సెలక్టర్లు సిరాజ్ వైపు మొగ్గు చూపుతారని అనుకున్నా. అలా అయితే నలుగురు పేసర్లు జట్టులో ఉండేవారు. ఇక మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. తుదిజట్టులో యశస్విని ఆడించేందుకు శ్రేయస్ అయ్యర్నే పక్కనపెట్టాలని చూసిన యాజమాన్యం ఇప్పుడు కనీసం అతడికి చాంపియన్స్ ట్రోఫీ జట్టులో స్థానం కూడా కల్పించకపోవడం గమనార్హం’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.కాగా ఇప్పటికే టెస్టుల్లో, టీ20లలో ఓపెనర్గా తనను తాను నిరూపించుకున్న యశస్వి జైస్వాల్.. ఇటీవల ఇంగ్లండ్తో స్వదేశంలో తొలి మ్యాచ్ సందర్భంగా వన్డేల్లో అరంగేట్రం చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి అతడు భారత ఇన్నింగ్స్ ఆరంభించగా.. వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ వన్డౌన్లో వచ్చాడు.ఇక మోకాలి గాయం వల్ల భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఈ మ్యాచ్కు దూరం కాగా.. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్ తనకు అచ్చొచ్చిన నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. ధనాధన్ ఇన్నింగ్స్(36 బంతుల్లో 59) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.కోహ్లి గాయం కారణంగానేఈ క్రమంలో మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. కోహ్లి గాయం కారణంగానే తనకు తుదిజట్టులో చోటు దక్కిందని.. లేదంటే ఈ మ్యాచ్లో తాను భాగమయ్యేవాడినే కాదని తెలిపాడు. అంటే.. జైస్వాల్ను ఆడించే క్రమంలో అయ్యర్ను తప్పించేందుకు కూడా మేనేజ్మెంట్ వెనుకాడలేదని తేలింది. అయితే, తాజాగా జైసూను చాంపియన్స్ ట్రోఫీ ప్రధాన జట్టు నుంచి తీసేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా పైవిధంగా స్పందించాడు.ఇదిలా ఉంటే.. అరంగేట్ర వన్డేలో జైస్వాల్ విఫలమయ్యాడు. 22 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండ్ బ్యాటర్ మూడు ఫోర్ల సాయంతో 15 పరుగులు చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో వికెట్ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. మరోవైపు.. ఇంగ్లండ్తో సిరీస్ల సందర్భంగా సత్తా చాటిన హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఏకంగా చాంపియన్స్ ట్రోఫీ జట్టులో స్థానం సంపాదించారు.చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: Chris Gayle: అతడొక వరల్డ్క్లాస్ ప్లేయర్.. ఈసారి చాంపియన్స్ ట్రోఫీ వారికే -
జట్టు కోసం కొన్ని పరుగులు చేశా.. అతడొక క్లాసీ ప్లేయర్: రోహిత్ శర్మ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఫామ్లోకి వచ్చేశాడు. ఇంగ్లండ్(India vs England)తో రెండో వన్డేలో విధ్వంసకర బ్యాటింగ్తో శతక్కొట్టి తన ఆటను విమర్శిస్తున్న వాళ్లకు బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. కో..డితే బంతి బౌండరీ దాటడమే అన్నట్లుగా తనదైన శైలిలో హిట్టింగ్ ఆడి.. క్రికెట్ ప్రేమికులకు కనులవిందు చేశాడు. అద్భుతమైన ఇన్నింగ్స్తో చెలరేగి.. జట్టును గెలిపించాడు.నా గేమ్ప్లాన్ అదేఈ నేపథ్యంలో విజయానంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ... సెంచరీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఈరోజు ఆటను పూర్తిగా ఆస్వాదించాను. జట్టు కోసం పరుగులు చేయడం ఎల్లప్పుడూ సంతృప్తిని ఇస్తుంది. ముఖ్యంగా సిరీస్ గెలవాలంటే మాకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం.నిజానికి టీ20 ఫార్మాట్ కంటే కాస్త సుదీర్ఘమైన.. టెస్టుల కంటే చిన్నదైన ఫార్మాట్ ఇది. అందుకే పరిస్థితులకు తగ్గట్లుగా ఎప్పుటికప్పుడు ప్రణాళికలు మార్చుకుంటూ వెళ్లాలి. ఈరోజు నా వ్యూహాలను పక్కాగా అమలు చేయగలిగాను.నల్లరేగడి మట్టి పిచ్ ఇది. జారుతూ ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. వికెట్ మీదకు కాకుండా.. శరీరం మీదకు బంతులు సంధిస్తున్న ఇంగ్లండ్ బౌలర్ల వ్యూహాన్ని పసిగట్టి నేను పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాను.గిల్ క్లాసీ ప్లేయర్గ్యాప్ దొరికినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించాను’’ అని రోహిత్ శర్మ తన ఆటతీరుపై సంతృప్తి వ్యక్తం చేశాడు. అదే విధంగా.. శుబ్మన్ గిల్(Shubman Gill), శ్రేయస్ అయ్యర్ నుంచి తనకు మద్దతు లభించించదన్న హిట్మ్యాన్.. ‘‘ఇద్దరూ చక్కగా సహకరించారు. వాళ్లతో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదించాను. గిల్ చాలా చాలా క్లాసీ ప్లేయర్. అతడి ఆటను నేను దగ్గరగా గమనించాను. పరిస్థితి ఎలా ఉన్న తలవంచని స్వభావం. అతడి బ్యాటింగ్ గణాంకాలే ఇందుకు నిదర్శనం’’ అని రోహిత్ శర్మ గిల్పై ప్రశంసలు కురిపించాడు.మిడిల్ ఓవర్లే ముఖ్యంఇక టీమిండియా ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఏదేమైనా మిడిల్ ఓవర్లలో వికెట్లు కాపాడుకోవడం అత్యంత ముఖ్యం. మధ్య ఓవర్లలో ఆట తీరును బట్టే ఫలితం నిర్ణయించబడుతుంది. ఒకవేళ అప్పుడే మనం జాగ్రత్తపడితే డెత్ ఓవర్లలో పెద్దగా భయపడాల్సిన అవసరం ఉండదు.నాగ్పూర్లో కూడా మేము ఇదే విధంగా మిడిల్ ఓవర్లలో చక్కగా రాణించాం. తద్వారా ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచి అనుకున్న ఫలితాన్ని రాబట్టగలిగాం. రోజురోజుకూ మరింత గొప్పగా మారేలా మా జట్టు సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతోంది. జట్టులోని ప్రతి సభ్యుడికి తన పాత్ర ఏమిటో తెలుసు. కెప్టెన్, కోచ్ వాళ్ల నుంచి ఎలాంటి ఆట తీరును ఆశిస్తున్నారో ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. కాబట్టి ముందుకు అనుకున్న వ్యూహాలను పక్కాగా అమలు చేస్తే దేని గురించి ఆందోళన చెందాల్సిన పని ఉండదు’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.సిరీస్ కైవసంకాగా ఇంగ్లండ్తో రెండో వన్డేలో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఒడిశాలోని కటక్లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. 49.5 ఓవర్లలో 204 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ బెన్ డకెట్(65), జో రూట్(69) అర్ధ శతకాలతో రాణించారు.భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీయగా.. మహ్మద్ షమీ, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ తీశారు. ఇక లక్ష్య ఛేదనలో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ(90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్లు- 119) సెంచరీతో చెలరేగి జట్టు విజయానికి బాటలు చేశాడు.మరో ఓపెనర్ శుబ్మన్ గిల్(60) అర్ధ శతకంతో రాణించగా.. శ్రేయస్ అయ్యర్(44), అక్షర్ పటేల్(41 నాటౌట్) లక్ష్యాన్ని పూర్తి చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. రో‘హిట్’ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఇక ఈ విజయంతో టీమిండియా ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్ను 2-0తో సొంతం చేసుకుంది. ఇరుజట్ల మధ్య బుధవారం నామమాత్రపు మూడో వన్డే జరుగుతుంది.చదవండి: SA T20: ఫైనల్లో సన్రైజర్స్ చిత్తు.. ఛాంపియన్స్గా ముంబై టీమ్What a way to get to the HUNDRED! 🤩A treat for the fans in Cuttack to witness Captain Rohit Sharma at his best 👌👌Follow The Match ▶️ https://t.co/NReW1eEQtF#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank | @ImRo45 pic.twitter.com/oQIlX7fY1T— BCCI (@BCCI) February 9, 2025𝗔 𝘀𝘂𝗽𝗲𝗿 𝘀𝗵𝗼𝘄 𝘁𝗼 𝘀𝗲𝗮𝗹 𝗮 𝘄𝗶𝗻 𝗶𝗻 𝗖𝘂𝘁𝘁𝗮𝗰𝗸! ✅The Rohit Sharma-led #TeamIndia beat England by 4⃣ wickets in the 2nd ODI & take an unassailable lead in the ODI series! 👏 👏Scorecard ▶️ https://t.co/NReW1eEQtF#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/G63vdfozd5— BCCI (@BCCI) February 9, 2025 -
శ్రేయాస్ జోరు మరి విరాట్ పరిస్థితి ఏమిటి?
ఇంగ్లండ్ తో గురువారం జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో నిజానికి భారత్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఆడే పరిస్థితి లేదు. దానికి ముందు రోజు రాత్రి వరకు దీని పై స్పష్టత లేదు. శ్రేయాస్ అయ్యర్ ఏదో సినిమా చూస్తూ నిబ్బరముగా ఉన్నాడు. ఈ లోగా కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి ఫోన్ వచ్చింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి గాయం కావడంతో అతను ఆడటం కష్టమని. అందువల్ల మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉండమని కోరాడు. దాంతో సినిమా ఆపేసి మ్యాచ్ కి ముందు విశ్రాంతి కోసం నిద్రకు ఉపక్రమించాడు శ్రేయాస్ అయ్యర్. "విరాట్ మోకాలి నొప్పి కారణంగా ఆడే అవకాశం లేనందున నువ్వు ఆడే అవసరం రావచ్చు అని కెప్టెన్ (రోహిత్ శర్మ) నుండి నాకు కాల్ వచ్చింది" అని అయ్యర్ స్వయంగా వెల్లడించాడు."నేను నా గదికి తిరిగి వెళ్లి వెంటనే నిద్ర పోయాను." గురువారం మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ క్రీజులోకి అడుగు పెట్టే సమయానికి భారత్ 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో ఉంది. ఇంగ్లాండ్ పేసర్లు జోఫ్రా ఆర్చర్ మరియు సాకిబ్ మహమూద్ నిలకడగా బౌలింగ్ చేస్తూ భారత్ ని పరుగులు కొట్టకుండా నిల్వరిస్తున్నారు.ఆ దశలో రంగ ప్రవేశం చేసిన అయ్యర్ ఇంగ్లాండ్ బౌలర్ల సవాలును ఎదుర్కొన్నాడు. అయ్యర్ రెండు సిక్సర్లు, తొమ్మిది ఫోర్లతో 36 బంతుల్లో 59 పరుగులు చేశాడు. తన అద్భుతమైన ఎదురుదాడి ఇన్నింగ్స్తో మ్యాచ్ ని మలుపు తిప్పాడు. ఫలితంగా భారత్ తొలి వన్డేలో ఇంగ్లాండ్పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించగా, శ్రేయాస్ అయ్యర్ తన 19వ అర్ధ సెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్ లో మరో విషయం వెల్లడైంది. యశస్వి జైస్వాల్ ఓపెనర్ గా వస్తే శుభ్మాన్ గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్ కి వస్తాడు. విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉంటాడు. ఎడమచేతి వాటం అక్షర్ తదుపరి బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది, ఆట స్థితిని బట్టి కే ఎల్ రాహుల్ లేదా హార్దిక్ పాండ్యా తర్వాత బ్యాటింగ్ చేస్తారు. అయితే కోహ్లీ గాయం లేకపోతే అయ్యర్ కి స్తానం లేదా అన్నది ఇక్కడ ప్రధానాంశం. "కోహ్లీ ఫిట్ గా ఉంటే అయ్యర్ ఆడటం సాధ్యం కాదన్న విషయం గురుంచే నేను తదేకంగా ఆలోచిస్తున్నాను. 2023 ప్రపంచ కప్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 500 కి పైగా పరుగులు చేసిన తొలి భారత్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్.అటువంటి నైపుణ్యం ఉన్న బ్యాట్స్మన్ ని మీరెలా బెంచ్ మీద కూర్చో బెట్ట గలరు? అని భారత్ మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా జట్టు మేనేజ్మెంట్ పై విరుచుకు పడ్డాడు. భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో శ్రేయాస్ అయ్యర్ ని సమర్ధించాడు."శ్రేయస్ తన నైపుణ్యాన్ని ఇప్పటికే నిరూపించుకున్నాడు. అతను ప్రపంచ కప్లో పరుగుల ప్రవాహం సృష్టించాడు. ఒక ఆటగాడు ఇన్ని పరుగులు చేసినప్పుడు, అతనికి అవకాశాలు లభిస్తాయని భావించడంలో తప్పేం ఉంది. అతను అతని దృష్టిలో అత్యుత్తమ బ్యాట్స్మన్. అందుకే దేవుడు కూడా అలాగే భావించాడు. అతను చేసిన 50 పరుగులు, మ్యాచ్ రూపురేఖలను మార్చాయి," అని హర్భజన్ అయ్యర్ పై ప్రశంసలు కురిపించాడు. -
అద్భుతమైన ఆటగాడు.. అతడినే పక్కనపెడతారా?: ఆసీస్ దిగ్గజం
టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)పై ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్(Ricky Ponting) ప్రశంసలు కురిపించాడు. మిడిలార్డర్లో చక్కగా రాణించగల నైపుణ్యాలు అతడి సొంతమని కొనియాడాడు. అయితే, గత రెండేళ్లుగా టీమిండియా యాజమాన్యం అయ్యర్కు అడపాదడపా మాత్రమే అవకాశాలు ఇవ్వడం తనకు విస్మయం కలిగిస్తోందని పేర్కొన్నాడు.కాగా స్వదేశంలో గతేడాది ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా వెన్నునొప్పితో జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్.. ఆ తర్వాత కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. రంజీల్లో ఆడాలన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) ఆదేశాలను తొలుత బేఖాతరు చేసిన ఈ ముంబైకర్.. తర్వాత గాయాన్ని సాకుగా చూపి తప్పించుకున్నాడు.ఈ క్రమంలో బీసీసీఐ అయ్యర్పై కఠిన చర్యలు తీసుకుంది. అతడి సెంట్రల్ కాంట్రాక్టు రద్దు చేస్తూ వేటు వేసింది. ఈ తర్వాత అతడు దేశవాళీ క్రికెట్ బరిలోకి దిగి తనను తాను నిరూపించుకున్నాడు. అంతేకాదు.. ఐపీఎల్-2024లో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్గా టైటిల్ గెలిచాడు.టీ20 జట్టులో మాత్రం చోటు కరువుఈ నేపథ్యంలో గతేడాది శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో ఆడే అవకాశం దక్కించుకున్న శ్రేయస్ అయ్యర్.. టీ20 జట్టులో మాత్రం చోటు సంపాదించలేకపోయాడు. యాజమాన్యం అతడిని ఎప్పటికప్పుడు పక్కనపెట్టి.. కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చింది. టీ20 ప్రపంచకప్-2024 జట్టులోనూ అతడికి చాన్స్ ఇవ్వలేదు.ఇక తాజాగా ఇంగ్లండ్తో స్వదేశంలో వన్డే సిరీస్ సందర్భంగా పునరాగమనం చేసిన శ్రేయస్ అయ్యర్.. నాగ్పూర్లో జరిగిన తొలి వన్డేలో అదరగొట్టాడు. కేవలం 36 బంతుల్లోనే 59 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో తొమ్మిది ఫోర్లతో పాటు రెండు సిక్సర్లు ఉండటం విశేషం.అయితే, ఈ మ్యాచ్లో తనకు తొలుత తుదిజట్టులో స్థానం లేదని.. విరాట్ కోహ్లి గాయపడ్డ కారణంగానే తనను పిలిపించారని శ్రేయస్ అయ్యర్ స్వయంగా వెల్లడించాడు. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫామ్లో ఉన్న ఆటగాడిని బెంచ్కే పరిమితం చేయాలని చూడటం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అద్భుతమైన ఆటగాడు.. అతడినే పక్కనపెడతారా?ఈ నేపథ్యంలో లెజెండరీ బ్యాటర్ రిక్కీ పాంటింగ్ ఐసీసీ రివ్యూ షోలో మాట్లాడుతూ.. ‘‘గత రెండేళ్లుగా అతడి సేవలను ఎందుకు సరిగ్గా ఉపయోగించుకోవడం లేదో అర్థం కావడం లేదు. వన్డే ప్రపంచకప్-2023లోనూ శతకాలతో చెలరేగి భీకరమైన ఫామ్ కనబరిచాడు.మిడిలార్డర్లో సొగసైన బ్యాటింగ్తో అలరించాడు. దీంతో జట్టులో అతడి స్థానం సుస్థిరమైందని నేను అనుకున్నా. కానీ అలా జరుగలేదు. వెన్నునొప్పి కారణంగా అతడు జట్టులో స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.అయినా.. అతడిని పక్కనపెట్టాలని చూడటం సరికాదు’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ హెడ్కోచ్గా పాంటింగ్ నియమితుడైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వేలంలో భాగంగా శ్రేయస్ అయ్యర్ను పంజాబ్ రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేయడంలో పాంటింగ్ కీలక పాత్ర పోషించాడు. వీరిద్దరు కలిసి గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున పనిచేశారు కూడా!ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో గురువారం నాటి తొలి వన్డేలో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యం సంపాదించింది. ఇరుజట్ల మధ్య ఆదివారం కటక్లో రెండో వన్డే జరుగుతుంది.చదవండి: సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?: మండిపడ్డ గావస్కర్ -
క్రెడిట్ మొత్తం అతడికే.. మా ఓటమికి కారణం అదే: బట్లర్
భారత్లో ఇంగ్లండ్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. తొలుత ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 4-1తో కోల్పోయిన బట్లర్ బృందం.. వన్డే సిరీస్(India vs England ODIs)నూ ఓటమితోనే ఆరంభించింది. నాగ్పూర్లో గురువారం జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్ల తేడాతో టీమిండియా చేతిలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ జోస్ బట్లర్(Jos Buttler) విచారం వ్యక్తం చేశాడు.క్రెడిట్ మొత్తం అతడికేశుభారంభం అందుకున్నా దానిని కొనసాగించలేకపోవడమే తమ పరాజయానికి కారణమని బట్లర్ అన్నాడు. అదే విధంగా.. టీమిండియా విజయంలో క్రెడిట్ మొత్తం శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)కు దక్కుతుందంటూ అతడి బ్యాటింగ్ తీరును ప్రశంసించాడు. కాగా విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో టాస్ గెలిచిన బట్లర్ తొలుత బ్యాటింగ్ వైపు మొగ్గుచూపాడు.అతడి రనౌట్లో అయ్యర్ కీలక పాత్రఈ క్రమంలో టీమిండియా సీనియర్ పేసర్ భారత బౌలింగ్ అటాక్ ఆరంభించి.. తొలి ఓవర్లో పరుగులేమీ ఇవ్వలేదు. అనంతరం వన్డే అరంగేట్ర ఆటగాడు, మరో పేసర్ హర్షిత్ రాణా సైతం మెయిడిన్ వేసి సత్తా చాటాడు. అయితే, ఆ తర్వాత ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ధనాధన్ ఇన్నింగ్స్తో హర్షిత్ రాణాకు చుక్కలు చూపించాడు.ఒకే ఓవర్లో ఏకంగా ఇరవై ఆరు పరుగులు పిండుకుని రాణాను పనిష్ చేశాడు. కానీ మంచి జోరు మీదున్న సమయంలో అనవసరపు పరుగు కోసం యత్నించి రనౌట్ అయ్యాడు. భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అద్భుత ఫీల్డింగ్ కారణంగా సాల్ట్(26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు- 43 రన్స్) వెనుదిరిగాడు.A moment of brilliance on the field by #ShreyasIyer and #PhilSalt is RUNOUT! 🙌🏻Start watching FREE on Disney+ Hotstar ➡️ https://t.co/gzTQA0IDnU#INDvENGOnJioStar 1st ODI 👉 LIVE NOW on Disney+ Hotstar, Star Sports 2, Star Sports 3, Sports 18 1 & Colors Cineplex! pic.twitter.com/n9hvFfJQpE— Star Sports (@StarSportsIndia) February 6, 2025 ఇక మరో ఓపెనర్ బెన్ డకెట్ సైతం 29 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో 32 పరుగులతో రాణించగా.. వన్డౌన్లో వచ్చిన రీఎంట్రీ స్టార్ జో రూట్(19) నిరాశపరిచాడు. ఇక హ్యారీ బ్రూక్ హర్షిత్ రాణా దెబ్బకు పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఇలాంటి తరుణంలో బట్లర్, జాకొబ్ బెతెల్తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.బట్లర్ 67 బంతుల్లో 52 పరుగులు చేయగా.. బెతెల్ 64 బాల్స్ ఎదుర్కొని 51 రన్స్ సాధించాడు. కానీ మిగతా వాళ్లు మాత్రం చేతులెత్తేశారు. లియామ్ లివింగ్స్టోన్(5), బ్రైడన్ కార్సే(10), ఆదిల్ రషీద్(8) త్వరత్వరగా పెవిలియన్ చేరగా.. టెయిలెండర్ జోఫ్రా ఆర్చర్ 18 బంతుల్లో 21 పరుగులతో అజేయంగా నిలిచాడు. 38.4 ఓవర్లలోనే..ఫలితంగా ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లతో చెలరేగగా.. మహ్మద్ షమీ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 38.4 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(15), కెప్టెన్ రోహిత్ శర్మ(2) విఫలమైనా.. శుబ్మన్ గిల్ (87) అద్భుత అర్థ శతకంతో మెరిశాడు. అతడికి తోడుగా నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ టీ20 తరహా మాదిరి 36 బంతుల్లోనే 59 పరుగులతో దుమ్ములేపాడు. ఇక ఆల్రౌండర్ అక్షర్ పటేల్(47 బంతుల్లోనే 52) కూడా హాఫ్ సెంచరీ సాధించాడు.మా ఓటమికి కారణం అదేఈ నేపథ్యంలో ఓటమి అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మాట్లాడుతూ.. ‘‘గెలవలేకపోయినందుకు బాధగా ఉంది. పవర్ ప్లేలో మేము అద్భుతంగా రాణించాం. కానీ త్వరత్వరగా వికెట్లు కోల్పోవడం ప్రభావం చూపింది. ఇంకో 40- 50 పరుగులు చేసేందుకు వికెట్ అనుకూలంగానే ఉంది. కానీ మేము ఆఖరిదాకా నిలవలేకపోయాం.ఏదేమైనా మా వాళ్లు శుభారంభం అందించారనేది వాస్తవం. ఆ సమయంలో మ్యాచ్ మాకు అనుకూలంగానే ఉంది. ఇక టీమిండియా విజయంలో శ్రేయస్ అయ్యర్కు క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది. అతడి అద్భుత ఇన్నింగ్స్ వల్ల భారత్కు మెరుగైన భాగస్వామ్యం లభించింది. ఏదేమైనా.. ఇకపై మేము ఇన్నింగ్స్ ఆసాంతం ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సి ఉంది’’ అని పరాజయానికి గల కారణాలను విశ్లేషించాడు. చదవండి: IND vs ENG: శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డు -
తుదిజట్టులో నాకసలు స్థానమే లేదు.. రోహిత్ కాల్ తర్వాత..: శ్రేయస్ అయ్యర్
టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) పునరాగమనంలో అదరగొట్టాడు. దేశవాళీ క్రికెట్లో అదరగొట్టిన ఈ ముంబైకర్.. ఇంగ్లండ్(India vs England)తో తొలి వన్డేలోనూ అదే ఫామ్ను కొనసాగించాడు. జట్టు కష్టాల్లో ఉన్న వేళ మెరుపు అర్ధ శతకంతో రాణించి భారత్ గెలుపొందడంలో తన వంతు పాత్ర పోషించాడు.అయ్యర్ షాకింగ్ కామెంట్స్ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్పై ప్రశంసల వర్షం కురుస్తుండగా.. విజయానంతరం అతడొక షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు. నాగ్పూర్ వన్డే తుదిజట్టులో తనకు తొలుత అసలు స్థానమే లేదని చెప్పాడు. అయితే, ఆఖరి నిమిషంలో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) నుంచి ఫోన్ కాల్ వచ్చిందని.. అప్పటికప్పుడు మ్యాచ్ కోసం తనను తాను మానసికంగా సన్నద్ధం చేసుకున్నట్లు తెలిపాడు.ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. ‘‘ఇదొక సరదా ఘటన. గత రాత్రి నేను సినిమా చూస్తూ సమయం గడిపేద్దామని అనుకున్న. అయితే, అంతలోనే అకస్మాత్తుగా కెప్టెన్ నుంచి కాల్ వచ్చింది. విరాట్ మోకాలు ఉబ్బిపోయింది కాబట్టి.. నీకు ఆడే అవకాశం రావొచ్చు అని మా కెప్టెన్ చెప్పాడు.తుదిజట్టులో నాకసలు స్థానమే లేదువెంటనే నా గదికి పరిగెత్తుకుని వెళ్లాను. మరో ఆలోచన లేకుండా నిద్రకు ఉపక్రమించాను. ఆ క్షణంలో ఆ ఆనందాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో కూడా నాకు తెలియలేదు. నిజానికి తొలి వన్డేలో మొదట నాకు ఆడే అవకాశం రాలేదు.దురదృష్టవశాత్తూ విరాట్ గామపడటం వల్ల నన్ను పిలిచారు. అయితే, ఏదో ఒక సమయంలో కచ్చితంగా నాకు అవకాశం వస్తుందనే ఉద్దేశంతో నన్ను నేను సన్నద్ధం చేసుకుంటూనే ఉన్నాను. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. గతంలో ఓసారి ఆసియా కప్ సమయంలో నేను గాయపడినపుడు నా స్థానంలో వేరొకరు వచ్చి శతకం బాదారు’’ అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.అదే నాకు ఉపయోగపడిందిఇక దేశవాళీ క్రికెట్ ఆడటం వల్ల ప్రయోజనాలను వివరిస్తూ.. ‘‘గతేడాది డొమెస్టిక్ సీజన్ను నేను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నా. ఇన్నింగ్స్ ఎలా నిర్మించాలన్న అంశం గురించి నేను మరిన్ని పాఠాలు నేర్చుకునే వీలు కలిగింది. కాలానుగుణంగా నా ఆటకు మెరుగులు దిద్దుకున్నా. నైపుణ్యాలకు పదును పెట్టుకున్నాను.ప్రతి విషయంలోనూ పరిపూర్ణత సాధించేందుకు కృషి చేశా. ముఖ్యంగా ఫిట్నెస్పై కూడా మరింత దృష్టి సారించాను. అదే నాకు ఇప్పుడిలా ఉపయోగపడింది’’ అని శ్రేయస్ అయ్యర్ సంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా ముంబై తరఫున రంజీల్లో తాజా సీజన్లో అయ్యర్ ఓ ద్విశతకం బాదాడు. అంతేకాదు.. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కెప్టెన్గా ముంబైకి టైటిల్ అందించాడు.నాలుగు వికెట్ల తేడాతో రోహిత్ సేన విజయంఇక భారత్- ఇంగ్లండ్ వన్డే విషయానికొస్తే.. నాగ్పూర్లో గురువారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బట్లర్ బృందం తొలుత బ్యాటింగ్ చేసింది. ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించినా.. భారత బౌలర్ల మెరుగైన ప్రదర్శన కారణంగా 47.4 ఓవర్లలో 248 పరుగులు చేసి ఆలౌట్ అయింది.లక్ష్య ఛేదనలో టీమిండియా పందొమ్మిది పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న వేళ వన్డౌన్ బ్యాటర్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ శుబ్మన్ గిల్(96 బంతుల్లో 87), నాలుగో స్థానంలో వచ్చిన శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 59), ఆల్రౌండర్ అక్షర్ పటేల్(47 బంతుల్లో 52) ధనాధన్ దంచికొట్టారు. ఫలితంగా 38.4 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి భారత్ టార్గెట్ను పూర్తి చేసింది.చదవండి: IND vs ENG: శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డుSHREYAS on F-IYER! 🔥@ShreyasIyer15 shifts gears by taking on Jofra Archer for back-to-back sixes! 💪Start watching FREE on Disney+ Hotstar#INDvENGOnJioStar 1st ODI 👉 LIVE NOW on Disney+ Hotstar, Star Sports 2, Star Sports 3, Sports 18-1 & Colors Cineplex! pic.twitter.com/HrQ3WLGuPe— Star Sports (@StarSportsIndia) February 6, 2025 -
శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డు..
నాగ్పూర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సత్తాచాటాడు. ఆరు నెలల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన అయ్యర్.. తన మెరుపు హాఫ్ సెంచరీతో అందరిని ఆకట్టుకున్నాడు. 249 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలోనే యశస్వి జైశ్వాల్(15), రోహిత్ శర్మ(2) వికెట్లను కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన అయ్యర్ ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. శుబ్మన్ గిల్తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో అయ్యర్ 30 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్గా 36 బంతులు ఎదుర్కొన్న శ్రేయస్.. 9 ఫోర్లు, 2 సిక్స్లతో 59 పరుగులు చేసి ఔటయ్యాడు.అయ్యర్ అరుదైన ఫీట్..కాగా ఈ మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే క్రికెట్లో నాలుగో స్ధానంలో బ్యాటింగ్ వచ్చి 50 కంటే ఎక్కువ సగటు, 100 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో వెయ్యికి పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా అయ్యర్ రికార్డులకెక్కాడు.ఇప్పటివరకు వరల్డ్ క్రికెట్లో నాలుగో స్దానంలో బ్యాటింగ్కు వచ్చిన ఎవరూ ఈ ఫీట్ సాధించలేదు. కానీ వేరే పొజిషేన్లో బ్యాటింగ్కు వచ్చి మాత్రం ఈ రికార్డును పలువురు సాధించారు. దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ క్వింటన్ డికాక్ ఓపెనర్గా, శుబ్మన్ గిల్(రెండో స్ధానం), ఏబీ డివిలియర్స్(ఐదో స్ధానం) ఈ ఘనతను సాధించారు.ఇంగ్లండ్ చిత్తు..ఇక ఈ మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను భారత్ చిత్తు చేసింది. ఇంగ్లండ్ నిర్ధేశించిన 249 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 6 వికెట్లు కోల్పోయి కేవలం 38.4 ఓవర్లలోనే అందుకుంది. భారత బ్యాటర్లలో శుబ్మన్ గిల్(87), శ్రేయస్ అయ్యర్(59), అక్షర్ పటేల్(52) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో సకీబ్ మహుమూద్, అదిల్ రషీద్ తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన 47.4 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ జోస్ బట్లర్ (67 బంతుల్లో 52; 4 ఫోర్లు), జాకబ్ బెతెల్ (64 బంతుల్లో 51; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేయగా...ఫిల్ సాల్ట్ (26 బంతుల్లో 43; 5 ఫోర్లు, 3 సిక్స్లు), డకెట్(32) దాటిగా ఆడారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, రవీంద్ర జడేజా తలా మూడేసి వికెట్లు పడగొట్టారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే కటక్ వేదికగా ఫిబ్రవరి 9న జరగనుంది.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన హర్షిత్ రాణా.. తొలి భారత ప్లేయర్గా -
చాలా సంతోషంగా ఉంది.. వారి వల్లే గెలిచాము: రోహిత్ శర్మ
ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్ను టీమిండియా(Teamindia) అద్భుతమైన విజయంతో ఆరంభించింది. నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్(England)ను భారత్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జోస్ బట్లర్(67 బంతుల్లో 4 ఫోర్లతో 52), జాకోబ్ బెతెల్(64 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 51) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలా మూడు వికెట్లు పడగొట్టగా.. మహమ్మద్ షమీ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ సాధించారు.గిల్, అయ్యర్ మెరుపులు..అనంతరం 249 పరుగుల లక్ష్యాన్ని భారత్ 6 వికెట్లు కోల్పోయి కేవలం 38.4 ఓవర్లలోనే అందుకుంది. భారత బ్యాటర్లలో భ్మన్ గిల్(96 బంతుల్లో 14 ఫోర్లతో 87 ), అక్షర్ పటేల్(47 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 52 ) శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 59) హాఫ్ సెంచరీలతో రాణించారు.ఆదిలోనే కెప్టెన్ రోహిత్ శర్మ(2),యశస్వి జైస్వాల్(15) వికెట్లను భారత్ కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన అయ్యర్.. ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. గిల్ ఓవైపు ఆచితూచి ఆడినప్పటికి.. అయ్యర్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. శ్రేయస్ ఔటైన తర్వాత గిల్ కూడా తన బ్యాట్కు పనిచెప్పాడు. అతడితో పాటు బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చిన అక్షర్ పటేల్ సైతం దూకుడుగా ఆడాడు. ఆఖరిలో రవీంద్ర జడేజా(12),హార్దిక్ పాండ్యా(9) ఆజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశారు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) స్పందించాడు. ఈ మ్యాచ్లో తమ కుర్రాళ్ల ప్రదర్శనపై హిట్మ్యాన్ సంతోషం వ్యక్తం చేశాడు."తొలి మ్యాచ్లోనే విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత మేము ఈ ఫార్మాట్లో ఆడాము. వీలైనంత త్వరగా తిరిగి రీగ్రూప్ అయ్యి విజయం కోసం ఏమి చేయాలన్నదానిపై దృష్టి పెట్టాలనుకున్నాము. మా అంచనాలకు తగ్గట్టుగానే ఈ మ్యాచ్లో మేము రాణించాము. అయితే ఇంగ్లండ్ ఓపెనర్లు ఆరంభంలో దూకుడుగా ఆడి మాపై ఒత్తిడి పెంచారు. కానీ మా బౌలర్లు అద్బుతమైన కమ్బ్యాక్ ఇచ్చారు. ఇది సుదీర్ఘమైన ఫార్మాట్. ఈ ఫార్మాట్లో తిరిగి పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతీ మ్యాచ్లోనూ మలుపులు ఉంటాయి. అంతేతప్ప మ్యాచ్ మన చేతి నుంచి చేజారిపోయిందని కాదు. తిరిగి కమ్బ్యాక్ ఇచ్చే స్కిల్స్ మన వద్ద ఉండాలి. ఈ క్రెడిట్ మొత్తం మా బౌలర్లకే దక్కుతుంది. నిజంగా వారి వల్లే తిరిగి గేమ్లోకి వచ్చాము. మిడిలార్డర్లో లెఫ్ట్ హ్యాండర్ ఉండాలని భావించాము. అందుకే అక్షర్ పటేల్కు తుది జట్టులో ఛాన్స్ ఇచ్చాము.అక్షర్ పటేల్ బ్యాట్తో ఏమి చేయగలడో మనందరికి తెలిసిందే. అతడు తానెంటో మరోసారి నిరూపించాడు. శ్రేయస్ అయ్యర్ సైతం అద్భుతంగా ఆడాడు. గిల్, అయ్యర్ నెలకొల్పిన భాగస్వామ్యం చాలా కీలకంగా మారింది. ఛాపింయన్స్ ట్రోఫీ ముందు మాకు ఎటువంటి ప్రత్యేక ప్రణాళికలు లేవు. అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణించి ముందుకు వెళ్లాలి అనుకుంటున్నామని" పోస్ట్ మ్యాచ్ప్రెజెంటేషన్లో రోహిత్ పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన హర్షిత్ రాణా.. తొలి భారత ప్లేయర్గా -
రాణించిన జడ్డూ, శ్రేయస్, గిల్, అక్షర్.. తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం
ఇంగ్లండ్తో (England) మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా (Team India) ఘనంగా ప్రారంభించింది. నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. టీమిండియా బౌలర్లు చెలరేగడంతో 248 పరుగులకే (47.4 ఓవర్లలో) ఆలౌటైంది. రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ను దెబ్బ కొట్టారు. షమీ, అక్షర్, కుల్దీప్ తలో వికెట్ తీశారు.ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (52), జేకబ్ బేతెల్ (51) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఓపెనర్లు బెన్ డకెట్ (32), ఫిలిప్ సాల్ట్ (43) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రూట్ 19, బ్రూక్ 0, లివింగ్స్టోన్ 5, కార్స్ 10, ఆదిల్ రషీద్ 8, సాకిబ్ మహమూద్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్ (21 నాటౌట్) బ్యాట్ ఝులిపించడంతో ఇంగ్లండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్.. 38.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ (2), యశస్వి జైస్వాల్ (15) త్వరగా ఔటైనా.. మిడిలార్డర్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్ (59), శుభ్మన్ గిల్ (87), అక్షర్ పటేల్ (52) అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా శ్రేయస్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి మధ్యలోనే భారత్ గెలుపు ఖరారు చేశాడు. లక్ష్యానికి చేరువైన తరుణంలో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. హార్దిక్ పాండ్యా (9 నాటౌట్), రవీంద్ర జడేజా (12 నాటౌట్) భారత్ను విజయతీరాలకు చేర్చారు. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఆర్చర్, జేకబ్ బేతెల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. రెండో వన్డే కటక్ వేదికగా ఫిబ్రవరి 9న జరుగనుంది.జడేజా@600ఈ మ్యాచ్లో టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా ఓ అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్లో మూడు వికెట్లు తీసిన జడేజా.. అంతర్జాతీయ క్రికెట్లో 600 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా భారత్ తరఫున ఈ ఘనత సాధించిన ఐదో బౌలర్గా రికార్డు నెలకొల్పాడు. జడ్డూకు ముందు అనిల్ కుంబ్లే (953), అశ్విన్ (765), హర్భజన్ సింగ్ (707), కపిల్ దేవ్ (687) మాత్రమే 600 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టారు. భారత్ తరఫున 600 వికెట్లు పడగొట్టిన తొలి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, అలాగే అంతర్జాతీయ క్రికెట్లో 600 వికెట్లతో పాటు 6000 పరుగులు చేసిన ఏకైక భారత స్పిన్నర్ జడేజానే.అరంగ్రేటంలోనే మెరిసిన రాణా.. నిరాశపరిచిన జైస్వాల్ఈ మ్యాచ్తో వన్డే క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన హర్షిత్ రాణా తనపై పెట్టుకున్న అంచనాలకు న్యాయం చేశాడు. ఈ మ్యాచ్లో తొలుత ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ఆతను.. ఆతర్వాత కోలుకుని మూడు వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఆరంభంలో ఫిల్ సాల్ట్ రాణాకు చుక్కలు చూపించాడు. ఇదే మ్యాచ్తో వన్డే అరంగేట్రం చేసిన మరో భారత ఆటగాడు యశస్వి జైస్వాల్ నిరాశపరిచాడు. ఈ మ్యాచ్లో జైస్వాల్ 22 బంతుల్లో 15 పరుగులు చేసి ఔటయ్యాడు.కొనసాగిన రోహిత్ వైఫల్యాల పరంపరఅంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ వైఫల్యాల పరంపర కొనసాగింది. ఈ మ్యాచ్లో అతను 7 బంతులు ఎదుర్కొని 2 పరుగులకే ఔటయ్యాడు. ఇటీవలికాలంలో ఫార్మాట్లకతీతంగా రోహిత్ ప్రదర్శనలు చాలా దారుణంగా ఉన్నాయి.గత 16 ఇన్నింగ్స్ల్లో రోహిత్ కేవలం ఒకే అర్ద సెంచరీ చేశాడు. గత ఏడాదంతా కలుపుకుని రోహిత్ చేసింది కేవలం 166 పరుగులే. విరాట్ దూరం.. పంత్కు నో ప్లేస్ఈ మ్యాచ్కు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి దూరంగా ఉన్నాడు. మోకాలి గాయం కారణంగా కోహ్లి ఈ మ్యాచ్లో ఆడలేదు. గాయాల కారణంగా కోహ్లి మ్యాచ్లకు దూరం కావడం చాలా అరుదు. ఈ మ్యాచ్లో మరో భారత స్టార్ ఆటగాడికి కూడా చోటు దక్కలేదు. వికెట్కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ బెంచ్కే పరిమితమయ్యాడు. కేఎల్ రాహుల్ అదనంగా వికెట్కీపింగ్ బాధ్యతలు మోశాడు. -
యజమానులు ఎవరైనా.. జట్టు మాత్రం నాదే: రిక్కీ పాంటింగ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2025లో సరికొత్త పంజాబ్ కింగ్స్(Punjab Kings)ను చూస్తారని హెడ్కోచ్ రిక్కీ పాంటింగ్(Ricky Ponting) అన్నాడు. వేలం విషయంలో ఫ్రాంఛైజీ యజమాన్యం తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చిందని.. అందుకే తన వ్యూహాలను పక్కాగా అమలు చేయగలిగినట్లు తెలిపాడు. కోరుకున్న ఆటగాళ్లను దక్కించుకోవడంలో తాము సఫలమయ్యామన్నాడు.ఇక మైదానంలో మెరుగైన ఫలితాలు సాధించడంపైనే ప్రస్తుతం తన దృష్టి మొత్తం కేంద్రీకృతమై ఉన్నట్లు రిక్కీ పాంటింగ్ పేర్కొన్నాడు. కాగా ఈ ఆస్ట్రేలియా దిగ్గజానికి ఐపీఎల్తో గత పదేళ్లుగా అనుబంధం ఉంది.ఢిల్లీ క్యాపిటల్స్తో ఏడేళ్లుఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) ప్రాంఛైజీకి అత్యధికంగా ఏడేళ్లు అతడు హెడ్కోచ్గా పనిచేశాడు. 2018- 2024 వరకు అతడి మార్గదర్శనంలో ఢిల్లీ జట్టు మిశ్రమ ఫలితాలు అందుకుంది. అయితే, అత్యుత్తమంగా 2020లో ఫైనల్కు చేరింది. కానీ రన్నరప్తోనే సరిపెట్టుకుంది. ఇక అంతకు ముందు 2019లో.. ఆ తర్వాత 2021లో ప్లే ఆఫ్స్ వరకు చేరగలిగింది.కానీ 2022-2024 వరకు ఒక్కసారి కూడా టాప్-4లోనూ అడుగుపెట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ యాజమాన్యం రిక్కీ పాంటింగ్తో తమకున్న సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకుంది. అనంతరం.. పంజాబ్ కింగ్స్ పాంటింగ్ను తమ కుటుంబంలోకి ఆహ్వానించి ప్రధాన కోచ్గా నియమించింది.చెత్త రికార్డుతో పంజాబ్ఇక ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్కు ఉన్న చెత్త రికార్డు గురించి తెలిసిందే. క్యాష్ రిచ్ లీగ్ ఆరంభ ఎడిషన్(2008) నుంచి ఇప్పటిదాకా కేవలం రెండుసార్లే ప్లే ఆఫ్స్ చేరింది. ఆఖరి నిమిషంలో చేతులెత్తేసి మ్యాచ్లు చేజార్చుకున్న సందర్భాలు కోకొల్లలు. అయితే, ఈసారి మాత్రం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలనే ఆలోచనతో పాంటింగ్ను రంగంలోకి దింపింది.ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ యాజమాన్యం గురించి రిక్కీ పాంటింగ్ హెవీ గేమ్స్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘వేలానికి ముందు మేము అన్ని రకాలుగా చర్చించుకున్నాం. అంతా అనుకున్నట్లే జరిగినందుకు నాకు సంతోషంగా ఉంది.యజమానులు వాళ్లే అయినా.. జట్టు పూర్తిగా నాదేఇక ఇప్పటి నుంచి ఫ్రాంఛైజీ యజమానులు ఎవరైనా సరే.. జట్టు మాత్రం పూర్తిగా నా చేతుల్లో ఉంటుంది. జట్టు గత చరిత్ర గురించి నేను చాలా విషయాలు విన్నాను. ఇకపై అందుకు భిన్నంగా ఉండాలంటే నాకు స్వేచ్ఛ కావాలని అడిగాను. అందుకు ఓనర్లు కూడా అంగీకరించారు. ఫ్రాంఛైజీ యజమానులతో పాటు అడ్మినిస్ట్రేటర్లు, బోర్డు డైరెక్టర్లు.. ఇలా ప్రతి ఒక్కరికి నా కార్యచరణ గురించి వివరించాను. నా శైలిలో జట్టును ముందుకు తీసుకువెళ్తాను. ముఖ్యంగా భారత క్రికెటర్లపై మేము ఎక్కువగా దృష్టి పెట్టాము. వారి రాక మాకు శుభారంభం లాంటిదే’’ అని రిక్కీ పాంటింగ్ పేర్కొన్నాడు.రికార్డు ధరకు అయ్యర్ను కొనికాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ రికార్డు స్థాయిలో .. టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్ కోసం ఏకంగా రూ. 26.75 కోట్లు ఖర్చుపెట్టింది. గత సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్కు టైటిల్ అందించిన ఈ విన్నింగ్ కెప్టెన్ను తమ సారథిగా నియమించింది. అంతేకాదు.. వేలానికి ముందు ప్రభ్సిమ్రన్ సింగ్, శశాంక్ సింగ్లను మాత్రమే రిటైన్ చేసుకున్న పంజాబ్.. వేలంలో మరో టీమిండియా స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ను రూ. 18 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక పంజాబ్ జట్టుకు నెస్ వాడియా, ప్రీతి జింటా సహ యజమానులు అన్న విషయం తెలిసిందే.చదవండి: అతడికి ఇదే చివరి ఐసీసీ టోర్నీ.. టీమిండియా గెలిస్తే చరిత్రే: సురేశ్ రైనా -
Rohit Sharma: కొంపదీసి అందుకోసమేనా ఇదంతా?: గావస్కర్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)పై భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్(Sunil Gavaskar) విమర్శలు గుప్పించాడు. ఈ ఇద్దరు ఏదో మొక్కుబడిగా రంజీలు ఆడుతున్నారే తప్ప.. జట్టును గెలిపించాలనే తపన కనిపించలేదన్నాడు. టెక్నిక్తో బ్యాటింగ్ చేయాల్సిన చోట.. దూకుడు ప్రదర్శించి వికెట్లు పారేసుకోవడం సరికాదని హితవు పలికాడు.కాగా ఇటీవల భారత టెస్టు జట్టు ఘోర పరాభవాలు చవిచూసిన విషయం తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్తో 3-0తో వైట్వాష్ కావడం సహా.. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది.కెప్టెన్గా, బ్యాటర్గా విఫలంఈ రెండు సిరీస్లలో కెప్టెన్గా, బ్యాటర్గా రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా ఆసీస్ గడ్డపై కనీసం ఒక్క అర్ధ శతకం కూడా సాధించలేకపోయాడు. ఈ నేపథ్యంలో టెస్టు క్రికెట్కు ఇక రిటైర్మెంట్ ప్రకటించాలంటూ రోహిత్కు మాజీ క్రికెటర్ల నుంచి సూచనలు వచ్చాయి.అయితే, ఇప్పట్లో తాను టెస్టు క్రికెట్ నుంచి వైదొలగబోనని రోహిత్ శర్మ కుండబద్దలు కొట్టాడు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిబంధనల ప్రకారం.. రంజీ ట్రోఫీ బరిలో దిగాడు. సొంతజట్టు ముంబై తరఫున రంజీ రెండో దశ పోటీల్లో భాగంగా జమ్మూ కశ్మీర్తో మ్యాచ్ ఆడాడు.రంజీల్లోనూ నిరాశేకానీ.. ఇక్కడ కూడా రోహిత్ శర్మ తీవ్రంగా నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్లో మూడు.. రెండో ఇన్నింగ్స్లో 28 పరుగులు చేశాడు. మరో టీమిండియా స్టార్, ఇప్పటికే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన శ్రేయస్ అయ్యర్ కూడా ఈ మ్యాచ్లో విఫలమయ్యాడు.రెండు ఇన్నింగ్స్లో వరుసగా 11, 17 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఈ మ్యాచ్లో జమ్మూ కశ్మీర్ చేతిలో.. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఐదు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. నిజానికి ముంబై కాస్తైనా పరువు నిలబెట్టుకుందంటే అందుకు లోయర్ ఆర్డర్ బ్యాటర్లే కారణం.చెలరేగిన శార్దూల్, తనుశ్తొలి ఇన్నింగ్స్లో మెరుపు అర్థ శతకం(57 బంతుల్లో 51) బాదిన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్.. రెండో ఇన్నింగ్స్లో శతకం(119)తో సత్తా చాటాడు,. ఇక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ తనుశ్ కొటియాన్ సైతం 26, 62 పరుగులు చేశాడు. ఇక శార్దూల్ ఈ మ్యాచ్లో రెండు వికెట్లు కూడా తీశాడు.ఈ నేపథ్యంలో ముంబై మాజీ ఆటగాడు, టీమిండియా మాజీ కెప్టెన్ సునిల్ గావస్కర్ రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ల ఆట తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘‘ ఈ ఇద్దరూ తమ స్థాయికి తగ్గట్లు ఆడలేదు. అసలు ఆడాలన్న కసి కూడా వారిలో కనిపించలేదు.కొంపదీసి అందుకోసమేనా ఇదంతా?వీళ్లు నిజంగానే రంజీలు ఆడాలనుకున్నారా. లేదంటే.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు కోల్పోకూడదు, వాటిపై ప్రభావం పడకూడదన్న ఏకైక కారణంతోనే బరిలోకి దిగారా? అనిపించింది. మరోవైపు.. శార్దూల్.. తనూశ్.. రెడ్బాల్ క్రికెట్లో జాగ్రత్తగా ఆడుతూనే.. దూకుడుగా ఎలా ఉండాలో చూపించారు’’ అని గావస్కర్ పేర్కొన్నాడు.ఏదేమైనా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ వంటి టీమిండియా స్టార్లు ఈ టోర్నీలో ఆడటం వల్ల యువ ఆటగాళ్లలో కొత్త ఉత్సాహం నింపిందని గావస్కర్ అన్నాడు. వీరి నుంచి ఆయుశ్ మాత్రే వంటి వాళ్లు సలహాలు, సూచనలు తీసుకునేందుకు వీలు కలిగిందని పేర్కొన్నాడు.కాగా వరుస సెంచరీలతో జోరు మీదున్న ఆయుశ్ మాత్రే.. రోహిత్ శర్మ కోసం జట్టులో తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. మరోవైపు.. యశస్వి జైస్వాల్(4, 26) కూడా రోహిత్కు ఓపెనింగ్ జోడీగా దిగి.. ఈ మ్యాచ్లో విఫలమయ్యాడు.చదవండి: Ab De Villiers: సౌతాఫ్రికా కెప్టెన్గా డివిలియర్స్.. టీ20 టోర్నీతో రీఎంట్రీ -
తుస్సుమన్న టీమిండియా స్టార్లు.. శ్రేయస్, శివమ్ దూబే కూడా..!
రంజీ ట్రోఫీ 2024-25 ఎడిషన్లో భాగంగా జమ్మూ అండ్ కశ్మీర్తో జరుగుతున్న మ్యాచ్లో స్టార్ ప్యాకప్ ఉన్న ముంబై టీమ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. తొలి ఇన్నింగ్స్లో 120 పరుగులకే ఆలౌటైన ఈ మాజీ రంజీ ఛాంపియన్.. రెండో ఇన్నింగ్స్లోనూ పేలవ ప్రదర్శన కొనసాగిస్తుంది. రెండో రోజు లంచ్ విరామం సమయానికి ముంబై 86 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆ జట్టు జమ్మూ అండ్ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ను సమం చేసింది. జమ్మూ అండ్ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్లో 206 పరుగులు చేసింది.రెండో ఇన్నింగ్స్లోనూ విఫలమైన స్టార్లు జమ్మూ అండ్ కశ్మీర్తో మ్యాచ్లో ముంబై తరఫున బరిలోకి దిగిన టీమిండియా స్టార్లు రెండో ఇన్నింగ్స్లోనూ విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్లో 4 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్.. సెకెండ్ ఇన్నింగ్స్లో 26 పరుగులకు (5 ఫోర్లు) ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో 3 పరుగులే బిచానా ఎత్తిన రోహిత్ శర్మ.. సెకెండ్ ఇన్నింగ్స్లో కాస్త పర్వాలేదన్నట్టుగా 35 బంతుల్లో 28 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో రోహిత్ 2 సొగసైన బౌండరీలు, 3 భారీ సిక్సర్లు బాది తన పాత రోజులను గుర్తు చేశాడు.శ్రేయస్ మరోసారి..!ఈ మ్యాచ్లో టీమిండియా వన్డే ప్లేయర్ శ్రేయస్ అయ్యర్కు రెండు ఇన్నింగ్స్ల్లో శుభారంభాలే లభించాయి. అయితే వాటిని పెద్ద స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో తొలి బంతికే సిక్సర్ బాది జోష్ మీదున్నట్లు కనిపించిన శ్రేయస్ 7 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. సెకెండ్ ఇన్నింగ్స్లోనూ అదే జోష్ను ప్రదర్శించిన శ్రేయస్.. వచ్చీ రాగానే ఎడాపెడా నాలుగు బౌండరీలు (16 బంతుల్లో 17 పరుగులు) బాది ఔటయ్యాడు.రెండో ఇన్నింగ్స్లోనూ డకౌటైన శివమ్ దూబేఈ మ్యాచ్లో విధ్వంసకర ఆటగాడు శివమ్ దూబే రెండు ఇన్నింగ్స్ల్లోనూ డకౌటై నిరాశపరిచాడు. శ్రేయస్, శివమ్ దూబేల వికెట్లు ఒకే స్కోర్ వద్ద కోల్పోవడంతో ముంబై కష్టాల్లో పడింది. లంచ్ సమయానికి రహానే (12), షమ్స్ ములానీ (0) క్రీజ్లో ఉన్నారు.ముంబై పరువు కాపాడిన శార్దూల్ఈ మ్యాచ్లో ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ ముంబై పరువు కాపాడాడు. 100లోపే ఆలౌటైయ్యేలా కనిపించిన ముంబైను శార్దూల్ తన హాఫ్ సెంచరీతో గట్టెక్కించాడు. తొలి ఇన్నింగ్స్లో మొత్తం 57 బంతులు ఎదుర్కొన్న శార్దూల్ 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేశాడు. శార్దూల్కు తనుశ్ కోటియన్ (26, 5 ఫోర్లు) కాసేపు సహకరించడంతో ముంబై 100 పరుగుల మార్కును దాటింది. -
Shreyas Iyer: వరల్డ్కప్లో మా ఇద్దరిది కీలక పాత్ర.. ఈసారీ!
చాంపియన్స్ ట్రోఫీ-2025 నేపథ్యంలో టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ ఐసీసీ టోర్నీలో పాల్గొనే జట్టులో తాను తప్పక చోటు దక్కించుకుంటాననే ధీమా వ్యక్తం చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్లో తాను ఏ స్థానంలోనైనా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.కాగా గతేడాది శ్రీలంకతో వన్డే సిరీస్ సందర్భంగా శ్రేయస్ అయ్యర్ చివరిసారిగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత ఐపీఎల్తో పాటు దేశీ క్రికెట్కే పరిమితమైన ఈ ముంబై బ్యాటర్.. 2024లో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్గా జట్టుకు టైటిల్ అందించాడు. అంతేకాదు.. రంజీ ట్రోఫీ, ఇరానీ కప్ గెలిచిన జట్లలో సభ్యుడు.అదే విధంగా తన కెప్టెన్సీలో ముంబైకి దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అందించాడు. దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ దుమ్ములేపాడు. రెండు భారీ శతకాలతో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీకి అయ్యర్ ఎంపిక కావడం లాంఛనప్రాయమే అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.వరల్డ్కప్లో మా ఇద్దరిది కీలక పాత్ర.. ఈసారీ!ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ స్వయంగా ఈ విషయంపై స్పందించాడు. వన్డే వరల్డ్ప్-2023 ప్రదర్శన ఆధారంగా తనకు చాంపియన్స్ ట్రోఫీలోనూ ఆడే అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘‘నేను ఏ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకైనా సిద్ధంగా ఉన్నాను.గత వరల్డ్కప్ టోర్నీలో నేను, కేఎల్ రాహుల్(KL Rahul) మిడిలార్డర్లో కీలక పాత్ర పోషించాం. మా ఇద్దరికీ ఆ ఈవెంట్ అద్భుతంగా సాగింది. అయితే, దురదృష్టవశాత్తూ ఫైనల్లో మా ప్రణాళికలను పక్కాగా అమలు చేయలేకపోయాం. ఏదేమైనా చాంపియన్స్ ట్రోఫీ ఆడే టీమిండియాకు ఎంపికైతే నాకు అంతకంటే గర్వకారణం మరొకటి ఉండదు. దేశానికి ప్రాతినిథ్యం వహించడం ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది’’ అని శ్రేయస్ అయ్యర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో పేర్కొన్నాడు.రెండు శతకాలు బాదికాగా భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ ఈవెంట్లో శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో.. వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేశారు. ఈ టోర్నమెంట్లో మిడిలార్డర్లో బరిలోకి దిగిన అయ్యర్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. పదకొండు ఇన్నింగ్స్లో కలిపి ఈ కుడిచేతి వాటం బ్యాటర్ సగటు 66.25తో 530 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, మూడు హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం.ఫైనల్లో మాత్రం విఫలంఅయితే, అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో(India vs Australia) మాత్రం అయ్యర్ తేలిపోయాడు. ఆసీస్ కెప్టెన్, పేస్ బౌలర్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో జోష్ ఇంగ్లిస్కు క్యాచ్ ఇచ్చి నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. మరోవైపు.. ఈ మెగా టోర్నీలో కేఎల్ రాహుల్ 452 పరుగులు సాధించాడు. ఫైనల్లో 66 పరుగులు చేసి.. టీమిండియా ఇన్నింగ్స్లో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు.పంజాబ్ కెప్టెన్గాఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025 మెగా వేలంలో శ్రేయస్ అయ్యర్పై కాసుల వర్షం కురిసిన విషయం తెలిసిందే. గతేడాది కోల్కతా నైట్ రైడర్స్కు కెప్టెన్గా వ్యవహరించి ట్రోఫీ అందించిన ఈ ఆటగాడి కోసం పంజాబ్ కింగ్స్ భారీ మొత్తం ఖర్చు పెట్టింది. ఏకంగా రూ. 26.75 కోట్లకు అయ్యర్ను సొంతం చేసుకుంది. ఫలితంగా క్యాష్ రిచ్ లీగ్లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన రెండో ఆటగాడిగా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. ఇక అతడిని తమ కెప్టెన్గా ప్రకటిస్తూ పంజాబ్ కింగ్స్ ఆదివారం ప్రకటన విడుదల చేసింది. కాగా ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ టీమిండియా సూపర్స్టార్ రిషభ్ పంత్ను రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఈ మెగా లీగ్లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఈ వికెట్ కీపర్ బ్యాటర్ చరిత్రకెక్కాడు.చదవండి: చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన ఆరోజే: బీసీసీఐ ఉపాధ్యక్షుడు -
IPL 2025: కెప్టెన్ పేరును ప్రకటించిన పంజాబ్ కింగ్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్(Punjab Kings) జట్టు తమ కొత్త కెప్టెన్ పేరును ప్రకటించింది. ఐపీఎల్-2025 సీజన్కు గానూ టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)ను తమ సారథిగా ఎంపిక చేసుకుంది. కాగా క్యాష్ రిచ్ లీగ్లో కెప్టెన్గా ఈ ముంబై బ్యాటర్కు మంచి అనుభవం ఉంది. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్లకు అతడు నాయకుడిగా వ్యవహరించాడు.కోల్కతాకు టైటిల్ అందించిఇక గతేడాది ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ను చాంపియన్గా నిలిపిన 30 ఏళ్ల శ్రేయస్ అయ్యర్కు భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే, మెగా వేలం-2025(IPL Mega Auction 2025)కి ముందు కోల్కతా ఫ్రాంఛైజీ అతడిని రిటైన్ చేసుకుంటుందని విశ్లేషకులు భావించగా.. శ్రేయస్ మాత్రం జట్టుతో బంధాన్ని తెంచుకునేందుకే ఇష్టపడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అతడు రూ. 2 కోట్ల కనీస ధరతో ఆక్షన్లోకి వచ్చాడు.భారీ ధర.. ఈ చాంపియన్ కెప్టెన్ను దక్కించుకునేందుకు పాత జట్టు కోల్కతా తొలుత రంగంలోకి దిగగా.. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ తగ్గేదేలే అన్నట్లు ధరను పెంచుకుంటూ పోయాయి. నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన వేలం పాటలో ఆఖరికి పంజాబ్ నెగ్గింది. రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 26 కోట్ల 75 లక్షలు పెట్టి శ్రేయస్ అయ్యర్ను కొనుగోలు చేసింది. తాజాగా అతడికి పగ్గాలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.నమ్మకాన్ని నిలబెట్టుకుంటాఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్తో మరోసారి కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా చూస్తున్నా. జట్టులో నైపుణ్యానికి కొదవలేదు. ఇప్పటికే నిరూపించుకున్న ఆటగాళ్లతో పాటు ప్రతిభావంతులు చాలా మంది అందుబాటులో ఉన్నారు.పంజాబ్ కింగ్స్ జట్టుకు తొలి ఐపీఎల్ టైటిల్ అందించేందుకు నావంతు కృషి చేస్తా’ అని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఇక.. ప్రధాన కోచ్ పాంటింగ్ మాట్లాడుతూ ‘శ్రేయస్కు ఆటపై మంచి అవగాహన ఉంది. కెప్టెన్గా ఇప్పటికే నిరూపించుకున్నాడు. గతంలో అతడితో కలిసి పనిచేశా. సీజన్ కోసం ఆతృతగా చూస్తున్నా’ అని అన్నాడు.కాగా ఇటీవల శ్రేయస్ అయ్యర్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. 2024లో రంజీ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీలు గెలిచిన ముంబై జట్టులో శ్రేయస్ అయ్యర్ సభ్యుడు. అంతేకాదు.. ఇటీవల అతడి కెప్టెన్సీలో ముంబై టీమ్ దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ టైటిల్ గెలిచింది.సూపర్ ఫామ్లోఅదే విధంగా.. దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ శ్రేయస్ అయ్యర్ భారీ శతకాలతో దుమ్ములేపాడు. తదుపరి అతడు ఇంగ్లండ్తో స్వదేశంలో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్తో టీమిండియా తరఫున పునరాగమనం చేసే అవకాశం ఉంది. అయితే, అంతకంటే ముందు ఇంగ్లండ్తో జరిగే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడే భారత జట్టులో మాత్రం అయ్యర్కు చోటు దక్కలేదు. కాగా శ్రేయస్ అయ్యర్ చివరిసారిగా గతేడాది శ్రీలంకతో వన్డే సిరీస్లో పాల్గొన్నాడు.గతేడాది ఫ్లాప్ షోఇదిలా ఉంటే.. పంజాబ్ కింగ్స్ ఇంత వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. ఇక గత సీజన్లో శిఖర్ ధావన్ కెప్టెన్గా వ్యవహరించగా.. గాయం వల్ల అతడు ఆదిలోనే తప్పుకోగా.. ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్ కర్రన్ జట్టును ముందుకు నడిపించాడు. అయితే, పద్నాలుగు మ్యాచ్లకు గానూ పంజాబ్ కేవలం ఐదే గెలిచి.. తొమ్మిదో స్థానంతో సీజన్ను ముగించింది. చదవండి: వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ.. సంచలనం సృష్టించిన ముంబై బ్యాటర్𝐒𝐡𝐫𝐞𝐲𝐚𝐬 𝐈𝐲𝐞𝐫 ➡️ 𝐓𝐡𝐞 𝐜𝐡𝐨𝐬𝐞𝐧 𝐨𝐧𝐞! ©️♥️#CaptainShreyas #SaddaPunjab #PunjabKings pic.twitter.com/EFxxWYc44b— Punjab Kings (@PunjabKingsIPL) January 12, 2025 -
అరివీర భయంకరమైన ఫామ్లో అయ్యర్.. టీమిండియాలో చోటు పక్కా..!
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఇటీవలి కాలంలో ఫార్మాట్లకతీతంగా విశేషంగా రాణిస్తున్నాడు. అయ్యర్ ఈ ఏడాది దేశవాలీ టోర్నీల్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫామ్ లేమి కారణంగా జాతీయ జట్టులో చోటు కోల్పోయిన శ్రేయస్.. దేశవాలీ క్రికెట్లో మెరుగ్గా ఆడుతున్నాడు. శ్రేయస్ మిగతా టీమిండియా ఆటగాళ్లలా బీరాలకు పోకుండా తనను తాను తగ్గించుకుని దేశవాలీ క్రికెట్ ఆడాడు. శ్రేయస్ ఈ ఏడాది రంజీల్లో 90.4 సగటున, 88.8 స్ట్రయిక్రేట్తో 452 పరుగులు చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో 188.5 స్ట్రయిక్రేట్తో 49.3 సగటున 345 పరుగులు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో శ్రేయస్ పట్టపగ్గాల్లేకుండా బ్యాట్ను ఝులిపిస్తున్నాడు. వీహెచ్టీలో శ్రేయస్ ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్ల్లో రెండు సెంచరీల సాయంతో 325 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో శ్రేయస్ యావరేజ్ చూస్తే కళ్లు చెదురుతాయి. శ్రేయస్ 325 సగటున పరుగులు సాధించాడు. అతని స్ట్రయిక్రేట్ 131.6గా ఉంది. ఈ గణాంకాలతో శ్రేయస్ భారత సెలెక్టర్లకు సవాలు విసురుతున్నాడు. పలు నివేదికల ప్రకారం శ్రేయస్ ఇంగ్లండ్ సిరీస్లతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఎంపిక కానున్నట్లు తెలుస్తుంది. శ్రేయస్ ఇదే భీకర ఫామ్ను కొనసాగిస్తే పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత్కు తిరుగే ఉండదు. శ్రేయస్ టీమిండియా తరఫున చివరిగా గతేడాది ఆగస్ట్లో శ్రీలంకతో వన్డే మ్యాచ్ ఆడాడు. శ్రేయస్ తన చివరి టీ20ను 2023 డిసెంబర్లో ఆడాడు. బెంగళూరులో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ శ్రేయస్కు చివరి టీ20. టెస్ట్ల విషయానికొస్తే..శ్రేయస్ టెస్ట్ల రికార్డు అంత బాలేదు. 2021 నవంబర్లో తొలి టెస్ట్ మ్యాచ్ (న్యూజిలాండ్తో) ఆడిన శ్రేయస్.. 2024 ఫిబ్రవరిలో తన చివరి టెస్ట్ మ్యాచ్ (ఇంగ్లండ్) ఆడాడు. 33 ఏళ్ల శ్రేయస్ టీమిండియాలో చోటే లక్ష్యంగా దేశవాలీ క్రికెట్లో సత్తా చాటుతున్నాడు. ఇంగ్లండ్తో పరిమత ఓవర్ల సిరీస్లు, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్లను ఈనెల 12వ తేదీలోపు ప్రకటించనున్నారు. చాలా నివేదికలు రెండు ఫార్మాట్లలో శ్రేయస్కు చోటు పక్కా అని అంటున్నాయి. శ్రేయస్ రాకతో మిడిలార్డర్లో టీమిండియా అత్యంత పటిష్టంగా మారుతుంది. ప్రస్తుత ఫామ్ ప్రకారం చూస్తే శ్రేయస్ ఛాంపియన్స్ ట్రోఫీలో చెలరేగడం ఖాయంగా కనిపిస్తుంది. వన్డే ఫార్మాట్లో మొదటి నుంచి శ్రేయస్కు తిరుగులేదు. ఈ ఫార్మాట్లో అతను 62 మ్యాచ్లు ఆడి 47.47 సగటున, 101.21 స్ట్రయిక్రేట్తో 2421 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20ల్లోనూ శ్రేయస్కు మెరుగైన రికార్డే ఉంది. పొట్టి ఫార్మాట్లో శ్రేయస్ 51 మ్యాచ్లు ఆడి 136.12 స్ట్రయిక్రేట్తో, 30.66 సగటున 1104 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ల్లో అంతంతమాత్రంగా రాణించిన శ్రేయస్.. 14 మ్యాచ్ల్లో 36.86 సగటున 811 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.భారత్, ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ షెడ్యూల్..జనవరి 22- తొలి టీ20(కోల్కతా)జనవరి 25- రెండో టీ20(చెన్నై)జనవరి 28- మూడో టీ20(రాజ్కోట్)జనవరి 31- నాలుగో టీ20(పుణే)ఫిబ్రవరి 2- ఐదో టీ20(ముంబై, వాంఖడే)ఈ సిరీస్లోని మ్యాచ్లన్నీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి.భారత్, ఇంగ్లండ్ మధ్య వన్డే సిరీస్ షెడ్యూల్..ఫిబ్రవరి 6- తొలి వన్డే(నాగ్పూర్)ఫిబ్రవరి 9- రెండో వన్డే(కటక్)ఫిబ్రవరి 12- మూడో వన్డే(అహ్మదాబాద్)ఛాంపియన్స్ ట్రోఫీలో భారత షెడ్యూల్..ఫిబ్రవరి 20- బంగ్లాదేశ్ (దుబాయ్)ఫిబ్రవరి 23- పాకిస్తాన్ (దుబాయ్)మార్చి 2- న్యూజిలాండ్ (దుబాయ్)ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్.. పాక్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్లతో కలిసి గ్రూప్-ఏలో ఉంది. గ్రూప్ దశ మ్యాచ్ల అనంతరం తొలి రెండు స్థానాల్లో ఉండే జట్లు సెమీస్కు అర్హత సాధిస్తాయి. తొలి సెమీస్ మార్చి 4న జరుగుతుంది. ఈ మ్యాచ్లో గ్రూప్-ఏ టాపర్, గ్రూప్-బిలో రెండో స్థానంలో ఉండే జట్టు పోటీపడతాయి. మార్చి 5న రెండో సెమీఫైనల్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో గ్రూప్-బి టాపర్, గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉండే జట్టును ఢీకొంటుంది. సెమీస్లో విజేతలు మార్చి 9న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. -
శ్రేయస్ అయ్యర్ విధ్వంసకర సెంచరీ..
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ముందు భారత సెలక్టర్లకు మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) సవాల్ విసురుతున్నాడు. జాతీయ జట్టుకు దూరంగా ఉన్న అయ్యర్.. దేశీవాళీ క్రికెట్లో పరుగులు వరద పారిస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో శ్రేయస్ అయ్యర్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు.ఈ టోర్నీలో ముంబై జట్టుకు సారథ్యం వహిస్తున్న అయ్యర్.. పుదుచ్చేరితో జరుగుతున్న రౌండ్ 6 మ్యాచ్లో అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ముంబై జట్టును అయ్యర్ తన మెరుపు సెంచరీతో అదుకున్నాడు. కేవలం 133 బంతులు ఎదుర్కొన్న అయ్యర్.. 16 ఫోర్లు,4 సిక్స్లతో 137 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా ముంబై నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 290 పరుగులు చేసింది. పుదుచ్చేరి బౌలర్లలో సాగర్ దేశీ, గౌరవ్ యాదవ్, గురువర్దన్ సింగ్, అంకిత్ శర్మ తలా రెండు వికెట్లు సాధించారు.రెండో సెంచరీ.. కాగా ఈ టోర్నీలో శ్రేయస్కు ఇది రెండో సెంచరీ. ఈ దేశీవాళీ టోర్నీలో ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడిన అయ్యర్.. 138.66 స్ట్రైక్ రేటుతో 312 పరుగులు చేశాడు. అంతకుముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ అయ్యర్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. దీంతో ఈ ముంబై ఆటగాడికి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసే భారత జట్టులో చోటు దక్కే అవకాశముంది. -
శ్రేయస్ అయ్యర్ మెరుపు ఇన్నింగ్స్.. తిలక్ వర్మకు చేదు అనుభవం
విజయ్ హజారే ట్రోఫీ(VHT) 2024-25 సీజన్లో ముంబై జట్టు తొలి గెలుపు నమోదు చేసింది. అహ్మదాబాద్లో సోమవారం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ను మూడు వికెట్ల తేడాతో ఓడించింది. కాగా దేశవాళీ వన్డే టోర్నమెంట్ VHTలో భాగంగా గ్రూప్-‘సి’లో ఉన్న ముంబై తమ తొలి మ్యాచ్లో కర్ణాటకతో తలపడింది.అయితే, ఈ లిస్ట్-‘ఏ’ మ్యాచ్లో ముంబై సారథి శ్రేయస్ అయ్యర్ విధ్వంసకర శతకం(55 బంతుల్లో 114 నాటౌట్) బాదినా ఫలితం లేకపోయింది. కర్ణాటక చేతిలో ఏడు వికెట్ల తేడాతో ముంబై పరాజయం చవిచూసింది. ఈ క్రమంలో హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో మాత్రం ముంబై ఎటువంటి పొరపాట్లకు తావివ్వలేదు.టాస్ గెలిచిన ముంబై.. తిలక్ వర్మ డకౌట్నరేంద్ర మోదీ స్టేడియం ‘బి’ గ్రౌండ్లో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ జట్టు.. ముంబై బౌలర్ల ధాటికి 169 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్(64), అభిరథ్ రెడ్డి(35) రాణించినా.. కెప్టెన్ తిలక్ వర్మ(0) మరోసారి విఫలమయ్యాడు.ఇక మిడిలార్డర్లో అలెగాని వరుణ్ గౌడ్(1), రోహిత్ రాయుడు(1) పూర్తిగా నిరాశపరచగా.. వికెట్ కీపర్ బ్యాటర్ అరవెల్లి అవినాశ్(52) అర్ధ శతకంతో సత్తా చాటాడు. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరడంతో హైదరాబాద్ 38.1 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. ముంబై బౌలర్లలో స్పిన్నర్ అథర్వ అంకోలేకర్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. ఆయుశ్ మాత్రే మూడు వికెట్లు పడగొట్టాడు.105/7.. ఓటమి అంచుల్లో ఉన్న వేళఅదే విధంగా తనుష్ కొటియాన్ రెండు, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు అంగ్క్రిష్ రఘువంశీ(19), ఆయుశ్ మాత్రే(28) నిరాశపరచగా.. హార్దిక్ తామోర్(0), సూర్యాంశ్ షెడ్గే(6), అథర్వ అంకోలేకర్(5), శార్దూల్ ఠాకూర్(0) పూర్తిగా విఫలమయ్యారు.ఇక ఎనిమిదో స్థానంలో వచ్చిన టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(18) కూడా చేతులెత్తేశాడు. దీంతో ముంబై 105 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన వేళ తొమ్మిదో స్థానంలో బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిశాడు.అయ్యర్ ధనాధన్.. తిలక్ సేనకు చేదు అనుభవంమరో ఎండ్ నుంచి తనుష్ కొటియాన్(37 బంతుల్లో 39 నాటౌట్) సహకారం అందించగా.. అయ్యర్ ధనాధన్ దంచికొట్టాడు. కేవలం 20 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 220కి పైగా స్ట్రైక్రేటుతో 44 పరుగులతో దుమ్ములేపాడు. ఈ క్రమంలో 25.2 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసిన ముంబై.. తిలక్ సేనపై జయభేరి మోగించింది.ఇక జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ముంబై ఆల్రౌండర్ తనుష్ కొటియాన్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. కాగా ముంబై తమ తదుపరి మ్యాచ్లో అరుణాచల్ ప్రదేశ్తో గురువారం మ్యాచ్ ఆడనుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ముగిసిన దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టైటిల్ను శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ముంబై జట్టు గెలుచుకున్న విషయం తెలిసిందే.చదవండి: PV Sindhu Marriage Photo: పీవీ సింధు పెళ్లి.. తొలి ఫొటో వైరల్ -
అయ్యర్ సెంచరీ వృథా.. 383 పరుగుల టార్గెట్ను ఊదిపడేసిన కర్ణాటక
విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో కర్ణాటక జట్టు శుభారంభం చేసింది. అహ్మదాబాద్ వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో కర్ణాటక ఘన విజయం సాధించింది. 383 పరుగుల భారీ లక్ష్యాన్ని కర్ణాటక 46.2 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఊదిపడేసింది. కర్ణాటక బ్యాటర్లలో కృష్ణన్ శ్రీజిత్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.లక్ష్య చేధనలో శ్రీజిత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 101 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్స్లతో 150 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు అనీష్ కేవీ(82), ప్రవీణ్ దూబే(65) హాఫ్ సెంచరీతో రాణించారు. ముంబై బౌలర్లలో జునేద్ ఖాన్ రెండు వికెట్లతో సత్తాచాటాడు.అయ్యర్ సెంచరీ వృథా..ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 4 వికెట్ల నష్టానికి 382 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ముంబై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(114) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు అయాష్ మాత్రే(78), హార్దిక్ తమోర్(84), శివమ్ దూబే(63) హాఫ్ సెంచరీలతో రాణించారు.కర్ణాటక బౌలర్లలో ప్రవీణ్ దూబే రెండు, విధ్యాదర్ పటేల్, శ్రేయస్ గోపాల్ తలా వికెట్ సాధించారు. ముంబై ఓటమి పాలవ్వడంతో శ్రేయస్ అయ్యర్ సెంచరీ వృథా అయిపోయింది. కర్ణాటక రికార్డు..కాగా విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో అత్యధిక ఛేజింగ్ చేసిన రెండో జట్టుగా కర్ణాటక నిలిచింది. ఈ జాబితాలో ఆంధ్ర జట్టు తొలి స్ధానంలో ఉంది. 2011/12 సీజన్లో గోవాపై 384 పరుగుల లక్ష్యాన్ని ఆంధ్ర ఛేజ్ చేసింది.చదవండి: CT 2025: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఇదే..! భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..? -
శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. వన్డేలో విధ్వంసకర శతకం
దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ(వీహెచ్టీ) తొలి మ్యాచ్లోనే ముంబై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దంచికొట్టాడు. కర్ణాటక బౌలింగ్ను ఊచకోత కోస్తూ విధ్వంసకర శతకం బాదాడు. అయ్యర్ ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా ముంబై భారీ స్కోరు సాధించింది.కాగా వీహెచ్టీ 2024-25 ఎడిషన్ రౌండ్ వన్లో భాగంగా గ్రూప్-‘సి’లో ఉన్న ముంబై కర్ణాటకతో తమ తొలి మ్యాచ్ ఆడుతోంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం బి గ్రౌండ్ ఇందుకు వేదిక. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కర్ణాటక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆయుశ్, హార్దిక్ హాఫ్ సెంచరీలుఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ముంబై ఆరంభంలోనే ఓపెనర్ అంగ్క్రిష్ రఘువంశీ(6) వికెట్ కోల్పోయింది. అయితే, మరో ఓపెనర్ ఆయుశ్ మాత్రే(78)తో కలిసి వన్డౌన్ బ్యాటర్ హార్దిక్ తామోర్(84) ముంబై ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. అయ్యర్ విశ్వరూపంఇక నాలుగో స్థానంలో వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ కర్ణాటక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 55 బంతుల్లోనే 114 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఐదు ఫోర్లు, పది సిక్సర్ల సాయంతో 207కు పైగా స్ట్రైక్రేటు నమోదు చేశాడు.ఇక శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్తో దుమ్ములేపగా.. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ శివం దూబే కూడా ధనాధన్ దంచికొట్టాడు. 36 బంతుల్లో ఐదు ఫోర్లు, ఐదు సిక్స్ల సాయంతో దూబే 63 పరుగులు చేసి.. అయ్యర్తో కలిసి ఆఖరి వరకు నాటౌట్గా నిలిచాడు.టీ20 తరహాలో వీరబాదుడుకాగా వన్డేలో టీ20 తరహాలో వీరబాదుడు బాదిన ఈ ఇద్దరి కారణంగా ముంబై నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్ల నష్టానికి ముంబై 382 పరుగులు సాధించింది. అయితే, ఈ మ్యాచ్లో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం విఫలమయ్యాడు.మొత్తంగా పదహారు బంతులు ఎదుర్కొన్న ‘స్కై’ 20 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఇక కర్ణాటక బౌలర్లలో ప్రవీణ్ దూబే రెండు, విద్యాధర్ పాటిల్, శ్రేయస్ గోపాల్ ఒక్కో వికెట్ తీశారు.ముంబై వర్సెస్ కర్ణాటక తుదిజట్లుకర్ణాటకమయాంక్ అగర్వాల్ (కెప్టెన్), అనీష్ కేవీ, నికిన్ జోస్, స్మరన్ రవిచంద్రన్, అభినవ్ మనోహర్, కృష్ణన్ శ్రీజిత్(వికెట్ కీపర్), శ్రేయస్ గోపాల్, విజయ్కుమార్ వైశాఖ్, ప్రవీణ్ దూబే, వాసుకి కౌశిక్, విద్యాధర్ పాటిల్.ముంబైఅంగ్క్రిష్ రఘువంశీ, ఆయుష్ మాత్రే, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ తామోర్(వికెట్ కీపర్), శివం దూబే, సూర్యాన్ష్ షెడ్గే, అథర్వ అంకోలేకర్, శార్దూల్ ఠాకూర్, ఎం.జునేద్ ఖాన్, తనూష్ కొటియన్.చదవండి: SA vs PAK: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్.. అతడిపై వేటు! సూర్యకు చోటు
దేశవాళీ వన్డే టోర్నమెంట్లో విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్ నేపథ్యంలో ముంబై క్రికెట్ అసోసియేషన్ తమ జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఈ టోర్నీ ఆడబోయే పదిహేడు మంది సభ్యుల పేర్ల(తొలి మూడు మ్యాచ్లు)ను మంగళవారం వెల్లడించింది. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో పాటు ఆల్రౌండర్ శివం దూబే కూడా ఈ టోర్నీలో పాల్గొనునున్నట్లు తెలిపింది.అతడిపై వేటుఅయితే, ఓపెనర్ పృథ్వీ షాకు మాత్రం ఈ జట్టులో చోటు దక్కలేదు. నిలకడలేమి ఫామ్తో సతమవుతున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్పై సెలక్టర్లు వేటు వేశారు. మరోవైపు.. సూపర్ ఫామ్లో ఉన్న అజింక్య రహానే వ్యక్తిగత కారణాల దృష్ట్యా సెలక్షన్కు అందుబాటులో లేడని తెలుస్తోంది.గత కొంతకాలంగా పృథ్వీ షా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. క్రమశిక్షణా రాహిత్యం, ఫిట్నెస్ లేమి తదితర కారణాలతో రంజీ జట్టుకు అతడు కొన్నాళ్లుపాటు దూరంగా ఉండాల్సి వచ్చింది. తిరిగి వచ్చినా కేవలం 59 పరుగులే చేశాడు.మరోవైపు.. ఐపీఎల్ మెగా వేలం-2025లో రూ. 75 లక్షల కనీస ధరకే అందుబాటులో ఉన్నా ఒక్క ఫ్రాంఛైజీ పృథ్వీ షా వైపు కన్నెత్తి చూడలేదు. ఫలితంగా ఒకప్పటి ఈ స్టార్ బ్యాటర్ అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు.ఇక దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ పృథ్వీ షా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఈ టోర్నీలో 25 ఏళ్ల పృథ్వీ తొమ్మిది మ్యాచ్లలో కలిపి.. 197 పరుగులే చేయగలిగాడు. మధ్యప్రదేశ్తో ఫైనల్లోనూ పది పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలోనే అతడిపై సెలక్టర్లు వేటు వేశారు.రహానే దూరంమరోవైపు.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబైని విజేతగా నిలిపిన టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్.. విజయ్ హజారే ట్రోఫీలోనూ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఇక పొట్టి ఫార్మాట్లో విధ్వంసకర బ్యాటింగ్తో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించి ముంబైని చాంపియన్గా నిలపడంలో కీలక పాత్ర పోషించిన రహానే.. వన్డే టోర్నీలో మాత్రం ఆడటం లేదు. కాగా డిసెంబరు 21 నుంచి విజయ్ హజారే ట్రోఫీ మొదలుకానుంది.తిరుగులేని ముంబైకాగా భారత దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టు ఇప్పటికి 63 టైటిల్స్ గెలిచింది. రంజీ ట్రోఫీని 42 సార్లు నెగ్గిన ముంబై జట్టు ఇరానీ కప్ను 15 సార్లు దక్కించుకుంది. విజయ్ హజారే వన్డే ట్రోఫీలో 4 సార్లు విజేతగా నిలిచిన ముంబై.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టీ20 టోర్నీ టైటిల్ను రెండుసార్లు కైవసం చేసుకుంది. ఇప్పుడు మరో టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగనుంది.విజయ్ హజారే వన్డే టోర్నీ 2024 -25కి తొలి మూడు మ్యాచ్లకు ముంబై జట్టుశ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, జే బిస్తా, సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, సూర్యాన్ష్ షెడ్గే, సిద్ధేశ్ లాడ్, హార్దిక్ తామోర్, ప్రసాద్ పవార్, అధర్వ అంకోలేకర్, తనూష్ కొటియన్, శార్దూల్ ఠాకూర్, రాయ్స్టన్ డయాస్, జునేద్ ఖాన్, హర్ష్ తనా, వినాయక్ భోయిర్. చదవండి: శెభాష్.. గండం నుంచి గట్టెక్కించారు! మీరే నయం -
చోటిస్తారా?.. టీమిండియా సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్
టీ20 ఫార్మాట్లో భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ అద్భుత కెప్టెన్సీతో అదరగొడుతున్నాడు. సారథిగా ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్(ఐపీఎల్) టైటిల్ గెలిచిన ఈ ముంబై బ్యాటర్.. దేశీ టీ20 టోర్నీలోనూ ట్రోఫీ గెలిచాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT) ఫైనల్లో అయ్యర్ కెప్టెన్సీలోని ముంబై జట్టు ఆదివారం మధ్యప్రదేశ్ను చిత్తు చేసింది.ఆల్రౌండ్ ప్రదర్శనతోటోర్నీ ఆసాంతం రాణించిన శ్రేయస్ సేన టైటిల్ పోరులో మధ్యప్రదేశ్ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. సమష్టి ప్రదర్శనతో ఫైనల్కు వచ్చిన ముంబై.. ఆఖరి మెట్టుపై కూడా ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై మధ్యప్రదేశ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది.రజత్ పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్ (40 బంతుల్లో 81 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్స్లు) కారణంగా మధ్యప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అయితే, పేస్ ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ (17; 1 ఫోర్, 1 సిక్స్) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. ముంబై బౌలర్లలో శార్దుల్ ఠాకూర్, రాయ్స్టన్ డయాస్ రెండు వికెట్ల చొప్పున తీసుకున్నారు.ఇరగదీసిన సూర్యకుమార్ యాదవ్అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ముంబై 17.5 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసి గెలిచింది. 174 పరుగులతో స్కోరు సమమయ్యాక ముంబై బ్యాటర్ అథర్వ సిక్స్ కొట్టి మ్యాచ్ను ముగించాడు. టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా... సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే (37; 4 ఫోర్లు) రాణించాడు.చివర్లో సూర్యాంశ్ షెగ్డే (15 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు), అథర్వ అంకొలేకర్ (6 బంతుల్లో 16 నాటౌట్; 2 సిక్స్లు) మెరుపులు మెరిపించారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో త్రిపురేశ్ సింగ్ 2 వికెట్లు పడగొట్టాడు. సూర్యాంశ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, అజింక్య రహానేకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. ఈ ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ముంబై సొంతమైంది.ఒకే ఏడాదిలో రెండు టీ20 టైటిళ్లు గెలిచిన తొలి సారథిగాఈ నేపథ్యంలో భారత్లో ఒకే ఏడాదిలో రెండు టీ20 టైటిళ్లు గెలిచిన కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్-2024లో కోల్కతా నైట్ రైడర్స్ను విజేతగా నిలిపిన అతడు.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని కూడా అందుకోవడం విశేషం. కాగా క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డాడన్న కారణంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అయ్యర్ను ఈ ఏడాది సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించిన విషయం తెలిసిందే.భవిష్య కెప్టెన్ ఆప్షన్లలో తానూ ఒకడిననే మెసేజ్రంజీల్లో ఆడకుండా తప్పించుకునేందుకు గాయం తగ్గినప్పటికీ.. దానిని సాకుగా చూపాడని తేలడంతో బీసీసీఐ శ్రేయస్ అయ్యర్పై వేటు వేసినట్లు తెలిసింది. అయితే, ఐపీఎల్లో తనను తాను నిరూపించుకున్న శ్రేయస్ అయ్యర్కు మళ్లీ టీమిండియా సెలక్టర్లు పిలుపునిచ్చారు. శ్రీలంక పర్యటనలో వన్డే సిరీస్కు అతడిని ఎంపిక చేశారు. కానీ.. టీ20 జట్టులో మాత్రం అతడికి స్థానం ఇవ్వడం లేదు.టీమిండియా తరఫున గతేడాది డిసెంబరులో చివరగా శ్రేయస్ అయ్యర్ టీ20 మ్యాచ్ ఆడాడు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన సిరీస్లో పాల్గొన్నాడు. అయితే, తాజాగా దేశీ టీ20 టోర్నీలోనూ సత్తా చాటి.. టీమిండియా సెలక్టర్లకు గట్టి సందేశం ఇచ్చాడు. భవిష్య కెప్టెన్ ఆప్షన్లలో తానూ ఒకడిననే మెసేజ్ పంపించాడు.వచ్చే ఏడాది పంజాబ్ జట్టుకుఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు కోల్కతా శ్రేయస్ అయ్యర్ను రిలీజ్ చేయగా.. పంజాబ్ కింగ్స్ వేలంపాటలో అతడిని కొనుక్కుంది. ఈ స్టార్ ప్లేయర్ కోసం ఏకంగా రూ. 26.75 కోట్లు ఖర్చు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన రెండో ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు. రూ. 27 కోట్ల ధర పలికిన రిషభ్ పంత్(లక్నో సూపర్ జెయింట్స్) అయ్యర్ కంటే ముందున్నాడు.చదవండి: ‘రోహిత్, గంభీర్ మధ్య విభేదాలు?.. ద్రవిడ్తో చక్కగా ఉండేవాడు.. కానీ’ -
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ముంబైదే (ఫొటోలు)
-
సుర్యాంశ్ షేడ్గే ఊచకోత.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ముంబైదే
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీని ముంబై జట్టు కైవసం చేసుకుంది. ఇవాళ (డిసెంబర్ 15) జరిగిన ఫైనల్లో ముంబై మధ్యప్రదేశ్పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్.. కెప్టెన్ రజత్ పాటిదార్ (40 బంతుల్లో 81 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్తో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. రజత్ పాటిదార్ చివరి వరకు క్రీజ్లో నిలబడి మధ్యప్రదేశ్కు ఫైటింగ్ టోటల్ అందించాడు. ఇన్నింగ్స్ చివరి రెండు ఓవర్లలో పాటిదార్ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్లో సుభ్రాన్షు సేనాపతి (23), హర్ప్రీత్ సింగ్ (15), వెంకటేశ్ అయ్యర్ (17), రాహుల్ బాథమ్ (19) రెండంకెల స్కోర్లు చేయగా.. ఆర్పిత్ గౌడ్ (3), హర్ష్ గావ్లి (2), త్రిపురేశ్ సింగ్, శివమ్ శుక్లా (1) సింగిల్ డిజిట్ స్కోర్లరే పరిమితమయ్యారు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, రాయ్స్టన్ డయాస్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అంకోలేకర్, శివమ్ దూబే, సుయాంశ్ షేడ్గే తలో వికెట్ దక్కించుకున్నారు.రాణించిన రహానే, స్కై.. షేడ్గే, అంకోలేకర్ ఊచకోత175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. ఆదిలోనే పృథ్వీ షా (10) వికెట్ కోల్పోయింది. అయితే రహానే (30 బంతుల్లో 37), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (9 బంతుల్లో 16) ఏమాత్రం తగ్గకుండా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. మధ్యలో సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 48) తనదైన స్టయిల్లో విరుచుకుపడ్డాడు. చివర్లో శివమ్ దూబే (6 బంతుల్లో 9), అథర్వ అంకోలేకర్ (6 బంతుల్లో 16 నాటౌట్), సూర్యాంశ్ షేడ్గే (15 బంతుల్లో 36 నాటౌట్) బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి ముంబైని గమ్యానికి చేర్చారు. ముఖ్యంగా షేడ్గే మధ్యప్రదేశ్ బౌలర్లను ఊచకోత కోశాడు. అంకోలేకర్ సిక్సర్ బాది మ్యాచ్ను ఫినిష్ చేశాడు. ముంబై 17.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. దేశవాలీ క్రికెట్లో ముంబైకు ఇది 63వ టైటిల్. రెండో సయ్యద్ ముస్తాక్ అలీ టైటిల్. టోర్నీ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన రహానేకు ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు, ఫైనల్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన సూర్యాంశ్ షేడ్గేకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు లభించాయి. సూర్యాంశ్ షేడ్గేను ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ కేవలం 30 లక్షలకు సొంతం చేసుకుంది. -
రఫ్పాడించిన రహానే.. విధ్వంసకర సెంచరీ మిస్.. అయితేనేం..
దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై బ్యాటర్ అజింక్య రహానే పరుగుల విధ్వంసం సృష్టించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ బరోడా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆది నుంచే దూకుడు ప్రదర్శించిన రహానే సెంచరీ దిశగా పయనించాడు.శతకానికి రెండు పరుగుల దూరంలోఅయితే, దురదృష్టవశాత్తూ శతకానికి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు రహానే. అయితేనేం తన మెరుపు ఇన్నింగ్స్తో ముంబైకి విజయం అందించి.. ఫైనల్కు చేర్చాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తొలి సెమీ ఫైనల్లో భాగంగా ముంబై జట్టు బరోడాతో తలపడింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై.. బరోడాను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో బరోడా జట్టు ఏడు వికెట్లు నష్టపోయి 158 పరుగులు చేసింది.రాణించిన శివాలిక్ శర్మబరోడా ఇన్నింగ్స్లో శివాలిక్ శర్మ(36 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలవగా.. ఓపెనర్ శశ్వత్ రావత్(33), కెప్టెన్ కృనాల్ పాండ్యా(30), ఆల్రౌండర్ అతిత్ సేత్(14 బంతుల్లో 22) ఫర్వాలేదనిపించారు. ఇక ముంబై బౌలర్లలో పేసర్లు సూర్యాంశ్ షెడ్గే రెండు వికెట్లు ఖాతాలో వేసుకోగా.. శివం దూబే, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్థి ఒక్కో వికెట్ తీశారు. ఇక స్పిన్ బౌలర్లు తనుష్ కొటియాన్, అథర్వ అంకోలేకర్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.బరోడా బౌలింగ్ను చితక్కొట్టిన రహానేఇక బరోడా విధించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబైకి ఆదిలో షాక్ తగిలింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఓపెనర్ పృథ్వీ షా(8) అవుటయ్యాడు. అయితే, ఆ ఆనందం బరోడాకు ఎంతో సేపు నిలవలేదు. మరో ఓపెనర్ అజింక్య రహానే బరోడా బౌలింగ్ను చితక్కొట్టాడు.కేవలం 56 బంతుల్లోనే 11 ఫోర్లు, ఐదు సిక్స్ల సాయంతో ఏకంగా 98 పరుగులు రాబట్టాడు. అయితే, అభిమన్యు సింగ్ బౌలింగ్లో విష్ణు సోలంకికి క్యాచ్ ఇవ్వడంతో రహానే విధ్వంసకర ఇన్నింగ్స్కు తెరపడింది. తృటిలో సెంచరీ అతడి చేజారింది. సూర్య విఫలంమిగతా వాళ్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 30 బంతుల్లో 46 పరుగులతో రాణించగా.. సూర్యకుమార్ యాదవ్ నిరాశపరిచాడు. ఏడు బంతులు ఆడిన స్కై కేవలం ఒకే ఒక్క పరుగు చేశాడు. శివం దూబే 0, సూర్యాంశ్ షెడ్గే 6 పరుగులతో అజేయంగా నిలిచారు.ఇక రహానే ధనాధన్ బ్యాటింగ్ కారణంగా ముంబై 17.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆరు వికెట్ల తేడాతో బరోడాను ఓడించి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024 ఫైనల్ చేరింది.చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వెస్టిండీస్ బ్యాటర్ ప్రపంచ రికార్డు -
SMAT: టీమిండియా స్టార్ల మెరుపులు.. సెమీస్ చేరిన జట్లు, షెడ్యూల్
ప్రతిష్టాత్మక దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 ఎడిషన్ రసవత్తరంగా సాగుతోంది. టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సహా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, అభిషేక్ శర్మ, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్ తదితరులు ఈ టోర్నీలో ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఇక ఈ టీ20 టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. మధ్యప్రదేశ్, బరోడా, ముంబై, ఢిల్లీ జట్లు టాప్-4లో అడుగుపెట్టాయి. ఈ నేపథ్యంలో సెమీ ఫైనల్స్ షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ టైమింగ్స్ తదితర అంశాలను గమనిద్దాం. అంతకంటే ముందు.. ఈ నాలుగు జట్లు క్వార్టర్ ఫైనల్స్కు చేరిన తీరుపై ఓ లుక్కేద్దాం.పృథ్వీ షా, సూర్యాంశ్, శివమ్ దూబే మెరుపులు గ్రూప్ ‘ఇ’ టాపర్గా క్వార్టర్స్లో అడుగు పెట్టిన ముంబై అదే జోరు కొనసాగిస్తూ విదర్భను మట్టికరిపించింది. ఆలూరులో బుధవారం హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో ముంబై జట్టు 6 వికెట్ల తేడాతో విదర్భపై గెలుపొందింది.టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన విదర్భ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అథర్వ తైడె (41 బంతుల్లో 66; 10 ఫోర్లు, 1 సిక్స్), అపూర్వ్ వాంఖడె (33 బంతుల్లో 51; 2 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధశతకాలతో రాణించగా... శుభమ్ దూబే (19 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు) చివర్లో మెరుపులు మెరిపించాడు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 224 పరుగులు చేసి గెలిచింది.సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే (45 బంతుల్లో 84; 10 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా... పృథ్వీ షా (26 బంతుల్లో 49; 5 ఫోర్లు, 4 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తొలి బంతి నుంచే ఓపెనర్లు విరుచుకుపడటంతో 7 ఓవర్లు ముగిసేసరికి ముంబై జట్టు 83 పరుగులు చేసింది.కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (5), సూర్యకుమార్ యాదవ్ (9) విఫలం కాగా... ఆఖర్లో శివమ్ దూబే (37 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు), సూర్యాంశ్ (36 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్లు) ధాటిగా ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చారు. రహానేకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’అవార్డు దక్కింది.వెంకటేశ్ అయ్యర్ ఆల్రౌండ్ షోఆలూరు: పేస్ ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ (33 బంతుల్లో 38 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు; 2/23) ఆకట్టుకోవడంతో... సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్లో మధ్యప్రదేశ్ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట సౌరాష్ట్ర 20 ఓవర్లలో 7 వికెట్లకు 173 పరుగులు చేసింది. చిరాగ్ జానీ (45 బంతుల్లో 80 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు.మధ్యప్రదేశ్ బౌలర్లలో వెంకటేశ్ అయ్యర్, అవేశ్ ఖాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో మధ్యప్రదేశ్ 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసి గెలిచింది. అరి్పత్ గౌడ్ (42; 4 ఫోర్లు, 2 సిక్స్లు), వెంకటేశ్ అయ్యర్తో పాటు కెప్టెన్ రజత్ పాటిదార్ (28; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. చివర్లో హర్ప్రీత్ సింగ్ (9 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు) ధాటిగా ఆడి జట్టును గెలిపించాడు.హార్దిక్ పాండ్యా 3 వికెట్లు, 3 క్యాచ్లు బెంగళూరు: బెంగాల్తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో బరోడా 41 పరుగుల తేడాతో గెలిచి సెమీస్ చేరింది. బరోడాకు ఆడుతున్న భారత స్టార్ హార్దిక్ పాండ్యా 3 వికెట్లు పడగొట్టడంతోపాటు 3 క్యాచ్లు తీసుకున్నాడు. మొదట బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.శాశ్వత్ రావత్ (40; 1 ఫోర్, 3 సిక్స్లు), అభిమన్యు సింగ్ (37; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. బెంగాల్ బౌలర్లలో షమీ, కనిష్క్ సేత్, ప్రతీప్తా ప్రమాణిక్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో బెంగాల్ తడబడింది. 18 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటైంది. ఆల్రౌండర్ షహబాజ్ అహ్మద్ (36 బంతుల్లో 55; 3 ఫోర్లు, 4 సిక్స్లు) ఒక్కడే రాణించాడు. బరోడా బౌలర్లలో హార్దిక్ పాండ్యా, లుక్మన్ మెరివాలా, అతిత్ సేత్ తలా మూడేసి వికెట్లు పడగొట్టారు. అనూజ్ అదుర్స్బెంగళూరు: వికెట్ కీపర్ అనూజ్ రావత్ (33 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్స్లు) విధ్వంసకర అర్ధశతకంతో చెలరేగడంతో ఢిల్లీ జట్టు ముస్తాక్ అలీ టోర్నీ సెమీఫైనల్కు చేరింది. చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఢిల్లీ జట్టు 19 పరుగుల తేడాతో ఉత్తరప్రదేశ్ జట్టుపై నెగ్గింది. మొదట బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 193 పరుగులు చేసింది.అనూజ్ రావత్తో పాటు ఓపెనర్లు యశ్ ధుల్ (42; 5 ఫోర్లు, 2 సిక్స్లు), ప్రియాన్ష్ ఆర్య (44; 3 ఫోర్లు, 3 సిక్స్లు) కూడా రాణించారు. అనంతరం లక్ష్యఛేదనలో ఉత్తరప్రదేశ్ జట్టు 20 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది. యువ ఆటగాడు ప్రియం గార్గ్ (34 బంతుల్లో 54; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకంతో పోరాడగా... రింకూ సింగ్ (10), నితీశ్ రాణా (2) విఫలమవడంతో ఉత్తరప్రదేశ్కు పరాజయం తప్పలేదు. ఢిల్లీ బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 3... ఆయుష్ బదోనీ, సుయాశ్ శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సెమీ ఫైనల్స్ షెడ్యూల్, వేదిక, టైమింగ్స్తొలి సెమీ ఫైనల్:👉ముంబై వర్సెస్ బరోడా- బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం- డిసెంబరు 13(శుక్రవారం)- ఉదయం 11 గంటలకు ఆరంభం.రెండో సెమీ ఫైనల్: 👉మధ్యప్రదేశ్ వర్సెస్ ఢిల్లీ- బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం- డిసెంబరు 13(శుక్రవారం)- సాయంత్రం 4.30 నిమిషాలకు ఆరంభం.ఇప్పటి వరకు అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్లు సాధించింది వీరేసకీబుల్ గనీ ఈ సీజన్లో 353 పరుగులు చేసి టాప్ రన్ స్కోరర్గా ఉండగా.. కరణ్ లాల్ 338, అభిషేక్ పోరెల్ 335, అజింక్య రహానే 334, తిలక్ వర్మ 327 పరుగులు సాధించారు.మరోవైపు.. జగ్జీత్ సింగ్ 18 వికెట్లతో టాప్ బౌలర్గా ఉండగా.. కుమార్ కార్తికేయ 15, ముకేశ్ చౌదరి 15చ శ్రేయస్ గోపాల్ 14, కేవీ శశికాంత్ 14 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.చదవండి: బుమ్రా తర్వాత బెస్ట్ బౌలర్.. భీకర ఫామ్లో ఆర్సీబీ పేసర్ -
రాణించిన రహానే.. దుమ్మురేపిన శ్రేయస్ అయ్యర్
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ముంబై ఆటగాడు శ్రేయస్ అయ్యర్ చెలరేగిపోయాడు. మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్లో శ్రేయస్ 39 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 71 పరుగులు చేశాడు. శ్రేయస్తో పాటు వెటరన్ ఆజింక్య రహానే (34 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా రాణించడంతో మహారాష్ట్రపై ముంబై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. వికెట్కీపర్ నిఖిల్ నాయక్ (47), అజిమ్ ఖాజీ (32) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. అర్శిన్ కులకర్ణి (19), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (19), త్రిపాఠి (16), రామకృష్ణ ఘోష్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. ముంబై బౌలర్లలో తనుశ్ కోటియన్ 3, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్తి తలో 2, రాయ్స్టన్ డయాస్, సూర్యాంశ్ షెడ్గే చెరో వికెట్ పడగొట్టారు.172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. శ్రేయస్, రహానే రాణించడంతో 17.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ముంబై ఇన్నింగ్స్లో అంగ్క్రిష్ రఘువంశీ 21, షమ్స్ ములానీ 14 (నాటౌట్), హార్దిక్ తామోర్ (9 నాటౌట్) పరుగులు చేయగా.. పృథ్వీ షా, సూర్యాంశ్ షెడ్గే డకౌట్ అయ్యారు. మహా బౌలర్లలో ముకేశ్ చౌదరీ 4 వికెట్లు పడగొట్టగా.. అర్శిన్ కులకర్ణి ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్లో మెరుపు ప్రదర్శన చేసిన శ్రేయస్ అయ్యర్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్లో కూడా శ్రేయస్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. కాగా, నవంబర్ 24న జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో శ్రేయస్ అయ్యర్ రికార్డు స్థాయిలో 26.75 కోట్లకు అమ్ముడుపోయాడు. అయ్యర్ను పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది రెండో భారీ ధర. ఇదే వేలంలో రిషబ్ పంత్ను లక్నో సూపర్ జెయింట్స్ 27 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధిక ధర. గత 5 ఇన్నింగ్స్ల్లో ముంబై తరఫున శ్రేయస్ చేసిన స్కోర్లు..142- రంజీ ట్రోఫీ233- రంజీ ట్రోఫీ47- రంజీ ట్రోఫీ130 నాటౌట్ (57)- సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ71 (39)- సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ -
వేలంలో భారత క్రికెటర్లకు కాసుల పంట.. తొలి రోజు ఎవరు ఎంత ధర పలికారంటే..?
-
ఐపీఎల్ 2025 తొలి రోజు వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్లు వీరే..!
ఐపీఎల్ 2025 మెగా వేలం నిన్న (నవంబర్ 24) సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. వేలం తొలి రోజు మొత్తం 72 మంది ఆటగాళ్లు అమ్ముడుపోయారు. ఇందులో 24 మంది విదేశీ ఆటగాళ్లు కాగా.. మిగతా వారు భారత ఆటగాళ్లు. తొలి రోజు వేలంలో నాలుగు ఆర్టీఎమ్ కార్డులు (రచిన్ రవీంద్ర (సీఎస్కే), జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ (ఢిల్లీ), నమన్ ధిర్ (ముంబై), అర్షదీప్ సింగ్ (పంజాబ్)) వాడుకోబడ్డాయి. నిన్న వేలంలో అన్ని ఫ్రాంచైజీలచే మొత్తం రూ. 467.85 కోట్లు ఖర్చు చేయబడింది. నిన్నటి వేలంలో రిషబ్ పంత్కు అత్యధిక ధర లభించింది. లక్నో సూపర్ జెయింట్స్ పంత్ను రూ. 27 కోట్లకు దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది భారీ ధర. నిన్నటి వేలంలో రెండో భారీ మొత్తం శ్రేయస్ అయ్యర్కు లభించింది. శ్రేయస్ను పంజాబ్ రూ. 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. మూడో అత్యధిక ధర వెంకటేశ్ అయ్యర్కు లభించింది. వెంకటేశ్ అయ్యర్ను కేకేఆర్ రూ. 23.75 కోట్లకు సొంతం చేసుకుంది. అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్లను పంజాబ్ చెరి రూ. 18 కోట్లు ఇచ్చి దక్కించుకుంది. అంతా ఊహించనట్లుగా కేఎల్ రాహుల్కు భారీ ధర దక్కలేదు. రాహుల్ను ఢిల్లీ రూ. 14 కోట్లకే సొంతం చేసుకుంది. ఫ్రాంచైజీ వారీగా అమ్ముడుపోయిన ఆటగాళ్లు..సీఎస్కే:నూర్ అహ్మద్ (10 కోట్లు)రవిచంద్రన్ అశ్విన్ (9.75 కోట్లు)డెవాన్ కాన్వే (6.25 కోట్లు)సయ్యద్ ఖలీల్ అహ్మద్ (4.8 కోట్లు)రచిన్ రవీంద్ర (4 కోట్లు, RTM)రాహుల్ త్రిపాఠి (3.4 కోట్లు)విజయ్ శంకర్ (1.2 కోట్లు)ఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్ (14 కోట్లు)మిచెల్ స్టార్క్ (11.75 కోట్లు)టి నటరాజన్ (10.75 కోట్లు)జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ (9 కోట్లు, RTM)హ్యారీ బ్రూక్ (6.25 కోట్లు)అషుతోష్ శర్మ (3.80 కోట్లు)మోహిత్ శర్మ (2.20 కోట్లు)సమీర్ రిజ్వి (95 లక్షలు)కరుణ్ నాయర్ (50 లక్షలు)గుజరాత్ టైటాన్స్: జోస్ బట్లర్ (15.75 కోట్లు)మొహమ్మద్ సిరాజ్ (12.25 కోట్లు)కగిసో రబాడ (10.75 కోట్లు)ప్రసిద్ద్ కృష్ణ (9.50 కోట్లు)మహిపాల్ లోమ్రార్ (1.70 కోట్లు)మనవ్ సుతార్ (30 లక్షలు)కుమార్ కుషాగ్రా (65 లక్షలు)అనుజ్ రావత్ (30 లక్షలు)నిషాంత్ సంధు (30 లక్షలు)కేకేఆర్: వెంకటేశ్ అయ్యర్ (23.75 కోట్లు)అన్రిచ్ నోర్జే (6.50 కోట్లు)క్వింటన్ డికాక్ (3.60 కోట్లు)అంగ్క్రిష్ రఘువంశీ (3 కోట్లు)రహ్మానుల్లా గుర్బాజ్ (2 కోట్లు)వైభవ్ అరోరా (1.80 కోట్లు)మయాంక్ మార్కండే (30 లక్షలు)లక్నో సూపర్ జెయింట్స్: రిషబ్ పంత్ (27 కోట్లు)ఆవేశ్ ఖాన్ (9.75 కోట్లు)డేవిడ్ మిల్లర్ (7.5 కోట్లు)అబ్దుల్ సమద్ (4.2 కోట్లు)మిచెల్ మార్ష్ (3.4 కోట్లు)ఆర్యన్ జుయల్ (30 లక్షలు)ముంబై ఇండియన్స్:ట్రెంట్ బౌల్ట్ (12.50 కోట్లు)నమన్ ధిర్ (5.25 కోట్లు, RTM)రాబిన్ మింజ్ (65 లక్షలు)కర్ణ్ శర్మ (50 లక్షలు)పంజాబ్ కింగ్స్: శ్రేయస్ అయ్యర్(26.75 కోట్లు)యుజ్వేంద్ర చహల్(18 కోట్లు)అర్షదీప్ సింగ్ (18 కోట్లు, RTM)మార్కస్ స్టోయినిస్ (11 కోట్లు)నేహల్ వధేరా (4.2 కోట్లు)గ్లెన్ మ్యాక్స్వెల్ (4.2 కోట్లు)విజయ్కుమార్ వైశాఖ్ (1.8 కోట్లు)యశ్ ఠాకర్ (1.60 కోట్లు)హర్ప్రీత్ బ్రార్ (1.5 కోట్లు)విష్ణు వినోద్ (95 లక్షలు)రాజస్థాన్ రాయల్స్: జోఫ్రా ఆర్చర్ (12.50 కోట్లు)వనిందు హసరంగ (5.25 కోట్లు)మహీశ్ తీక్షణ (4.40 కోట్లు)ఆకాశ్ మధ్వాల్ (1.20 కోట్లు)కుమార్ కార్తీకేయ (30 లక్షలు)ఆర్సీబీ:జోష్ హాజిల్వుడ్ (12.50 కోట్లు)ఫిల్ సాల్ట్ (11.50 కోట్లు)జితేశ్ శర్మ (11 కోట్లు)లియామ్ లివింగ్స్టోన్ (8.75 కోట్లు)రసిఖ్ దార్ (6 కోట్లు)సుయాశ్ శర్మ (2.6 కోట్లు)సన్రైజర్స్ హైదరాబాద్:ఇషాన్ కిషన్ (11.25 కోట్లు)మొహమ్మద్ షమీ (10 కోట్లు)హర్షల్ పటేల్ (8 కోట్లు)అభినవ్ మనోహర్ (3.20కోట్లు)రాహుల్ చాహల్ (3.20 కోట్లు)ఆడమ్ జంపా (2.40 కోట్లు)సిమ్రన్జీత్ సింగ్ (1.50 కోట్లు)అథర్వ తైడే (30 లక్షలు) -
శ్రేయస్ అయ్యర్పై కనకవర్షం.. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి! కానీ..
మెగా వేలం-2025లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కోసం ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఎగబడ్డాయి. రూ. 2 కోట్ల కనీస ధరకు ఆక్షన్లోకి వచ్చిన ఈ ముంబై బ్యాటర్ను దక్కించుకునేందుకు పాత జట్టు కోల్కతా నైట్ రైడర్స్ పోటీకి రాగా.. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ తగ్గేదేలే అన్నట్లు రేసులో మున్ముందుకు దూసుకుపోయాయి.నువ్వా- నేనా అన్నట్లు ఢిల్లీ, పంజాబ్ తలపడటంతో శ్రేయస్ అయ్యర్ ధర రూ. 20 కోట్లు దాటింది. దీంతో కోల్కతా పోటీ నుంచి తప్పుకోగా.. సరైన కెప్టెన్లు లేని కారణంగా ఢిల్లీ, పంజాబ్ మాత్రం అయ్యర్ ధరను అంతకంతకూ పెంచుతూ పోయాయి. ఆఖరికి ఢిల్లీ వెనక్కి తగ్గగా.. రూ. 26.75 కోట్లకు పంజాబ్ తమ సొంతం చేసుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా అయ్యర్ చరిత్ర సృష్టించాడు. అంతకు ముందు మొదటి ప్లేయర్గా వేలంలోకి వచ్చిన మరో టీమిండియా స్టార్, పేస్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ను కూడా పంజాబ్ భారీ ధరకు సొంతం చేసుకుంది.కెప్టెన్ కోసం..ఐపీఎల్-2024లో కోల్కతా నైట్రైడర్స్ను చాంపియన్గా నిలిపిన ఘనత శ్రేయస్ అయ్యర్ సొంతం. అయినప్పటికీ కోల్కతా రిటెన్షన్కు ముందు అతడిని వదిలేసింది. దీంతో అతడు మెగా వేలంలోకి హాట్కేకు అవుతాడని అంతా ముందే ఊహించారు. అందుకు తగ్గట్లుగానే అయ్యర్ భారీ ధర పలకడం విశేషం. కాగా పంజాబ్ ఇంత వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. అంతేకాదు వేలానికి ముందు కేవలం ఇద్దరిని రిటైన్ చేసుకుని అందరినీ విడిచిపెట్టింది.దీంతో రూ. 110.5 కోట్ల పర్సు వాల్యూతో వేలంలోకి వచ్చింది. దీంతో అయ్యర్ కోసం ఈ మేర ఖర్చు చేసింది. అయితే, పంత్ను లక్నో రూ. 27 కోట్లకు కొనడంతో అయ్యర్ రికార్డు బ్రేక్ అయింది.కాగా ఐపీఎల్లో శ్రేయస్ అయ్యర్ ఇప్పటి వరకు 115 మ్యాచ్లు ఆడి.. 3127 పరుగులు చేశాడు.చదవండి: Rishabh Pant: అయ్యర్ రికార్డు బ్రేక్.. కోట్లు కొల్లగొట్టిన పంత్! లక్నో సొంతంMissed watching that stunning Shreyas bidding process❓We have you covered here with the snippets 🎥 🔽#TATAIPLAuction | #TATAIPL | @ShreyasIyer15 | @PunjabKingsIPL | #PBKS pic.twitter.com/a7jAki8LVz— IndianPremierLeague (@IPL) November 24, 2024 -
Mega Auction: పేరు మోసిన స్టార్లు.. హాట్కేకులు వీళ్లే.. 116 మందిపైనే వేలం వెర్రి
ఫ్రాంచైజీల చేతిలో ఉన్నవి రూ. 641.50 కోట్లు... కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్లు 204... అందుబాటులో ఉన్న ప్లేయర్లు 577 మంది... అత్యధిక మొత్తం ఉన్న ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ రూ 110.50 కోట్లు. ఈ అంకెలు చాలు ఐపీఎల్ ఆటనే కాదు... వేలం పాట కూడా సూపర్హిట్ అవుతుందని! రెండు రోజుల పాటు జరిగే ఈ వేలం వేడుకకు సర్వం సిద్ధమైంది. వేలం పాట పాడే ఆక్షనీర్ మల్లికా సాగర్, పది ఫ్రాంచైజీ యాజమాన్యాలు, హెడ్ కోచ్లు, విశ్లేషకులు వెరసి అందరి కళ్లు హార్డ్ హిట్టర్, వికెట్ కీపర్–బ్యాటర్ రిషభ్ పంత్పైనే నెలకొన్నాయి. అంచనాలు మించితే రూ. పాతిక కోట్లు పలికే భారత ప్లేయర్గా రికార్డులకెక్కేందుకు పంత్ సై అంటున్నాడు.వచ్చే సీజన్ ఐపీఎల్ ఆటకు ముందు వేలం పాటకు వేళయింది. ఆది, సోమవారాల్లో జరిగే ఆటగాళ్ల మెగా వేలంలో భారత స్టార్లతో పాటు పలువురు విదేశీ స్టార్లు ఫ్రాంచైజీలను ఆకర్శిస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసిన రిషభ్ పంత్పై పది ఫ్రాంచైజీలు కన్నేశాయి.మెగా వేలంలోనే మెగా ధర పలికే ఆటగాడిగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సారథ్యం, వికెట్ కీపింగ్, మెరుపు బ్యాటింగ్ ఇవన్నీ కూడా పంత్ ధరను అమాంతం పెంచే లక్షణాలు. దీంతో ఎంతైన వెచ్చించేందుకు ఫ్రాంచైజీలు ఎగబడనున్నాయి.అతడితో పాటు భారత స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్, ఈ సీజన్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) విజయసారథి శ్రేయస్ అయ్యర్, సీమర్లు అర్ష్దీప్ సింగ్, సిరాజ్లపై రూ. కోట్లు కురవనున్నాయి.విదేశీ ఆటగాళ్లలో జోస్ బట్లర్, లివింగ్స్టోన్ (ఇంగ్లండ్), స్టార్క్, వార్నర్ (ఆస్ట్రేలియా), రబడా (దక్షిణాఫ్రికా)లపై ఫ్రాంచైజీలు దృష్టిపెడతాయి. గతేడాది వేలంపాట పాడిన ప్రముఖ ఆక్షనీర్ మల్లికా సాగర్ ఈ సారి కూడా వేలం ప్రక్రియను నిర్వహించనుంది. 116 మందిపైనే వేలం వెర్రి వేలానికి 577 మంది ఆటగాళ్లతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తుది జాబితాను సిద్ధం చేసినప్పటికీ మొదటి సెట్లో వచ్చే 116 మందిపైనే ఫ్రాంచైజీల దృష్టి ఎక్కువగా ఉంటుంది. దీంతో పాట రూ. కోట్ల మాట దాటడం ఖాయం. ఎందుకంటే ఇందులో పేరు మోసిన స్టార్లు, మ్యాచ్ను ఏకపక్షంగా మలుపుతిప్పే ఆల్రౌండర్లు, నిప్పులు చెరిగే సీమర్లు ఇలా అగ్రశ్రేణి ఆటగాళ్లంతా ముందు వరుసలో వస్తారు. దీంతో వేలం పాట రేసు రసవత్తరంగా సాగడం ఖాయమైంది.ఇక 117 నుంచి ఆఖరి దాకా వచ్చే ఆటగాళ్లపై వేళ్లమీద లెక్కించే స్థాయిలోనే పోటీ ఉంటుంది. అంటే ఇందులో పది, పదిహేను మందిపై మాత్రమే ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశముంది. మిగతా వారంతా ఇలా చదివితే అలా కుదిరిపోవడం లేదంటే వచ్చి వెళ్లిపోయే పేర్లే ఉంటాయి. పది ఫ్రాంచైజీలు కలిపి గరిష్టంగా 204 మందినే ఎంపిక చేసుకుంటాయి.అర్ష్దీప్ అ‘ధర’హో ఖాయం అంతర్జాతీయ క్రికెట్లో గత మూడు సీజన్లుగా భారత సీమర్ అర్ష్దీప్ సింగ్ నిలకడగా రాణిస్తున్నాడు. 96 అంతర్జాతీయ టి20లాడిన అర్ష్దీప్ 96 వికెట్లు తీశాడు. ముఖ్యంగా ఈ ఏడాది సఫారీగడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్ డెత్ ఓవర్లలో సీనియర్ స్టార్ బుమ్రాకు దీటుగా బౌలింగ్ వేసి దక్షిణాఫ్రికాను కట్టడి చేసిన అతనిపై ఫ్రాంచైజీలు ఎగబడటం ఖాయం.తరచూ పూర్తి జట్టును మారుస్తున్న పంజాబ్ కింగ్స్ వద్దే పెద్ద మొత్తంలో డబ్బులు (రూ.110 కోట్లు) ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్టార్డమ్ను తీసుకొచ్చేందుకు పంత్ను, బౌలింగ్ పదును పెంచేందుకు అర్ష్దీప్ను కొనుగోలు చేసేందుకు ఎక్కువ సానుకూలతలు పంజాబ్కే ఉన్నాయి.బట్లర్ వైపు ఆర్సీబీ చూపు పంజాబ్ తర్వాత రెండో అధిక పర్సు రూ. 83 కోట్లు కలిగివున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) డాషింగ్ ఓపెనర్ జోస్ బట్లర్పై రూ. కోట్లు వెచ్చించే అవకాశముంది. రాహుల్, అయ్యర్ సహా ఆల్రౌండర్ దీపక్ చహర్ కోసం పోటీపడనుంది.ఢిల్లీ క్యాపిటల్స్ (రూ. 73 కోట్లు), గుజరాత్ టైటాన్స్ (రూ.69 కోట్లు), లక్నో సూపర్జెయింట్స్ (రూ.69 కోట్లు), చెన్నై సూపర్కింగ్స్ (రూ. 55 కోట్లు), కోల్కతా నైట్రైడర్స్ (రూ. 51 కోట్లు), ముంబై ఇండియన్స్ (రూ.45 కోట్లు), సన్రైజర్స్ హైదరాబాద్ (రూ. 45 కోట్లు), రాజస్తాన్ రాయల్స్ (రూ.41 కోట్లు)లు కూడా అందుబాటులో ఉన్న వనరులతో మేటి ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి.చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన జైశ్వాల్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా -
శ్రేయస్ అయ్యర్ విధ్వంసకర సెంచరీ.. బౌలర్లకు చుక్కలు
ఐపీఎల్-2025 మెగా వేలానికి ఒక్క రోజు ముందు టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ-2024లో భాగంగా గోవాతో జరిగిన మ్యాచ్లో అయ్యర్ అద్భుత శతకంతో సత్తాచాటాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ముంబై సారథిగా బరిలోకి దిగిన అయ్యర్.. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 47 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 57 బంతులు ఎదుర్కొన్న అయ్యర్ 11 ఫోర్లు, 10 సిక్సర్లతో 130 పరుగులుచేశాడు. శ్రేయస్తోపాటు పృథ్వీషా(33), ములానీ(41) రాణించారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన గోవా జట్టు కూడా ఆఖరి వరకు పోరాడింది. లక్ష్య చేధనలో గోవా 8 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. ఫలితంగా 26 పరుగుల తేడాతో గోవా ఓటమి చవిచూడాల్సి వచ్చింది.గోవా బ్యాటర్లలో సుయాష్ ప్రభుదేశాయ్(52) టాప్ స్కోరర్గా నిలిచాడు. ముంబై బౌలర్లలో రాయ్స్టన్ ద్యాస్, సూర్యన్ష్ షెడ్గే తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ములానీ, శార్ధూల్ ఠాకూర్, మొహిత్ తలా వికెట్ సాధించారు.వేలంలో కాసుల వర్షం కురవనుందా?కాగా అయ్యర్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్నాడు. దీంతో నవంబర్ 24, 25 తేదీల్లో జెడ్డా వేదికగా జరగనున్న వేలంలో అయ్యర్పై కాసుల వర్షం కురిసే అవకాశముంది. కాగా మెగా వేలానికి ముందు కోల్కతా నైట్రైడర్స్ అయ్యర్ను వేలంలోకి విడిచిపెట్టిన సంగతి తెలిసిందే.చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన జైశ్వాల్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా -
SMT 2024: ముంబై జట్టు ప్రకటన.. పృథ్వీ షా, రహానేలకు చోటు
దేశవాళీ టి20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టుకు శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహించనున్నాడు. ఈ నెల 23 నుంచి డిసెంబర్ 15 వరకు జరగనున్న ఈ ట్రోఫీ కోసం ముంబై క్రికెట్ సంఘం ఆదివారం 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. రంజీ ట్రోపీలో ముంబై జట్టుకు సారథ్యం వహించిన అజింక్యా రహానేతో పాటు... ఫిట్నెస్ లేమితో పాటు క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడి రంజీ జట్టులో చోటు కోల్పోయిన ఓపెనర్ పృథ్వీ షా కూడా ముస్తాక్ అలీ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకున్నారు. భారత టెస్టు జట్టులో సుస్థిర స్థానం సాధించాలనుకుంటున్న శ్రేయస్ అయ్యర్ ప్రస్తుత రంజీ ట్రోఫీలో చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నాడు.తాజా సీజన్లో అయ్యర్ 90.40 సగటుతో 452 పరుగులు సాధించాడు. అందులో ఒక డబుల్ సెంచరీ, మరో సెంచరీ ఉంది. ఇక ఇటీవల ఆస్ట్రేలియా–‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టులో భారత ‘ఎ’ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తనుశ్ కోటియాన్, పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్, సిద్ధేశ్ లాడ్, యువ ఓపెనర్ అంగ్క్రిష్ రఘువంశీ ముంబై జట్టులో చోటు దక్కించుకున్నారు. ముంబై జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), పృథ్వీ షా, అంగ్క్రిష్ రఘువంశీ, జయ్ బిస్తా, అజింక్యా రహానే, సిద్ధేశ్ లాడ్, సూర్యాన్ష్ షెడ్గె, సాయిరాజ్ పాటిల్, హార్దిక్ తమోర్, ఆకాశ్ ఆనంద్, షమ్స్ ములానీ, హిమాన్షు సింగ్, తనుశ్ కోటియాన్, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్థి, రోస్టన్ డియాస్, జునేద్ ఖాన్.చదవండి: కోహ్లిపై ఒత్తిడి పెంచండి! -
శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఆడనున్న సూర్యకుమార్..!
ముంబై జట్టు కెప్టెన్గా తిరిగి బాధ్యతలు చేపట్టేందుకు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సిద్దమయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో అయ్యర్ను తమ జట్టు కెప్టెన్గా నియమించాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ సీనియర్ సెలక్షన్ కమిటీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.అయితే ప్రస్తుత రంజీ ట్రోఫీ సీజన్లో ముంబైకి కెప్టెన్గా ఉన్న అజింక్య రహానేనే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా సారథిగా వ్యహరిస్తాడని తొలుత వార్తలు వినిపించాయి. కానీ ఎంసీఎ మాత్రం అయ్యర్ వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.ఈ దేశీవాళీ టోర్నీలో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో రహానే ఆడనున్నట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ తమ కథనంలో పేర్కొంది.ఇక టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడనున్నట్లు వినికిడి. అయ్యర్ కెప్టెన్సీలో అతడు ముంబై తరపున బరిలోకి దిగనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఆరంభ మ్యాచ్లకు సూర్య దూరం కానున్నట్లు తెలుస్తోంది.కాగా ఇటీవలే సూర్య కెప్టెన్సీలోని భారత జట్టు దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ముంబై స్టార్ ప్లేయర్లు శివమ్ దూబే, ముషీర్ ఖాన్ గాయాల కారణంగా దూరమయ్యారు. ఇక ఈ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి ముంబై ప్రాబుబుల్స్పృథ్వీ షా, ఆయుష్ మ్హత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, జే బిస్తా, శ్రీరాజ్ ఘరత్, అజింక్య రహానే, శ్రేయాస్ అయ్యర్, సూర్యాంశ్ షెడ్గే, ఇషాన్ ముల్చందానీ, సిద్దేష్ లాడ్, హార్దిక్ తమోర్ (వికెట్కీపర్), ఆకాష్ ఆనంద్ (వికెట్ కీపర్), షా ముపార్కర్, సాయి పార్క్రాజ్, సాయి పార్క్, , హిమాన్షు సింగ్, సాగర్ ఛబ్రియా, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్తి, సిల్వెస్టర్ డిసౌజా, రాయిస్టన్ డయాస్, యోగేష్ పాటిల్, హర్ష్ తన్నా, ఇర్ఫాన్ ఉమైర్, వినాయక్ భోయిర్, కృతిక్ హనగవాడి, శశాంక్ అత్తార్డే, జునేద్ ఖాన్ -
స్టార్ ఓపెనర్ రీ ఎంట్రీ.. శ్రేయస్ అయ్యర్ కూడా! కానీ అతడు మిస్!
టీమిండియా ఓపెనర్, తమ స్టార్ క్రికెటర్ పృథ్వీ షాకు ముంబై క్రికెట్ అసోసియేషన్ శుభవార్త అందించింది. ఇటీవల రంజీ జట్టు నుంచి అతడిని తొలగించిన యాజమాన్యం.. దేశీ టీ20 టోర్నీ కోసం మళ్లీ పిలుపునిచ్చేందుకు సిద్ధమైంది. కాగా దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శనలతో టీమిండియాలోకి దూసుకువచ్చిన పృథ్వీ షా.. తన స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు.టీమిండియా ఓపెనర్గా తన స్థానాన్ని కోల్పోయినిలకడలేని ఆటతీరుతో శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్లతో పోటీలో వెనుకబడి టీమిండియా ఓపెనర్గా తన స్థానాన్ని కోల్పోయాడు. 2018లో భారత జట్టు తరఫున అరంగేట్రం చేసిన పృథ్వీ.. 2021లో చివరగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటి వరకు మొత్తం 5 టెస్టులు, 6 వన్డేలు ఆడిన ఈ ముంబై బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 339, 189 పరుగులు చేశాడు.ముంబై తరఫున ఆడుతూఅదే విధంగా.. టీమిండియా తరఫున ఒకే ఒక్క టీ20 ఆడి డకౌట్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో మళ్లీ డొమెస్టిక్ క్రికెట్పై దృష్టిపెట్టిన పృథ్వీ షా.. ముంబై తరఫున ఆడుతూ తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్తో పాటు.. విజయ్ హజారే ట్రోఫీ(వన్డే), సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(టీ20)లో ఆడుతూనే.. ఐపీఎల్లోనూ అదృష్టాన్ని పరీక్షించుకంటున్నాడు.ఇంగ్లండ్ గడ్డపై రాణిస్తూఅలాగే ఇంగ్లండ్ దేశీ టోర్నీల్లోనూ పాల్గొంటున్న పృథ్వీ షా.. అక్కడ నార్తంప్టన్షైర్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. రంజీ ట్రోఫీ 2024-25లో తొలుత పృథ్వీ షాకు అవకాశం ఇచ్చిన ముంబై క్రికెట్ అసోసియేషన్.. ఆ తర్వాత అతడిని పక్కనపెట్టింది. ఫామ్ లేమి, ఫిట్నెస్ సమస్యలు, అనుచిత ప్రవర్తన కారణంగా పృథ్వీపై వేటు వేసింది.శ్రేయస్ అయ్యర్ కూడాఈ నేపథ్యంలో తాజాగా ముంబై ప్రాబబుల్స్ జట్టులో పృథ్వీ పేరు కనిపించడం విశేషం. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో పాల్గొనే అవకాశం ఉన్న ఆటగాళ్ల పేరును ముంబై క్రికెట్ అసోసియేషన్ తాజాగా విడుదల చేసింది. ఇందులో పృథ్వీ షాతో పాటు టీమిండియా స్టార్, ప్రస్తుతం జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్లతో పాటు వెటరన్ ప్లేయర్ అజింక్య రహానే తదితరుల పేర్లు కూడా ఉన్నాయి.అతడు మాత్రం మిస్అయితే, ఆల్రౌండర్ తనుష్ కొటియాన్ మాత్రం ఈ లిస్టులో మిస్సయ్యాడు. ఇటీవల భారత్-‘ఎ’ జట్టుకు ఎంపికైన అతడు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నాడు. కానీ.. అక్కడ ఆసీస్-‘ఎ’తో రెండు మ్యాచ్ల అనధికారిక టెస్టు సిరీస్లో భారత్ 2-0తో క్లీన్స్వీప్ అయింది. కాగా నవంబరు 23 నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తాజా సీజన్ మొదలుకానుంది. ఇందులో రంజీ సారథి రహానేనే ముంబైకి నాయక త్వం వహించే అవకాశం ఉంది.సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తాజా ఎడిషన్లో పాల్గొనబోయే ముంబై ప్రాబబుల్ జట్టుపృథ్వీ షా, ఆయుష్ మాత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, జే బిస్తా, శ్రీరాజ్ ఘరత్, అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్, సూర్యాన్ష్ షెడ్గే, ఇషాన్ ముల్చందానీ, సిద్ధేశ్ లాడ్, హార్దిక్ తామోర్ (వికెట్ కీపర్), ఆకాశ్ ఆనంద్ (వికెట్ కీపర్), సాయిరాజ్ పాటిల్, ఆకాశ్ పార్కర్, షామ్స్ ములానీ, హిమాన్షు సింగ్, సాగర్ చాబ్రియా, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్థి, సిల్వెస్టర్ డిసౌజా, రాయ్స్టన్ డైస్, యోగేశ్ పాటిల్, హర్ష్ తన్నా, ఇర్ఫాన్ ఉమైర్, వినాయక్ భోయిర్, కృతిక్ హనగవాడీ, శశాంక్ అటార్డే, జునేద్ ఖాన్. చదవండి: BGT: వరుసగా 4 సెంచరీలు.. ఆస్ట్రేలియాలో ఫెయిల్.. అయినా టీమిండియా ఓపెనర్గా అతడే! -
శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. కెరీర్లో తొలి డబుల్ సెంచరీ
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, ముంబై స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ తన ఫామ్ను తిరిగి అందుకున్నాడు. రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో భాగంగా బాంద్రా కుర్లా కాంప్లెక్స్ గ్రౌండ్ వేదికగా ఒడిశాతో జరుగుతున్న మ్యాచ్లో అయ్యర్ అద్భుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు.ఐదో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన అయ్యర్ వన్డే తరహాలో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మైదానం నలుమూలల బౌండరీలు బాదుతూ తన సత్తా ఎంటో మరోసారి శ్రేయస్ చూపించాడు. ఈ క్రమంలో అయ్యర్ కేవలం 201 బంతుల్లో తన తొలి ఫస్ట్క్లాస్ డబుల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు.ఓవరాల్గా తొలి ఇన్నింగ్స్లో 228 బంతులు ఎదుర్కొన్న అయ్యర్.. 24 ఫోర్లు, 9 సిక్స్లతో 233 పరుగులు చేసి ఔటయ్యాడు. అయ్యర్తో పాటు సుద్దేశ్ లాడ్(150 బ్యాటింగ్) సెంచరీతో మెరిశాడు. వీరిద్దరి విధ్వంసం ఫలితంగా ముంబై తమ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. 117 ఓవర్లు ముగిసే సరికి ముంబై 4 వికెట్ల నష్టానికి 521 పరుగులు చేసింది.అయ్యర్ రీ ఎంట్రీ ఇస్తాడా?కాగా శ్రేయస్ అయ్యర్ తన పేలవ ఫామ్ కారణంగా భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయాడు. అయ్యర్ చివరగా ఇండియా తరపున టెస్టుల్లో ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్పై ఆడాడు. తొలి టెస్టు ఆడిన అయ్యర్కు తన వెన్ను గాయం తిరగబెట్టడంతో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.ఆ తర్వాత రంజీల్లో ఆడాలన్న బీసీసీఐ అదేశాలు దిక్కరించడంతో అయ్యర్ తన సెంట్రల్ కాంట్రాక్ట్ను కోల్పోయాడు. ఆ తర్వాత దిగివచ్చిన శ్రేయస్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఆడేందుకు సిదద్దమయ్యాడు. ఈ క్రమంలో బుచ్చిబాబు టోర్నీ, దులీప్ ట్రోఫీలో అతడు ఆడాడు. ఇప్పుడు రంజీ సీజన్లో కూడా ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక అద్బుత డబుల్ సెంచరీతో అయ్యర్ తిరిగి భారత టెస్టు జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది.చదవండి: గుడ్న్యూస్ చెప్పిన పీవీ సింధు.. పునాది పడింది! -
IPL 2025: కేకేఆర్ విడిచిపెట్టింది.. సెంచరీలతో విరుచుకుపడ్డారు..!
ఐపీఎల్ ఫ్రాంచైజీలు అక్టోబర్ 31న తాము రీటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. ఈ జాబితాలో చాలామంది స్టార్ ఆటగాళ్ల పేర్లు మిస్ అయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన కేకేఆర్ రింకూ సింగ్ (రూ. 13 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ. 12 కోట్లు), సునీల్ నరైన్ (రూ. 12 కోట్లు), ఆండ్రీ రసెల్ (రూ. 12 కోట్లు), హర్షిత్ రాణా (రూ. 4 కోట్లు), రమన్దీప్ సింగ్ను (రూ. 4 కోట్లు) అట్టిపెట్టుకుని.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సహా మిగతా ఆటగాళ్లనంతా వేలానికి వదిలేసింది.కేకేఆర్ రిటైన్ చేసుకున్న జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో మిచెల్ స్టార్క్, వెంకటేశ్ అయ్యర్ లాంటి ఆటగాళ్లు మనసు నొచ్చుకున్నారు. వెంకటేశ్ అయ్యర్ తన మనసులోని మాటను సోషల్మీడియాలో షేర్ చేసుకున్నాడు. కేకేఆర్ వదిలిపెట్టిన తర్వాత జరుగుతున్న తొలి రంజీ మ్యాచ్లో వెంకటేశ్ అయ్యర్ తన ప్రతాపాన్ని చూపాడు. రంజీల్లో మధ్యప్రదేశ్కు ఆడే వెంకటేశ్ అయ్యర్.. బీహార్తో జరుగుతున్న మ్యాచ్లో 113 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 118 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.కేకేఆర్ తనను వదిలేసిందన్న కోపమో ఏమో కానీ ఈ మ్యాచ్లో వెంకటేశ్ అయ్యర్ చాలా పట్టుదలగా ఆడి సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో వెంకటేశ్ అయ్యర్ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు కూడా సవాలు విసిరాడు. తానెంత విలువైన ఆటగాడినో అన్న విషయాన్ని వెంకటేశ్ అయ్యర్ ఫ్రాంచైజీలకు తెలియజేశాడు.మరోవైపు కేకేఆర్ వదిలేసిన మరో అయ్యర్ కూడా ఇవాళ శతకొట్టాడు. కేకేఆర్ మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. ఒడిషాతో జరుగుతున్న మ్యాచ్లో 164 బంతుల్లో 18 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 152 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ప్రస్తుత రంజీ సీజన్లో శ్రేయస్కు ఇది వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం. తాజా ప్రదర్శనల నేపథ్యంలో ఐపీఎల్ 2025 మెగా వేలంలో శ్రేయస్కు మాంచి గిరాకీ ఏర్పడే అవకాశం ఉంది. -
సెలెక్టర్లకు సవాలు విసిరిన శ్రేయస్ అయ్యర్.. వరుసగా రెండు సెంచరీలు
రంజీ ట్రోఫీ 2024 సీజన్లో ముంబై ఆటగాడు, టీమిండియా ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ వరుసగా రెండు మ్యాచ్ల్లో సెంచరీలు చేశాడు. ఈ సీజన్లో తొలుత మహారాష్ట్రపై శతక్కొట్టిన శ్రేయస్.. తాజాగా ఒడిషాపై సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. ఒడిషాపై శ్రేయస్ 101 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో 14 బౌండరీలు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఓవరాల్ శ్రేయస్కు ఫస్ట్ క్లాస్ కెరీర్లో ఇది 15వ సెంచరీ. శ్రేయస్ అటాకింగ్ సెంచరీతో సత్తా చాటడంతో ఒడిషాతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై పటిష్ట స్థితికి చేరింది. 72 ఓవర్ల అనంతరం ముంబై 3 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. శ్రేయస్కు జతగా సిద్దేశ్ లాడ్ (91) క్రీజ్లో ఉన్నాడు. అంతకుముందు ఓపెనర్ అంగ్క్రిష్ రఘువంశీ తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. రఘువంశీ 124 బంతుల్లో 92 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ ఆయుశ్ మాత్రే 18 పరుగులకు వెనుదిరగగా.. కెప్టెన్ అజింక్య రహానే డకౌటయ్యాడు. ఒడిషా బౌలర్లలో బిప్లబ్ సమంత్రే రెండు వికెట్లు పడగొట్టగా.. సూర్యకాంత్ ప్రధాన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.కాగా, శ్రేయస్ అయ్యర్ తిరిగి టెస్టుల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు కష్టపడుతున్నాడు. పేలవ ఫామ్ కారణంగా ఇంగ్లండ్తో సిరీస్ అనంతరం జట్టులో చోటు కోల్పోయిన శ్రేయస్.. ఆతర్వాత సెంట్రల్ కాంట్రాక్ట్ను కోల్పోయాడు. ప్రస్తుతం టీమిండియాలో రీ ఎంట్రీనే లక్ష్యంగా శ్రేయస్ రంజీట్రోఫీలో ఆడుతున్నాడు. శ్రేయస్ వరుస సెంచరీలు చేసి సెలెక్టర్లకు సవాలు విసిరాడు. టీమిండియా మిడిలార్డర్ బలహీనంగా కనబడుతున్న తరుణంలో శ్రేయస్ సెలెక్టర్ల పాలిట ఆశాకిరణంగా కనిపిస్తుంటాడు.మరోవైపు శ్రేయస్ను తన ఐపీఎల్ ఫ్రాంచైజీ కేకేఆర్ ఇటీవలే వదిలించుకున్న విషయం తెలిసిందే. శ్రేయస్ కేకేఆర్ను గత సీజన్లో ఛాంపియన్గా నిలిబెట్టినా అతన్ని కేకేఆర్ రిటైన్ చేసుకోలేదు. నవంబర్ 24, 25 తేదీల్లో జెద్దా వేదికగా జరిగే ఐపీఎల్ 2025 మెగా వేలంలో శ్రేయస్ పాల్గొంటాడు. శ్రేయస్ రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్ విభాగంలో తన పేరును నమోదు చేసుకున్నాడు. శ్రేయస్తో పాటు రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సిరాజ్ లాంటి 48 మంది భారతీయ స్టార్ క్యాప్డ్ ఆటగాళ్లు మెగా వేలంలో పాల్గొననున్నారు. -
IPL Auction: వేలంలోకి టీమిండియా స్టార్లు.. వాళ్లిద్దరి కనీస ధర తక్కువే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం-2025 వేదిక ఖరారైంది. ఈ నెల 24, 25న సౌదీ అరేబియాలోని జిద్దా నగరంలో ఐపీఎల్–2025 వేలంపాట జరగనుందని మంగళవారం బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. గత ఏడాది దుబాయ్లో ఐపీఎల్ వేలం నిర్వహించగా... వరుసగా రెండో ఏడాది విదేశాల్లో ఐపీఎల్ వేలం జరగనుంది. ముందుగా సౌదీ అరేబియా రాజధాని రియాద్లో వేలం నిర్వహిస్తారని వార్తలు వచ్చినా బీసీసీఐ మాత్రం జిద్దా నగరాన్ని ఎంచుకుంది. 👉ఇక ఇటీవల ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితా విడుదల కాగా... 1574 మంది ప్లేయర్లు వేలానికి రానున్నారు. ఇందులో 1165 మంది భారత ఆటగాళ్లు, 409 మంది విదేశీయులు ఉన్నారు. మొత్తంగా 320 మంది క్యాప్డ్ ప్లేయర్లు, 1224 మంది అన్ క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. 👉ఇందులో జాతీయ జట్టుకు ఆడిన భారత ఆటగాళ్లు 48 మంది ఉండగా... 965 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. అసోసియేట్ దేశాల నుంచి 30 మంది ప్లేయర్లు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అప్పటి నుంచి ఒక్క టీ20 ఆడలేదు.. కానీ👉ఇంగ్లండ్ స్టార్ బెన్ స్టోక్స్ వచ్చే ఐపీఎల్ టోర్నీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. 2014 నుంచి ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడని ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ ఏకంగా రూ. 1 కోటీ 25 లక్షల కనీస ధరకు తన పేరును నమోదు చేసుకోవడం విశేషం. 👉ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా తొలి టెస్టు ఆడుతున్న సమయంలోనే ఈ వేలం జరగనుంది. ఒక్కో జట్టు రీటైన్ ఆటగాళ్లను కలుపుకొని అత్యధికంగా 25 మంది ప్లేయర్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం ఫ్రాంచైజీలు రీటైన్ చేసుకున్న ఆటగాళ్లు కాకుండా... ఇంకా 204 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంది. వేలంలో 641.5 కోట్లు ఖర్చురిటెన్షన్ విధానంలో పలువురు ప్రధాన ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వదిలేసుకోవడంతో... రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, సిరాజ్లాంటి పలువురు భారత స్టార్ ఆటగాళ్లు వేలానికి రానున్నారు. మొత్తంగా 10 ఫ్రాంచైజీలు కలిపి 204 మంది ప్లేయర్ల కోసం రూ. 641.5 కోట్లు వేలంలో ఖర్చు చేయనున్నాయి. ఇందులో 70 మంది విదేశీ ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది. రిటెన్షన్ గడువు ముగిసేసరికి 10 జట్లు రూ. 558.5 కోట్లు ఖర్చు పెట్టి 46 మంది ప్లేయర్లను అట్టిపెట్టుకున్నాయి. రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన తర్వాత అత్యధికంగా పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ వద్ద రూ.110.5 కోట్లు మిగిలి ఉన్నాయి. వారి కనీస ధర రూ. 2 కోట్లుఇక ఈసారి వేలంలోకి రానున్న టీమిండియా స్టార్ బ్యాటర్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లతో పాటు వెటరన్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్ తదితరులు తమ కనీస ధరను రూ. 2 కోట్లుగా నిర్ణయించినట్లు సమాచారం.వీరితో పాటు ఖలీల్ అహ్మద్, దీపక్ చహర్, వెంకటేశ్ అయ్యర్, ఆవేశ్ ఖాన్, ఇషాన్ కిషన్, ముకేశ్ కుమార్, భువనేశ్వర్ కుమార్, ప్రసిద్ కృష్ణ, టి.నటరాజన్, దేవదత్ పడిక్కల్, కృనాల్ పాండ్యా, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్ తదితర ద్వితీయ శ్రేణి భారత క్రికెటర్లు సైతం రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి రానున్నట్లు తెలుస్తోంది.వీరి బేస్ ప్రైస్ రూ. 75 లక్షలుఅయితే, ముంబై బ్యాటర్లు పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ల బేస్ ప్రైస్ మాత్రం రూ. 75 లక్షలుగా ఉండనున్నట్లు సమాచారం. కాగా టీమిండియా ఓపెనర్గా వచ్చిన అవశాలను సద్వినియోగం చేసుకోలేకపోయిన పృథ్వీ షా.. ఐపీఎల్లోనూ అంతంతమాత్రంగానే ఆడుతున్నాడు. మరోవైపు.. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సర్ఫరాజ్ ఖాన్ టెస్టుల్లో సత్తా చాటుతున్నాడు. అయితే, గతేడాది వేలంలో అమ్ముడుపోకుండా మిగిలి పోయిన అతడిని ఈసారి ఏదో ఒక ఫ్రాంఛైజీ కనీసం బేస్ ధరకు సొంతం చేసుకునే అవకాశం ఉంది.చదవండి: Ind vs Aus BGT: కేఎల్ రాహుల్పై దృష్టి -
IPL 2025: మెగా వేలం డేట్స్ ఫిక్స్! ఇప్పటికి రూ. రూ. 550.5 కోట్లు.. ఇక
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2025 మెగా వేలానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి పూర్తి ప్రణాళికను సిద్ధం చేసిందని.. ఈ నెల ఆఖరి వారంలో రియాద్ వేదికగా ఆక్షన్ నిర్వహించనున్నట్లు సమాచారం. అదే విధంగా.. వేలం రెండు రోజుల పాటు సాగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.రైట్ టూ మ్యాచ్ కార్డు అందుబాటులోకికాగా మెగా వేలం నేపథ్యంలో ఇప్పటికే పది ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్ జాబితాను బీసీసీఐకి సమర్పించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది పర్స్ వాల్యూను రూ. 120 కోట్లకు పెంచడం సహా రైట్ టూ మ్యాచ్(ఆర్టీఎమ్) కార్డు అందుబాటులోకి రావడంతో ఫ్రాంఛైజీలు వ్యూహాత్మకంగా అడుగులు వేశాయి. కీలకమైన ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకుని.. స్టార్లు అయినా సరే తమకు భారం అనుకుంటే.. వాళ్లను వదిలించుకున్నాయి.వదిలించుకున్నాయిరాజస్తాన్ రాయల్స్ జోస్ బట్లర్(ఇంగ్లండ్), సన్రైజర్స్ హైదరాబాద్ ఐడెన్ మార్క్రమ్(సౌతాఫ్రికా), ఆర్సీబీ గ్లెన్ మాక్స్వెల్(ఆస్ట్రేలియా), కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(సౌతాఫ్రికా), లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్, కోల్కతా నైట్రైడర్స్కు ఈ ఏడాది టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్లను రిలీజ్ చేయడం ఇందుకు ఉదాహరణ.ఆ తేదీల్లోనే వేలం!ఇక పది జట్లు కలిపి మొత్తంగా 46 మంది ప్లేయర్లను అట్టిపెట్టుకుని.. వారి కోసం రూ. 550.5 కోట్ల మేర ఖర్చు చేశాయి. ఇక ఈ 46 మందిలో 36 మంది భారత క్రికెటర్లే.. అందులోనూ పది మంది అన్క్యాప్డ్ ఇండియన్స్ కావడం విశేషం. కాగా ఈ సీజన్లో కూడా సొంతగడ్డపై కాకుండా విదేశంలో వేలం నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.ఇందుకోసం సౌదీ అరేబియా రాజధాని రియాద్ను ఎంపిక చేసినట్లు సమాచారం. నవంబరు 24, 25 తేదీల్లో వేలం నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైనట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాగా గతేడాది డిసెంబరు 19న దుబాయ్లో ఐపీఎల్ వేలం జరిగిన విషయం తెలిసిందే.ఐపీఎల్ మెగా వేలం-2025 రిటెన్షన్స్ పోనూ ఎవరి పర్సులో ఎంత?రాజస్తాన్ రాయల్స్ 👉సంజూ సామ్సన్-భారత్- రూ. 18 కోట్లు 👉యశస్వి జైస్వాల్- భారత్- రూ. 18 కోట్లు 👉రియాన్ పరాగ్- భారత్- రూ. 14 కోట్లు 👉ధ్రువ్ జురెల్- భారత్- రూ. 14 కోట్లు 👉హెట్మైర్-వెస్టిండీస్ రూ. 11 కోట్లు 👉సందీప్ శర్మ- భారత్- రూ. 4 కోట్లు 👉పర్సులో మిగిలిన మొత్తం: రూ. 41 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం లేదుగుజరాత్ టైటాన్స్👉రషీద్ ఖాన్-అఫ్గానిస్తాన్- రూ. 18 కోట్లు 👉శుబ్మన్ గిల్- భారత్- రూ. 16.50 కోట్లు 👉సాయి సుదర్శన్- భారత్- రూ. 8.50 కోట్లు 👉రాహుల్ తెవాటియా- భారత్ రూ. 4 కోట్లు 👉షారుఖ్ ఖాన్ భారత్- రూ. 4 కోట్లు 👉పర్సులో మిగిలిన మొత్తం: రూ. 69 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం: ఒక క్యాప్డ్ ప్లేయర్ను తీసుకోవచ్చుఢిల్లీ క్యాపిటల్స్ 👉అక్షర్ పటేల్- భారత్- రూ. 16.50 కోట్లు 👉కుల్దీప్ యాదవ్- భారత్ రూ. 13.25 కోట్లు 👉ట్రిస్టన్ స్టబ్స్- దక్షిణాఫ్రికా రూ. 10 కోట్లు 👉అభిషేక్ పొరెల్- భారత్ రూ. 4 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 73 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం: ఇద్దరు క్యాప్డ్ ప్లేయర్లను తీసుకోవచ్చు లక్నో సూపర్ జెయింట్స్ 👉నికోలస్ పూరన్- వెస్టిండీస్- రూ. 21 కోట్లు 👉రవి బిష్ణోయ్- భారత్- రూ. 11 కోట్లు 👉మయాంక్ యాదవ్ -భారత్- రూ. 11 కోట్లు 👉మోహసిన్ ఖాన్- భారత్- రూ. 4 కోట్లు 👉ఆయుష్ బదోని- భారత్- రూ. 4 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 69 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం లేదు: ఒక క్యాప్డ్ ప్లేయర్ను తీసుకోవచ్చు సన్రైజర్స్ హైదరాబాద్ 👉హెన్రిచ్ క్లాసెన్- దక్షిణాఫ్రికా- రూ. 23 కోట్లు 👉ప్యాట్ కమిన్స్- ఆస్ట్రేలియా- రూ. 18 కోట్లు 👉అభిషేక్ శర్మ- భారత్- రూ. 14 కోట్లు 👉ట్రావిస్ హెడ్- ఆస్ట్రేలియా- రూ. 14 కోట్లు 👉నితీశ్ రెడ్డి- భారత్- రూ. 6 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 45 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం: ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ను తీసుకోవచ్చుముంబై ఇండియన్స్ 👉జస్ప్రీత్ బుమ్రా- భారత్- రూ. 18 కోట్లు 👉సూర్యకుమార్- భారత్- రూ. 16.35 కోట్లు 👉హార్దిక్ పాండ్యా- భారత్- రూ. 16.35 కోట్లు 👉రోహిత్ శర్మ- భారత్- రూ. 16.30 కోట్లు 👉తిలక్ వర్మ- భారత్- రూ. 8 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 45 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం: ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ను తీసుకోవచ్చుచెన్నై సూపర్ కింగ్స్ 👉రుతురాజ్ గైక్వాడ్- భారత్- రూ. 18 కోట్లు 👉మతీశా పతిరన- శ్రీలంక- రూ. 13 కోట్లు 👉శివమ్ దూబే- భారత్- రూ. 12 కోట్లు 👉రవీంద్ర జడేజా- భారత్- రూ. 18 కోట్లు 👉ధోనీ - భారత్- రూ. 4 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 55 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం: ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ను తీసుకోవచ్చుకోల్కతా నైట్ రైడర్స్ 👉రింకూ సింగ్- భారత్- రూ. 13 కోట్లు 👉వరుణ్ చక్రవర్తి- భారత్ -రూ. 12 కోట్లు 👉సునీల్ నరైన్- వెస్టిండీస్- రూ. 12 కోట్లు 👉ఆండ్రె రసెల్- వెస్టిండీస్- రూ. 12 కోట్లు 👉హర్షిత్ రాణా- భారత్- రూ. 4 కోట్లు 👉రమణ్దీప్ సింగ్- భారత్- రూ. 4 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 51 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం లేదురాయల్ చాలెంజర్స్ బెంగళూరు 👉విరాట్ కోహ్లి- భారత్- రూ. 21 కోట్లు 👉రజత్ పాటిదార్- భారత్ -రూ. 11 కోట్లు 👉యశ్ దయాళ్- భారత్- రూ. 5 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 83 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం: ముగ్గురు క్యాప్డ్ ప్లేయర్లను తీసుకోవచ్చుపంజాబ్ కింగ్స్ 👉శశాంక్ సింగ్- భారత్- రూ. 5.5 కోట్లు 👉ప్రభ్సిమ్రన్ సింగ్ -భారత్- రూ. 4 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 110.5 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం: నలుగురు క్యాప్డ్ ప్లేయర్లను తీసుకోవచ్చు.చదవండి: BGT 2024: సొంతగడ్డపైనే ఘోర అవమానం.. గంభీర్కు బీసీసీఐ షాక్!.. ఇక చాలు.. -
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా టీమిండియా స్టార్ ప్లేయర్?
ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తమ కెప్టెన్ రిషబ్ పంత్ను విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, కుల్దీప్ యాదవ్లను మాత్రమే ఢిల్లీ రిటైన్ చేసుకుంది. అయితే పంత్ను వేలంలోకి విడిచిపెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఇప్పుడు తమ కొత్త కెప్టెన్ను వెతికే పనిలో పడింది. ఈ క్రమంలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, కోల్కతా నైట్రైడర్స్ మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్పై ఢిల్లీ యాజమాన్యం కన్నేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ ఆఖరిలో జరగనున్న మెగా వేలంలో అయ్యర్ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని సదరు ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్-2024లో కేకేఆర్ను ఛాంపియన్గా నిలిపిన శ్రేయస్కు తమ జట్టు పగ్గాలు అప్పగించాలని జీఎంఆర్( (GMR) గ్రూప్ యోచిస్తున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.మళ్లీ సొంతగూటికి?కాగా ఢిల్లీ ఫ్రాంచైజీతో శ్రేయస్కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అయ్యర్ 2015లో ఢిల్లీ ఫ్రాంచైజీ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అప్పటి ఢిల్లీ డేర్డేవిల్స్ అతడిని రూ.2.5 కోట్లకు కొనుగోలు చేసింది. తన అరంగేట్రం నుంచి ఐపీఎల్-2021 వరకు ఢిల్లీ ఆధారిత ఫ్రాంచైజీకే అయ్యర్ ప్రాతినిథ్యం వహించాడు. అంతేకాకుండా మూడు సీజన్ల పాటు ఢిల్లీ కెప్టెన్గా కూడా శ్రేయస్ వ్యవహరించాడు. ఐపీఎల్-2020లో అయ్యర్ సారథ్యంలోనే ఢిల్లీ ఫైనల్కు చేరింది. ఆ తర్వాత అయ్యర్ తరుచూ గాయాల బారిన పడటంతో ఢిల్లీ యాజమాన్యం ఐపీఎల్-2022 సీజన్ ముందు విడిచిపెట్టింది. ఈ క్రమంలో అయ్యర్ స్ధానంలోనే తమ రెగ్యూలర్ కెప్టెన్గా రిషబ్ను ఢిల్లీ నియమించింది. ఇప్పుడు మళ్లీ రివర్స్గా రిషబ్ను విడిచిపెట్టి అయ్యర్ను తమ సారథిగా నియమించేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఢిల్లీ పర్స్లో ప్రస్తుతం రూ.73 కోట్లు ఉన్నాయి. వేలంలో ఈ భారీ మొత్తాన్ని ఢిల్లీ ఫ్రాంచైజీ ఖర్చుచేయనుంది.చదవండి: IND vs NZ: నా బౌలింగ్లోనే సిక్సర్లు కొడతావా? కసి తీర్చుకున్న అశ్విన్! వీడియో -
IPL 2025 Retention List: కెప్టెన్లను వదిలేసిన ఫ్రాంచైజీలు ఇవే..!
ఐపీఎల్ 2025 సీజన్కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. అన్ని ఫ్రాంచైజీలు ఊహించినట్టుగానే తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించాయి. అయితే కొన్ని ఫ్రాంచైజీలు ఆసక్తికరంగా తమ కెప్టెన్లను వదిలేశాయి.ముందు నుంచి ప్రచారం జరిగినట్టుగా ఢిల్లీ (రిషబ్ పంత్), లక్నో (కేఎల్ రాహుల్), కేకేఆర్ (శ్రేయస్ అయ్యర్), పంజాబ్ కింగ్స్ (శిఖర్ ధవన్), ఆర్సీబీ (ఫాఫ్ డుప్లెసిస్) తమ కెప్టెన్లను వేలానికి వదిలేశాయి. నవంబర్ చివరి వారంలో జరుగబోయే మెగా వేలంలో ఈ ఐదుగురు కెప్టెన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కారణాలు ఏవైనా ఆయా ఫ్రాంచైజీలు కెప్టెన్లను వేలానికి వదిలేయడం ఆసక్తికరంగా మారింది.కెప్టెన్లను వదిలేసిన ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా..కోల్కతా నైట్రైడర్స్రింకూ సింగ్- రూ. 13 కోట్లువరుణ్ చక్రవర్తి- రూ. 12 కోట్లుసునీల్ నరైన్- రూ. 12 కోట్లుఆండ్రీ రసెల్- రూ. 12 కోట్లుహర్షిత్ రాణా- రూ. 4 కోట్లురమన్దీప్ సింగ్- రూ. 4 కోట్లుఢిల్లీ క్యాపిటల్స్అక్షర్ పటేల్- రూ. 16.5 కోట్లుకుల్దీప్ యాదవ్- రూ. 13.25 కోట్లుట్రిస్టన్ స్టబ్స్- రూ. 10 కోట్లుఅభిషేక్ పోరెల్- రూ. 4 కోట్లులక్నో సూపర్ జెయింట్స్నికోలస్ పూరన్- రూ. 21 కోట్లురవి బిష్ణోయ్- రూ. 11 కోట్లుమయాంక్ యాదవ్- రూ. 11 కోట్లుమొహిసన్ ఖాన్- రూ. 4 కోట్లుఆయుశ్ బదోని- రూ. 4 కోట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరువిరాట్ కోహ్లి- రూ. 21 కోట్లురజత్ పాటిదార్- రూ. 11 కోట్లుయశ్ దయాల్- రూ. 5 కోట్లుపంజాబ్ కింగ్స్శశాంక్ సింగ్- రూ. 5.5 కోట్లుప్రభ్మన్సిమ్రన్ సింగ్- రూ. 4 కోట్లు -
IPL 2025: శ్రేయస్తో కేకేఆర్ కటీఫ్..?
ఐపీఎల్-2025 సీజన్ కోసం ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాల సమర్పణకు మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. అక్టోబర్ 31లోగా ఫ్రాంచైజీలన్నీ తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల వివరాలను సమర్పించాలి. అన్ని ఫ్రాంచైజీలు ఇప్పటికే తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్లపై ఓ క్లారిటీ కలిగి ఉన్నాయి.ఒక్కో ఫ్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు. ఇందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లకు అవకాశం ఉంటుంది. రిటైన్ చేసుకునే క్యాప్డ్ ప్లేయర్లకు ఛాయిస్ ప్రకారం వరుసగా 18, 14, 11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. రిటైన్ చేసుకునే అన్క్యాప్డ్ ప్లేయర్కు 4 కోట్లు పారితోషికం చెల్లించాల్సి ఉంటుంది. ఐపీఎల్-2025 వేలం నవంబర్ 25 లేదా 26 తేదీల్లో రియాద్లో జరగవచ్చు.శ్రేయస్తో కేకేఆర్ కటీఫ్..?కేకేఆర్ విషయానికొస్తే.. ఈ ఫ్రాంచైజీ కూడా తమ రిటెన్షన్ జాబితాను సిద్దం చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే కేకేఆర్ ఈసారి కెప్టెన్ పేరు లేకుండానే ముందుకు సాగనున్నట్లు సమాచారం. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో కేకేఆర్ గత సీజన్ టైటిల్ గెలిచినప్పటికీ.. ఈసారి అతన్ని రిటైన్ చేసుకునేందుకు ఫ్రాంచైజీ యాజమాన్యం ఆసక్తి కనబర్చడం లేదని తెలుస్తుంది. రిటెన్షన్ జాబితా సమర్పణకు మరికొద్ది గంటలు సమయమే ఉన్నా ఇప్పటికీ ఫ్రాంచైజీ మేనేజ్మెంట్ శ్రేయస్ను సంప్రదించలేదట. దీన్ని బట్టి చూస్తే కేకేఆర్ శ్రేయస్కు కటీఫ్ చెప్పడం ఖాయమని తెలుస్తుంది.ఇదిలా ఉంటే, శ్రేయస్ కోసం సొంత ఫ్రాంచైజీ ఆసక్తి కనబర్చనప్పటికీ.. మిగతా ఫ్రాంచైజీలు ఎగబడుతున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ శ్రేయస్ వేలానికి వస్తే ఇతన్ని దక్కించుకోవడం కోసం మూడు, నాలుగు ఫ్రాంచైజీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయట. కెప్టెన్గా శ్రేయస్కు మంచి ట్రాక్ రికార్డు ఉండటంతో ఇతన్ని కెప్టెన్గా చేసేందుకు పలు ఫ్రాంచైజీలు ప్రణాళికలు సిద్దం చేసుకున్నాయని సమాచారం.కేకేఆర్ రిటైన్ చేసుకునే అవకాశం ఉన్న ఆటగాళ్లు..సునీల్ నరైన్ఆండ్రీ రసెల్ఫిలిప్ సాల్ట్రింకూ సింగ్ -
శ్రేయస్ అయ్యర్కు గాయం
ముంబై బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మరోసారి గాయం బారిన పడ్డాడు. ఇటీవల జరిగిన రంజీ మ్యాచ్ సందర్భంగా శ్రేయస్ భుజానికి దెబ్బ తగిలింది. శ్రేయస్ వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో అతను ముంబై తదుపరి ఆడబోయే రంజీ మ్యాచ్కు దూరం కానున్నాడు. ముంబై ఈ నెల 26న త్రిపురతో తలపడాల్సి ఉంది. రంజీల్లో రాణించి టీమిండియాలో చోటు దక్కించుకోవాలని భావించిన శ్రేయస్కు గాయాలు పెద్ద సమస్యగా మారాయి.శ్రేయస్ ఈ ఏడాది ఆగస్ట్లో చివరిసారిగా టీమిండియాకు ఆడాడు. అనంతరం అతను జట్టులో స్థానం కోల్పోయి ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడుతున్నాడు. శ్రేయస్ ఇటీవలికాలంలో దులీప్ ట్రోఫీ, ఇరానీ కప్, రంజీ ట్రోఫీలో మొత్తం ఆరు మ్యాచ్లు ఆడాడు. గత వారం మహారాష్ట్రతో జరిగిన రంజీ మ్యాచ్లో శ్రేయస్ మ్యాచ్ విన్నింగ్ సెంచరీతో (142) మెరిశాడు. శ్రేయస్ ఈ రంజీ సీజన్లో ఇప్పటివరకు మూడు ఇన్నింగ్స్లు ఆడి 57.33 సగటున 172 పరుగులు చేశాడు. బరోడాతో జరిగిన సీజన్ తొలి మ్యాచ్లో శ్రేయస్ 0, 30 పరుగులు చేశాడు. చదవండి: పృథ్వీ షాపై వేటు -
మూడేళ్ల తర్వాత శతక్కొట్టిన శ్రేయస్ అయ్యర్.. నేను రెడీ!
శ్రేయస్ అయ్యర్ శతక్కొట్టాడు. మూడేళ్ల తర్వాత ఈ ముంబై బ్యాటర్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో తొలి సెంచరీ సాధించాడు. రంజీ ట్రోఫీ 2024-25 ఎడిషన్లో భాగంగా మహారాష్ట్రతో మ్యాచ్ సందర్భంగా వంద పరుగుల మార్కును దాటాడు.టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ఈ మేర అద్భుత శతకం బాదిన శ్రేయస్ అయ్యర్.. రేసులో తానూ ఉన్నానంటూ సెలక్టర్లకు సందేశం పంపాడు. డిఫెండింగ్ చాంపియన్ ముంబై రంజీ తాజా ఎడిషన్లో తొలుత బరోడాతో తలపడి ఓడిపోయింది.ఈ క్రమంలో రహానే సేన అక్టోబరు 18న మహారాష్ట్రతో తమ రెండో మ్యాచ్ మొదలుపెట్టింది. సొంతమైదానంలో టాస్ ఓడిన ముంబై తొలుత బౌలింగ్ చేసింది. మహారాష్ట్రను తొలి ఇన్నింగ్స్లో 126 పరుగులకే ఆలౌట్ చేసింది. ముంబై బౌలర్లలో మోహిత్ అవస్థి, షామ్స్ ములానీ మూడేసి వికెట్లతో చెలరేగగా.. శార్దూల్ ఠాకూర్, రాయ్స్టన్ డైస్ చెరో రెండు వికెట్లు కూల్చారు.అనంతరం బ్యాటింగ్కు దిగిన ముంబైకి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ పృథ్వీ షా కేవలం ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు. అయితే, మరో ఓపెనర్ ఆయుశ్ మాత్రే సూపర్ సెంచరీ(232 బంతుల్లో 176) పరుగులు చేయగా.. శ్రేయస్ అయ్యర్ అతడికి సహకారం అందించాడు. మొత్తంగా 190 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 142 పరుగులు సాధించాడు. శ్రేయస్ ఇన్నింగ్స్లో 12 ఫోర్లు, 4 సిక్స్లు ఉన్నాయి.ఆయుశ్ మాత్రే, శ్రేయస్ అయ్యర్ శతక ఇన్నింగ్స్ కారణంగా ముంబై తమ మొదటి ఇన్నింగ్స్లో 441 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక శనివారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి మహారాష్ట్ర 31 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 142 పరుగులు చేసింది. ముంబై కంటే 173 పరుగులు వెనుకబడి ఉంది.ముంబై వర్సెస్ మహారాష్ట్ర తుదిజట్లుముంబైపృథ్వీ షా, ఆయుశ్ మాత్రే, హార్దిక్ తమోర్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, అజింక్య రహానే (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, షామ్స్ ములానీ, శార్దూల్ ఠాకూర్, తనుష్ కోటియన్, మోహిత్ అవస్థి, రాయిస్టన్ డైస్.మహారాష్ట్రరుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అర్షిన్ కులకర్ణి, అంకిత్ బావ్నే, నిఖిల్ నాయక్ (వికెట్ కీపర్), సచిన్ దాస్, అజీమ్ కాజీ, సత్యజీత్ బచావ్, సిద్ధేష్ వీర్, ఆర్ఎస్ హంగర్గేకర్, ప్రదీప్ దధే, హితేష్ వాలుంజ్. -
ఖరీదైన అపార్ట్మెంట్ కొన్న అయ్యర్.. ఎన్ని కోట్లంటే..?
టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్కు అతడిని భారత సెలక్టర్లు పక్కన పెట్టారు. ఈ క్రమంలో దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో ఇండియా-డి జట్టుకు అయ్యర్ సారథ్యం వహించాడు. కానీ అక్కడ కూడా తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో శ్రేయస్ విఫలమయ్యాడు.ఈ టోర్నీలో మొత్తం ఆరు ఇన్నింగ్స్లలో కేవలం రెండు సార్లు మాత్రమే 50 పరుగుల మార్క్ను అతడు అందుకున్నాడు. అదే విధంగా రెండు ఇన్నింగ్స్లలో డకౌట్గా వెనుదిరిగాడు. అయితే దులీప్ ట్రోఫీలో విఫలమైన అయ్యర్.. ఇప్పుడు ఇరానీ ట్రోఫీపై దృష్టి సారించాడు. రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరగనున్న మ్యాచ్లో సత్తాచాటి తిరిగి భారత టెస్టు జట్టులో పునరాగమనం చేయాలని ఈ ముంబైకర్ భావిస్తున్నాడు.అపార్ట్మెంట్ కొన్న అయ్యర్..ఇక ఇది ఇలా ఉండగా.. శ్రేయస్ అయ్యర్ మరో ఖరీదైన అపార్ట్మెంట్ కొనుగోలు చేశాడు. ముంబైలోని వర్లీ ప్రాంతంలో రూ. 2.90 కోట్లతో ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అమ్మ రోహిణీ అయ్యర్తో కలిసి అతడు ఈ ఇంటిని కొన్నట్టు స్థానిక రిజిస్ట్రేషన్ కార్యాలయం అధికారులు చెబుతున్నారు. వర్లీలోని ఆదర్శ్ నగర్ ప్రాంతంలోని త్రివేణి ఇండస్ట్రియల్ సీహెచ్ఎస్ఎల్లోని 2వ అంతస్తులో అపార్ట్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. జాప్కీ రిపోర్ట్ ప్రకారం.. 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయ్యర్ ఖరీదు చేసిన అపార్ట్మెంట్ ఉందంట.రిజిస్ట్రేషన్ కోసం రూ.17.40 లక్షల స్టాంప్ డ్యూటీ అయ్యర్ కట్టినట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ముంబైలో అయ్యర్ పేరిట ఓ అపార్ట్మెంట్ ఉంది. 2020లో ముంబైలోనే అత్యంత ఎత్తైన లోధా వరల్డ్ టవర్స్ ని 48వ అంతస్థులో ప్లాట్ను శ్రేయస్ కొనుగోలు చేశాడు.చదవండి: IND vs BAN: అగార్కర్ కీలక నిర్ణయం.. జట్టు నుంచి స్టార్ ప్లేయర్ అవుట్? -
కెప్టెన్గా రహానే.. జట్టులోకి ఇద్దరు టీమిండియా స్టార్లు!
ఇరానీ కప్-2024కు ముంబై జట్టు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. రెస్టాఫ్ ఇండియాపై గెలుపే లక్ష్యంగా ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెడ్బాల్ మ్యాచ్లో ముంబైకి అజింక్య రహానే సారథ్యం వహించనున్నాడు.ఇక ఈ మ్యాచ్కు ఇద్దరు టీమిండియా స్టార్లు కూడా అందుబాటులోకి రావడంతో జట్టు మరింత పటిష్టంగా మారనుందని ముంబై వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కాగా రంజీ ట్రోఫీ గెలిచిన జట్టుకు, రెస్టాఫ్ ఇండియా టీమ్కు మధ్య ఇరానీ కప్ పోటీ జరుగుతుంది.రంజీ తాజా ఎడిషన్ విజేత ముంబైఈ ఏడాది రంజీ టోర్నీలో రహానే సారథ్యంలోని ముంబై జట్టు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్టోబరు 1 నుంచి మొదలయ్యే ఇరానీ కప్ మ్యాచ్లో రెస్టాఫ్ ఇండియాతో తలపడనుంది. ఇందుకోసం ఎంసీఏ మంగళవారం తమ జట్టును ప్రకటించనున్నట్లు క్రిక్బజ్ వెల్లడించింది.ఇద్దరు టీమిండియా స్టార్లు అందుబాటులోకిరహానే కెప్టెన్సీలో జరుగనున్న ఈ మ్యాచ్కు టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్తో పాటు.. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ కూడా అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఎంసీఏ అధికారులు నిర్ధారించినట్లు పేర్కొంది. కాగా టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానే ఇటీవల ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్షిప్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు. లీసస్టర్షైర్కు ఆడే క్రమంలో అతడు గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.అయితే, ఇరానీ కప్ మ్యాచ్ నాటికి రహానే పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. టీమిండియాలో చోటు కోల్పోయిన శ్రేయస్ అయ్యర్.. బంగ్లాదేశ్తో రెండో టెస్టుకు కూడా ఎంపిక కాలేదు. కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్లతో మిడిలార్డర్లో పోటీలో అతడు వెనుకబడ్డాడు.శ్రేయస్కు మరో అవకాశంఇటీవల దులిప్ ట్రోఫీ-2024లోనూ శ్రేయస్ నిరాశపరిచాడు. దీంతో ఇరానీ కప్ మ్యాచ్లోనైనా సత్తా చాటాలని అతడు పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. శస్త్ర చికిత్స అనంతరం కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఇన్విటేషనల్ టోర్నీలో ఆడిన శార్దూల్ ఠాకూర్ సైతం ఈ మ్యాచ్కు అందుబాటులోని రానున్నట్లు సమాచారం. కాగా ముంబై చివరగా 1998లో ఇరానీ కప్ గెలిచింది. అయితే, ఈసారి మేటి ఆటగాళ్లు జట్టులో భాగమవడం సానుకూలాంశం. మరోవైపు.. రెస్టాఫ్ ఇండియా జట్టు గత హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదుంది. గత మ్యాచ్లలో సౌరాష్ట్రపై రెండుసార్లు, మధ్యప్రదేశ్ జట్టుపై ఒకసారి గెలిచి ఇరానీ కప్ టైటిల్ సొంతం చేసుకుంది. కాగా శ్రేయస్, శార్దూల్ రంజీ గెలిచిన ముంబై జట్టులోనూ సభ్యులేనన్న విషయం తెలిసిందే.చదవండి: ఇరగదీస్తున్న ఆసియా దేశాలు.. ఒక్క పాక్ మినహా..! -
రికీ భుయ్ మెరుపులు
సాక్షి, అనంతపురం: ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్ (87 బంతుల్లో 90 బ్యాటింగ్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. ఫలితంగా భారత్ ‘బి’తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్లో భారత్ ‘డి’ జట్టు రెండో ఇన్నింగ్స్లో 44 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (40 బంతుల్లో 50; 7 ఫోర్లు, ఒక సిక్సర్), సంజూ సామ్సన్ (53 బంతుల్లో 45; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఓపెనర్లు దేవదత్ పడిక్కల్ (3), శ్రీకర్ భరత్ (2) విఫలమయ్యారు. 18 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో భుయ్, శ్రేయస్ కలిసి ఇన్నింగ్స్ను నడిపించారు. వీరిద్దరూ ఎడాపెడా బౌండ్రీలు బాదుతూ వన్డే తరహాలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. భారత్ ‘బి’ బౌలర్లలో ముకేశ్ కుమార్ 3, నవ్దీప్ సైనీ రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 210/6తో శనివారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ‘బి’ చివరకు 76.2 ఓవర్లలో 282 పరుగులకు ఆలౌటైంది. స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (140 బంతుల్లో 87; 7 ఫోర్లు, ఒక సిక్సర్) ఆకట్టుకున్నాడు. చివరి వరస ఆటగాళ్లతో కలిసి జట్టుకు విలువైన స్కోరు అందించాడు. భారత్ ‘డి’ బౌలర్లలో సౌరభ్ కుమార్ 5, అర్‡్షదీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టారు. నేడు ఆటకు చివరి రోజు కాగా... చేతిలో 5 వికెట్లు ఉన్న భారత్ ‘డి’ ఓవరాల్గా 311 పరుగుల ఆధిక్యంలో ఉంది. రికీ భుయ్తో పాటు ఆకాశ్ సేన్ గుప్తా (28 బ్యాటింగ్; 4 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. స్కోరు వివరాలు భారత్ ‘డి’ తొలి ఇన్నింగ్స్: 349; భారత్ ‘బి’ తొలి ఇన్నింగ్స్: 282 భారత్ ‘డి’ రెండో ఇన్నింగ్స్: దేవదత్ పడిక్కల్ (సి) జగదీశన్ (బి) నవ్దీప్ సైనీ 3; శ్రీకర్ భరత్ (బి) ముకేశ్ కుమార్ 2; రికీ భుయ్ (నాటౌట్) 90; నిశాంత్ సింధు (సి అండ్ బి) నవ్దీప్ సైనీ 5; శ్రేయస్ అయ్యర్ (సి) మోహిత్ అవస్థి (బి) ముకేశ్ కుమార్ 50; సంజూ సామ్సన్ (సి) ప్రభుదేశాయ్ (బి) ముకేశ్ కుమార్ 45; ఆకాశ్ సేన్ గుప్తా (నాటౌట్) 28; ఎక్స్ట్రాలు: 21; మొత్తం (44 ఓవర్లలో 5 వికెట్లకు) 244. వికెట్ల పతనం: 1–9, 2–13, 3–18, 4–93, 5–161, బౌలింగ్: ముకేశ్ కుమార్ 13–0–80–3; నవ్దీప్ సైనీ 11–2–40–2; మోహిత్ అవస్థి 9–2–41–0; నితీశ్ కుమార్ రెడ్డి 3–0–19–0; రాహుల్ చాహర్ 5–0–27–0; ముషీర్ ఖాన్ 3–0–18–0. -
DT 2024: శ్రేయస్ నీవు ఇక మారవా? మళ్లీ డకౌట్
దులీప్ ట్రోఫీ-2024లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా అనంతపూర్ వేదికగా ఇండియా-బితో జరుగుతున్న మ్యాచ్లో.. భారత్ ‘డి’ కెప్టెన్గా బరిలోకి దిగిన అయ్యర్ తీవ్ర నిరాశపరిచాడు.ఐదు బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. స్పిన్నర్ రాహుల్ చాహర్ బౌలింగ్లో నితీష్ కుమార్కు క్యాచ్ ఇచ్చి శ్రేయస్ పెవిలియన్కు చేరాడు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన ఐదు ఇన్నింగ్స్ల్లో శ్రేయస్ ఒక్కసారి మాత్రమే అర్ధ శతకం సాధించాడు. ఓవరాల్గా 5 ఇన్నింగ్స్లో 20.80 సగటుతో కేవలం 105 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో భారత టెస్టు జట్టులో అయ్యర్ రీఎంట్రీ ఇవ్వడం ఇప్పటిలో కష్టమనే చెప్పుకోవాలి. ఈ క్రమంలో శ్రేయస్ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. శ్రేయస్ నీవు ఇక మారవా? అంటూ పోస్టులు పెడుతున్నారు.చెలరేగిన సంజూ..ఇక తొలి రోజు ఆటముగిసే సమయానికి భారత్ ‘డి’ జట్టు 77 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. భారత-డి ఇన్నింగ్స్లో అయ్యర్ మినహా మిగితా బ్యాటర్లందరూ తమ వంతు పాత్ర పోషించారు. శ్రీకర్ భరత్ (105 బంతుల్లో 52; 9 ఫోర్లు), రికీ భుయ్ (87 బంతుల్లో 56;9 ఫోర్లు), దేవదత్ పడిక్కల్ (95 బంతుల్లో 50; 8 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. అదే విధంగా వికెట్ కీపర్ సంజూ శాంసన్ 89 పరుగులతో క్రీజులో ఉన్నాడు.చదవండి: AUS vs ENG: హెడ్ విధ్వంసకర సెంచరీ.. ఇంగ్లండ్ను చిత్తు చేసిన ఆసీస్ -
శ్రేయస్ అయ్యర్కు మరో బిగ్షాక్!?
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు మరో గట్టి ఎదురుదెబ్బ తగలనుందా? ఇప్పట్లో అతడు టెస్టు జట్టులో పునరాగమనం చేయడం కష్టమేనా? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. స్వయంకృతాపరాధం, నిలకడలేమి ఫామ్ శ్రేయస్ టెస్టు భవిష్యత్తును ఆగమ్యగోచరంగా మార్చినట్లు తెలుస్తోంది.సెంట్రల్ కాంట్రాక్టు పాయెఈ ఏడాది ఇంగ్లండ్తో స్వదేశంలో చివరగా టెస్టు సిరీస్లో పాల్గొన్నాడు శ్రేయస్ అయ్యర్. తొలి రెండు మ్యాచ్లలో కలిపి కేవలం 104(35, 13, 27, 29) పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో ఈ మిడిలార్డర్ బ్యాటర్పై వేటు పడింది. మిగిలిన మూడు టెస్టులకు అతడిని పక్కనపెట్టింది బీసీసీఐ. అనంతరం రంజీల్లో ఆడాలని ఆదేశించగా.. ఫిట్నెస్ కారణాలు చూపి శ్రేయస్ అయ్యర్ ఈ దేశవాళీ టోర్నీకి దూరంగా ఉన్నాడు.ఐపీఎల్తో జోష్అయితే, పూర్తి ఫిట్గా ఉన్నా బోర్డు ఆదేశాలు బేఖాతరు చేశాడన్న కారణంతో బీసీసీఐ అతడిపై కొరడా ఝులింపించింది. క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడ్డందుకు గానూ సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించింది. దీంతో దిగొచ్చిన శ్రేయస్ అయ్యర్ రంజీల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఐపీఎల్-2024లో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్గా వ్యవహరించి.. జట్టును చాంపియన్గా నిలిపాడు.అంతలోనే విఫలంఈ క్రమంలో శ్రీలంక పర్యటన సందర్భంగా శ్రేయస్ అయ్యర్ వన్డే రీఎంట్రీకి బీసీసీఐ అనుమతినిచ్చింది. అయితే, టెస్టుల్లో చోటు లక్ష్యంగా దేశవాళీ రెడ్బాల్ టోర్నీల్లో దిగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. విజయవంతం కాలేకపోతున్నాడు. తొలుత బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నీలో ముంబై తరఫున ఆడిన అతడు.. అక్కడ ప్రభావం చూపలేకపోయాడు. అయినప్పటికీ దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా- ‘డి’ కెప్టెన్గా ఎంపికయ్యాడు.ఈ టోర్నీ తొలి మ్యాచ్లో అయ్యర్ ఇప్పటి వరకు 9, 54 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్తో తొలి టెస్టుకు ఇప్పటికే అతడిని పక్కన పెట్టేశారు టీమిండియా సెలక్టర్లు. ఇక దులిప్ ట్రోఫీ రెండో మ్యాచ్లో( 0, 41)నూ అయ్యర్ ఆకట్టుకోలేకపోయాడు. దీంతో బంగ్లాదేశ్తో రెండో మ్యాచ్కు కూడా అతడి పేరును పరిగణనలోకి తీసుకునే అవకాశం కనిపించడం లేదు. ఎవరి స్థానంలో? ఎందుకు చోటివ్వాలి?అంతేకాదు.. స్వదేశంలో తదుపరి న్యూజిలాండ్తో.. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లకు శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేసే అవకాశం లేదని బీసీసీఐ వర్గాలు జాతీయ మీడియాతో పేర్కొన్నాయి. ‘‘ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్కు టెస్టు జట్టులో చోటు దక్కే అవకాశమే లేదు. ఎవరి స్థానంలో అతడిని జట్టులోకి తీసుకోవాలంటారు? దులిప్ ట్రోఫీలో అతడి షాట్ సెలక్షన్లు కూడా ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం కదా! వచ్చిన అవకాశాలను అతడు సద్వినియోగం చేసుకోవడం లేదు’’ అని సదరు వర్గాలు తెలిపాయి. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25లో భాగంగా రోహిత్ సేన బంగ్లాదేశ్తో రెండు, న్యూజిలాండ్తో మూడు, ఆస్ట్రేలియాతో ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది.చదవండి: బుమ్రా కాదు!.. అతడితో పోటీ అంటే మస్తు మజా: ఆసీస్ స్టార్ -
'అతడు ఆటను గౌరవించడు.. జట్టులో చోటు దండగ'
టెస్టు క్రికెట్లో రీ ఎంట్రీ ఇవ్వాలనకున్న టీమిండియా మిడిలార్డర్ శ్రేయస్ అయ్యర్కు నిరాశే ఎదురైంది. బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్కు ఎంపిక చేసిన భారత జట్టులో అయ్యర్కు చోటు దక్కలేదు. అతడి స్ధానంలో ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ను సెలక్టర్లు ఎంపిక చేశారు.ఇప్పటిలో అతడు భారత టెస్టు జట్టులోకి వచ్చే సూచనలు కన్పించడం లేదు. దేశీవాళీ క్రికెట్లో అయ్యర్ నిలకడగా రాణించలేకపోతున్నాడు. బుచ్చిబాబు టోర్నీలో విఫలమైన శ్రేయస్.. ఇప్పుడు దులీప్ ట్రోఫీలో కూడా అదే తీరును కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు ఈ టోర్నీలో మూడు ఇన్నింగ్స్లు ఆడిన అయ్యర్ కేవలం 63 పరుగులు మాత్రమే చేశాడు.భారత్-డి జట్టుకు సారథ్యం వహిస్తున్న అయ్యర్.. తొలి మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ సాధించి ఫామ్లోకి వచ్చేలా కన్పించాడు. కానీ తర్వాత ఇండియా-ఎ రెండో రౌండ్ మ్యాచ్లో డకౌటయ్యాడు.దీంతో అతడిని మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. తాజాగా అయ్యర్ను ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. రెడ్ బాల్ క్రికెట్ను అయ్యర్ సీరియస్గా తీసుకోవడం లేదని అలీ చెప్పుకొచ్చాడు"ఒక క్రికెటర్గా శ్రేయస్ అయ్యర్ను చూస్తే నాకు చాలా బాధగా ఉంది. అయ్యర్కు ఇప్పుడు రెడ్-బాల్ ఆడాలన్న ఆసక్తి లేదు. అతడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆడుతున్నట్లు ఉంది. అనంతపూర్ వంటి వికెట్పై అయ్యర్ సెంచరీ లేదా డబుల్ సెంచరీలు చేసి ఉండాల్సింది. కానీ అతడికి కేవలం బౌండరీలు సాధించాలన్న తపన తప్ప మరొకటి లేదు. ఏకాగ్రత లేకుండా ఆడి ఈజీగా పెవిలియన్కు చేరుతున్నాడు. శ్రేయస్కు వైట్బాల్ క్రికెట్పై మక్కువ ఎక్కువ. వన్డే ప్రపంచకప్లో రెండు సెంచరీలు సాధించిన తర్వాత అయ్యర్ను కొంతమంది విరాట్ కోహ్లితో పోల్చారు. కానీ విరాట్కు, శ్రేయస్కు చాలా తేడా ఉంది. నేను భారత సెలక్టర్ అయివుంటే దులీప్ ట్రోఫీలో అయ్యర్ను ఆడేంచివాడిని కాదు. అతను ఆటను గౌరవించడు. దులీప్ ట్రోఫీలో రహానే, పుజారా ఆడకపోవడం అయ్యర్ అదృష్టం. లేదంటే అతడికి దులీప్ ట్రోఫీలో కూడా చోటు దక్కపోయిండేంది అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బసిత్ అలీ పేర్కొన్నాడు.చదవండి: IPL 2025: శ్రేయస్ అయ్యర్కు షాక్.. కేకేఆర్ కెప్టెన్గా సూర్యకుమార్!? -
శ్రేయస్ అయ్యర్కు షాక్.. కేకేఆర్ కెప్టెన్గా సూర్యకుమార్!?
ఐపీఎల్-2025 సీజన్కు ముందు అన్ని ఫ్రాంచైజీలు కీలక మార్పులు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆఖరిలో జరగనున్న మెగా వేలం కోసం ఆయా జట్లు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాయి.ఇప్పటికే ముంబై ఇండియన్స్కు రోహిత్ శర్మ గుడ్బై చెప్పనున్నాడనే ప్రచారం జోరుగా సాగుతుండగా.. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కోతా నైట్రైడర్స్కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఐపీఎల్-2024లో తమ జట్టును ఛాంపియన్గా నిలిపిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ను కేకేఆర్ యాజమాన్యం విడిచిపెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కేకేఆర్ కెప్టెన్గా సూర్యకుమార్..?గౌతం గంభీర్ తర్వాత కేకేఆర్కు టైటిల్ అందించిన రెండో కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. అయితే మెంటార్గా పనిచేసిన గౌతం గంభీర్.. ఇప్పుడు భారత ప్రధాన కోచ్ బాధ్యతలు చేపట్టడంతో తమ కెప్టెన్ కూడా మార్చాలని కేకేఆర్ భావిస్తున్నట్లు వినికిడి.ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ను ట్రేడింగ్ ద్వారా సొంతం చేసుకోవాలని కేకేఆర్ యోచిస్తున్నట్లు సమాచారం. అందుకు బదులుగా కేకేఆర్ అయ్యర్ను ముంబైకి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇరు ఫ్రాంచైజీల మధ్య డీల్ కుదిరినట్లు సమాచారం. సూర్యకు అయ్యర్ స్ధానంలో తమ జట్టు పగ్గాలని అప్పగించాలని కేకేఆర్ ప్లాన్ చేస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అదేవిధంగా గంభీర్ స్ధానంలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మెంటార్ బాధ్యతలు చేపట్టనున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.చదవండి: AUS vs ENG: లివింగ్ స్టోన్ ఊచకోత.. ఆసీస్పై ఇంగ్లండ్పై ఘన విజయం -
పడిక్కల్ పోరాటం
సాక్షి అనంతపురం: ఓపెనర్లు ప్రథమ్ సింగ్ (82 బంతుల్లో 59 బ్యాటింగ్), కెపె్టన్ మయాంక్ అగర్వాల్ (87 బంతుల్లో 56; 8 ఫోర్లు) అర్ధ శతకాలు బాదడంతో భారత్ ‘డి’తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో భారత్ ‘ఎ’ 28.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 115 పరుగులు చేసింది. ఆరంభం నుంచి సాధికారికంగా ఆడిన ఈ జంట తొలి వికెట్కు 115 పరుగులు జోడించింది. శుక్రవారం రెండో రోజు ఆట ముగియడానికి ముందు భారత్ ‘డి’ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్లో మయాంక్ ఔటయ్యాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 288/8తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ‘ఎ’ మరో రెండు పరుగులు జోడించి 290 వద్ద ఆలౌటైంది. షమ్స్ ములానీ (187 బంతుల్లో 89; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) క్రితం రోజు స్కోరుకు ఒక పరుగు మాత్రమే జత చేయగలిగాడు. భారత్ ‘డి’ బౌలర్లలో హర్షిత్ రాణా 4... విద్వత్ కావేరప్ప, అర్‡్షదీప్ సింగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ‘డి’ 52.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. దేవదత్ పడిక్కల్ (124 బంతుల్లో 92; 15 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు. భారత్ ‘ఎ’ జట్టు బౌలర్లలో ఖలీల్ అహ్మద్, అఖీబ్ ఖాన్ చెరో మూడు వికెట్లు తీశారు. దీంతో తొలి ఇన్నింగ్స్లో 107 పరుగుల ఆధిక్యం సాధించిన భారత్ ‘ఎ’... రెండో ఇన్నింగ్స్ స్కోరుతో కలుపుకొని ఓవరాల్గా 222 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో 9 వికెట్లు ఉన్న భారత్ ‘ఎ’ మూడో రోజు మరెన్ని పరుగులు జోడిస్తుందో చూడాలి. పడిక్కల్ ఒక్కడే... భారత్ ‘డి’ తొలి ఇన్నింగ్స్లో మిడిలార్డర్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ ఒక్కడే ఆకట్టుకున్నాడు. కెపె్టన్ శ్రేయస్ అయ్యర్ (0) డకౌట్ కాగా.. వికెట్ కీపర్ సంజూ సామ్సన్ (5), అథర్వ (4), యశ్ దూబే (14), రికీ భుయ్ (23), సారాంశ్ జైన్ (8), విఫలమయ్యారు. ఒక ఎండ్లో పడిక్కల్ క్రీజులో పాతుకుపోగా... మరో ఎండ్ నుంచి అతడికి సహకారం అందించేవారే కరువయ్యారు. సహచరులతో ఒక్కొక్కరుగా వెనుదిరుగుతున్నా... పడిక్కల్ మాత్రం జోరు తగ్గించలేదు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. సామ్సన్ మరోసారి అంచనాలు అందుకోలేకపోగా... మెరుగైన ఆరంభం దక్కించుకున్న ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్... ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. చివర్లో హర్షిత్ రాణా (29 బంతుల్లో 31; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో భారత్ ‘డి’183 పరుగులు చేయగలిగింది.స్కోరు వివరాలు భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 288 ఆలౌట్; భారత్ ‘డి’ తొలి ఇన్నింగ్స్: అథర్వ (ఎల్బీడబ్ల్యూ) ఖలీల్ 4; యశ్ దూబే (సి) కుశాగ్ర (బి) అఖీబ్ 14; శ్రేయస్ (సి) అఖీబ్ (బి) ఖలీల్ 0; పడిక్కల్ (సి) కుశాగ్ర (బి) ప్రసిధ్ కృష్ణ 92; సంజూ సామ్సన్ (సి) ప్రసిధ్ కృష్ణ (బి) అఖీబ్ 5; రికీ భుయ్ (ఎల్బీడబ్ల్యూ) ఖలీల్ 23; సారాంశ్ (ఎల్బీ) తనుశ్ 8; సౌరభ్ (సి) శాశ్వత్ (బి) అఖీబ్ 1; హర్షిత్ రాణా (బి) ములానీ 31; అర్‡్షదీప్ (రనౌట్) 0; విద్వత్ కావేరప్ప (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు: 3, మొత్తం: (52.1 ఓవర్లలో ఆలౌట్) 183. వికెట్ల పతనం: 1–4, 2–6, 3–44, 4–52, 5–96, 6–122, 7–141, 8–154, 9–170, 10–183. బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 8–0–39–3; ప్రసిధ్ కృష్ణ 11–4–30–1; అఖీబ్ ఖాన్ 12–2–41–3; తనుశ్ కొటియాన్ 12–5–22–1; షమ్స్ ములానీ 9.1–1–50–1. భారత్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్: ప్రథమ్ సింగ్ (బ్యాటింగ్) 59; మయాంక్ అగర్వాల్ (సి అండ్ బి) శ్రేయస్ అయ్యర్ 56; మొత్తం: (28.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి) 115. వికెట్ల పతనం: 1–115, బౌలింగ్: హర్షిత్ రాణా 3–0–12–0; విద్వత్ కావేరప్ప 3–0–18–0; సౌరభ్ కుమార్ 11–1–46–0; అర్‡్షదీప్ సింగ్ 4–0–21–0; సారాంశ్ జైన్ 7–1–18–0; శ్రేయస్ అయ్యర్ 0.1–0–0–1. -
అప్పుడు డకౌట్.. ఇప్పుడు వికెట్! శ్రేయస్ సెలబ్రేషన్స్
టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆరేళ్ల తర్వాత ఫస్ట్క్లాస్ క్రికెట్లో తొలి వికెట్ తీశాడు. దులిప్ ట్రోఫీ-2024 ఎడిషన్లో ఇండియా-‘డి’ కెప్టెన్గా వ్యవహరిస్తున్న అతడు.. ఇండియా-‘ఎ’ తో మ్యాచ్లో ఈ మేర తన బౌలింగ్ నైపుణ్యాలు ప్రదర్శించాడు. భారత టెస్టు జట్టులో చోటే లక్ష్యంగా అయ్యర్ ఈ రెడ్బాల్ టోర్నీ బరిలో దిగాడు.తొలి టెస్టులో స్థానం దక్కలేదుఇండియా-‘సి’తో జరిగిన తమ తొలి మ్యాచ్లో నాలుగు వికెట్ల తేడాతో సారథిగా ఓటమిని చవిచూశాడు. ఈ మ్యాచ్లో 39 బంతుల్లో అర్ధ శతకం సాధించినప్పటికీ.. బంగ్లాదేశ్తో టీమిండియా ఆడబోయే తొలి టెస్టులో శ్రేయస్ అయ్యర్కు స్థానం దక్కలేదు. దీంతో దులిప్ ట్రోఫీ జట్టుతోనే ఉన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ప్రస్తుతం ఇండియా-‘ఎ’ జట్టుతో మ్యాచ్ ఆడుతున్నాడు. అనంతపురం వేదికగా గురువారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇండియా-‘డి’ కెప్టెన్శ్రేయస్ అయ్యర్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఇండియా-‘ఎ’ను తొలి ఇన్నింగ్స్లో 290 పరుగులకు ఆలౌట్ చేయగలిగింది ఇండియా-‘డి’.దేవ్దత్ పడిక్కల్ 92కానీ బ్యాటింగ్ పరంగా మాత్రం రాణించలేకపోయింది. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ డకౌట్ కాగా.. మరో టీమిండియా స్టార్ సంజూ శాంసన్ ఐదు పరుగులకే వెనుదిరిగాడు. అయితే, నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన దేవ్దత్ పడిక్కల్ 92 రన్స్తో అదరగొట్టగా.. రికీ భుయ్ 23, హర్షిత్ రాణా 31 పరుగులతో పర్వాలేదనిపించారు. వీరి కారణంగా ఇండియా-డి తొలి ఇన్నింగ్స్లో 183 పరుగులు చేయగలింది.స్వయంగా రంగంలోకి దిగిన కెప్టెన్ఈ క్రమంలో వందకు పైగా పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇండియా-‘ఎ’ జట్టుకు ఓపెనర్లు ప్రథమ్ సింగ్, మయాంక్ అగర్వాల్ శుభారంభం అందించారు. ఇద్దరూ అర్ధ శతకాలు పూర్తి చేసుకుని జోరు మరింత పెంచారు. ఈ జోడీని విడగొట్టడం ఇండియా-‘డి’ బౌలర్ల తరం కాలేదు. దీంతో శ్రేయస్ అయ్యర్ స్వయంగా రంగంలోకి దిగాడు.రైటార్మ్ లెగ్బ్రేక్ స్పిన్ బౌలింగ్ చేయగల అయ్యర్.. ఇండియా-‘ఎ’ ఇన్నింగ్స్ 29వ ఓవర్ తొలి బంతికే కెప్టెన్ మయాంక్ అగర్వాల్(56)ను అవుట్ చేశాడు. ఊహించని రీతిలో రిటర్న్ క్యాచ్ అందుకుని మయాంక్కు షాకిచ్చాడు. ఆరేళ్ల తర్వాత శ్రేయస్ అయ్యర్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో వికెట్ తీయడం ఇదే తొలిసారి. అంతకు ముందు సౌరాష్ట్రతో 2018 నాటి మ్యాచ్లో అతడు వికెట్(చేతన్ సకారియా) పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. రెండో రోజు ఆట ముగిసేసరికి.. ఇండియా-‘ఎ’ తమ రెండో ఇన్నింగ్స్లో 28.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 115 పరుగులు చేసింది. ఇండియా-‘డి’పై 222 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. చదవండి: నా కుమారుడికి అవకాశాలు ఇస్తారనుకున్నా: పాక్ మాజీ కెప్టెన్Golden Arm! 💪Shreyas Iyer comes into the attack. Shreyas Iyer strikes first ball 👌An excellent low catch off his own bowling, and he breaks the 115-run opening stand at the stroke of stumps. #DuleepTrophy | @IDFCFIRSTBankScorecard ▶️: https://t.co/m9YW0Hu10f pic.twitter.com/c1nXJsN8QM— BCCI Domestic (@BCCIdomestic) September 13, 2024 -
సన్గ్లాసెస్తో బ్యాటింగ్..! కట్ చేస్తే డకౌటయ్యాడు(వీడియో)
దులీప్ ట్రోఫీ-2024లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఈ టోర్నీలో ఇండియా డి జట్టుకు సారథ్యం వహిస్తున్న అయ్యర్.. మరోసారి నిరాశపరిచాడు. ఇండియా-సితో జరిగిన తొలి మ్యాచ్లో సెకెండ్ ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ సాధించి టచ్లో కన్పించిన శ్రేయస్.. ఇప్పుడు రెండో మ్యాచ్లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచాడు.అనంతపూర్ వేదికగా ఇండియా-ఎతో జరుగుతున్న మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో అయ్యర్ డకౌటయ్యాడు. 7 బంతులు ఎదుర్కొన్న ఈ ముంబై ఆటగాడు.. ఖాలీల్ అహ్మద్ బౌలింగ్లో ఖాతా తెరవకుండా పెవిలియన్కు చేరాడు. ఓ చెత్త షాట్ ఆడి మిడాన్లో అయ్యర్ దొరికిపోయాడు. ఈ మ్యాచ్లో అయ్యర్ కూలింగ్ అద్దాలు పెట్టుకుని మరి బ్యాటింగ్ చేయడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు మూడు ఇన్నింగ్స్లు ఆడిన శ్రేయస్ కేవలం 63 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో టీమిండియా టెస్టు జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలన్న అయ్యర్ కల ఇప్పటిలో నేరవేరేలా కన్పించడం లేదు.మరోవైపు బీసీసీఐ అగ్రహానికి గురైన ఇషాన్ కిషన్ మాత్రం అదరగొడుతున్నాడు. ఇండియా-సి జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న కిషన్.. భారత్-బి జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో సెంచరీతో మెరిశాడు. అంతకుముందు బుచ్చిబాబు టోర్నీలో సైతం కిషన్ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు.చదవండి: AFG vs NZ: అత్యంత చెత్త రికార్డు.. 91 ఏళ్ల చరిత్రలో తొలిసారి? Shreyas Iyer dismissed for a duck in Duleep Trophy 2024 pic.twitter.com/MXJb4IvkKW— Dev Sharma (@Devsharmahere) September 13, 2024 -
రింకూ, శ్రేయస్, సుందర్లపై దృష్టి
సాక్షి, అనంతపురం: దేశవాళీ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీలో నేడు రెండో దశ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. అనంతపురం వేదికగా జరగనున్న ఈ మ్యచ్ల్లో భారత్ ‘ఎ’ జట్టుతో భారత్ ‘డి’... భారత్ ‘బి’ జట్టుతో భారత్ ‘సి’ తలపడనున్నాయి. తొలి రౌండ్ మ్యాచ్ల్లో భారత్ ‘బి’, ‘సి’ జట్లు విజయాలు సాధించాయి. ఈ నెల 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్ మినహా టీమిండియా ప్లేయర్లెవరూ రెండో రౌండ్ దులీప్ ట్రోఫీ మ్యాచ్లో పాల్గొనడం లేదు. తొలి మ్యాచ్లో ఆడిన శుబ్మన్ గిల్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురేల్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్దీప్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, యశ్ దయాళ్, అక్షర్ పటేల్... తమతమ జట్లను వీడి టీమిండియాతో జట్టు కట్టారు. దీంతో భారత్ ‘సి’ జట్టులో మినహా మిగిలిన టీమ్లలో మార్పులు చోటు చేసుకున్నాయి. భారత ‘ఎ’ జట్టుకు మయాంక్ అగర్వాల్ సారథ్యం వహించనుండగా.. ‘బి’ టీమ్కు అభిమన్యు ఈశ్వరన్ కెపె్టన్గా వ్యవహరించనున్నాడు. ‘సి’ టీమ్కు రుతురాజ్ గైక్వాడ్, ‘డి’ జట్టుకు శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహించనున్నారు. ప్రధాన ఆటగాళ్ల గైర్హాజరీలో దేశవాళీల్లో నిలకడ కొనసాగిస్తున్న యువ ఆటగాళ్లకు ఈ మ్యాచ్లు మంచి అవకాశం కానున్నాయి. రింకూ సింగ్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, మయాంక్ అగర్వాల్, వాషింగ్టన్ సుందర్ వంటి వాళ్లు మెరుగైన ప్రదర్శన చేసి జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని భావిస్తున్నారు. గత మ్యాచ్లో భారత్ ‘ఎ’ జట్టుకు సారథిగా వ్యవహరించిన శుబ్మన్ గిల్ అందుబాటులో లేకపోవడంతో మయాంక్కు జట్టు పగ్గాలు దక్కాయి. రెండేళ్ల క్రితం జాతీయ జట్టు తరఫున చివరి టెస్టు ఆడిన మయాంక్ తిరిగి సెలెక్టర్ల దృష్టిలో పడాలంటే భారీగా పరుగులు చేయాల్సిన అవసరముంది. బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల సిరీస్లో తొలి టెస్టు కోసమే భారత జట్టును ఎంపిక చేయగా... దులీప్ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేస్తే బంగ్లాతో రెండో టెస్టు కోసం ప్రకటించనున్న జట్టులో చోటు దక్కించుకునే అవకాశం లేకపోలేదు.ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్తో తొలి టెస్టు కోసం ప్రకటించిన టీమిండియాలో సభ్యుడైన సర్ఫరాజ్... ఈ మ్యాచ్ అనంతరం నేరుగా చెన్నైలో జట్టుతో చేరనున్నాడు. భారత్ ‘బి’ జట్టు తరఫున బరిలోకి దిగనున్న సర్ఫరాజ్ ఖాన్... మరో మంచి ఇన్నింగ్స్తో రాణించి టీమిండియాలో చేరాలనుకుంటున్నాడు. ఇక గత మ్యాచ్లో భారీ సెంచరీతో చెలరేగిన సర్ఫరాజ్ సోదరుడు ముషీర్ ఖాన్ అదే జోరు కొనసాగించాలనుకుంటున్నాడు. అటు బ్యాట్తో ఇటు బంతితో సత్తాచాటగల స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ భారత్ ‘బి’ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇంగ్లండ్తో సిరీస్లో ఆకట్టుకోలేకపోయిన రజత్ పాటిదార్తో పాటు శ్రేయస్ అయ్యర్ తిరిగి సత్తాచాటి సెలెక్టర్ల దృష్టిలో పడాలని చూస్తున్నారు. గత మ్యాచ్ ప్లెయింగ్ ఎలెవన్లో చోటు దక్కించుకోలేకపోయిన దేవదత్ పడిక్కల్, సంజూ సామ్సన్ భారత్ ‘డి’ జట్టు తరఫున ఈ మ్యాచ్లోనైనా అవకాశం దక్కించుకుంటారా చూడాలి. ఇక పేస్ బౌలర్లు ముఖేశ్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సుదీర్ఘ టెస్టు సీజన్కు ముందు లయ అందుకునేందుకు ఇది చక్కటి అవకాశం. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు ముందు భారత్ మొత్తం 10 టెస్టులు ఆడనుండగా... పేస్ బౌలర్లకు విరివిగా అవకాశాలు వచ్చే చాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో దులీప్ ట్రోఫీలో రాణించిన వారిపై సెలెక్టర్ల దృష్టి ఉండనుంది. ఇక గత మ్యాచ్లో ఎనిమిది వికెట్లతో సత్తాచాటిన లెఫ్టార్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు.దులీప్ ట్రోఫీలో తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లుతిలక్ వర్మ (భారత్ ‘ఎ’) షేక్ రషీద్ (భారత్ ‘ఎ’) నితీశ్ కుమార్ రెడ్డి (భారత్ ‘బి’) రికీ భుయ్ (భారత్ ‘డి’) శ్రీకర్ భరత్ (భారత్ ‘డి’) -
టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ బర్త్డే: ఆ ముగ్గురు హైలైట్ (ఫొటోలు)
-
అందుకే వాళ్లిద్దరికి టీమిండియాలో చోటు దక్కలేదు!
సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా వరుస మ్యాచ్లతో బిజీ కానుంది. చివరిసారిగా.. శ్రీలంక పర్యటన సందర్భంగా ఆగష్టు 7న వన్డే మ్యాచ్ ఆడిన రోహిత్ సేన.. సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ మొదలుపెట్టనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో భాగంగా జరుగనున్న బంగ్లాతో రెండు మ్యాచ్లు ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదివారమే తొలి టెస్టుకు జట్టును కూడా ప్రకటించింది.ఈ సిరీస్ ద్వారా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ పునరాగమనం చేయనుండగా.. కేఎల్ రాహుల్ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సైతం టీ20 ప్రపంచకప్-2024 తర్వాత రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. మరోవైపు.. ఉత్తరప్రదేశ్ యువ పేసర్ యశ్ దయాల్కు సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు.ఐపీఎల్ టీమ్ను చాంపియన్గా నిలిపిఅయితే, ఈ జట్టులో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు మాత్రం చోటు దక్కలేదు. రంజీల్లో ఆడాలన్న ఆదేశాలను బేఖాతరు చేశాడంటూ క్రమశిక్షణ చర్యల కింద గతంలో అతడిపై బీసీసీఐ వేటు వేసింది. సెంట్రల్ కాంట్రాక్టు నుంచి కూడా తప్పించింది. అయితే, ఐపీఎల్-2024లో కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్గా వ్యవహరించి.. ఆ జట్టును చాంపియన్గా నిలిపిన ఈ ముంబై ప్లేయర్కు శ్రీలంకతో వన్డే సిరీస్ సందర్భంగా బీసీసీఐ అవకాశమిచ్చింది.ఈ క్రమంలో రెడ్బాల్ జట్టులో కూడా చోటు దక్కించుకోవాలన్న లక్ష్యంతో బుచ్చిబాబు టోర్నమెంట్లోనూ శ్రేయస్ అయ్యర్ ఆడాడు. అయితే, అక్కడ ఆశించిన మేర రాణించలేకపోయాడు. అనంతరం దులిప్ ట్రోఫీ-2024 బరిలో దిగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఇండియా- డి కెప్టెన్గా వ్యవహరించాడు.సర్ఫరాజ్ ఖాన్కు అవకాశంఇండియా-సితో మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో విఫలమైనా.. రెండో ఇన్నింగ్స్లో 39 బంతుల్లోనే అర్ధ శతకం బాది ఫామ్లోకి వచ్చినట్లే కనిపించాడు. అయితే, సెలక్టర్లు మాత్రం అతడిపై నమ్మకం ఉంచలేదు. శ్రేయస్ అయ్యర్ ఆటలో నిలకడలేని కారణంగా అతడిని పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. అదే సమయంలో మరో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్కు మాత్రం సెలక్టర్లు పిలుపునివ్వడం విశేషం. కాగా కేఎల్ రాహుల్ గైర్హాజరీలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసిన ఈ రంజీ వీరుడు వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాదిన విషయం తెలిసిందే.అందుకే షమీని కూడా తీసుకోలేదు!ఇక అయ్యర్తో పాటు బంగ్లాదేశ్తో సిరీస్కు టీమిండియా సీనియర్ పేస్ బౌలర్ మహ్మద్ షమీని కూడా ఎంపికచేయలేదు సెలక్టర్లు. వన్డే వరల్డ్కప్-2023 తర్వాత చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న షమీ ప్రస్తుతం ఫిట్గానే ఉన్నాడు. అయితే, అతడిని హడావుడిగా జట్టుకు ఎంపిక చేసి రిస్క్ తీసుకోవడం ఎందుకని బీసీసీఐ భావించినట్లు సమాచారం. ప్రధాన పేసర్ బుమ్రా అందుబాటులో ఉండటం, సొంతగడ్డపై అదీ బంగ్లాదేశ్ వంటి జట్టుతో సిరీస్ నేపథ్యంలో షమీని వెంటనే పిలిపించాల్సిన అవసరం లేదని భావించినట్లు తెలుస్తోంది. అందుకే అతడి స్థానంలో యశ్ దయాల్కు చోటిచ్చినట్లు సమాచారం. ఇక రంజీల్లో బెంగాల్ తరఫున షమీ ఒక మ్యాచ్ ఆడిన తర్వాత అతడిని న్యూజిలాండ్తో సిరీస్ నాటికి పిలిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.బంగ్లాదేశ్తో తొలి టెస్టుకు బీసీసీఐ ప్రకటించిన జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్. చదవండి: Duleep Trophy: రింకూ సింగ్కు లక్కీ ఛాన్స్.. ఆ జట్టు నుంచి పిలుపు? -
7 వికెట్లతో చెలరేగిన మానవ్.. ఓటమి దిశగా శ్రేయస్ టీమ్
దులీప్ ట్రోఫీ-2024లో భాగంగా అనంతపూర్ వేదికగా భారత-డి జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో భారత-సి జట్టు విజయం దిశగా అడుగులు వేస్తోంది. టీమ్-సి విజయానికి ఇంకా 155 పరుగుల దూరంలో నిలిచింది. అయితే 206/8 ఓవర్ నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన డి జట్టు.. 236 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు ఇండియా-సి జట్టు 168 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్లో భారత-బి జట్టుకు కేవలం 4 పరుగుల ఆధిక్యం మాత్రమే లభించింది. అనంతరం 4 పరుగుల వెనకంజతో సెకెండ్ ఇన్నింగ్స్ను మొదలు పెట్టిన డి జట్టు 236 పరుగులకు ఆలౌటైంది. దీంతో సి జట్టు ముందు 233 పరుగుల లక్ష్యాన్ని టీమ్ డి ఉంచింది. కాగా శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని సి జట్టు తొలి ఇన్నింగ్స్లో 164 పరుగులకే చాపచుట్టేసింది.7 వికెట్లతో చెలరేగిన మానవ్.. ఇక సెకెండ్ ఇన్నింగ్స్లో భారత-సి జట్టు స్పిన్నర్ మానవ్ సుతార్ 7 వికెట్లతో చెలరేగాడు. అతడి స్పిన్ ఉచ్చులో చిక్కుకుని ఇండియా డి జట్టు విల్లవిల్లాడింది. పడిక్కల్, రిక్కీ భుయ్ వంటి స్టార్ ఆటగాళ్లను ఔట్ చేసి డి జట్టును దెబ్బతీశాడు. ఈ మ్యాచ్లో 19.1 ఓవర్లు బౌలింగ్ చేసిన మానవ్ సుతార్.. 49 పరుగులతో 7 వికెట్లు సాధించాడు. -
ఎట్టకేలకు.. శ్రేయస్ అయ్యర్ ధనాధన్ ఇన్నింగ్స్!
వరుస వైఫల్యాలతో విమర్శలపాలైన టీమిండియా మిడిలార్డర్ స్టార్ శ్రేయస్ అయ్యర్ ఎట్టకేలకు బ్యాట్ ఝులిపించాడు. దులిప్ ట్రోఫీ-2024లో తన తొలి అర్ధ శతకం నమోదు చేశాడు. ఇండియా-‘డి’ జట్టుకు సారథ్యం వహిస్తున్న అతడు.. ఇండియా- ‘సి’తో మ్యాచ్లో.. రెండో ఇన్నిం గ్స్లో 44 బంతులు ఎదుర్కొని 54 పరుగులు చేశాడు.బంగ్లాతో సిరీస్లో చోటు దక్కాలంటే..కాగా సెప్టెంబరు 19 నుంచి సొంతగడ్డపై టీమిండియా బంగ్లాదేశ్తో టెస్టులు ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ చేరే క్రమంలో ఈ సిరీస్ భారత్కు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ మినహా మిగతా టీమిండియా స్టార్లంతా దులిప్ ట్రోఫీ బరిలో దిగారు. ఈ దేశవాళీ రెడ్బాల్ టోర్నీలో సత్తా చాటి బంగ్లాతో ఆడే జట్టులో చోటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.వరుస మ్యాచ్లలో విఫలంఅయితే, శ్రేయస్ అయ్యర్ గత కొంతకాలంగా ఫామ్లేమితో సతమతమవుతున్నాడు. ఇటీవల ముంబై జట్టు తరఫున బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నీలో ఆడిన అయ్యర్.. నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యాడు. అయినప్పటికీ, దులిప్ ట్రోఫీ తాజా ఎడిషన్లో ఇండియా-డి జట్టు కెప్టెన్గా బీసీసీఐ అతడికి అవకాశం ఇచ్చింది.ఈ క్రమంలో గురువారం(సెప్టెంబరు 5) అనంతపురం వేదికగా ఇండియా-‘సి’తో మొదలైన తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో శ్రేయస్ అయ్యర్ నిరాశపరిచాడు. పదహారు బంతులు ఎదుర్కొని కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేశాడు. విజయ్కుమార్ వైశాక్ బౌలింగ్లో అభిషేక్ పొరల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.అక్షర్ ఆల్రౌండ్ షోతోఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సహా మిగతా బ్యాటర్లంతా విఫలమైన వేళ.. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ అద్భుత బ్యాటింగ్తో ఇండియా-‘డి’కి గౌరవప్రదమైన స్కోరు అందించాడు. 118 బంతుల్లో 86 పరుగులతో అక్షర్ రాణించగా.. ఇండియా-‘డి’ 164 పరుగులకు ఆలౌట్ అయింది.ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇండియా-‘సి’కి ఇండియా-‘డి’ బౌలర్లు చెక్ పెట్టారు. పేసర్లు హర్షిత్ రాణా(4/33), అర్ష్దీప్ సింగ్(1/29), ఆదిత్య థాకరే(1/33), స్పిన్నర్లు అక్షర్ పటేల్(2/46), సారాంశ్ జైన్(2/16) రాణించడంతో ఇండియా-‘సి’ 168 పరుగులకు ఆలౌట్ కాగా.. కేవలం నాలుగు పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.బ్యాట్ ఝులిపించిన శ్రేయస్ అయ్యర్ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా ఇండియా-‘డి’ టీ విరామ సమయానికి 24 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 140 పరుగులు చేసింది. ఓపెనర్లు అథర్వ తైడే(15), యశ్ దూబే(5) విఫలం కాగా.. వన్డౌన్లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం ముప్పై తొమ్మిది బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్నాడు ఈ కుడిచేతి వాటం బ్యాటర్.అయితే, 54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అన్షుల్ కాంబోజ్ బౌలింగ్లో షాట్కు యత్నించిన శ్రేయస్.. రుతురాజ్ గైక్వాడ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అతడి ఇన్నింగ్స్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ ఉండటం విశేషం. టీ బ్రేక్ సమయానికి దేవ్దత్ పడిక్కల్ 42, రికీ భుయ్ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు.చదవండి: DT 2024: ముషీర్ ఖాన్@181.. 321 పరుగులకు భారత్-బి ఆలౌట్ -
అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో దులీప్ ట్రోఫీ ప్రారంభం (ఫొటోలు)
-
శ్రేయస్ అయ్యర్ మళ్లీ ఫెయిల్.. ఇక అంతే సంగతి మరి?
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. బుచ్చిబాబు టోర్నీలో తీవ్ర నిరాశపరిచిన అయ్యర్.. ఇప్పుడు దేశీవాళీ టోర్నీలో దులీప్ ట్రోఫీలో కూడా అదే తీరును కనబరుస్తున్నాడు.ఈ టోర్నీలో ఇండియా-సి జట్టుకు సారథ్యం వహిస్తున్న శ్రేయస్.. ఇండియా-డితో జరుగుతున్న తొలి మ్యాచ్లో విఫలమయ్యాడు. అనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో అయ్యర్ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. విజయ్ కుమార్ వైశ్యాఖ్ బౌలింగ్లో వికెట్ కీపర్ అభిషేక్ పొరెల్కు క్యాచ్ ఇచ్చి అయ్యర్ ఔటయ్యాడు. కాగా ఈ టోర్నీలో మెరుగ్గా రాణించి భారత టెస్టు జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలని భావించిన అయ్యర్.. ఆ దిశగా అడుగులు వేయలేకపోతున్నాడు. వరుసగా విఫలమవుతుండడంతో బంగ్లాతో టెస్టు సిరీస్కు అతడి ఎంపికపై సందిగ్ధం నెలకొంది. -
అనంతపురంలో ఆడటం సంతోషంగా ఉంది: శ్రేయస్ అయ్యర్
దేశవాళీ క్రికెట్లో పాల్గొనటం ద్వారా నైపుణ్యాలను మరింతగా పెంచుకోవచ్చని టీమిండియా స్టార్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్ అన్నారు. జాతీయ జట్టుకు ఆడుతున్న క్రికెటర్లు ఈ టోర్నీల్లో ఆడటం వల్ల యువతలో స్ఫూర్తినింపినట్లు అవుతుందని పేర్కొన్నారు. కాగా జాతీయ విధుల నుంచి విరామం లభించినపుడు.. ఫిట్గా ఉన్న సెంట్రల్ కాంట్రాక్టు ఆటగాళ్లంతా డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 5 నుంచి మొదలుకానున్న దులిప్ ట్రోఫీ-2024లో శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, రిషభ్ పంత్, శుబ్మన్ గిల్, కేఎల్ రాహుల్ తదితర టీమిండియా స్టార్లు పాల్గొనున్నారు. ఇండియా-ఏ, ఇండియా-బి- ఇండియా-సి, ఇండియా-డి జట్ల తరఫున ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. ఈ రెడ్బాల్ టోర్నీ పోటీలు అనంతపురం వేదికగా గురువారం ఆరంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే క్రికెటర్లంతా అక్కడికి చేరుకుని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు.ఈ క్రమంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇండియా-సి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఇండియా-డి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..అనంతపురం లో జరిగే దులీప్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ లో ఆడుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ ఫోర్-డే టోర్నీలో ఆడటం ద్వారా నైపుణ్యాలను పదునుపెట్టుకునే అవకాశం దొరుకుతుందని హర్షం వ్యక్తం చేశారు.దులిప్ ట్రోఫీ- 2024 జట్లుఇండియా-ఏశుబ్మన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనూష్ కొటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్, విద్వత్ కావేరప్ప, కుమార్ కుషాగ్రా, శస్వత్ రావత్.ఇండియా-బిఅభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ముషీర్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి*, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ, యశ్ దయాళ్, ముకేష్ కుమార్, రాహుల్ చహర్, ఆర్. సాయి కిషోర్, మోహిత్ అవస్థి, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్).ఇండియా-సిరుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, బి ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, గౌరవ్ యాదవ్, వైషక్ విజయ్కుమార్, అన్షుల్ ఖంబోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మార్కండే, ఆర్యన్ జుయాల్ (వికెట్ కీపర్), సందీప్ వారియర్.ఇండియా-డిశ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అథర్వ తైడే, యశ్ దూబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రికీ భుయ్, శరణ్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, ఆదిత్య థాకరే, హర్షిత్ రాణా, తుషార్ దేశ్పాండే, ఆకాశ్ సేన్గుప్తా, కేఎస్ భరత్(వికెట్ కీపర్), సౌరభ్ కుమార్.చదవండి: సెంచరీ హీరో’కు గాయం.. సంజూ శాంసన్కు లక్కీ ఛాన్స్! -
సంజూ శాంసన్కు లక్కీ ఛాన్స్!
టీమిండియా స్టార్ క్రికెటర్ ఇషాన్ కిషన్ దులిప్ ట్రోఫీ-2024 ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. గాయం కారణంగా అతడు ఇండియా-డి జట్టుకు అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. అతడి స్థానంలో మరో భారత వికెట్ కీపర్ బ్యాటర్ టీమ్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.సెంచరీతో కదం తొక్కికాగా గతేడాది దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధంతరంగా స్వదేశానికి వచ్చిన ఇషాన్ కిషన్.. ఆ తర్వాత టీమిండియాలో మళ్లీ చోటు దక్కించుకోలేకపోయాడు. రంజీ ట్రోఫీలో ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించి సెంట్రల్ కాంట్రాక్టు కూడా కోల్పోయాడు. ఈ క్రమంలో దిద్దుబాటు చర్యలకు దిగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఇటీవల బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నీ బరిలో దిగాడు.తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని ఈ రెడ్బాల్ టోర్నమెంట్లో జార్ఖండ్ కెప్టెన్గా వ్యవహరించిన ఇషాన్ సెంచరీతో అలరించాడు. అయితే, తన జట్టును మాత్రం సెమీస్ రేసులో నిలపలేకపోయాడు. ఇదిలా ఉంటే.. ఈ టోర్నీ సందర్భంగానే ఇషాన్కు గాయమైనట్లు క్రిక్బజ్ వెల్లడించింది. ఫలితంగా.. సెప్టెంబరు 5న ఆరంభమయ్యే దులిప్ ట్రోఫీకి అతడు అందుబాటులో ఉండకపోవచ్చని పేర్కొంది.సంజూ శాంసన్కు చోటు?ఇషాన్ కిషన్ స్థానంలో కేరళ క్రికెటర్ సంజూ శాంసన్ ఇండియా-డి జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కాగా సెప్టెంబరు 19 నుంచి టీమిండియా స్వదేశంలో బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ మ్యాచ్లకు సన్నాహకంగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తదితర టీమిండియా స్టార్లు దులిప్ ట్రోఫీ బరిలో దిగనున్నారు.ఇషాన్కు తప్పని కష్టాలుఈ టోర్నీలో సత్తా చాటి బంగ్లాతో సిరీస్కు ఎంపికకావాలని కొందరు.. జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవాలని మరికొందరు పట్టుదలగా ఉన్నారు. అయితే, తీవ్రమైన పోటీనెలకొన్న తరుణంలో ఇషాన్ కిషన్ ఇప్పట్లో రీఎంట్రీ ఇవ్వకపోయినా.. కనీసం సెలక్టర్ల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉండేది. కానీ గాయం తీవ్రతరమైతే అతడు ఈ ఎడిషన్ మొత్తానికి దూరమైతే.. మళ్లీ రంజీ దాకా వేచిచూడాల్సిందే!! ఏదేమైనా ఇషాన్కు ఇప్పట్లో కెరీర్ కష్టాల నుంచి విముక్తి లభించేలా కనిపించడం లేదు!!దులిప్ ట్రోఫీ: బీసీసీఐ ప్రకటించిన ఇండియా-డి జట్టుశ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అథర్వ తైడే, యశ్ దూబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రికీ భుయ్, శరణ్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, ఆదిత్య థాకరే, హర్షిత్ రాణా, తుషార్ దేశ్పాండే, ఆకాశ్ సేన్గుప్తా, కేఎస్ భరత్(వికెట్ కీపర్), సౌరభ్ కుమార్.చదవండి: Duleep Trophy 2024: అనంతపూర్ చేరుకున్న క్రికెటర్లు -
శ్రేయస్ అయ్యర్ మళ్లీ ఫెయిల్.. 286 పరుగుల తేడాతో ముంబై ఓటమి
బుచ్చిబాబు టోర్నీ-2024లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ఈ టోర్నీలో ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్న అయ్యర్.. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్తో జరిగిన మ్యాచ్లో తీవ్ర నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి ఔటైన శ్రేయస్.. రెండో ఇన్నింగ్స్లో 22 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. మరోసారి షార్ట్బాల్ బలహీనతను అయ్యర్ అధిగమించలేకపోయాడు. తమిళనాడు పేసర్ అచ్యుత్ వేసిన షార్ట్పిచ్ బాల్కు ఫుల్షాట్ ఆడబోయి క్యాచ్గా శ్రేయస్ దొరికిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. మరోవైపు తొలి ఇన్నింగ్స్లో 30 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు రాలేదు. అతడి చేతి వేలికి ప్రాక్టీస్ సమయంలో గాయమైంది. అయితే గాయం అంత తీవ్రమైనది కానట్లు తెలుస్తోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబై పై 286 పరుగుల తేడాతో తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఘన విజయం సాధించింది. 510 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు 223 పరుగులకే ఆలౌటైంది. ముంబై బ్యాటర్లలో షామ్స్ ములానీ(68) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. -
నిరాశపరిచిన శ్రేయస్, సూర్యకుమార్
బుచ్చిబాబు టోర్నీలో టీమిండియా స్టార్లు శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ తీవ్రంగా నిరాశపరిచారు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్తో జరిగిన మ్యాచ్లో ముంబైకి ప్రాతనిథ్యం వహించిన ఈ ఇద్దరు తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. శ్రేయస్ 3 బంతుల్లో 2 పరుగులు చేసి సాయి కిశోర్ బౌలింగ్లో ఔట్ కాగా.. సూర్యకుమార్ యాదవ్ 38 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 30 పరుగులు చేసి అజిత్ రామ్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఫలితంగా ముంబై తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. దివ్యాన్ష్ సక్సెనా(61 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. అంతకుముందు తమిళనాడు 117.3 ఓవర్లలో 379 పరుగులకు ఆలౌటైంది. ప్రదోష్ 65, ఇంద్రజిత్ 61, భూపతి 82, అజిత్ 53 పరుగులు చేయగా.. ముంబై బౌలర్ హిమాన్షు 81 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు.కాగా, బుచ్చిబాబు టోర్నీలో సత్తా చాటి బంగ్లాదేశ్ సిరీస్కు ముందు భారత సెలెక్టర్లను ఆకర్శిgచాలని శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ అనుకున్నారు. అయితే వారి ఆశలు అడియాసలయ్యాయి. సాయి కిషోర్, అజిత్ రామ్ వారి ఆశలపై నీళ్లు చల్లారు. వీరిద్దరు మిగతా టీమిండియా ఆటగాళ్లతో కలిసి వచ్చే నెలలో జరిగే దులీప్ ట్రోఫీలో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ టోర్నీలో రాణిస్తే బంగ్లాతో సిరీస్కు టీమిండియాలో చోటు దక్కడం దాదాపుగా ఖయమనే చెప్పాలి. అయితే ఈ టోర్నీలో సత్తా చాటడం అంత ఈజీ కాదు. జాతీయ జట్టుకు ఆడిన ఆటగాళ్లంతా ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. దీంతో ఇక్కడ పరుగులు సాధించడం కష్టమవుతుంది. వచ్చే నాలుగు నెలల్లో భారత్ 10 టెస్ట్ మ్యాచ్లు ఆడనుండటంతో శ్రేయస్, సూర్యకుమార్ లాంటి చాలామంది క్రికెటర్లు రెడ్ బాల్ క్రికెట్పై దృష్టి పెట్టారు. టీమిండియాలో చోటే లక్ష్యంగా వీరంతా పావులు కదుపతునున్నారు. -
శ్రేయస్ అయ్యర్కు చేదు అనుభవం.. వీడియో
టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ బౌలర్ అవతారమెత్తాడు. బుచ్చిబాబు టోర్నమెంట్లో తన బౌలింగ్ నైపుణ్యాలు ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. తన సహజశైలికి విరుద్ధంగా.. వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్ సునిల్ నరైన్ మాదిరి బౌల్ చేయబోయి ప్రత్యర్థి జట్టు బ్యాటర్కు దొరికిపోయాడు.కాగా దులిప్ ట్రోఫీ-2024కు ముందు భారత క్రికెటర్లు.. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్(టీఎన్సీఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బుచ్చిబాబు రెడ్బాల్ టోర్నీలో ఆడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శ్రేయస్ అయ్యర్ సొంత జట్టు ముంబైకి ఆడుతున్నాడు. ఈ క్రమంలో టీఎన్సీఏ ఎలెవన్ జట్టుతో మంగళవారం ముంబై మ్యాచ్ మొదలైంది.సునిల్ నరైన్ను అనుసరించబోయి..తొలుత బ్యాటింగ్కు దిగిన టీఎన్సీఏ తొలిరోజు ఆట పూర్తయ్యేసరికి(90 ఓవర్లు) ఐదు వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. అయితే, ఆట ముగియడానికి ఒక్క ఓవర్ మిగిలి ఉన్న ఉన్న తరుణంలో శ్రేయస్ అయ్యర్ బంతితో రంగంలోకి దిగాడు. తొంభైవ ఓవర్లో బాల్ చేతబట్టిన ఈ పార్ట్టైమ్ స్పిన్నర్ సునిల్ నరైన్ శైలిని అనుసరించబోయాడు. అయితే, క్రీజులో ఉన్న తమిళనాడు బ్యాటర్ సోను యాదవ్ భారీ సిక్సర్తో అయ్యర్కు చేదు అనుభవం మిగిల్చాడు.ఇండియా-డి జట్టుకు కెప్టెన్గామొత్తంగా అయ్యర్ ఓవర్లో టీఎన్సీఏ ఏడు పరుగులు రాబట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా ఈ టోర్నీ అనంతరం సెప్టెంబరు 5 నుంచి మొదలుకానున్న దులిప్ ట్రోఫీలో అయ్యర్ ఆడనున్నాడు. ఇండియా-డి జట్టుకు అతడు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. కాగా స్పెషలిస్టు బ్యాటర్ అయిన శ్రేయస్ అయ్యర్ రైటార్మ్ లెగ్బ్రేక్ స్పిన్ బౌలింగ్ చేయగలడు. ఇక విండీస్ బౌలింగ్ ఆల్రౌండర్ సునిల్ నరైన్ రైటార్మ్ ఆఫ్బ్రేక్ స్పిన్నర్. వీరిద్దరు ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్కతా నైట్ రైడర్స్లో సహచర ఆటగాళ్లు. ఈ ఏడాది అయ్యర్ సారథ్యంలోని కోల్కతా చాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే.చదవండి: Duleep Trophy: ఆ ముగ్గురు స్టార్లు దూరం.. బీసీసీఐ ప్రకటనShreyas Iyer bowling with Sunil Narine action. 😂 pic.twitter.com/EpX4ZxnfZx— Mufaddal Vohra (@mufaddal_vohra) August 27, 2024 -
IPL 2025: అయ్యర్పై వేటు?.. కేకేఆర్ కెప్టెన్గా సూర్య?!
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చే ఏడాది కోల్కతా నైట్ రైడర్స్కు మారనున్నాడా? ఏకంగా కేకేఆర్ సారథిగా బాధ్యతలు చేపట్టబోతున్నాడా? ఇలా అయితే.. శ్రేయస్ అయ్యర్ పరిస్థితి ఏమిటి? అంటూ సోషల్ మీడియాలో చర్చకు తెరతీశారు ఈ ఇద్దరు క్రికెటర్ల అభిమానులు. ఓ స్పోర్ట్స్ జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలు ఇందుకు కారణం.హార్దిక్ రాకతోనే గందరగోళం!ఇండియన్ ప్రీమియర్ లీగ్లో 2012లో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్.. రెండేళ్ల తర్వాత కేకేఆర్లో చేరాడు. టీమిండియా ప్రస్తుత హెడ్కోచ్ గౌతం గంభీర్ సారథ్యంలో 2014లో టైటిల్ గెలిచిన కేకేఆర్ జట్టులో అతడు సభ్యుడు. అయితే, తగినన్ని అవకాశాలు రాకపోవడంతో 2017లో కోల్కతా ఫ్రాంఛైజీని వీడి.. తిరిగి ముంబై గూటికి చేరాడు సూర్య.అప్పటి నుంచి ముంబై జట్టులో పాతుకుపోయిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. అంచెలంచెలుగా ఎదిగాడు. వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్గా సత్తా చాటి.. అనూహ్య రీతిలో టీమిండియా కెప్టెన్గా నియమితుడయ్యాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో రోహిత్ శర్మపై వేటు వేసి అతడి స్థానంలో టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ తన సారథిగా ప్రకటించిన విషయం తెలిసిందే.వాస్తవానికి.. ముంబై జట్టులో రోహిత్ గైర్హాజరీలో సూర్య కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో రోహిత్ తర్వాత అతడే ముంబై పగ్గాలు చేపడతాడని విశ్లేషకులు భావించారు. అంతేకాదు.. మరో సీనియర్, టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా కూడా కెప్టెన్సీ అవకాశం ఉందని అంచనా వేశారు.అందుకే ముంబైని వీడాలనుకుంటున్నాడా?అయితే, ముంబై యాజమాన్యం మాత్రం భారీ ధరకు గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ను ట్రేడ్ చేసుకుని మరీ కెప్టెన్ను చేసింది. ఫలితంగా జట్టు రెండు వర్గాలుగా చీలిపోయినట్లు వార్తలు వచ్చాయి. అందుకు అనుగుణంగా రోహిత్ శర్మకు మద్దతుగా బుమ్రా, సూర్య నిలవగా.. హార్దిక్ సీనియర్ల సపోర్టు లేక ఒంటరయ్యాడు. ఈ క్రమంలో ఒత్తిడిలో చిత్తై కెప్టెన్గా పూర్తిగా విఫలమయ్యాడు.ఇక హార్దిక్ రాకతో సందిగ్దంలో పడిన సూర్య.. ముంబై జట్టును వీడేందుకు సిద్ధపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కేకేఆర్ ఈ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ను సంప్రదించిందని.. తమ జట్టులోకి వస్తే కెప్టెన్గా నియమిస్తామని ఆఫర్ చేసిందని ఓ వ్యక్తి వీడియో విడుదల చేశాడు. అతడి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కాగా.. సూర్య, శ్రేయస్ అయ్యర్ అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.కేకేఆర్ సారథి అయితే బాగుంటుంది!సూర్య మళ్లీ కేకేఆర్ గూటికి చేరి కెప్టెన్ అయితే బాగుంటుందని అతడి ఫ్యాన్స్ అంటుండగా.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో పదేళ్ల తర్వాత జట్టుకు ట్రోఫీ అందించిన శ్రేయస్ను తప్పించడం సరికాదని అతడి మద్దతుదారులు అంటున్నారు. ఇవన్నీ వట్టి వదంతులేనని.. నిరాధార వ్యాఖ్యలను నమ్మాల్సిన అవసరం లేదని కొట్టిపారేస్తున్నారు. శ్రేయస్ను కేకేఆర్ రిటైన్ చేసుకోవడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.అయితే, ప్రస్తుత టీమిండియా టీ20 కెప్టెన్గా ఉన్న సూర్య పట్ల కేకేఆర్ నిజంగా మొగ్గు చూపితే.. శ్రేయస్ వేలంలోకి వస్తాడని.. అతడిని ముంబై కొనుగోలు చేసే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు. కాగా సూర్య ఇప్పటి వరకు ఓవరాల్గా 150 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 3594 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 24 అర్ధ శతకాలు ఉన్నాయి. అంతర్జాతీయ టీ20లలోనూ 4 శతకాలు బాదిన రికార్డు సూర్యకు ఉంది. 🚨𝐓𝐫𝐚𝐧𝐬𝐟𝐞𝐫 𝐑𝐮𝐦𝐨𝐮𝐫𝐬 🚨👀 KKR management unofficially contacted SKY for KKR captaincy from next year .( Rohit Juglan from Revzsports)pic.twitter.com/ClEVeuqcb4— KKR Vibe (@KnightsVibe) August 24, 2024 -
సియెట్ అవార్డుల ప్రధానోత్సవం.. సందడి చేసిన క్రికెట్ స్టార్స్ (ఫొటోలు)
-
జడ్డూనే ముందుగా అడిగా.. నా నిర్ణయాల వల్లే ఇలా: జై షా
తమ కఠిన వైఖరి కారణంగానే టీమిండియా స్టార్లలో మార్పు వచ్చిందని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కార్యదర్శి జై షా అన్నాడు. యువ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ దేశవాళీ టోర్నీల్లో ఆడటమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాడు. కేవలం వీరిద్దరిని దృష్టిలో పెట్టుకుని నిబంధనలు ప్రవేశపెట్టలేదని.. అందరి కంటే ముందుగా రవీంద్ర జడేజా విషయంలో తాను ఈ వైఖరి అవలంబించినట్లు తెలిపాడు.బోర్డు ఆదేశాలను లెక్కచేయలేదుసెంట్రల్ కాంట్రాక్టు ఉన్న భారత క్రికెటర్లు ఫిట్గా ఉండి, జాతీయ జట్టుకు దూరంగా ఉన్న సమయంలో కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ నిబంధనలు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ బోర్డు ఆదేశాలను లెక్కచేయలేదు. ఈ నేపథ్యంలో వీరిద్దరిని సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డారన్న కారణంగా ఈ మేరకు కఠిన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పొరపాటు సరిచేసుకున్న శ్రేయస్ ఇప్పటికే రంజీల్లో ఆడి శ్రీలంకతో వన్డే సిరీస్ జట్టులో చోటు దక్కించుకోగా.. ఇషాన్ సైతం దులిప్ ట్రోఫీ-2024 బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం గురించి జై షా స్పందిస్తూ... ‘‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి మినహా మిగతా వాళ్లంతా దులిప్ ట్రోఫీ ఆడబోతున్నారు.నా కఠిన నిర్ణయాల వల్లే ఇలానేను కఠినమైన నిర్ణయాలు తీసుకున్నందు వల్లే ఇది సాధ్యమైంది. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కూడా ఈ టోర్నీలో భాగమయ్యారు. మేము స్ట్రిక్ట్గా ఉండాలనే నిర్ణయించుకున్నాం. నిజానికి రవీంద్ర జడేజా గాయం కారణంగా జట్టుకు దూరమైనపుడు.. నేను తనకి కాల్ చేశాను.కోలుకున్న తర్వాత ముందుగా దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచించాను. జడేజా అందుకు తగ్గట్లుగా ముందుగా రంజీ మ్యాచ్ ఆడి ఆ తర్వాత టీమిండియాలోకి వచ్చాడు. ఆటగాళ్లు గాయపడటం సహజం. అయితే, గాయం కారణంగా జట్టుకు దూరమైన ఆటగాళ్లు తిరిగి ఫిట్నెస్ సాధించడంతో పాటు డొమెస్టిక్ క్రికెట్ ఆడితేనే జాతీయ జట్టుకు ఎంపిక చేస్తామని చెప్పాం’’ అని జై షా టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు. సెప్టెంబరు 5 నుంచిఅయితే, కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మాత్రం ఇందుకు మినహాయింపు అని జై షా స్పష్టం చేశాడు. కాగా సెప్టెంబరు 5 నుంచి దేశవాళీ రెడ్బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ ఆరంభం కానుంది. స్వదేశంలో బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ముందుకు టీమిండియా స్టార్లు ఈ టోర్నమెంట్ బరిలో దిగనున్నారు. చదవండి: Ind vs Ban: టీమిండియాలో చోటు దక్కదని తెలుసు.. అయినా! -
టెస్టు కెప్టెన్గానూ అతడు పనికిరాడా?: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియాలో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, కీలక ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వీడ్కోలు పలకగా.. హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్ ప్రస్థానం కూడా ముగిసిపోయింది. ఈ క్రమంలో టీ20 జట్టు పూర్తిస్థాయి కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ నియమితుడు కాగా.. గౌతం గంభీర్ కోచ్గా ద్రవిడ్ బాధ్యతలను స్వీకరించాడు.భవిష్య కెప్టెన్గా శుబ్మన్ గిల్మరోవైపు.. 37 ఏళ్ల రోహిత్ శర్మకు డిప్యూటీగా స్టార్ ఓపెనర్ శుబ్మన్ గిల్ను నియమించింది బీసీసీఐ. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఈ పంజాబీ బ్యాటర్కు వైస్ కెప్టెన్గా బాధ్యతలు అప్పగించింది. అంతేకాదు.. రోహిత్, సూర్య గైర్హాజరీలో జింబాబ్వే టీ20 సిరీస్కు కెప్టెన్గానూ ఎంపిక చేసింది. తద్వారా భవిష్య కెప్టెన్గా శుబ్మన్ గిల్ ఉండబోతున్నాడని సంకేతాలు ఇచ్చింది.ఈ నేపథ్యంలో మరో స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ గురించి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో అద్భుతమైన రికార్డు ఉన్న పంత్ను కెప్టెన్గా నియమిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. అయితే, దులిప్ ట్రోఫీ-2024 జట్ల ప్రకటన తర్వాత ఈ ఉత్తరాఖండ్ బ్యాటర్ పేరును బీసీసీఐ భవిష్య కెప్టెన్గా పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలుస్తోందన్నాడు.ఆ నలుగురికి ఛాన్స్కాగా సెప్టెంబరు 5 నుంచి మొదలుకానున్న ఈ రెడ్బాల్ టోర్నీకి సంబంధించిన నాలుగు జట్లను బీసీసీఐ బుధవారం ప్రకటించింది. టీమిండియా స్టార్లు శుబ్మన్ గిల్(టీమ్-ఎ), రుతురాజ్ గైక్వాడ్(టీమ్-సి), శ్రేయస్ అయ్యర్(టీమ్-డి)లకు సారథులుగా అవకాశం ఇచ్చిన బీసీసీఐ.. టీమ్-బి కెప్టెన్గా బెంగాల్ స్టార్ అభిమన్యు ఈశ్వరన్ను నియమించింది. ఈ జట్టులోనే రిషభ్ పంత్కూ చోటిచ్చింది.ఈ విషయంపై స్పందించిన ఆకాశ్ చోప్రా.. ‘‘రిషభ్ పంత్ కెప్టెన్ కాదా!.. అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలో అతడు ఆడాలా? మరేం పర్లేదు. అయితే, టీమిండియా భవిష్య కెప్టెన్గా భావిస్తున్న పంత్ను.. ఈ టోర్నీలో సారథిగా ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది.ఏకైక వికెట్ కీపర్ బ్యాటర్గా చరిత్రవ్యక్తిగతంగా నేనేమీ పంత్ను సమర్థించడం లేదు. టెస్టు క్రికెటర్గా అతడి గణాంకాల ఆధారంగానే మాట్లాడుతున్నా. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా గడ్డపై శతకాలు బాదిన భారత ఏకైక వికెట్ కీపర్ బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు పంత్. కెప్టెన్గా తనకంటే గొప్ప ఆటగాడు మరెవరు ఉంటారు? అయినా.. సరే తనను పక్కనపెట్టారు. దీనిని బట్టి టీమిండియా పగ్గాలు అప్పజెప్పే సూచనలూ కనిపించడం లేదు’’ అని ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా 2022 డిసెంబరులో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన పంత్.. దాదాపు ఏడాదిన్నరపాటు జట్టుకు దూరమయ్యాడు. ఐపీఎల్-2024 ద్వారా పునరాగమనం చేసిన ఈ వికెట్ కీపర్.. టీ20 ప్రపంచకప్-2024లోనూ సత్తా చాటాడు.చదవండి: గంభీర్ ప్లాన్ అదుర్స్: బౌలింగ్ కోచ్గా మోర్కెల్ ఎంపికకు కారణం ఇదే! -
దులీప్ ట్రోఫీ జట్ల ప్రకటన.. కెప్టెన్లుగా గిల్, రుతురాజ్, శ్రేయస్.. సీనియర్లకు విశ్రాంతి
సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభంకాబోయే దులీప్ ట్రోఫీ కోసం నాలుగు జట్లను (టీమ్ ఏ, బి, సి, డి) ఇవాళ (ఆగస్ట్ 14) ప్రకటించారు. ఈ జట్లకు శుభ్మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించనున్నారు. ఈ టోర్నీలో చాలామంది టీమిండియా స్టార్లు పాల్గొననున్నారు. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ మినహా టీమిండియా మొత్తం ఈ టోర్నీలో పాల్గొంటుంది. ఈ టోర్నీలో ప్రదర్శన ఆధారంగానే బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్కు జట్టు ఎంపిక ఉంటుందని తెలుస్తుంది.టీమ్ ఏ: శుభమన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనుష్ కోటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, విద్వత్ కావేరప్ప, కుమార్ కుశాగ్రా , శాశ్వత్ రావత్.టీమ్ బి: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ సిరాజ్, యశ్ దయాల్, ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవస్తి , ఎన్ జగదీసన్ (వికెట్కీపర్).టీమ్ సి: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్ (వికెట్కీపర్), సూర్యకుమార్ యాదవ్, బాబా ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, ఉమ్రాన్ మాలిక్, వైషాక్ విజయ్కుమార్, అన్షుల్ ఖంబోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మర్కండే, ఆర్యన్ జుయల్ (వికెట్కీపర్), సందీప్ వారియర్.టీమ్ డి: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అథర్వ తైడే, యశ్ దూబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్ (వికెట్కీపర్), రికీ భుయ్, సరాంశ్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, ఆదిత్య ఠాకరే, హర్షిత్ రాణా, తుషార్ దేశ్పాండే, ఆకాష్ సేన్ గుప్తా, కేఎస్ భరత్ (వికెట్కీపర్), సౌరభ్ కుమార్.షెడ్యూల్..సెప్టెంబర్ 5-8: తొలి మ్యాచ్- టీమ్ ఏ వర్సెస్ టీమ్ బిరెండో మ్యాచ్- టీమ్ సి వర్సెస్ టీమ్ డిసెప్టెంబర్ 12-15: మూడో మ్యాచ్- టీమ్ ఏ వర్సెస్ టీమ్ డినాలుగో మ్యాచ్- టీమ్ బి వర్సెస్ టీమ్ సిసెప్టెంబర్ 19-22: ఐదో మ్యాచ్- టీమ్ బి వర్సెస్ టీమ్ డిఆరో మ్యాచ్- టీమ్ ఏ వర్సెస్ టీమ్ సి -
సూర్యతో పాటు శ్రేయస్ అయ్యర్ కూడా!
శ్రీలంక సిరీస్తో వన్డేల్లో పునరాగమనం చేసిన టీమిండియా క్రికెటర్ టెస్టు రీఎంట్రీపై కూడా దృష్టి సారించాడు. బంగ్లాదేశ్తో సిరీస్ నేపథ్యంలో భారత జట్టులో చోటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలో బుచ్చిబాబు టోర్నమెంట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ముంబై తరఫున ఈ టోర్నీలో శ్రేయస్ బరిలోకి దిగనున్నాడు.ఆ మ్యాచ్లో శ్రేయస్ ఆడతాడుఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) ధ్రువీకరించింది. ‘‘తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్లో శ్రేయస్ అయ్యర్ ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. కోయంబత్తూరు వేదికగా ఆగష్టు 27న జరుగనున్న ముంబై వర్సెస్ జమ్మూ కశ్మీర్ మ్యాచ్లో అతడు ఆడనున్నాడు’’ అని ఎంసీఏ తన ప్రకటనలో తెలిపింది.కాగా శ్రేయస్ అయ్యర్ గత కొంతకాలంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ముందు ముంబై తరఫున రంజీ బరిలో దిగిన అతడు.. ఇంగ్లిష్ జట్టుతో సిరీస్కు ఎంపికయ్యాడు. అయితే, తొలి రెండు టెస్టుల్లో వరుసగా 35, 13, 27, 29 పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరిచాడు. ఆ తర్వాత తుదిజట్టులో అతడికి చోటు దక్కలేదు.టెస్టు జట్టులోనూ చోటే లక్ష్యంగా ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్లో ఆడిన తర్వాతే టీమిండియాలో అవకాశమని బీసీసీఐ చెప్పగా.. ఆ ఆదేశాలను బేఖాతరు చేశాడు. ఈ నేపథ్యంలో సెంట్రల్ కాంట్రాక్టు కూడా కోల్పోయాడు. అయితే, ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్గా వ్యవహరించిన శ్రేయస్ అయ్యర్కు శ్రీలంకతో వన్డే సిరీస్ సందర్భంగా టీమిండియా సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది.ఇక ఇప్పుడు టెస్టు జట్టులోనూ తిరిగి చోటు దక్కించుకోవాలని శ్రేయస్ అయ్యర్ పట్టుదలగా ఉన్నాడు. ఈ విషయం గురించి మాట్లాడుతూ.. వన్డే వరల్డ్కప్-2023 తర్వాత తాను ఫామ్ కోల్పోయానని.. అయితే, ఐపీఎల్ ద్వారా తిరిగి గాడిలో పడ్డాడని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. తాను ఎవరితోనూ పోటీపడటం లేదని.. తనకు తానే పోటీ అని పేర్కొన్నాడు. కాగా సెప్టెంబరు 19 నుంచి భారత్- బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్ మొదలుకానుంది. ఇక అయ్యర్తో పాటు మరో ముంబై బ్యాటర్, టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ బుచ్చిబాబు టోర్నీ ఆడనున్నాడు. ఈ రెడ్బాల్ టోర్నీలో ముంబై కెప్టెన్గా సర్ఫరాజ్ ఖాన్ వ్యవహరించనున్నాడు.చదవండి: Pak vs Ban: పాక్ ఆస్ట్రేలియన్ మైండ్సెట్తో ఆడకూడదు! -
IND VS SL 2nd ODI: శ్రేయస్ అయ్యర్ సూపర్ త్రో.. నమ్మశక్యంకాని రీతిలో రనౌట్
శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ సూపర్ త్రోతో అలరించాడు. ఈ మ్యాచ్లో అయ్యర్.. క్రీజ్లో కుదురుకున్న కమిందు మెండిస్ను (40) అద్భుతమైన డైరెక్ట్ త్రోతో పెవిలియన్కు పంపాడు. ఈ విన్యాసాన్ని చూసిన వారంతా ఔరా అనుకున్నారు. శ్రేయస్ సూపర్ త్రోకు సంబంధించిన వీడియో నెట్టింట షికార్లు చేస్తుంది.What a direct hit from Shreyas Iyer. 🤯🎯pic.twitter.com/VqZeVfbetk— Mufaddal Vohra (@mufaddal_vohra) August 4, 2024మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్లో పథుమ్ నిస్సంక 0, అవిష్క ఫెర్నాండో 40, కుశాల్ మెండిస్ 30, సమరవిక్రమ 14, అసలంక 25, లియనగే 12, వెల్లలగే 37, కమిందు మెండిస్ 40, అఖిల ధనంజయ 15 పరుగులు చేసి ఔట్ కాగా.. జెఫ్రీ వాండర్సే 1 పరుగుతో అజేయంగా నిలిచారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ 2, సిరాజ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.241 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా ధాటిగా ఇన్నింగ్స్ను ప్రారంభించింది. రోహిత్ శర్మ కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సిరీస్లో వరుసగా రెండో ఫిఫ్టీ పూర్తి చేశాడు. రోహిత్ సిక్సర్తో హాఫ్ సెంచరీని పూర్తి చేయడం విశేషం.19 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 123/3గా ఉంది. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే మరో 118 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజ్లో కోహ్లి (14), అక్షర్ పటేల్ (7) ఉన్నారు. -
శ్రేయస్ వచ్చేశాడు.. మరి డబుల్ సెంచరీ వీరుడి సంగతేంటి?
టీమిండియా స్టార్ ప్లేయర్, కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దాదాపు 8 నెలల తర్వాత జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. శ్రీలంకతో వన్డే సిరీస్కు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ అయ్యర్ను ఎంపిక చేసింది. కాగా దేశీవాళీ క్రికెట్లో ఆడాలన్న తమ ఆదేశాలను ధిక్కరించినందు అయ్యర్పై బీసీసీఐ క్రమశిక్షణ చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.అదేవిధంగా అతడిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి సైతం బీసీసీఐ తప్పించింది. అయితే తన తప్పు తెలుసుకున్న అయ్యర్ గత రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబై జట్టుకు ఆడాడు. అంతేకాకుండా జాతీయ జట్టు తరపున రీ ఎంట్రీ ఇచ్చేందుకు తీవ్రంగా శ్రమించాడు. అయితే ఇప్పుడు భారత కొత్త హెడ్ కోచ్గా గౌతం గంభీర్ బాధ్యతలు చేపట్టడంతో అయ్యర్కు మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చేందుకు తలుపులు తెరుచుకున్నాయి. గంభీర్కు అయ్యర్కు మంచి అనుబంధం ఉంది. ఐపీఎల్-2024 విజేతగా నిలిచిన కేకేఆర్ జట్టుకు అయ్యర్ కెప్టెన్ కాగా.. గంభీర్ మెంటార్గా పనిచేశాడు. గంభీర్ సూచనలతోనే అయ్యర్ను మళ్లీ సెలక్టర్లు పిలుపినిచ్చినట్లు తెలుస్తోంది. అయ్యర్ కాంట్రాక్ట్పై కూడా బీసీసీఐ పునారాలోచనచేయనున్నట్లు సమాచారం. ఇక అయ్యర్తో పాటు బీసీసీఐ అగ్రహానికి గురైన మరో క్రికెటర్ ఇషాన్ కిషన్ పరిస్థితి ఏంటి అని క్రీడా వర్గాల్లో తెగ చర్చనడుస్తోంది.కిషన్ రీ ఎంట్రీ ఎప్పుడు?కాగా గతేడాది డిసెంబర్లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన ఇషాన్ కిషన్.. వ్యక్తిత కారణాలతో సిరీస్ మధ్యలోనే స్వదేశానికి వచ్చేశాడు. అయితే జనవరిలో భారత జట్టు ఇంగ్లండ్తో ఆడిన ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ముందు సెలక్టర్లు ఇషాన్ పేరును పరిగణనలోకి తీసుకోవాలంటే దేశవాళీలు ఆడాలని కోరారు. కానీ సెలక్టర్ల ఆదేశాలను కిషన్ పరిగణలోకి తీసుకోలేదు. దీంతో అతడి స్ధానంలో ఆసీస్ సిరీస్కు ధ్రువ్ జురెల్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఆ తర్వాత కూడా కిషన్ దేశీవాళీ క్రికెట్ ఆడలేదు. దేశీ వాళీ క్రికెట్ కాకుండా ఐపీఎల్-2024 కోసం ప్రాక్టీస్ చేసుకోవడం వంటి ఆంశాలు బీసీసీఐ అగ్రహాం తెప్పించాయి.దీంతో అతడిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బీసీసీఐ తప్పించింది. అప్పటి నుంచి జాతీయ జట్టు ఎంపికలో కిషన్ను సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. అయితే ఇషాన్ కిషన్ తిరిగి జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలంటే కచ్చితంగా దేశవాళీ క్రికెట్ సీజన్ మొత్తం ఆడాల్సిందే అని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా వన్డేల్లో అయ్యర్కు డబుల్ సెంచరీ ఉన్న సంగతి తెలిసిందే.భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రింకూ సింగ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా. -
శ్రీలంక పర్యటనకు భారత జట్టు ఎంపిక నేడే? అతడు రీ ఎంట్రీ ఇస్తాడా?
జింబాబ్వేతో టీ20 సిరీస్ను ఘనంగా ముగించిన టీమిండియా.. ఇప్పుడు శ్రీలంక పర్యటనకు సిద్దమవుతోంది. ఈ టూర్లో భాగంగా భారత్ ఆతిథ్య జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. పల్లెకెలె వేదికగా జూలై 27న జరగనున్న తొలి టీ20తో టీమిండియా పర్యటన ప్రారంభం కానుంది. కాగా శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్లకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ మంగళవారం(జూలై 16) ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. అజిత్ అగర్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ వర్చువల్గా మంగళవారం సాయంత్రం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.ఈ జట్టు ఎంపికలో భారత కొత్త హెడ్కోచ్ గౌతం గంభీర్ కూడా పాల్గోనున్నట్లు సమాచారం. ఇక లంక పర్యటనకు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాకు సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టీ20 క్రికెట్కు ఇప్పటికే గుడ్బై చెప్పిన రోహిత్, విరాట్, జడేజా.. ఇప్పుడు లంకతో వన్డే సిరీస్కు కూడా దూరంగా ఉండనున్నారు. అయితే ఈ సిరీస్కు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా దూరం కానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో శ్రీలంక పర్యటనలో వన్డే, టీ20 సిరీస్లకు ఇద్దరు వేర్వేరు కెప్టెన్లను సెలక్టర్లు ఎంపిక చేయనున్నట్లు వినికిడి.అదే విధంగా టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తిరిగి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ ఆదేశాలను దిక్కరించి జట్టుకు దూరంగా ఉంటున్న అయ్యర్.. ఇప్పుడు గంభీర్ రాకతో అతడి ఎంట్రీ సుగమైనట్లు క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ఐపీఎల్-2024 ఛాంపియన్స్ నిలిచిన కోల్కతా నైట్రైడర్స్కు అయ్యర్ సారథ్యం వహించగా.. గంభీర్ మెంటార్గా పనిచేశాడు. -
Ind vs SL: అగార్కర్తో గంభీర్ భేటీ అప్పుడే! ఆ ఇద్దరి రీ ఎంట్రీ!
టీమిండియా కోచ్గా గౌతం గంభీర్ ప్రయాణం జూలైలో ఆరంభం కానుంది. ఈనెల చివర్లో భారత జట్టు శ్రీలంకలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే విడుదల చేసింది.రెండు వేదికల్లో 13 రోజులపాటు జరిగే ఈ సిరీస్లో శ్రీలంకతో భారత జట్టు మూడు టీ20 మ్యాచ్లు, మూడు వన్డేలు ఆడుతుంది. పల్లెకెలో మైదానంలో జూలై 26, 27, 29వ తేదీల్లో వరుసగామూడు టీ20 మ్యాచ్లు జరుగుతాయి.అనంతరం ఆగస్టు 1, 4, 7 తేదీల్లో కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో మూడు వన్డేలు జరుగుతాయి. ఈ సిరీస్లో పాల్గొనే భారత జట్టును ఇంకా ప్రకటించలేదు.ఈ నేపథ్యంలో జట్టు ఎంపిక గురించి హెడ్ కోచ్ గౌతం గంభీర్ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో వచ్చే వారం భేటీ కానున్నట్లు సమాచారం. కాగా టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన సీనియర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా ఈ పర్యటనకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.మరోవైపు.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, టీ20 జట్టు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్లకు కూడా మేనేజ్మెంట్ విశ్రాంతినివ్వనున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో లంకలో పర్యటించే జట్ల ఎంపిక కూర్పుపై.. ముఖ్యంగా కెప్టెన్ల విషయంలో గౌతీ అజిత్తో చర్చలు జరుపనున్నట్లు సమాచారం. కాగా కేఎల్ రాహుల్తో పాటు శ్రేయస్ అయ్యర్ వన్డేల్లో పునరాగమనం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.రోహిత్ శర్మ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ లంకతో వన్డే సిరీస్కు కెప్టెన్గా వ్యవహరించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే విధంగా.. శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ గురించి కూడా ఈ భేటీలో గంభీర్ అజిత్తో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.ఇక ఒకవేళ హార్దిక్ విశ్రాంతి కోరుకోనట్లయితే అతడికి టీ20 పగ్గాలు అప్పగించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. అతడికి డిప్యూటీగా సూర్యకుమార్ యాదవ్ను ఎంపిక చేస్తారని బీసీసీఐ వర్గాలు జాతీయ మీడియాతో పేర్కొన్నాయి.అదే విధంగా సీనియర్ల గైర్హాజరీలో శుబ్మన్ గిల్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్,ఆవేశ్ ఖాన్, అభిషేక్ శర్మ తదితర యువ ఆటగాళ్లు లంకతో టీ20 సిరీస్ ఆడబొయే జట్టులో చోటు దక్కించుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం వీళ్లంతా జింబాబ్వే పర్యటనలో ఉన్నారు.ఇక ఈసారి టీమిండియా- శ్రీలంక సిరీస్కు మరో ప్రత్యేకత ఏర్పడింది. రెండు జట్లూ ఈసారి కొత్త హెడ్ కోచ్ల పర్యవేక్షణలో ద్వైపాక్షిక సిరీస్లో పోటీపడనున్నాయి. టీమిండియాకు గౌతం గంభీర్... శ్రీలంకకు సనత్ జయసూర్య హెడ్ కోచ్లుగా వ్యవహరించనున్నారు.గందరగోళంగా శ్రీలంక జట్టు పరిస్థితిగత నెలలో వెస్టిండీస్–అమెరికాలలో జరిగిన టీ20 ప్రపంచకప్లో హసరంగ నేతృత్వంలో ఆడిన శ్రీలంక లీగ్ దశలోనే ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే. జట్టు పేలవ ప్రదర్శన కారణంగా హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్వుడ్ తన పదవికి రాజీనామా చేయగా, కోచ్ బాటనే కెప్టెన్ కూడా అనుసరించాడు. శ్రీలంక టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగ వైదొలిగాడు. శ్రీలంక క్రికెట్ మేలు కోరే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు, జట్టులో సభ్యుడిగా కొనసాగుతానని హసరంగ వివరించాడు. హసరంగ రాజీనామా నేపథ్యంలో టీమిండియాతో సిరీస్ను శ్రీలంక కొత్త కెప్టెన్ ఆధ్వర్యంలో ఆడనుంది. -
గంభీర్ రాక.. ఆ ఆటగాడికి మళ్లీ పిలుపు! ఎవరంటే?
టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తిరిగి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడా? అంటే అవుననే అంటున్నాయి క్రికెట్ వర్గాలు. శ్రీలంకతో వన్డే సిరీస్తో అయ్యర్ పునరాగమనం చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించిన అయ్యర్.. భారత జట్టులో చోటుతో పాటు వార్షిక కాంట్రాక్ట్ ను కూడా కోల్పోయిన విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు భారత కొత్త హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన గౌతం గంభీర్.. అయ్యర్ విషయంలో సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. అయ్యర్ విషయంపై గంభీర్ బీసీసీఐ పెద్దలతో మాట్లాడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే శ్రీలంకతో వన్డే సిరీస్కు అయ్యర్కు చోటు దక్కనున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా వీరిద్దరికి మంచి అనుబంధం ఉంది. ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ వ్యవరిస్తుండగా.. ఈ ఏడాది సీజన్లో కేకేఆర్ మెంటార్గా గంభీర్ పనిచేశాడు. వీరిద్దరి నేతృత్వంలో పీఎల్-2024 ఛాంపియన్స్గా కోల్కతా నైట్రైడర్స్ నిలిచింది. అదేవిధంగా అయ్యర్ కూడా మంచి టచ్లో కన్పించాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో అయ్యర్ తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు.మరోవైపు తన ఫిట్నెస్ కాపాడుకోవడానికి అయ్యర్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ముంబైలో వర్షంలో పడుతున్న సమయంలో కూడా తన ప్రాక్టీస్ను అయ్యర్ కొనసాగిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. -
అనంత్- రాధిక సంగీత్: జంటగా మెరిసిన క్రికెటర్లు.. హార్దిక్ మాత్రం ఒంటరిగా! (ఫోటోలు)
-
రోహిత్ భయ్యా నన్ను మాట్లాడనివ్వలేదు: కేకేఆర్ మాజీ కెప్టెన్
‘‘గతేడాది నేను కెప్టెన్గా ఉన్న సమయంలో రోహిత్ భయ్యా దగ్గరకు వెళ్లి నా మనసులో చెలరేగుతున్న అలజడి గురించి పంచుకున్నాను. రెండు మ్యాచ్లు గెలిచాం.. రెండు మ్యాచ్లు ఓడిపోయాం.నాకేమీ అర్థం కావడం లేదు భయ్యా అన్నాను. అప్పుడు.. ‘నితీశ్.. ఇంతకీ కెప్టెన్సీ అంటే ఏమనుకుంటున్నావు? అని అడిగాడు.వెంటనే నా మనసులో ఉన్నదంతా కక్కేయాలని.. ఏదో చెప్పేందుకు ప్రయత్నించాను. కానీ.. రోహిత్ భయ్యా నన్ను మాట్లాడనివ్వలేదు.‘కెప్టెన్సీ అంటే అసలేమీ లేదు. బౌలర్లను మారుస్తూ.. ఫీల్డర్లనూ అక్కడి నుంచి ఇక్కడికి.. ఇక్కడి నుంచి అక్కడికి మార్చడం అంతే. ఫలితం నీకు అనుకూలంగా వచ్చిందనుకో.. నువ్వు బాగానే ఉంటావు.ఒకవేళ నువ్వు ఆశించినది జరగలేదనుకో.. నువ్వు ఎంత మంచిగా కెప్టెన్సీ చేసినా ఎవరూ నీ గురించి మాట్లాడుకోరు. కాబట్టి నిన్ను నువ్వు మెరుగుపరచుకుంటూ.. నీ ఆట, నైపుణ్యాలపై దృష్టి పెట్టి ముందుకు సాగాలంతే.ఏ విషయాన్నైనా క్లిష్టంగా భావించనంత వరకు అంతా బాగానే ఉంటుంది. నువ్వు తెలివైన, తేలికైన మార్గాన్నే ఎంచుకోవాలి’ అని భయ్యా నాతో అన్నాడు.ఆరోజు నన్ను నేను సమాధానపరచుకునేలా నాలో స్ఫూర్తి నింపాడు’’ అని కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటర్ నితీశ్ రాణా గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.కాగా గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్ గతేడాది ఐపీఎల్కు దూరం కాగా.. అతడి స్థానంలో నితీశ్ రాణా కేకేఆర్ సారథిగా బాధ్యతలు చేపట్టాడు. బ్యాటర్గా ఫర్వాలేదనిపించినా కెప్టెన్గా మాత్రం విఫలమయ్యాడు.కేకేఆర్ తరఫున 14 మ్యాచ్లు ఆడి 413 పరుగులు చేసిన నితీశ్ రాణా.. జట్టును ప్లే ఆఫ్స్ మాత్రం చేర్చలేకపోయాడు. ఈ క్రమంలో ఈ ఏడాది శ్రేయస్ అయ్యర్ తిరిగి రాగా.. కేకేఆర్ మేనేజ్మెంట్ అతడిని మళ్లీ కెప్టెన్గా నియమించింది.అయితే, తాను కేకేఆర్ సారథిగా ఉన్న సమయంలో వరుస వైఫల్యాల నేపథ్యంలో నాటి ముంబై ఇండియన్స్ కెప్టెన్, ప్రస్తుత టీమిండియా సారథి రోహిత్ శర్మ విలువైన సూచనలు , సలహాలు ఇచ్చాడని నితీశ్ రాణా చెప్పుకొచ్చాడు. టీఆర్ఎస్ పాడ్కాస్ట్లో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా ఐపీఎల్-2024లో కేవలం రెండు మ్యాచ్లు ఆడిన నితీశ్ 42 పరుగులు చేయగలిగాడు. అయితే, కేకేఆర్ ఈసారి చాంపియన్గా నిలవడంతో ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడిగా మధుర జ్ఞాపకాలు సొంతం చేసుకున్నాడు. -
శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ.. జింబాబ్వే టీ20 సిరీస్కు ఐపీఎల్ హీరోలు
ఐపీఎల్ 2024 విన్నింగ్ కెప్టెన్ (కేకేఆర్) శ్రేయస్ అయ్యర్ జులై, ఆగస్ట్ నెలల్లో శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్తో టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తాడని తెలుస్తుంది. వివిధ కారణాల చేత టీ20 వరల్డ్కప్ జట్టుకు ఎంపిక కాని శ్రేయస్.. లంకతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు అందుబాటులో ఉంటాడని సమాచారం.మరోవైపు ఐపీఎల్ 2024 హీరోలు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, నితీశ్ రెడ్డి, విజయ్కుమార్ వైశాఖ్, యశ్ దయాల్ జులై 6 నుంచి జింబాబ్వేతో జరుగబోయే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఎంపికయ్యే సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వీరందరూ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు.వీరితో పాటు టీ20 వరల్డ్కప్కు ట్రావెలింగ్ రిజర్వ్లుగా ఎంపికైన శుభ్మన్ గిల్, ఆవేశ్ ఖాన్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్ కూడా జింబాబ్వే సిరీస్కు ఎంపికవుతారని తెలుస్తుంది. జింబాబ్వే పర్యటనకు హార్దిక్ పాండ్యా కెప్టెన్, సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్గా ఎంపికవుతారని ప్రచారం జరుగుతుంది. జింబాబ్వే సిరీస్కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, బుమ్రా లాంటి సీనియర్లకు విశ్రాంతినిస్తారని సమాచారం. జింబాబ్వే పర్యటన కోసం భారత జట్టును వచ్చే వారంలో ప్రకటించనున్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే, ప్రస్తుతం టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024తో బిజీగా ఉంది. మెగా టోర్నీలో భారత్ సూపర్-8కు అర్హత సాధించింది. సూపర్-8లో టీమిండియా.. ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్లతో తలపడనుంది. -
శెభాష్ శ్రేయస్.. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అతడే
ఐపీఎల్-2024 ఛాంపియన్స్గా కోల్కతా నైట్రైడర్స్ నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం చెన్నై వేదికగా జరిగిన ఫైనల్లో సన్రైజర్స్ హైదరాబాద్ను 8 వికెట్ల తేడాతో ఓడించిన కేకేఆర్.. మూడో సారి ట్రోఫీని ముద్దాడింది. కేకేఆర్ మూడో సారి టైటిల్ సాధించడంలో ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ది కీలక పాత్ర. అయ్యర్ వ్యక్తిగత ప్రదర్శన పరంగా పర్వాలేదన్పంచటప్పటకి.. సారథిగా మాత్రం జట్టును అద్భుతంగా నడిపించాడు. అయ్యర్ కెప్టెన్సీ 100కు 100 మార్కులు పడాల్సిందే. తన వ్యూహాలతో ప్రత్యర్ధి జట్లను అయ్యర్ చిత్తు చేశాడు. ఈ ఏడాది సీజన్లో కేకేఆర్ కేవలం మూడు మ్యాచ్ల్లో మాత్రం ఓడిపోయిందంటే అయ్యర్ కెప్టెన్సీ ఏ విధంగా ఉందో ఆర్ధం చేసుకోవచ్చు. ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందు అయ్యర్కు ఏది కలిసిరాలేదు. బీసీసీఐ ఆదేశాలను దిక్కరించడంతో జట్టులో చోటుతో పాటు వార్షిక కాంట్రాక్ట్ ను కూడా కోల్పోయాడు. అయితే పడిలేచిన కేరటంలా తన కెప్టెన్సీ మార్క్ను చూపించాడు. జట్టును విజయ పథంలో నడిపిస్తూ ఏకంగా టైటిల్ను అందించాడు. ఈ ఏడాది సీజన్లో శ్రేయస్ 14 ఇన్నింగ్స్ల్లో 351 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అయ్యర్పై భారత మాజీ బ్యాటర్ రాబిన్ ఉతప్ప ప్రశంసల వర్షం కురిపించాడు. శ్రేయస్ను కెప్టెన్గా చాలా మంది తక్కువగా అంచనా వేశారని ఉతప్ప అభిప్రాయపడ్డాడు. "శ్రేయస్ అయ్యర్కు అద్బుతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అతడు భవిష్యత్తులో కచ్చితంగా భారత జట్టు కెప్టెన్ అవుతాడు. నా వరకు అయితే ఫ్యూచర్ కెప్టెన్సీ రేసులో శుబ్మన్ గిల్ కంటే అయ్యరే ముందుంటాడు. అతడు జట్టును నడిపించే విధానం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అతడు ఈ ఏడాది సీజన్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాడు. అయ్యర్.. గౌతమ్ గంభీర్, చంద్రకాంత్ పండిట్, అభిషేక్ నాయర్ దిగ్గజాలతో కలిసి పనిచేశాడు. కాబట్టి ఆ అనుభవం శ్రేయస్కు కచ్చితంగా కలిసిస్తోంది. ఈ ఏడాది సీజన్కు ముందు అయ్యర్ పరిస్ధితి అంతగా బాగోలేదు. ఫిట్నెస్ లోపించడంతో జట్టులో చోటు కూడా కోల్పోయాడు. వెన్ను నొప్పితో బాధపడుతూనే అయ్యర్ ఆడుతున్నాడు. ముఖ్యంగా సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోవడం, వరల్డ్కప్ చోటు దక్కకపోవడం అయ్యర్ను మానసికంగా దెబ్బతీశాయి. అయినప్పటకి అయ్యర్ తన బాధను దిగమింగుకుని కేకేఆర్ను ఛాంపియన్స్గా నిలిపాడని" జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉతప్ప పేర్కొన్నాడు. -
గంభీర్ కాదు!.. కేకేఆర్ విజయాల్లో అతడిది కీలక పాత్ర.. ముగ్గురు హీరోలు
కోల్కతా నైట్ రైడర్స్ పదేళ్ల తర్వాత మరోసారి ఐపీఎల్ చాంపియన్గా అవతరించింది. క్యాష్ రిచ్ లీగ్లో మూడోసారి టైటిల్ గెలిచి ట్రోఫీని ముద్దాడింది. పదిహేడో ఎడిషన్ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని ఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచిన శ్రేయస్ అయ్యర్ సేన.. ఫైనల్లోనూ సత్తా చాటింది.చెన్నై వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ఐపీఎల్-2024 విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో కేకేఆర్ క్యాంపు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లతో సహా ఫ్రాంఛైజీ యజమానులు షారుఖ్ ఖాన్, జూహీ చావ్లా కుటుంబాలు ఈ సంతోషంలో పాలుపంచుకున్నాయి.విజయం పరిపూర్ణం.. వారే కారణంఇదిలా ఉంటే.. గతేడాది పేలవంగా ఆడి ఏడో స్థానానికి పరిమితమైన కేకేఆర్.. ఈసారి సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంది. సమిష్టి కృషితో టైటిల్ సాధించింది. లీగ్ దశలో పద్నాలుగు మ్యాచ్లకు గానూ తొమ్మిది విజయాలు సాధించి టేబుల్ టాపర్గా నిలిచింది.క్వాలిఫయర్-1లో సన్రైజర్స్ను ఓడించి ఫైనల్ చేరిన కేకేఆర్.. ఆఖరి మెట్టుపై అదే ప్రత్యర్థిని మరోసారి బోల్తా కొట్టించి విజయాన్ని పరిపూర్ణం చేసుకుంది. అయితే, కేకేఆర్ సక్సెస్ వెనుక మెంటార్ గౌతం గంభీర్దే కీలక పాత్ర అని ఆటగాళ్లతో పాటు మాజీ క్రికెటర్లు ప్రశంసిస్తున్నారు.గంభీర్ను మెంటార్గా రప్పించడం ద్వారా ఆటగాళ్ల ఆలోచనా తీరులో మార్పు వచ్చిందని.. గెలుపునకు బాట వేసిందని కొనియాడుతున్నారు. ఇది కొంతవరకు వాస్తవమే. అయితే, గంభీర్ ఒక్కడే కాదు కేకేఆర్ విజయానికి ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిట్తో పాటు అసిస్టెంట్ కోచ్లు అభిషేక్ నాయర్, భరత్ అరుణ్లు కూడా ప్రధాన కారణం.ఆరు రంజీ ట్రోఫీలు.. ఇప్పుడిలా మరో టైటిల్దేశవాళీ క్రికెట్ జట్లకు కోచ్గా వ్యవహరిస్తున్న చంద్రకాంత్ పండిట్.. శిక్షణ విషయంలో చాలా కఠినంగా ఉంటారని పేరు. అనుకున్న ఫలితాలను రాబట్టేందుకు ఆటగాళ్లతో ఎంత హార్డ్వర్క్ చేయించడానికైనా ఆయన వెనుకాడరని ప్రతీతి.ఇక గంభీర్ రూపంలో మరో దిగ్గజం చంద్రకాంత్ పండిట్కు తోడు కావడంతో ఆయన పని మరింత సులువైంది. మూడు వేర్వేరు జట్లకు కోచ్గా వ్యహరించి.. ఆరు రంజీ ట్రోఫీలు గెలిచిన శిక్షకుడిగా పేరొందిన చంద్రకాంత్ ఖాతాలో తొలిసారి ఐపీఎల్ టైటిల్ కూడా చేరింది.వాళ్లపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన అభిషేక్ నాయర్కేకేఆర్ గెలుపులో టీమిండియా మాజీ బ్యాటింగ్ ఆల్రౌండర్ అభిషేక్ నాయర్ది కూడా కీలక పాత్ర. ముఖ్యంగా ఇండియన్ కోర్కు సంబంధించి అతడే పూర్తి బాధ్యత తీసుకున్నట్లు సమాచారం.అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పాటు యువ ప్లేయర్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచి వారు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేలా అభిషేక్ తీర్చిదిద్దాడు. ఫైనల్ తర్వాత కేకేఆర్ స్టార్లు లీడింగ్ వికెట్ టేకర్ వరుణ్ చక్రవర్తి, ఫైనల్ టాప్ స్కోరర్ వెంకటేశ్ అయ్యర్ చెప్పిన మాటలే ఇందుకు నిదర్శనం.‘‘అభిషేక్ నాయర్కు కచ్చితంగా క్రెడిట్ దక్కాల్సిందే. కొంతమంది పేర్లు పెద్దగా వెలుగులోకి రావు. కానీ.. నా వరకు అభిషేక్ విషయంలో అలా జరగకూడదనే కోరుకుంటా. ఈ ప్రపంచంలోని అన్ని రకాల ప్రశంసలకు అతడు అర్హుడు’’ అని వెంకటేశ్ అయ్యర్ అభిషేక్ నాయర్పై అభిమానం చాటుకున్నాడు.ఆ శక్తి మరెవరో కాదుఇక కేకేఆర్ విజయాల్లో బౌలింగ్ విభాగానిదే ప్రధాన పాత్ర అనడంలో సందేహం లేదు. ఫైనల్లో సన్రైజర్స్ను 113 పరుగులకే ఆలౌట్ చేసి సరికొత్త రికార్డులు సృష్టించారు కేకేఆర్ బౌలర్లు. స్పిన్నర్లు, పేసర్లు కలిసి ఈ సీజన్ ఆద్యంతం అద్భుతంగా రాణించారు. వారి వెనుక ఉన్న శక్తి పేరు భరత్ అరుణ్.𝙏𝙝𝙚 𝙛𝙚𝙚𝙡𝙞𝙣𝙜 𝙤𝙛 𝙀𝙪𝙥𝙝𝙤𝙧𝙞𝙖 🏆Celebrating @KKRiders' triumph in 𝙎𝙍𝙆 style ⭐️😎#TATAIPL | #KKRvSRH | #Final | #TheFinalCall | @iamsrk pic.twitter.com/OmvXa9GtJx— IndianPremierLeague (@IPL) May 27, 2024చదవండి: BCCI- IPL 2024: వారికి భారీ మొత్తం.. బీసీసీఐ కీలక ప్రకటన -
డబ్ల్యూపీఎల్ ఫైనల్, ఐపీఎల్ ఫైనల్ అచ్చుగుద్దినట్లు ఒకేలా.. ఇలా ఎలా..!
క్రికెట్ గణాంకాలకు సంబంధించిన ఆట కాబట్టి అప్పుడప్పుడు ఒకే రకమైన గణాంకాలను చూడాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు మనం చూడబోయే గణాంకాలు మాత్రం క్రికెట్ అభిమానులకు ఫ్యూజులు ఎగిరిపోయేలా చేస్తున్నాయి. ఈ గణాంకాల ముందు యాదృచ్చికం అనే మాట చిన్నబోతుంది. అంతలా ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి ఈ గణాంకాలు.వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది జరిగిన మహిళల ఐపీఎల్ (డబ్ల్యూపీఎల్).. తాజాగా నిన్న ముగిసిన ఐపీఎల్కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది మార్చి 17న జరిగిన డబ్ల్యూపీఎల్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్లో ఢిల్లీ కెప్టెన్ (ఆసీస్ కెప్టెన్) టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్ల ధాటికి ఢిల్లీ 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో ఆర్సీబీ సైతం తడబడినా మరో మూడు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరగలిగింది. ఆ మ్యాచ్లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఫలితంగా భారతీయ ప్లేయరైన (టీ20 ఫార్మాట్లో భారత కెప్టెన్) స్మృతి మంధన నేతృత్వంలో ఆర్సీబీ తొలి సారి టైటిల్ కైవసం చేసుకుంది.ఐపీఎల్ 2024 ఫైనల్లోనూ అలాగే..నిన్న జరిగిన పురుషుల ఐపీఎల్ ఫైనల్లోనూ కొన్ని విషయాల్లో అచ్చుగుద్దినట్లు ఇలానే జరగడం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. కేకేఆర్తో నిన్న జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ కెప్టెన్ (ఆసీస్ కెప్టెన్) పాట్ కమిన్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మహిళల ఐపీఎల్లోనూ ఇలాగే ఆసీస్ కెప్టెన్ (మెగ్ లాన్నింగ్) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఐపీఎల్ ఫైనల్లో కమిన్స్ ప్రత్యర్ది భారత ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కాగా.. నాటి డబ్ల్యూపీఎల్ ఫైనల్లోనూ ఆసీస్ కెప్డెన్ (ఢిల్లీ కెప్టెన్) ప్రత్యర్ది భారత ప్లేయరే (మంధన).2024 WPL Final:- Aussie Captain Vs Indian captain.- Aussie captain took batting.- Team 113/10 in 18.3 overs.- Indian captain's team won by 8 wickets.IPL 2024 Final:- Aussie captain Vs Indian captain.- Aussie captain took batting.- Team 113/10 in 18.3 overs.- Indian… pic.twitter.com/jH07ZzmAEO— Mufaddal Vohra (@mufaddal_vohra) May 26, 2024ఐపీఎల్ 2024 ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ (ఆసీస్ కెప్టెన్) 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్ కాగా.. నాటి డబ్ల్యూపీఎల్ ఫైనల్లోనూ టాస్ గెలిచిన ఢిల్లీ (ఆసీస్ కెప్టెన్) 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. ఐపీఎల్ ఫైనల్లో భారత ప్లేయర్ అయిన శ్రేయస్.. ఆసీస్ కెప్టెన్ నేతృత్వంలోని సన్రైజర్స్ను 8 వికెట్ల తేడాతో ఓడగొట్టగా.. డబ్ల్యూపీఎల్ ఫైనల్లోనూ ఆసీస్ కెప్టెన్ లాన్నింగ్ నేతృత్వంలోని ఢిల్లీని భారత ప్లేయర్ సారథ్యంలోని ఆర్సీబీ అదే 8 వికెట్ల తేడాతోనే ఓడగొట్టింది. ఇన్ని విషయాల్లో ఈ ఏడాది డబ్ల్యూపీఎల్, ఐపీఎల్కు పోలికలు ఉండటంతో క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
IPL 2024: కేకేఆర్ వెనుక 'గంభీరం'
ఐపీఎల్ 2024 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ విజేతగా ఆవిర్భవించింది. నిన్న (మే 26) జరిగిన ఫైనల్లో ఈ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి మూడోసారి టైటిల్ను ఎగరేసుకుపోయింది. ఈ సీజన్లో ఆధ్యాంతం అద్భుత విజయాలు సాధించిన కేకేఆర్ ఫైనల్ మ్యాచ్లోనూ అన్ని రంగాల్లో సత్తా చాటి పదేళ్ల తర్వాత మరోసారి ఐపీఎల్ కిరీటాన్ని సొంతం చేసుకుంది.Shreyas Iyer handed the Trophy to Rinku Singh for celebration.- The Leader. 👌 pic.twitter.com/V8Pb55ZPQX— Johns. (@CricCrazyJohns) May 26, 2024ఆటగాళ్లతో సమానమైపాత్ర..ఈ సీజన్లో కేకేఆర్ విజయాల్లో ఆటగాళ్ల పాత్ర ఎంత ఉందో జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ పాత్ర కూడా అంతే ఉంది. ఈ సీజన్తోనే కేకేఆర్ మెంటార్గా బాధ్యతలు చేపట్టిన గంభీర్.. ఆ జట్టు సాధించిన ప్రతి విజయంలోనూ తనదైన ముద్ర వేశాడు.Third most successful IPL franchise in league history - KKR. pic.twitter.com/bYnKkbujXi— Johns. (@CricCrazyJohns) May 26, 2024పేరుకు తగ్గట్టుగానే గంభీరంగా..ఆన్ ఫీల్డ్ అయినా.. ఆఫ్ ద ఫీల్డ్ అయినా గంభీరంగా కనిపించే గంభీర్ పేరుకు తగ్గట్టుగానే కేకేఆర్ విజయాల్లో గంభీరమైన పాత్ర పోషించాడు. గంభీర్ తనకు మాత్రమే సాధ్యమైన సాహసోపేతమైన నిర్ణయాలతో కేకేఆర్ను గెలుపుబాట పట్టించాడు. గంభీర్ ఆధ్వర్యంలో కేకేఆర్ ఈ సీజన్లో కేవలం మూడు మ్యాచ్ల్లో మాత్రమే ఓడింది. Gautam Gambhir with IPL Trophy. ❤️ pic.twitter.com/LI2HLwEpiH— Johns. (@CricCrazyJohns) May 26, 2024నరైన్ సక్సెస్ వెనుక కూడా గంభీరుడే..సునీల్ నరైన్కు ఓపెనర్గా ప్రమోషన్ ఇచ్చి సత్ఫలితాలు రాబట్టిన ఘనత గంభీర్దే. అలాగే ఫైనల్స్ హీరో మిచెల్ స్టార్క్ను దక్కించుకోవడంలోనూ గంభీరే ప్రధానపాత్ర పోషించాడని అంతా అంటారు. యువ పేసర్లు హర్షిత్ రాణా, వైభవ్ అరోరాలను ప్రోత్సాహించడంలోనూ.. వెటరన్ ఆండ్రీ రసెల్ను వెనకేసుకురావడంలోనూ గంభీర్దే ప్రధానమైన పాత్ర. SUNIL NARINE - The MVP of IPL 2024. Greatest of KKR...!!!!! pic.twitter.com/1IBdxl1qRk— Johns. (@CricCrazyJohns) May 26, 2024శ్రేయస్ను వెన్నుతట్టి.. వెంకటేశ్పై విశ్వాసముంచి..శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్లపై విశ్వాసముంచి వారి నుంచి సత్ఫలితాలు రాబట్టిన ఘనత కూడా గంభీర్కే దక్కుతుంది. రింకూ సింగ్, రమన్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి లాంటి లోకల్ టాలెంట్లకు కూడా గంభీర్ అండగా నిలిచాడు. ఇలా ఏరకంగా చూసుకున్నా కేకేఆర్కు పూర్వవైభవం దక్కడంలో గంభీర్ పాత్ర ప్రధానమైందనడంలో ఎలాంటి సందేహాం లేదు.KKR players taking Gautam Gambhir in their shoulders. 👌 pic.twitter.com/XspysKKbiM— Johns. (@CricCrazyJohns) May 26, 2024సొంత అభిమానులచే ఛీత్కారాలు ఎదుర్కొన్న స్థాయి నుంచి..గడిచిన ఆరు సీజన్లలో పేలవ ప్రదర్శనతో సొంత అభిమానల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొన్న కేకేఆర్.. గంభీర్ రాకతో ఒక్కసారిగా నూతనోత్సాహాన్ని అందుకుని టైటిల్ ఎగరేసుకుపోయింది.షారుఖ్ పట్టుబట్టి మరీ..కేకేఆర్ సహ యజమాని షారుఖ్ ఖాన్ ఈ సీజన్ కోసం గంభీర్ను పట్టుబట్టి మరీ ఒప్పించి లక్నో సూపర్ జెయింట్స్ నుంచి పిలిపించుకున్నాడు. మెంటార్గా గంభీర్కు కేకేఆర్ కొత్తేమో కానీ ఆటగాడిగా, కెప్టెన్గా గంభీర్ కేకేఆర్ అభిమానులకు సుపరిచితుడు. ఈ సీజన్లో మెంటార్గా కేకేఆర్ను ఛాంపియన్గా నిలిపిన గంభీర్.. 2012, 2014 సీజన్లలో కెప్టెన్గా కేకేఆర్కు టైటిల్స్ అందించాడు. Gautam Gambhir & King of Indian Cinema Shah Rukh Khan with IPL Trophy 💜- The Frame for KKR legacy. pic.twitter.com/pfrFw9prKe— Johns. (@CricCrazyJohns) May 27, 2024కేకేఆర్ కెప్టెన్గా గంభీర్ ప్రస్తానం దీనితోనే ఆగిపోలేదు. గంభీర్ నేతృత్వంలో కేకేఆర్ 2016, 2017 సీజన్లలోనే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. దీనికి ముందు 2011 సీజన్లోనూ గంభీర్ సారథ్యంలో కేకేఆర్ ప్లే ఆఫ్స్కు చేరింది. కేకేఆర్ కెప్టెన్గా ఏడు సీజన్ల పాటు కొనసాగిన గంభీర్ ఈ జట్టును రెండుసార్లు ఛాంపియన్గా.. మూడు సీజన్లలో ప్లే ఆఫ్స్కు.. రెండు సీజన్లలో (2013, 2015) లీగ్ దశ వరకు విజయవంతంగా నడిపించాడు. తాజాగా మెంటార్గా బాధ్యతలు చేపట్టి తన ఆధ్వర్యంలో మూడోసారి కేకేఆర్ను ఛాంపియన్గా నిలిపాడు. Shah Rukh Khan kissing Gautam Gambhir 💜- SRK brings back Gambhir again and he has written a great comeback story. pic.twitter.com/gcAjm1S2Bh— Johns. (@CricCrazyJohns) May 26, 2024షారుఖ్ విశ్వాసాన్ని నిలుపుకున్నాడు..కేకేఆర్ బాస్ షారుఖ్కు తనపై అపార విశ్వాసమున్నట్లు గంభీరే స్వయంగా పలు సందర్భాల్లో చెప్పాడు. ఈ నమ్మకాన్ని నిలుపుకుంటూ గంభీర్ పదేళ్ల తర్వాత తిరిగొచ్చి కేకేఆర్కు టైటిల్ను అందించాడు. తాజాగా కేకేఆర్ టైటిల్ గెలిచిన అనంతరం షారుఖ్ ఖాన్ గంభీర్ నుదిటిపై ముద్దు పెట్టుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. దీనికి సంబంధించిన చిత్రాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. -
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే
ఐపీఎల్-2024లో కోల్కతా నైట్రైడర్స్ ఫైనల్కు చేరిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-1లో సన్రైజర్స్ హైదరాబాద్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసిన కేకేఆర్.. ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకుంది. ఈ విజయంతో కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో రెండు ఫ్రాంచైజీలను ఫైనల్కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్గా శ్రేయస్ రికార్డులకెక్కాడు. ఐపీఎల్ 2020 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ను సారథిగా శ్రేయస్ ఫైనల్కు చేర్చాడు. ఆ తర్వాత ఢిల్లీ ఫ్రాంచైజీ వదులుకోవడంతో కేకేఆర్ జట్టుతో జత కట్టిన అయ్యర్.. మరోసారి తన కెప్టెన్సీ మార్క్ చూపించి ఫైనల్కు తీసుకెళ్లాడు. దీంతో ఈ అరుదైన ఫీట్ను తన పేరిట లిఖించుకున్నాడు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఏ కెప్టెన్కు ఈ ఘనత సాధ్యం కాలేదు. కాగా ఈ ఏడాది సీజన్లో కేకేఆర్ను అయ్యర్ అద్భుతంగా నడిపించాడు. లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్ల్లో తొమ్మిదింట విజయాలతో పాయింట్ల పట్టికలో కేకేఆర్ను అగ్రస్ధానంలో నిలిపాడు. సన్రైజర్స్తో జరిగిన క్వాలిఫయర్-1లో శ్రేయస్ కెప్టెన్సీ పరంగా మాత్రమే కాకుండా బ్యాటింగ్లో కూడా దుమ్ములేపాడు.చదవండి: USA vs BAN: బంగ్లాకు షాకిచ్చిన పసికూన.. యూఎస్ఏ సంచలన విజయం -
IPL 2024 KKR Vs SRH: వాళ్ల వల్లే గెలిచాం.. ఫైనల్లోనూ మేమే: శ్రేయస్ అయ్యర్
‘‘చాలా చాలా సంతోషంగా ఉంది. జట్టులోని ప్రతి ఒక్కరు తమ వంతు పాత్రను సమర్థవంతంగా పోషించారు. మా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నాను. ఈరోజు మేము ఏం చేయగలమో అదే చేసి చూపించాం. కీలకమైన ఈ మ్యాచ్లో మా జట్టులోని ప్రతి ఒక్క బౌలర్ తమ బాధ్యతను నెరవేర్చారు.వరుసగా వికెట్లు తీస్తూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. ఇలాంటి వైవిధ్యమైన బౌలింగ్ లైనప్ ఉంటే కెప్టెన్ పని సులువవుతుంది. మా బౌలర్లంతా అద్భుతంగా రాణించారు. ఇక ముందు కూడా మా ప్రదర్శన ఇలాగే ఉంటుందని భావిస్తున్నా.ఈరోజు గుర్బాజ్ తన తొలి మ్యాచ్ ఆడాడు. ఓపెనర్గా మాకు శుభారంభమే అందించాడు. ఇదే జోరులో మరింత ముందుకు వెళ్లాలని పట్టుదలగా ఉన్నాం. ఫైనల్లోనూ మా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాం’’ అని కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు.ఐపీఎల్-2024లో తుదిపోరుకు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. కాగా లీగ్ దశలో పద్నాలుగింట తొమ్మిది విజయాలతో టాపర్గా నిలిచిన కేకేఆర్.. క్వాలిఫయర్-1లోనూ సత్తా చాటింది.అహ్మదాబాద్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో జయభేరి మోగించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్కు కేకేఆర్ బౌలర్లు ఆది నుంచే చుక్కలు చూపించారు.సీజన్ ఆసాంతం విధ్వంసకర బ్యాటింగ్తో విరుచుకుపడిన సన్రైజర్స్కు షాకిస్తూ 159 పరుగులకే కుప్పకూల్చారు. మిచెల్ స్టార్క్ అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి రెండు, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సునిల్ నరైన్, ఆండ్రీ రసెల్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.ఈ క్రమంలో నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్కు ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ 14 బంతుల్లో 23, సునిల్ నరైన్ 16 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేయగలిగారు.అయితే, వన్డౌన్లో వచ్చిన వెంకటేశ్ అయ్యర్, నాలుగో స్థానంలో వచ్చిన శ్రేయస్ అయ్యర్ సన్రైజర్స్ ఫీల్డర్ల తప్పిదాల కారణంగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆకాశమే హద్దుగా చెలరేగారు. వెంకటేశ్ 28 బంతుల్లో 51, శ్రేయస్ అయ్యర్ 24 బంతుల్లో 58 పరుగులతో దుమ్ములేపారు.వీరిద్దరి విజృంభణతో 13.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి కేకేఆర్ 164 పరుగులు సాధించింది. సన్రైజర్స్ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ ఫైనల్లో అడుగుపెట్టింది.ఈ విజయం పట్ల హర్షం వ్యక్తం చేసిన శ్రేయస్ అయ్యర్ జట్టు ప్రదర్శన పట్ల తాను ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపాడు. అదే విధంగా.. మైదానంలో వెంకటేశ్ అయ్యర్తో తన కమ్యూనికేషన్ గురించి చెబుతూ.. ‘‘నిజానికి నాకు తమిళ్ మాట్లాడటం రాదు. అయితే, ఎదుటివాళ్లు మాట్లాడింది అర్థం చేసుకోగలను. వెంకీ తమిళ్లోనే మాట్లాడతాడు. నేను అతడికి హిందీలో బదులిస్తాను’’ అని తెలిపాడు.What a memorable 𝗞𝗻𝗶𝗴𝗵𝘁 for the men in purple 💜Unbeaten half-centuries from Venkatesh Iyer 🤝 Shreyas IyerThe celebrations continue for the final-bound @KKRiders 😎Scorecard ▶️ https://t.co/U9jiBAlyXF#TATAIPL | #KKRvSRH | #Qualifier1 | #TheFinalCall pic.twitter.com/xBFp3Sskqq— IndianPremierLeague (@IPL) May 21, 2024 -
శ్రేయస్, ఇషాన్ల వేటు పడటానికి కారణం అతడే: జై షా
టీమిండియా స్టార్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్టులు కోల్పోవడానికి తాను కారణం కాదన్నాడు భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా. సెలక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడం మాత్రమే తన విధి అని తెలిపాడు.కాగా దక్షిణాఫ్రికా పర్యటన నుంచి మధ్యలోనే స్వదేశానికి తిరిగి వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్.. రంజీల్లో ఆడమని బోర్డు ఆదేశించినా లెక్కచేయలేదు. ఆ తర్వాత వెంటనే ఐపీఎల్-2024 కోసం ముంబై ఇండియన్స్ క్యాంపులో చేరాడు.మరోవైపు.. శ్రేయస్ అయ్యర్ సైతం రంజీల్లో ముంబై తరఫున బరిలోకి దిగకుండా ఫిట్నెస్ కారణాలు సాకుగా చూపాడు. అయితే, ఎన్సీఏ అలాంటిదేమీ లేదని కొట్టిపారేసింది. ఈ క్రమంలో తాజా సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో ఈ ఇద్దరి పేర్లు గల్లంతయ్యాయి.ఆ తర్వాత అయ్యర్ ముంబై తరఫున రంజీ బరిలో దిగినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో వీరిద్దరికి టీ20 వరల్డ్కప్-2024 జట్టులోనూ చోటు దక్కలేదు.అతడి నిర్ణయం ప్రకారమేఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్టులు కోల్పోయిన అంశంపై జై షా తాజాగా స్పందించాడు. ‘‘బీసీసీఐ రాజ్యాంగాన్ని గమనించండి.సెలక్షన్ మీటింగ్లో చర్చించిన విషయాల గురించి మీడియాకు తెలియజేసే కన్వీనర్ను మాత్రమే నేను.ఆ ఇద్దరిని దేశవాళీ క్రికెట్ ఆడాలని నిర్ణయించిందీ.. అదే విధంగా వారు చెప్పినట్లు వినలేదని సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి తప్పించిందీ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్.అతడు తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడమే నా పని. వాళ్లిద్దరు వెళ్లినా సంజూ శాంసన్ లాంటి వాళ్ల రూపంలో కొత్త ఆటగాళ్లకు చోటు దక్కింది కదా!’’ అని జై షా జాతీయ మీడియాతో వ్యాఖ్యానించాడు.అయ్యర్ అదుర్స్... ఇషాన్ ఫెయిల్కాగా ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం ఐపీఎల్-2024తో బిజీగా ఉన్నారు. ముంబై ఇండియన్స్ తరఫున ఓపెనర్గా వస్తున్న ఇషాన్ ఇప్పటి వరకు 12 ఇన్నింగ్స్లో కలిపి 266 పరుగులు మాత్రమే చేశాడు.మరోవైపు కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రం 11 ఇన్నింగ్స్లో 280 పరుగులు చేయడంతో పాటు.. ఈ సీజన్లో జట్టును ప్లే ఆఫ్స్ చేరిన మొదటి జట్టుగా నిలిపే పనిలో ఉన్నాడు. చదవండి: ద్రవిడ్ గుడ్ బై!.. టీమిండియా కొత్త కోచ్గా ఫారినర్?.. జై షా కామెంట్స్ వైరల్ -
హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
టీమిండియా భవిష్య కెప్టెన్ గురించి బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ తర్వాత భారత జట్టు సారథిగా పగ్గాలు చేపట్టగల అర్హత అతడికే ఉందంటూ ఓ ముంబైకర్ పేరు చెప్పాడు.కాగా టీ20 ప్రపంచకప్-2021 తర్వాత విరాట్ కోహ్లి స్థానంలో రోహిత్ శర్మను కెప్టెన్ను చేసింది బీసీసీఐ. హిట్మ్యాన్ సారథ్యంలో అన్ని ఫార్మాట్లలో ఏక కాలంలో నంబన్ వన్గా నిలిచిన టీమిండియా.. ఐసీసీ టోర్నీల్లో మాత్రం సత్తా చాటలేకపోయింది.ఫైనల్ వరకూ వచ్చినా టీ20 ప్రపంచకప్-2022లో సెమీస్లోనే నిష్క్రమించిన రోహిత్ సేన.. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో ఓడి ట్రోఫీని ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. అదే విధంగా.. సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్-2023లోనూ విజయ లాంఛనం పూర్తి చేయలేక.. ఆస్ట్రేలియా చేతిలో ఓడి ఆఖరి మెట్టుపై టైటిల్ను చేజార్చుకుంది.ఇక ఇప్పుడు మరో మెగా టోర్నీకి టీమిండియా సిద్ధమవుతోంది. పొట్టి ఫార్మాట్లో వరల్డ్కప్ ఈవెంట్కు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రోహిత్ శర్మ నాయకత్వంలోని పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది.ఇందులో మిడిలార్డర్ బ్యాటర్, క్రమశిక్షణా చర్యల నేపథ్యంలో సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్కు మాత్రం చోటు దక్కలేదు. అయితే, ఐపీఎల్-2024లో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్గా మాత్రం అయ్యర్ దూసుకుపోతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్లలో కేకేఆర్ ఎనిమిది గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎమ్ఎస్కే ప్రసాద్ అయ్యర్ కెప్టెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలా కాదు. ‘‘హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలా కాదు.. శ్రేయస్ అయ్యర్ను టీమిండియా తదుపరి కెప్టెన్గా తీర్చిదిద్దబడ్డాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ క్రమపద్ధతిలో సారథిగా ఎదిగేందుకు బాటలు వేసుకున్నాడు.గత రెండేళ్లలో అతడి గణాంకాలు అద్బుతం. ఇక ఇండియా-ఏ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. నాకు తెలిసి ఇండియా- ఏ ఆడిన 10 సిరీస్లలో ఎనిమిది గెలిచింది. అందులో ఎక్కువసార్లు భారత జట్టును ముందుకు నడిపింది శ్రేయస్ అయ్యరే!టీమిండియా తదుపరి కెప్టెన్గా అతడు తయారుచేయబడ్డాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ తర్వాత సారథిగా రిషభ్ పంత్తో శ్రేయస్ అయ్యర్ పోటీపడుతున్నాడు. పంత్ కంటే ముందే..నిజానికి పంత్ కంటే కూడా శ్రేయస్ అయ్యర్ ఒక అడుగు ముందే ఉన్నాడని చెప్పవచ్చు’’ అని రెవ్స్ట్పోర్ట్స్తో ఎంఎస్కే ప్రసాద్ వ్యాఖ్యానించాడు. అయితే, ఇదంతా గతం. బీసీసీఐతో విభేదాల నేపథ్యంలో అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోవడంతో ఇప్పుడు జట్టులో స్థానం గురించి పోటీ పడాల్సిన పరిస్థితి.చదవండి: ‘SRH అని ఎవరన్నారు?.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’ -
సహనం కోల్పోయిన గంభీర్... అంపైర్తో గొడవ! ఆఖరికి..
పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా కోల్కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతం గంభీర్ సహనం కోల్పోయాడు. ఆన్ ఫీల్డ్ అంపైర్ల నిర్ణయం వల్ల తమకు అన్యాయం జరిగిందంటూ ఫోర్త్ అంపైర్తో వాగ్వాదానికి దిగాడు. ఐపీఎల్-2024లో భాగంగా కేకేఆర్ శుక్రవారం పంజాబ్ కింగ్స్తో తలపడింది. సొంతగడ్డపై టాస్ ఓడిన కోల్కతా తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 261 పరుగుల భారీ స్కోరు సాధించింది.ఓవర్ త్రో.. ఓ సింగిల్అయితే, కేకేఆర్ ఇన్నింగ్స్ 14వ ఓవర్ సందర్భంగా గౌతం గంభీర్ తీవ్ర అసహానికి గురయ్యాడు. పద్నాలుగో ఓవర్లో పంజాబ్ స్పిన్నర్ రాహుల్ చహర్ ఆఖరి బంతిని అవుట్ సైడాఫ్ దిశగా షార్ట్బాల్గా సంధించాడు. అప్పుడు క్రీజులో ఉన్న ఆండ్రీ రసెల్ ఆ బంతిని కవర్స్ మీదుగా షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.ఈ క్రమంలో ఫీల్డర్ అశుతోష్ శర్మ ఇన్సైడ్ సర్కిల్లోనే బంతిని ఆపేసి.. వికెట్ కీపర్ జితేశ్ శర్మ వైపునకు విసిరాడు. అయితే, అది ఓవర్ త్రో అయింది. దీంతో మరో ఎండ్లో ఉన్న వెంకటేశ్ అయ్యర్ను పిలిచి రసెల్ సింగిల్ తీశాడు. పరుగు ఇవ్వడం కుదరదుకానీ ఆన్ ఫీల్డ్ అంపైర్ అనిల్ చౌదరి ఈ సింగిల్ను పరుగుల ఖాతాలో చేర్చేందుకు నిరాకరించాడు. అశుతోశ్ బంతిని ఆపేసిన తర్వాత.. తాను తాను ఓవర్ పూర్తైందని కాల్ ఇచ్చానని.. కాబట్టి ఈ ఓవర్ త్రో కారణంగా వచ్చిన పరుగు లెక్కలోకి రాదని స్పష్టం చేశాడు.ఇందుకు రసెల్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే, డగౌట్లో ఉన్న కేకేఆర్ మెంటార్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కలిసి వారికి సమీపంలో ఉన్న ఫోర్త్ అంపైర్ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో గంభీర్ ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఫోర్త్ అంపైర్తో వాదించాడు.pic.twitter.com/eICqVXG8kE— Nihari Korma (@NihariVsKorma) April 27, 2024అంపైర్తో గంభీర్ వాదనఅయితే, అతడి నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో గౌతీ ముఖం మాడ్చుకుని అసంతృప్తిగా పక్కకు వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.ఇదిలా ఉంటే.. కేకేఆర్ విధించిన 262 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 18.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి ఛేదించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జానీ బెయిర్ స్టో అజేయ విధ్వంసకర శతకం(48 బంతుల్లో 108)తో పంజాబ్ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.చదవండి: KKR vs PBKS: టీ20లలో సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో ఇదే తొలిసారి.@PunjabKingsIPL are roaring again 🦁A special victory at the Eden Gardens for #PBKS who secure the highest successful run chase in the IPL and T20s ❤️Scorecard ▶️ https://t.co/T9DxmbgIWu#TATAIPL | #KKRvPBKS pic.twitter.com/FNxVD8ZeW6— IndianPremierLeague (@IPL) April 26, 2024 -
శ్రేయస్ అయ్యర్కు దెబ్బ మీద దెబ్బ! మరో షాక్..
ఓటమి బాధలో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు మరో షాక్ తగిలింది. నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా అతడికి భారత క్రికెట్ నియంత్రణ మండలి భారీ జరిమానా విధించింది. ఇందుకు సంబంధించి ఐపీఎల్ నిర్వాహకులు బుధవారం ప్రకటన విడుదల చేశారు. కాగా ఐపీఎల్-2024లో భాగంగా సొంతమైదానం ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్ మంగళవారం రాజస్తాన్ రాయల్స్తో తలపడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అయ్యర్ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే, లక్ష్య ఛేదనలో ఆఖరి బంతి వరకు పోరాడినా రాజస్తాన్ రాయల్స్ జోస్ బట్లర్ వీరోచిత సెంచరీ కారణంగా ఓటమిని మూటగట్టుకుంది. రెండు వికెట్ల తేడాతో ఓడిపోయి పరాజయం పాలైంది. నిజానికి.. కేకేఆర్ రాజస్తాన్ను నిలువరిస్తుందనే అంతా అనుకున్నారు. కొంప ముంచి స్లో ఓవర్ రేటు కానీ స్లో ఓవర్ రేటు కేకేఆర్ కొంపముంచింది. నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున ఆఖరి ఓవర్లో 30 యార్డ్ సర్కిల్ ఆవల కేవలం నలుగురు ఫీల్డర్లనే ఉంచాల్సి వచ్చింది. దీనిని సద్వినియోగం చేసుకున్న బట్లర్ మొదటి బంతికే సిక్సర్ బాదాడు. ఓటమితో పాటు మరో షాక్ కూడా అనంతరం మూడు బంతుల్లో విజయ సమీకరణం ఐదు పరుగులు కాగా.. చివరి బంతికి సింగిల్ తీసి రాజస్తాన్ విజయలాంఛనం పూర్తి చేశాడు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే స్లో ఓవర్ రేటు కారణంగా కేకేఆర్ మ్యాచ్ ఓడిపోగా.. నిర్ణీత సమయంలో బౌలింగ్ పూర్తి చేయనందున కోల్కతా సారథి శ్రేయస్ అయ్యర్కు బీసీసీఐ రూ. 12 లక్షల జరిమానా విధించింది. ఇది మొదటి తప్పు కాబట్టి ఈ మేర ఫైన్తో సరిపెట్టినట్లు తెలిపింది. కాగా ఐపీఎల్-2024లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్లలో నాలుగు గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. చదవండి: ఈసారి టైటిల్ సన్రైజర్స్దే!.. రిక్కీ పాంటింగ్ కామెంట్స్ వైరల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం.. అందుకే వరుణ్ చేతికి బంతి!
రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నామని కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ మ్యాచ్ ఆద్యంతం తమను భావోద్వేగాల డోలికలో ఊగిసలాడేలా చేసిందని.. కానీ తమకు ఈ పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదన్నాడు. ఏదేమైనా ఈ ఓటమిని అంగీకరించక తప్పదన్న శ్రేయస్.. టోర్నీ మధ్యలో ఇలాంటి అనుభవం ఎదురుకావడం ఒక రకంగా మంచిదైందని పేర్కొన్నాడు. లోపాలు సరిచేసుకుని రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగే వీలుంటుందన్నాడు. ఇక ఈ మ్యాచ్లో అద్బుతంగా రాణించిన సునిల్ నరైన్ గురించి ప్రస్తావిస్తూ.. కేకేఆర్కు దొరికిన అత్యంత విలువైన ఆస్తి నరైన్ అని ప్రశంసించాడు. అదే విధంగా ఆఖరి ఓవర్లో బంతిని కావాలనే వరుణ్ చక్రవర్తికి ఇచ్చానన్న శ్రేయస్ అయ్యర్.. ఫలితం రాబట్టలేకపోయానని విచారం వ్యక్తం చేశాడు. On Display: 𝗘𝗳𝗳𝗼𝗿𝘁𝗹𝗲𝘀𝘀 𝗛𝗶𝘁𝘁𝗶𝗻𝗴 😍 Sunil Narine smacking it with perfection👌👌 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #KKRvRR | @KKRiders pic.twitter.com/yXC3F5r1SY — IndianPremierLeague (@IPL) April 16, 2024 అందుకే వరుణ్ చేతికి బంతి జోస్ బట్లర్ను నిలువరించేందుకు తాము అనుసరించి వ్యూహాలు ఫలించలేదని పేర్కొన్నాడు. కచ్చితంగా గెలుస్తామనుకున్న మ్యాచ్లో ఓడిపోవడం బాధగా ఉందని శ్రేయస్ అయ్యర్ అసంతృప్తిని వెళ్లగక్కాడు. అయితే ఓటమినే తలచుకుంటూ కూర్చోలేమని.. తదుపరి మ్యాచ్ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతామని శ్రేయస్ అయ్యర్ ఈ సందర్భంగా తెలిపాడు. కాగా ఐపీఎల్-2024లో భాగంగా సొంతమైదానంలో కేకేఆర్కు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ఈడెన్ గార్డెన్స్లో రాజస్తాన్ రాయల్స్తో చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో కోల్కతా రెండు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఇక ఈ సీజన్లో కేకేఆర్కు ఇది రెండో ఓటమి. An Impactful Innings 😍 🔝 class effort from a 🔝 player ft. Jos Buttler Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #KKRvRR | @rajasthanroyals pic.twitter.com/5vz2qLIC7Z — IndianPremierLeague (@IPL) April 16, 2024 నరైన్ సుడిగాలి ఇన్నింగ్స్ వృథా ఇక ఈ మ్యాచ్లో కేకేఆర్ ఆల్రౌండర్ సునిల్ నరైన్ 56 బంతుల్లో 13 ఫోర్లు, ఆరు సిక్స్ల సాయంతో 109 పరుగులు సాధించాడు. అదే విధంగా.. రెండు వికెట్లు కూడా పడగొట్టాడు ఈ స్పిన్ ఆల్రౌండర్. అయితే, రాయల్స్ స్టార్ జోస్ బట్లర్ అజేయ శతకం కారణంగా నరైన్సుడిగాలి ఇన్నింగ్స్ వృథాగా పోయింది. వాళ్లిద్దరి వల్లే ఓటమి 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 14 ఓవర్ల తర్వాత రాజస్తాన్ ఆరు వికెట్లు నష్టపోయి కేవలం 128 పరుగులకే పరిమితమైన వేళ బట్లర, రోవ్మన్ పావెల్తో కలిసి దూకుడుగా ఆడాడు. పావెల్ మెరుపు ఇన్నింగ్స్(13 బంతుల్లో 26)తో ఆకట్టుకోగా.. సెంచరీ వీరుడు బట్లర్(60 బంతుల్లో 107) ఆఖరి ఓవర్లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఆఖరి బంతికి సింగిల్ తీసి రాజస్తాన్ను గెలుపుతీరాలకు చేర్చాడు. అలా నమ్మశక్యంకాని రీతిలో కేకేఆర్ ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కేకేఆర్ సారథి శ్రేయస్ అయ్యర్ పైవిధంగా స్పందించాడు. బట్లర్, రోవ్మన్ పావెల్ అద్భుతంగా ఆడారని వారిద్దరికి క్రెడిట్ ఇచ్చాడు. చదవండి: ఐపీఎల్ చరిత్రలో తొలి జట్టుగా రాజస్తాన్ ఆల్టైమ్ రికార్డు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆ అమ్మాయి కోసం చాలా ఎదురుచూశాను.. శ్రేయస్ అయ్యర్
ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్ చేసిన ద గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కలిసి పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో హిట్మ్యాన్, శ్రేయస్ అభిమానులకు తెలియని చాలా విషయాలను షేర్ చేసుకున్నారు. కపిల్ శర్మ ప్రశ్నలు అడుగుండగా.. వీరిద్దరు తమదైన శైలిలో సమాధానాలు చెబుతూ నవ్వులు పూయించారు. ఆధ్యాంతం ఉల్లాసభరింతగా సాగిన ఈ షో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఆ అమ్మాయి మెసేజ్ కోసం ఎదురుచూశాను.. స్టేడియంలో మహిళా అభిమానులపై కెమెరామెన్ల ఫోకస్ అనే అంశంపై చర్చ జరుగుతుండగా శ్రేయస్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. నా తొలి ఐపీఎల్ సీజన్లో ఓ అందమైన అమ్మాయిని చూశాను. స్టాండ్స్లో కూర్చుకున్న ఆ అమ్మాయివైపు చేయి ఊపుతూ హలో చెప్పాను. ఆ సమయంలో ఫేస్బుక్ చాలా పాపులర్గా ఉండేది. అందులో ఆ అమ్మాయి రిప్లై ఇస్తుందేమో అని చాలా ఎదురుచూశానని శ్రేయస్ తన తొలి క్రష్ గురించి చెప్పుకొచ్చాడు. శ్రేయస్ ఈ విషయం గురించి చెప్పగానే షోకు హాజరైన వారంతా ఓకొడుతూ సౌండ్లు చేశారు. ఇదే షోలో శ్రేయస్ మరిన్ని విషయాలు కూడా పంచుకున్నాడు. తన ఆరాధ్య క్రికెటర్ రోహిత్ శర్మ అని, అతను టీమిండియా కెప్టెన్ అయినందుకు ఈ మాట చెప్పడం లేదని అన్నాడు. సహచరులతో రోహిత్ చాలా నాటు స్టయిల్లో మాట్లాడతాడని శ్రేయస్ చెప్పగా.. రోహిత్ కూడా శ్రేయస్పై ఇదే కంప్లైంట్ చేశాడు. ఇదిలా ఉంటే రోహిత్, శ్రేయస్ ప్రస్తుతం ఐపీఎల్ 2024తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో రోహిత్ ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ నాలుగు మ్యాచ్ల్లో ఒకే ఒక విజయంతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉండగా.. శ్రేయస్ నాయకత్వంలోని కేకేఆర్ 4 మ్యాచ్ల్లో 3 విజయాలతో రెండో స్థానంలో నిలిచింది. -
ఆ ఇద్దరితో రూమ్ అస్సలు షేర్ చేసుకోను: రోహిత్ శర్మ
ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్ చేసిన ద గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కపిల్.. హిట్మ్యాన్, శ్రేయస్లను పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగాడు. వీటికి రోహిత్, శ్రేయస్ తమదైన శైలిలో బదులిచ్చారు. ఈ సందర్భంగా రోహిత్, శ్రేయస్ అభిమానులకు తెలియని చాలా విషయాలను షేర్ చేసుకున్నారు. ఆధ్యాంతం ఉల్లాసభరింతగా సాగిన ఈ షో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఆ ఇద్దరు పరమ గలీజ్గాళ్లు.. షో సందర్భంగా కపిల్ హిట్మ్యాన్తో సంభాషిస్తూ ఓ ఆసక్తికర ప్రశ్నను అడిగాడు. రూమ్ షేర్ చేసుకోవాల్సి వస్తే ఎవరితో కలసి షేర్ చేసుకుంటారని రోహిత్ను అడిగాడు. ఇందుకు రోహిత్ బదులిస్తూ.. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ప్రత్యేక గది కేటాయిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రూమ్ షేర్ చేసుకోవాల్సి వస్తే శిఖర్ ధవన్, రిషబ్ పంత్లతో మాత్రం అస్సలు ఉండనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. ఆ ఇద్దరు గదిని చాలా మురికిగా ఉంచుతారు. ప్రాక్టీస్ నుంచి వచ్చాక బట్టలను మంచంపైనే పడేస్తారు. వారి గది తలపుపై ఎప్పుడూ డు నాట్ డిస్టర్బ్ (DOD) అనే బోర్డు దర్శనమిస్తుంది. ఈ ఇద్దరు మధ్యాహ్నం ఒంటి గంట వరకు పడుకుంటారు. ఉదయమే రూమ్ క్లీనింగ్కు వచ్చే వాళ్లు DOD బోర్డును చూసి వెనక్కు వెళ్లిపోతారు. మూడు నాలుగు రోజుల వరకు వాళ్ల రూమ్ చండాలంగా ఉంటుంది. ఈ కారణంగా వీళ్లతో రూమ్ షేర్ చేసుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడరు. నేను కూడా వారితో ఉండాలని అస్సలు అనుకోనంటూ హిట్మ్యాన్ బదులిచ్చాడు. ఇదే సందర్భంగా రోహిత్ మరిన్ని విషయాలను కూడా షేర్ చేసుకున్నాడు. వన్డే వరల్డ్కప్ ఫైనల్లో ఓటమి అనంతరం అభిమానుల కోపానికి గురవుతానని భయపడ్డానని తెలిపాడు. కానీ ప్రజలు తమను బాగా ఆడామని ప్రశంసించడంతో ఊపిరి పీల్చుకున్నామని అన్నాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 7) ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ (మధ్యాహ్నం 3:30).. లక్నో-గుజరాత్ (రాత్రి 7:30) తలపడుతున్నాయి. -
IPL 2024 : విశాఖలో నేడు ఢిల్లీ vs కోల్కతా (ఫొటోలు)
-
#KKR: ఆర్సీబీపై మా విజయానికి కారణం అదే: అయ్యర్
చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారించిన కోల్కతా నైట్ రైడర్స్ ఆల్రౌండర్ సునిల్ నరైన్పై ఆ జట్టు సారథి శ్రేయస్ అయ్యర్ ప్రశంసలు కురిపించాడు. ఓపెనర్గా వచ్చి తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడని కొనియాడాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టు గొప్ప ఆరంభం అందించాడని పేర్కొన్నాడు. ఐపీఎల్-2024లో భాగంగా కేకేఆర్ శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 182 పరుగులు చేసింది. అయితే, ఆరంభంలో బౌలర్లకు కాస్త అనుకూలించిన బెంగళూరు పిచ్పై.. సెకండాఫ్లో బ్యాటర్లు రెచ్చిపోయారు. ఆర్సీబీ విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేకేఆర్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(20 బంతుల్లో 30) మెరుగ్గా రాణించగా.. మరో ఓపెనర్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సునిల్ నరైన్ ధనాధన్ ఇన్నింగ్స్తో దంచికొట్టాడు. 22 బంతులు ఎదుర్కొన్న ఈ బౌలింగ్ ఆల్రౌండర్ 2 ఫోర్లు, 5 సిక్స్ల సాయంతో 47 పరుగులు చేశాడు. A quick-fire 47 off just 22 deliveries 💥💥 An entertaining opening act from Sunil Narine comes to an end 👏👏 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvKKR pic.twitter.com/s0dNMzrL80 — IndianPremierLeague (@IPL) March 29, 2024 ఇక వన్డౌన్లో వచ్చిన వెంకటేశ్ అయ్యర్ 30 బంతుల్లోనే యాభై పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆఖర్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 39, రింకూ సింగ్ 5 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. 16.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన కేకేఆర్ ఆర్సీబీపై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా పదిహేడో ఎడిషన్లో వరుసగా రెండో గెలుపు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టు ఆట తీరుపై హర్షం వ్యక్తం చేశాడు. వికెట్ బౌలర్లకు పెద్దగా అనుకూలించడం లేదని ఆండ్రీ రసెల్ చెప్పాడని.. పిచ్ పరిస్థితులను సరిగ్గా అంచనా వేసి తమకు సూచనలు ఇచ్చాడని తెలిపాడు. ఈ క్రమంలో సునిల్ నరైన్ను ఓపెనర్గా పంపాలా వద్దా అన్న అంశంపై చర్చలు జరిపామని.. ఆఖరికి ఓపెనర్గానే బరిలోకి దించామని పేర్కొన్నాడు. జట్టులో తన పాత్ర ఏమిటో నరైన్కు స్పష్టంగా తెలుసని అయ్యర్ పేర్కొన్నాడు. కాగా ఆర్సీబీతో మ్యాచ్లో రసెల్ నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి 29 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. మరోవైపు నరైన్ 4 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. Venkatesh F-IYER 🔥🔥 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvKKR pic.twitter.com/2EeUvGTR8J — IndianPremierLeague (@IPL) March 29, 2024 ఇక వరుసగా రెండో గెలుపుపై స్పందిస్తూ.. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని.. టోర్నీలో మున్ముందు ఇంకెన్నో సాధించాల్సి ఉందని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. కాగా కేకేఆర్ తదుపరి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. విశాఖపట్నంలో బుధవారం ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. చదవండి: #Kohli: పాపం.. కోహ్లి ఒక్కడు ఏం చేయగలడు? -
IPL 2024 RCB Vs KKR Pics: ఆర్సీబీపై నైట్రైడర్స్ అలవోక విజయం (ఫొటోలు)
-
హోలీ సంబురాల్లో మునిగి తేలిన ఐపీఎల్ హీరోలు.. కోహ్లి మాత్రం అలా..!
హోలీ పర్వదినాన ఐపీఎల్ క్రికెటర్లు రంగుల సంబురాల్లో మునిగి తేలారు. ఇవాళ ఉదయం నుంచి చాలా మంది క్రికెటర్లు ఉత్సాహంగా హోలీ సంబురాలు చేసుకున్నారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ సహచరులతో కలిసి రంగుల పూసుకుని నీటితో సంబురాలు చేసుకోగా, మరో ముంబై ఇండియన్ సూర్యకుమార్ యాదవ్ తన శ్రీమతితో కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. Rohit Sharma celebrating Holi with his family & MI team mates. ⭐https://t.co/Kc645b7DOV— Johns. (@CricCrazyJohns) March 25, 2024 The Hitman Rohit Sharma celebrating Holi. pic.twitter.com/kHaTPPQANf — CricketMAN2 (@ImTanujSingh) March 25, 2024 Gautam Gambhir and Shreyas Iyer celebrating Holi. pic.twitter.com/dWnjdSiOaz — CricketMAN2 (@ImTanujSingh) March 25, 2024 కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఆ జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ ముఖానికి రంగులు పూసుకుని ఫోటోలకు పోజులివ్వగా.. ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు పృథ్వీ షా ముఖం నిండా రంగులు పూసుకుని తన ఐపీఎల్ సహచరులతో కలిసి సెల్ఫీ దిగాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రావో నగరంలో జరిగిన హోలీ సంబురాల్లో పాల్గొని తన ఆటపాటలతో అభిమానులను అలరించాడు. Captain Shreyas Iyer and KKR players celebrating Holi.pic.twitter.com/L5WldKccF3 — Mufaddal Vohra (@mufaddal_vohra) March 25, 2024 Delhi Capitals' players celebrating Holi. pic.twitter.com/lqRn9RvLAe — CricketMAN2 (@ImTanujSingh) March 25, 2024 VIRAT KOHLI RETURNS AT CHINNASWAMY TODAY. - The GOAT is Ready to Roar..!!!! 🐐 pic.twitter.com/xpHsedcuzD — CricketMAN2 (@ImTanujSingh) March 25, 2024 ఐపీఎల్ కామెంటేటర్లు స్టీవ్ స్మిత్, స్టువర్ట్ బ్రాడ్ భారత సంప్రదాయ దుస్తులు ధరించి హోలీ సంబురాలు చేసుకుంటూ ఫోటోలకు పోజులిచ్చారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో తరహాలో హోలీ సంబురాలు చేసుకోగా.. ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి మాత్రం ప్రాక్టీస్లో మునిగి తేలాడు. Suryakumar Yadav with his wife celebrating Holi. pic.twitter.com/46ltjxTnBG — CricketMAN2 (@ImTanujSingh) March 25, 2024 Dwayne Bravo at the Holi Celebrations in Chennai. ❤️pic.twitter.com/27PWVB0rwj — CricketMAN2 (@ImTanujSingh) March 25, 2024 ఆర్సీబీకి ఇవాళ మ్యాచ్ ఉండటంతో కోహ్లి హోలీ సంబురాలు చేసుకున్నట్లు లేడు. ఆర్సీబీ తమ హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. పంజాబ్ తమ తొలి మ్యాచ్లో ఢిల్లీను ఓడించి బోణీ విజయం సొంతం చేసుకోగా.. తొలి మ్యాచ్లో సీఎస్కే చేతిలో ఓడిన ఆర్సీబీ ఖాతా తెరవాల్సి ఉంది. -
KKR Vs SRH: టీమిండియాలో తుస్సుమన్పించాడు.. ఇక్కడ కూడా! ఇక నీ పని అంతే
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో విఫలమై జట్టులో చోటు కోల్పోయిన అయ్యర్.. ఇప్పుడు ఐపీఎల్-2024లోనూ అదే తీరును కనబరిచాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ దారుణంగా విఫలమయ్యాడు. కేకేఆర్ కెప్టెన్గా బరిలోకి దిగిన అయ్యర్.. డకౌట్గా వెనుదిరిగాడు. కేవలం రెండు బంతులు ఎదుర్కొన్న అయ్యర్.. ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. నటరాజన్ బౌలింగ్లో కమ్మిన్స్కు క్యాచ్ ఇచ్చి అయ్యర్ ఔటయ్యాడు. ఈ క్రమలో అయ్యర్ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఈ చెత్త ఆటతో భారత జట్టులోకి ఎంట్రీ కష్టమేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా అయ్యర్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ను సైతం కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఎస్ఆర్హెచ్పై 4 పరుగుల తేడాతో కేకేఆర్ విజయం సాధించింది. 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో ఎస్ఆర్హెచ్ విజయానికి 13 పరుగులు అవసరమయ్యాయి. ఎస్ఆర్హెచ్ 7 పరుగులు మాత్రమే చేయడంతో సన్రైజర్స్ పరాజయం పాలైంది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో హెన్రిస్ క్లాసెన్(29 బంతుల్లో 63) విరోచిత పోరాటం చేశాడు. -
SRH Vs KKR: తుదిజట్టులో వీరికే చోటు!.. పైచేయి ఎవరిదంటే?
గత మూడేళ్లుగా పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం కోసం పోటీ పడుతందా అన్నట్లుగా ఉంది సన్రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి. 2016లో టైటిల్ గెలిచిన రైజర్స్ ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో రాణించలేకపోయింది. తొలి టైటిల్ అందించిన డేవిడ్ వార్నర్ పుణ్యమా అని 2020లో మూడో స్థానంతో ముగించినా.. ఆ తర్వాత వరుసగా ఎనిమిది, ఎనిమిది, పది స్థానాల్లో నిలిచి విమర్శలు మూటగట్టుకుంది. ఇప్పుడిక ఐపీఎల్-2024 సమరానికి సిద్ధమైంది. కొత్త కోచ్ డేనియల్ వెటోరీ మార్గదర్శనం, కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలో ప్రయాణం మొదలుపెట్టనుంది. ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్తో శనివారం నాటి మ్యాచ్తో ఈ సీజన్ను ఆరంభించనుంది. మరోవైపు.. ఐపీఎల్-2023 మొత్తానికి దూరమైన కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్తో పునరాగమనం చేయనున్నాడు. టీమిండియా మాజీ ఓపెనర్, రెండుసార్లు కోల్కతాను విజేతగా నిలిపిన గౌతం గంభీర్ కేకేఆర్ మెంటార్ అవతారంలో కనిపించనున్నాడు. మరి ఈ పోరులో ఎవరిది పైచేయి అవుతుందో!? ఇరు జట్ల అంచనా, ముఖాముఖి రికార్డులు గమనిద్దామా?! ముఖాముఖి రికార్డులు ఎస్ఆర్హెచ్- కేకేఆర్ ఇప్పటి వరకు 25సార్లు ఎదురుపడగా.. కేకేఆర్ 16 మ్యాచ్లలో గెలవగా.. రైజర్స్ కేవలం తొమ్మిదిసార్లు మాత్రమే విజయం సాధించింది. గత ఏడు మ్యాచ్లలో రైజర్స్ కేవలం రెండుసార్లు గెలవగా.. కేకేఆర్ ఐదుసార్లు పైచేయి సాధించింది. ►2023 – 23 పరుగుల తేడాతో సన్రైజర్స్ గెలుపు ►2023 – 5 పరుగుల తేడాతో కేకేఆర్ విజయం ►2022 – 7 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ గెలుపు ►2022 – 54 పరుగుల తేడాతో కేకేఆర్ జయభేరి ►2021 – 10 పరుగుల తేడాతో కేకేఆర్ గెలుపు ►2021 – ఆరు వికెట్ల తేడాతో కేకేఆర్ విజయం ►2020 – ఏడు వికెట్ల తేడాతో కేకేఆర్ గెలుపు సన్రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టు(అంచనా) మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రమ్ , హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), ఉపేంద్ర యాదవ్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), అభిషేక్ శర్మ, ఉమ్రాన్ మాలిక్, టి.నటరాజన్, భువనేశ్వర్ కుమార్. కోల్కతా నైట్ రైడర్స్ తుదిజట్టు(అంచనా) ఫిల్ సాల్ట్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, రహ్మనుల్లా గుర్బాజ్. చదవండి: IPL 2024: ఆర్సీబీతో మ్యాచ్ అంటే శివాలెత్తిపోతాడు.. ఇప్పటికీ మేము నాటౌట్! -
IPL 2024: బీసీసీఐ వేటుపై శ్రేయస్ అయ్యర్ స్పందన
ప్రస్తుతం తాను ఆటపై మాత్రమే దృష్టి పెట్టాలనుకుంటున్నానని కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. గతం గురించి ఎక్కువగా ఆలోచించి సమయం వృథా చేయాలనుకోవడం లేదని పేర్కొన్నాడు. ఎన్నో ఏళ్లుగా ఐపీఎల్ ఆడుతున్నానని.. పదిహేడో ఎడిషన్కు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యానని తెలిపాడు. కాగా గత కొన్ని రోజులుగా శ్రేయస్ అయ్యర్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో బీసీసీఐ ఈ టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ను వార్షిక కాంట్రాక్టు నుంచి తప్పించింది. గాయం తీవ్రత ఎక్కువగా లేదని జాతీయ క్రికెట్ అకాడమీ వైద్యులు చెప్పినా.. గాయాన్ని సాకుగా చూపి రంజీ బరిలో దిగలేదని వేటువేసింది. ఆ తర్వాత మళ్లీ ముంబై జట్టు తరఫున రీఎంట్రీ ఇచ్చిన అయ్యర్.. రంజీ ట్రోఫీ 2023-23 ఫైనల్లో 95 పరుగులతో సత్తా చాటాడు. ఇక ఇప్పుడు ఫిట్నెస్ సాధించి ఐపీఎల్-2024లో సన్రైజర్స్ హైదరాబాద్తో శనివారం నాటి మ్యాచ్లో కేకేఆర్ కెప్టెన్గా మైదానంలో దిగనున్నాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శ్రేయస్ అయ్యర్ తనపై జరుగుతున్న ప్రచారాలపై స్పందించాడు. ‘‘ఆ డాక్టర్ ఏం చెప్పాడన్న విషయం గురించి నేను పట్టించుకోను. వెన్నునొప్పితో నేను బాధపడుతున్న మాట వాస్తవం. అయితే, దాని గురించే అతిగా ఆలోచిస్తూ కూర్చుంటే పనులుకావు. నా అత్యుత్తమ నైపుణ్యం ఏమిటో వెలికితీసేందుకు ప్రయత్నించాలి. అందుకే ఈ చెత్తనంతా పక్కనపెట్టి.. ప్రస్తుతం మున్ముందు ఏం చేయాలన్న అంశం మీద దృష్టి పెట్టాలి. నాకు తెలిసి నా ఆట తీరు బాగానే ఉంది. ప్రస్తుతం నేను అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాను. ఎన్నో ఏళ్లుగా ఐపీఎల్ ఆడుతున్నా.. కొంతకాలం దూరమైనంత మాత్రాన పెద్దగా మార్పేమీ రాదు. ఐపీఎల్ తాజా సీజన్ కోసం పూర్తి స్థాయిలో సంసిద్ధుడినయ్యాను. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నా. షాట్లు ఆడుతున్నా’’ అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ టైటిల్ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని పేర్కొన్నాడు. గౌతం గంభీర్ కేకేఆర్ మెంటార్గా రావడం, మిచెల్ స్టార్క్ జట్టుతో ఉండటం సానుకూలాంశమని అయ్యర్ అన్నాడు. కాగా గాయం కారణంగా అయ్యర్ గత ఐపీఎల్ సీజన్కు దూరమైన విషయం తెలిసిందే. చదవండి: #Kohli: ఇలాంటి ప్రవర్తన అస్సలు ఊహించలేదు.. నీకిది తగునా కోహ్లి? -
శ్రేయస్ అయ్యర్కు లైన్ క్లియర్
కోల్కతా నైట్రైడర్స్కు శుభవార్త. ఐపీఎల్ 2024 సీజన్ ఆడేందుకు ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు అధికారికంగా లైన్ క్లియర్ అయ్యింది. ఈ మేరకు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) అయ్యర్కు క్లీన్ చిట్ ఇచ్చింది. ఎన్సీఏ సలహా మేరకు అయ్యర్ ముంబైలోని వెన్నెముక నిపుణుడిని సంప్రదించగా.. అతను అయ్యర్కు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు సమాచారం. సదరు వెన్నెముక వైద్యుడు అయ్యర్కు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇస్తూనే ఓ మెలిక కూడా పెట్టాడని తెలుస్తుంది. గత కొంతకాలంగా వెన్నెముక సమస్యతో బాధపడుతున్న అయ్యర్ బంతిని డిఫెండ్ చేసే క్రమంలో కాలును ఎక్కువగా చాచ కూడదని హెచ్చరించినట్లు సమాచారం. ఒకవేళ అయ్యర్ అలాంటి షాట్లు ఆడాల్సి వస్తే వెన్ను సమస్య తిరగబెట్టే ప్రమాదమున్నట్లు తెలుస్తుంది. శ్రేయస్ అయ్యర్ వెన్ను సమస్య కారణంగా గత సీజన్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. కాగా, ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభంకానుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కే.. ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి. కేకేఆర్ ఈ సీజన్ తొలి మ్యాచ్ను మార్చి 23న ఆడనుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగే ఆ మ్యాచ్లో కేకేఆర్.. సన్రైజర్స్ హైదరాబాద్ను ఢీకొంటుంది. -
భారత టీ20 జట్టు నుంచి అవుట్! వరల్డ్కప్లో నో ఛాన్స్!
IPL 2024- T20 WC 2024: టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు కష్టమేనని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. సెలక్టర్లు అతడిని పక్కనపెట్టినట్లు ఇప్పటికే సంకేతాలిచ్చారని పేర్కొన్నాడు. ఐపీఎల్-2024లో సత్తా చాటితేనే తిరిగి భారత టీ20 జట్టులో స్థానం పొందే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్కు కెప్టెన్గా ఉన్న భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. వెన్నునొప్పి కారణంగా గత సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఆ తర్వాత భారత టీ20 జట్టులో పునరాగమనం చేసిన అతడు ఫర్వాలేదనిపించాడు. వన్డే వరల్డ్కప్-2023లోనూ సత్తా చాటాడు. అయితే, గత కొన్ని రోజులుగా కెరీర్లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు అయ్యర్. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డాడనే కారణంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి అతడి సెంట్రల్ కాంట్రాక్టును రద్దు చేసింది. ఈ నేపథ్యంలో భారత జట్టులో శ్రేయస్ అయ్యర్ పునరాగమనంపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో జూన్లో మొదలుకానున్న టీ20 ప్రపంచకప్-2024 జట్టులో అతడికి చోటు దక్కుతుందా లేదా అన్న అంశంపై ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. భారత టీ20 జట్టు నుంచి అవుట్! వరల్డ్కప్లో నో ఛాన్స్! ‘‘శ్రేయస్ అయ్యర్... ప్రస్తుతం నీ పేరు భారత టీ20 జట్టులో లేదు. ఒకవేళ ఐపీఎల్ తాజా ఎడిషన్లో నువ్వు సత్తా చాటితే రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంటుంది. 550కి పైగా పరుగులు సాధిస్తే సెలక్టర్లు కచ్చితంగా ఈ పేరును పరిగణనలోకి తీసుకుంటారు. ఐపీఎల్లో అదరగొడితేనే కీలక సభ్యుడిగా జట్టులో చోటిస్తారు. కానీ ప్రస్తుతం అతడి పేరు పరిశీలనలో లేదన్నది వాస్తవం’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2023లో శ్రేయస్ అయ్యర్ స్థానంలో నితీశ్ రాణా కేకేఆర్ను ముందుకు నడిపించాడు. కానీ కనీసం ప్లే ఆఫ్స్నకు కూడా చేర్చలేకపోయాడు. ఈ నేపథ్యంలో తిరిగి కేకేఆర్ పగ్గాలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్.. కెప్టెన్గా, బ్యాటర్గా రాణిస్తేనే వరల్డ్కప్ అవకాశాలను సజీవం చేసుకోగలడు. ఐపీఎల్ పదిహేడో ఎడిషన్లో ప్రదర్శనపైనే అతడి అంతర్జాతీయ టీ20 కెరీర్ ఆధారపడి ఉందని చెప్పవచ్చు!! ఇదిలా ఉంటే.. మార్చి 22న ఐపీఎల్-2024కు తెరలేవనుంది. చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య చెపాక్లో ఆరంభ మ్యాచ్ జరుగనుంది. ఇక కేకేఆర్ మార్చి 23న సొంతమైదానంలో సన్రైజర్స్ హైదారాబాద్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. చదవండి: # RCB: మేమేం ఏడ్వటం లేదు... అబ్బే ఇవి కన్నీళ్లుకావు! -
BCCI: శ్రేయస్ అయ్యర్కు శుభవార్త!?
ఐపీఎల్-2023 నేపథ్యంలో కోల్కతా నైట్ రైడర్స్ అభిమానులకు శుభవార్త! ఆ జట్టు కెప్టెన్, టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ పూర్తి ఫిట్గా ఉన్నట్లు సమాచారం. రెండు రోజుల వ్యవధిలో అతడు కేకేఆర్ ప్రి- ఐపీఎల్ క్యాంపులో చేరనున్నట్లు తెలుస్తోంది. రంజీ ట్రోఫీ 2023- 24 సీజన్ విజేత ముంబై జట్టు మేనేజర్ భూషణ్ పాటిల్ ఈ విషయాన్ని వెల్లడించినట్లు క్రిక్బజ్ పేర్కొంది. కాగా రంజీ తాజా సీజన్ ఆరంభం నుంచి ముగింపు మధ్యలో శ్రేయస్ అయ్యర్ కెరీర్లో సంచలన మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ముందు ముంబై తరఫున రంజీ బరిలో దిగిన అయ్యర్.. ఆ తర్వాత టీమిండియాతో చేరాడు. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా రెండు టెస్టుల్లో విఫలం కావడంతో బీసీసీఐ అతడిని పక్కనపెట్టింది. ఈ క్రమంలో వెన్నునొప్పితో బాధపడుతున్న అతడు.. జాతీయ క్రికెట్ అకాడమీలో చేరాడు. అయితే, అప్పటికే బీసీసీఐ.. సెంట్రల్ కాంట్రాక్టు ఆటగాళ్లను ఉద్దేశించి ఓ నిబంధన ప్రవేశపెట్టింది. జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనపుడు.. పూర్తి ఫిట్గా ప్రతీ ఆటగాడు రంజీల్లో ఆడాలని ఆదేశించింది. దీంతో తాను ఫిట్గా లేనంటూ అయ్యర్ ముంబై క్రికెట్ అసోసియేషన్కు తెలియజేయగా.. ఎన్సీఏ అతడు పూర్తి ఫిట్గా ఉన్నట్లు చెప్పడంతో అతడిపై వేటు పడింది. క్రమశిక్షణరాహిత్యం నేపథ్యంలో యువ ఓపెనర్ ఇషాన్ కిషన్తో పాటు శ్రేయస్ అయ్యర్ కాంట్రాక్టును కూడా బీసీసీఐ రద్దు చేసింది. ఈ క్రమంలో మళ్లీ రంజీ టోర్నీలో అడుగుపెట్టిన అయ్యర్.. విదర్భతో ఫైనల్ మ్యాచ్లో అదరగొట్టాడు. 95 పరుగులతో అదరగొట్టి ముంబై విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, బ్యాటింగ్ అనంతరం రెండురోజుల పాటు అయ్యర్ ఫీల్డింగ్కు దూరంగా ఉండటంతో వెన్నునొప్పి తిరగబెట్టిందనే వార్తలు వచ్చాయి. ఫలితంగా అతడు ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నాడనే ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ముంబై జట్టు మేనేజర్ భూషణ్ పాటిల్ మాట్లాడుతూ.. ‘‘అయ్యర్ ఫిట్నెస్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అతడు బాగున్నాడు. రెండు రోజుల్లో ప్రి- ఐపీఎల్ క్యాంపులో చేరతాడు’’ అని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. అయ్యర్ కాంట్రాక్టు విషయంలో బీసీసీఐ పునరాలోచన చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టును పునరుద్ధరించే యోచనలో ఉన్నట్లు వదంతులు వస్తున్నాయి. చదవండి: హార్దిక్ రిటైర్ అవ్వటమే బెటర్: భారత మాజీ పేసర్ షాకింగ్ కామెంట్స్ -
మా జట్టులో తక్కువ పరుగులు చేసింది నేనే: రహానే
Ajinkya Rahane Comments After Guiding Mumbai to Ranji Trophy Title Win: ‘‘మా జట్టులో తక్కువ పరుగులు స్కోరు చేసిన బ్యాటర్ను నేనే.. అయినప్పటికీ అందరికంటే అత్యంత సంతోషడే వ్యక్తిని కూడా నేనే.. ట్రోఫీ గెలవడం ఆనందంగా ఉంది. ప్రతి ఆటగాడి కెరీర్లో ఎన్నో ఎత్తుపళ్లాలు ఉంటాయి. ఏదేమైనా డ్రెసింగ్ రూంలో అందరూ పరస్పరం ఒకరి విజయాలు మరొకరు సెలబ్రేట్ చేసుకునే వాతావరణం కల్పించడమే అత్యంత ముఖ్యమైనది. నా జీవితంలో ఈరోజు ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. గతేడాది ఒక్క పరుగు తేడాతో ఓడి.. నాకౌట్ దశకు అర్హత సాధించలేకపోయాం. అయితే, ఇప్పుడు జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడి పట్ల మరింత బాధ్యత తీసుకుని.. వారి ఆటిట్యూడ్, ఫిట్నెస్, సహచర సభ్యులతో మెలిగే విధానం.. ఇలా ప్రతి అంశంలోనూ మరింత శ్రద్ధ వహించాం. ముంబై క్రికెట్ అసోసియేషన్ అన్ని వేళలా మాకు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు’’ అని రంజీ ట్రోఫీ 2023-24 టైటిల్ విన్నింగ్ కెప్టెన్ అజింక్య రహానే హర్షం చేశాడు. అదే విధంగా.. విదర్భ సైతం ఆఖరి వరకు విజయం కోసం అద్భుతంగా పోరాడిందని కొనియాడాడు. కాగా వాంఖడే స్టేడియంలో గురువారం ముగిసిన రంజీ ట్రోఫీ 2023- 24 ఫైనల్ మ్యాచ్లో ముంబై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. విదర్భను 169 పరుగుల తేడాతో చిత్తు చేసి రికార్డు స్థాయిలో ఏకంగా 42వ సారి ట్రోఫీ గెలుచుకుంది. ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన ముషీర్ ఖాన్(136) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక రహానే 73 విలువైన పరుగులు చేయగా.. శ్రేయస్ అయ్యర్ 95 పరుగులతో అదరగొట్టాడు. షమ్స్ ములానీ సైతం అజేయ అర్ధ శతకంతో రాణించాడు. కాగా రంజీ తాజా ఎడిషన్లో అదరగొట్టి టీమిండియాలో రీఎంట్రీ ఇవ్వాలనుకున్న రహానే.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. మొత్తంగా పదమూడు ఇన్నింగ్స్ ఆడి కేవలం 214 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 𝐌𝐮𝐦𝐛𝐚𝐢 are WINNERS of the #RanjiTrophy 2023-24! 🙌 Mumbai Captain Ajinkya Rahane receives the coveted Trophy 🏆 from the hands of Mr Ashish Shelar, Honorary Treasurer, BCCI. 👏 👏#Final | #MUMvVID | @ShelarAshish | @ajinkyarahane88 | @MumbaiCricAssoc | @IDFCFIRSTBank pic.twitter.com/LPZTZW3IV4 — BCCI Domestic (@BCCIdomestic) March 14, 2024 For his superb hundred in the #RanjiTrophy #Final, Musheer Khan is named the Player of the Match. 👍 👍 He receives the award from the hands of Mr Ashish Shelar, Honorary Treasurer, BCCI. 👏 👏#MUMvVID | @ShelarAshish | @IDFCFIRSTBank pic.twitter.com/T3l6mLW6kP — BCCI Domestic (@BCCIdomestic) March 14, 2024 Tanush Kotian bagged the Player of the Tournament award for brilliant all-round display 🙌 🙌 He receives the award from Mr Ajinkya Naik, Honorary Secretary, Mumbai Cricket Association. 👏 👏#RanjiTrophy | #Final | #MUMvVID | @ajinkyasnaik | @MumbaiCricAssoc | @IDFCFIRSTBank pic.twitter.com/eMbRcr4s24 — BCCI Domestic (@BCCIdomestic) March 14, 2024 -
కేకేఆర్కు బిగ్ షాక్.. శ్రేయస్ అయ్యర్ దూరం! కెప్టెన్గా అతడే
ఐపీఎల్-2024 సీజన్కు ముందు కోల్కతా నైట్రైడర్స్కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, టీమిండియా స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అయ్యర్కు తన వెన్నుగాయం మళ్లీ తిరగబెట్టింది. ఈ క్రమంలో అతడు నాలుగో రోజు మొత్తం ఫీల్డింగ్కు రాలేదు. ఐదో రోజు సైతం అయ్యర్ ఫీల్డ్లో కన్పించలేదు. ఈ ఫైనల్ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్లో అయ్యర్ 95 పరుగులతో రాణించాడు. బ్యాటింగ్ చేసిన సమయంలో కూడా అయ్యర్ వెన్ను నొప్పితో బాధపడ్డాడు. ఫిజియో మైదానంలోకి వచ్చి రెండుసార్లు చికిత్స అందించాడు. కాగా గతేడాది వెన్ను గాయానికి అయ్యర్ శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ క్రమంలో గతేడాది ఐపీఎల్ కూడా దూరమయ్యాడు. ఇప్పుడు సరిగ్గా మళ్లీ ఐపీఎల్ ఆరంభ సమయంలోనే అయ్యర్ గాయపడటం.. కేకేఆర్ ఫ్రాంచైజీని కలవరపెడుతోంది. ఒకవేళ అయ్యర్ దూరమైతే కేకేఆర్ కెప్టెన్గా నితీష్ రాణా మరోసారి బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉంది. కాగా ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. చెపాక్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఇక ఇది ఇలా ఉండగా.. శ్రేయస్ను సెంట్రాల్ కాంట్రాక్ట్ నుంచి బీసీసీఐ తప్పించిన సంగతి తెలిసిందే. రంజీల్లో ఆడాలన్న తమ ఆదేశాలను అయ్యర్ ధిక్కరించడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. చదవండి: IPL 2024: ఢిల్లీ జట్టులోకి ఫాస్టెస్ట్ సెంచరీ వీరుడు.. ఎవరంటే? -
ఎట్టకేలకు.. శ్రేయస్ అయ్యర్ విధ్వంసం! వీడియో వైరల్
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, ముంబై ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఎట్టకేలకు బ్యాట్ ఝుళిపించాడు. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో భాగంగా విధర్బ జరుగుతున్న ఫైనల్లో అయ్యర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ తుది పోరు సెకెండ్ ఇన్నింగ్స్లో 111 బంతులు ఎదుర్కొన్న అయ్యర్.. 10 ఫోర్లు, 3 సిక్స్లతో 95 పరుగులు చేశాడు. దూకుడుగా ఆడిన అయ్యర్ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. కాగా అయ్యర్ ఇంగ్లండ్తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో విఫలమై భారత జట్టులో చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే. జట్టులో చోటు మాత్రమే కాకుండా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ను సైతం శ్రేయస్ కోల్పోయాడు. తొలుత రంజీట్రోఫీలో ఆడేందుకు అయ్యర్ విముఖత చూపించడంతో అయ్యర్ను కాంట్రాక్ట్ నుంచి బీసీసీఐ తప్పించింది. అయ్యర్తో పాటు మరో యువ క్రికెటర్ ఇషాన్ కిషన్పై కూడా బీసీసీఐ వేటు వేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్లో విఫలమైన ముంబై.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం భారీ స్కోర్ దిశగా దూసుకుపోతోంది. 114 ఓవర్లకు సెకెండ్ ఇన్నింగ్స్లో ముంబై 7 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. ఓవరాల్గా ముంబై ప్రస్తుతం 483 ఆధిక్యంలో కొనసాగుతోంది. ముంబై బ్యాటర్లలో అయ్యర్తో పాటు ముషీర్ ఖాన్(136) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. A confident fifty from Shreyas Iyer in the Ranji Trophy final with aggressive approach and looking good against Short balls. 👌pic.twitter.com/G7UReArVhd — Johns. (@CricCrazyJohns) March 12, 2024 -
ఏమైంది శ్రేయస్? మరోసారి ఫెయిల్! ఇక కష్టమే మరి
రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ ఫైనల్లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై, విధర్భ జట్లు తలపడుతున్నాయి. ఈ ఫైనల్ పోరులో టీమిండియా స్టార్, ముంబై ఆటగాడు శ్రేయస్ అయ్యర్ దారుణంగా విఫలమయ్యాడు. కీలక సమయంలో బ్యాటింగ్ వచ్చిన అయ్యర్.. కేవలం 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. అయ్యర్ షార్ట్ బాల్ వీక్నెస్ను విధర్బ బౌలర్ ఉమేశ్ యాదవ్ క్యాష్ చేసుకున్నాడు. షార్ట్ పిచ్ బంతులతో అయ్యర్ను ఉమేశ్ ముప్పుతిప్పలు పెట్టాడు. ఆఖరి ఉమేశ్ బౌలింగ్లోనే స్లిప్లో కరుణ్ నాయర్కు క్యాచ్ ఇచ్చి అయ్యర్ ఔటయ్యాడు. ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్టుల్లో విఫలమై భారత జట్టులో చోటు కోల్పోయిన అయ్యర్.. ఇప్పుడు దేశీవాళీ క్రికెట్లో సైతం సతమతమవుతున్నాడు. అదే విధంగా బీసీసీఐ కాంట్రాక్ట్ను సైతం అయ్యర్ కోల్పోయాడు. దీంతో అయ్యర్ భారత జట్టులోకి ఎంట్రీ ప్రశ్నార్థకంగా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి రోజు లంచ్ విరామానికి ముంబై 4 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. క్రీజులో హార్దిక్ తామోర్(4), అజింక్యా రహానే(6) పరుగులతో ఉన్నారు. అంతకుముందు పృథ్వీ షా(46) పరుగులతో రాణించాడు. చదవండి: IPL 2024: 'చెన్నై, ముంబై, సన్రైజర్స్ కాదు.. ఈ సారి ఐపీఎల్ టైటిల్ ఆ జట్టుదే' -
ఇషాన్, శ్రేయస్ల కాంట్రాక్ట్ రద్దు: సచిన్ రియాక్షన్ వైరల్
దేశవాళీ క్రికెట్ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి తీసుకున్న నిర్ణయంపై దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ హర్షం వ్యక్తం చేశాడు. అగ్రశ్రేణి ఆటగాళ్లు ఫస్ల్క్లాస్ క్రికెట్ బరిలో దిగడం ద్వారా డొమెస్టిక్ టోర్నీలకు మరింత ఆదరణ పెరుగుతుందన్నాడు. తనకు అవకాశం వచ్చినప్పుడల్లా ముంబై తరఫున ఆడేందుకు ఎంతో ఆతురతగా ఎదురుచూసే వాడినని సచిన్ టెండుల్కర్ గుర్తు చేసుకున్నాడు. కాగా జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనపుడు సెంట్రల్ కాంట్రాక్ట్ క్రికెటర్లు కచ్చితంగా రెడ్ బాల్ క్రికెట్(ఫస్ట్క్లాస్) ఆడాల్సిందేనని బీసీసీఐ ఇటీవల నిబంధన విధించిన విషయం తెలిసిందే. ఫిట్నెస్ కారణాల దృష్ట్యా ఇబ్బందిపడే వారు మినహా ప్రతి ఒక్కరు.. ముఖ్యంగా యువ ఆటగాళ్లు రంజీ బరిలో దిగాల్సిందేనని బోర్డు ఆటగాళ్లకు ఆదేశాలిచ్చింది. హెడ్కోచ్, కెప్టెన్, సెలక్టర్లు చెప్పినపుడు ఏ ఆటగాడైనా సరే దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో 2023-24 ఏడాదికిగానూ ప్రకటించిన వార్షిక కాంట్రాక్టులలో ముంబై బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, జార్ఖండ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్లకు మొండిచేయి చూపింది. రంజీ బరిలో దిగాలన్న కోచ్ ఆదేశాలను పెడచెవిన పెట్టారనే కారణంతో వారిద్దరిపై వేటు పడినట్లు తెలిసింది. ఈ క్రమంలో సచిన్ టెండుల్కర్ ఎక్స్ వేదికగా రంజీ ట్రోఫీ ప్రాధాన్యం గురించి వివరిస్తూ.. ‘‘తాజా రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముంబై జట్టు పడిలేచిన కెరటంలా ఫైనల్కు దూసుకువచ్చింది. మరో సెమీస్ మ్యాచ్లో చివరి రోజు వరకు ఆట కొనసాగుతున్న వైనం ముచ్చటగా ఉంది. ఈ మ్యాచ్లో మధ్యప్రదేశ్ విజయానికి 90కి పైగా పరుగులు, విదర్భకు నాలుగు వికెట్లు కావాలి. నిజానికి నా కెరీర్ ఆసాంతం ఎప్పుడు ముంబైకి ఆడే అవకాశం వచ్చినా కచ్చితంగా బరిలో దిగే వాడిని. అక్కడి డ్రెస్సింగ్ రూంలో దాదాపు 7-8 మంది టీమిండియా ఆటగాళ్లు ఉండేవారు. వారితో కలిసి అక్కడ రూం షేర్ చేసుకోవడం మరింత సరదాగా ఉండేది. టీమిండియా తరఫున టాప్ ప్లేయర్లుగా ఉన్నవాళ్లు దేశవాళీ క్రికెట్లో వారి వారి జట్లకు ఆడితే ఆదరణ పెరుగుతుంది. యువ ఆటగాళ్లకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. కొత్త ప్రతిభ వెలుగులోకి వస్తుంది. అంతేకాదు ఫామ్లేమితో ఇబ్బంది పడేవాళ్లు తిరిగి బేసిక్స్ నుంచి మొదలుపెట్టి పొరపాట్లను సరిచేసుకునే అవకాశం దొరుకుతుంది. స్టార్ క్రికెటర్లు డొమెస్టిక్ టోర్నీల్లో ఆడితే క్రమక్రమంగా అభిమానులు కూడా దేశవాళీ జట్లకు మద్దతుగా నిలుస్తారు. నిజంగా దేశవాళీ క్రికెట్కు కూడా బీసీసీఐ సమాన ప్రాధాన్యం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది’’ అని సుదీర్ఘ నోట్ షేర్ చేశాడు. కాగా సచిన్ టెండుల్కర్ మంగళవారం ఈ మేరకు పోస్ట్ చేయగా.. బుధవారం నాటి ఆటలో భాగంగా రంజీ సెమీస్లో మధ్యప్రదేశ్పై విదర్భ 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. The Ranji Trophy semi-finals have been riveting! @MumbaiCricAssoc’s march into the finals was aided by a brilliant batting recovery, while the other semi-final hangs in the balance going into the last day - Madhya Pradesh need 90+ runs to win, Vidarbha need 4 wickets.… — Sachin Tendulkar (@sachin_rt) March 5, 2024 -
‘సాహో’ హీరోయిన్తో ప్రేమలో పడ్డ శ్రేయస్ అయ్యర్?!
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ముందు రంజీ బరిలో దిగడం.. ఆ తర్వాత భారత జట్టులోకి రావడం.. ఆడిన రెండు మ్యాచ్లలో విఫలం కావడం.. ఆపై మళ్లీ రంజీ టోర్నీ ఆడేందుకు వెళ్లడం వంటివి జరిగాయి. ఈ పరిణామాల క్రమం మధ్యలో అయ్యర్.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయాడు కూడా!.. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డాడన్న విమర్శల నేపథ్యంలో బోర్డు అయ్యర్పై వేటు వేసినట్లు తెలిసింది. అయితే, ఈసారి కెరీర్ పరంగా కాకుండా.. వ్యక్తిగత విషయాల నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ పేరు తెరమీదకు వచ్చింది. ఆమెతో డేటింగ్ అంటూ రూమర్లు శ్రేయస్ అయ్యర్ స్నేహితుల జాబితాలో ఓ కొత్త అమ్మాయి చేరినట్లు సమాచారం. అయితే, ఆమెతో కేవలం ఫ్రెండ్షిప్ వరకే అయ్యర్ పరిమితం కాలేదని.. డేటింగ్ కూడా చేస్తూ పరస్పర అభిప్రాయాలు పంచుకుంటూ.. తమ బంధాన్ని మరో లెవల్కు తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యాడని గాసిప్ రాయుళ్లు కథనాలు అల్లేస్తున్నారు. వదంతులకు కారణం ఇదే? ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్. సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిన అందాల తార. ఇక శ్రద్ధాతో అయ్యర్ పేరును ముడిపెట్టి కథనాలు రావడానికి కారణం.. ఇటీవల వాళ్లిద్దరు ఓ యాడ్లో కలిసి కనిపించడం.. అదే విధంగా ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు ఫాలో కావడమే. ఇద్దరు సెలబ్రిటీలు.. అందునా ఓ స్టార్ క్రికెటర్.. ఓ టాప్ హీరోయిన్ ఇలా ఒకరినొకరు ఫాలో కావడంతో నెటిజన్లు ఇలా తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇద్దరూ సీక్రెట్గా డేటింగ్ చేస్తున్నారంటూ అభిప్రాయపడుతున్నారు. వాళ్లంతా బీ-టౌన్ అల్లుళ్లే కాగా క్రికెట్కు, బాలీవుడ్కు విడదీయరాని అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. నవాబ్ అలీ పటౌడీ ఖాన్ నుంచి విరాట్ కోహ్లి.. మొన్నటికి మొన్న కేఎల్ రాహుల్ దాకా.. బాలీవుడ్ నటీమణులను పెళ్లాడిన క్రికెటర్లు చాలా మందే ఉన్నారు. ఏమో శ్రేయస్ అయ్యర్ కూడా ఆ జాబితాలో చేరినా ఆశ్చర్యపడనక్కర్లేదంటున్నారు నెటిజన్లు! అన్నట్లు శ్రద్ధ ఇటీవలే తన 37వ పుట్టినరోజు జరుపుకోగా.. అయ్యర్కు ఇప్పుడు 29 ఏళ్లు! చదవండి: #DhanashreeVerma: అతడితో అలా చహల్ భార్య ధనశ్రీ వర్మ ఫొటో.. -
కష్టాల్లో జట్టు.. తుస్సుమన్పించిన శ్రేయస్ అయ్యర్! స్టంప్స్ ఎగిరిపోయాయిగా
ఫస్ట్క్లాస్ క్రికెట్లో రీ ఎంట్రీ ఇచ్చిన ముంబై బ్యాటర్, టీమిండియా మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ తన తొలి మ్యాచ్లోనే నిరాశపరిచాడు. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ సెకెండ్ సెమీఫైనల్లో క్రికెట్ అకాడమీ వేదికగా ముంబై, తమిళనాడు జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో అయ్యర్ విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో 167 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ముంబై జట్టు కష్టాల్లో పడింది. ప్రస్తుతం ముంబై 22 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. తమిళనాడు స్పిన్నర్ సాయికిషోర్ 5 వికెట్లతో ముంబైను దెబ్బతీశాడు. అంతకుముందు తమిళనాడు సైతం తొలి ఇన్నింగ్స్లో విఫలమైంది. కేవలం 146 పరుగులు మాత్రమే చేసింది. బీసీసీఐ సీరియస్.. అయ్యర్ రీ ఎంట్రీ వాస్తవానికి అయ్యర్ బరోడాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్కు ముంబై జట్టుకు అందుబాటులో ఉండాల్సింది. కానీ వెన్ను నొప్పి సాకు చెప్పి క్వార్టర్స్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న బీసీసీఐ శ్రేయస్ను ఏకంగా సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. బీసీసీఐ తీవ్రమైన చర్యలు తీసుకోవడంతో ఎట్టకేలకు దిగిచ్చొన అయ్యర్ సెమీఫైనల్స్కు అందుబాటులోకి వచ్చాడు. -
దేశం కోసం శ్రేయస్ అయ్యర్ త్యాగం.. బీసీసీఐ తప్పు చేసిందా?
శ్రేయస్ అయ్యర్.. గత కొన్ని రోజులగా భారత క్రికెట్ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. అందుకు కారణం అతడిని బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించడమే. తాజాగా 2024-25 ఏడాదికి గాను బీసీసీఐ ప్రకటించిన ఆటగాళ్ల జాబితాలో అయ్యర్కు చోటు దక్కలేదు. అయ్యర్తో పాటు మరో యువ ఆటగాడు ఇషాన్ కిషన్ను కూడా బీసీసీఐ కాంట్రక్ట్ నుంచి తప్పించింది. దేశీవాళీ క్రికెట్లో ఆడేందుకు వీరిద్దరూ నిరాకరించడంతో బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై బిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇషాన్ కిషన్ విషయంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైందేనని.. కానీ అయ్యర్ విషయంలో కాస్త ఆలోచించాల్సిందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలేం జరిగిందంటే? ఇంగ్లండ్తో తొలి రెండు టెస్టులకు ఎంపికైన అయ్యర్.. దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలో ఇంగ్లీష్ జట్టుతో ఆఖరి మూడు టెస్టులకు సెలక్టర్లు శ్రేయస్ను పక్కన పెట్టారు. తొలుత అందరూ అయ్యర్ వెన్ను గాయం తిరగబెట్టిందని, అందుకే అతడికి విశ్రాంతి ఇచ్చారని భావించారు. కానీ ఫామ్ లేమి కారణంగానే సెలక్టర్లు ఎంపిక చేయలేదని తర్వాత బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఆడాలని ముంబై క్రికెట్ ఆసోషియేషన్ అయ్యర్ను కోరింది. కానీ అయ్యర్ తను ఫిట్నెస్గా లేనని, అందుబాటులో ఉండనని చెప్పుకొచ్చాడు. కానీ జాతీయ క్రికెట్ అకాడమీ మాత్రం.. అయ్యర్ ఫిట్గానే ఉన్నాడని తేల్చిచెప్పడంతో వివాదం ముదిరింది. అంతకంటే ముందు సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లు కచ్చితంగా దేశీవాళీ టోర్నీల్లో ఆడాలని బీసీసీఐ సైతం ఆదేశాలు జారీ చేసింది. అయితే రంజీ మ్యాచ్ ఆడమని బీసీసీఐ సూచనలను పెడచెవిన పెట్టిన అయ్యర్.. ఐపీఎల్లో తాను కెప్టెన్గా ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నిర్వహించిన ప్రీ ట్రైనింగ్ క్యాంప్లో పాల్గోన్నడట. ఈ విషయం తెలుసుకున్న బీసీసీఐ ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్ అయ్యర్పై సీరియస్ అయినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అగార్కర్ సూచన మేరకే బీసీసీఐ అయ్యర్పై వేటు వేసినట్లు సమాచారం. అయితే బీసీసీఐ చర్యలతో దిగొచ్చిన అయ్యర్.. తమిళనాడుతో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్కు అందుబాటులోకి వచ్చాడు. అయితే అయ్యర్కు సంబంధించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అయ్యర్ అంత త్యాగం చేశాడా? కాగా గతేడాది ఐపీఎల్ సీజన్కు అయ్యర్ వెన్ను గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. అయితే వరల్డ్కప్లో దేశం తరఫున ఆడాలనే ఉద్దేశంతోనే ఐపీఎల్కు అయ్యర్ దూరమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్లు తీసుకుంటూనే టోర్నీ మొత్తం అయ్యర్ ఆడినట్లు ఓ ప్రముఖ క్రీడా వెబ్సైట్ రాసుకొచ్చింది. అదే విధంగా అయ్యర్ ఇప్పటికి వెన్ను నొప్పితో బాధపడుతున్నాడని, వరల్డ్కప్ తర్వాత విశ్రాంతి ఏకైక బ్యాటర్ శ్రేయస్ అని ఆ వెబ్సైట్ పేర్కొంది. శ్రేయస్ అయ్యర్ వరల్డ్ కప్ కోసం ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. శస్త్రచికిత్స తర్వాత ప్రపంచకప్ సమయానికి సిద్దంగా ఉండేందుకు ప్రతీరోజు మూడు పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్లు తీసుకున్నాడు. సెమీ-ఫైనల్ ,ఫైనల్ సమయంలో అతడికి వెన్ను నొప్పి తిరగబెట్టింది. అతడు నొప్పిని భరిస్తూనే ఆడాడు. కనీసం వరల్డ్కప్ తర్వాత అయ్యర్ విశ్రాంతి కూడా తీసుకోలేదు. అతడు స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్, దక్షిణాఫ్రికా పర్యటనకు కూడా వెళ్లాడు. దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత, ఇంగ్లండ్తో మొదటి రెండు టెస్టులకు ముందు జనవరిలో అయ్యర్ను రంజీల్లో ఆడమని అడిగారు. కానీ అతడు వెన్ను నొప్పితో బాధపడుతుండడంతో అందుకు అంగీకరించలేదు. అయితే అతడు తన ఫిట్నెస్ పెంచుకునేందుకు కేకేఆర్ అకాడమీలో చేరాడు. ఎప్పటికప్పుడు ముంబై టీమ్ హెడ్ కోచ్ ఓంకార్ సాల్వి సైతం కేకేఆర్ ప్రాక్టీస్ శిబరాన్ని సందర్శించేవాడు. మొదట్లో ప్రాక్టీస్ సెషన్లో 60 బంతులు ఆడితేనే వెన్ను నొప్పితో బాధపడేవాడు. ఇప్పుడు ఒక సెషన్లో అతను 200 బంతులను ఎదుర్కొంటున్నాడు. పరిస్థితి ఇప్పుడు మెరుగుపడింది. కాబట్టి తమిళనాడుతో జరిగే రంజీ ట్రోఫీ సెమీ-ఫైనల్కు అందుబాటులోకి వచ్చాడని సదరు వెబ్సైట్ శ్రేయస్ పరిస్థితిని వివరిస్తూ రాసుకొచ్చింది. -
శ్రేయస్ అయ్యర్పై అగార్కర్ సీరియస్!?
టీమిండియా స్టార్ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషాన్ ప్రస్తుతం భారత క్రికెట్ వర్గాల్లో హాట్టాపిక్గా మారారు. అందుకు కారణం వారిద్దరిని బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ల నుంచి తప్పించడమే. 2024-25 ఏడాదికి గాను బీసీసీఐ ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్ల జాబితాలో శ్రేయస్, ఇషాన్ పేర్లు లేవు. దేశవాళీ క్రికెట్లో ఆడేందుకు విముఖత చూపడంతో వీరిద్దరిపై బీసీసీఐ వేటు వేసింది. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన కిషన్.. మానసిక సమస్యల కారణం చెప్పి ఉన్నపళంగా స్వదేశానికి వచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే భారత్కు వచ్చిన కిషన్.. హార్దిక్ పాండ్యాతో కలిసి ఈ ఏడాది ఐపీఎల్ సీజన్కు సిద్దమయ్యాడు. ఈ క్రమంలో భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం కిషాన్ రీ ఎంట్రీ ఇవ్వాలంటే రంజీల్లో ఆడాల్సిందే అని సృష్టం చేశాడు. కానీ బోర్డు, ద్రవిడ్ మాటలను కిషన్ పెడచెవిన పెట్టాడు. మరోవైపు అయ్యర్ది కూడా ఇదే తీరు. ఇంగ్లండ్తో ఆఖరి మూడు టెస్టులకు అయ్యర్ను ఫామ్ లేమి కారణంగా సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఈ క్రమంలో రంజీ క్వార్టర్ ఫైనల్స్లో ఆడాలని ముంబై క్రికెట్ ఆసోషియేషన్ శ్రేయస్ను కోరింది. కానీ అయ్యర్ మాత్రం వెన్ను నొప్పితో బాధపడుతున్నాని, అందుబాటులో ఉండనని చెప్పేశాడు. అయితే అంతకముందు రోజే అయ్యర్ ఫిట్గా ఉన్నాడని ఏన్సీఏ సర్టిఫికేట్ను మంజారు చేసింది. దీంతో అయ్యర్ కావాలానే రంజీలు ఆడకుండా తప్పించుకున్నాడని ప్రచారం జరిగింది. బీసీసీఐ కూడా ఇదే విషయంపై సీరియస్ అయినట్లు వార్తలు వినిపించాయి. అయితే అయ్యర్పై బీసీసీఐ వేటు వేయడానికి మరో కారణం కూడా ఉందంట. వెన్ను నొప్పి సాకు చెప్పి అయ్యర్ కోల్కతా నైట్రైడర్స్ ప్రీ ఐపీఎల్ ట్రైనింగ్లో పాల్గొనున్నట్లు సమచారం. ఈ క్రమంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మెన్ అజిత్ అగార్కర్ అయ్యర్పై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అయ్యర్ను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించాలని సెలక్షన్ కమిటీ బీసీసీఐకి సిఫార్సు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా అయ్యర్ ప్రస్తుతం తమిళనాడుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీస్లో ముంబై తరపున ఆడుతున్నాడు. చదవండి: IPL 2024- SRH: సన్రైజర్స్కు బిగ్ షాక్! -
అతడు తప్పు చేయలేదు.. అలాంటపుడు శిక్ష ఎందుకు?
స్టార్ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లను వార్షిక కాంట్రాక్టు జాబితా నుంచి తొలగించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో బీసీసీఐని కొంతమంది సమర్థిస్తుంటే.. మరికొంత మంది మాజీ క్రికెటర్లు మాత్రం తప్పుబడుతున్నారు. కాగా సెంట్రల్ కాంట్రాక్టు కలిగి ఉన్న క్రికెటర్లందరూ బోర్డు ఆదేశాలకు అనుగుణంగా తప్పక దేశవాళీ క్రికెట్లో ఆడాలని బీసీసీఐ పేర్కొన్న సంగతి తెలిసిందే. కోచ్, కెప్టెన్, సెలక్టర్ల సూచనల మేరకు ఎవరైతే దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందో నిర్ణయిస్తామని తెలిపింది. ముఖ్యంగా ఫిట్గా ఉన్న యువ ఆటగాళ్లు బోర్డు సూచించినపుడు తప్పక డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని ఆటగాళ్లను ఆదేశించింది. అయితే, అయ్యర్, ఇషాన్ ఈ నిబంధనలు ఉల్లంఘించారనే వార్తల నడుమ.. వారిద్దరి సెంట్రల్ కాంట్రాక్టు రద్దు చేయడం ఇందుకు బలాన్నిచ్చింది. ఈ నేపథ్యంలో మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లకు అండగా నిలబడ్డాడు. వారికి మద్దతుగా నిలుస్తూ.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వంటి వాళ్లకు మాత్రం ఈ నిబంధనల నుంచి ఎలా మినహాయింపు ఇస్తారని ప్రశ్నించాడు. ఈ క్రమంలో మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. ‘‘హార్దిక్ పాండ్యా విషయాన్ని సంక్లిష్టం చేయాల్సిన అవసరం లేదు. అతడు ఎన్నో ఏళ్లుగా రెడ్ బాల్ క్రికెట్కు దూరంగా ఉన్నాడు. కాబట్టి ఈ నిబంధన విషయంలో అతడి గురించిన ప్రస్తావనే అనవసరం. అతడు టెస్టు సిరీస్లకు అందుబాటులోనే ఉండటం లేదు. అలాంటపుడు అతడిని ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడమని చెప్పడంలో అర్థమే లేదు. నాలుగు రోజుల మ్యాచ్కు ఓ ఆటగాడి శరీరం సహకరించనపుడు. గాయాల బారిన పడే ప్రమాదం ఉందనీ తెలిసినపుడు అలాంటి వ్యక్తిని ఎవరూ కూడా ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడమని ఆదేశించరు. ఒకవేళ తను టెస్టు ఆడేందుకు పూర్తి ఫిట్గా ఉంటే.. తను టీమిండియాకు ఆడటం మానేసి.. ప్రమోషన్ షూట్లలో పాల్గొంటే అప్పుడు తనది తప్పని చెప్పవచ్చు. కానీ ప్రస్తుతం అతడు ఇలాంటి తప్పులేమీ చేయలేదు. కాబట్టి బీసీసీఐకి అతడిని శిక్షించాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొన్నాడు. చదవండి: Shreyas Iyer: సెమీస్ తుదిజట్టులో అయ్యర్.. రహానే కీలక వ్యాఖ్యలు -
తుదిజట్టులో శ్రేయస్ అయ్యర్.. రహానే కీలక వ్యాఖ్యలు
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దేశవాళీ క్రికెట్లో తిరిగి అడుగుపెట్టాడు. రంజీ ట్రోఫీ 2023-24 సెమీ ఫైనల్(2) సందర్భంగా ముంబై తరఫున పునరాగమనం చేశాడు. ఈ మేరకు తమిళనాడుతో శనివారం మొదలైన మ్యాచ్లో తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ విషయాన్ని ముంబై కెప్టెన్ అజింక్య రహానే వెల్లడించాడు. కాగా ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ముందు శ్రేయస్ అయ్యర్ రంజీ బరిలో దిగాడు. ఆంధ్రతో మ్యాచ్ సందర్భంగా మెరుగైన ప్రదర్శన కనబరిచిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. హైదరాబాద్లో ఇంగ్లండ్తో తొలి టెస్టు నేపథ్యంలో భారత జట్టుతో చేరాడు. మొదటి రెండు మ్యాచ్లలో విఫలమైన అయ్యర్ను మూడో టెస్టు నుంచి పక్కనపెట్టారు సెలక్టర్లు. ఈ క్రమంలో తనకు వెన్నునొప్పి తిరగబెట్టిందని శ్రేయస్ అయ్యర్ జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లినట్లు వార్తలు వినిపించాయి. అదే సమయంలో టీమిండియాలో తిరిగి అడుగుపెట్టాలంటే తప్పక రంజీ బరిలో దిగాలని బీసీసీఐ ఆదేశించింది. అయితే, అయ్యర్ ఫిట్నెస్ కారణాలు చూపి మినహాయింపు పొందాలని భావించగా.. ఎన్సీఏ మాత్రం అతడు ఫిట్గా ఉన్నట్లు సర్టిఫికెట్ ఇచ్చిందని జాతీయ మీడియా వెల్లడించింది. ఈ పరిణామాల క్రమంలో 2022-24 ఏడాది గానూ ప్రకటించిన వార్షిక కాంట్రాక్టులో అయ్యర్ పేరు గల్లంతైంది. దీంతో బీసీసీఐ ఆదేశాలు ధిక్కరించినందు వల్లే అయ్యర్పై వేటు పడిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ముంబై బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ రంజీల్లో రీఎంట్రీ ఇవ్వడం గమనార్హం. ఈ క్రమంలో ముంబై సారథి అజింక్య రహానే మాట్లాడుతూ.. ‘‘తను అనుభవం ఉన్న ఆటగాడు. ముంబై కోసం ఎప్పుడు బరిలోకి దిగినా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటాడు. సెమీ ఫైనల్ సందర్భంగా అతడు జట్టుతో చేరడం థ్రిల్లింగ్గా ఉంది’’ పేర్కొన్నాడు. కాగా ముంబై వేదికగా శనివారం మొదలైన సెమీస్ మ్యాచ్లో టాస్ గెలిచిన తమిళనాడు తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. ముంబైని బౌలింగ్కు ఆహ్వానించింది. రంజీ సెమీఫైనల్-2.. ముంబై వర్సెస్ తమిళనాడు తుదిజట్లు ముంబై పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్, భూపేన్ లల్వానీ, అజింక్య రహానె (కెప్టెన్), ముషీర్ ఖాన్, షమ్స్ ములానీ, హార్దిక్ తామోర్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, తనూష్ కొటియాన్, మోహిత్ అవస్థి, తుషార్ దేశ్ పాండే. తమిళనాడు ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, బాబా ఇంద్రజిత్, ప్రదోష్ పాల్, రవిశ్రీనివాసన్ సాయి కిశోర్ (కెప్టెన్), విజయ్ శంకర్, వాషింగ్టన్ సుందర్, ఎం.మహ్మద్, ఎస్ అజిత్ రామ్, సందీప్ వారియర్, కుల్దీప్ సేన్. -
హార్దిక్కు రూల్స్ వర్తించవా.. పాపం ఇషాన్, శ్రేయస్: మండిపడ్డ ఇర్ఫాన్
వార్షిక క్రాంటాక్టుల విషయంలో భారత క్రికెట్ నియంత్రణ అనుసరించిన తీరుపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ విస్మయం వ్యక్తం చేశాడు. ఏ నిబంధనైనా టీమిండియా ఆటగాళ్లందరికీ ఒకేలా ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. భారత జట్టు అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు ఇలాంటి పోకడలు నష్టం చేకూరుస్తాయని పఠాన్ ఘాటు విమర్శలు చేశాడు. కాగా 2023-24 ఏడాదికి గానూ ప్రకటించిన వార్షిక కాంట్రాక్టుల విషయంలో టీమిండియా మిడిలార్డర్ స్టార్ శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ పేర్లు గల్లంతైన విషయం తెలిసిందే. రంజీ టోర్నీలో ఆడాలన్న బోర్డు ఆదేశాలు బేఖాతరు చేశారన్న కారణంగానే వీళ్లిద్దరికి మొండిచేయి చూపారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ బీసీసీఐ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ‘‘శ్రేయస్, ఇషాన్ ఇద్దరూ ప్రతిభావంతులైన క్రికెటర్లే. తిరిగి పుంజుకుని రెట్టించిన ఉత్సాహంతో వాళ్లిద్దరు కమ్బ్యాక్ ఇస్తారనే అనుకుంటున్నా. హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాళ్లు టెస్టు క్రికెట్ ఆడకూడదు అనుకున్నపుడు.. కనీసం దేశవాళీ పరిమిత ఓవర్ల క్రికెట్లోనైనా వాళ్లను ఆడించాలి కదా? జాతీయ జట్టుకు దూరమైనపుడు వాళ్లు కూడా దేశవాళీ బరిలో దిగాలి కదా? ఒకవేళ ఈ నిబంధన అందరికీ వర్తింపజేయకుంటే.. భారత క్రికెట్ అనుకున్న లక్ష్యాలను ఎన్నటికీ సాధించలేదు’’ అని ఎక్స్ వేదికగా ఇర్ఫాన్ పఠాన్ మండిపడ్డాడు. కాగా గతేడాది వన్డే వరల్డ్కప్-2023 సందర్భంగా గాయపడ్డ పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. మళ్లీ టీమిండియా తరఫున ఇంతవరకు రీఎంట్రీ ఇవ్వలేదు. అయితే, ఐపీఎల్-2024 బరిలో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా బరిలోకి దిగేందుకు జిమ్లో చెమటోడుస్తున్నాడు. మరోవైపు.. శ్రేయస్ అయ్యర్ రంజీ సెమీస్లో ముంబై తరఫున ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడుతో ముంబై ఆడబోయే ఈ మ్యాచ్కు ఎంపిక చేసిన జట్టులో అతడికి చోటు దక్కింది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చదవండి: BCCI Annual Players Contract List: పూర్తి వివరాలు.. విశేషాలు They are talented cricketers, both Shreyas and Ishan. Hoping they bounce back and come back stronger. If players like Hardik don’t want to play red ball cricket, should he and others like him participate in white-ball domestic cricket when they aren’t on national duty? If this… — Irfan Pathan (@IrfanPathan) February 29, 2024 -
అదేనా అయ్యర్ చేసిన తప్పు? శ్రేయస్ మళ్లీ ఎంట్రీ ఇస్తాడా?
శ్రేయస్ అయ్యర్.. గత కొంత కాలంగా టీమిండియా మిడిలార్డర్లో నిలకడకు పెట్టింది పేరు. మూడు ఫార్మాట్లలో మిడిలార్డర్లో విరాట్ కోహ్లి తర్వాత అంతటి సత్తా ఉన్న ఆటగాడిగా అయ్యర్ పేరొందాడు. వన్డే ప్రపంచకప్లో ఫైనల్కు చేరడంలో అయ్యర్ ది కీలక పాత్ర. వరల్డ్కప్ హిస్టరీలోనే సింగిల్ ఎడిషన్లో 500పైగా పరుగులు చేసిన ఏకైక భారత ఆటగాడు అయ్యరే. 2022 నుంచి మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా ఈ ముంబైకర్ కొనసాగుతున్నాడు. అటువంటి అయ్యర్ ఇప్పుడు ఏకంగా ఎందుకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ను కోల్పోవాల్సి వచ్చింది? భారత క్రికెట్ బోర్డు సరైన నిర్ణయం తీసుకుందా? అన్న ప్రశ్నలు సగటు అభిమానిలో రేకెత్తుతున్నాయి. అదేనా అయ్యర్ చేసిన తప్పు? స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో శ్రేయస్ అయ్యర్ భాగమయ్యాడు. అయితే తొలి రెండు టెస్టుల్లోనూ ఈ ముంబైకర్ పెద్దగా అకట్టుకోలేకపోయాడు. అనంతరం ఆఖరి మూడు టెస్టులకు ప్రకటించిన భారత జట్టులో అనూహ్యంగా శ్రేయస్కు చోటు దక్కలేదు. అయితే అతడి వెన్ను గాయం తిరగబెట్టిందని అందుకే సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారని తొలుత వార్తలు వినిపించాయి. అయ్యర్ కూడా వైజాగ్ టెస్టు అనంతరం నేరుగా బెంగళూరులోని ఏన్సీఏకు వెళ్లిపోయాడు. కానీ ఫామ్ లేమి కారణంగానే అయ్యర్ను పక్కన పెట్టారని తర్వాత బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే సరిగ్గా ఇదే సమయంలో సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లందరూ టీండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వాలంటే కచ్చితంగా రంజీలు ఆడాల్సిందేనని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో రంజీ ట్రోఫీ 2023-24 క్వార్టర్స్లో ఆడాలని ముంబై క్రికెట్ ఆసోషియేషన్ అతడిని కోరింది. కానీ కానీ అయ్యర్ మాత్రం తన వెన్ను నొప్పితో బాధపడుతున్నాని, అందుబాటులో ఉండనని తేల్చిచేప్పేశాడు. అయితే తన ప్రకటనకు ఒక్క రోజే ముందే అయ్యర్ ఫిట్నెస్గా ఉన్నట్లు ఏన్సీఏ సర్టిఫికెట్ ఇవ్వడం గమనార్హం. దీంతో అయ్యర్ కావాలనే రంజీలు ఆడకుండా తప్పించుకున్నాడని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో బీసీసీఐ అతడిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించేందుకు సిద్దమైందని పలు రిపోర్ట్లు వెల్లడించాయి. ఈ వార్తలు ప్రచారంలో ఉన్న సమయంలోనే అయ్యర్పై బీసీసీఐ వేటు వేయడం గమనార్హం. బీసీసీఐ సరైన నిర్ణయం తీసుకుందా? అయితే బీసీసీఐ తీసుకున్న నిర్ణయం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రేడ్-బిలో ఉన్న ఆటగాడిని ఒక్కసారిగా తప్పించాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దేశవాళీ క్రికెట్ ఆడనంత మాత్రానా గతేడాదిగా భారత జట్టుతో ఉంటూ.. ఎన్నో అద్భుత విజయాలు అందించిన ఆటగాడి పట్ల బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైనది కాదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ అతడికి పన్మిషెంట్ ఇవ్వాలనకుంటే గ్రేడ్-సి డిమోషన్ చేయవలసిందని మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. భారత జట్టు తరపున అయ్యర్ ఆడిన ఇన్నింగ్స్ల వీడియోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ సపోర్ట్గా నిలుస్తున్నారు. మరి కొంత మంది అయ్యర్ 100 శాతం ఫిట్నెస్గా లేడని అందుకే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని పోస్ట్లు చేస్తున్నారు. కాగా అయ్యర్తో పాటు మరో యువ ఆటగాడు ఇషాన్ కిషన్ కూడా బీసీసీఐ కాంట్రాక్ట్ను కోల్పోయాడు. చదవండి: Babar Azam AFG Captain Photo Viral: అఫ్గానిస్తాన్ కెప్టెన్గా బాబర్ ఆజం..!? -
సర్ఫరాజ్ ఖాన్, దృవ్ జురెల్లకు జాక్పాట్
టీమిండియా బ్యాటింగ్ సంచలనాలు సర్ఫరాజ్ ఖాన్, దృవ్ జురెల్లకు జాక్పాట్ కొట్టే ఛాన్స్ వచ్చింది. ఇంగ్లండ్తో జరుగబోయే తదుపరి టెస్ట్లో ఈ ఇద్దరు తుది జట్టులో ఉంటే, వీరికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లు దక్కనున్నాయి. బీసీసీఐ కాంట్రాక్ట్ దక్కాలంటే ఆటగాళ్లు టీమిండియా తరఫున కనీసం 3 టెస్టులు లేదా ఎనిమిది వన్డేలు లేదా పది టీ20లు ఆడాల్సి ఉంటుంది. అయితే వీరిద్దరు ఇప్పటివరకు రెండు టెస్ట్ మ్యాచ్లే ఆడారు. ఈ రెండు మ్యాచ్ల్లో వీరిద్దరి ప్రదర్శనను పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ.. మూడు మ్యాచ్ల అనంతరం వీరికి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఇద్దరు ఆటగాళ్ల తాజా ఫామ్ను బట్టి చూస్తే వీరు ఐదో టెస్ట్కు తుది జట్టులో ఉండటం దాదాపుగా ఖాయమేనని చెప్పాలి. దీంతో వీరికి గ్రేడ్ సి కింద బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కడం దాదాపుగా ఖరారైందనే చెప్పాలి. కాగా, 2023-24 సంవత్సరానికి గాను సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ఇవాళ (ఫిబ్రవరి 28) ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 30 మంది ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. ఏ ప్లస్ కేటగిరిలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా.. ఏ కేటగిరిలో అశ్విన్, షమీ, సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా.. బి కేటగిరిలో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్.. సి కేటగిరిలో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ద్ కృష్ణ, అవేశ్ ఖాన్, రజత్ పాటిదార్ చోటు దక్కించుకున్నారు. రంజీల్లో ఆడాల్సిందేనన్న బీసీసీఐ ఆదేశాలను బేఖాతరు చేసిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కాంట్రాక్ట్లను కోల్పోగా.. రింకూ సింగ్ (సి), తిలక్ వర్మ (సి), ప్రసిద్ద్ కృష్ణ (సి), అవేశ్ ఖాన్ (సి), రజత్ పాటిదార్ (సి), జితేశ్ శర్మ (సి), ముకేశ్ కుమార్ (సి), రవి బిష్ణోయ్కు (సి) కొత్తగా కాంట్రాక్ట్ లభించింది. శ్రేయస్ (బి), ఇషాన్లతో (సి) పాటు యుజ్వేంద్ర చహల్ (సి), చతేశ్వర్ పుజారా (బి), దీపక్ హుడా (సి), ఉమేశ్ యాదవ్ (సి), శిఖర్ ధవన్ (సి) బీసీసీఐ కాంట్రాక్ట్లు కోల్పోయారు. కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, సిరాజ్లకు బి నుంచి ఏ కేటగిరికి ప్రమోషన్ లభించగా.. అక్షర్ పటేల్, రిషబ్ పంత్లకు ఏ నుంచి బి కేటగిరికి డిమోషన్ వచ్చింది. గతేడాది బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లో లేని యశస్వి జైస్వాల్.. ప్రస్తుత ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్లో అత్యుత్తమంగా (వరుస డబుల్ సెంచరీలు) రాణించడంతో అతనికి నేరుగా బి గ్రేడ్ కాంట్రాక్ట్ దక్కింది. ఏ ప్లస్ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లకు వార్షిక వేతనం కింద యేటా రూ. 7 కోట్లు దక్కనున్నాయి. ‘ఏ’ కేటగిరీలోని క్రికెటర్లకు రూ. 5 కోట్లు..‘బి’ కేటగిరిలో ఉన్న వారికి రూ. 3 కోట్లు.. ‘సి’ కేటగిరిలో ఉన్న క్రికెటర్లకు కోటి రూపాయల వార్షిక వేతనం లభించనుంది. -
అనుకున్నదే అయ్యింది.. బీసీసీఐ కాంట్రాక్ట్ కోల్పోయిన ఇషాన్, శ్రేయస్
భారత క్రికెట్ అభిమానులు ఊహించిందే నిజమైంది. రంజీల్లో ఆడమని ఎంత చెప్పినా వినకుండా విర్రవీగిన ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ను కోల్పోయారు. తాజాగా ప్రకటించిన బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో వీరిద్దరి పేర్లు గల్లంతయ్యాయి. ప్రస్తుతం బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లభించిన ఆటగాళ్లలో రోహిత్, కోహ్లి, బుమ్రా, జడేజా ఏ ప్లస్ స్థానాలను నిలుపుకోగా.. బి కేటగిరి నుంచి శ్రేయస్, సి కేటగిరి నుంచి ఇషాన్ తొలగించబడ్డారు. గతకొంతకాలంగా జట్టులో లేనప్పటికీ హార్దిక్ పాండ్యా ఏ గ్రేడ్ కాంట్రాక్ట్ను నిలుపుకోగా.. కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, సిరాజ్లకు ప్రమోషన్ (బి నుంచి ఏ కేటగిరి) దక్కింది. యశస్వికి జాక్పాట్.. గతేడాది బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లో లేని యశస్వి జైస్వాల్.. ప్రస్తుత ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్లో అత్యుత్తమంగా (వరుస డబుల్ సెంచరీలు) రాణించడంతో అతనికి నేరుగా బి గ్రేడ్ కాంట్రాక్ట్ దక్కింది. కాంట్రాక్ట్ కోల్పోయిన వారు వీరే.. బీసీసీఐ తాజాగా ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో చాలా మంది పేర్లు కనపడలేదు. యుజ్వేంద్ర చహల్ (సి), చతేశ్వర్ పుజారా (బి), దీపక్ హుడా (సి), ఉమేశ్ యాదవ్ (సి), శిఖర్ ధవన్ (సి) బీసీసీఐ కాంట్రాక్ట్లు కోల్పోయారు. అక్షర్, పంత్లకు డిమోషన్ (ఏ నుంచి బి) కొత్తగా కాంట్రాక్ట్ దక్కించుకున్న తిలక్ వర్మ, రింకూ సింగ్ కేటగిరి వారీగా ఆటగాళ్లకు దక్కనున్న మొత్తం.. ఏ ప్లస్ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లకు వార్షిక వేతనం కింద యేటా రూ. 7 కోట్లు దక్కనున్నాయి. ‘ఏ’ కేటగిరీలోని క్రికెటర్లకు రూ. 5 కోట్లు..‘బి’ కేటగిరిలో ఉన్న వారికి రూ. 3 కోట్లు.. ‘సి’ కేటగిరిలో ఉన్న క్రికెటర్లకు కోటి రూపాయల వార్షిక వేతనం లభించనుంది. 2023-24 బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకున్న ఆటగాళ్ల వివరాలు.. ఏ ప్లస్ కేటగిరి: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఏ కేటగిరి: అశ్విన్, షమీ, సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా బి కేటగిరి: సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్ సి కేటగిరి: రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ద్ కృష్ణ, అవేష్ ఖాన్, రజత్ పాటిదార్ చదవండి: రంజీల్లో ఆడాల్సిందే.... ఆటగాళ్లకు బీసీసీఐ స్ట్రిక్ట్ వార్నింగ్ -
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ..
Shreyas Iyer named in Mumbai squad: టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో తిరిగి అడుగుపెట్టనున్నాడు. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ముందు ఆంధ్రతో మ్యాచ్లో ఆడిన ఈ ముంబై బ్యాటర్.. తాజాగా సెమీ ఫైనల్ మ్యాచ్తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదేశాల మేరకు తప్పక రంజీ బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో తమిళనాడుతో సెమీస్ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్కు చోటు ఇచ్చినట్లు ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు అజింక్య రహానే సారథ్యంలోని 16 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది. కాగా ముంబై- తమిళనాడు మధ్య మార్చి 2 నుంచి రంజీ సెమీ ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుంది. వెన్ను నొప్పి అని చెబితే ఎన్సీఏ మాత్రం అలా ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో సిరీస్లో అయ్యర్ పూర్తిగా నిరాశపరిచిన విషయం తెలిసిందే. తొలి రెండు టెస్టుల్లో ఆడి మొత్తంగా కేవలం 104 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో మూడో టెస్టు నుంచి జట్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో రంజీ బరిలో దిగాలన్న బీసీసీఐ నిబంధన నుంచి తప్పించుకునేందుకు వెన్నునొప్పిని కారణంగా చూపాడు. అయితే, జాతీయ క్రికెట్ అకాడమీ మాత్రం అయ్యర్ పూర్తి ఫిట్గా ఉన్నాడని ముంబై క్రికెట్ అసోసియేషన్కు తెలిపినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో రంజీ ట్రోఫీలో ఆడకూడదనే శ్రేయస్ అయ్యర్ ఇలా చేసి ఉంటాడని.. ఈ నేపథ్యంలో అతడిపై గుర్రుగా ఉన్న బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించే యోచనలో ఉందని వదంతులు వ్యాపించాయి. అయితే, తాజాగా తాను ఫిట్గా ఉన్నానంటూ అయ్యర్ రంజీల్లో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం కావడం గమనార్హం. తమిళనాడుతో సెమీస్కు ముంబై జట్టు: అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్, పృథ్వీ షా, భూపేన్ లాల్వానీ, అమోగ్ భత్కల్, ముషీర్ ఖాన్, ప్రసాద్ పవార్, హార్దిక్ తామోర్, శార్దూల్ ఠాకూర్, షామ్స్ ములానీ, తనూష్ కొటియాన్, ఆదిత్య ధుమాల్, తుషార్ దేశ్పాండే, మోహిత్ అవస్తి, రాయ్స్టన్ డయాస్, ధావల్ కులకర్ణి. చదవండి: Rohit Sharma: ఆ మాత్రం విశ్వాసం లేకపోతే ఎట్లా? రోహిత్ వ్యాఖ్యలపై టీమిండియా దిగ్గజం స్పందన