Sivakumar
-
తెలుగోళ్లు మెచ్చిన తమిళ స్టార్ హీరో.. సూర్య బర్త్డే స్పెషల్ (ఫొటోలు)
-
తెనాలి ఎమ్మెల్యేపై యువకుడి దాష్టీకం
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలి వైఎస్సార్సీపీ అభ్యర్థిపై సామాజికవర్గం ముసుగులో కూటమికి చెందిన ఓ యువకుడు ఆయన భార్య సమక్షంలోనే అవమానించి... రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించారు. ఆగ్రహించిన ఆయన చేయి చేసుకోవడంతో సోషల్ మీడియాలో దు్రష్పచారానికి తెగబడ్డారు. అంతేగాకుండా ఈసీకి ఫిర్యాదు చేసి ఆయన్ను తిర గనీయకుండా గృహనిర్బంధం చేశారు. అయితానగర్లో సోమవారం ఉదయం ఓటు వేసేందుకు భార్యతో సహా వచ్చిన ఎమ్మెల్యే శివకుమార్ను అప్పటికే క్యూలో ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి గొట్టిముక్కల సుధాకర్ అడ్డుకున్నాడు.క్యూలో వెళ్లకుండా నేరుగా లోపలకు వెళ్లడమేంటన్న మిషతో దుర్భాషలాడాడు. అయినా మౌనంగా లోపలకు వెళ్లి ఓటేసి వస్తుంటే, మళ్లీ అదే వ్యక్తి అడ్డుకున్నాడు. కులాల పేర్లు ప్రస్తావిస్తూ ‘ఆ పార్టీలో ఉండటమేమిటి’ ను వ్వు కమ్మోడివి కావా?’ అని రెచ్చగొట్టాడు. ఇంకా కవి్వంపు చర్యలకు పాల్పడటమే గాకుండా భార్య ముందే అసభ్యంగా మాట్లాడటంతో తట్టుకోలేకపోయిన శివకుమార్ అతడి చెంపపై కొట్టాడు.సుధాకర్ కూడా తిరిగి చేయి చేసుకోవడంతో ఎమ్మెల్యే పక్కనే ఉన్న కార్యకర్తలు అతడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటనను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీనిని ఆసరాగా చేసుకుని టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదుచేసి, పోలింగ్ సరళిని పర్యవేక్షించే అవకాశం లేకుండా గృహనిర్బంధం విధించేలా చేశారు. ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదు చేశారు. మనోహర్తో కలిసి చేసిన కుట్ర తనను రెచ్చగొట్టి ఏదోలా గొడవ సృష్టించి పోలింగ్ రోజున డ్యామేజ్ చేయాలని జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్, గొట్టిముక్కల సుధాకర్ కుట్ర పన్నారని ఎమ్మెల్యే శివకుమార్ ఆరోపించారు. -
అభిమానితో దురుసు ప్రవర్తన? హీరో సూర్య తండ్రిపై విమర్శలు
తమిళ స్టార్ హీరో సూర్యకి తెలుగులోనూ కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అమ్మాయిల్లో క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూర్య పెద్దగా వివాదాల జోలికి పోడు. తాజాగా ఈ హీరో తండ్రి మాత్రం ఓ అభిమానితో దురుసుగా ప్రవర్తించారని, తెచ్చిన శాలువా విసిరేశారని అంటూ ఓ వీడియో వైరల్ అయింది. దీంతో సూర్య తండ్రిపై విమర్శలు వచ్చాయి. దీంతో అసలేం జరిగింది? ఎందుకు అలా ప్రవర్తించాల్సి వచ్చిందని స్వయనా సూర్య తండ్రి క్లారిటీ ఇచ్చేశారు. ఏం జరిగింది? నటుడు, డబ్బింగ్ ఆర్టిస్టుగా గుర్తింపు శివకుమార్ తాజాగా చెన్నైలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈవెంట్ పూర్తయిన తర్వాత బయటకు వెళ్తున్న క్రమంలోనే ఓ వ్యక్తి, ఈయన కోసం శాలువా తీసుకొచ్చాడు. దాని ఒంటిపై కప్పబోతుంటే.. శివకుమార్ దాన్ని చేతిలోకి తీసుకుని కింద పడేశారు. అయితే శాలువా పట్టుకొచ్చిన వ్యక్తి శివకుమార్కి ఫ్రెండ్ మనవడే. దీంతో చనువు కొద్ది నాకెందుకురా అనే ఉద్దేశంతోనే విసిరేశారట. (ఇదీ చదవండి: నేను బతికే ఉన్నాను.. రూమర్స్పై యువనటి క్లారిటీ) 50 ఏళ్ల నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ 'వీడియోలో ఉన్నది మా తాత కరీమ్. శివకుమార్, ఆయన గత 50 ఏళ్ల నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. శాలువా ఇస్తున్నప్పుడు.. ఎందుకురా ఇవన్నీ అని జోక్ చేస్తూ దాన్ని విసిరేశారు. వెళ్దాం పద అని తాతతో పాటు కిందకు వెళ్లిపోయారు. శాలువా నీ దగ్గరే ఉండనివ్వు అని మా తాతతో అన్నారు. మా తాత కారైకుడీలో ఉంటారు. అక్కడ జరిగిన ఈవెంట్కే శివకుమార్ అతిథిగా వెళ్లారు. నిజమేంటో తెలియకుండా తప్పుడు ప్రచారం చేయొద్దు' అని కరీమ్ మనవడు రిఫాయ్ చెప్పుకొచ్చాడు. శివకుమార్ ఏం చెప్పారు? 'నేను, కరీమ్ చాలా క్లోజ్. కానీ కొత్తగా నా కోసం శాలువా తీసుకొచ్చాడు. కానీ ఇదంతా నచ్చక తిరిగిచ్చేశాను. అయితే ఆ రోజు సరిగా విశ్రాంతి లేకపోవడం వల్ల స్పీచే కష్టంగా ఇచ్చాను. అన్ని పూర్తి చేసుకుని బయటకొస్తుంటే శాలువా తీసుకొచ్చాడు. కానీ అది కిందపడేయడం నా తప్పే. దానికి నేను సారీ చెబుతున్నా' అని శివకుమార్ ఓ వీడియోలో చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా) -
విజయ్కాంత్ లేరనే వార్త జీర్ణించుకోలేకపోతున్నా: కార్తీ
దివంగత నటుడు, డీఎండీకే పార్టీ అధ్యక్షుడు విజయ్కాంత్కు దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం తరపున ఈ నెల 19న సంస్మరణ సభను నిర్వహించనున్నట్లు హీరో, ఆ సంఘం కోశాధికారి కార్తీ తెలిపారు. గత నెల 28న విజయ్కాంత్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆ సమయంలో పలువురు సెలబ్రిటీలు ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించగా.. కొందరు ఇతర ప్రాంతాల్లో ఉండటం కారణంగా సంతాపం తెలుపలేకపోయారు. అందులో హీరో కార్తీ ఒకరు. గురువారం చైన్నెకి చేరుకున్న ఆయన తన తండ్రి శివకుమార్, సోదరుడు సూర్యతో కలిసి స్థానిక కోయంబేడులోని డీఎండీకే పార్టీ కార్యాలయ ఆవరణలో విజయకాంత్ సమాధిని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విజయ్కాంత్ మన మధ్య లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని వాపోయారు. దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా ఆయన్ని కలిసినప్పుడు చాలా ఉత్సాహంగా మాట్లాడారని పేర్కొన్నారు. అధ్యక్షుడు అంటే మార్గదర్శిగా నిలవాలన్నది విజయ్కాంత్ నుంచే నేర్చుకున్నట్లు తెలిపారు. కాగా జనవరి 19న తమ సంఘం తరపున విజయ్కాంత్కు సంస్మరణ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. • Exclusive - #Sivakumar Sir, @Karthi_Offl Anna At Captain #Vijayakanthsir 's Home For Grieving The Loss Of Their Loved One | @prabhu_sr #Karthi pic.twitter.com/pzMldSMoez — Yogesh Yogi (@YogeshY16480498) January 5, 2024 చదవండి: ఒక కన్నులో ధైర్యం, మరో కన్నులో కరుణ.. అంటూ బోరున ఏడ్చిన సూర్య -
మా నామినేషన్లు చెల్లకుండా చేసే కుట్ర
బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేడితో పాటే అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కూడా తారస్థాయికి చేరుతోంది. తమ నామినేషన్లను ఏదోలా చెల్లకుండా చేసేందుకు బసవరాజ్ బొమ్మై సర్కారు భారీ కుట్రకు తెర తీస్తోందని పీసీసీ చీఫ్ శివకుమార్ మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. తమ అభ్యర్థుల నామినేషన్లలో ఏదో ఒక లోపాన్ని వెతకాలని, అలాగే బీజేపీ నామినేషన్లలో ఏమైనా తప్పులుంటే సరి చేయాలని రిటర్నింగ్ ఆఫీసర్లందరి మీదా ఎంతగానో ఒత్తిడి తెస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు స్వయానా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే వారికి ఫోన్లు వెళ్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తక్షణం రంగంలోకి దిగి దీనిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. సీఎంఓ కాల్ డీటైల్స్ తెప్పించుకుని పరిశీలించాలని సూచించారు. బీజేపీ అధికార దుర్వినియోగానికి అంతూ పొంతూ లేకుండా పోతోందంటూ దుయ్యబట్టారు. ‘‘ఈ కుట్రకు సంబంధించి మా దగ్గర సాక్ష్యాలున్నాయి. సౌందత్తి ఎల్లమ్మ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి నామినేషన్ పత్రాల్లో తప్పులున్నాయి. వాటిని సరిచేయాల్సిందిగా సీఎంఓ నుంచి ఆర్ఓకు ఫోన్ వెళ్లింది. ఇక నా నామినేషన్ను ఏదోలా తిరస్కరింపజేసేందుకు బీజేపీ తరఫున పెద్ద టీమే రంగంలోకి దిగింది. నా పరిస్థితే ఇలా ఉంటే ఇతర సాధారణ అభ్యర్థుల సంగతేమిటో అర్థం చేసుకోవచ్చు’’ అన్నారు. -
తెనాలికి సీఎం వరాలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ విజ్ఞప్తి మేరకు నియోజకవర్గంలో పలు కార్యక్రమాల కోసం నిధులను మంజూరు చేస్తున్నట్లు మంగళవారం పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ► తెనాలిలో మున్సిపల్ భవనం కోసం రూ.15 కోట్లు ► షాదీ ఖానా కోసం రూ.4 కోట్లు ► ఎస్సీ కాలనీలో స్మశానవాటిక కోసం రూ.9 కోట్లు ► కొల్లిపర మండలంలో అగ్రికల్చర్ మినీ మార్కెట్ యార్డు భూముల కొనుగోలు కోసం రూ.5 కోట్లు ► దుగ్గిరాల– కొల్లిపర రోడ్డు విస్తరణకు రూ.10 కోట్లు డ్రోన్ను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నదాతలు ఆశీస్సులు అందించాలి అన్నదాతలకు అన్ని విధాలా అండగా ఉంటున్న సీఎం వైఎస్ జగన్కి సంపూర్ణ ఆశీస్సులు అందించాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల కోసం నూటికి నూరు శాతం బీమా ప్రీమియాన్ని భరిస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్. సున్నా వడ్డీ రుణాలు ఇస్తున్నాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుంచి విక్రయం వరకు అండగా నిలుస్తున్నాం. రైతే అసలైన శాస్త్రవేత్త అని నమ్మి వ్యవసాయ సలహా మండలి ఏర్పాటు చేసి లక్ష మంది రైతులతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఇవన్నీ కొన్ని పత్రికలకు, టీడీపీ నాయకులకు పట్టడం లేదు. గాడిదలకు ఏం తెలుసు గంధపు చెక్కల వాసన అన్న మాదిరిగా వ్యవహరిస్తున్నారు. – కాకాణి గోవర్ధన్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి వారి నోటిని వేటితో కడగాలి? పేద ఎస్సీ మహిళా కౌలు రైతునైన నాకు సెంటు భూమి కూడా లేదు. 6 ఎకరాలు కౌలుకు తీసుకుని పసుç³#, వరి సాగు చేస్తున్నా. కరోనా సమయంలో పసుపు రూ. 5,500 ఉంటే మీరు రూ.6,850 ప్రకటించడంతో లబ్ధి పొందాం.గతేడాది పసుపు వర్షాలతో దెబ్బతింటే ఇన్సూరెన్స్ కింద రూ.80వేలు వచ్చాయి. టైలరింగ్ కూడా చేస్తున్న నాకు చేయూత సాయం అందుతోంది. మీరు పాదయాత్ర చేసినప్పుడు ప్రజలు బ్రహ్మరథం పట్టగా కొంతమంది మాత్రం మీరు వెళ్లిన తర్వాత తుడిచేశారు. ఇప్పుడు కొందరు పాదయాత్ర చేస్తున్నారు. వారి మాటలూ వింటున్నాం. మరి వాళ్ల నోటిని వేటితో కడగాలి? – పి.మేరిమ్మ, రేవేంద్రపాడు, దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా -
సంక్రాంతికి బుల్లితెరపై సూర్య తండ్రి శివకుమార్ తిరుక్కురళ్ 100
తమిళసినిమా: సీనియర్ నటుడు, హీరో సూర్య తండ్రి శివకుమార్ గొప్ప నటుడు అన్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఉత్తమ నటుడుగా కంటే మంచి చిత్ర కళాకారుడు అనిపించుకోవడమే గర్వంగా భావిస్తారు. శివకుమార్ మంచి చిత్రకారుడు అన్న విషయం తెలిసిందే. నాలుగు దశాబ్దాలకు పైగా కథానాయకుడిగా సాంఘిక, చారిత్రక, పౌరాణిక కథా చిత్రాలు చేసి శభాష్ అనిపించుకున్న శివకుమార్ నటనకు స్వస్తి చెప్పి దశాబ్దంన్నరకు పైనే అయ్యింది. అయితే ఆయన ప్రశాంతి దశలో మాత్రం లేరు. కంబ రామాయణం, మహాభారతం వంటి పురాణం గ్రంథాలను అవపోసన చేసి వేదికలపై గంటల తరబడి ప్రవచనాలు చెబుతూ ప్రేక్షకులను ఉత్తేజ పరుస్తున్నారు. తాజాగా తిరుక్కురళ్ 100 పేరుతో ముఖ్య అంశాలకు తన జీవిత అనుభవాలను జోడించి ఓ గ్రంథాన్ని రచించారు. దానిని ఇటీవల ఈరోడ్లో వేలాదిమంది ప్రేక్షకుల సమక్షంలో ఏకధాటిగా ఉపన్యసించి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఇంతకుముందు పరిధి పరిమేలముగర్ నుంచి సాల్మన్ పాపయ్య వరకు పలువురు ప్రముఖ రచయితలు తిరుక్కురళ్కు పరిభాషను రచించారు. అయితే తిరుక్కురళ్లోని ముఖ్య అంశాలకు తన అనుభవాలను జోడించి రచించింది నటుడు శివకుమారేనని అభినందనలు అందుకుంటున్నారు. కాగా ఈయన రాసి, ఉపన్యసించిన తిరుక్కురళ్ 100 కార్యక్రమాన్ని పుదియ తలైమురై టీవీ ఛానల్ సంక్రాంతి సందర్భంగా ఈ నెల 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ప్రచారం చేయనుంది. అదే విధంగా పుదుయుగం ఛానల్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26వ తేదీన ఉదయం 10 గంటల నుంచి ప్రచారం చేయనుందని నటుడు శివకుమార్ శనివారం సాయంత్రం చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. -
శివ వెనకున్నవారినీ శిక్షించాలి
సాక్షి, వరంగల్: న్యాయ విద్యార్థినిపై లైంగికదాడి కేసులో అరెస్టయిన వేముల శివకుమార్ను శిక్షించాలని కాంగ్రెస్, బీజేపీలు డిమాండ్ చేశాయి. తన పీఏ పోక్సో కేసులో అరెస్టవ్వడానికి నైతిక బాధ్యత వహిస్తూ వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పదవికి రాజీనామా చేయాలని పట్టుబట్టాయి. శివతోపాటు ఆయన వెనుక ఉన్న అధికార పార్టీ వారికి శిక్ష పడేలా పోలీసుల దర్యాప్తు సాగాలని కోరాయి. అత్యాచారానికి పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ ఎంజీఎం జంక్షన్లోని రాజీవ్గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ, వరంగల్ చౌరస్తాలో బీజేపీ నేతలు నిరసన కార్యక్రమాలు చేశారు. ప్రభుత్వ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. ఆందోళనకు దిగిన మాజీ మంత్రి కొండా సురేఖ, వరంగల్, హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యతోపాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. మట్టెవాడ ఠాణాకు తరలించి శివకుమార్తో పాటు విజయ్కుమార్, హాస్టల్ నిర్వాహకురాలును పోలీసులు అరెస్టు చేశారు. -
వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవం..సాక్షి ఫోటో జర్నలిస్టులకు సన్మానం
-
ఉత్తమ అవార్డుకు సాక్షి ఫొటోగ్రాఫర్ ఎంపిక
భువనగిరి: స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫొటోగ్రఫీ అకాడమీ ఆధ్వర్యంలో విజయవాడలో ‘వన్ నేషన్ వన్ ఫ్లాగ్’పై నిర్వహించిన పోటీల్లో సాక్షి దినపత్రిక యాదాద్రి భువనగిరి జిల్లా ఫొటోగ్రాఫర్ కోల్లోజు శివకుమార్ పంపిన చిత్రం ఎంపికైంది. ఈనెల 19న విజయవాడలో జరగనున్న కార్యక్రమంలో శివకుమార్ అవార్డు అందుకోనున్నారు. -
సింపుల్గా బీఏ రాజు కుమారుడి వివాహం.. ఫోటోలు వైరల్
BA Raju Son Siva Kumar Marriage Pics Goes Viral: ప్రముఖ దివంగత నిర్మాత బీఏ రాజు తనయుడు, డైరెక్టర్ శివకుమార్ వివాహబంధంలోకి అడుగుపెట్టాడు. స్నేహితురాలు లావణ్యతో ఆయన ఈనె 22న ఆయన పెళ్లి జరిగింది. శివకుమార్కు చాలా ఇష్టమైన సంఖ్య 22. అందుకే ఆయన తొలి చిత్రానికి సైతం శివకుమార్ ’22’ అనే పేరే పెట్టారు. ఇక 2022, జనవరి22వ తేదీ, 22 గంటలకు పెళ్లి చేసుకోవడం విశేషం. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఆయన వివాహం నిరాడంబరంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా శివకుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'పూణెకి చెందిన మరాఠీ అమ్మాయి, నా స్నేహితురాలు దండిగే లావణ్యతో వివాహం జరిగింది. మేం ఇద్దరం కలిసి మా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. మీ అందరి ఆశీస్సులు కావాలి' అంటూ పేర్కొన్నారు. ఇక కొత్త జంటకు పలువురు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. కాగా పూరి జగన్నాథ్, వివి. వినాయక్ వంటి టాప్ డైరెక్టర్స్ వద్ద సహాయ దర్శకుడిగా చేసిన శివకుమార్.. శివకుమార్ ’22’అనే సినిమా ద్వారా దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. Today Got Married To My Bestie Dandige Lavanya , Marathi Girl From Pune Settled In Hyderabad . Need All Your Blessings As We Start Our New Journey Together. Thanks & Love You All ❤️ pic.twitter.com/bH8Yu1tos3 — Shiva Kumar B (@ShivaKumarB22) January 22, 2022 -
3 టన్నుల ఇనుముతో 14 అడుగుల అంబేడ్కర్ విగ్రహం
తెనాలి: తెనాలి శిల్పకారులు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 14 అడుగుల విగ్రహాన్ని ఇనుప వ్యర్థాలతో తయారు చేశారు. సూర్య శిల్పశాల నిర్వహకులైన తండ్రీకొడుకులు కాటూరి వెంకటేశ్వరరావు, కాటూరి రవిచంద్రలు 3 టన్నుల ఇనుప వ్యర్థాలను ఉపయోగించి, 3 నెలల శ్రమతో అంబేడ్కర్ విగ్రహాన్ని వీరు తీర్చిదిద్దారు. శిల్పశాల ఎదుట ఈ విగ్రహాన్ని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆదివారం ఆవిష్కరించారు. అంబేడ్కర్ విగ్రహంతో ఎమ్మెల్యే శివకుమార్ -
నేను ప్రేమించా.. నువ్వు పెళ్లి చేసుకోవద్దు
బచ్చన్నపేట: ఇద్దరూ క్లాస్మేట్స్.. కలసి చదువుకున్నారు.. ఆ రకంగా ఏర్పడిన చనువు ప్రేమగా మారింది. ఈ ప్రేమ యువతి పెళ్లి చెడిపోవడానికి కారణమైంది.. దీంతో కక్ష పెంచుకున్న ఆమె సోదరుడు.. చెల్లెలిని ప్రేమించిన యువకుడిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూర్ కమాన్ వద్ద శుక్రవారం జరిగింది. ఎస్సై రఘుపతి కథనం ప్రకారం.. మండలంలోని కొన్నె గ్రామానికి చెందిన పేర్ని కొమురమ్మ, తిరుపతి దంపతులకు ముగ్గురు కుమారులు. (పోలీసుల అదుపులో యాకూబ్.. సెల్ఫోన్లు ఎక్కడ?) కాగా, కొమురమ్మ దంపతులు ఇద్దరు కుమారులతో కలసి జీవనోపాధి కోసం ముంబై వెళ్లగా.. రెండో కుమారుడు శ్రీధర్ను అమ్మమ్మ వద్ద మండలంలోని కొడవటూర్లో చదివించారు. ఇదే గ్రామానికి చెందిన ఓ యువతి, శ్రీధర్ కలసి ఒకే కళాశాలలో ఇంటర్మీడియెట్ చదివారు. ప్రస్తుతం యువతి హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో నర్సు శిక్షణ చేస్తుండగా, శ్రీధర్ (22) హైదరాబాద్లోనే ఓ హోటల్లో క్యాషియర్గా పని చేస్తున్నాడు. లాక్డౌన్ కావడంతో ఇద్దరూ కొడవటూర్ గ్రామంలోనే ఉంటున్నారు. (బెంగాలీ కుటుంబం.. విషాదాంతం) నేను ప్రేమించాను.. నువ్వు పెళ్లి చేసుకోవద్దు ఈ ప్రేమ వ్యవహారం యువతి ఇంట్లో తెలియడంతో వారు శ్రీధర్తో పాటు అతడి తాతను మందలించారు. ఇటీవల యువతికి పెళ్లి నిశ్చయమైంది. ఈ విషయం తెలుసుకున్న శ్రీధర్ ..ఆ యువతిని పెళ్లి చేసుకోబోయే యువకుడికి ఫోన్ చేసి తమ ప్రేమ విషయాన్ని చెప్పాడు. దీంతో పెళ్లి చేసుకోవడానికి ఆ అబ్బాయి నిరాకరించగా యువతి కుటుంబ సభ్యులు శ్రీధర్పై కక్ష పెంచుకున్నారు. శుక్రవారం ఉదయం ద్విచక్ర వాహనంపై కొడవటూర్ వెళుతున్న అతడిని యువతి సోదరుడు శివకుమార్ బచ్చన్నపేట – చేర్యాల మెయిన్ రోడ్డుపై కమాన్ వద్ద ఆటోతో ఢీకొట్టగా అతను కింద పడ్డాడు. అనంతరం శ్రీధర్ను కత్తితో పొడిచి హత్య చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
రాజనీతి
పూర్వం చంద్రగిరిని జయవర్ధనుడనే రాజు పాలించేవాడు. ఆయన పాలనలో సమర్థుడు. తన కాలంలో రాజ్యాన్ని బాగా విస్తరించడమే కాక ప్రజలను కన్నబిడ్డల వలే చూసేవాడు. రాజ్యం మధ్యన వున్న నది ఒడ్డున పెద్దకోట కట్టాడు. అది శత్రుదుర్భేద్యమైన కోట. ఆయనకు చెట్లంటే వల్లమాలిన అభిమానం. కోట లోపల వున్న అంతఃపురం చుట్టూ గొప్ప ఉద్యనవనాన్ని పెంచాడు. వాటిని చూడడానికి అనేకమంది పనివాళ్లను నియమించాడు. యుద్ధాలు లేని, రాజకీయంగా సమస్యలు లేని సమయాల్లో ఆయన సాయంత్రం ఉద్యానవనంలో సేదదీరేవాడు. ఆ సమయంలో అక్కడికి పండితులను రప్పించుకుని, వారి చేత రామాయణ, భారత, భాగవతాలను చదివింపజేసుకొని వినేవాడు. అందులోని ధర్మసూక్ష్మాలను వారితో చర్చించేవాడు. అయితే ఆయనకు పెద్ద కొరత ఉండేది, అదేమంటే సంతానం లేకపోవడం. ఎవరైనా ఆ విషయాన్ని ఆయన ముందు ఎత్తితే, ‘‘ఎందుకు బిడ్డలు లేరని బాధ పడటం? నా ప్రజలందరూ నా బిడ్డలే కదా! ఇందుకు నేను సంతోషపడాలిగాని, విచారించడం దేనికి? అది సరయింది కాదు’’ అనేవాడు. ‘‘అది కాదు ప్రభూ! తమ తర్వాత ఈ రాజ్యానికి వారసుడెవరా?’’ అని అంటే ‘‘అది భగవంతుడు నిర్ణయిస్తాడు, దానికి మనం బాధ పడటం దేనికి?’’ అనేవాడు మహారాజు. కాలం గడిచింది. రాజుగారు వృద్ధులయ్యారు. కాలం చేశారు. తరవాత వారసుడి గురించి సేనాధిపతి, మంత్రిని అడిగాడు. అప్పుడు మంత్రి, ‘‘మన రాజ్యానికి అనాదిగా ఒక ఆచారం వుంది. వారసుడు లేనప్పుడు మన పట్టపుటేనుగుకు ఒక దండ ఇచ్చి, అది ఎవరి మెడలో వేస్తే వారే రాజు! ఆ ఆచారాన్నే మనం ఇప్పుడు కూడా కొనసాగనిద్దాం’’ అన్నాడు. ‘‘ఏనుగుకు ఎవరు సమర్థుడో, ఎవడు కాదో ఎలా తెలుస్తుంది? ఒకవేళ ఒక అనర్హుడు అదృష్టవంతుడయితే మన రాజ్యం పరిస్థితి ఏమిటి? అధోగతే కదా?’’ అని సేనాధిపతి అన్నాడు. దానికి మంత్రి, ‘‘మన ప్రభువు గొప్ప దైవభక్తుడు, ఆయన ఆశీస్సులు మనకెప్పుడూ వుంటాయి. మన పట్టపుటేనుగు మనకు మంచి రాజును నిర్ణయిస్తుందని నాకు నమ్మకం వుంది’’ అన్నాడు. మంచి ముహూర్తం చూసి, మంత్రి పట్టపుటేనుగుకు మాల ఇచ్చి, రాజవీధుల గుండా నడిపించే ఏర్పాటు చేశాడు. హుందాగా పూలదండను తొండంతో పట్టుకుని రాజవీధుల గుండా నడుస్తూ చివరకు పట్టపుటేనుగు ఒక బలిష్ఠుడైన సామాన్యుడి మెడలో వేసింది. ఆశ్చర్యం! విచారిస్తే, వాడు కోటలో వున్న తోటమాలి కొడుకు, వీరభద్రుడు. మంత్రి అతణ్ణి రాజుగా ప్రకటించి, పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయసాగాడు. సేనాధిపతి, మంత్రితో ‘‘ఒక తోటమాలి కొడుకు ఇంత పెద్దరాజ్యాన్ని సమర్థంగా పరిపాలించగలడా? శత్రువుల బారి నుండి రాజ్యాన్ని కాపాడగలడా?’’ అంటూ సందేహం బయటపెట్టాడు. ఇదంతా వీరభద్రుడు విననే విన్నాడు. ‘‘అయ్యా! నేను తోటమాలి కొడుకునే. అయినంత మాత్రాన రాజ్యాన్ని పాలించలేనని ఎలా అనుకుంటున్నారు? ఎవరైనా అవకాశం రానంతవరకే సామాన్యులు. అవకాశం లభిస్తే వారిలోని శక్తిసామర్థ్యాలు వాటంతట అవే వెలుపలికి వస్తాయి’’ అంటూ ఈ శ్లోకం చెప్పాడు. యధా మధు సమాదత్తే రక్షాన్ పుష్పాణి షట్పదః తద్వ దర్థాన్మనుష్యే భ్య ఆద ద్యాద విహింసయా–అంటే ‘‘తుమ్మెదలు ఏ విధంగానయితే, తమకున్న శక్తియుక్తులతో పూలను పాడు చేయకుండా, వాని నుండి మహత్తరమైన తేనెను పొందుతాయో...అట్లే ప్రజారంజకుడైన రాజు తన ప్రజలను అన్ని విధాలైన ఆపదల నుండి కాపాడుతూనే రాజ్య క్షేమం కోసం వాని నుండి తగిన మేరకు శిస్తు మొదలైన వాటిద్వారా ధనాన్ని, ఏ విధమైన హింసకు తావు లేకుండా సన్మార్గాన గ్రహిస్తాడు’’ అని అర్థం చెప్పాడు. మంత్రి, సేనాధిసతి ఆశ్చర్యపోతుండగా వీరభద్రుడు ఇలా ఇలా అన్నాడు... పుష్పం పుష్పం విచిన్వీత మూలచ్ఛేదం నకారయేత్ మూలాకార ఇవారమే న యధా జ్ఞా ర క కారకః అంటూ అర్థం కూడా ఇలా చెప్పాడు వీరభద్రుడు. ‘‘తోటలో మాలి ఏ విధంగా ఒక్కొక్క పువ్వును ఎంతో జాగ్రత్తగా పువ్వు యొక్క మూలానికి హాని కలగకుండా పుష్పాలను కోస్తాడో, అదే విధంగా ప్రజారంజకుడైన రాజు తన ప్రజల జీవన మూలానికి ఎటువంటి కీడు కలిగించకుండా పన్నులు గ్రహిస్తాడు. అంతేగాని బొగ్గును తయారు చేసే వాడిలాగా మూలానికి హాని చేయడు’’ ఆశ్చర్యం నుంచి తేరుకొని మంత్రి ‘‘ఇవన్నీ భారతంలోని విదురనీతిలోనివి. నీకెలా తెలుసు? చూస్తే నీకు మంచి ధారణశక్తి వున్నట్టుంది’’ అన్నాడు. దానికి వీరభద్రుడు– ‘‘అయ్యా! నేను చిన్ననాటి నుండి రాజుగారి ఉద్యానవనంలో నా తండ్రితో పాటు కలిసి పనిచేస్తుండేవాణ్ణి! రాజుగారు సాయం సమయాల్లో జరిపే పండితగోష్ఠులను శ్రద్ధగా వినేవాడ్ని. పెద్దయితే నేను రాజుగారి కొలువులో ఏదైనా ఉద్యోగం చేయాలనుకునేవాణ్ణి, కాని అదృష్టం నన్ను రాజును చేసింది. నాకున్న జ్ఞానంతో నేను రాజ్యాన్ని సుభిక్షం చేయగలనన్న ఆత్మవిశ్వాసం నాకుంది’’ అన్నాడు. మంత్రికి ఎంతో తృప్తి కలిగింది. ఆయన సేనాధిపతి వైపు చూస్తూ ‘‘రాజుగారన్నట్లే భగవంతుడు మనకు మంచి రాజునే ఇచ్చాడు. ఇతనికి రాజనీతి తెలుసు. మన సహాయసహాకారాలు ఎలాగూ వుంటాయి గనక ఇబ్బంది ఏమి లేదు’’ అన్నాడు. సేనాపధిపతి సంతృప్తి పడ్డాడు. వారు ఊహించినట్టే వీరభద్రుడు అతి తక్కువ కాలంలోనే మంచిరాజుగా పేరు ప్రఖ్యాతలు పొందాడు. -
టిక్టాక్లో చూసి శివకుమార్ ఫిదా.. కానీ,
బెంగళూరు : టిక్టాక్ ద్వారా పరిచయమైన యువతికి ఓ యువకుడు రూ. లక్షలు ఇచ్చి మోసపోయిన ఘటన బెంగళూరులో జరిగింది. నగరానికి చెందిన శివకుమార్కు టిక్టాక్ ద్వారా విజయలక్ష్మీ అనే మహిళ పరిచయం అయింది. దీంతో శివకుమార్ ఫిదా అయ్యారు. ఆమె మొబైల్ నంబర్ తీసుకుని ఫేస్బుక్ ఖాతా ద్వారా చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. వీరి స్నేహం ప్రేమగా మారింది. కొద్ది రోజుల పాటు ఇద్దరు ఒకే ఇంటిలో సహ జీవనం కూడా మొదలుపెట్టారు. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి శివకుమార్ దగ్గర రూ. లక్షలు డబ్బులను తీసుకుని విజయలక్ష్మీ పరారైంది. తీసుకున్న డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో హత్య చేస్తానంటూ బెదిరించినట్లు శివకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డీజీహళ్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడ్డ బిల్డప్ బాబాయ్! ఐఏఎస్ అధికారి అని చెప్పుకుంటూ తిరుగుతున్న వ్యక్తిని తహసీల్దార్ సమయస్పూర్తితో పట్టించిన సంఘటన చెన్నపట్టణలో చోటుచేసుకుంది. మహమ్మద్ సల్మాన్ (37) అరెస్టయిన నకిలీ ఐఏఎస్ అధికారి. నిందితుడు ఇన్నోవా కారుపై కర్ణాటక సర్కార అని రాసుకుని ఇద్దరు గన్మ్యాన్లను వెంటబెట్టుకుని తిరుగుతూ తాలూకాలకు వెళ్లి ప్రభుత్వ అధికారుల చేత పనులు చేయించుకోవడంతోపాటు రాజభోగాలు అనుభవించేవాడు. శుక్రవారం సాయంత్రం మహ్మద్ సల్మాన్ చెన్నపట్టణ ప్రభుత్వ అతిథిగృహంలో ఐఏఎస్ అధికారి హోదాలో దిగాడు. ఈ విషయం కాస్త తహసీల్దార్ సుదర్శన్ చెవిన పడింది. దీంతో హుటాహుటిన ఒక బొకే తీసుకుని స్వాగతిద్దామని బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో తహసీల్దార్ సుదర్శన్ రెవెన్యూశాఖకు సంబంధించి మాట్లాడుతూ కొన్ని ప్రశ్నలు వేయగా మహ్మద్ సల్మాన్ తడబడ్డాడు. దొరికిపోతాననే భయంతో గన్మ్యాన్లతో కలిసి పరారవుతుండగా వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సల్మాన్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇదేవిధంగా ఐఏఎస్ అధికారినని చెప్పుకుని తిరుగుతూ ప్రభుత్వ అధికారులతో పనులు చేయించుకునేవాడని పోలీసుల విచారణలో తేలింది. సల్మాన్తోపాటు ఇద్దరు గన్మ్యాన్లను అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
రాజస్తాన్లో తెలంగాణ పోలీసులపై దాడి
సాక్షి, వరంగల్ : రాజస్తాన్లో తెలంగాణ పోలీసులపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. ఓ చోరీ కేసు విచారణ నిమిత్తం వరంగల్ సుబేదార్ పోలీస్ స్టేషన్కు చెందిన ఏఎస్ఐ శివకుమార్ మరో ఇద్దరు కానిస్టేబుల్స్ బేల్వాడ జిల్లా హెర్నియ గ్రామానికి వెళ్లారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా వారిపై స్థానికులు ఒక్కసారిగా దాడి చేశారు. ఈ సంఘటనలో ఏఎస్ఐ శివకుమార్తో పాటు కానిస్టేబుల్స్ తీవ్రంగా గాయపడ్డారు. బేల్వాడలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో వీరంతా చికిత్స పొందుతున్నారు. మరోవైపు వరంగల్ పోలీసులపై దాడి చేసిన వారిపై రాజస్తాన్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నేను పబ్లిక్ ప్రాపర్టీ కాదు!
సెలబ్రిటీలకు ఉండే క్రేజే వేరు. అందులోనూ సినిమా నటీనటులంటే జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందుకే వారు ఎక్కడ కనిపించినా ఫొటోల కోసం ఎగబడుతుంటారు. ఇది ఒక్కోసారి ఆ సెలబ్రిటీలకు ఇబ్బంది కలిగిస్తుంటుంది. తాజాగా తమిళ నటుడు శివకుమార్కి (హీరో సూర్య, కార్తీల తండ్రి) అలాంటి ఇబ్బందే ఎదురైంది. తనతో సెల్ఫీ తీసుకోబోయిన ఓ అభిమాని ఫోన్ లాక్కొని శివకుమార్ విసిరివేశారు. ఇది కాస్తా హాట్ టాపిక్ కావడంతో శివకుమార్ స్పందిస్తూ ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘‘సెల్ఫీల విషయంలో ఎవరి ఇష్టం వారిది. కానీ, ఒక సెలబ్రిటీ విషయంలో అలా చేయడం కరెక్ట్ కాదు. ఓ 25 మంది అభిమానులు సెక్యూరిటీ గార్డులను పక్కకు తోసేసి మరీ నా దగ్గరికి వచ్చి సెల్ఫీలు దిగుతున్నారు. ఒక సెలబ్రిటీతో సెల్ఫీ దిగాలనుకుంటే ముందు వారి అనుమతి తీసుకోవాలి. నేనేమీ పబ్లిక్ ప్రాపర్టీ కాదు. నాకూ ప్రైవసీ ఉంటుంది. గతంలో చాలాసార్లు అభిమానులు సెల్ఫీ అడిగితే కాదనలేదు. నన్ను నేను ఓ బుద్ధుడిలానో లేదా ఓ సాధువులానో భావించడం లేదు. నేనూ మీలాగే సాధారణ మనిషిని. నాకు నచ్చినట్లుగా జీవిస్తున్నాను. నన్ను ఓ నేతగానో.. ఓ సూపర్స్టార్గానో చూడాలని కోరడం లేదు. ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో హీరోలే. కానీ, మనం చేసే పనులు ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు’’ అని శివకుమార్ పేర్కొన్నారు. -
జయ మరణం; ‘అమ్మ’ డ్రైవర్ కీలక సమాచారం
చెన్నై : దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ జరుపుతున్న ఆర్ముగస్వామి కమిషన్ ఆసక్తికర అంశాలను బయటపెట్టింది. దర్యాప్తులో భాగంగా కమిషన్ జయలలిత నెచ్చలి శశికళ, ఆమె వ్యక్తిగత వైద్యుడు శివకుమార్తో పాటు జయలలిత దగ్గర చాలాకాలంగా డ్రైవర్గా పనిచేస్తున్న కన్నన్ని వేర్వేరుగా విచారించింది. శశికళ, వైద్యుడు, కన్నన్ చెప్పిన అంశాలకు పొంతన లేదని తెలిపింది. శశికళ, శివకుమార్ల వర్షన్... ‘ఆ రోజు అనగా 2016, సెప్టెంబర్ 22న అమ్మ(జయలలిత) బెడ్పై కూర్చుని ఉంది. అకస్మాత్తుగా పడిపోయింది. దాంతో డ్రైవర్ కన్నన్, జయ వ్యక్తిగత భద్రతా అధికారి ‘అమ్మ’ను బెడ్ మీద నుంచి వీల్ చైర్లోకి మార్చడానికి ప్రయత్నించారు. కానీ వారికి అది సాధ్యపడలేదు. దాంతో రాత్రి 9.30 గంటలకు అంబులెన్స్కు ఫోన్ చేసామని’ చెప్పారు. కన్నన్ చెప్పిన వివరాలు... ‘అమ్మ’ డ్రైవర్ కన్నన్ మాత్రం శశికళ, శివకుమార్లు చెప్పిన దానికి విరుద్ధమైన విషయాలు చెప్పాడని కమిషన్ వెల్లడించింది. కన్నన్ 1991 నుంచి జయలలిత దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కన్నన్ జయలలితను ఆస్పత్రిలో చేర్చిన రోజు జరిగిన సంఘటన గురించి కమిషన్తో చెప్పిన వివరాలు... ‘నేను ‘అమ్మ’ గదిలోకి వెళ్లేసరికి ఆమె చైర్లో కూర్చుని ఉన్నారు. అప్పటికే ‘అమ్మ’ స్పృహ కోల్పోయి ఉన్నారు. ఆ సమయంలో అక్కడ కొన్ని ఫైల్స్ ఓపెన్ చేసి ఉన్నాయి. పెన్ను కాప్ కూడా తీసి ఉంది. ‘చిన్నమ్మ’ నాతో వెంటనే వెళ్లి ఒక వీల్ చైర్ తీసుకు రా, అమ్మని ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పింది. కొంతసేపటి తరువాత నేను, పీఎస్ఓ వీరపెరుమాల్ చైర్ తీసుకువచ్చి, అమ్మను ఆ చైర్లో కూర్చొపెట్టాము. రెండడుగులు వేసామో, లేదో అమ్మ చైర్ నుంచి కింద పడింది. వెంటనే నేను, వీరపెరుమాల్ ‘అమ్మ’ను లేపడానికి ప్రయత్నించాము. కానీ మా వల్ల కాలేదు. దాంతో స్ట్రెచర్ తీసుకువస్తే బాగుంటుందని భావించామ’ని తెలిపాడు. గంట సేపు డాక్టర్ అదృశ్యం... అంతేకాక కన్నన్ చెప్పిన మరో ఆసక్తికర అంశమేంటంటే.. ‘నేను రాత్రి 8.30 గంటల సమయంలో డాక్టర్ శివకుమార్ను పోయెస్ గార్డెన్లో చూశాను. కానీ కొంతసేపటి తరువాత ఆయన బయటకు వెళ్లిపోయాడు. మళ్లీ ఆయన తిరిగి ఎప్పుడు పోయెస్ గార్డెన్కి వచ్చాడో నాకు తెలియదు. కానీ నేను అమ్మ గదిలోకి వెళ్లినప్పుడు శివకుమార్ అక్కడే ఉన్నాడు. అంటే దాదాపు గంట తర్వాత అంటే 9.30 గంటలకు అతను తిరిగి వచ్చుంటాడని తెలిపాడు. అంతేకాక ‘ఆ రోజు(సెప్టెంబర్ 22) రాత్రి 10 గంటల ప్రాంతంలో కారును సిద్ధంగా ఉంచమని పీఎస్వో పెరుమాళ్కు చెప్పాను. అయితే లక్ష్మి (జయ ఇంట్లో పనిమనిషి) పెద్ద కారు అయితే బాగుంటుందని తనతో చెప్పింద’ని తెలిపాడు. అయితే కన్నన్ చెప్పిన ఈ రెండు విషయాలను శశికళ, శివకుమార్లు చెప్పలేదని కమిషన్ పేర్కొంది. అంతేకాక పోయెస్ గార్డెన్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని, అయితే సెప్టెంబర్ 22 నాటి దృశ్యాలు అందులో రికార్డయ్యాయో, లేదో తనకు తెలియదని కన్నన్ కమిషన్తో చెప్పాడు. -
కార్తీతో మళ్లీ..
తమిళసినిమా: నటుడు కార్తీ, నటి రకుల్ ప్రీత్సింగ్ జంటగా నటించిన ధీరన్ అధికారం ఒండ్రు చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో కార్తీ, రకుల్ మధ్య రొమాన్స్ సన్నివేశాలు బాగా వర్కౌట్ అయ్యాయి. తాజాగా ఈ జోడి మరోసారి సిల్వర్ స్క్రీన్పై రొమాన్స్కు రెడీ అయ్యింది. సరవణన్, ఆర్.కన్నన్, బాలీవుడ్ దర్శకుడు అనురాగ్కశ్యప్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన రజత్ రవిశంకర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ భారీ చిత్రాన్ని రిలయన్స్ సంస్థ సమర్పణలో ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.లక్ష్మణ్కుమార్ నిర్మిస్తున్నారు. ఇది కార్తీకు 17వ చిత్రం. ఈ చిత్రం శనివారం ఉదయం చెన్నైలో పూజాకార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. కార్తీ తండ్రి, సీనియర్ నటుడు శివకుమార్ అతిథిగా విచ్చేసి క్లాప్ కొట్టగా, నటుడు సూర్య కెమెరా స్విచ్ఛాన్ చేసి షూటింగ్ను ప్రారంభించారు. ఇందులో సీనియర్ నటుడు కార్తీక్ కీలక పాత్ర పోషించనుండటం మరో విశేషం. ముఖ్య పాత్రల్లో రమ్యకృష్ణ, ప్రకాశ్రాజ్, ఆర్జే.విఘ్నేశ్కాంత్ నటిస్తున్నారు. దీనికి హారీష్ జయరాజ్ సంగీతం, వేల్రాజ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఈ నెల 8 నుంచి 15 రోజుల పాటు చెన్నైలో షూటింగ్ నిర్వహించినున్నట్లు, ఆ తరువాత హైదరాబాద్, ముంబై, యూరప్ దేశాలు, హిమాలయాల్లోనూ చిత్రీకరించనున్నట్లు తెలిపారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి 2డీ.ఎంటర్టెయిన్మెంట్ రాజశేఖర్ పాండియన్, దర్శకుడు పాండిరాజ్, మాదేశ్, పలువురు సినీ ప్రముఖులు పాల్గొని చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు
-
‘ఫీజు’ చెల్లించే వరకు పోరు
వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ 24న ఇందిరా పార్కు వద్ద మహాధర్నా పార్టీ శ్రేణులంతా పాల్గొనాలని పిలుపు సాక్షి, హైదరాబాద్: కోటి ఆశలు కల్పించి, అంతులేని హామీలు గుప్పించి, 13 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత పగ్గాలు చేపట్టిన టీఆర్ఎస్ పార్టీ.. అతి తక్కువ కాలంలోనే అపఖ్యాతి మూటగట్టుకొందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్ విమర్శించారు. మంగళవారం లోటస్పాండ్ వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల బలిదానాలతో గద్దెనెక్కిన సీఎం కేసీఆర్ పూటకో మాట.. పచ్చి అబద్ధాలతో పబ్బం గడుపుతున్నారని వాపోయారు. వైఎస్సార్ 23 జిల్లాల్లో సమర్థవంతంగా ఫీజు రీయింబర్స్మెంట్ కళాశాలలకు చెల్లించారన్నారు. తద్వారా ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద విద్యార్థులు ఉన్నత చదువు అభ్యసించేందుకు అవకాశం కల్పించారన్నారు. మహానేత వైఎస్సార్ అకాల మరణం తర్వాత అధికార పీఠం ఎక్కిన నలుగురు సీఎంలు వైఎస్సార్ పథకాలను నిర్వీర్యం చేశారన్నారు. రాష్ట్రం విడిపోతే మా బతుకులు బాగుపడతాయని ఆశలు పెట్టుకున్న విద్యార్థులను టీఆర్ఎస్ సర్కారు నిరాశకు గురిచేసిందన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెబుతూ రూ. 1,35,000 కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టిన సీఎం కేసీఆర్.. విద్యార్థులకు రూ. 3,000 కోట్లు చెల్లించలేరా అని ఆయన ప్రశ్నించారు. ప్రతి ఏటా 30 నుంచి 40 శాతం మాత్రమే చెల్లిస్తూ పోతే రాబోయే అకడమిక్ సంవత్సరంలో అది రూ.6,000 కోట్లకు చేరి, విద్యార్థుల చదువులే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందన్నారు. శ్రీకాంత్రెడ్డి నేతృత్వంలో పోరాటం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల బాధల్ని దృష్టిలో పెట్టుకొని ఫీజు రీయింబర్స్మెంట్పై తమ పార్టీ సమరానికి సిద్ధమైందన్నారు. ఈ నెల 24న నగరంలోని ఇందిరా పార్కు వద్ద మహాధర్నా చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి ఇందులో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. ప్రభుత్వాన్ని మెడలు వంచేందుకు ఈ ఆందోళన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వైఎస్సార్ సీపీ శ్రేణులంతా ఇందులో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేంత వరకు పోరాటం ఆపమని అన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 24న చలో ఇందిరా పార్కు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి నాయకత్వంలో ఉదయం 11 గంటలకు ఆందోళన ప్రారంభమౌతుందన్నారు. -
అనూప్, శివకుమార్లకు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: ఆసియన్ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్లో భారత స్కేటర్లు అనూప్కుమార్, శివకుమార్ మనీశ్లు సత్తా చాటారు. చైనాలోని లిషుయ్ నగరంలో జరిగిన ఈ టోర్నమెంట్ సీనియర్ విభాగంలో అనూప్ కుమార్ రెండు స్వర్ణాలు, రెండు రజతాలను సాధించగా... క్యాడెట్ విభాగంలో శివకుమార్ పసిడి పతకాన్ని దక్కించుకున్నాడు. -
నాన్న బాటలో పయనిస్తాం
నాన్న బాటలో పయనించడానికి ప్రయత్నిస్తామని ప్రముఖ నటుడు సూర్య వ్యాఖ్యానించారు. సీనియర్ నటుడు, సూర్య, కార్తీల తండ్రి, మంచి చిత్రకారుడు అయిన శివకుమార్ 75 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన పుట్టిన రోజును గురువారం ఆయన గురించిన విశేషాలతో కూడిన గోల్డెన్ మూమెంట్స్ ఆఫ్ శివకుమార్ ఇన్ తమిళసినిమా పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక గిండిలోని ఒక నక్షత్రహోటల్ వేదికై న ఈ కార్యక్రమంలో పాల్గొన్న సూర్య మాట్లాడుతూ తన తండ్రి నటుడిగా పరిచయం కానీ 22 ఏళ్ల వయసులో ఆకలి బాధను కూడా లెక్క చేయకుండా గీచిన చిత్రలేఖనాలను ఆయన 75 వ వసంతంలో ప్రజల ముందుకు తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. ఆయన నిరంత శ్రమ, కృషితో తమ నాన్నమ్మ అడవులకు వెళ్లి కట్టెలు కొట్టి సంపాదించిన డబ్బుతో పొట్ట నింపుకుని నటుడిగా ఈ స్థాయికి ఎదిగారని తెలిసారు. ఇక్కడ వక్తలు మీ నాన్నను ఆదర్శంగా తీసుకోవాలని తమకు సలహా ఇస్తున్నారని, అయితే నాన్న జీవన విధానం తమకు సాధ్యం కాదని అన్నారు. ఆయన చిత్రకళాకారుడిగా ఉంటూ అటుపై నటనపై ఆసక్తితో ఆ వైపు దృష్టి సారించారని, షూటింగ్ ముగిసిన తరువాత నాటకాలతో నటనను మరింత మెరుగుపరచుకునే వారని, అలా ఉదయం నుంచి రాత్రి వరకూ శ్రమించారని తెలిపారు. అందువల్ల నాన్న అడుగుజాడల్లో నడవడానికి తాము ప్రయత్నం మాత్రమే చేయగలం అని పేర్కొన్నారు. నాన్నకు ఇప్పటికీ 500 మందితో సన్నిహితంగా ఉంటారన్నారు. అంత కాకపోయినా తామూ నలుగురు సన్నిహితులను పొందాలని భావిస్తున్నామనని అన్నారు. శివకుమార్ మాట్లాడుతూ తాను గొప్పనటుడినని చెప్పుకోను గానీ, చిత్రకారుడినని చెప్పుకోవడానికి గర్వపడతానని పేర్కొన్నారు. తన 16వ ఏట నుంచి 24 ఏళ్ల మధ్యలో గీచిన చిత్రలేఖనాలను ఇప్పుడు ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని శివకుమార్ అన్నారు. -
నవంబర్ 8 లోపే వారిపై వేటు వేయాలి
వైఎస్సార్సీపీ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరారుుంచిన ఎమ్మెల్యేలపై నవంబర్ 8 లోపలే స్పీకర్ అనర్హత వేటు వేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన సాక్షితో మాట్లాడారు. పార్టీ ఫిరారుుంచిన ఎమ్మెల్యేలపై నవంబర్ 8 లోపే అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వైఎస్సార్సీపీ స్వాగతిస్తోం దన్నారు. టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రజలు ఉన్నారని సర్వేలు చెబుతున్నాయని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారని, అలాంటప్పుడు పార్టీ ఫిరారుుంచిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. -
నాగకన్య పోరాటం
గతజన్మ స్మృతుల అన్వేషణలో ఓ నాగకన్యకు ఎదురైన సంఘటనలు ఏంటి? ప్రతికూల శక్తులపై ఆమె ఎటువంటి పోరాటం చేశారు? నాగకన్య నేపథ్యం ఏంటి? అనే కథాంశంతో తెరకెక్కిన సోషియో ఫాంటసీ థ్రిల్లర్ ‘నాగభరణం’. కోడి రామకృష్ణ దర్శకత్వంలో సాజీద్ ఖురేషి, ధావల్ గడ, సొహైల్ అన్సారీ నిర్మించారు. రమ్య, దిగంత్, సాయికుమార్ ప్రధాన పాత్రధారులు. సురక్ష్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ నెల 14న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ‘‘క్లైమాక్స్లో స్వర్గీయ కన్నడ నటుడు విష్ణువర్థన్ను గ్రాఫిక్స్ రూపంలో పునఃసృష్టించిన సన్నివేశాలు అలరిస్తాయి. మకుట సంస్థ అందించిన విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకి బలం. కొత్తదనం కోరుకునే ప్రతి ఒక్కరినీ ఈ సినిమా మెప్పిస్తుంది’’ అన్నారు కోడి రామకృష్ణ. ఇటీవల విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలకు చక్కటి ప్రేక్షకాదరణ లభించిందని శివకుమార్ తెలిపారు. ముకుల్దేవ్, రవి కాలే తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమేరా: వేణు, సంగీతం: గురుకిరణ్. -
చారిత్రాత్మక తప్పిదం: శివకుమార్
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం, మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మహా ఒప్పందంగా అభివర్ణించడం సిగ్గు చేటు అని తెలంగాణ వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి శివకుమార్ ధ్వజమెత్తారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ ...మహా ఒప్పందం కాదని, మహా మోసం అని అభవర్ణించారు. తెలంగాణ ప్రజల పరువును, ఆత్మగౌరవాన్ని మహారాష్ట్రలో తాకట్టు పెట్టి, కమీషన్ల కోసమే కేసీఆర్ ఎత్తు తగ్గించారని శివకుమార్ విమర్శించారు. తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించే బ్యారేజీ ఎత్తు 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించడం, మేడిగడ్డ వద్ద నిర్మించే బ్యారేజీ ఎత్తు 102 మీటర్ల నుంచి 100 మీటర్లకు తగ్గించడం చారిత్రాత్మక ఒప్పందం కాదని, చారిత్రాత్మక తప్పిదమని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. ఈ ఒప్పందంపై తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని శివకుమార్ అన్నారు. -
పనీపాటా లేకుండా తిరుగుతున్నావన్నందుకు..
ఉద్యోగం చేయమని తల్లి మందలించడంతో ఓ యువకుడు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చంద్రగిరినగర్కు చెందిన విమలమ్మ కుమారుడు శివకుమార్ (22) చదువు మానేసి సినిమా కథలు రాయడం ప్రారంభించాడు. దీంతో తల్లి విమలమ్మ ఏదైనా పని చేసి, డబ్బు సంపాదించాలంటూ మందలించింది. మనస్తాపానికి గురైన శివకుమార్ ఈ నెల 21న ఎవరికీ చెప్పకుండా ఎటో వెళ్లిపోయాడు. కుమారుడు ఇప్పటి వరకు తిరిగి రాకపోవడంతో తల్లి విమలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కేటీపీపీ సీఈకి లోకాయుక్త నోటీసులు
వరంగల్ జిల్లా గణపురం మండలం చెల్పూరు శివారులోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ) సీఈ శివకుమార్కు లోకాయుక్త నోటీసులు జారీ చేసింది. కేటీపీపీలో ఉద్యోగ నియామకాల్లో, క్యాజువల్ లేబర్ ఎంపికలో అధికారులు అవినీతికి పాల్పడ్డారని స్థానిక నిరుద్యోగులు లోకాయుక్తకు జూన్ 17వ తేదీన ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన లోకాయుక్తా సంబంధిత అధికారులకు నోటీసులు పంపించింది. కేటీపీపీ అధికారుల వింత నిర్ణయాల మూలంగా ప్లాంట్లో స్థానికేతరులకు ఉద్యోగాలు లభించాయి. ఇటీవల చేపట్టిన 420 జేపీఏ(జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్) ఉద్యోగ నియూమకాల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. దీనిపై సీఈకి నోటీసులు జారీ చేసిన లోకాయుక్త.. 24న తమ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. -
ఆస్పత్రుల చుట్టూ తిరగలేక ఆత్మహత్యాయత్నం
- భర్త మృతి, భార్య పరిస్థితి విషమం విజయనగరం: అనారోగ్యంతో బాధపడుతున్న ఆలుమగలు..ఆస్పత్రుల చుట్టూ తిరగలేక మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఈ సంఘటనలో భర్త మృతి చెందగా..భార్య పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. విజయనగరంలోని కల్పన థియేటర్ సమీపంలో ఉంటున్న ఎం.గణేష్ ఓ ఆస్పత్రిలో సూపర్ వైజర్గా పని చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నగణేష్ దంపతులు మనస్థాపంతో ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఇది గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించగా గణేష్(47) మృతి చెందాడు. భార్య శివకుమారి(42) ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. -
'కార్మికుల సంక్షేమం కోసం వైఎస్ఆర్ ఎంతో కృషి చేశారు'
హైదరాబాద్ : కార్మికుల హక్కులను రెండు రాష్ట్రాల తెలుగు ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శివకుమార్ ఆరోపించారు. మేడే సందర్భంగా ఆదివారం హైదరాబాద్లోని ఆ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ... తమ పార్టీ పేరులోనే కార్మికుల సంక్షేమం ఉందన్నారు. కార్మికుల సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన బాటలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందన్నారు. -
అంతులేని నిరీక్షణ
తప్పిపోయిన తనయుడు మనోజ్ కోసం నాలుగేళ్లుగా ఎదురుచూపు కన్నబిడ్డ రాకకై తల్లి ఆరాటం చేతికి అందివచ్చిన కొడుకు నాలుగేళ్లుగా కనిపించక పోవటంతో కన్నతల్లిదండ్రుల ఆవేదనకు అంతులేదు. ఎక్కడైనా కొడుకు కనిపించకపోతాడా అన్న ఆశతో చూసి చూసి వారు కళ్లు కాయలు కాశాయి. ‘అమ్మా! ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నా’ అని చెప్పిన వాడు ఇంతవరకూ ఇంటికి రాలేదు. పోలీసుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. కనిపించినట్టే కనిపించి మాయమయ్యాడని కొందరు స్నేహితులు, బంధువులు చెప్పటంతో ఎప్పటికైనా ఇంటికి తిరిగి రాకపోతాడా అన్న ఆశతో ఎదురుచూస్తున్న ఆ కన్నవారి ఆవేదనకు ఇది అక్షరరూపం. విజయలక్ష్మి, శివకుమార్ దంపతులు తొమ్మిదేళ్ల కిందట సామర్లకోట నుంచి వైజాగ్ వచ్చేశారు. ప్రహ్లాదపురంలో ఫర్నిచర్ వ్యాపారంలో స్థిరపడ్డారు శివకుమార్. వాళ్లకు ఇద్దరబ్బాయిలు విశ్వతేజ, మనోజ్. పెద్ద కొడుకు ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో ఉద్యోగి. చిన్నకొడుకు సింహాచలం అప్పన్న గుళ్లో సెక్యూరిటీ ఉద్యోగి. నాలుగేళ్ల కిందటి వరకు వారిది సంతోషమైన కుటుంబం. ఇలా సాగిపోతున్న వారి సంసారంలో ఒక పెద్ద కుదుపు. 2012 ఆగస్టు నెల23న ఎప్పటి లాగానే తండ్రీ కొడుకులు ఎవరి పనులకు వాళ్లు వెళ్లారు. మనోజ్ మధ్యాహ్నం మూడున్నరకు డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చాడు. రాత్రి ఏడున్నరకు స్నేహితుడి నుంచి అతడికో ఫోన్ వచ్చింది. ‘అమ్మా! ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నా’ అని చెప్పిన వాడు ఇంత వరకు రాలేదు. ఒడిశాలో ఉన్నాడా!: ‘బాబెళ్లి నాలుగేళ్లయింది. ఆ రోజు... మనోజ్ ఇంటి నుంచి వెళ్లిన గంటకు కూడా రాకపోయేసరికి ఫోన్ చేశాను. అప్పటికే ఫోన్ స్విచాఫ్లో ఉంది. సినిమాకెళ్లాడేమో అనుకున్నాను. ఎంతరాత్రయినా రాలేదు. తెల్లా ర్లూ అలా కూర్చునే ఉన్నాను. ఉదయా న్నే మనోజ్ ఫ్రెండ్స్కు ఫోన్ చేశాం. ఎవరూ తమకేమీ తెలియదన్నారు. అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నాం. అంజనం వేయిస్తే ఒడిశాలో ఉన్నాడని చెప్పారు. వాళ్లు చెప్పినట్లే అక్కడికి వెళ్లి బాబు ఫొటో చూపిస్తూ కనిపించిన అందరినీ అడిగాం. మజ్జిగైరమ్మ గుళ్లో కొందరు ‘ఇప్పుడే చూశాం’’ అన్నారు. అక్కడే హోటల్లో కూడా ‘ఇప్పుడే భోజనం చేసి వెళ్లాడు’ అని చెప్పారు. దాంతో మాకు కొండంత ఆశ కలిగింది. బాబు మాత్రం కనిపించలేదు. బాబు ఫొటో కనిపించిన సెక్యూరిటీ ఉద్యోగులందరికీ ఇచ్చాం. ఎన్నో పూజలు చేయించాం. ఓసారి మా వదినకు తిరుపతితో కనిపించాట్ట. తాను క్యూలైన్లో ఉండగా పదడుగుల దూరంలో కనిపించి ‘మనోజ్’ అని పిలవగానే ఆమెను చూసి పరుగెత్తుకు పోయాడని చెప్పింది. పెంబర్తి పోలీస్ స్టేషన్కైతే వందసార్లకంటే ఎక్కువగానే వెళ్లాం. పోలీసులు మా ప్రయత్నం మేము చేస్తాం అన్నారు. కానీ ఇప్పటికీ ఏ మాత్రం ఆచూకీ దొరకలేదు’ అని కొడుకు కనిపించకుండా పోయినప్పటి నుంచి జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ విలపిస్తున్నారు విజయలక్ష్మి. కొడుకుపై బెంగతోనే : క్షణక్షణం కుమారుడిపై బెంగతోనే తల్లి విజయలక్ష్మి ఆరోగ్యం క్షీణించింది. ఈ నాలుగేళ్లలో రెండుసార్లు కిడ్నీ ఆపరేషన్లు చేయాల్సి వచ్చింది. చిన్న కొడుకు ప్రతి చిన్న విషయాన్నీ తనతో చెప్పేవాడు. అలాంటిది ఇన్ని రోజులు తనతో మాట్లాడకుండా ఎలా ఉండగలుగుతున్నాడో అని తనను తానే ప్రశ్నించుకుంటోంది. అసలు ఉన్నాడో లేదో అనే భావన కలిగితేనే ఆమె హృదయం తల్లడిల్లిపోతోంది. తన సోదరుడి ఆచూకీ తెలిస్తే 97037 09619, 9391309803 నంబర్లకు తెలియజేయాలని మనోజ్ సోదరుడు విశ్వతేజ కోరుతున్నారు. సంతోషంగా గుండెలకు హత్తుకుంటాం ఏ అమ్మాయినైనా ఇష్టపడి ఆ సంగతి చెప్పలేకపోయాడేమో? ఇంట్లో ఒప్పుకోరని నాతో కూడా చెప్పకుండా దాచాడేమో నా పిచ్చితండ్రి. ఒకవేళ అలాంటిదే ఉంటే బాబు ఎవరిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటానన్నా మాకు అభ్యంతరం లేదు. ఇప్పటికే పెళ్లి చేసుకుని ఉంటే భార్యాబిడ్డలతో వస్తే సంతోషంగా గుండెలకు హత్తుకుంటాం. - విజయలక్ష్మి, మనోజ్ తల్లి -
రాజంపేటలో చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం
ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ధర్నా నిర్వహించారు. మండల అధ్యక్షుడు శివకుమార్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. పట్టణంలోని వైఎస్సార్ సర్కిల్ వద్దకు భారీగా చేరుకున్న ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు.. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో మాట ఇచ్చి.. ఇప్పుడు హామీ నెరవేర్చక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
హీరో అయిన విలన్
సినిమా చాలా మందికి ప్రేమ, ఆశ, ఆసక్తి అన్నింటికి మించి దాన్ని నమ్ముకున్న వారికి జీవితం. ఇక్కడ స్వశక్తితో ఉన్నత శిఖరాలను అధిష్టించిన వారెందరో, ఇక నటనను నమ్ముకున్న వాళ్లు చాలా మంది కింద స్థాయి నుంచే మన్ననలు అందుకునే స్థాయికి ఎదిగా రు. సూపర్స్టార్ రజనీకాంత్ నుంచి పలువురు ప్రతి నా యకుడి పాత్రల నుంచి నా యకుల స్థాయికి చేరి సాధిం చారు.అలాంటి వారి స్ఫూర్తి తో ఇక్కడ తమ ప్రతిభను చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కోవకు చెందిన నటుడిగా రాజ్భరత్ను చెప్పుకోవచ్చు. అందం, చక్కని పర్సనాలిటీ, మంచి రంగు ఒక హీరోకు కావలసిన అర్హతలన్నీ ఉన్నాయని సీనియర్ నటుడు శివకుమార్ చేతనే ప్రశంసలు, ఆశీస్సులు అందుకున్న ఈయన గొప్ప సినీ నేపథ్యం నుంచి వచ్చిన నటుడు. రాజ్భరత్ తండ్రి ప్రఖ్యాత దర్శక, నిర్మాత మల్లియం రాజ్గోపాల్. ఈయన దివంగత ప్రఖ్యాత నటుడు శివాజీగణేశన్, జెమినీగణేశన్,శివకుమార్ వంటి నటులతో పలు చిత్రాలు చేశారు. ఇప్పుడు రాజ్గోపాల్ వారసుడుగా రాజ్భరత్ నటనను వృత్తిగా ఎంచుకున్నారు. శశి దర్శకత్వం వహించిన 555 చిత్రం ద్వారా ప్రతినాయకుడిగా చిన్న పాత్ర ద్వారా తెరంగేట్రం చేసిన రాజ్భరత్ గ్రోత్ దినదినాభివృద్ధి చెందుతుందనే చెప్పాలి. మిష్కిన్ దర్శకత్వంలో ఓనాయుమ్ ఆటుకుట్టియుమ్ చిత్రంలో మెరుగైన విలనీయాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు.తదుపరి ప్రమోషన్గా ఆంధ్రామెస్ చిత్రంలో కథానాయకుడి అవతారం ఎత్తా రు. ఈ చిత్రం విడుదలకు ముందే నట్పధికారం 79 చి త్రంలో హీరోగా నటించారు.చాలా మంది విషయంలో జరిగినట్లుగానే రాజ్భరత్ హీరోగా నటించిన తొలి చి త్రం కంటే ముందుగా రెండో చిత్రం విడుదల కానుంది. ఆయన నటించిన నట్పధికారం 79 చిత్రం ఈ నెల 11న తెరపైకి రానుంది.ఈ సందర్భంగా ఆయన్ని పలకరించగా నట్పధికారం చిత్రంలో నటించడం మంచి అనుభవం అన్నారు.ఇంకా చెప్పాలంటే రవిచంద్రన్ దర్శకత్వంలో నటించడమే గొప్ప అవకాశంగా పేర్కోన్నారు.ఆయన ఇంతకు ముందు కన్నెదిరే తోండ్రినాళ్ చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిన విషయమేనని,అలాంటి స్నేహం ఇది వృత్తంగా మరో కోణంలో రూపొందిన చిత్రం నట్పధికారం 79 చిత్రం అని తెలిపారు. ఈ చిత్రానికి సహయ దర్శకుడిగా ప్రారంభించి కథానాయకుడిగా నటించే వరకూ తన భాగం ఉందన్నారు.కారణం దర్శకుడు రవిచంద్రన్తో ఉన్న అనుబంధమేనని చెప్పారు.చిన్న ఎమోషన్తో కూడిన ఈ చిత్రం జనరంజకంగా ఉంటుందని తెలిపారు. నటి రేష్మీమీనన్, తేజస్విని కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో అనువదించే అవకాశం ఉందా?అన్న ప్రశ్నకు అనువాదంగా కాదుగానీ రీమేక్ అయ్యే అవకాశం ఉందని బదులిచ్చారు.కారణం ఇది యూనివర్సల్ కన్టెంట్తో రూపొందిన కథా చిత్రం అని ఆయన తెలిపారు.రాజ్భరత్ నటించిన మరో చిత్రం జీరో కూడా త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. -
శివకుమార్కు వైఎస్సార్సీపీ షోకాజ్ నోటీసులు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయరాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే శివకుమార్కు తెలంగాణ విభాగం అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా బలోపేతం చేసే పనిలో నిమగ్నమైనందున గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయకూడదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో శివకుమార్ చేసిన వ్యాఖ్యలు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేవిధంగా ఉన్నాయని, అందుకే ఆయనకు షోకాజ్ నోటీసుల జారీ చేశామని పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నోటీసులపై పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని శివకుమార్ను కోరారు. -
కరువు మండలాలు ప్రకటించాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు మండలాలను ప్రకటించి, సత్వరమే సహాయక చర్యలు చేపట్టాలని తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పంటలు నష్టపోయి, అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరింది. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి, పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి, కె.శివకుమార్ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతులు పిట్టల్లా రాలిపోతున్నా సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. రైతు ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వపరంగా సహాయ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలకు దిగుతామని.. ఇతర పార్టీలతో కలసి నిరసనలు చేపడతామని హెచ్చరించారు. పార్టీ ఆధ్వర్యంలో కరువు, రైతన్నల ఆత్మహత్యలు, సాగు సంక్షోభంపై సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. రైతుల ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోకుండా సీఎం కేసీఆర్ చైనా పర్యటనకు వెళ్లారని కిష్టారెడ్డి విమర్శించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాగానే ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.లక్షన్నర పరిహారం అందించేలా జీవో 421ను తీసుకువచ్చారని.. ప్రస్తుత ప్రభుత్వం దానిని అమలుచేస్తున్న దాఖలాలు లేవని పేర్కొన్నారు. మహబూబ్నగర్లో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు అందిస్తూ పార్టీ సహాయచర్యలు చేపడుతుందని కిష్టారెడ్డి తెలిపారు. రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని శివకుమార్ డిమాండ్ చేశారు. -
ప్రేమించి.. పెళ్లి తర్వాత వేధించి
భార్య, అత్తింటి వారిపై దాడి ముగ్గురికి తీవ్ర గాయాలు గోల్కొండ: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై భర్త హత్యాయత్నం చేశాడు. హుమాయూన్నగర్ పోలీసులు తెలిపిన వివరాలు.. మాసబ్ట్యాంక్ పోచమ్మబస్తీకి చెందిన యాదయ్య కుమారుడు శివకుమార్(25), అదే బస్తీలో వాంబే గృహ సముదాయంలో నివసిస్తున్న ఉషారాణి కూతురు మనీషలు మే 1వ తేదీన రహస్యంగా యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన పదిహేను రోజుల నుంచి శివకుమార్ భార్యను హింసించడం మొదలు పెట్టాడు. దీంతో మనీష తల్లివద్దకు వచ్చేసింది. కక్ష పెంచుకున్న శివకుమార్ జూన్లో మనీష ఇంటిపై దాడిచేసి ఫర్నిచర్ ధ్వంసం చేశాడు. ఈ విషయంపై మనీష పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వస్తే, చస్తానంటూ విద్యుత్ తీగలను పట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో గత్యంతరం లేక పోలీసులు వెనుదిరిగారు. ఈ సంఘటన తర్వాత కూడా శివకుమార్ పలుమార్లు మనీష, ఆమె కుటుంబ సభ్యులపై కూడా దాడిచేసే ప్రయత్నం చేశాడు. ఈ విషయంపై మనీష పశ్చిమ మండలం డీసీపీకీ ఫిర్యాదు చేసింది. కాగా మంగళవారం రాత్రి 8 గంటలకు శివకుమార్ మనీష ఇంటికి వచ్చి గొడవకు దిగాడు. నువ్వు ఏ పని చేయడం లేదు, కష్టించి సంపాదించే వరకు మనీషను పంపేది లేదని ఆమె తల్లి ఉషారాణి స్పష్టం చేసింది. దీంతో రెచ్చిపోయిన శివకుమార్ మనీష, ఆమె తల్లిని కొట్టి పారిపోయాడు. వెంటనే ఈ విషయంపై మనీష హుమాయూన్నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్స్టేషన్లో నానా హంగామా చేసిన శివకుమార్ తలను లాకప్ గోడలకు కొట్టుకుంటూ ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించాడు. దీంతో పోలీసులు రాత్రి రెండు గంటల సమయంలో అతడ్ని వదిలేశారు. నేరుగా రాత్రి 3 గంటల ప్రాంతంలో మనీష ఇంటికి వెళ్లాడు. రోకలి పట్టుకొని భర్తను ఎదిరించబోయిన మనీషను పిడిగుద్దులు గుద్దుతూ ఆమె చేతిలోని రోకలిని లాక్కొని హత్యాయత్నం చేశాడు. అడ్డువచ్చిన ఉషారాణి, మనీష అమ్మమ్మ మధురవీణలపై కూడా దాడి చేశాడు. ముగ్గురి తలలు పగిలి తీవ్ర రక్తస్రావమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు గాయపడ్డ వారిని ఉస్మానియాకు తరలించి శివకుమార్ను అదుపులోకి తీసుకున్నారు. -
పరామర్శ యాత్రను విజయవంతం చేయండి
సరూర్నగర్ : ఈనెల 29 నుంచి రంగారెడ్డి జిల్లాలో ప్రారంభం కానున్న షర్మిలమ్మ పరామర్శ యాత్రను జయప్రదం చేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్ పార్టీ నాయకులను, అభిమానులను, కార్యకర్తలను కోరారు. దివంగత ముఖ్యంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి అకాల మరణాన్ని జీర్ణించుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు షర్మిలమ్మ చేపట్టబోతున్న పరామర్శ యాత్ర పోస్టర్ను బుధవారం మందమల్లమ్మ చౌరస్తాలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొలిశెట్టి శివకుమార్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జి.సురేష్రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్బంగా శివకుమార్ మాట్లాడుతూ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలోని మూడు జిల్లాలో పరామర్శ యాత్ర పూర్తయిందని అన్నారు. ఈనెల 29నుంచి రంగారెడ్డి జిల్లాలో.. సరూర్నగర్ మండలం, జిల్లెలగూడనుంచి ప్రారంభమై వచ్చే నెల 2వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలోని 7 నియోజక వర్గాలలో 580 కిలోమీటర్లమేర తిరుగుతూ 15 కుటుంబాలను పరామర్శిస్తారని వెల్లడించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని జిల్లెలగూడనుంచి పరామర్శయాత్ర మొదలవుతుందని పేర్కొన్నారు. పోస్టర్ విడుదల చేసిన మందమల్లమ్మ చౌరస్తాలోనే షర్మిలమ్మ చేత బహిరంగసభ ఉంటుందని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు జి.సురేష్రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ కోసం రంగారెడ్డి జిల్లాలో మరణించిన అన్ని కుటుంబాలను షర్మిలమ్మ విచ్చేసి పరామర్శిస్తారన్నారు. పరామర్శయాత్రను విజయవం తం చేసేందుకు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వైఎస్ పథకాలతో లబ్ధిపొందిన లబ్దిదారులు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు దుబ్బాక గోపాల్రెడ్డి, సూరజ్ఎస్దాని, జిల్లా కార్యదర్శి ఎమ్మెటి వెంకట్రెడ్డి, సరూర్నగర్ మండల అధ్యక్షుడు కొంతం మోహన్రెడ్డి, విద్యార్థి నాయకులు గుర్జని సుమన్గౌడ్, మామిడి రాంచందర్, మాసూం, పోల రాజశేఖర్రెడ్డి, జాపాల కిష్టయ్య, నగరపంచాయితీ అధ్యక్షురాలు విజయలక్ష్మీ, యాదయ్య, పాండునాయక్, ఆనంద్కమార్, శ్రీనివాస్, తదితరులున్నారు. -
'మ్యానిఫెస్టోలోని అంశాలకు కేసీఆర్ జవాబు చెప్పాలి'
-
2017లో చంద్రయాన్-2
ఇస్రో డెరైక్టర్ శివకుమార్ వెల్లడి వేలూరు(తమిళనాడు): ఇస్రో ఆధ్వర్యంలో 2017వ సంవత్సరంలో చంద్రుడిపైకి మానవ సహిత శాటిలైట్(చంద్రయాన్-2)ను పంపేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఇస్రో డెరైక్టర్ శివకుమార్ తెలిపారు. వేలూరులోని వీఐటీ (వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) యూనివర్సిటీలో శాటిలైట్ సంబంధిత అంతర్జాతీయ సదస్సు వీఐటీ ఉపాధ్యక్షుడు జీవీ సెల్వం అధ్యక్షతన శనివారం జరిగింది. ఇస్రో డెరైక్టర్ శివకుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించి ప్రసంగించారు. ప్రస్తుతం పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ అనే వాహక నౌకలను అంతరిక్షంలోకి పంపుతున్నామన్నారు. ప్రభుత్వం ఆర్థిక వనరులు సమకూరిస్తే చంద్రయాన్-2 శాటిలైట్ను పంపవచ్చన్నారు. ఇది నాలుగు వేల నుంచి ఐదు వేల కి లోల బరువు ఉంటుందని తెలిపారు. అనంతరం సదస్సు సీడీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎన్పీఎస్ ప్రొఫెసర్ గోసవ్యా, యూకే యూనివర్సిటీ ప్రొ. ఆల్ కేంద్రన్, వీఐటీ బిజినెస్ స్కూల్ ప్రిన్సిపాల్ గీత పనివాసగం పాల్గొన్నారు. -
18 నుంచి షర్మిల రెండో దఫా పరామర్శ యాత్ర
నల్లగొండ జిల్లాలో ఐదు రోజుల యాత్ర 17 కుటుంబాలకు పరామర్శ వైఎస్సార్సీపీ నేత శివకుమార్ వెల్లడి 15న పార్టీ తెలంగాణ కార్యాలయం ప్రారంభం హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 18 నుంచి నల్లగొండ జిల్లాలో రెండో విడత పరామర్శ యాత్రను చేపట్టనున్నారని పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ తెలిపారు. మంగళవారం లోటస్ పాండ్లోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. షర్మిల రెండో విడత యాత్ర ఈ నెల 18 నుంచి 22 వరకు ఐదు రోజులు జరుగుతుందని చెప్పారు. ‘‘భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నల్లగొండ, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల్లో షర్మిల 509 కిలోమీటర్లు పర్యటిస్తారు. దివంగత సీఎం, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మృతిని జీర్ణించుకో లేక మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శిస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నల్లకాల్వ సభలో ప్రజలకు మాటివ్వడం తెలిసిందే. ఆ మాట కోసమే షర్మిల పరామర్శ యాత్ర కొనసాగిస్తున్నారు. రెండో విడత యాత్రలో 17 కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు’’ అని శివకుమార్ వివరించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా పరామర్శ యాత్ర ఉంటుందా అని ప్రశ్నించగా, నల్లగొండలో రెండో విడత యాత్ర పూర్తయ్యాక దానిపై ఆలోచిస్తామని బదులిచ్చారు. వైఎస్ మృతి పట్ల చలించి హైదరాబాద్లో 10 మంది, రంగారెడ్డిలో 20 మంది మరణించారని గుర్తుచేశారు. మరోవైపు, సచివాలయ మార్పును వైసీపీ వ్యతిరేకిస్తుందని శివకుమార్ చెప్పారు. దీనిపై త్వరలో తాము గవర్నర్ను కూడా కలుస్తామన్నారు. ఛాతీ ఆస్పత్రిని ఎర్రగడ్డ నుంచి మార్చొద్దంటూ వైఎస్సార్సీపీ ధర్నా నిర్వహించిందని గుర్తు చేశారు. 15న పార్టీ కార్యాలయం ప్రారంభం బుధవారం (11వ తేదీన) జరగాల్సిన వైఎస్సార్సీపీ తెలంగాణ కార్యాలయ ప్రారంభోత్సవం వైఎస్ జగన్ అందుబాటులో లేని కారణంగా వాయిదా పడిందని శివకుమార్ తెలిపారు. కార్యాలయాన్ని 15వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు లోటస్ పాండ్లో ఆయన ప్రారంభిస్తారని చెప్పారు. రాష్ట్ర పార్టీ యంత్రాంగమంతా హాజరవుతుందన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్ రెడ్డి, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు బి.రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
పాత్రికేయుడు శివకుమార్ మృతి
పలువురికి శాసనసభ సంతాపం బెంగళూరు : ప్రముఖ ఆంగ్లపత్రికలో పాత్రికేయుడుగా పనిచేస్తున్న ఎన్డీ.శివకుమార్ (39) సోమవారం ఉదయం గుండెనొప్పితో వృుతిచెందారు. బెళగావి శీతాకాల సమావేశాల కవరేజ్ కోసం బెళగావికి వెళ్లిన శివకుమార్ సోమవారం ఉదయం గుండెనొప్పి రావ డంతో కేఎల్ఈ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ సోమవారం ఉదయం వృుతిచెందారు. శివకుమార్ మరణవార్త తెలియగానే ముఖ్యమంత్రి సిద్దరామయ్య, సమాచారశాఖామంత్రి రోషన్బేగ్ ఆస్పత్రికి వెళ్లి అంతిమదర్శనం చేసుకుని తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. వృుతుడికి భార్యతో పాటు రెండేళ్ల వయసు గల కుమార్తె ఉన్నారు. ఇటీవల వృుతిచెందిన పలువురికి శాసనసభ సంతాపం మాజీ ఎమ్మెల్యే ఎంపీ.వెంకటేశ్, మహ్మద్సైఫ్ ఉద్దీన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి వీఆర్.కృష్ణయ్యర్, పాత్రికేయుడు ఎన్.డీ.శివకుమార్ తదితరులకు విదానసభ సమావేశాల్లో భావపూర్వ శ్రధ్దాంజలి అర్పించారు. సమావేశాల్లో స్పీకర్ కాగోడుతిమ్మప్ప సంతాపం ప్రకటించి వృుతుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాట్లాడుతూ.... ఎంపీ.వెంకటేశ్ రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలకు ఉత్తమ సేవలందిచార ంటూ ఆయన సేవలను కొనియాడారు. అదేవిధంగా మహ్మద్సైఫ్ ఉద్దీన్ వక్ఫ్బోర్డు అధ్యక్షుడిగా ప్రజలకు సేవలందించారని తెలిపారు. యువపాత్రికేయుడు ఎన్డీ.శివకుమార్ విధినిర్వహణలో వృుతిచెందడం అత్యంత దురదృష్టకర విషయమన్నారు. ప్రతిపక్షనేత జగదీశ్షెట్టర్ మాట్లాడుతూ ఉత్తమ పాత్రికేయుల్లో ఎన్డీ.శివకుమార్ కూడా ఒకరని ఆయన ఆకస్మిక మరణం తీవ్ర దిగ్బాంతికి గురిచేసిందన్నారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతిచేకూర్చాలన్నారు. -
దొంగల ముఠాకు చెక్
సికింద్రాబాద్: ప్రయాణికుల దృష్టి మళ్లించి నగదు, నగలు ఎత్తుకెళ్తున్న ఓ ఘరానా ముఠా ఆట కట్టించారు గోపాలపురం పోలీసులు. నిందితుల నుంచి 105 తులాల బంగారు నగలు, 370 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర మండలం డీసీపీ ఆర్.జయలక్ష్మి, గోపాలపురం ఏసీపీ కె.శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం... సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, జూబ్లీబస్స్టేషన్ ప్రాంతాల్లో మహిళా ప్రయాణికుల నగల చోరీతో పాటు జేబు దొంగతనాలు ఎక్కువగా జరుగుతుండటంతో నిందితులను పట్టుకొనేందుకు ఉత్తర మండలం ఎస్ఐలు ఎంఎస్వీ కిషోర్, భాస్కర్రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. పక్కా పథకం ప్రకారం రెక్కీ నిర్వహించిన ఈ బృందం.. రైల్వేస్టేషన్ ప్రాంతంలో సంచరిస్తున్న నిందితులు నలుగురినీ రెడ్హ్యాండెడ్గా పట్టుకుంది. ఓల్డ్ అల్వాల్ సూర్యనగర్లో నివాసముండే ఆవుల గణేష్ అలియాస్ ఆకుల రాజు (40) పాత నేరస్తుడు. ఎనిమిదేళ్లుగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో దృష్టి మళ్లించి చోరీలు, జేబుదొంగతనాలు చేస్తున్నాడు. గతంలో పలుమార్లు జైలుకు వెళ్లి బెయిల్పై విడుదయ్యాడు. అనంతపురం జిల్లాకు చెందిన మరో నిందితురాలు దుర్గ (35) ఇదే తరహా నేరాలు చేస్తోంది. ఇటీవల బోయిన్పల్లి పోలీసులు దుర్గను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కాగా, జైలు నుంచి బెయిల్ విడుదలైన ఆవుల గణేష్ తన తరహాలోనే దోపిడీలకు పాల్పడే దుర్గతో పాటు అనంతపురం పట్టణానికి చెందిన గొల్ల సురేష్ (25), బలిజ ప్రశాంత్కుమార్ (28)తో కలిసి ముఠాను ఏర్పాటు చేశాడు. రద్దీగా ఉండే బస్సుల్లో ప్రయాణిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. మహిళల వద్ద దుర్గ అపహరించిన నగలను గణేష్ బృందం బయటికి తరలిస్తుంది. గణేష్ బృందం మహంకాళి, గోపాలపురం, మార్కెట్, బోయిన్పల్లి, మారేడుపల్లి, కార్ఖానా, బొల్లారం పోలీస్స్టేషన్ల పరిధిలోని బస్టాప్ల్లో చోరీలకు పాల్పడింది. నలుగురినీ అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి కిలో 50 గ్రాముల (105 తులాలు) బంగారు ఆభరణాలు, 370 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. -
కన్నకొడుకే కాలయముడు
ఆస్తి కోసం తల్లిని హత్య చేసిన వైనం అల్లాదుర్గం రూరల్ : జల్సాలు, చిల్లర దొంగతనాలకు అలవాటు పడిన ఓ యువకుడు డబ్బు, ఆస్తి కోసం కన్న తల్లినే అతి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన మండలంలోని అప్పాజిపల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. జోగిపేట సీఐ రఘు కథనం మేరకు.. గ్రామానికి చెందిన శంకురి నర్సమ్మ (42)కు ఒక్కడే కుమారుడు శివకుమార్. తండ్రి చనిపోవడంతో తల్లే కూలీ పని చేస్తూ కుమారుడిని పోషిస్తోంది. అయితే శివకుమార్ జల్సాలకు అలవాటు పడి గ్రామంలో చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. ఈ క్రమంలో తల్లి నర్సమ్మను జల్సాల నిమిత్తం శివకుమార్ డబ్బును అడిగారు. ఇందుకు ఆమె తిరస్కరించింది. దీంతో కసి పెంచుకున్న శివకుమార్ ఆమెను హతమార్చాలని నిర్ణయించాడు. అందులో భాగంగానే అదే గ్రామానికి చెందిన తలారి పాండు సాయం తీసుకున్నాడు. ఇద్దరూ కలిసి ఆదివారం రాత్రి నర్సమ్మను మాయమాటలు చెప్పి గ్రామ శివారులోకి తీసుకెళ్లారు. అనంతరం అక్కడ నర్సమ్మ నోట్లో గుడ్డలు కుక్కి ఆమె చీరతోనే ఉరేసి చంపారు. కాగా తన తల్లిని చంపి గండి చెరువులో ఉన్న తూటి పొదలో పడేసినట్లు శివకుమార్ సోమవారం ఉదయం గ్రామస్తులకు చెప్పారు. దీంతో వారు విషయాన్ని పోలీసులకు సమాచారం అందిస్తూ శివకుమార్ను చికతబాదారు. ఈ క్రమంలో శివకుమార్ అసలు విషయం బయటకు చెప్పాడు. తన తల్లిని తలారి పాండే హత్య చేశాడని తెలిపాడు. ఈలోగా పోలీసులు గ్రామానికి చేరుకుని శివకుమార్ను అదుపులో తీసుకున్నారు. సీఐ రఘు డాగ్ స్క్వాడ్ రప్పించి విచారణ చేపట్టగా పోలీస్ డాగ్ మృతదేహం నుంచి మృతురాలి ఇంటికి, తలారి పాండు ఇంటి వరకు వెళ్లి ఆగింది. ఈ సందర్భంగా పోలీసులు నిందితుడు శివకుమార్ వద్ద ఉన్న మూడు సెల్ఫోన్లు, హత్యకు గురైన నర్సమ్మకు చెందిన బంగారు ఆభర ణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హత్యకు గురైన నర్సమ్మ అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విజయ్మోహన్ తెలిపారు. కాగి మరో నిందితుడు తలారి పాండు పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. -
గెలిచినా, ఓడినా బళ్లారి అభివృద్ధికి స్పెషల్ డ్రైవ్
సాక్షి, బళ్లారి : బళ్లారి ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి ఎన్వై. గోపాలకృష్ణ గెలి చినా, ఓడినా బళ్లారి అభివృద్ధికి స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని పెట్టుకున్నట్లు కాం గ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జి, రాష్ట్ర విద్యుత్ శా ఖ మంత్రి డీకే శివకుమార్ తెలిపారు. ఆ యన ఆదివారం నగరంలోని పోలా ప్యా రడైజ్ హోటల్లో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాల అనంతరం బ ళ్లారిలో కేబినేట్ సమావేశం నిర్వహించే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇక్కడ అన్ని శాఖల ముఖ్యాధికారు లు, మంత్రులు పాల్గొనడం వల్ల అభివృ ద్ధి పనులు ఎలా చేపట్టాలో అర్థమవుతుం దన్నారు. బళ్లారి ఉప ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నందున తనకు ఇక్కడ సమస్యలు చూ సి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని భావించినట్లు చెప్పారు. తాము అధికారంలో ఉన్నప్పటికీ ఎలాంటి గొడవలు జరగకుండా శాంతియుతంగా ఎన్నికలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు, చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తమ పార్టీ అధికారంలో ఉందని, బళ్లారి అభివృద్ధి కూడా తమతోనే సాధ్యమన్నారు. ఈ నేపథ్యంలో జేడీఎస్, బీజే పీ కార్యకర్తలు కూడా తమకే ఓట్లు వేస్తారనే నమ్మకం ఉందన్నారు. ఆపరేషన్ హస్తం తాము చేపట్టడం లేదని, వారి ఇష్ట ప్రకారమే తమ పార్టీలోకి వస్తున్నారన్నారు. తాను ఎన్నికల జిమ్మిక్కులు చేయడం లేదని, సేవ చేయడం మాత్రమే తనకు తెలుసన్నారు. బళ్లారిలో ఇళ్లు లేని పేదలు, వృద్ధాప్య పెన్షన్లు రాని వృద్ధులు ఎంతో మంది ఉన్నారని , పేదల జాబితాను సిద్ధం చేసి వారికి ప్రభుత్వ ఫలాలు నేరుగా అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి పరమేశ్వర నాయక్, డీసీసీ అధ్యక్షుడు జేఎస్.ఆంజనేయులు, లోక్సభ సభ్యుడు డీకే సురేష్ కుమార్ పాల్గొన్నారు. -
ఒక్కొక్కరు వంద మందికి గాలం వేయండి
మంత్రి శివకుమార్ బళ్లారి టౌన్ : ఒక్కొక్క కాంగ్రెస్ నాయకుడు వంద మంది బీజేపీ కార్యకర్తలకు గాలం వేసి పార్టీలోకి రప్పించుకోవాలని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి డీకే.శివకుమార్ పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని రాఘవ కళామందిరంలో వాల్మీకి కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో శ్రీరాములు ఒక్కడే వాల్మీకి నాయకుడు కాదన్నారు. మీరంతా మనసు పెడితే మరో పది మంది లీడర్లను తయారు చేసుకోవచ్చన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్వై. గోపాలకృష్ణ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. శ్రీరాములు అభివృద్ధి చేసిన దానిపై తాను చర్చించనని, కానీ తనకు నియోజకవర్గం వద్దని రాజీనామా చేసిన తర్వాత మరలా ఆ పార్టీ తరఫున ఎలా అభ్యర్థిని నిలబెట్టారన్నారు. ఎన్వై.హనుమంతప్ప ఆశీస్సుల వల్లే ఆయన ఈ స్థాయికి ఎదిగారన్నారు. ఒకప్పుడు ఆయనను ఇంటి దేవుడిగా కొలిచి నేడు ఆయనపైనే పోటీ చేసి ఓడించే స్థాయికి ఎదిగారన్నారు. తాను ఈ నియోజకవర్గాన్ని ఎన్నికల జరిగేలోగానే ఖాళీ చేస్తామని శ్రీరాములు వ్యాఖ్యనలు చేయడం తగదన్నారు. తాను బళ్లారిలో ఎన్నికల ముగిసేంత వరకు ఉంటానన్నారు. సీఎం సిద్దరామయ్య సామాజిక న్యాయం, పేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో రాజీవ్ ఆవాస్ పథకం ద్వారా ఒక్కొక్క లబ్ధిదారుడికి రూ. 4 లక్షల వరకు ఇవ్వాలని, అందరికీ స్థలాలు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ఇది ఎన్నికల హామీ కాదని తమ ప్రభుత్వ ప్రణాళిక అని చెప్పారు. శ్రీరాములు నాడు బీజేపీ నుంచి స్వాభిమానం దెబ్బతినిందని చెప్పి కొత్త పార్టీ పెట్టి తర్వాత ఆ పార్టీలోకి ఎలా వెళ్లారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి పీటీ పరమేశ్వరనాయక్, సినీ నటి శశికుమార్, ఎమ్మెల్యే అనిల్లాడ్, తుకారాం, ఉగ్రప్ప, పార్టీ అభ్యర్థి ఎన్వై.గోపాలకృష్ణ, స్థానిక నేతలు బెస్ట్ రామప్ప, నెట్టి కల్లప్ప, రాంప్రసాద్, జేఎస్.ఆంజినేయులు, వీకే.బసప్ప, హగరి వండ్రి తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమ పెళ్లి గురించి ఇంట్లో చెప్పలేక....
ముజాహిద్ పూర్: ప్రేమ పెళ్లి గురించి ఇంట్లో చెప్పలేక, భార్యా కొడుకును చంపేందుకు యత్నించాడో భర్త. ఈ ఘటనలో కొడుకు చనిపోగా, భార్య చావు తప్పించుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం ముజాహిద్ పూర్ హత్యకేసులో అసలు నిజాలు వెలుగు చూశాయి. గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి చంపినట్టుగా భావిస్తున్న మహిళ, ఆమె కొడుకును .. నిజానికి భర్త, మరిది హతమార్చారు. మహబూబ్నగర్ జిల్లా కొందుర్గు మండలం ఎల్కగూడెంకు చెందిన కిశోర్, షాద్నగర్కు చెందిన సుజాతలు పెద్దలకు తెలియకుండా ప్రేమ పెళ్లి చేసుకుని, హైదరాబాద్ మల్కాజిగిరిలో ఉంటున్నారు. వీరికి మూడేళ్ల బాబు. తమ పెళ్లి, బాబు విషయాన్ని ఇంట్లో చెప్పమని సుజాత తరచూ కిశోర్తో గొడవపడుతూ ఉండేది. ఈ నేపథ్యంలో అత్తారింటికి తీసుకెళతానని భార్య, కొడుకును కిశోర్, అతడి తమ్ముడు ఆనంద్ బైకుపై తీసుకెళ్లారు. ముజాహిద్పూర్ అటవీప్రాంతంలో ఆమె గొంతు నులిమేశారు. తల్లిని కొడుతుండగా అడ్డొచ్చిన బాబును దారుణంగా హతమార్చారు. అయితే, సుజాత స్పృహ తప్పిపడిపోగా, ఆమె చనిపోయిందనుకుని అక్కడ్నించి వెళ్లిపోయారు. కానీ, ఆమె కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతు ఉండటాన్ని గమనించిన స్థానికులు, ఆసుపత్రికి తరలించగా, ఆమె కోలుకుంది. జరిగిన విషయాన్ని పోలీసులకు తెలపగా .. వారు నిందితుల కోసం గాలిస్తున్నారు. -
'ఆ ఘాతుకానికి పాల్పడింది భర్తే'
-
'ఆ ఘాతుకానికి పాల్పడింది భర్తే'
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం ముజాహిద్ పూర్లో మూడేళ్ల బాలుడిని చంపి...తల్లిపై అత్యాచారయత్నం కేసులో కొత్త నిజాలు వెలుగు చేస్తున్నాయి. కట్టుకున్న భర్తే ... కొడుకుతో పాటు తనను హతమార్చేందుకు యత్నించినట్లు బాధితురాలు సుజాత వెల్లడించింది. బాధితురాలి వివరణతో పోలీసులు షాక్ తిన్నారు. భర్త శివకుమార్ ముందుగా తనపై హత్యాయత్నం చేసి, అనంతరం కొడుకును చంపి అక్కడ నుంచి పరారయ్యాడని ఆమె తెలిపింది. సుజాత చనిపోయిందనుకుని ఘటనా స్థలం నుంచి భర్త వెళ్లిపోయాడు. అయితే కొన ఊపిరితో ఉన్న సుజాతను స్థానికులు గమనించి ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ఆమె ప్రాణాలు దక్కాయి. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. చేవెళ్ల డీఎస్పీ శ్రీధర్ కథనం ప్రకారం ముజాహిద్ పూర్ శివారులో మహబూబ్ నగర్ జిల్ఆ కొందుర్గు మండలం వెల్కిచర్లకు వెళ్లే రోడ్డులోని అటవీ ప్రాంతంలో నిన్న ఓ మహిళ అపస్మారక స్థితిలో పడిఉంది. ఈ విషయాన్ని గమనించిన ఓ పశువుల కాపరి స్థానికులకు సమాచారం అందించారు. వారు పోలీసులకు తెలపటంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. సుజాత కోలుకోవటంతో పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. బాధితురాలి స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్. నిందితుడు శివకుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
హ్యాకర్లకు చెక్ పెట్టే.. ఐటీ సెక్యూరిటీ
అప్కమింగ్ కెరీర్ సమాచార సాంకేతిక (ఐటీ) పరిజ్ఞానం రాకతో అన్ని రంగాల్లో కంప్యూటర్ల వినియోగం తప్పనిసరిగా మారింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అన్లైన్లోనే అన్ని లావాదేవీలు జరుగు తున్నాయి. అదే సమయంలో సమాచార చోరు లు (హ్యాకర్లు) తమ హస్తలాఘవం చూపుతు న్నారు. కంప్యూటర్లలోని విలువైన డేటాను తస్కరిస్తున్నారు. దీనివల్ల కంపెనీలు నష్ట పోతున్నాయి. కోలుకోలేని విధంగా దెబ్బతింటు న్నాయి. కొన్నిసార్లు దేశభద్రతకు సంబంధించిన కీలక సమాచారం కూడా శత్రుదేశాలకు చేరి పోతోంది. ఇది ఆందోళనకరమైన పరిణామం. ఈ నేపథ్యంలో హ్యాకర్ల బారినుంచి కంప్యూటర్లను రక్షించేందుకు ఐటీ సెక్యూరిటీ నిపుణుల వినియో గం పెరిగింది. ఐటీ సెక్యూరిటీ ఉద్యోగాలకు, ఉపాధికి ఢోకా లేని కెరీర్గా మారింది. కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకుల్లోని కంప్యూటర్లు ఎక్కువగా హ్యాకర్ల బారిన పడుతున్నాయి. ఇటీవలి కాలంలో అన్ని రంగాల్లోనూ ఈ బెడద అధికమైంది. కేసుల విచారణలో సాయం: కంప్యూటర్లలోకి నకిలీ సాఫ్ట్వేర్లను, వైరస్లను పంపి, సమాచారాన్ని తస్కరించి, సొమ్ము చేసుకుంటున్న ముఠాలు ఉన్నాయి. ఏది ఎలాంటి సాఫ్ట్వేరో తెలియని పరిస్థితి. ఇదంతా అంతర్జాతీయ స్థాయిలో జరుగుతోంది. హ్యాకర్ల పంజాకు గురైన ఎన్నో సంస్థలు ఐటీ సెక్యూరిటీ నిపుణులను నియమించుకుంటున్నాయి. ప్రమాద తీవ్రత అందరికీ తెలియడంతో అన్ని రంగాల్లో వీరి నియామకం జరుగుతోంది. ఐటీ సెక్యూరిటీ లో మూడు విభాగాలు ఉంటాయి. ఒకటి.. కంప్యూటర్ హ్యాకింగ్కు గురైతే అందుకు కారణాన్ని గుర్తించడం. రెండోది.. ఎక్కడి నుంచి హ్యాకింగ్ జరిగిందో గుర్తించడం. మూడోది.. నకిలీ సాఫ్ట్వేర్ను, వైరస్లను తొలగించి, మరోసారి హ్యాకింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం. ఐటీ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఈ మూడు దశల్లో పనిచేయాల్సి ఉంటుంది. వీరి ప్రధాన బాధ్యత ఆన్లైన్ మోసాలను అరికట్టడం. అంతేకాకుండా సెక్యూరిటీ కంప్యూటర్ అప్లికేషన్లను రూపొందించాలి. ప్రస్తుతం ఆన్లైన్ మోసాలకు సంబంధించిన కేసుల విచారణకు దర్యాప్తు సంస్థలు ఐటీ సెక్యూరిటీ నిపుణుల సాయం తీసుకుంటున్నాయి. నేరస్థులను చట్టం ముందు నిలబెట్టేందుకు వీరి సేవలు అవసరమవుతున్నాయి. అర్హతలు: మనదేశంలో అండర్గ్రాడ్యుయేట్ స్థాయిలో ఐటీ సెక్యూరిటీపై ఎలాంటి కోర్సులు లేవు. అయితే, బీసీఏ, బీటెక్ కోర్సుల్లో భాగంగా ఐటీ సెక్యూరిటీని ఒక సబ్జెక్టుగా బోధిస్తున్నారు. ఈ రంగాన్ని కెరీర్గా ఎంచుకోవాలంటే ఇది సరిపోదు. బీటెక్ పూర్తిచేసిన వారు ఎంటెక్ (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ) కోర్సు చేస్తే మంచి అవకాశాలుంటాయి. వేతనాలు: ఐటీ సెక్యూరిటీ నిపుణులకు ప్రారంభంలో నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వేతనం అందుతుంది. నైపుణ్యాలను పెంచుకుంటే నెలకు రూ.20 వేల నుంచి రూ.25 వేలు పొందొచ్చు. ఎంసీఏ, బీటెక్ చేస్తే ఇంకా ఎక్కువ వేతనం లభిస్తుంది. ఐటీ సెక్టార్లో వన్నెతగ్గని కెరీర్ ‘‘ఐటీ రంగంలో వన్నెతగ్గని కోర్సుగా ఐటీ సెక్యూరిటీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆన్లైన్ మార్కెటింగ్, ఇంటర్నెట్ వినియోగం ఎంతగా వ్యాప్తిచెందితే.. ఈ రంగంలో అంతగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఐటీ దిగ్గజాల నుంచి సాధారణ వస్త్రదుకాణం వరకూ అంతటా కంప్యూటర్ వినియోగం పెరిగింది. ఆన్లైన్లో వ్యాపార లావాదేవీలు మరింత విస్తృతమవు తున్నాయి. ఈ నేపథ్యంలో నిపుణుల అవసరం నానాటికీ పెరుగుతుంది. టెక్నాలజీ పరంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటే అవకాశాలకు కొదవ ఉండదు. సాఫ్ట్వేర్ సంస్థలూ ఈ రంగంలో నైపుణ్యం ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తున్నాయి. క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం పెరుగుతున్న కొద్దీ నకిలీ కార్డులను అదుపు చేసేందుకు ఐటీ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ అవసరం పెరిగింది. మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉన్న ఈ కోర్సుతో ఉపాధి, సంతృప్తి రెండూ లభిస్తాయి. వేతనం విషయానికొస్తే ప్రారంభంలో నెలకు రూ.15వేల వరకు అందుకోవచ్చు. అనుభవం, నైపుణ్యాలు పెంచుకుంటే అధిక వేతనాలు పొందొచ్చు. - శివకుమార్, జనరల్ మేనే జర్, జూమ్ టెక్నాలజీస్ -
ఎగువ సభకు ఈశ్వర, పరమేశ్వర?
అభ్యర్థిత్వాల కోసం కాంగ్రెస్, బీజేపీలో పోటాపోటీ మొత్తం ఏడు స్థానాలు ఖాళీ కాంగ్రెస్ 4, బీజేపీ 2, జేడీఎస్ ఒక స్థానాన్ని గెలుచుకునే అవకాశం రేపు ఢిల్లీ వెళ్లనున్న సిద్ధు, పరమేశ్వర సాక్షి ప్రతినిధి, బెంగళూరు : శాసన సభ నుంచి శాసన మండలికి జరుగనున్న ఎన్నికల్లో అభ్యర్థిత్వాలను దక్కించుకోవడానికి అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీలో పోటీ ఎక్కువైంది. అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో చర్చించడానికి కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. స్వయానా పరమేశ్వర కూడా ఆశావహుడే. శాసన సభ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయనకు ప్రత్యామ్నాయ పదవి ఇవ్వడానికి అధిష్టానం కూడా సానుకూలంగా ఉంది. కనుక ఆయన అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారైనట్లే. లోక్సభ ఎనికల్లో మండ్య నుంచి ఓడిపోయిన నటి రమ్యతో పాటు మాజీ మంత్రి రాణి సతీశ్ కూడా ఎగువ సభ సభ్యత్వాలను ఆశిస్తున్నారు. రమ్యకు ఇక్కడ కాకపోయినా రాజ్యసభ సభ్యత్వమైనా ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరో వైపు బీజేపీ నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్. ఈశ్వరప్ప ఎగువ సభకు వెళ్లడం దాదాపుగా ఖాయం. లోక్సభ ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయాన్ని పరిగణనలోకి తీసుకున్న బీజేపీ అధిష్టానం ఈశ్వరప్పకు సముచిత పదవిని ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. కాగా లోక్సభకు ఎన్నికైన డీవీ. సదానంద గౌడ ఇదివరకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. వాస్తవానికి ఆయన వచ్చే నెలాఖరులో రిటైర్డ కావాల్సి ఉంది. ఇంకా భారతి శెట్టి, కేవీ. నారాయణ స్వామి, ఎంసీ. నాణయ్య, ఎంవీ. రాజశేఖరన్, సిద్ధరాజు, మోనప్ప భండారీలు పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఇలా ఏర్పడిన ఏడు ఖాళీలను ఎమ్మెల్యేల ఓట్ల ద్వారా భర్తీ చేస్తారు. వీటిలో కాంగ్రెస్ నాలుగు స్థానాలను సునాయాసంగా గెలుచుకుంటుంది. బీజేపీ రెండు, జేడీఎస్ ఒక స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. -
మైనర్ బాలిక అనుమానాస్పద మృతి
లైంగిక దాడికి పాల్పడి హత్య చేశారని మృతురాలి పిన్నమ్మ ఫిర్యాదు దొడ్డబళ్లాపురం, న్యూస్లైన్ : తాలూకాలోని గుండప్పనాయకనహళ్లికి చెందిన మైనర్ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వంటిపై దుస్తులు లేకపోవడం, మంటల్లో కాలిపోవడం వంటి ఆనవాళ్లను బట్టి ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడి, ఆపై హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యక్ష సాక్షి, మృతురాలి తమ్ముడు సిద్దేశ్, కుటుంబ సభ్యుల కథనం మేరకు... గ్రామ శివార్లలో నివాసం ఉంటున్న గోపాలయ్యకు కుమార్తె నిర్మల(14), సిద్దేశ్ అనే బాలుడు ఉన్నారు. శనివారం గోపాలయ్య పొలానికి వెళ్లిన సమయంలో నిర్మల ఇంటిలో ఒక్కతే ఉంది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన శివకుమార్, నరసింహమూర్తి ఇంట్లోకి చొరబడి నిర్మలపై లైంగిక దాడికి యత్నించారు. ప్రతిఘటించేందుకు నిర్మల యత్నించింది. అప్పుడే ఇంటికి వచ్చిన సిద్దేశ్ తలుపులు కొట్టినా తీయకపోవడంతో ఇంటి వెనుక ఉన్న కిటీకీ నుంచి లోపలకు చూడగా నిందితులు నిర్మలపై లైంగిక దాడికి యత్నించడాన్ని గమనించాడు. విషయాన్ని తండ్రికి తెలిపేందుకు పొలానికి వెళ్లాడు. గోపాలయ్య ఇంటికి చేరే సరికి నిర్మల అర్ధనగ్నంగా, ఒళ్లంతా కాలిపోయి విగతజీవిగా కనిపించింది. ఆదివారం ఉదయం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా నరసింహ మూర్తి, శివకుమార్ నిర్మలను తరచూ వేధిస్తూ గ్రామస్తుల చేత చీవాట్లు కూడా తిన్నారని మృతురాలి పిన్ని లక్ష్మి తెలిపింది. నిందితులు నిర్మలపై లైంగిక దాడికి పాల్పడి, హత్య చేశారని హొసహళ్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతనే నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి సాక్ష్యం చెప్పేందుకు ముందుకు వచ్చిన గ్రామస్తులను, సిద్దేశ్ను పోలీసులు బెదిరించారని మృతురాలి పిన్నమ్మ ఆరోపిస్తోంది. -
టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు షాక్!
-
టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు భారీ షాక్!
హైదరాబాద్ : గుంటూరు జిల్లాలో టీడీపీకి, విజయనగరం జిల్లాల్లో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. తెనాలి టీడీపీ సీనియర్ నేత, దివంగత మాజీ మంత్రి అన్నాబత్తుని సత్యనారాయణ తనయుడు శివకుమార్ శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. తెనాలి నియోజకవర్గంలో టీడీపీ కీలకనేతగా శివకుమార్ వ్యవహరిస్తున్నారు. శివకుమార్కు తెనాలిలో ప్రముఖ విద్యాసంస్ధల ఛైర్మన్గా కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. లోటస్పాండ్లో శివకుమార్తో పాటు ఆయన ముఖ్య అనుచరులు కూడా జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఇదిలాఉంటే పీసీసీ అధ్యక్షుడు సొంత జిల్లా విజయనగరంలో కాంగ్రెస్ పార్టీకి... బొత్సా సత్యనారాయణకు ఆ జిల్లా నేత షాక్ ఇచ్చారు. బొత్సా ముఖ్య అనుచరుడు, చీపురుపల్లి కాంగ్రెస్ కీలకనేత మీసాల వరహాలనాయుడు కూడా ఈ రోజే జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వరహలనాయుడు సతీమణి సరోజిని ఇటీవలే ఇండిపెండెంట్గా పోటీచేసి చీపురుపల్లి మేజర్ పంచాయితీ సర్పంచ్గా భారీ మెజార్టీతో గెలుపొందారు. -
వ్యవసాయ ఎగుమతుల్లో వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గడిచిన పదేళ్లుగా దేశీయ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు ఏటా సగటున 20 శాతం చొప్పున వృద్ధి చెందుతూ 36 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దేశం నుంచి జరుగుతున్న మొత్తం ఎగుమతుల్లో ఇది 12 శాతానికి సమానమని, కాని ఈ రంగంలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయని ఐటీసీ వ్యవసాయ వ్యాపార విభాగం అధిపతి ఎస్.శివకుమార్ సోమవారం తెలిపారు. సరైన మౌలికవసతులు లేకపోవడంతో దేశీయంగా రూ.50,000 కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులు ఏటా వృధా అవుతున్నాయన్నారు. ఫుడ్ ప్రోసెసింగ్తో ఈ నష్టాన్ని అరికట్టవచ్చన్నారు. హైదరాబాద్లో ‘ఫుడ్ 360’ పేరిట నవంబర్లో నిర్వహించే అంతర్జాతీయ సదస్సు వివరాలను తెలియచేయడానికి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దేశీయ వ్యవసాయ రంగం పెట్టుబడుల విలువ రూ.1.50 లక్షల కోట్లకు చేరిందన్నారు. వ్యవసాయరంగంలో దిగుమతుల కంటే ఎగుమతులే ఎక్కువ జరుగుతున్నాయని, వీటిని ప్రోసెస్ చేస్తే మరిన్ని ఎగుమతికి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చన్నారు. గతంలో రెండుసార్లు నిర్వహించిన ఫుడ్ 360 విజయవంతమయ్యిందని, ఈ సంవత్సరం నవంబర్ 6-7 తేదీల్లో జరిగే ఈ రెండురోజుల సదస్సును లక్షమంది సందర్శిస్తారని అంచనా వేస్తున్నట్లు ఫిక్కీ ఏపీ చాప్టర్ కోచైర్మన్ జేఏ చౌదరి తెలిపారు. గత సంవత్సరం 2,600 మంది ప్రతినిధులు పాల్గొన్నారని, ఈ సంవత్సరం కూడా అదే స్థాయిలో హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
ప్లంబర్ కిడ్నాప్ : ఐదుగురి అరెస్టు
తిరువొత్తియూరు, న్యూస్లైన్ : తిరువణ్ణామలై సమీపంలో రూ.40 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్లంబర్ను కిడ్నాప్ చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తిరువణ్ణామలై, కొలక్కారవాడి గ్రామానికి చెందిన రౌద్రి అలియాస్ మురుగన్ (35) ప్లంబర్గా పనిచేస్తున్నాడు. ఏప్రిల్లో నరిపల్లి పెరియపట్టి రోడ్డులో హొగ్నెకల్ సహకార తాగునీటి పథకంలో పైప్లైన్ అమర్చేందుకు తన ఊరికి చెందిన కొందరిని పనికి తీసుకెళ్లాడు. అక్కడ వారికి కాంట్రాక్టర్ తగిన జీతం ఇవ్వలేదు. దీంతో ఆగ్రహం చెందిన రౌద్రి అలియాస్ మురుగన్ తిరువణ్ణామలైకు చెందిన వీరరాఘవన్ (39) అనే వ్యక్తి వద్ద లారీని అద్దెకు తీసుకుని రూ.2.45 లక్షల విలువైన పైపులను చోరీ చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. లారీని స్వాధీనం చేసుకుని అరూర్ కోర్టులో అప్పగించారు. లారీని కోర్టు నుంచి విడిపించడానికి వీరరాఘవన్ రూ.లక్ష చెల్లించాడు. ఈ మొత్తాన్ని ఇవ్వాలని రౌద్రిని అడిగాడు. తాను అంత మొత్తాన్ని ఇవ్వలేనని, రూ.40 వేలు మాత్ర ఇస్తానని పేర్కొన్నాడు. అది కూడా ఇవ్వలేకపోయాడు. దీంతో ఆగ్రహం చెందిన వీరరాఘవన్ తన సహచరులు వెంకటేశన్ (33), శివకుమార్ (30), రాజి (32), మురుగన్(29)తో కలిసి శనివారం రౌద్రిని కారులో కిడ్నాప్ చేశాడు. అతని నుంచి తప్పించుకున్న రౌద్రి శనివారం రాత్రి ఇంటికి చేరుకుని తిరువణ్ణామలై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం ఉదయం వీరరాఘవన్తోపాటు ఐదుగురిని అరెస్టు చేసి కిడ్నాప్కు ఉపయోగించిన కారు, కత్తి, కర్రలు స్వాధీనం చేసుకున్నారు.