social
-
గిరి ‘గడబ’ ప్రకృతితో మమేకం
ఆధునిక ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న గిరిజన తెగ ‘గడబ’ ఇప్పుడిప్పుడే తన రూపు మార్చుకుంటోంది. అయితే, వీరి అరుదైన సంస్కృతి అంతరించిపోకుండా కాపాడుకుంటోంది. ప్రాచీన కాలం నుంచి ఈ తెగ గోదావరి పరివాహక ప్రాంతానికి దాపుగా ఉంటోంది. ‘గ’ అంటే గొప్పతనం అని, ‘డ’ అంటే నీటికి సూచిక అని అర్థం. ‘గడ’ అంటే గొప్పదైనా నీరు అని, గోదావరి అనే పేరు ఉంది. ఒరియాలో ‘గడబ’ అంటే సహనం గలవాడు అని అర్థం. గడబ తెగలు ఒరిస్సా వింద్య పర్వత ప్రాంతాల్లో స్థిరపడ్డాయి. మధ్యప్రదేశ్లోనూ ఈ తెగ ఉంది. ఈ తెగను భాష గుటబ్! వీరిలో అక్షరాస్యులు, నిరక్షరాస్యులూ ఉన్నారు. మన రాష్ట్రంలో గడబలు విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో ప్రముఖంగా కనిపిస్తారు. అటవీ ఉత్పత్తులే ఆధారంగా!వీరు గడ్డి, మట్టి, కలపను ఉపయోగించి ఇండ్లను నిర్మించుకుంటారు. ఈ గుడెసెలు త్రికోణాకారంలోనూ, మరికొన్నింటికి కింది భాగం గుండ్రంగా ఉండి పైకప్పు కోన్ ఆకారంలో ఉంటుంది. మహిళలు కుట్టని రెండు వస్త్రాల ముక్కలను ధరిస్తారు. అలాగే, రెండు వలయాలుగా ఉండే నెక్పీస్ను ధరిస్తారు. వీటిలో అల్యూమినియమ్, వెండి లోహం ప్రధానమైంది. తృణధాన్యాలు, వరి పండిస్తారు. అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడే వీరంతా సహజ పద్ధతుల్లో తయారుచేసుకున్న సారాయి, కల్లు పానీయాలను సేవిస్తారు. థింసా నృత్యంమహిళలు అర్థచంద్రాకారంలో నిలబడి, ఒకరి మీద ఒకరు చేతులు వేసి, ఒక వైపుకు లయబద్ధంగా కాళ్లు కదుపుతూ నృత్యం చేస్తారు. వీరు నృత్యం చేస్తున్నప్పుడు పురుషులు సంగీతవాయిద్యాలను వాయిస్తారు. ఈ థింసా నృత్యం ఆధునిక ప్రపంచాన్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. సులువైన జీవనంఇంటిపేర్లను బట్టి వావివరసలను లెక్కించుకుంటారు. మేనబావ, మేనమరదలు వరసలు గలవారు వీరిలో ఎక్కువగా పెళ్లి చేసుకుంటారు. పెళ్లి వద్దని అమ్మాయి అనుకుంటే కుల పెద్దలతో పంచాయితీ నిర్వహించి వారి సమక్షంలో ఓలి ఖర్చు పెట్టుకుంటే చాలు విడిపోవచ్చు. అబ్బాయి కూడా ఇదే పద్ధతి పాటిస్తాడు.అన్నీ చిన్న కుటుంబాలే!గడబలో ఎక్కువగా చిన్నకుటుంబాలే. వీరికి ఇటెకుల, కొత్త అమావాస్య, తొలకరి, కులదేవత పండగలు ప్రధానమైనవి. వీరిని గడ్బా అని మధ్య ప్రదేశ్లో, గడబాస్ అని ఆంధ్రప్రదేశ్లో పేరుంది.(చదవండి: నా నుదుటి రాతలోనే నృత్యం ఉంది..!) -
అరెస్ట్ పై.. పట్నం నరేందర్ రెడ్డి భార్య.. కీలక వ్యాఖ్యలు
-
వైఎస్సార్సీపీకి ఓటేశారని సామాజిక బహిష్కరణ!
వినుకొండ (నూజెండ్ల): పోలింగ్ ముగిసినప్పటికీ టీడీపీ నేతల ఆగడాలకు అంతూ పొంతూ లేకుండా పోతున్నది. వైఎస్సార్ సీపీకి ఓటు వేశారని ఓ ఎస్సీ కాలనీ వాసులను సామాజిక బహిష్కరణ చేయడమే ఇందుకు సాక్షీభూతంగా నిలుస్తున్నది. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం గురప్పనాయుడిపాలెం గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీ వాసులు ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓట్లు వేశారని గ్రామంలో మంచినీటి ప్లాంట్ వద్దకు రానివ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని కాలనీ వాసులు వినుకొండ ఎమ్మెల్యే బొల్లాబ్రహ్మనాయుడును గురువారం కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం గ్రామానికి చెందిన మాశిపోగు వసంతరావు, దూపాటి లింగయ్య, పాలెపోగు యోబు, మాణిక్యరావుతోపాటు పలువురు కాలనీ వాసులు మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు ముగిసిన వెంటనే గ్రామంలోని వాటర్ ప్లాంట్ వద్ద తాగునీరు పట్టుకోవడానికి వీలులేదని, పొలం పనులకు పిలవబోమని, కౌలుకు భూములు ఇవ్వబోమని, కులం పేరుతో దూషిస్తూ టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈవిషయమై ఎస్సీ కమిషన్ తో పాటు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సామాజిక బహిష్కరణ చేయడం దారుణం : ఎమ్మెల్యే బొల్లా గురప్పనాయుడు పాలెం ఎస్సీ కాలనీ వాసులకు తాగునీరు ఇవ్వకుండా, పనులకు పిలవకుండా బహిష్కరించడం దారుణమని ఎమ్మెల్యే బొల్లా అన్నారు. కాలనీ వాసులకు అండగా ఉంటామని తెలిపారు. గ్రామంలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. -
అమరావతిలో ధ్వనించిన సామాజిక సాధికారత
సాక్షి ప్రతినిధి, గుంటూరు: పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో శుక్రవారం జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో బడుగు, బలహీన వర్గాల్లో వచ్చిన చైతన్యం కళ్లకు కట్టింది. అమరావతి జనసంద్రం అయింది. వేలాది బడుగు, బలహీన వర్గాల ప్రజలు తరలిరాగా కృష్ణాతీరాన అమరేశ్వరుడి సన్నిధిలో స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకరరావు నేతృత్వంలో బస్సు యాత్ర విజయవంతంగా సాగింది. అనంతరం జరిగిన సభకు వేలాదిగా ప్రజలు పోటెత్తారు. మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు సీఎం జగన్ చేస్తున్న మేలును వివరించినప్పుడు ప్రజలు జేజేలు పలికారు. ఇది బడుగు, బలహీనవర్గాల ప్రభుత్వం : మంత్రి విడదల రజిని రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నది బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. పెదకూరపాడు నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార సభలో మంత్రి రజిని మాట్లాడుతూ.. మహిషాసురుడ్ని సంహరిస్తే దసరా, నరకాసురుడిని సంహరిస్తే దీపావళి చేసుకుంటామని, తరతరాలుగా బడుగు, బలహీన వర్గాల అణచివేతను సంహరిస్తే ఆ ప్రభుత్వ పాలనను ఏమనాలని, ఆ సంబరాన్ని ఏమని పిలవాలని అన్నారు. ఆ ఉత్సవాలే సామాజిక సాధికారత అని చెప్పారు. నాలుగున్నరేళ్లలో విద్యా, వైద్యంలో విప్లవాత్మక మార్పులు తెచి్చన ఘనత సీఎం జగనన్నకే సొంతమన్నారు. ఏ ముఖ్యమంత్రీ ఆలోచన చేయని విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్్టతో ప్రభుత్వ వైద్యులు గ్రామానికే వచ్చి సేవలు అందిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు హయాంలో ఒక్క స్కూల్ బాగు చేయాలన్న ఆలోచనే చేయలేదని, ఆఖరికి పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనాన్ని కూడా సొమ్ము చేసుకున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ బిడ్డని అని గొప్పగా చెప్పుకుంటా : అలీ ఎల్రక్టానిక్ మీడియా సలహాదారు, సినీ నటుడు అలీ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగన్ చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి అనితర సాధ్యమని అన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా ఆంధ్రప్రదేశ్ బిడ్డని అని గొప్పగా చెప్పుకుంటానన్నారు. పెద్దగా చదువుకోని తనకే తెలుగు, తమిళ్, మళయాళం, కన్నడం, హిందీ, ఇంగ్లిష్ బాషలు వచ్చని, మన పిల్లలు ఇంగ్లీష్లో చదవకూడదా? మాట్లాడకూడదా? అని ప్రశి్నంచారు. మారుతున్న ప్రపంచంతోపాటే మన పిల్లలు కూడా మారాలన్నది సీఎం జగన్ ఆలోచన అని చెప్పారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలు నాయకత్వం వహించాలని చెప్పిన మొట్టమొదటి నేత వైఎస్ జగన్ అని చెప్పారు. పెత్తందారీ వ్యవస్థకు సీఎం జగన్ ఒక సవాలుగా నిలబడ్డారన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రాజకీయ పారీ్టలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టల ఓట్ల కోసం మాయమాటలు చెప్పాయని, సీఎం జగన్ మాత్రం ఈ వర్గాల కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టి, అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని అన్నారు. బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. చంద్రబాబు బడుగుల జీవితాలను వెక్కిరించారని, మనం ఇంగ్లిష్ మీడియం చదివితే పోటీకి వస్తారని భయపడి అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. అయినా, సీఎం జగన్ ఈ వర్గాల అభ్యున్నతి కోసం బాబు పన్నాగాలను విజయవంతంగా ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు శంకరరావు, మహ్మద్ ముస్తఫా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: జగనే రావాలి.. జగనే కావాలి -
రాజ్యాంగంలో ఆ 'రెండు' పదాలు మిస్సింగ్: అధిర్ రంజన్ చౌదరి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన ప్రత్యేక పార్లమెంట్ సెషన్లలో భాగంగా మొదటిరోజు పాత పార్లమెంటుకు వీడ్కోలు పలకగా రెండో రోజు సభ్యులంతా కొత్త పార్లమెంటు భవనంలో అడుగు పెట్టారు. ఈ సందర్బంగా ఎంపీల చేతికి ఇచ్చిన భారత రాజ్యాంగం ప్రతుల్లో భారత రాజ్యాంగం ముందుమాటలో సాంఘిక, లౌకిక పదాలు లేకపోవడంపై కాంగ్రెస్ నేత అధిర్ రంజాన్ చౌదరి తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఎంపీలంతా కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో వారి చేతికి భారత రాజ్యాంగ ప్రతులను అందించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి తమకు ఇచ్చిన రాజ్యాంగ ప్రతుల్లోని పీఠికలో పొరపాట్లు ఉన్నాయన్నారు. అధిర్ రంజాన్ చౌదరి మాట్లడుతూ.. మాకు అందిచ్చిన రాజ్యాంగ ప్రతుల ప్రవేశికలో సాంఘిక, లౌకిక అన్న పదాలు ముద్రించలేదన్నారు. ఆ పదాలు రాజ్యాంగ పుస్తకంలో అంతకు ముందు లేవని 1976లో రాజ్యాంగ సవరణ తరవాతే ఆ పదాలను రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరిచారన్న విషయం నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఎవరైనా మన చేతికి రాజ్యాంగం అందించి అందులో ఈ పదాలు కనిపించకపోతే ఆందోళన చెందాల్సిందేనన్నారు. నాకు మాత్రం ఈ విషయం ఆందోళన కలిగించేదే. వారి ఉద్దేశ్యం చూస్తే నాకు అనుమానం కలుగుతోందన్నారు. నాకు ఈ విషయంలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. లేదంటే ఈ అంశం గురించి కచ్చితంగా ప్రస్తావించేవాడినని అన్నారు. ఇక ఇండియా పేరును 'భారత్'గా మార్చే అంశంపై మాట్లాడుతూ.. 'ఇండియా' 'భారత్' పేర్లలో ఏదైనా ఒక్కటే.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో ఇండియాగా పిలవబడే భారత్, రాష్ట్రాల సమూహం అని కూడా సంబోధించారు. నా దృష్టిలో రాజ్యాంగం బైబిల్, ఖురాన్, భగవత్గీత గ్రంధాలకు ఏమాత్రం తక్కువకాదు. ఆ విషయంలో ఎవ్వరూ ఎటువంటి సమస్యను సృష్టించకుండా ఉంటే బాగుంటుందని అన్నారు. అధిర్ రంజాన్ చౌదరి, భారత రాజ్యాంగం, సాంఘిక, లౌకిక, రాజ్యాంగ పీఠిక ఇది కూడా చదవండి: పొలిటికల్ మైలేజి కోసమే బిల్లు పెట్టారు: కపిల్ సిబాల్ -
దేశ సమైక్యతకు చిహ్నం ఆ భాష! జాతీయ భాషగా నీరాజనాలు అందుకుంటోంది
భాషతో బంధంజాతి నిర్మాణంలో భాష పాత్ర చాలా గొప్పది. అనేక విషయాలను అధ్యయనం చేయడం, విజ్ఞాన సాంకేతిక తదితర ఉన్నత రంగాల్లో ప్రావీణ్యత పొందడం ఒక భాష ద్వారానే సాధ్యపడుతుంది. ఒక వ్యక్తి సమగ్ర వికాసానికి భాష ఆయువుపట్టు. అదే భాష దేశాన్ని ఒకే తాటిపై నిలబడేలా, జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించినప్పుడు ఆ భాష ‘జాతీయ భాష’గా నీరాజనాలు అందుకుంటుంది. ఆ పాత్రను అక్షరాలా ‘హిందీ’ భాష నిర్వర్తించింది, నిర్వర్తిస్తోంది కూడా. భారత స్వాతంత్య్ర సమరంలో ప్రజలను జాగృత పరచడంలో క్రియాశీల పాత్ర పోషించి, ప్రపంచంలోనే అత్యధికులు మాట్లాడే రెండవ భాషగా వికసించిన భాష హిందీని కొందరు ఇంకా పరాయి భాషగా భావించడం దురదృష్టకరం. హిందీ ఒక భాష మాత్రమే కాదు, మన దేశ సమైక్యతా చిహ్నం కూడా! దేశంలో హిందీ మాట్లాడేవారు, అర్థం చేసుకునే వారు అధికంగా ఉండడం చేత కేంద్ర ప్రభుత్వము హిందీని అధికార భాషగా ప్రకటించింది. ప్రస్తుతం పదికి పైగా రాష్ట్రాలలో ప్రథమ భాషగా, మిగతా రాష్ట్రాల్లో ద్వితీయ భాషగా హిందీ ప్రచలనములో ఉన్నప్పటికీ, ఆంగ్ల భాషపై మోజుతో హిందీని నిర్లక్ష్యం చేస్తున్నారు. గాంధీజీ స్వయంగా దక్షిణ భారతదేశంలో ఈ భాష ప్రచార కార్యక్రమా నికి ‘దక్షిణ భారత హిందీ ప్రచార సభ’ స్థాపనతో శ్రీకారం చుట్టారు. ఆ మహాత్ముని ఆశయాలను అనుసరిస్తున్న మనం ఆయన విస్తరింపచేసిన భాషను తగిన విధంగా ఆదరించలేక పోవడం విచారకరం. వివిధ దేశాల్లో ఎన్నో విశ్వవిద్యాలయాల్లో హిందీని పాఠ్యాంశంగా బోధించడం గమనార్హం. కానీ, మన దేశంలో మాత్రం అంతగా హిందీకి ప్రాముఖ్యం ఇవ్వడం లేదు. ‘త్రిభాషా సూత్రా’న్ని అనుసరించి మాతృ భాష ప్రథమ భాషగా ద్వితీయ భాషగా హిందీని, తృతీయ భాషగా ఆంగ్లం. పాఠశాల విద్యార్థులకు బోధించాలని కేంద్రం నిర్దేశించింది. కానీ కొన్ని రాష్ట్రాలు ముఖ్యంగా తమిళనాడు లాంటి దక్షిణాది రాష్ట్రాలు ఈ సూత్రాన్ని వ్యతిరేకిస్తున్నాయి. పరాయి భాషలు అవసరానికి ఎన్ని నేర్చుకున్నా, మన మాతృ భాష, అధికార భాషలను నిర్లక్ష్యం చేయరాదు. – భైతి దుర్గయ్య, హిందీ ఉపాధ్యాయుడు (చదవండి: మాట తప్పిన ఆత్రేయ! ముచ్చటపడ్డా.. ఆ కోరిక నెరవేరకుండానే..) -
‘స్కిల్’ స్కామ్ సామాజిక, ఆర్థిక నేరం
సాక్షి, అమరావతి : గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ను భారీ కుట్రకు సంబంధించిన సామాజిక, ఆర్థిక నేరంగా గతంలో విచారణకు వచ్చినప్పుడు హైకోర్టు అభివర్ణించింది. బెయిల్ మంజూరు చేసే సమయంలో న్యాయస్థానాలు ఇలాంటి కేసులను ప్రత్యేక దృష్టి కోణంలో చూడాలని తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం చెప్పిందని గుర్తు చేసింది. ఈ స్కామ్లో బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన నిందితులపై ఉన్నవి తీవ్ర ఆరోపణలని తెలిపింది. ఈ స్కామ్లో రూ.371 కోట్ల ప్రజాధనం ముడి పడి ఉందని, చాలా తీవ్రత ఉందని హైకోర్టు తెలిపింది. ఈ స్కిల్ కుంభకోణంలో ఇద్దరు కీలక నిందితులు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేయగా, హైకోర్టు వారి పిటిషన్లు కొట్టేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఇద్దరు వేర్వేరు న్యాయమూర్తులు వేర్వేరు సందర్భాల్లో ఈ మేరకు తీర్పు ఇచ్చారు. షెల్ కంపెనీల కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్లను దర్యాపు అధికారులు కోర్టు ముందు ఉంచలేదన్న నిందితుల వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఆ విషయాలన్నీ తుది ట్రయల్లో చెప్పుకోవాలని స్పష్టం చేసింది. కేసు రికార్డులను పరిశీలించిన హైకోర్టు.. షెల్ కంపెనీల కొనుగోలు జరిగిన తీరును గమనించింది. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని, వారి బెయిల్ పిటిషన్లను కొట్టేస్తున్నట్లు తెలిపింది. రిమాండ్ తిరస్కరణ సరికాదు.. ఇదే కుంభకోణంలో కీలక నిందితుడి రిమాండ్ను ఏసీబీ కోర్టు తిరస్కరించడాన్ని కూడా హైకోర్టు తప్పు పట్టింది. రిమాండ్ సమయంలో కింది కోర్టు మినీ ట్రయల్ నిర్వహిస్తూ ఫలానా సెక్షన్ వర్తించదంటూ తేల్చేయడంపై హైకోర్టు ఆక్షేపణ తెలిపింది. రిమాండ్ సమయంలో మినీ ట్రయిల్ తగదని స్పష్టం చేసింది. నిందితునిపై నమోదు చేసిన కేసు విచారణకు స్వీకరించదగ్గదా.. కాదా.. అన్నది మాత్రమే చూడాలని స్పష్టం చేసింది. నేరంలో నిందితుల పాత్ర గురించి క్షుణ్ణంగా చెప్పాల్సిన అవసరం లేదంది. 41ఏ సీఆర్పీసీ కిందకు రాని నేరాలకు కూడా 41ఏ ఇవ్వాలని చెప్పడం సరికాదంది. ఈ మొత్తం కేసులో ఐపీసీ 120బి ప్రకారం నేరపూరిత కుట్ర ఉందన్న విషయాన్ని ఏసీబీ ప్రత్యేక కోర్టు విస్మరించిందని హైకోర్టు ఆక్షేపించింది. రిమాండ్ తిరస్కరిస్తూ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. -
ఛత్తీస్గఢ్లో సామాజిక వర్గాల ప్రభావం ఎంత?.. ఎవరు ఎటువైపు మొగ్గు?
డిసెంబర్లో జరగనున్న ఛత్తీస్గఢ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలున్నట్లు పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన ‘ఛత్తీస్గఢ్ మూడ్ సర్వే’లో తేలింది. వివిధ సామాజిక వర్గాల ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై విశ్లేషిస్తే.. ఎస్టీ సామాజిక వర్గం ఆధిపత్యం ఛత్తీస్గఢ్ దక్షిణ ప్రాంతాన్ని బస్తార్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ 12 స్థానాల్లో 11 ఎస్టీ రిజర్వ్డ్గా ఉన్నాయి. ఇది మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం. బీజేపీకి పట్టున్న ఈ ప్రాంతంలో 2018లో 11 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో మరోస్థానం గెలిచి మొత్తం 12 స్థానాలను సాధించింది. ఎస్టీలతోపాటు గోండ్, మారియా`మురియా, భాత్ర హల్బీట్ సామాజిక వర్గాల ప్రభావం ఇక్కడుంది. ఇక్కడ ఓబీసీతో పాటు ఇతర సామాజిక వర్గాల ప్రభావం తక్కువ. సుక్మా జిల్లాలో సీపీఐ ప్రభావం కొంత ఉంది. బస్తర్లో మత మార్పిడి ఘటనలతో గత కొన్ని సంవత్సరాలుగా గిరిజనుల మధ్య మత కలహాలు జరిగాయి. ఈ కారణాలతో బీజేపీ 2018తో పోలిస్తే కొంత బలపడే అవకశాలున్నాయి. ఈ ప్రాంతంలో సర్వ్ ఆదివాసీ సమాజ్ ఓట్లను చీల్చినా సీట్లు గెలిచే అవకాశాలు లేవు. ఇక్కడ కాంగ్రెస్ కొంత నష్టపోయినా ప్రభుత్వ పథకాల ప్రభావంతో అధిక స్థానాలు గెలిచే అవకాశాలున్నాయని పీపుల్స్పల్స్ సర్వేలో తేలింది. రాయ్పూర్, బిలాస్పూర్, జగదల్పూర్, అంబిక్పూర్, కోబ్రా, రాయిగఢ్ మొదలగు నగరాల్లో రాజపూత్, బ్రాహ్మిణ్, సింధీ, పంజాబీలు, మార్వాడీలు, బనియా సామాజిక వర్గాల ప్రభావం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఓడియా, బెంగాలీల ప్రభావం కూడా ఉంది. ఈ సామాజిక వర్గాలలో బీజేపీ పట్ల కొంత మొగ్గు కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఓబీసీల ఓటింగ్ బ్యాంక్ అధికం. ఓబీసీలో సాహు సామాజిక వర్గం అధికంగా ఉన్నారు. ఈ సామాజిక వర్గంలో బీజేపీ పట్ల కొంత మొగ్గు ఉంది. ఓబీసీలో రెండో పెద్ద సామాజికవర్గం కుర్మీలది. వీరు సెంట్రల్ రీజియన్లో అధికంగా ఉన్నారు. ముఖ్యమంత్రి భూపేష్ ఈ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో వీరు కాంగ్రెస్ వైపు ఉన్నారు. చేనేతకు చెందిన పానికాస్ కాంగ్రెస్ వైపు ఉన్నారు. వ్యవసాయ రంగానికి చెందిన మారర్ సామాజిక వర్గం కాంగ్రెస్ పట్ల అనుకూలంగా ఉంది. సెంట్రల్ ప్రాంతంలో అధికంగా ఉండే కాలర్ సామాజిక వర్గం బీజేపీకి అనుకూలంగా ఉంది. దేవాంగన్ సామాజిక వర్గం బీజేపీ పట్ల మొగ్గు చూపుతుంది. మధ్య ఛత్తీస్గఢ్లో ప్రాభల్యం ఉన్న యాదవ్ సామాజిక వర్గం బీజేపీకి అనుకూలంగా ఉంది. చదవండి: ఆ సర్వే రిపోర్ట్ ఏం చెబుతోంది? ఎస్సీలు ప్రధానంగా ఛత్తీస్గఢ్ మధ్య ప్రాంతంలో అధికంగా ఉన్నారు. ఎస్సీల్లో అధికంగా ఉన్న సాతనమీ, హరిజన, మహార్ సామాజిక వర్గాలు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నాయి. ఎస్టీల ప్రభావం ప్రధానంగా ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో ఉంది. ఎస్టీల్లో అధికంగా ఉండే గోండుల ఓటర్లు కాంగ్రెస్, బీజేపీ, సర్వ్ ఆదివాసీ పార్టీలకు అనుకూలంగా చీలిపోయారు. ఎస్టీలలో రెండో పెద్ద సామాజిక వర్గమైన కన్వార్ బీజేపీ పట్ల మొగ్గు చూపుతున్నారు. ఉత్తర ప్రాంతంలో ఉన్న ఖైర్వార్, ఓరాన్ సామాజిక వర్గాలు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నాయి. పహాడి కోబ్ర సామాజిక వర్గం బీజేపీ పట్ల సానుకూలంగా ఉంది. హల్బా సామాజిక వర్గం కాంగ్రెస్కు అనుకూలంగా ఉంది. మరియా`మురియా, భాట్రా సామాజిక వర్గాలు కాంగ్రెస్, బీజేపీ మధ్య చీలి ఉన్నాయి. రాష్ట్ర జనాభాలో రెండు శాతానికి పైగా ఉన్న ముస్లింలు, దాదాపు రెండు శాతం ఉన్న క్రిస్టియన్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. -
ట్రెండీ లుక్లో అషు రెడ్డి అందాలు.. పర్వతాల్లో జాన్వీ కపూర్ ఫోజులు!
►అమెరికా వీధుల్లో అషు రెడ్డి అందాలు ►బ్లాక్ డ్రెస్లో దసరా బ్యూటీ కీర్తి సురేశ్ లుక్స్ ►పర్వత ప్రాంతాల్లో ఎంజాయ్ చేస్తున్న దేవర భామ జాన్వీ కపూర్ ►శారీలో అందాలు ఒలకబోస్తున్న టిక్ వెడ్స్ షేరు భామ అవనీత్ కౌర్ ►బ్లాక్ డ్రెస్లో కాబోయే పెళ్లికూతురు పరిణీతి చోప్రా పోజులు View this post on Instagram A post shared by @parineetichopra View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Avneet Kaur Official (@avneetkaur_13) -
ESG: పెట్టుబడి.. పదికాలాలు పచ్చగా!
అసలు పెట్టుబడి ఉద్దేశం రాబడే కదా..? ఈ రాబడి కాంక్షే ఇన్వెస్టర్ల నిర్ణయాలను ప్రభావితం చేస్తుంటుంది. కానీ, నేడు భూ మండలం వాతావరణ మార్పులు అనే పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వనరుల వినియోగం గరిష్ట స్థాయికి చేరి, కాలుష్యం అసాధారణ స్థాయికి చేరిపోయిన తరుణంలో.. పర్యావరణంపై మమకారంతో పుట్టుకొచ్చిందే ఈఎస్జీ (ఎన్విరాన్మెంట్, సోషల్, గవర్నెన్స్) విధానం. తాము పెట్టుబడి కోసం ఎంపిక చేసుకుంటున్న కంపెనీ.. పర్యావరణాన్ని ఏ రకంగా చూస్తోందన్నది ఇన్వెస్టర్కు కీలకం అవుతుంది. అంటే పర్యావరణానికి తన ఉత్పత్తులు, తయారీ, సేవల ద్వారా హాని కలిగించకూడదు. తన ఉద్యోగులు, భాగస్వాములతో ఎలా వ్యవహరిస్తుందన్నది ‘సోషల్’. ఇక కంపెనీ నిర్వహణ తీరుకు అద్దం పట్టేదే గవర్నెన్స్. ఈ మూడింటిలో పాస్ మార్కులు పొందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడమే ఈఎస్జీ ఇన్వెస్టింగ్. ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి కాలంలో పాపులర్ అవుతున్న ఈ విధానం పట్ల రిటైల్ ఇన్వెస్టర్లు కూడా ఆకర్షితులవుతున్నారు. అయితే, ఇందులో కొన్ని పరిమితులు ఉన్నాయి. దేశీయంగా ఇంకా పూర్తి స్థాయిలో పరిణతి చెందలేదు. కనుక ఈఎస్జీ థీమ్ పట్ల ఆసక్తితో ఉన్న ఇన్వెస్టర్లు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవేంటో సమగ్రంగా వివరించే కథనమిది... ప్రపంచవ్యాప్తంగా ఈఎస్జీ పెట్టుబడులు 2020 నాటికే 35 ట్రిలియన్ డాలర్లు (రూ. 2800 లక్షల కోట్లు) దాటాయంటే దీని ప్రాధాన్యం ఏ మేరకో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఈ తరహా పర్యావరణ అనుకూల పెట్టుబడి విధానం కొత్తదేమీ కాదు. కాకపోతే దీని రూపం మారింది. గ్రీన్ ఇన్వెస్టింగ్, సామాజిక బాధ్యతా పెట్టుబడి విధానం, సుస్థిర పెట్టుబడి అన్నవి ఈఎస్జీని పోలినవే. ఈ తరహా పెట్టుబడులన్నింటినీ ఏకం చేసింది ఈఎస్జీ. ఇప్పుడు ఈఎస్జీ అనుకూలం. ఈఎస్జీ వ్యతిరేకం పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు కంపెనీలను చూస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ప్రత్యేకంగా ఈఎస్జీ ఫండ్స్ను ఆఫర్ చేస్తున్నాయి. పెట్టుబడులు భిన్నం.. కంపెనీలు ఏ స్థాయిలో లాభాలను ఆర్జిస్తున్నాయనే దానికంటే.. ఏ విధంగా లాభాలను పొందుతున్నాయన్నది ఈఎస్జీ విధానంలో కీలకం. పర్యావరణానికి హాని తలపెట్టకుండా, వీలైతే మేలు చేస్తూ, చక్కని లాభాలను పోగేస్తున్న కంపెనీలకు ఈ విధానంలో మంచి డిమాండ్ ఉంటుంది. కేవలం గత రెండు సంవత్సరాల్లోనే సుమారు 32 బిలియన్ డాలర్లు (రూ.2.56 లక్షల కోట్లు) ఈఎస్జీ ఆధారిత యూఎస్ ఈటీఎఫ్ల్లోకి పెట్టుబడులుగా వెళ్లాయి. ముందే చెప్పుకున్నట్టు ఈ పెట్టుబడికి సామాజిక స్పృహ ఎక్కువ. కనుక రాబడుల విషయంలో కొంత రాజీ పడక తప్పదు. ఎంఎస్సీఐ వరల్డ్ ఈఎస్జీ ఇండెక్స్ రాబడులను పరిశీలిస్తే.. గత 10 ఏళ్లలో రెట్టింపైంది. ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన సార్వత్రిక నిబంధనలు, ప్రమాణాలు ఈఎస్జీకి లేవు. అలాగే ఏకీకృత నిర్వచనం, విధానం కూడా లేవు. అసలు ఈఎస్జీ పేరుతో మూలసూత్రాలకు విరుద్ధంగా పెట్టుబడులు పెడుతున్న కంపెనీలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు కొన్ని ఈఎస్జీ ఈక్విటీ ఫండ్స్.. ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ తర్వాత చమురు ధరల పెరుగుదలతో షెల్, రెప్సోల్ కంపెనీల్లో పెట్టుబడులు పెంచుకున్నాయి. కాగా, పెట్టుబడులపై భవిష్యత్తులో మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఫండ్స్ మేనేజర్ల పెట్టుబడుల విధానాలకు, ఈఎస్జీ సూత్రాలు ఏ విధంగా సరిపోలుతున్నాయో వెల్లడించేలా త్వరలో యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ కమిషన్ మార్గదర్శకాలను అమల్లోకి తీసుకురానుంది. అలాగే, సెబీ సైతం ఫండ్స్ ఈఎస్జీ పథకాలకు సంబంధించి వెల్లడించాల్సిన సమాచారం విషయమై విస్తృతమైన సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేయడం గమనించదగిన అంశం. కొంచెం జాగ్రత్త అవసరం.. ఈఎస్జీ స్టాక్స్కు మార్కెట్ కొంచెం ప్రీమియం వ్యాల్యూషన్ ఇస్తుంటుంది. దీంతో కొన్ని కంపెనీలు ఈఎస్జీ థీమ్ను దుర్వినియోగం చేస్తున్నాయి. తమ ఉత్పత్తులు పర్యావరణం అనుకూలమని తప్పుడు సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ తరహా ధోరణలను అరికట్టేందుకు నూతన పర్యావరణ నిబంధనలను కేంద్రం అమల్లోకి తీసుకురానుంది. దీని కింద కంపెనీలు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కాలుష్య విడుదలకు సంబంధించి మరింత సమాచారం, వివరాలను వెల్లడించాలి. ఈఎస్జీ రేటింగ్ కోసం థర్డ్ పార్టీ సంస్థలపైనే కంపెనీలు ఆధారపడాల్సి వస్తోంది. సార్వత్రిక బెంచ్ మార్క్ లేదా పద్ధతి అనేది ఈఎస్జీ రేటింగ్లకు అమల్లో లేదు. కేంద్ర నూతన నిబంధనలు, సెబీ సంప్రదింపుల పత్రం తర్వాత విడు దల చేసే మార్గదర్శకాలతో ఈఎస్జీ థీమ్ మరింత పటిష్టం కానుంది. పెట్టుబడులకు ముందు ఆయా అంశాలపై అవగాహన అవసరం. ఈఎస్జీ స్కోర్ ఎలా? ఎన్విరాన్మెంట్ కంపెనీ కార్యకలాపాలు పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకున్న చర్యలు? గతంలో ఇలాంటి లక్ష్యాలను ఏ మేరకు సాధించింది? ఏ మేరకు ఇంధనాన్ని వినియోగిస్తోంది? పునరుత్పాదక ఇంధన వనరులను ఏర్పాటు చేసుకుందా? నీటి వినియోగం, కాలుష్యం విడుదల, వ్యర్థాల నిర్వహణ ఇలాంటి అంశాలన్నీ ఈఎస్జీ స్కోర్కు ముందు థర్డ్ పార్టీ సంస్థలు చూస్తాయి. సోషల్ ఉద్యోగులతో కంపెనీకి ఉన్న అనుబంధం, వారి భద్రతకు, ఆరోగ్యానికి తీసుకున్న చర్యలు, సమాజంతో ఉన్న సంబంధాలు, భాగస్వాములతో సంబంధాలను అధ్యయనం చేస్తారు. భాగస్వాములు, ఉద్యోగులు అందరినీ ఏకరీతిన చూసేందుకు వీలుగా కంపెనీలు అమలు చేస్తున్న విధానాలు, పద్ధతులను పరిశీలించడం జరుగుతుంది. నాణ్యత, సైబర్ సెక్యూరిటీ, డేటా భద్రత చర్యలకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. గవర్నెన్స్ కంపెనీ బోర్డు నిర్మాణం ఎలా ఉంది? నిపుణులు, మహిళలకు చోటు కల్పించారా? బోర్డు కమిటీల ఏర్పాటు, బోర్డు పనితీరు, అవినీతి నిరోధానికి తీసుకున్న చర్యలు, స్టాట్యుటరీ ఆడిటర్లు, ఆడిట్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ను కూడా పరిశీలిస్తారు. దేశీయంగా... ఇంకా ఆరంభ దశలోనే దేశీయంగా ఈఎస్జీ థీమ్ ఇంకా ఆరంభ దశలోనే ఉందని చెప్పుకోవచ్చు. కనుక రిటైల్ ఇన్వెస్టర్లు నేరుగా ఈఎస్జీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం రిస్క్తో కూడుకున్నదే. ఎందుకంటే ఇది లోతైన అంశం. విస్తృత సమాచారాన్ని అధ్యయనం చేయాల్సి వస్తుంది. ఎస్ఈఎస్ (స్టేక్ హోల్డర్స్ ఎంపవర్మెంట్ సర్వీసెస్) తదితర కొన్ని ఉచిత వేదికలు ఈఎస్జీ కంపెనీలకు సంబంధించి ర్యాంకులను ప్రకటిస్తున్నాయి. ఇతర సంస్థల నుంచి ఈఎస్జీ కంపెనీల వివరాలు పొందాలంటే కొంత చెల్లించుకోవాల్సి వస్తుంది. నేరుగా కంటే మ్యూచువల్ ఫండ్స్ రూట్ నయం. ప్రస్తుతం 10 వరకు ఈఎస్జీ ఆధారిత థీమాటిక్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఎనిమిది పథకాలు గత రెండేళ్లలో ప్రారంభమైనవే ఉన్నాయి. రెండు పథకాలు ప్యాసివ్గా (ఇండెక్స్ల్లో ఇన్వెస్ట్ చేసేవి) పనిచేస్తున్నాయి. ఒక పథకం దీర్ఘకాలం నుంచి ఉన్నా కానీ, ఆరంభంలో ఈఎస్జీ పథకంగా లేదు. దీర్ఘకాలంలో వ్యాపార పరంగా నిలదొక్కుకోగలవా? ఈఎస్జీలో ఏ అంశాల పరంగా కంపెనీ మెరుగ్గా ఉంది? వాటిని ఇక ముందూ కొనసాగించగలదా? భవిష్యత్తు వృద్ధి అవకాశాలు ఇలాంటి అంశాలను సాధారణ ఇన్వెస్టర్ కంటే మ్యూచువల్ ఫండ్స్ పరిశోధన బృందాలు మెరుగ్గా అంచనా వేయగలవు. ఇక ఈఎస్జీలో రెండు అంశాల్లో టిక్ మార్క్లు పడినా ఆయా కంపెనీలను సైతం ఫండ్స్ ఎంపిక చేసుకుంటున్నాయి. ఎందుకంటే పర్యావరణం, సోషల్, గవర్నెన్స్ మూడింటిలోనూ సరితూగే కంపెనీలు కొన్నే ఉంటున్నాయి. అలాంటప్పుడు అదనపు పెట్టుబడుల సర్దుబాటుకు వీలుగా రెండు అంశాల్లో మెరుగైన పనితీరు చూపిస్తున్న వాటిని కూడా ఫండ్స్ ఎంపిక చేసుకుంటున్నాయి. 2022 అక్టోబర్ 1 నుంచి బిజినెస్ రెస్పాన్స్బిలిటీ అండ్ సస్టెయిన్బిలిటీ రిపోర్ట్ (బీఆర్ఎస్ఆర్)ను విడుదల చేసే కంపెనీల్లోనే మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే నిర్వహిస్తున్న పెట్టుబడులకు 2023 సెప్టెంబర్ 30 వరకు సెబీ వెసులుబాటు కల్పించింది. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్లో (పీఎంఎస్) ఎస్బీఐ ఈఎస్జీ పోర్ట్ఫోలియో, అవెండస్ ఈఎస్జీ ఫండ్స్ పీఎంఎస్, వైట్ ఓక్ ఇండియా పయనీర్స్ ఈక్విటీ ఈఎస్జీ తదితర సంస్థల సేవలు అందుబాటులో ఉన్నాయి. దీర్ఘకాలంలోనే రాబడులు..? ఈఎస్జీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల కంటే నిఫ్టీ 100 ఈఎస్జీ ఇండెక్స్ పనితీరే కాస్త మెరుగ్గా కనిపిస్తోంది. గత పదేళ్ల కాలంలో వార్షికంగా 15.25 శాతం కాంపౌండెడ్ రాబడిని ఈ సూచీ ఇచ్చింది. నిఫ్టీ 100 రాబడి కంటే ఇది ఒక శాతం ఎక్కువ. ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ రాబడులు మిశ్రమంగా ఉన్నాయి. ఏడాది కాలంలో రాబడులు మైనస్ 9 శాతం నుంచి ప్లస్ 27 శాతం మధ్య ఉన్నాయి. కానీ, మూడేళ్ల కాలంలో మాత్రం సానుకూల పనితీరు చూపించాయి. ఏడు పథకాలు ఏడాది కాలంలో నష్టాలను ఇవ్వడం గమనించాలి. సెక్టోరల్ ఫండ్స్.. ఫార్మా (12 శాతం డౌన్), ఐటీ (15 శాతం డౌన్) కంటే ఈఎస్జీ ఫండ్స్ కాస్త నయమనే చెప్పుకోవాలి. మార్కెట్లో ఒక్కో సైకిల్లో కొన్ని రంగాల షేర్లు ర్యాలీ చేయడం, కొన్ని ప్రతికూల రాబడులను ఇవ్వడం సాధారణంగా ఉండే పరిణామమే. ఈఎస్జీ పథకాలు రాబడులను ఇవ్వాలంటే పెట్టుబడులకు తగినంత వ్యవధి ఇవ్వాలన్నది మర్చిపోవద్దు. పోర్ట్ఫోలియో భిన్నమేమీ కాదు.. ఈఎస్జీ థీమ్ పట్ల ఆసక్తిగా ఉన్న ఇన్వెస్టర్లు ముందుగా ఈఎస్జీ ఫండ్స్ పోర్ట్ఫోలియోను పరిశీలించడం, అధ్యయనం చేయడం ద్వారా కొన్ని అంశాలను అయినా తెలుసుకునే వీలుంటుంది. ఈఎస్జీ ప్యారామీటర్లకు తూగే దేశీ స్టాక్స్ 200 వరకు, ఇంటర్నేషనల్ స్టాక్స్ 40 వరకు ఉంటాయి. ఇవన్నీ థీమ్యాటిక్ ఫండ్స్ కిందకు వస్తాయి. కనుక మొత్తం పెట్టుబడుల్లో 80 శాతాన్ని ఈఎస్జీ కంపెనీల్లోనే అవి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన 20 శాతం కూడా ఈఎస్జీ థీమ్కు పూర్తి వ్యతిరేకంగా ఉండకూడదని సెబీ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ప్రముఖ మ్యూచువల్ ఫండ్స్ పథకాల పోర్ట్ఫోలియోల్లో కనిపించే స్టాక్సే ఈఎస్జీ పథకాల్లోనూ కనిపించడం ఆశ్చర్యమేమీ కాదు. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (బీఎఫ్ఎస్ఐ), ఐటీ రంగ కంపెనీలు ఎక్కువ శాతం ఈఎస్జీ పథకాల్లో ప్రముఖంగా ఉన్నాయి. ఇవి పర్యావరణానికి హాని చేయకపోవడం, ప్రజల జీవనాన్ని సౌకర్యవంతం, మెరుగు చేయడం కోసం పనిచేస్తుంటాయి. కనుక వీటికి ఎక్కువ పథకాలు ఓటేస్తున్నాయి. 80 శాతం ఈఎస్జీ పథకాల్లో ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ ప్రముఖ స్టాక్స్గా ఉన్నాయి. దాదాపు అన్ని ఈఎస్జీ పథకాల్లోనూ టాప్–10 హోల్డింగ్స్లో 4 నుంచి 9 వరకు అవే కంపెనీలు దర్శనమిస్తాయి. పీఎంఎస్, ఫండ్స్ పోర్ట్ఫోలియోలో సాధారణంగా కనిపించే ఇతర స్టాక్స్లో బజాజ్ ఫైనాన్స్, టైటాన్, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, విప్రో, హెచ్యూఎల్ ఉన్నాయి. -
ప్రణాళికాబద్ధంగా దూరం చేస్తున్నారు!
డెబ్భై ఐదేళ్ల స్వాతంత్య్ర భారతంలో సామాజిక ఆర్థిక వ్యవస్థ మరింత కూలిపోవడానికి కారణం దళిత, బహుజన ఉత్పత్తి వర్గాలను ప్రధాన స్రవంతి లోని ఉత్పాదక శక్తులుగా మార్చకపోవడమే. అంటే ఒక 500 ఏళ్ల నుంచి నాటు వేసే కుటుంబాలు భూమి కలిగి లేకపోవడం; ఏ రంగంలో అయితే వారు తమ శ్రమను ధారబోస్తున్నారో ఆ రంగం భూస్వామ్య పెట్టుబడిదారుల చేతుల్లో ఉండడం ప్రధాన కారణం. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో శిశు ఆరోగ్య సంరక్షణ మరింతగా క్షీణించడం వలన పుట్టే పిల్లలు శక్తిమంతంగా పుట్టడం లేదు. మాతా శిశు పోషక ఆరోగ్య బాధ్యతలు మరింతగా క్షీణిస్తున్నాయి. అవినీతి అన్ని వైపులా అల్లుకుంటూ ఇచ్చే చేతికీ, తీసుకునే చేతికీ మధ్య వంద చేతులు ఏర్పడుతున్నాయి. భరత భూమిలో ప్రధాన వనరు భూమి. భూమి అందరి సొత్తు. కానీ ప్రతి రాష్ట్రంలోనూ ఇప్పుడు అది ఐదు కులాల చేతుల్లోనే ఉంది. మొత్తం భారత దేశంలో సుమారు 6,000 కులాలున్నాయి. అయితే దాదాపు భూమి అంతా 100 కులాల చేతుల్లోనే ఉంది. ఇంతకంటే పెద్ద అసమానత మనకి ఏ దేశంలోనూ కనిపించదు. మన జాతీయాదాయం మొత్తంలో 22 శాతం... ఒక్క శాతం మంది దగ్గరే ఉంది. భారతదేశ సంపదాభివృద్ధి ప్రక్రియలోకి దళితులను ఎందుకు రానివ్వడం లేదు అనేది మన ముందున్న ప్రశ్న. ఇదంతా ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతోంది. సంపదను సృష్టిస్తున్న ఐటీ పరిశ్రమ భారతదేశంలో 1990 నుండి ప్రారంభమైంది. అతికొద్ది కాలంలోనే 16 లక్షల కోట్లు వ్యాపారం చేసింది. ఈ రంగంలో దేశంలోని పది, పది హేను కులాలే జొరబడ్డాయి. ఈ రంగంలోకి దళితులు ప్రవేశించకుండా పెద్ద ప్రయత్నం జరుగుతోంది. ఇది పెద్ద సామాజిక ద్రోహం. ఇక జీడీపీ సంగతికొస్తే... ప్రపం చంలో రెండు దేశాలు ముందున్నాయి. ఒకటి చైనా. రెండోది దక్షిణ కొరియా. దీనికి కారణం అక్కడ కుల, మత భేదాలు లేకుండా అందరినీ, అన్ని రంగాలలో ప్రోత్సహించడమే. భారతదేశంలో అటువంటి ప్రోత్సాహమే లేదు. దానికి కారణం కులవ్యవస్థ, అస్పృశ్యతా భావన. చైనా ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. చైనాతో మనం పోటీపడలేక పోవ డానికి కారణం మనదేశం లోని 60 కోట్ల మందినీ మనం ఉత్పత్తి రంగంలోకి తీసుకురాకపోవడం. సామాజిక న్యాయానికి విఘాతం ముఖ్యంగా 1970 తర్వాత ఏ కులం వారు ఆ కుల వ్యవస్థను పటిష్టం చేసుకుంటున్నారు. పారిశ్రామిక వ్యవస్థలు, విద్యా సంస్థలు అన్నింటిలోనూ స్వకులం వారినే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇది సామాజిక న్యాయ దూరం. మరోపక్క దేశంలో అవినీతి పెరిగిపోతోంది. అవినీతి మీద మాట్లాడే గళాలను అణచి వేయాలని చూస్తున్నారు. కనీసం స్వాతంత్య్రం వచ్చిన మొదట్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, రామ్ మనోహర్ లోహియా, హీరేన్ ముఖర్జీ, డాంగే, పుచ్చలపల్లి సుందరయ్య, కృష్ణ మీనన్, మాలవ్యా, లాల్ బహదూర్ శాస్త్రి, గుల్జారీలాల్ నందా, సుశీలా నాయర్, మొరార్జీ దేశాయ్, నంబూద్రి పాద్ వంటి వారు ప్రజాస్వామ్యంలోని లొసుగులను గురించి తమ గళాలు వినిపించగలిగే వారు. ఇప్పుడా పరిస్థితి భారత దేశంలో లేదు. స్వాతంత్య్ర భారతంలో ప్రజల వాక్కుకు స్వాతంత్య్రం లేదు. ఈ దశాబ్దంలో ఎంతో మంది తమ వాక్కు వినిపించి హతులయ్యారు. సంపన్న వర్గాలు, అగ్రకులాలు ఎన్నికలను పెట్టుబడి, రాబడిగా చూస్తున్నాయి. రాజకీయ రంగంలో ఓటు కొనడం ఎప్పుడు ప్రారంభించారో అప్పుడే ప్రజాస్వామ్య విలువలు కుప్పకూలడం ప్రారంభమయ్యింది. ధనికుల రక్షణ, పేదల భక్షణ కొనసాగుతోంది. పోలీసు వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, పాలక వ్యవస్థ ధనవంతులకు ఊడిగం చేస్తున్నాయి. ధనవంతులు మరింత ధనవంతులు కావడానికి కారణం రాజ్యాంగ ఉల్లంఘనే. ఈ 75 ఏళ్లలో శాస్త్రీయ, వైజ్ఞానిక, సాంకేతిక జ్ఞానం అంతరిస్తూ వస్తోంది. భారతదేశంలో ప్రధాన మతమైన బౌద్ధం పునరుజ్జీవం మీద దెబ్బ కొట్టారు. హిందూ మతో ద్ధరణకు పూనుకుని బడులు తగ్గించి గుడులు పెంచారు. హిందూ మతేతరమైన జైన, సిక్కు, బౌద్ధ, క్రైస్తవ, జొరాస్ట్రియన్ వంటి మత ధర్మాలను ఎదగకుండా చేశారు. మానవ, సామాజిక, వ్యక్తి ధర్మాలను ధ్వంసం చేసి అరాచకత్వాన్ని పెంచారు. భారతీయ తాత్వికులైన చార్వాకులు, సాంఖ్యాయనులు వంటి భౌతిక తాత్వికుల ధర్మాలను కాలరాశారు. వీటన్నిటి ఫలితంగా భారతదేశం సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక దోపిడీలో మగ్గుతోంది. స్వాతంత్య్రం అగ్రకులాల, అగ్ర వర్గాల అనుభవైకవేద్యమయ్యింది. (క్లిక్: ప్రగతి ఫలాలు దక్కిందెవరికి?) అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్క దళితుడూ, బహుజనుడూ, మైనారిటీలు చేతబూనాల్సిన చారిత్రక సందర్భం ఇది. రాజ్యాంగం ఇచ్చిన ఉద్యమ హక్కుని, పోరాట హక్కుని పునరుజ్జీవింపజేసి మనుషులు చైతన్యవంతులై, నీతిమంతులై, వ్యక్తిత్వ నిర్మాణదక్షులై తమను తాము అమ్ముకోకుండా; తమను తాము రక్షించుకుని, జీవింపజేసుకుని, నూతన భావాలను పునరుజ్జీవింప జేసుకుని రాజ్యాధికార దిశగా కొనసాగ వలసిన రోజులివి. పోరాటం మానవుని హక్కు. జీవించడం మానవుని హక్కు. సంపద అందరికీ సమానంగా పంపిణీ అయ్యే వరకూ పిడికిళ్లు బిగుసుకునే ఉంటాయి. ఐక్యతా పోరాటమే స్వాతంత్య్రానికి పునాది. - డాక్టర్ కత్తి పద్మారావు సామాజిక ఉద్యమకారుడు -
మౌలిక మార్పులే లక్ష్యంగా...
ముఖ్యమంత్రిగా, చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ను పెద్దగా పట్టించుకోలేదు. ఏ మౌలిక మార్పునూ చేయడానికి ప్రయత్నించలేదు. జగన్ ముఖ్య మంత్రి పదవి చేపట్టగానే రాష్ట్రానికేం కావాలో అర్థం చేసుకున్నారు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, ఇతర పాలనాపరమైన చర్యలను మననం చేసుకున్నారు. ఆంధ్ర ప్రజల అవస రాలనూ, ఆత్మగౌరవాన్నీ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య అంతరాలను గుర్తించారు. వ్యావసాయిక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో దాని ప్రాముఖ్యాన్ని గుర్తించాడు. రాష్ట్రంలో మౌలిక మార్పులైన సోషల్ ట్రాన్స్ఫర్మేషన్, సామాజిక న్యాయం, విద్య, వైద్యం, వ్యవసాయం లాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని పాలనను ప్రారంభించారు. గత ముప్పై, నలభై ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో కార్పొరేట్ ఇంగ్లిష్ మాధ్యమ విద్యవల్ల పెరుగుతున్న సామాజిక అంతరాలనూ, బహుజనులకు తగ్గుతున్న ఉద్యోగావ కాశాలనూ, ప్రైవేట్ విద్యాలయాల్లో చదివించ లేక బహుజనులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులనూ, ఆత్మన్యూనతనూ గుర్తించారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. ఇది విద్యా రంగంలో విప్లవాత్మకమైన ముందడుగుగా చెప్పవచ్చు. దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు... తరతరాలుగా, సామాజిక దురన్యాయానికి గురువుతున్నారు. వీరిని పట్టించుకున్న పాలకులు దేశమంతటా వెదికినా వేళ్లమీద లెక్క బెట్టేంతమంది కూడా లేరు. పాలనా రంగంలో సముచితస్థాన మిచ్చినపుడే వారికి న్యాయం చేసినట్టవుతుంది. అధికారం వారి చేతికి అందినప్పుడే ‘సాధికారత’ సాధ్యమవుతుంది. అందుకే వైఎస్ జగన్ రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల్లో ఈ వర్గాల వారికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అలాగే అసెంబ్లీ సీట్ల కేటాయింపులోనూ వీరికి అగ్ర తాంబూలం ఇచ్చారు. పంచాయతీలు, మునిసిపాలిటీలు, జిల్లా పరిషత్ వంటి స్థానిక సంస్థల అధిపతులుగా అధిక శాతం మంది ఈ వర్గాలవారే ఎన్నికయ్యేట్లు చూశారు. మంత్రి వర్గంలోనూ బహుజన వర్గాలకు ఎవ్వరూ ఊహించనంతమంది బహుజనులకు చోటివ్వడం ద్వారా జగన్ సామాజిక మార్పునకు పునాది వేశారు. ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని అన్ని రోగాలకు వర్తింపజేసేట్టు చట్టం చేయడం, ప్రభుత్వ దవాఖానాలను బలోపేతం చేయడం ద్వారా వైద్యాన్ని అట్టడుగు జనం ముంగిటకు చేర్చగలుగుతున్నారు. (చదవండి: వారికో న్యాయం.. ఊరికో న్యాయం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాయలసీమ, మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాలుగా ఉంది. ఈ ప్రాంతాల మధ్య సామాజిక అంతరాల దొంతరలతోపాటూ, ఆర్థిక అసమానతలూ ఉన్నాయి. ఈ అంతరాలను తొలగించకపోతే భవిష్యత్తులో అనేక సమస్యలు వచ్చే అవకాశముంది. అందుకే ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానులు పెట్టాలనే సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తిరుగులేని ప్రజాభిమానాన్ని సంపాదించుకున్న వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మౌలికమార్పులతో వచ్చే ఎన్నికల నాటికి అజేయశక్తిగా నిలబడి తీరుతారు. (చదవండి: తనవాళ్లయితే తప్పుచేసినా సరేనా?) - డాక్టర్ కాలువ మల్లయ్య వ్యాసకర్త కథకుడు, నవలా రచయిత -
శ్రమ విలువ తెలుసు కాబట్టే...
జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఆంధ్రప్రదేశ్ సామాజిక ముఖచిత్రమే మారిపోయింది. పేదవాడి అవసరాలను తీర్చడం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. విద్య, వైద్యం ఉచితంగా అందించడం, ఆహార ధాన్యాల ఉత్పత్తికి అనువుగా పెట్టుబడి రాయితీలు ఇవ్వడం, ‘రైతు భరోసా’ కేంద్రాల ద్వారా నాణ్య మైన విత్తనాలు, ఎరువులు అందించడం, మెట్ట ప్రాంతాలలో ఉచిత బోర్లు వేసే ‘జలకళ‘ కార్య క్రమాలను చేపట్టడం; ‘అమ్మ ఒడి’ పథకాన్ని ప్రారంభించడం, డ్వాక్రా రుణాలు ఇవ్వడం; పాడి పశువులు, గొర్రెలు, మేకల పెంపకానికి ‘చేయూత’ అందించడం; ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోతే ఏ సీజన్లో నష్టాన్ని అదే సీజన్లో చెల్లించే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టడం, రోజు వారీ పనులు చేసుకునే వారికి ‘ఆసరా’ ఇస్తూ నిత్యం పేదవాడి చేతిలో డబ్బు ఉండేలా చూసి ఉత్పత్తి రంగం దెబ్బతినకుండా చూడడం వంటి జగనన్న ప్రభుత్వం చేపట్టిన ఎన్నో పథకాలు పేదలకు, మహిళలకు, మైనారి టీలకు వెన్నుదన్నుగా నిలిచాయి. శ్రమైక జీవులైన వెనుకబడిన 139 కులాల వారిని 58 కార్పొరేషన్ల ద్వారా ఆదుకునే ప్రయత్నం మామూలు విషయం కాదు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి 760 మందిని... అంటే ఐదేళ్లలో దాదాపు 2,000 మందికి పైగా ఈ కులాలకు చెందిన వారిని నాయకులుగా తీర్చిదిద్ది రాజకీయంగా ఎదిగే అవకాశం కల్పిస్తున్నారు. శ్రమజీవుల కోసం మరో మహా యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. అదే 35 లక్షల మందికి ఇంటి పట్టాలు ఇచ్చి, అందరికీ గృహాలు నిర్మించి సొంత ఇంటి కలను నెరవేర్చ పూనుకోవడం. ఇది ఒక విప్లవాత్మకమైన చర్య. అంతేకాకుండా విద్యాల యాలను, వైద్యశాలలను ఆధునికీకరించడం ద్వారా నాణ్యమైన విద్య, వైద్యం పేదవాడికి అందుబాటులో ఉంచారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందడానికి పాలనా వికేంద్రీకరణకు వీలు కల్పించే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. అన్ని మతాల వారినీ సమానంగా గౌరవించడంలో భాగంగా మసీదులు, మదరసాలు, దేవాలయాలు, చర్చిల... నిర్మాణాలు, పునరుద్ధరణ కార్యక్రమాలకు ప్రభుత్వ సాయం అందించడం, ఆయా ప్రార్థనా మందిరాల్లో పనిచేసే మత పెద్దలుగా లేదా పూజారులుగా ఉన్నవారికి జీతాలు ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించడం జగన్ ప్రభుత్వ చలవే. ఇవన్నీ చూసినప్పుడు పేదవాని శ్రమను గుర్తించిన వాడుగా జగన్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారనిపిస్తుంది. ప్రతిపక్షం ప్రభుత్వ ప్రతిష్ఠను పలుచన చేయడా నికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా లెక్కచేయకుండా ముందుకు పోతున్నారు జగన్. – కె.వి. రమణ బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ -
తెలంగాణ మున్సి‘పోల్స్’: భౌతిక దూరం పాటించని ఓటర్లు
-
కరోనా పడగ నీడ
‘కరోనా’ వైరస్ విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రపంచం ఇంకా ఈ మహమ్మారి తాకిడి నుంచి తేరుకోలేదు. ‘లాక్డౌన్’, ‘అన్లాక్’ ప్రక్రియలు ఎలా ఉన్నా, దేశంలో పండుగ పబ్బాల సందడి దాదాపు కనిపించకుండా పోయింది. పండుగల వేళ పిల్లలకు ఆటవిడుపు లేకుండాపోయింది. ఇళ్లకు బంధుమిత్రుల రాకపోకలు నిలిచిపోయాయి. ఎక్కడివాళ్లక్కడే అన్నట్లుగా జనాలు ఒంటరిద్వీపాల్లా బతుకులీడుస్తున్నారు. ‘కరోనా’ మహమ్మారి దెబ్బకు సామాజిక కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి. సహజంగా సంఘజీవులైన మనుషులకు ఈ పరిస్థితి మింగుడుపడనిదిగా ఉంటోంది. మనుషుల సామాజిక, మానసిక పరిస్థితులపై ‘కరోనా’ మహమ్మారి ప్రభావాన్ని గురించి ఒక పరిశీలన... ‘కరోనా’ వైరస్ చైనాను అతలాకుతలం చేస్తున్న వార్తలు ఈ ఏడాది ప్రారంభంలోనే వచ్చాయి. మన దేశంలో తొలి కేసు కేరళలో జనవరిలోనే నమోదైంది. ఇది జరిగిన రెండు నెలలకు పరిస్థితి అదుపుతప్పే సూచనలు కనిపించడంతో కేంద్ర ప్రభుత్వం మార్చి 22న జనతా కర్ఫ్యూ, తర్వాత దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించింది. ఐదు విడతల లాక్డౌన్ తర్వాత జూన్ 8న మొదటి విడత ‘అన్లాక్’ ప్రక్రియ ప్రారంభించింది. దేశంలో ‘కరోనా’ కేసులు ఆరు లక్షలు దాటిన తర్వాత జూలై 1న రెండో విడత ‘అన్లాక్’ ప్రక్రియ మొదలైంది. కట్టుదిట్టమైన లాక్డౌన్ అమలులో ఉండగానే ప్రధానమైన పండుగల్లో చాలా గడిచిపోయాయి. ఉగాది, శ్రీరామనవమి, రంజాన్, రథయాత్ర వంటి ప్రధానమైన పండుగలన్నీ కళాకాంతులు లేకుండాగానే జరిగిపోయాయి. రేపు రాబోయే రాఖీ పూర్ణిమతో పాటు ఏటా అట్టహాసంగా జరిగే వినాయక నవరాత్రులు, దసరా నవరాత్రులు, దీపావళి వంటి పండుగలు కూడా పెద్దగా సందడి లేకుండానే, జనాలు నామమాత్రంగా జరుపుకొనే సూచనలే కనిపిస్తున్నాయి. వచ్చేనెలలో జరగనున్న వినాయక నవరాత్రులకు సంబంధించి పలుచోట్ల ఇప్పటి నుంచే ఆంక్షలు కూడా మొదలయ్యాయి. వినాయక నవరాత్రుల సందర్భంగా వీధుల్లో ఏర్పాటు చేసే మండపాల్లోని విగ్రహాల ఎత్తు నాలుగు అడుగులకు మించరాదని, ఇళ్లల్లో పూజించే విగ్రహాల ఎత్తు రెండడుగులకు మించరాదని మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. నవరాత్రులు పూర్తయిన వెంటనే విగ్రహాలను నిమజ్జనం చేయకుండా, వచ్చే ఫిబ్రవరిలో రానున్న ‘మాఘి గణేశ చతుర్థి’ రోజున లేదా వచ్చే ఏడాది వినాయక నవరాత్రుల తర్వాత నిమజ్జనం చేయాలని ఆదేశించింది. వీధుల్లో ఏర్పాటు చేసే బహిరంగ మండపాలకు వచ్చే జనాలు మాస్కులు ధరించేలా, భౌతికదూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. మిగిలిన రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం వినాయక నవరాత్రులు, దసరా నవరాత్రుల వేడుకలపై కట్టుదిట్టమైన ఆంక్షలను అమలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. పండుగపబ్బాలు, వేడుకలపై ఆంక్షలు వచ్చే ఏడాది వరకు కూడా కొనసాగే పరిస్థితులు ఉన్నాయి. ‘కరోనా’ వ్యాక్సిన్ జనాలకు అందుబాటులోకి వచ్చి, మహమ్మారి పరిస్థితులు సద్దుమణిగేంత వరకు జనాలు ధైర్యంగా బహిరంగ వేడుకలు జరుపుకొనే పరిస్థితులు లేవు. పెద్దలు కొంతలో కొంతవరకు ఈ పరిస్థితులకు ఎలాగోలా సర్దుకుపోతున్నా, పిల్లలు మాత్రం నిరాశ చెందుతున్నారు. బంధుమిత్రులను కలుసుకునే అవకాశాలే కాదు, ఇదివరకటిలా తోటి పిల్లలతో వీధుల్లో ఆడుకునే పరిస్థితులూ లేకపోవడంతో దిగులుతో కుంగిపోతున్నారు. పెరుగుతున్న మానసిక సమస్యలు ‘కరోనా’ వైరస్ ఉధృతి కంటే, దీని పర్యవసానంగా తలెత్తిన లాక్డౌన్, మనుషుల మధ్య భౌతికదూరం, అన్లాక్ ప్రక్రియ మొదలయ్యాక మరింతగా పెరుగుతున్న రోగుల సంఖ్య వంటి పరిణామాలు మనుషుల్లో మానసిక సమస్యలను పెంచుతున్నాయి. ఈ మహమ్మారి ఫలితంగా మనుషుల్లో మానసిక సమస్యలు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ముందే అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం కావడంతో ఇప్పటికే చాలామంది ఉపాధి కోల్పోయారు. ఇంకొందరు ఉద్యోగాల్లో కొనసాగుతున్నా, ఉన్న ఉద్యోగం ఎప్పుడు ఊడిపోతుందో తెలియని భయంతో బితుకుబితుకుమంటున్నారు. మహమ్మారి కారణంగా అనుకోకుండా వచ్చిపడ్డ ఆర్థిక సమస్యల నుంచి ఎప్పటికి గట్టెక్కుతామో తెలియని ఆందోళనతో చాలామంది దిగులుతో కుంగిపోతున్నారు. గత ఏడాది చివర్లో చైనాలో పుట్టిన ‘కరోనా’ మహమ్మారి దావానలంలా దేశదేశాలకు వ్యాపించింది. చాలా దేశాల్లో లాక్డౌన్ ప్రక్రియ మొదలైన సుమారు నెల్లాళ్ల వ్యవధిలోనే 26.4 కోట్ల మంది మానసిక కుంగుబాటుకు లోనైనట్లు ఐక్యరాజ్య సమితి (యూఎన్వో) మే 14న విడుదల చేసిన ఒక నివేదికలో వెల్లడించింది. మన దేశంలో ఇదీ పరిస్థితి మహమ్మారి కాలంలో మన దేశంలో ప్రజల మానసిక పరిస్థితులపై ఒక చిన్న ఉదాహరణ. ‘కారిటాస్ ఇండియా’ అనే స్వచ్ఛంద సంస్థ దేశంలో లాక్డౌన్ మొదలైన తర్వాత ఏప్రిల్లో ఒక హెల్ప్లైన్ నంబరును ప్రారంభించింది. మానసిక ఆందోళనతో బాధపడుతున్న వారు పలువురు ఈ నంబరుకు కాల్ చేశారని, వారిలో ఏడేళ్ల చిన్నారులు మొదలుకొని ఎనభయ్యేళ్లు పైబడిన వృద్ధుల వరకు ఉన్నారని ‘కారిటాస్ ఇండియా’ వెల్లడించింది. ఎక్కువ కాల్స్ మానసిక సమస్యలతో బాధపడుతున్న వారివేనని, అస్సాం, బీహార్ తదితర ప్రాంతాల నుంచి కొద్ది మంది నిత్యావసరాలు, మందులు పంపాలని కూడా ఫోన్ చేసినవారు ఉన్నారని ‘కారిటాస్ ఇండియా’ వాలంటీర్ ఒకరు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తమకు కాల్స్ వస్తుంటాయని, కాల్స్ వచ్చిన ప్రాంతాలకు చెందిన తమ ప్రతినిధులను అప్రమత్తం చేసి, ఆందోళనతో బాధపడుతున్న వారికి కౌన్సెలింగ్ ఇస్తుంటామని వివరించారు. ‘లాక్డౌన్’ ప్రక్రియ మొదలైన నాటి నుంచి ఇప్పటి ‘అన్లాక్’ ప్రక్రియ కొనసాగుతున్న రోజుల వరకు చూసుకుంటే దేశవ్యాప్తంగా మానసిక సమస్యలతో బాధపడే వారి సంఖ్య దాదాపు 20 శాతానికి పైగా పెరిగినట్లు ‘ఇండియన్ సైకియాట్రీ సొసైటీ’ (ఐపీఎస్) వెల్లడించింది. అంతేకాదు, ‘కరోనా’ మహమ్మారి ఫలితంగా దేశంలోని ప్రతి ఐదుగురిలో ఒకరు ఏదో ఒక మానసిక సమస్యతో కుంగిపోతున్న పరిస్థితులు ఉన్నాయని కూడా తెలిపింది. మహమ్మారి కాలంలో ఉపాధి కోల్పోవడం, జీవన భద్రత కొరవడటం, ఆర్థిక ఇబ్బందులు, ఒంటరితనం వంటి సమస్యలు చాలామందిలో మానసిక ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు కలిగిస్తున్నాయని, అక్కడక్కడా కొద్దిమంది వ్యాధి సోకుతుందేమోననే భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలపై వార్తలు వెలువడుతున్నాయని, దీర్ఘకాలం ఇలాంటి పరిస్థితులు కొనసాగితే దేశంలో మానసిక ఆరోగ్య సంక్షోభం తలెత్తే ప్రమాదం లేకపోలేదని సెంటర్ ఫర్ మెంటల్ హెల్త్ లా అండ్ పాలసీ డైరెక్టర్ డాక్టర్ సౌమిత్రా పథారే చెబుతున్నారు. మన దేశంలో మానసిక సమస్యల తీవ్రత ‘కరోనా’ తాకిడికి ముందు నుంచే ఉంది. గత ఏడాది డిసెంబరులో విడుదలైన ‘లాన్సెట్’ అధ్యయన నివేదిక ప్రకారం 2017 నాటికి దేశంలోని ప్రతి ఏడుగురిలో ఒకరు మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. సమస్యల తీవ్రతలో హెచ్చుతగ్గులు ఉండవచ్చేమో గాని, వారిలో సమస్యలేవీ లేవని తోసిపుచ్చలేమని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ‘లాన్సెట్’ నివేదిక ప్రకారం 2017 నాటికి దేశంలో దాదాపు 19.73 కోట్ల మంది రకరకాల మానసిక వ్యాధులతో ఉన్నారు. వీరిలో దాదాపు 4.57 కోట్ల మంది డిప్రెషన్తోను, 4.49 కోట్ల మంది యాంగై్జటీ సమస్యలతోను సతమతమవుతున్నారు. ‘కరోనా’ మహమ్మారి తాకిడి కారణంగా ఈ సమస్యలతో బాధపడేవారి సంఖ్య మరో ఇరవై శాతానికి పైగా పెరిగినట్లు తాజా అంచనాలు చెబుతున్నాయి. దేశంలో మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిలో కనీసం 15 కోట్ల మందికి సత్వర మానసిక చికిత్స అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేసే ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్’ (ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్) నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దురదృష్టకరమైన విషయమేమిటంటే మన దేశంలోని మెజారిటీ జనాభాకు సరైన మానసిక చికిత్స లభించే అవకాశాలు అందుబాటులో లేవు. నగర, పట్టణ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న మానసిక వైద్య నిపుణుల సంఖ్య చాలినంతగా లేదు. మానసిక వైద్య నిపుణుల వద్దకు వెళ్లే చొరవ కూడా మన జనాభాలో చాలామందికి లేదు. రకరకాల భయాలు, అపోహల కారణంగా తమ ఇంట్లో ఎవరికైనా మానసిక సమస్యలు తలెత్తినా, మానసిక వైద్యుల వద్దకు తీసుకువెళ్లేందుకు వెనుకాడే జనాలే ఎక్కువ. దీర్ఘకాలం ఇదే పరిస్థితి కొనసాగితే, దేశంలో మానసిక ఆరోగ్య సంక్షోభం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యాభై శాతం కుటుంబాలపై తీవ్ర ప్రభావం ‘కరోనా’ మహమ్మారి దేశంలోని దాదాపు యాభై శాతం కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపినట్లు ‘యాక్సెస్ మీడియా ఇంటర్నేషనల్’ ఇటీవల చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. వీరిలో కొందరు ఊహించని విధంగా ఉపాధి పోగొట్టుకున్నారు. వీరిలో చాలామంది ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి పెద్ద పెద్ద నగరాల్లో ఉంటున్నవారే. అకస్మాత్తుగా జీవనాధారం కోల్పోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో లక్షలాది మంది వలస కార్మికులు కాలినడకనే ఇళ్లబాట పట్టారు. పగిలిన పాదాలు నెత్తురోడుతున్నా, ప్రత్యామ్నాయమేదీ లేని పరిస్థితుల్లో వందల కొద్ది కిలోమీటర్ల దూరం నడిచారు. చిన్నా చితకా వ్యాపారుల పరిస్థితి కూడా దారుణంగా మారింది. చాలామంది గిరాకీల్లేక వ్యాపారాలను మూసేసుకున్నారు. ‘కరోనా’ దెబ్బకు మూతబడిన వ్యాపారాల్లో చిన్న చిన్న టీస్టాల్స్ మొదలుకొని, పెద్ద పెద్ద రెస్టారెంట్స్, సినిమా థియేటర్స్ వంటివి కూడా ఉన్నాయి. కొన్ని దుకాణాలను తెరిచినా, ఇదివరకటి స్థాయిలో గిరాకీల్లేక వెలవెలబోతూ కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారిలోనూ చాలామందికి జీతాల్లో కోతలు పడుతుండటంతో ప్రజల్లో కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గింది. రవాణా వ్యవస్థ ఇప్పటికీ తేరుకోలేదు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని రవాణా సంస్థలు నష్టాల ఊబిలో చిక్కుకున్నాయి. కనీసం మరో ఆరునెలల వరకు ఉన్నచోటును విడిచి ప్రయాణాలకు బయలుదేరేది లేదని చాలామంది తెగేసి చెబుతున్నారు. కోరుకుంటే విదేశాలకు విమానాల్లో వెళ్లగలిగే స్థోమత ఉన్న సంపన్న, ఎగువ మధ్యతరగతి వర్గాల వారిలో సైతం దాదాపు 35 శాతం మంది మరో ఆరునెలల వరకు విమాన ప్రయాణాల జోలికి వెళ్లబోమని కరాఖండిగా చెబుతున్నారు. వీరంతా రూ.12 లక్షలకు పైబడిన వార్షికాదాయం గలవారేనని ‘యాక్సెస్ మీడియా ఇంటర్నేషనల్’ వెల్లడించింది. మెరుగైన ఆదాయం గల సంపన్నుల పరిస్థితే ఇలా ఉంటే, ‘కరోనా’ ధాటికి సామాన్యుల బతుకులు ఇంకెంతలా చితికిపోయాయో ఊహించుకోవాల్సిందే! అధిగమించడం ఎలాగంటే... ‘కరోనా’ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎవరూ ఊహించని పరిస్థితులు తలెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో మానసిక ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు తలెత్తే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలపై కూడా ఈ ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి. తోటి పిల్లలతో కలసి మెలసి ఆడుతూ పాడుతూ గడపడం ద్వారానే పిల్లలు మానవసంబంధాలను మెరుగుపరచుకుంటారు. ఇళ్లల్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులతో, ఇంట్లో ఉండే తాత బామ్మలు వంటి వారితో తమ భావాలను పంచుకోవడానికి ఇష్టపడతారు. మనుషులకు దూరమయ్యే పరిస్థితుల్లో వారు వస్తువులకు దగ్గరవుతారు. టీవీ, స్మార్ట్ఫోన్ వంటి వాటితోనే ఎక్కువగా కాలక్షేపం చేయడం మొదలుపెడతారు. ‘లాక్డౌన్’ పరిస్థితులు ఇంటిల్లిపాదీ ఒకేచోట చేరి కాలం గడిపే పరిస్థితిని తీసుకొచ్చింది. తల్లిదండ్రులు పూర్తిగా ‘వర్క్ ఫ్రమ్ హోమ్’లో మునిగిపోకుండా పిల్లలతో కబుర్లు చెప్పడం, ఆటలాడటం చేస్తున్నట్లయితే, వాళ్లల్లో ఒంటరితనం దూరమవుతుంది. ‘కరోనా’ ఫలితంగా ఉపాధి పోవడం, ఉద్యోగాల్లో అభద్రత వంటి పరిస్థితులు చాలామందిలో మానసిక ఒత్తిడిని, ఆందోళనను పెంచుతున్నాయి. ‘కరోనా’ తర్వాత మానసిక సమస్యలతో వచ్చే వారి సంఖ్య పెరిగింది. రోగ నిరోధకత పెంచుకునేందుకు పోషకాహారంతో పాటు విటమిన్–సి, విటమిన్–డి మాత్రలు తీసుకోవడం, వ్యాయామం, ధ్యానం వంటివి చేయడం, జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని పెంచుకోవడం ద్వారా చాలా వరకు సమస్యలను అధిగమించవచ్చు. అప్పటికీ మానసిక ఒత్తిడి, ఆందోళన, దిగులు, కుంగుబాటు ఇబ్బందిపెడుతున్నట్లయితే మానసిక వైద్య నిపుణులను సంప్రదించాల్సిందే. – డాక్టర్ శ్రీనివాస్ ఎస్ఆర్ఆర్వై .. మానసిక వైద్య నిపుణులు, ఎంజీఎం ప్రభుత్వ ఆస్పత్రి, వరంగల్ -
ర్యాలీలో చంద్రబాబు భౌతిక దూరం పాటించలేదు
-
సోషల్ వైరస్
-
నవ దశాబ్ద నారీమణి
ఉద్యమాల్లో మహిళలు.. చట్ట సభల్లో మహిళలు.. సదస్సులలో మహిళలు.. సమాలోచనల్లో మహిళలు! ఈ ఏడాది మొత్తం ప్రతి రంగంలోనూ, ప్రతి సందర్భంలోనూ మహిళలు క్రియాశీలంగా ఉన్నారు. 2019లో కూడా ఈ ఒరవడి కొనసాగబోతోంది. కొన్ని గంటల్లో రాబోతున్న కొత్త సంవత్సరం.. ఒక కొత్త మహిళా దశాబ్దపు ‘మార్చ్’కి తొలి అడుగు అయినా ఆశ్చర్యం లేదు. తక్కెడ సమానంగా ఉండాలి. సూచీ నిటారుగా ఆకాశాన్ని చూస్తుండాలి. అదే సరైన కొలమానం. సూచీ అటు వైపుకో ఇటువైపుకో వంగిందీ.. అంటే అది సమతూకం కానే కాదు. సమతూకం వ్యాపార సంబంధాల్లోనే కాదు, సామాజిక సంబంధాల్లోనూ ఉండాలి. సమతూకం లేని చోట సమన్యాయం జరగదు. వ్యవస్థ అవ్యవస్థీకృతంగా జడలు విప్పుతుంది. సమాజంలో మహిళ పరిస్థితీ అలాగే ఉంది. అందుకే ఇన్ని సదస్సులు, సమావేశాలు, చర్చలు, తీర్మానాలూ ఇంకా అవసరమవుతూనే ఉన్నాయి.‘ ‘వేకువ జామున లేచాను. ఇంటెడు చాకిరీ. చేస్తూనే ఉన్నాను. ఇంకా చేయాల్సిన పనులెన్ని ఉన్నాయో, ఇవన్నీ పూర్తయ్యేదెప్పుడు, ఒక ముద్ద తిని నడుం వాల్చేదెప్పుడు..’’ ఇది మధ్య తరగతి ఇల్లాలి ఆవేదనలాగానే కనిపిస్తుంది. కానీ ఇది సగటు ప్రపంచ మహిళ ఆవేదన. తాను ఇప్పటికే చక్కబెట్టిన పనులను తృప్తిగా కళ్ల నిండుగా చూసుకుందామనేలోపు కాలం తరుముతూ ఉంటుంది ఇంకా మిగిలిపోయి ఉన్న పనులను గుర్తు చేస్తూ. మహిళ పరిస్థితీ అంతే. ఒకమ్మాయి ఒక పతకం గెలిచిందని సంతోషంగా ఆకాశానికి ఎత్తేస్తుంటుంది మీడియా. ఆమె స్ఫూర్తితో ముందడుగు వేయండి... అని వెన్నుతడుతుంది. ఆ ప్రోత్సాహాన్నందుకుని ఒక అడుగు వేద్దామని సమాయత్తమయ్యే లోపు మరో పేజీలో మహిళల మీద హింస, లైంగిక దాడులు... ఆడపుట్టుకకు ఎన్ని కష్టాలో అని వికటాట్టహాసం చేస్తుంటాయి. ఇది సంఘర్షణ మహిళాభివృద్ధి, మహిళల స్థితిగతుల మీద ఏటా సింహావలోకనం ఉంటుంది. ఆ పునశ్చరణలో ‘సాధించింది ఎంత; సాధించాల్సింది ఎంత’ అనే తులనాత్మకమైన అధ్యయనాలు జరుగుతూనే ఉంటాయి. మహిళల పోరాటాన్ని ‘సమానత్వ సాధన పోరు’ అంటుంది అభ్యుదయ సమాజం. ‘ఆధిక్యత కోసం ఆరాటం’ అంటుంది పురుషాధిక్య భావజాలం. ‘ఇది మా అస్తిత్వ వేదన, మనుగడ కోసం గుండెల్లో చెలరేగుతున్న సంఘర్షణ మాత్రమే, అర్థం చేసుకోండి’ అంటోంది స్త్రీ ప్రపంచం . తప్పని ఆత్మగౌరవ పోరు మహిళ వంటింటికి పరిమితం కావడం లేదిప్పుడు. తనను తాను నిరూపించుకోవడానికి కత్తిమీద సాము చేస్తోంది. ఆమె విజయాలను చూపిస్తూ ‘చూశారా! మేము మహిళలకు ఎన్ని అవకాశాలిచ్చామో’ అంటోంది మేల్ చావనిజం. ‘ఇవ్వడానికి మీరెవరు? మా జీవితాన్ని మా చేతుల్లో ఉంచుకోనివ్వకుండా దోపిడీ చేసిందే మీరు కదా’ అని మహిళ మనసు రోదిస్తూనే ఉంటుందా మాటలు విన్న ప్రతిసారీ. ‘అయినా సరే... మేమేంటో మళ్లీ నిరూపించుకుంటాం. మీ చేతుల్లో చిక్కుకున్న మా జీవితాలను మా వెన్నెముక మీద నిలబెట్టుకుంటాం’ అని తిరిగి స్వీయనిరూపణ కోసం స్వయంశక్తిని అర్పించడానికి ప్రతిరోజూ కొత్తగా సిద్ధమవుతూనే ఉంటుంది మహిళ. అప్పుడు బయటపడుతోంది మరో మేల్ కోణం. ‘మీరు అర్పించాల్సింది మేధను కాదు, శ్రమను కాదు. జస్ట్ దేహాన్ని’ అంటూ పురుషాధిక్యత తన అమానవీయ కోణాన్ని అలవోకగా బయటపెడుతోంది. ఇన్ని అరాచకాల మధ్య... మహిళ అస్తిత్వ పోరాటంలో ఆత్మగౌరవ పోరాటం అనివార్యంగా వచ్చి చేరింది. ఆ పోరాటమే లైంగిక వేధింపులు, అక్రమ రవాణాలను నిరసిస్తూ భారతీయ మహిళ కదం తొక్కుతున్న ‘డిగ్నిటీ మార్చ్’. ఈ ఏడాది డిసెంబర్ 20న ముంబయిలో మొదలైన ఈ మార్చ్ వచ్చే ఫిబ్రవరి 22న న్యూఢిల్లీకి చేరనుంది. అయినా.. మహిళావాదం, మహిళ అవసరాలు, స్థితిగతులు.. అంటూ ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేని రోజు ఎప్పటికి వస్తుంది? ఎప్పుడైనా, ఎక్కడైనా... అది ప్రాచ్యమైనా, పాశ్చాత్యమైనా సరే... పురుషవాదం జడలు విప్పినప్పుడే మహిళావాదం పురుడు పోసుకుంటుంది. అప్పటి వరకు ఉండేది వ్యక్తివాదమే. సమన్యాయం లేని సమాజంలో సమతూకం కోసం, వ్యక్తివాద సమాజం కోసం మహిళలు తరంగంలా కదిలి వస్తున్నారు. ‘మాతోపాటు ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తాం’ అని నినదిస్తున్నారు. వ్యక్తివాద సమాజం ఎప్పటికి వచ్చినా అది మహిళల పోరాటంతోనే వస్తుంది. ఆ పోరాటం ఎన్నేళ్లనేదే అంతుచిక్కని ప్రశ్న. – వాకా మంజులారెడ్డి -
వీడియో ఆపద్బాంధవి
కెమెరాకు షూట్ చేసే శక్తి మాత్రమే ఉంటుంది.స్పందించే హృదయాలు మనుషులకే ఉంటాయి.ఈ మనుషుల్లో తడి మిగిలే ఉంది.ఆర్ద్రత మిగిలే ఉంది. మానవత్వం మిగిలే ఉంది. కావలసిందల్లా కదిలించే కన్ను.కేరళ అమ్మాయి జిన్షా బషీర్ కెమెరాతో లోకంలో ఉన్న కష్టాన్ని చెబుతుంది.వెంటనే దానికి లభిస్తున్న స్పందన ఆమెను ఆపద్బాంధవిగా మారుస్తోంది. కేరళలోని అలెప్పీకి చాలామంది బ్యాక్వాటర్స్లో హౌస్బోట్ విహారం కోసం వెళతారు.కానీ ఇప్పుడు ‘జిన్షా బషీర్’ను చూడటానికి వెళుతున్నారు.శిరస్సు మీద ఇస్లామీయ వస్త్రాన్ని చుట్టుకొని, జీన్స్ ప్యాంట్ ధరించి, క్లాసిక్ మోడల్ బుల్లెట్ను బటన్ స్టార్ట్ చేసి రివ్వున దూసుకుపోతూ కనిపించే జిన్షా బషీర్ను చూడటం, ఆమెకు కరచాలనం ఇవ్వడం చాలా తృప్తినిచ్చే పని. ఒక మంచి పనికి మద్దతు ఇచ్చే పని.ఎందుకంటే ఇవాళ కేరళలో మమ్ముట్టి, మోహన్లాల్ వలే జిన్షా కూడా స్టార్.ఆ స్టార్డమ్ ఆమెకు సినిమాల నుంచి రాలేదు.కేవలం ఫేస్బుక్ నుంచి వచ్చింది.అందులో ఆమె పెట్టే వీడియోల ద్వారా వచ్చింది. ఆ వీడియోల నుంచి ఆశించే మంచి ద్వారా వచ్చింది.పెట్రోల్బంక్ మోసాన్ని చూసిదాదాపు సంవత్సరం క్రితం. జిన్షా ఆ సమయంలో సాఫ్ట్వేర్ రంగంలో ఒక సగటు ఉద్యోగిగా పని చేస్తోందిదారిన పోతూ తన టూ వీలర్లో పెట్రోల్ పోయించుకోవడం కోసం ఆగింది. అందరూ పెట్రోలు పోయించుకుని పోతున్నారు. తన వంతు వచ్చింది. అయితే పెట్రోల్ పోసే వ్యక్తి మీటర్ను ట్యాంపర్ చేసి పెట్రోల్ పోస్తున్నట్టు జిన్షా గమనించింది.ఏమిటి నువ్వు చేస్తున్న పని’ అంది.ఇదిక్కడ రోజూ మామూలే. నోరు మూసుకొని పోయించుకుని పో’ అన్నాడా వ్యక్తి. అందరిలా జిన్షా కూడా నోరు మూసుకొని పెట్రోలు పోయించుకుని పోయి ఉంటే ఇవాళ ఆమె గురించి రాయడానికి ఉండేది కాదు. కానీ జిన్షా ఊరుకోలేదు. టూ వీలర్ దిగి తన సెల్ఫోన్ ద్వారా అప్పటికప్పుడు జరుగుతున్నది రికార్డ్ చేసింది. అక్కడ పెట్రోల్ పోయించుకుంటున్న వాళ్లతో మాట్లాడి ‘మీరెందుకు ఈ అన్యాయాన్ని నిలదీయరు’ అని ఇంటర్వ్యూ చేసింది. అదంతా తన ఫేస్బుక్ పేజీలో పెట్టింది. వెంటనే ఐదు వేల లైకులు వచ్చాయి.జిన్షా చాలా ఆశ్చర్యపోయింది. అన్యాయాలు అందరికీ తెలుసు. కానీ వాటిని నలుగురి దృష్టికి తెచ్చి ప్రశ్నించేవారే కావాలి అని అర్థం చేసుకుంది. సోషల్ మీడియాలో బ్లాగర్స్ చాలామందే ఉన్నారు. కానీ వీడియోల ద్వారా సమాజానికి సందేశాలిచ్చే ‘వ్లోగర్స్’ కూడా ఉన్నారని తెలుసుకుని తాను కూడా ‘వ్లోగర్’గా మారాలని నిశ్చయించుకుంది.ఉద్యోగాన్ని వదిలి సమాజ హితం కోరే వీడియోలను పోస్ట్ చేయడం మొదలుపెట్టింది. సహాయాల పరంపర జిన్షాకు ఒక వ్యక్తి గురించి తెలిసింది. అతని పేరు షాన్ షాహుల్. పేదవాడు. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు. వెళ్లిన ఇరవై అయిదు రోజులకే దురదృష్టవశాత్తు మరణించాడు. జిన్షా వెంటనే అతడి కుటుంబాన్ని కలిసింది. అది ఎంత పేదరికంలో ఉందో షూట్ చేసి తన వ్యాఖ్యానంతో ఫేస్బుక్లో వీడియో పోస్ట్ చేసింది. ‘ఇంటి పెద్ద లేకుండాపోయే దురదృష్టం ఎవరికీ వద్దు. ఈ కుటుంబానికి మనమంతా ఉన్నాం అనే ధైర్యం చెబుదాం’ అని పిలుపు ఇచ్చింది. దీనికి వెంటనే సౌదీలోని ఒక స్వచ్ఛంద సంస్థ స్పందించింది. షాన్ షాహుల్ కుటుంబానికి 11 లక్షల రూపాయల సహాయాన్ని అందించింది. ఇది కేవలం జిన్షా వీడియో వల్లే సాధ్యమైంది. జిన్షా ఫేస్బుక్ పేజీకి లైకులు పెరుగుతున్నాయి. ఫాలోవర్స్ పెరుగుతున్నారు. అటువంటి సమయంలోనే ఆయేషా అనే ఒక సంవత్సరం పాప గురించి జిన్షా ఒక వీడియో పెట్టింది. ‘ఈ పాపను చూశారా? బంగారు భవిష్యత్తును చూడాల్సిన ఈ పాప బోన్ మేరోతో చావు బతుకుల మధ్య ఉంది. ఈమె పెదాల మీద చిరునవ్వును పూయించే శక్తి మీ సహాయానికి ఉంది. ఈమెను బతికించే శక్తి మీకే ఉంది’ అని అప్పీల్ చేసింది. ఆశ్చర్యం... ఒకటి కాదు రెండు కాదు 30 లక్షల రూపాయలు ఆ పాప సహాయానికి అందాయి. వ్యతిరేకత మొదలు ఏ పనికైనా వ్యతిరేకత ఉంటుంది. జిన్షాకు కూడా వ్యతిరేకత మొదలైంది. ఆమె ఉద్దేశాలను తప్పు పట్టేవారు మెల్లగా గొంతు విప్పడం మొదలుపెట్టారు. ‘ఇది సంఘసేవ కాదు గాడిద గుడ్డూ కాదు. పేరు కోసమే ఆమె ఇలా చేస్తోంది’ అనే విమర్శలు వచ్చాయి. ‘ఇస్లాంలో పుట్టిన ఆడపిల్ల ఇలా రోడ్డున పడి తిరగడం బుల్లెట్ నడపడం ఏమిటి?’ అని సొంత బంధువులు కూడా నొసలు చిట్లించారు. ఇవన్నీ చీప్ట్రిక్స్ అని మరికొందరు కొట్టిపారేశారు. ఫేస్బుక్ పేజీలో బూతులు రాసి ఆమెను హేళన చేసినవారు కూడా ఉన్నారు. ఇదంతా చూసి జిన్షా తల్లి, సోదరి హడలిపోయారు. మనకెందుకు ఈ గోలంతా... ఇదంతా మానేయ్ అని ఆమెకు హితవు చెప్పారు. అయితే ఆమె తండ్రి, భర్త తోడు నిలిచారు. గతంలో మిలట్రీలో పని చేసిన జిన్షా తండ్రి ‘మరేం పర్లేదమ్మా... నీకు ఏది అనిపిస్తే అది చెయ్’ అని ధైర్యం చెప్పాడు. ‘నువ్వు ఏ దారిలో నడిచినా నా మద్దతు నీకే’ అని భర్త హామీ ఇచ్చాడు. ఇక జిన్షాకు లోకానికి వెరవాల్సిన అవసరం లేకపోయింది. తనను తిట్టే వాళ్ల కామెంట్స్ను స్క్రీన్ షాట్స్ తీసి తిరిగి ఫేస్బుక్లో పెట్టింది జిన్షా. చాలామంది వాటిని అసహ్యించుకున్నారు. మరోవైపు క్షణక్షణానికి ఆమె ఫేస్బుక్ పేజీ మీద లైక్ బటన్ నొక్కేవాళ్లు పెరిగారు. జిన్షా బుల్లెట్ మరింత స్పీడందుకుంది. పెళ్లి చేసిన పుణ్యం వంద అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. కానీ జిన్షా ఒక వీడియో పెట్టి చాలా సులువుగా ఒక పెళ్లి చేయగలిగింది. మునీర్ అనే ఒక నిరుపేద ఆమె దృష్టిలో పడ్డాడు. అతనికి సొంత ఇల్లు లేదు. ఉపాధి లేదు. పెళ్లికెదిగిన ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వాళ్లకు అతను జన్మలో పెళ్లి చేయలేడు. జిన్షా అతని పరిస్థితిపై వీడియో చేసి పోస్ట్ చేసింది. స్పందన చెప్పాలా? ఒక అమ్మాయి పెళ్లి క్షణాల్లో జరిగిపోయింది. ఇంకో అమ్మాయి ఎంగేజ్మెంట్ జరిగింది. అంతేకాదు దాతలు స్పందించి ఒక నాలుగు లక్షలు సహాయం చేశారు. మునీర్కు ఇప్పుడొక సొంత గూడు ఉంది. వాక్కే ఆకర్షణ జిన్షాకు వాక్కే ఆకర్షణ. అనర్గళంగా మాట్లాడుతుంది. ఎదుటివారిని ఒప్పించే విధంగా విషయాన్ని విశదీకరిస్తుంది. ఆమె చేసిన తెలివైన పని ఏమిటిరా అంటే మతాన్ని, రాజకీయాలను దూరంగా పెట్టడం. ‘వాటి గురించి నా వీడియోలు ఉండవు’ అంటుందామె. జిన్షా చేసే ముఖ్యమైన పని తన పేజీలో ఉపాధి అవకాశాల ప్రకటనలు విరివిగా పోస్ట్ చేయడం. గల్ఫ్ దేశాలలో ఉన్న ఉపాధి అవకాశాలను ఆమె నలుగురి దృష్టిలోకి తెస్తుంది కనుక ఆ విషయంగా కూడా ఆమె పేజీని ఫాలో అయ్యేవారి సంఖ్య పెరిగింది. ఇప్పుడు ఆమె ఫాలోవర్స్ సంఖ్య మూడున్నర లక్షలు. ఈ పాపులారిటీ చూసి సంస్థలే ఆమెకు తమ వద్ద ఉన్న ఉపాధి అవకాశాల ప్రకటనలు పంపిస్తుంటాయి. ఇవే కాదు జిన్షా తన పేజీలో ఆకర్షణీయమైన టూర్ ప్యాకేజీలను కూడా ఇస్తుంటుంది. తనలా మంచి పనులు చేసేవారి వివరాలు కూడా. జిన్షాను తమతో కలిసి పని చేయమని చాలా ఎన్జీఓలు కోరాయి. ‘అయితే అవన్నీ ఎంతోకొంత లాభాపేక్షతో పని చేస్తాయి. నేను వ్యక్తిగతంగా చేయగలిగింది చేస్తాను’ అంటుంది జిన్షా.జిన్షాకు ‘బెస్ట్ సోషల్ మీడియా బ్లాగర్ అవార్డ్ 2018’ వచ్చింది. ఆమె చేయాలనుకుంటున్న మంచి పనుల ముందు అదేమి పెద్ద విశేషం కాదు.ఇవాళ సమాజానికి జిన్షాల అవసరం చాలానే ఉంది.ఈ జిన్షా చాలామందికి స్ఫూర్తినివ్వాలని కోరుకుందాం. సామాన్యురాలిగా ఆగిపోవద్దు స్త్రీలు చాలా శక్తిమంతులు. వారు తమ సంస్కృతిని గౌరవించాల్సిన మాట నిజమే కానీ అన్నిసార్లు పురుషులను వెంబడించాల్సిన పని లేదు. తాము స్వతంత్రంగా ఉండటం నేర్చుకోవాలి. నేను కూడా సామాన్యురాలినే. కానీ ఇవాళ చాలా సంతృప్తికరమైన పని చేస్తున్నాను. ఇలా వీలైన స్త్రీలందరూ చేయవచ్చు. – జిన్షా బషీర్ -
రారండోయ్
కాలువ మల్లయ్య ‘కులరహిత భారతం’, ‘ద జర్నీ టువర్డ్స్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్’ ఆవిష్కరణ నేడు సాయంత్రం 5 గంటలకు హిమాయత్ నగర్లోని బీసీ భవన్లో జరగనుంది. నిర్వహణ: సమాంతర పబ్లికేషన్స్ ఎన్.గోపి ‘జలగీతం’కు ఎం.నారాయణశర్మ సంస్కృత అనువాదం ‘జలగీతమ్’; ‘జలగీతం– కావ్యసమాలోచనమ్’ ఆవిష్కరణ నేడు సాయంత్రం ఆరింటికి రవీంద్ర భారతిలో జరగనుంది. ఆవిష్కర్తలు: రమణాచారి, జి.ఎస్.ఆర్.కృష్ణమూర్తి. నిర్వహణ: దక్కన్ సాహిత్య సభ. ‘సినారె సాహితీ వైజయంతి’లో భాగంగా జూన్ 12న సాయంత్రం 6 గంటలకు త్యాగరాయ గానసభలో ‘సినారె యాత్రా సాహిత్య విశిష్టత’పై ఆర్.అనంత పద్మనాభరావు ప్రసంగిస్తారు. నిర్వహణ: ఆచంట కళాంజలితో పాటు భావ సారూప్య సాహిత్య సాంస్కృతిక సంస్థలు. శ్రీశ్రీ 35వ వర్ధంతి సభ, శ్రీశ్రీ నూతన లభ్య రచనల పరిచయ సభ జూన్ 14న సాయంత్రం 5:30కు విశాఖ పౌర గ్రంథాలయంలో జరగనుంది. నిర్వహణ: మొజాయిక్ సాహిత్య సంస్థ ఏనుగు నరసింహారెడ్డి కవితా సంపుటి ‘మూల మలుపు’ ఆవిష్కరణ జూన్ 14న సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరగనుంది. ఆవిష్కర్త: సుంకిరెడ్డి నారాయణరెడ్డి. నిర్వహణ: పాలపిట్ట బుక్స్. సురేంద్రదేవ్ చెల్లి కవితా సంపుటి ‘నడిచే దారిలో’ ఆవిష్కరణ జూన్ 16న సాయంత్రం 6 గంటలకు యానాంలో జరగనుంది. ఆవిష్కర్త: మల్లాడి కృష్ణారావు. నిర్వహణ: కవిసంధ్య, స్ఫూర్తి సాహితి బాలాంత్రపు రజనీకాంతరావు సంస్మరణ సభ జూన్ 17న సాయంత్రం 5:30కు హైదరాబాద్ స్టడీ సర్కిల్లో జరగనుంది. నిర్వహణ: ఛాయ. మల్లెతీగ పురస్కారాల ప్రదానం జూన్ 17న సాయంత్రం 6 గంటలకు మొగల్రాజపురంలోని కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడలో జరగనుంది. ప్రధాన పురస్కార గ్రహీత: ర్యాలి రైతు కష్టాలు వస్తువుగా వచ్చిన కవిత్వంతో తేనున్న సంకలనానికి తమ కవితలు పంపాల్సిందిగా కవులను కోరుతున్నారు బన్న అయిలయ్య. చిరునామా: 2–7–1261/1, విజయపాల్ కాలనీ, హన్మకొండ–506370. ఫోన్: 9949106968 -
చౌకబారు ప్రచారం, పేటీఎం ఫౌండర్పై మండిపాటు
పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మపై సోషల్ మీడియా యూజర్లు విరుచుకుపడుతున్నారు. సాయుధ దళాల వారోత్సవం సందర్భంగా ఆయన అందించిన సహకారం సోషల్ మీడియా యూజర్లలో మండిపాటుకు గురిచేసింది. సాయుధ దళాల వారోత్సవం సందర్భంగా తన వంతు సహకారంగా రూ.501ను అందిస్తున్నట్టు పేర్కొన్న విజయ్ శేఖర్ శర్మ, దాన్ని తన ట్విట్టర్ ప్రొఫైల్లో షేర్ చేశారు. బిలియన్ డాలర్ కంపెనీకి అధిపతి అయిన విజయ్ శేఖర్ శర్మ, కేవలం రూ.501నే సాయుధ దళాలకు అందించడంపై సోషల్ మీడియా యూజర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కేవలం రూ.501ను అందించడమే కాకుండా.. తానేదో పెద్ద మొత్తంలో నగదు అందించిన మాదిరిగా ట్విట్టర్లో షేర్ చేయడాన్ని యూజర్లు ప్రశ్నిస్తున్నారు. ఇది చాలా చౌక బారు ప్రచారమని, ఈ రోజుల్లో సాధారణ గ్రామీణ ప్రజానీకమే సరస్వతి పూజకు రూ.500 విరాళంగా ఇస్తున్నారని, అలాంటిది ఒక పెద్ద టైకూన్ అయి ఉండి కేవలం రూ.501 అందించడంపై ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటి సహకారం వస్తుందని అంచనా వేయడం లేదని పేర్కొంటున్నారు. కోట్లలో సంపద ఆర్జిస్తూ... కేవలం రూ.500నే విరాళంగా అందించడం చాలా చెత్తగా ఉందన్నారు. ఇది రక్షణ దళాలను కించపరచడమేనని అంటున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత పేటీఎం భారీ ఎత్తున్న సంపదను ఆర్జించింది. 1.47 బిలియన్ డాలర్లకు అధిపతి అయిన విజయ్ శేఖర్ శర్మ సాయుధ దళాలకు కేవలం రూ.501నే అందించడంపై సోషల్ మీడియా ప్రశ్నలు కురిపించడం తప్పేమీ కాదంటున్నారు కొందరు. ఈ వారమంతా సాయుధ దళాల వారోత్సవంగా ఆర్మీ సెలబ్రేట్ చేస్తోంది. సాయుధ దళాల విలువను విశ్వవ్యాప్తం చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఈ క్యాంపెయిన్ను లాంచ్చేసింది. Just sent ₹501 to Armed Forces Flag Day Fund. #🇮🇳 @DefenceMinIndia pic.twitter.com/B5KD7wcdb9 — Vijay Shekhar (@vijayshekhar) December 1, 2017 What a cheap publicity stunt. These days common rural citizens give this much money for Saraswati Pooja. Our tycoons are so miser. CSR must have a burden for you. Didn't expect this from you! https://t.co/FEEXnJRYIl — Mayank Shandilya (@ShandiMayank) December 2, 2017 This is somewhere an insult to the defence forces sir. You are owner of PayTM and 501 amount is just an Insult. Please put this tweet down. This will backfire sir. — Gaurav Pandey (@PandeyTweets) December 2, 2017 -
సెన్సేషనల్ కంపెనీ సీఈవోగా రానా
ఇప్పటికే హీరోగా, విలన్, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కనిపించిన యువనటుడు రానా, ఇప్పుడు మరో ప్రయోగానికి రెడీ అయ్యాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచే ప్రయోగాలు చేస్తున్న భల్లాలదేవ ఇప్పుడు వెబ్ మీడియాలోకి అడుగుపెట్టాడు. తాను వ్యాఖ్యాత వ్యవహరిస్తున్న నెంబర్ వన్ యారి విత్ రానా కార్యక్రమ నిర్మాతల కోసం ఓ వెబ్ సిరీస్ లో నటించాడు. నెంబర్ వన్ యారి విత్ రానా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వియూ సంస్థ ఇప్పటికే పలు వెబ్ సీరీస్ లతో ఆకట్టుకుంటోంది. తాజా రానా, నవీన్ కస్తూరియాలతో ఓ 'సోషల్' పేరుతో మరో వెబ్ సీరీస్ ను తెరకెక్కిస్తోంది. సోషల్ మీడియాకు అలవాటు పడిన యువత ఎలాంటి సమస్యలు ఎదుర్కుంటోంది అన్న నేపథ్యంలో ఈ వెబ్ సీరీస్ ను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. సోషల్ మీడియా కారణంగా ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయో థ్రిల్లింగ్ తెరకెక్కించారు. ఈ సిరీస్ లో రానా ప్రపంచంలోనే సెన్సేషనల్ టెక్ కంపెనీగా పేరు తెచ్చుకున్న 'సోషల్ ' కంపెనీ సీఈఓ విక్రమ్ సంపత్ గా కనిపిస్తున్నాడు. ఏ క్లిక్ కెన్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్ అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 8న తెలుగు, హిందీ భాషల్లో విడుదలవుతోంది. -
రానా మరో ప్రయోగం..!
కెరీర్ స్టార్టింగ్ నుంచే ప్రయోగాలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్న యంగ్ హీరో రానా ఇప్పుడు మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. హీరోగానే కాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా నటించిన భల్లాలదేవ ఇప్పుడు వెబ్ మీడియాలోకి అడుగుపెడుతున్నాడు. తాను వ్యాఖ్యాత వ్యవహరిస్తున్న నెంబర్ వన్ యారి విత్ రానా కార్యక్రమ నిర్మాతల కోసం ఈ ప్రయోగం చేస్తున్నాడు. నెంబర్ వన్ యారి విత్ రానా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వియూ సంస్థ ఇప్పటికే పలు వెబ్ సీరీస్ లతో ఆకట్టుకుంటోంది. తాజా రానా, నవీన్ కస్తూరియాలతో ఓ 'సోషల్' పేరుతో మరో వెబ్ సీరీస్ ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. సోషల్ మీడియాకు అలవాటు పడిన యువత ఎలాంటి సమస్యలు ఎదుర్కుంటోంది అన్న నేపథ్యంలో ఈ వెబ్ సీరీస్ ను తెరకెక్కిస్తున్నారు. -
ఆద్యంతం.. నవరసభరితం
- అలరిస్తున్న నంది నాటకోత్సవాలు – సామాజిక, కుటుంబ అంశాలే ఇతివృత్తాలు – ఆకట్టుకున్న క్రైమ్స్టోరీ - సైకతశిల్పం రేపటికి వాయిదా కర్నూలు(హాస్పిటల్): రాష్ట్ర స్థాయి నందినాటకోత్సవాల్లో భాగంగా మంగళవారం సి.క్యాంపులోని టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించిన నాటికలు కుటుంబసమస్యలు, సామాజిక అంశాల ఇతివృత్తాలతో సాగాయి. రాత్రి ఉద్యోగం వల్ల కలిగే అనర్థాల గురించి చెప్పే ‘కొత్తబానిసలు’, నిత్య జీవితంలో జరిగే సంఘటనలు ప్రాప్తమా లేక మాయా మంత్రాలా అనే ఇతివృత్తంతో సాగే ‘నియతి’, గెస్ట్హౌస్లో జరిగే హత్య నేపథ్యంలో సాగే ‘మిస్టరీ’, కుమారుడిపై ఉన్న ప్రేమ వెలకట్టలేనిదని తెలిపే ‘రుణాబంధ రూపేణా’, ఆస్తి కంటే అనుబంధాలే ముఖ్యమని చెప్పే ‘పంపకాలు’ హృదయాన్ని హత్తుకుంటాయి. మంగళవారం మొత్తం ఏడు నాటికలు జరగాల్సి ఉండగా కళాకారులు, టెక్నీషియన్లు రాకపోవడంతో నాయకురాలు నాగమ్మ రద్దు కాగా, సైకతశిల్పం 26వ తేదీకి వాయిదా పడింది. రాత్రి ఉద్యోగానికి భాష్యం చెప్పే ‘కొత్త బానిసలు’ భార్యాభర్తలిద్దరూ రాత్రి ఉద్యోగాలు చేస్తే వారి మనసులు ఎలా స్పందిస్తాయో...చిన్న చిన్న విషయాలకు కూడా ఎలా గొడవలు పెరిగిపోతాయో ‘కొత్త బానిసలు’ నాటిక కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో సంబంధం లేని గృహహింస చట్టాన్ని ఆశ్రయించి బతుకుని రోడ్డు మీదకు తెచ్చేలా భార్య ప్రవర్తించి విడాకుల వరకు వెళ్తుంది. వీరి సమస్యకు రాత్రి ఉద్యోగమేనని తెలుసుకున్న మానసిక వైద్యుడు వారికి కౌన్సిలింగ్ ఇస్తాడు. ‘నైట్ షిఫ్ట్లు చేస్తున్న ఓ రాత్రి ఉద్యోగులురా..!! ఆత్మవిశ్వాసం, ధృఢ సంకల్పం ఉంటేనే రాత్రి ఉద్యోగాలు చేయండి, లేదంటే ప్రతి చిన్నదానికీ అతిగా స్పందించి జీవితాన్ని బలిచేయాల్సి ఉంటుంది జాగ్రత్త’ అని వైద్యుడు బదులిస్తాడు. అటు హాస్యం, ఇటు సందేశాత్మకంగా ఉన్న ఈ నాటికను హుజూరాబాద్లోని ఈటెల నాటక రంగ కళాకారుల సమాఖ్య ప్రదర్శించింది. రచన డాక్టర్ బొక్కా శ్రీనివాసరావు, దర్శకత్వం కొలుగూరి దేవయ్య. పాత్రదారులు కొలుగూరి దేవయ్య, ఎం. ప్రకాశ్, కుడికాల ప్రభాకర్, ముదం కుమారస్వామి, దేవసేన నటించారు. ఆకట్టుకున్న ‘నియతి’ మంత్రాలు, మహత్తులు ఉన్నాయా..? ఉంటే వాటి సాయంతో మనం జీవితంలో కావాలనుకున్నవి సాధించగలమా..?, అది సాధ్యపడేటట్లయితే జీవితంలో మనకు ఎదురయ్యే ఆటు–పోట్ల సంగతేమిటి.?, మనం కోరుకోకపోయినా అవి జరుగుతున్నాయే...!, అందుకు కారణం నియతి అంటే ప్రాప్తం అంటారే..!, అది ఎంత వరకు నిజం..?. ఆనందంగా తృప్తిగా బతుకుతున్న ఒక మధ్యతరగతి కుటుంబంలో ఎదురుచూడని సంఘటనలు ఈ సమస్యను, సందేహాన్ని ఎంత వరకు తీరుస్తాయంటూ ఆలోచింపజేసే నాటిక ఈ ‘నియతి’. హైదరాబాద్లోని శ్రీ మహతి క్రియేషన్స్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ఈ నాటికకు రచన చిట్టాశంకర్, దర్శకత్వం ఉప్పలూరి సుబ్బరాయశర్మ. పాత్రదారులు చిట్టాశంకర్, మంజునాథ్, శివరామకృష్ణ, సుబ్బారావు, విజయలక్ష్మి నటించారు. ఉత్కంఠ భరిత మలుపులతో ‘మిస్టరి’ హైదరాబాద్కు చెందిన శ్రీ మహతి క్రియేషన్స్ వారు ‘మిస్టరి’ అనే నాటికను ప్రదర్శించారు. ఓ గెస్ట్హౌస్లో జరిగిన హత్యకు సంబంధించిన ఇతి వృత్తమే మిస్టరీ. సూర్యం, సునీత దంపతులు భీమిలిలో గెస్ట్హౌస్ ప్రారంభిస్తారు. అందులో సైకాలజీ లెక్చరర్ సుకుమార్, రిటైర్డ్ జడ్జి జగన్నాథం, రిటైర్డ్ ఆర్మీ మేజర్ మిత్రకాంత్, బిజినెస్మ్యాన్ చక్రధర్ రూములు అద్దెకు తీసుకుంటారు. అంతకుముందు రోజు రాత్రి విశాఖపట్టణంలో దుర్గమ్మ అనే మహిళ దారుణంగా హత్యకు గురైనట్లు టీవీ న్యూస్లో వారు తెలుసుకుంటారు. ఆ హత్యకు, గెస్ట్హౌస్కు సంబంధం ఉందంటూ స్థానిక సీఐ గిరిధర్ విచారణ చేసేందుకు వస్తారు. దర్యాప్తు జరుగుతుండగానే జగన్నాథం హత్యకు గురవుతారు. ఈ హత్యలకు కారణం ఏమిటి..?, హంతకులు ఒకరా..ఇద్దరా..? హంతకుడు పట్టబడతాడా లేదా ..? అనే ఉత్కంఠభరితమైన మలుపులతో ఈ నాటిక సాగుతుంది. ఈ నాటికకు రచన డీఏ సుబ్రహ్మణ్యశర్మ, దర్శకత్వం ఉప్పలూరి సుబ్బరాయశర్మ వహించారు. పాత్రదారులు ఏకే శ్రీదేవి, నిట్టల శ్రీరామ్మూర్తి, ఆర్. ప్రేమ్సాగర్, సతీష్కుమార్, చిట్టా శంకర్, పి. సుబ్బారావు, పుండరీక శర్మ, జానకీనాథ్, మల్లికార్జున నటించారు. తండ్రీ కొడుకుల అనుబంధమే ‘రుణానుబంధ రూపేణా’ అనంతపురం లలిత కళాపరిషత్ వారి ‘రుణానుబంధరూపేణా’ నాటిక కుటుంబ బాంధవ్యాలను కళ్లకు కడుతుంది. కథలోకి వెళ్తే మధ్యతరగతికి చెందిన రంగనాథం కుటుంబ బాధ్యతలను చక్కగా నెరవేరుస్తాడు. ఆయన భార్య తులసి అర్దంతరంగా మరణిస్తుంది. ఇదే సమయంలో కోడలు భేషజాలకు పోయి రంగనాథాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. కోడలు పట్ల కొడుకు నిర్లక్ష్యంతో చివరకు ఆయన వృద్ధాశ్రమంలో చేరాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఓసారి రంగనాథం కుమారుని కిడ్నీలు పాడై అసహాయస్థితిలో ఆసుపత్రిలో ఉంటాడు. అతనికి తెలియకుండానే తండ్రి వైద్యుని సహాయంతో కిడ్నీలు దానం చేసి ప్రాణం నిలబెడతాడు. కొన్నాళ్లకు ఈ విషయాన్ని తెలుసుకున్న కుమారుడు ప్రశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. కోడలు కూడా తన తప్పును తెలుసుకుని రంగనాథాన్ని వృద్ధాశ్రమం నుంచి ఇంటికి రమ్మని కోరుతుంది. కానీ తనకు ఇంటికన్నా వృద్ధాశ్రమంలోనే చాలా అవసరం ఉందని తిరస్కరించి వెళ్లిపోతాడు. ఈ నాటికకు రచన సి. రాము, దర్శకత్వం డి. మస్తాన్సాహెబ్. అనుబంధాలే ముఖ్యమని చెప్పే ‘పంపకాలు’ మీకోసమే వారి ‘పంపకాలు’ అనే సాంఘిక నాటిక అన్నదమ్ములు ఆస్తి పంపకాల ఇతివృత్తం గురించి ప్రదర్శించారు. పట్నంలో ఉద్యోగం చేస్తున్న ప్రభాకర్ తన పొలాన్ని భాగం వేయించుకుని, దాన్ని అమ్మి పట్నంలో ఇళ్లు కొందామని సొంతూరు బయలుదేరతాడు. ఇంటికి వెళ్లేసరికి తండ్రి, అన్నయ్య ఇంట్లో ఉండరు. విషయాన్ని ప్రభాకర్ తన వదినతో ప్రస్తావిస్తాడు. వారి మధ్య పిల్లల చదువులు, పెంపకం ప్రస్తావనకు వస్తాయి. ‘పొలాన్ని పంచడమంటే శరీర భాగాలను పంచినట్లే’ అని వదిన చెబుతుంది. తర్వాత అన్న రాఘవ తమ్మునిపై ప్రేమతో పంపకాలు ఏమీ ఉండవు ఆస్తి అంతా నువ్వే అనుభవించు అని ఇంటి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధపడతాడు. పెద్దకుమారుని వెంటే తండ్రి కూడా వెళ్లిపోతుండటంతో ప్రభాకర్కు జ్ఞానోదయం అవుతుంది. ఆస్తి పంపకాల కంటే అనుబంధాలే ముఖ్యమని గ్రహించడంతో కథ సుఖాంతం అవుతుంది. కుటుంబంలో జరిగే ఇలాంటి సంఘటనలను ఎంతో హృద్యంగా ప్రదర్శించారు. రచన డాక్టర్ బొక్కా శ్రీనివాసరావు, దర్శకత్వం ఎంఎస్కె ప్రభు. పాత్రదారులు ఎంఎస్కె ప్రభు, డాక్టర్ బొక్కా శ్రీనివాసరావు, రవికుమార్, హసీనాజాన్ నటించారు. నేటి నాటికలు బుధవారం ఉదయం 9 గంటలకు శ్రీ వాసవి డ్రమెటిక్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ‘విముక్త’, ఉదయం 10.30 గంటలకు శ్రీ కృష్ణతెలుగు థియేటర్ ఆర్ట్స్ వారి ‘ఇంకెంత దూరం’, మధ్యాహ్నం 12 గంటలకు ఆర్ట్ ఫామ్ క్రియేషన్స్ వారి ‘ఓ కాశీ వాసి రావయ్యా’, సాయంత్రం 4.30 గంటలకు లలిత కళా సమితి వారి ‘నిష్క్రమణ’, రాత్రి 7 గంటలకు కళావర్షిణి వారి ‘ఊహాజీవులు’, రాత్రి 8.30 గంటలకు గోవాడ క్రియేషన్స్ అసోసియేషన్ వారి ‘రచ్చబండ’ సాంఘిక నాటికలు ప్రదర్శితమవుతాయి. -
ప్రత్యేక హోదా కోసం పోరాటం ఆగదు
కోటగుమ్మం : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకూ తమ పోరాటం ఆగదని సామాజిక హక్కుల వేదిక చైర్మన్ వేణుగోపాల్, జిల్లా కన్వీనర్ తాటిపాక మధు అన్నారు. రాజమహేంద్రవరం ప్రెస్క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రయివేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్ కల్పించాలని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లా¯న్ నిధులు దుర్వినియోగం చేయవద్దని, బీసీ సబ్ప్లాన్కు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. వాటి సాధన కు వేదిక ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ నుంచి జీపు జాతా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా రాజకీయ జెండాలు పక్కనపెట్టి దళిత, గిరిజన, బలహీనవర్గాలు, మైనార్టీ సమస్యలపై పోరుబాట పట్టామన్నారు. 2011 నుంచి ఇప్పటి వరకూ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కృష్ణా ప్రాజెక్టు, ఆర్ అండ్ బీ రహదారులకు, పార్కులకు ఖర్చు పెట్టి నిధులు దుర్వినియోగం చేశారని విమర్శించారు. గత ఎన్నికల ముందు నారా చంద్రబాబు బీసీ సబ్ప్లాన్కు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటి వరకూ ఆ ఊసే లేదన్నారు. రంపచోడవరం గిరిజన యూనివర్సిటీని నెలకొల్పాలని, ఏజెన్సీ ప్రాంతాన్ని అల్లూరి జిల్లాగా ప్రకటించాలని కోరారు. జీపుజాతా ప్రారంభానికి మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఎమ్మెల్సీ సుభాష్చంద్రబోస్తో పాటు ఇతర వర్గాల ప్రముఖులు హాజరవుతారని వివరించారు. నవంబర్ 9న కాకినాడ కలెక్టరేట్ వద్ద పోరుగర్జన నిర్వహిస్తున్నట్టు తెలిపారు. -
తెలంగాణ జాగృతి జిల్లా శాఖకు అవార్డు
హన్మకొండ : తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు గోదావరి పుష్కరాలు, మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలోను వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేయడంతో పాటు వలంటీర్లుగా సేవలు అందించారు. సేవలను గుర్తించిన తెలంగాణ జాగృతి ఆధినాయకత్వం వరంగల్ జిల్లా శాఖకు బెస్ట్ జిల్లా శాఖగా ఎంపిక చేసి ఆవార్డు అందించింది. వరంగల్ జిల్లా శాఖ చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు రాష్ట్రంలోని ఇతర జిల్లాల కంటే ముందు వరుసలో ఉంది. నల్లగొండలో జరిగిన 10 వార్షికోత్సవ సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షురాలు, నిజామబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా జిల్లా కన్వీనర్ కోరబోయిన విజయ్కుమార్ అవార్డు అందుకున్నారు. దీంతో పాటు సలాం పోలీసు లఘుచిత్రా దర్శకుడు వంశీకి ప్రోత్సాహక అవార్డుకు వచ్చింది. జిల్లాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ ఇస్తున్న రాణి,లతకు ప్రోత్సాహక అవార్డు లభించింది. ఈ సందర్భంగా విజయ్కుమార్ మాట్లాడుతూ జిల్లాకు ఉత్తమ అవార్డు రావడానికి కృషి చేసిన జాగృతి అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. -
కవిత్వం సామాజిక బాధ్యత
కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శివారెడ్డి గుంటూరు(అరండల్పేట): మార్క్సిజం నాకు విశ్వ దర్శనం కావించిందని, అదే నా సాహిత్య మార్గదర్శి అని, కమ్యూనిస్టు ప్రణాళిక అధ్యయనం తర్వాత ఒక సామాజిక బాధ్యతగా కవిత్వాన్ని రాశానని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి కే శివారెడ్డి అన్నారు. గురువారం అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో ‘నేను–నా కవిత్వం’ అన్న అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన శివారెడ్డి మాట్లాడుతూ ఎక్కడా తేలిపోకుండా, జారిపోకుండా, ఏ గాలికీ కొట్టుకుపోకుండా కవిత్వయాత్ర చేస్తున్నానని తెలిపారు. నా కవిత్వంలో విద్యార్థులు, అనాథలు, జానపదlగాయకులుఏ కళకళలాడేలా చేస్తున్నానన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ, ఐరోపా, ఆఫ్రికా కవుల అధ్యయనాలు తన కవిత్వాన్ని విస్తతం చేశాయని చెప్పారు. ఇప్పటికి 26 కవితా సంపుటిలు వెలువరించానని, వెయ్యి పుస్తకాలకు పీఠికలు సమకూర్చానని తెలిపారు. కార్యక్రమంలో రావెళ్ల సాంబశివరావు, భూసూరుపల్లి వెంకటేశ్వర్లు, బీ వేదయ్య తదితరులు పాల్గొన్నారు. -
లయన్స్ సేవలు వెలకట్టలేనివి
పిట్లం : లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలు ప్రశంసనీయంగా, మరువలేనివిగా ఉన్నాయని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధేlఅన్నారు. ఈ సందర్భంగా ఆయన శనివారం రాత్రి మండల కేంద్రంలోని సాయి గార్డెన్లో ఏర్పాటు చేసిన 11వ ఇన్స్టాలేషన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ముందుగా జ్యోతి ప్రజ్వళన చేపట్టి అనంతరం మాట్లాడారు. లయన్స్ క్లబ్ చేపడుతున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయని, అనాథ పిల్లల కోసం పిట్లంలో ఏర్పాటు చేసిన అనాథ శరణాలయం ప్రశంసనీయమన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం పిలుపు మేరకు హరితహారం కార్యక్రమం చేపట్టడం, పేద పిల్లలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం లాంటిSకార్యక్రమాలు చేపడుతుండడం అభినంధనీయమన్నారు. కొత్తగా ఏర్పాౖటెన కమిటీ సభ్యులకు అభినంధనలు తెలిపారు. సమాజ సేవలో మంచి పేరు ప్రతిష్ఠలు తెచ్చుకోవాలని సూచించారు. కొత్త అధ్యక్షుల ప్రమాణ స్వీకారం పిట్లం లయన్స్ క్లబ్ కొత్త అధ్యక్షునిగా కంబాపూర్ గ్రామానికి చెందిన సంగప్ప శనివారం ప్రమాణస్వీకారం చేశారు. కార్యదర్శిగా బాలయ్య, ట్రెజరర్గా శ్రీనివాస్లు బాధ్యతలు చేపట్టారు. నారాయణఖేడ్ క్లబ్ అధ్యక్షునిగా డాక్టర్ శివకుమార్ బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లయన్స్ మల్టిబుల్ కౌన్సిల్ చైర్ పర్సన్ డాక్టర్ బాబురావ్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సభ్యులు సమాజంలో అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టేందుకు పిట్లం క్లబ్కు రూ. 25 వేల రూపాయల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ సభ్యులు సంజీవ్ రెడ్డి, వేణుగోపాల్, రాజ్ కుమార్, లక్ష్మీ నారాయణ, చంద్రశేఖర్, సుధాకర్, రమణాగౌడ్, గ్రామ సర్పంచ్ హన్మ గంగారాం, జెడ్పీటీసీ ప్రతాప్ రెడ్డి, వైస్ ఎంపీపీ నర్సాగౌడ్, కో ఆప్్షన్ శేక్ కరీం, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
లయన్స్ సేవలు వెలకట్టలేనివి
సమాజ సేవలో పేరు ప్రతిష్ఠలు తెచ్చుకోవాలి, ఎమ్మెల్యే హన్మంత్ సింధే పిట్లం : లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలు ప్రశంసనీయంగా, మరువలేనివిగా ఉన్నాయని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధేlఅన్నారు. ఈ సందర్భంగా ఆయన శనివారం రాత్రి మండల కేంద్రంలోని సాయి గార్డెన్లో ఏర్పాటు చేసిన 11వ ఇన్స్టాలేషన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ముందుగా జ్యోతి ప్రజ్వళన చేపట్టి అనంతరం మాట్లాడారు. లయన్స్ క్లబ్ చేపడుతున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయని, అనాథ పిల్లల కోసం పిట్లంలో ఏర్పాటు చేసిన అనాథ శరణాలయం ప్రశంసనీయమన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం పిలుపు మేరకు హరితహారం కార్యక్రమం చేపట్టడం, పేద పిల్లలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం లాంటిSకార్యక్రమాలు చేపడుతుండడం అభినంధనీయమన్నారు. కొత్తగా ఏర్పాౖటెన కమిటీ సభ్యులకు అభినంధనలు తెలిపారు. సమాజ సేవలో మంచి పేరు ప్రతిష్ఠలు తెచ్చుకోవాలని సూచించారు. కొత్త అధ్యక్షుల ప్రమాణ స్వీకారం పిట్లం లయన్స్ క్లబ్ కొత్త అధ్యక్షునిగా కంబాపూర్ గ్రామానికి చెందిన సంగప్ప శనివారం ప్రమాణస్వీకారం చేశారు. కార్యదర్శిగా బాలయ్య, ట్రెజరర్గా శ్రీనివాస్లు బాధ్యతలు చేపట్టారు. నారాయణఖేడ్ క్లబ్ అధ్యక్షునిగా డాక్టర్ శివకుమార్ బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లయన్స్ మల్టిబుల్ కౌన్సిల్ చైర్ పర్సన్ డాక్టర్ బాబురావ్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సభ్యులు సమాజంలో అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టేందుకు పిట్లం క్లబ్కు రూ. 25 వేల రూపాయల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ సభ్యులు సంజీవ్ రెడ్డి, వేణుగోపాల్, రాజ్ కుమార్, లక్ష్మీ నారాయణ, చంద్రశేఖర్, సుధాకర్, రమణాగౌడ్, గ్రామ సర్పంచ్ హన్మ గంగారాం, జెడ్పీటీసీ ప్రతాప్ రెడ్డి, వైస్ ఎంపీపీ నర్సాగౌడ్, కో ఆప్్షన్ శేక్ కరీం, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
మొక్కల సంరక్షణ సామాజిక బాధ్యత : డీఎస్పీ
కట్టంగూర్ : మొక్కల సంరక్షణను ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని నల్లగొండ డీఎస్పీ సుధాకర్ అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆదివారం మండల కేంద్రంలోని పద్మశాలినగర్లో ఆయన మొక్కలను నాటి మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్ఐ సత్యనారాయణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఏడుకొండలు, మర్రి రాజు, ఐతగోని నర్సింహ, నమ్ముల సత్యనారాయణ, కానుగు లింగయ్య, యాదయ్య, పోగుల నర్సింహ, నాగేష్, మల్లేష్, బాలన ర్సింహ, శిరిశాల శంకర్ పాల్గొన్నారు. -
మహాశ్వేతాదేవి ఆరోగ్య పరిస్థితి విషమం..
కోల్ కతాః పశ్చిమ బెంగాల్ కు చెందిన సుప్రసిద్ధ నవలా రచయిత, సామాజిక కార్యకర్త మహాశ్వేతాదేవి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. వివిధ ఆరోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న ఆమెకు.. గురువారం నుంచీ ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని, అయినా పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉన్నట్లు ఆమె చికిత్స పొందుతున్న ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ముఖ్యంగా ఆమె మూత్రపిండాలు రెండూ సరిగా పనిచేయడం లేదని, గురువారం రాత్రి డయాలసిస్ నిర్వహించినా.. పరిస్థితిలో ఎటువంటి మార్పు కనపించడం లేదని వైద్యులు చెప్తున్నారు. 90 ఏళ్ళ వయసున్నశ్వేతాదేవి వివిధ ఆరోగ్య సమస్యలతో కోల్ కతాలోని ఓ ఆస్పత్రిలో రెండు నెలలుగా చికిత్స పొందుతున్నారు. ఆమెకు రెండు కిడ్నీలు సరిగా పనిచేయకపోవడంతో తగిన వైద్యం అందిస్తున్నామని, అయినా పరిస్థితి విషమిస్తుండటంతో వెంటిలేషన్ పై శ్వాసను అందిస్తున్నామని వైద్యులు చెప్తున్నారు. 1996 లో జ్ఞానపీఠ అవార్డు పొందిన మహా శ్వేతాదేవి.. ప్రస్తుత బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో 1926 లో జన్మించారు. శ్వేతాదేవి తల్లిదండ్రులు సైతం రచయితలే. -
ఐ ఫోన్ ను గన్తో పేల్చేసింది!
ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్లు లేని జీవితాన్ని ఊహించలేం. ఫోన్ వాడకం ఓ ఫ్యాషన్ అయిపోయింది. ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా చిన్నారుల చేతుల్లో కూడ ఐఫోన్లు, యాండ్రాయిడ్స్ కనిపించడం సాధారణంగా మారిపోయింది. అంతేకాదు తల్లిదండ్రులతో ఏమాత్రం సంబంధం లేకుండా పిల్లలు ఫోన్లకే అతుక్కుపోతున్న జాడ్యం రాను రాను పెరిగిపోతోంది. ఇటువంటి మితిమీరిన వినియోగం ఒక్కోసారి పిల్లలపట్ల తల్లిదండ్రులకు ఏహ్యభావాన్ని, విసుగును, చికాకును కూడ తెప్పిస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్న ఓ వీడియో అందుకు తార్కాణంగా నిలుస్తోంది. యాండ్రాయిడ్ ఫోన్లు అందుబాటులో లేని కాలంలో కుటుంబ సభ్యుల మధ్యా... తల్లిదండ్రులు, పిల్లల మధ్యా కాస్తో కూస్తో ఉండే సంబంధాలు.. స్మార్ట్ ఫోన్ల పుణ్యమాని పూర్తిగా తగ్గిపోతున్నాయి. అదే నేపథ్యంలో తన పిల్లలు విసుగు వచ్చేంత ఎక్కువగా ఐ ఫోన్ వాడటం, సామాజిక మాధ్యమాలకు అతుక్కుపోవడం చూసి విసుగు చెందిన ఓ తల్లి భరించలేకపోయింది. పిలిచినా పలక్కుండా ఉండే మితిమీరిన ఫోన్ వాడకం ఆమెకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. అందుకే తన పిల్లలు వాడుతున్న ఐ ఫోన్ ను గన్ తో పేల్చేసింది. ఇప్పుడు ఆ వీడియో యూట్యూబ్ లో చక్కర్లు కొడుతూ వినియోగదారులను అమితంగా ఆకట్టుకుంటోంది. సామాజిక మాధ్యమాల మోజులో తన మాటలను కూడ పట్టించుకోని పిల్లల ప్రవర్తనకు ఆ తల్లి విసుగు చెందిపోయింది. అందుకే ఓ చెట్టు కొమ్మపై ఐ ఫోన్ ను పెట్టి గన్ తో పేల్చేసింది. అయినా ఆమె కోపం చల్లారలేదు. కొమ్మ పైనుంచి తెచ్చి, సుత్తితో చితక్కొట్టేందుకు ప్రయత్నించింది. తిరిగి మరోసారి ఫోన్ పై తుపాకీతో తన ప్రతాపం చూపించింది. తన పిల్లల భవిష్యత్ తనకు ముఖ్యమని, దాని ముందు ఎంతటి ఎలక్ట్రానిక్ వస్తువైనా పనికిరాదంటూ ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. -
ఆర్ఎస్ఎస్ చీఫ్ ఫొటో మార్ఫింగ్, ఇద్దరి అరెస్ట్
కార్గాన్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఫోటోను మార్ఫింగ్ చేసిన ఘటనలో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మోహన్ భగవత్ ఫోటోను అభ్యంతరకంగా మార్పులు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం, ఆ ఫోటో సామాజిక మాధ్యమంలో హల్ చల్ చేయడం మధ్యప్రదేశ్లో కలకలం సృష్టించింది. 22 ఏళ్ళ షాఖిర్, 20 ఏళ్ళ వసీమ్ అనే యువకులు మోహన్ భగవత్ చిత్రాన్ని మార్ఫింగ్ చేసి భికన్ గోన్ పట్టణంలోని స్థానిక సోషల్ నెట్ వర్కింగ్ గ్రూప్లో పోస్టు చేశారు. కాగా ఆ ఫొటోను మార్చి 16న పోస్టు చేసినట్లు గుర్తించామని, వారిద్దరినీ అరెస్టు చేసినట్లు ఏఎస్పీ అంతర్ సింగ్ కనేష్ వెల్లడించారు. మరోవైపు మోహన్ భగత్ మార్ఫింగ్ ఫొటోపై ఆర్ఎస్ఎస్, బిజెపి కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిద్దరికీ వ్యతిరేకంగా ఐటీ చట్టం సెక్షన్ 67, భారత శిక్షాస్మృతి 505 (2) సెక్షన్లకింద భికాన్ గాన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. కోర్టు వారిద్దర్ని ఈనెల 30 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే నిందితులు మాత్రం తమకు ఆ ఫొటో మరో గ్రూప్ నుంచి వచ్చిందని, కేవలం దాన్ని తాము పోస్టు చేసినట్లు చెప్తున్నారని ఏఎస్పీ పేర్కొన్నారు. -
ఆర్థిక వ్యవస్థ బలపడాలంటే...
భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ బలపడేందుకు విద్య ఎంతో సహకరిస్తుందని నోబుల్ శాంతి బహుమతి విజేత కైలాష్ సత్యార్థి అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యతో సామాజిక న్యాయం కూడా చేకూరుతుందని, స్థిరమైన ఆర్థిక వృద్ధి, అభివృద్ధి, సామాజిక న్యాయం ఒక్క విద్యవల్లే సాధ్యమౌతుందని సత్యార్థి తెలిపారు. వచ్చే పదేళ్ళలో భారత్ లోని ప్రతి ఒక్కరూ చదువుకునేలా చూస్తే... మన జీడీపీ వృద్ధి రేటు నాలుగు శాతం పెరుగుతుందని సత్యార్థి సూచించారు. రోటరీ ఇంటర్నేషనల్ లిటరసీ అండ్ ఏఎంపి ప్రెసిడెన్షియల్ కాన్ఫరెన్స్ లో ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. పిల్లలను తరగతి గదుల్లోకి పంపగల్గితే అదే వారి అభివృద్ధికి మార్గదర్శకమౌతుందని, అనేక అవకాశాలను తెచ్చిపెడుతుందని అన్నారు. భారత ఆర్థిక అభివృద్ధికి అదే మార్గదర్శకమౌతుందని సత్యార్థి అన్నారు. ఉదాసీనత, భయం, అసహనం ప్రపంచానికి శత్రువులుగా మారాయని సత్యార్థి పునరుద్ఘాటించారు. -
ఫేస్ బుక్... యూజర్లకు కొత్త సదుపాయం
ప్రఖ్యాత సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ఫేస్ బుక్.. ఇప్పుడు ఖాతాదారులకు కొత్త సదుపాయాన్ని కల్పిస్తోంది. వినియోగదారుల అభిరుచులను సేకరిస్తున్న ఈ సామాజిక మాధ్యమం... యూజర్ల ఆసక్తికి అనుగుణంగా 'యాడ్ ప్రిఫరెన్సెస్' టూల్ ను అందుబాటులోకి తెచ్చింది. తద్వారా ఫేస్ బుక్ పేజీలో వినియోగదారులకు ఇష్టమైన ప్రకటనలను అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. ఫేస్ బుక్ పేజ్ లో యూజర్లు ఎక్కువగా చూసే విషయాల ఆధారంగా సంబంధిత మాచారాన్ని సేకరించి ఆయా ప్రకటనలకు చెందిన పూర్తి సమాచారాన్ని వారికి అందుబాటులో ఉంచుతుంది. సాధారణంగా ఏ వెబ్ పేజీ తెరచినా పక్కనే అనేక ప్రకటనలు కనిపించడం మనం చూస్తుంటాం. అయితే ఫేస్ బుక్ ఇప్పుడు వినియోగదారులకు ఇష్టమైన ప్రకటనలు అందుబాటులో ఉంచేందుకు ముందుకొచ్చింది. ప్రధానంగా మీ వయసు, ఫేస్ బుక్ వినియోగించే తీరు, ఇష్టాలను పరిగణనలోకి తీసుకొని.. మీరు క్లిక్ చేసిన బటన్స్ ను బట్టి మీకేం కావాలో అంచనా వేస్తుంది. సైట్ నుంచి మీరు లాగౌట్ అయిపోయినా సమాచారం మాత్రం సేకరించి ఉంచుతుంది. ముఖ్యంగా ఈ టూల్... ఫేస్ బుక్ పేజీ శీర్షిక ఆధారంగా మీక్కావలసిన అంశాన్ని గుర్తిస్తుంది. వైవాహిక జీవితం, రాజకీయాలు వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని మీ ప్రాధాన్యతను అంచనా వేస్తుంది. క్లాత్, గాడ్జెట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు వంటి ప్రకటనలను వాటికి సంబంధించిన ఫొటోలతో సహా పూర్తి సమాచారాన్ని మీ ముందుంచుతుంది. పేజీలో మీరు సబ్జెక్ట్ ను మార్చినప్పుడల్లా ఆయా విషయాలకు సంబంధించిన ప్రకటనలు పేజీలో మారుతుండటం ఈ 'యాడ్ ప్రిఫరెన్సెస్' ప్రత్యేకత. అంతేకాక ఈ సమయంలో కొత్త ప్రకటనలను వినియోగదారులకు పరిచయం చేసి ప్రోత్సహించేందుకు కూడా ఫేస్ బుక్ ప్రయత్నిస్తుంది. -
మహిళా గూఢచారులతో భారత పురుషులకు ఎర!
భారత పురుషులకు ఎరవేసేందుకు పాక్ గూఢచార సంస్థ.. ఐఎస్ఐ కొత్త పంథాను ఎంచుకుంది. సోషల్ మీడియా ద్వారా మహిళా గూఢచారులను రంగంలోకి దింపుతోంది. గతంలో నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనపై, ఆ రాష్ట్రంలో ఇతర లక్ష్యాలపై దాడి చేసేందుకు అప్పట్లో నేపాల్ ఐఎస్ఐ ప్రయోగ కేంద్రాలనుంచి మహిళా గూఢచారులను ఇండియాలోకి ప్రవేశపెట్టారు. ఇప్పుడు సామాజిక మాధ్యమాలనే ఆ జిహాదీలు ఆయుధాలుగా వాడుకుంటూ ఇండియాలోని పురుషులకు ఎరవేస్తున్నారు. ఇటీవలి కాలంలో మహిళా గూఢచారుల కేసులు వెలుగు చూడటంతో పోలీసు నిఘా ముమ్మరం చేశారు. 2014 ఆగస్టు నుంచి నవంబర్ వరకు ఫిరోజ్ పూర్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ భారతీయులు కావడం వారి అనుమానాలకు మరింత బలాన్నిచ్చింది. నిందితులను పోలీసులు విచారించగా కొత్త కోణాలు వెలుగుచూశాయి. ఇండో పాక్ చెక్ పోస్టు దగ్గరి గుస్సేన్ వాలా ప్రాంతాన్నిమహిళా గూఢచారులు రెండుసార్లు సందర్శించినట్లు తెలిసింది. వీరిద్దరినీ విడివిడిగా ట్రాప్ చేసిన ఐఎస్ఐ ఏజెంట్ జయ మిశ్రాతో వీరికి సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. ఇద్దరు నిందితుల్లో ఒకరు మధ్యప్రదేశ్ భోపాల్ జిల్లాకు చెందిన 43 ఏళ్ల శివ్ నారాయణ్ చంద్రవంశం గానూ, మరొకరు 35ఏళ్ల అర్జున్ మాలవ్యగాను గుర్తించారు. ఈ నిందితులిద్దరూ ఐఎస్ఐ మహిళా ఏజెంట్ జయ మిశ్రాతో ఇంటర్నెట్ లో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నట్లు ఫిరోజ్ పూర్ పోలీస్ సీనియర్ సూపరింటెండెంట్ చెబుతున్నారు. ఐఎస్ఐ ఏజెంటుగా ఉన్న ఆ మహిళా గూఢచారి లాహోర్ లో ఓ క్లినిక్ నిర్వహిస్తోందని, ఆమె నల్లతేళ్లతో తయారు చేసిన ఔషధాలను సమాజసేవ కోసం వినియోగిస్తోందని పోలీసుల దర్యాప్తులో తేలింది. సో... భారత పురుషులు మహిళల పేర్లు కనిపించగానే కనెక్ట్ అయిపోకుండా సామాజిక మాధ్యమాల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే మరి. -
సిడ్నీలో స్వలింగ సంపర్కులు ర్యాలీ
-
ఒక్కొక్కరికి 5 కిలోల రేషన్ బియ్యం
-
ఏప్రిల్ నుంచి ఒక్కొక్కరికి 5 కిలోల రేషన్ బియ్యం
కర్నూలు బహిరంగసభలో సీఎం సామాజిక సాధికారిత మిషన్ ప్రారంభం ఆర్థికసంఘం కేటాయింపుల్లో అన్యాయం సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఏప్రిల్ నుంచి ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున కుటుంబ సభ్యులందరికీ రేషన్ బియ్యం పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. కుటుంబానికి 20 కిలోల బియ్యం పంపిణీ చేసేలా ప్రస్తుతం ఉన్న నిబంధనను ఎత్తేస్తామని చెప్పారు. కర్నూలులో శుక్రవారం ఆయన సామాజిక సాధికారిత మిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ పోస్టాఫీసుకు వెళ్లలేని వృద్ధులకు ఇంటివద్దే పింఛను ఇస్తామని, వేలిముద్రలు పడలేని స్థితి ఉంటే ఐరిస్ ద్వారా పింఛన్లు ఇస్తామని చెప్పారు. సామాజిక సాధికారిత పథకాన్ని తొమ్మిది ప్రభుత్వశాఖల సమన్వయంతో అమలు చేస్తామని చెప్పారు. ఈ పథకం ద్వారా ప్రసూతి, పిల్లల మరణాలతో పాటు చదువుకునే వయసున్న పిల్లలను బడికి పంపించడం వంటి కార్యక్రమాలను అమలు చేస్తామని తెలిపారు. దక్షిణ భారతదేశంలో మన రాష్ట్రంలోనే ఎక్కువ ప్రసూతి మరణాలు సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికసంఘం కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పారు.ఈ పరిస్థితుల్లో 24 గంటలు కష్టపడినా ఇతర రాష్ట్రాల కంటే ముందుకు వెళ్లలేమని నిస్సహాయతను వ్యక్తం చేశారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి మహానగరాలను తలదన్నేలా రాజధానిని నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాపార అవకాశాలన్నీ డ్వాక్రా సంఘాలకే డ్వాక్రా సంఘాల రుణాలను మాఫీ చేస్తానని, వాటిని ప్రపంచంలోనే ఆదర్శంగా తయారు చేస్తానని చెప్పారు.రాబోయే రోజుల్లో గ్రామాల్లో ఉన్న వ్యాపార అవకాశాలన్నీ అప్పగిస్తామని తెలిపారు. పోలవరం కంటే ముందే పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా 70 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా బేసిన్లోకి మళ్లిస్తామని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి, మంత్రులు రావెల , కామినేని ప్రసంగించారు. కాంగ్రెస్.. రాయలసీమకు శాపం: సీఎం సాక్షి ప్రతినిధి, కడప: జలయజ్ఞంలో కోట్లాది రూపాయల పనులు చేసినా నీరు లేదని, రాయలసీమకు కాంగ్రెస్ శాపంగా మారిందని సీఎం చంద్రబాబు చెప్పారు. రాయలసీమను కరువు నుంచి బయపడేలా చేస్తానన్నారు. వైఎస్సార్ జిల్లా గండికోట ప్రాజెక్టును శుక్రవారం ఆయన ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గండికోటకు శంకుస్థాపన చేసింది తానేనని, నీరు తీసుకొచ్చేవరకు విశ్రమించనని చెప్పారు. ఒంటిమిట్ట కోదండరామాలయానికి ప్రభుత్వం తర ఫున పట్టువస్త్రాలు పంపుతామని చెప్పారు. శ్రీకాళహస్తి, తిరుపతి, కాణిపాకం, ఒంటిమిట్టను కలిపి టూరిజం సర్క్యూట్ చేస్తామని తెలిపారు. చదువుతోపాటు నైపుణ్యాల అభివృద్ధి ముఖ్యం సాక్షి ప్రతినిధి, తిరుపతి: చదువుతోపాటు నైపుణ్యాల అభివృద్ధి ముఖ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ప్రతి ఒక్కరిలో నైపుణ్యం వెలికితీయడంతోపాటు, తెలివితేటలకు పదును పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో 2014లో పదో తరగతి, ఇంటర్మీడియట్లలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు తిరుపతిలోని తారకరామ స్టేడియంలో శుక్రవారం రాత్రి ఆయన పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతిభ అవార్డులు అందుకున్న విద్యార్థులను శని, ఆదివారాల్లో తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు. వీరు రూ.300 టికెట్ క్యూలో ఉచితంగా వెళ్లి స్వామిని దర్శించుకోవచ్చని తెలిపారు. రక్షణ వలయంలో సీఎం పర్యటన ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని పూర్తి పోలీసు రక్షణ వలయంలో నిర్వహించారు. సీఎం పర్యటనకు హాజరుకాకుండా ప్రజాప్రతినిధుల్ని నిర్బంధించారు. వైఎస్సార్సీపీ నేతృత్వంలో ఏర్పడిన అఖిలపక్షం రెండు రోజుల పాటు పోతిరెడ్డిపాడు నుంచి గండికోట వరకు క్షేత్రస్థాయిలో పరిశీలించింది. దీనిపై సీఎంకు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించిన స్థానిక జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సహా ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథరెడ్డి, శ్రీకాంత్రెడ్డి, అంజాద్బాషా, రఘురామిరెడ్డి, జయరాములు, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి, సీపీఎం, సీపీఐ, రైతుసంఘాల ప్రతినిధులను గుర్రప్పకోన వద్ద పోలీసులు అడ్డుకున్నారు.సీఎంకు సమస్యలను వివరించాలని భావించిన బీఈడీ అభ్యర్థుల్ని యర్రగుంట్లలోనే అడ్డగించారు. ఎమ్మార్పీఎస్ నేతల్ని ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. -
రాజకీయ అధికారమే మాలల సమస్యకు పరిష్కారం
మాలల సమావేశంలో సామాజిక విశ్లేషకులు గోపీనాథ్ హైదరాబాద్: రాజకీయ అధికారంతోనే మాలల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, అందుకు సామాజిక, రాజకీయ శక్తులుగా మాలలు ఎదగాలని ప్రముఖ సామాజిక విశ్లేషకులు డాక్టర్ ఎం.ఎఫ్. గోపీనాథ్ అన్నారు. హైదరాబాద్లోని లోయర్ ట్యాంక్బండ్ అంబేద్కర్ భవన్లో మాలల ఆత్మీయ సమావేశం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన గోపీనాథ్ మాట్లాడుతూ.. దేశంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళితే వర్గం రాదేమో కానీ, కులం మాత్రం తప్పకుండా మన వెంటే వస్తుందన్నారు. భారత్లోని వామపక్ష పార్టీలు 90 ఏళ్ల తర్వాత కులం ప్రాధాన్యతను ఇప్పుడు గుర్తిస్తున్నాయని చెప్పారు. మాజీ మంత్రి శంకర్రావు మాట్లాడుతూ.. దళితులపై జరుగుతున్న దాడులను నియంత్రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ అనుకూల తీర్మానాన్ని ఈ సమావేశం వ్యతిరేకించింది. కార్యక్రమంలో మాల సంఘాల కన్వీనర్, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, కాంగ్రెస్ నేత డాక్టర్ విజయరామారావు, మాజీ ఎమ్మెల్యే లింగయ్య, ఎమ్మెల్సీ ప్రభాకర్, మాల సంఘాల నేతలు చెన్నయ్య, పసుల రామ్మూర్తి, రావుల అంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
సిలబస్ మార్పులపై కమిటీ
పోటీ పరీక్షల విషయంలో టీఎస్పీఎస్సీ కసరత్తు సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1, గ్రూప్-2 తదితర పోటీ పరీక్షల సిలబస్లో మార్పులపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) దృష్టిసారించింది. దీనిపై రెండు మూడు రోజుల్లో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. పరీక్షల సిలబస్లో చేయాల్సిన మార్పులను సూచిస్తూ ఈ కమిటీ వారంలోగా నివేదిక ఇచ్చేలా చర్యలు చేపడుతోంది. అందులోని సిఫారసులను పరిశీలించిన తర్వాత సిలబస్ మార్పులపై తుది నిర్ణయం తీసుకుని ఫైలును ప్రభుత్వామోదం కోసం పంపించాలని కమిషన్ భావిస్తోంది. ప్రస్తుత సిలబస్లో గ్రూప్-1లో 25 శాతం వరకు, గ్రూప్-2 తదితర పోటీ పరీక్షల్లో 50 శాతం వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సమాచారమే ఉన్నట్లు సమాచారం. ఈ సిలబస్ను తెలంగాణ రాష్ట్రానికే పరిమితం చేయాలని కమిషన్ భావిస్తోంది. ఏపీకి సంబంధించిన చాలావరకు సమాచారం అవసరం లేదని, భౌగోళిక, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, చరిత్రకు సంబంధించిన అంశాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వివరాలనే సిలబస్లో పెట్టాలని భావిస్తోంది. తద్వారా ప్రస్తుతం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు నష్టం ఉండదని కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి. పైగా నోటిఫికేషన్ల తర్వాత విద్యార్థులకు కొంత సమయం ఉంటుంది కనుక వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నాయి. ఇక వచ్చే నెల మొదటి వారంలో టీఎస్పీఎస్సీ వెబ్సైట్ను ప్రారంభించేందుకు కూడా కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు సంబంధిత ఐటీ విభాగం అధికారులతో కమిషన్ సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు ఒకట్రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్లో(ఏపీపీఎస్సీ) పని చేస్తున్న తెలంగాణ సిబ్బందిని తెలంగాణకు కేటాయించే ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలున్నాయి. నోటిఫికేషన్ల జారీలో తప్పని జాప్యం! రాష్ట్ర విభజనలో భాగంగా వివిధ శాఖల్లో సిబ్బంది విభజనే పూర్తి కానందున కొత్త నోటిఫికేషన్ల జారీపై ప్రభావం పడుతోంది. ప్రభుత్వ శాఖలు తమ అవసరాల మేరకు ఉద్యోగ నియామకాల కోసం ఇండెంట్లు(ప్రతిపాదనలు) ఇస్తే తప్ప నోటిఫికేషన్లు జారీ చేయడం టీఎస్పీఎస్సీకి సాధ్యం కాదు. శాఖలవారీగా ఖాళీ పోస్టులు, కేడర్లవారీగా అర్హతల వివరాలను ఆయా శాఖలే కమిషన్కు అందజేయాలి. అలాగే ఆయా పోస్టుల భర్తీకి సర్ప్లస్ మ్యాన్పవర్ సెల్(ఎస్ఎంపీసీ), ఆర్థిక శాఖలు అనుమతివ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏ శాఖలోనూ ఉద్యోగుల విభ జన పూర్తి కాలేదు. అది పూర్తయితేనే శాఖలవారీ అవసరాలపై స్పష్టమైన సమాచారం వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ ఇప్పటికిప్పుడు ఉద్యోగాల భర్తీకి గ్రీన్సిగ్నల్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇటు టీఎస్పీఎస్సీలోనూ చైర్మన్, ముగ్గురు సభ్యులు, కార్యదర్శి మినహా మరే సిబ్బంది లేరు. కమిషన్లో పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ పోస్టుల్లోకి ఏపీపీఎస్సీలో పనిచేస్తున్న సిబ్బంది రావాల్సి ఉంది. ఉద్యోగుల విభజన పూర్తయితేనే ఈ పరిస్థితి చక్కబడుతుంది. అప్పటివరకు ఇతర అంశాలపై కమిషన్ దృష్టి సారించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు మరింతకాలం వేచి చూడక తప్పదు. కమిషన్కు పోస్టుల మంజూరు టీఎస్పీఎస్సీకి 121 పోస్టులను సృష్టిస్తూ ఆర్థికశాఖ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. అదనపు కార్యదర్శి స్థాయి నుంచి ఆఫీస్ సబార్డినేట్ వరకు పోస్టులను మంజూరు చేసింది. ఉద్యోగుల విభజనలో భాగంగా ఏపీపీఎస్సీ నుంచి కమిషన్కు వచ్చే ఉద్యోగులు మినహా మిగతా పోస్టులను భర్తీ చేసుకోవాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. కమిషన్కు అదనపు కార్యదర్శి-1, డిప్యూటీ కార్యదర్శి-2, అసిస్టెంట్ సెక్రటరీ-6, అసిస్టెంట్ సెక్రటరీ(అకౌంట్స్)-1, సెక్షన్ ఆఫీసర్-26, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్-26, జూనియర్ అసిస్టెంట్-26, ష్రాఫ్-1, రికార్డు అసిస్టెంట్-5, రెనో ఆపరేటర్-2, జామేదార్-1, దఫేదార్-2, డ్రైవర్-2, ఆఫీస్ సబార్డినేట్-20 పోస్టులు కొత్తగా వచ్చాయి. -
మాట్లాడటానికి వెనుకాడను..
మనసులో ఉన్న అభిప్రాయాలపై బయటకు మాట్లాడటానికి వెనుకాడనని అంటోందని డేరింగ్ గర్ల్ స్వరభాస్కర్. ప్రస్తుతం ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’లో నటిస్తున్న స్వరభాస్కర్ సామాజిక కార్యకర్త కూడా. బాలీవుడ్లో నిలదొక్కుకునే ప్రయత్నాలు సాగిస్తూనే, సామాజిక కార్యకలాపాల్లోనూ చురుగ్గా పాల్గొంటోంది. రాజకీయ, సామాజిక అభిప్రాయాలను బయటకు వెల్లడించేందుకు ఏమాత్రం సంకోచించనని ఆమె చెబుతోంది. -
ఇంటింటి సర్వే రాజ్యాంగ విరుద్ధం: చౌదరి
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించినున్న ఇంటింటి సర్వే రాజ్యాంగ విరుద్ధమని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలుకాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుపడుతోందని విమర్శించారు. ఏపీ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు. ఉమ్మడి రాజధానిలో గవర్నర్ కు విశేషాధికారాలు అప్పగించాల్సిందేననని అన్నారు. ఇంటింటి సర్వే వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మరో టీడీపీ ఎంపీ గుండు సుధారాణి చెప్పారు. నెల రోజులపాటు సర్వే నిర్వహించాలని ఆమె సూచించారు. -
సర్వే గడబిడ!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ఇంటింటి సర్వే’ జిల్లా యంత్రాం గాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సర్వేకు సరిపడా సిబ్బందిని సమకూర్చుకోవడం గండంగా మారింది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ)లోని జిల్లా పరిధి సర్వే బాధ్యత లు గ్రేటర్కు అప్పగించి చేతులు దులుపుకున్నా.. గ్రామీణ ప్రాంతంలో సర్వే నిర్వహణకు తగి నంత ఉద్యోగులు లేకపోవడం ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ నెల 19న గ్రేటర్ పరిధి మినహా 7,41,600 ఇళ్లలో ‘ఆర్థిక, సామాజిక సర్వే’ నిర్వహించేందుకు 28,447 మంది అవసరమని లెక్కగట్టారు. దీంట్లో కేవలం 17,617 మంది మాత్రమే అందుబాటులో ఉండడం, ఇంకా 10,830 మంది సిబ్బంది కొరత ఉండడం జిల్లా యంత్రాంగాన్ని వేధిస్తోంది. శుక్రవారం గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రేమండ్ పీటర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సైతం కలెక్టర్ ఎన్.శ్రీధర్ ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. సర్వేకు సరిపడే స్థాయిలో సిబ్బందిని సమకూర్చుకోవడం కష్టతరంగా మారినందున, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులను వినియోగించుకునేందుకు అనుమతించాలని కోరారు. ఇటీవల ఎన్నికల విధుల్లో నూ వీరి సేవలు వినియోగించుకున్నామని, ఇప్పుడు కూడా ఆ వెసులుబాటు కల్పిస్తే సర్వే సిబ్బంది కొరతను అధిగమిస్తామని స్పష్టం చేశారు. కలెక్టర్ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన రేమండ్ పీటర్.. ఉన్నతస్థాయిలో చర్చించి నిర్ణయం తెలియజేస్తామన్నారు. ఇంటింటి సర్వేలో ప్రైవేటు ఉద్యోగులను వినియోగించుకోకూడదని ప్రభుత్వం నిబంధనలు విధించడంతో దీన్ని సడలిస్తే కానీ గండం గట్టెక్కే పరిస్థితి కనిపించడంలేదు. పట్టణ ప్రాంతాలను సర్వే నుంచి మినహాయిస్తే గ్రామీణ ప్రాంతాలకు సరిపడా సిబ్బందిని సమకూర్చుకోవడం పెద్ద కష్టంకాబోదని భావించిన అధికారగణానికి తాజా పరిణామం మింగుడు పడకుండా ఉంది. సర్వే నిర్వహణపై రెండు రోజుల్లో శిక్షణా తరగతులు నిర్వహించాల్సివుండగా, ఇప్పటివరకు సిబ్బంది సేకరణపై స్పష్టత రాకపోవడం చికాకు కలిగిస్తోంది. -
'19న పెళ్లి ఉన్నా వాయిదా వేసుకోండి'
కరీంనగర్: సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వే నేపథ్యంలో ఈనెల19న ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండాలని తెలంగాణలో నివసిస్తున్న ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు. ఏ కార్యక్రమం ఉన్నా వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 19న పెళ్లి ఉన్నా వాయిదా వేసుకోండి, శ్రావణ మాసమే కాబట్టి మరో ముహూర్తం దొరుకుతుందని సలహాయిచ్చారు. 19న ఇంట్లో ఉండకుంటే మీ పేరు లిస్టులో ఉండదని చెప్పారు. ఆ రోజు లేనోడు లెక్కకు రాడు అని స్పష్టం చేశారు. ఈ నెల 19న తాను కూడా ఇల్లు కదలనని అన్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్పై తమ వాదనలు 11న వినిపిస్తామని కేసీఆర్ తెలిపారు. తమ ఇబ్బందులను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామన్నారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేశామని చెప్పారు. జర్నలిస్టులందరికి ఒకే యూనిక్ కార్డు ఇవ్వాలనుకుంటున్నట్టు తెలిపారు. -
అక్షరాలా లక్షమంది!
- గ్రేటర్లో సామాజిక, ఆర్థిక సర్వే - సిద్ధమవుతున్న జీహెచ్ఎంసీ - వివిధ శాఖల సిబ్బంది సాయంతో ముందుకు.. 25 వేల మంది సైనికులు... భారీ సంఖ్యలో సాధారణ పోలీసులు.. అదే స్థాయిలో ట్రాఫిక్ పోలీసులు... మొత్తం దాదాపు లక్షమంది గ్రేటర్ నగరంలో రంగంలోకి దిగనున్నారు. ఏంటీ? నగరంలో మళ్లీ ఏదో అలజడి రేగే ప్రమాదం ఉందనో...లేకపోతే ఎవరో ప్రముఖుడు వస్తున్నారనో అనుకుంటున్నారా? అదేం కాదు. త్వరలో చేపట్టేబోయే సామాజిక, ఆర్థిక గణనలో వీరంతా పాలు పంచుకోనున్నారు. అదీ సంగతి. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వే నిర్వహించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. దీనికోసం వివిధ విభాగా ల నుంచి సిబ్బందిని కేటాయిం చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ విస్తీర్ణం, సర్వేకు కావాల్సిన యంత్రాంగం కొరత తదితర అంశాల నేపథ్యంలో నగరంలో ఈ కార్యక్రమం సాగదనే సంశయాలు నెలకొన్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు వీలునుబట్టి అదే రోజున లేదా మరో తేదీన గ్రేటర్ నగరంలోనూ సామాజిక ఆర్థిక సర్వేకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిసింది. అందుకు అనుగుణంగా జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. వీలై తే ఒకే రోజున.. లేదా రెండు రోజుల పాటు సర్వే నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు అవసరమైన యంత్రాంగం, సర్వేలో ఎవరెవరిని వినియోగించుకోవాలి? ఏయే అంశాలు పొందుపరచాలనే విషయమై జీహెచ్ఎంసీ అధికారులు కసరత్తు ప్రారంభించారు. జీహెచ్ఎంసీతో పాటు నగరంలోని వివిధ శాఖల ప్రభుత్వోద్యోగులు, పోలీసులు, మిలటరీ బలగాలనూ వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్ చెప్పారు. సర్వే విధానంపై కసరత్తు సుమారు 625 చ.కి.మీల మేర విస్తరించిన జీహెచ్ఎంసీ ప్రస్తుత జనాభా 90 లక్షలు దాటింది. దీన్ని పరిగణనలోకి తీసుకొని సుమారు కోటి మంది వివరాలను సేకరించేందుకు లక్ష మంది అవసరమవుతారని జీహెచ్ఎంసీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఒక్కొక్కరు సగటున 25 ఇళ్లలో సర్వే చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. నగరంలో చిరునామాలు గందరగోళంగా ఉండటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని, సర్వేకు ఎలాంటి విధానాన్ని పాటించాలనే దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల పోలింగ్ స్టేషన్ల వారీగా సర్వే జరపాలనే అభిప్రాయాలతో పాటు జనగణన సమయంలో పాటించిన ఎన్యూమరేషన్ బ్లాకుల వారీగా చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలూ పరిశీలనకు వచ్చాయి. ఎన్యూమరేషన్ బ్లాకుల వారీగా అయితే శాస్త్రీయంగా ఉంటుందని భావిస్తున్నారు. ఎన్యూమరేషన్ బ్లాకుల మ్యాపులు ఉన్నందున పని సులువవుతుందనే అంచనాలు ఉన్నాయి. దీంతో పాటు జీహెచ్ఎంసీలోని ఆస్తి పన్ను విభాగం, అంగన్వాడీల సేవలూ వినియోగించుకోవాలనే ఆలోచన ఉన్నా...వాటి వల్ల తగిన ప్రయోజనం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్నివిధాలా యోగ్యమైన విధానం కోసం ఒకటి రెండు రోజుల పాటు ఆలోచనలు సాగే అవకాశం ఉంది. పూర్తయితే స్టిక్కర్లు సర్వే పూర్తయిన ఇళ్లకు సంబంధించి ఈ విషయం తెలియజేసేలా స్టిక్కర్లు అతికించనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ స్లిప్ల పంపిణీలోనూ జీహెచ్ఎంసీ అధికారులు ఈ విధానాన్ని పాటించారు. ఓటరు స్లిప్పులు అందజేసిన వారి ఇళ్లకు స్టిక్కర్లు అతికించారు. ఆ అనుభవంతో ఈ సారి మరింత పకడ్బందీగా స్టిక్కర్ల కార్యక్రమాన్ని అమలు చేయగలమని భావిస్తున్నారు. సర్వే విధుల్లో పాల్గొనే లక్ష మందిపై వివిధ స్థాయిల్లో సూపర్వైజర్లు, ఇన్ఛార్జులను నియమించనున్నారు. తమ పరిధిలో సర్వే తీరు ను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కార్యక్రమం విజయవంతమయ్యేం దుకు చర్యలు చేపడతారు. -
పఠనం వల్ల ప్రయోజనాలు ఎన్నో!
అధ్యయనం ఒకప్పుడు యువకుల చేతుల్లో సాహిత్య, సామాజిక రంగాలకు సంబంధించిన పుస్తకాలు విరివిగా కనిపించేవి. చదివిన పుస్తకాల గురించి విలువైన చర్చలు జరిగేవి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి మచ్చుకు కూడా కనిపించడం లేదు. పుస్తకం స్థానంలో సెల్ఫోన్ హస్తభూషణమైంది. ‘క్లాసు పుస్తకాలు చదవడానికి టైమ్ సరిపోవడం లేదు. ఇక సాహిత్య పుస్తకాలు కూడానా’ అనేది ఒక సాకు మాత్రమే. మనసుంటే మార్గం ఉంటుంది. చదవాలని కోరిక ఉండాలే గానీ సమయం తప్పకుండా దొరుకుతుంది. పుస్తకాలు చదవడం అనేది సాహిత్యపరిచయానికో, కాలక్షేపానికో కాదు...పఠన ప్రభావం వల్ల వ్యక్తుల మానసిక పరిధి విస్తరిస్తుందని రకరకాల పరిశోధనలు తెలియజేస్తున్నాయి. నిజానికి బాల్యంలోనే చదవడం మొదలుపెట్టాలి. వీలుకానప్పుడు టీనేజ్లో తప్పనిసరిగా పుస్తకపఠనాన్ని అలవాటు చేసుకోవాలి. బ్రిటన్లోని నేషనల్ లిటరసీ ట్రస్ట్(ఎన్ఎల్టి) తాజా అధ్యయనం మరోసారి పుస్తక పఠన విలువను ప్రపంచానికి చాటింది. పుస్తకాలు చదివే అలవాటు ఉన్న టీనేజర్లకు, లేని టీనేజర్లకు మధ్య వ్యత్యాసాలను అధ్యయనం చేశారు. పుస్తకాలు చదవని వారితే పోల్చితే, చదివే వారు లోకజ్ఞానంలోనే కాదు, రకరకాల సామర్థ్యాలలోనూ మెరుగైన ప్రతిభను కనబరుస్తున్నారని ఎన్ఎల్టి అధ్యయనం చెబుతుంది. పుస్తక పఠనం వల్ల ఉపయోగం ఏమిటి? టీనేజ్లో పుస్తకాలు చదివే అలవాటు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనది...లక్ష్యాన్ని నిర్దారించుకునే స్పృహ ఏర్పడుతుంది. లక్ష్యాన్ని చేరుకొనే పట్టుదల వస్తుంది. సామాజిక సమస్యలపై అవగాహన, సామాజిక స్పృహ ఏర్పడతాయి. పఠనాన్ని ఆహ్లాదకరమైన అనుభవంగా భావించే వాళ్లు మిగిలిన వాళ్లతో పోల్చితే భిన్నంగా ఆలోచించగలరు. క్లిష్టమైన సమస్యలకు సులువైన పరిష్కారాను కనుక్కోగలరు. పదిమందిలో ఆకర్షించేలా మాట్లాడే నైపుణ్యం పెరుగుతుంది. స్వీయవిశ్లేషణ సామర్థ్యం పెరుగుతుంది. దీనివల్ల తప్పులను, లోపాలను వేరొకరు వేలెత్తి చూపడానికి ముందే వాటిని సరిదిద్దుకోవచ్చు. చర్చలలో వాదన నైపుణ్యం పెరుగుతుంది. అమ్మాయిలే ఫస్ట్... పాశ్చాత్యదేశాలలో అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలే ఎక్కువగా పుస్తకాలు చదువుతున్నారు. దీనివల్ల అబ్బాయి కంటే అమ్మాయిలలోనే సానుకూల దృక్పథం ఎక్కువగా కనిపిస్తుంది. -
మానవ అభివృద్ధి నివేదికపై కసరత్తు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మానవ అభివృద్ధి నివేదిక (హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్)ను సిద్ధం చేయాలని ప్రణాళికశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లా, మండల, గ్రామస్థాయి వరకు పూర్తి సమాచారాన్ని సేకరించనున్నారు. ఈ బాధ్యతను ఇప్పటికే సామాజిక, ఆర్థిక అధ్యయన కేంద్రం(సెస్)కు అప్పగించింది. ఇప్పటికే ఈ పనిలో ఉన్న సెస్ మరో నెలరోజుల్లోగా నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. కాగా తెలంగాణ ప్రభుత్వం 2014-15 సంవత్సర బడ్జెట్ కసరత్తు ప్రారంభించింది. ఈనెల 27వ తేదీన అన్ని ప్రభుత్వ శాఖల అధిపతులు, విభాగాల అధిపతులకు దీనిపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. -
రావెల కార్యక్రమం రసాభాస
- బోనబోయిన వర్సెస్ గింజుపల్లి వర్గీయులు ఘర్షణ - రెండు వర్గాల వీరంగం - మంత్రి కాన్వాయ్ను నిలిపిన ప్రత్తిపాడు కార్యకర్తలు - సర్దుబాటు చేసిన మంత్రి విద్యానగర్/కొరిటెపాడు(గుంటూరు): రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా జిల్లాకు వచ్చిన రావెల కిషోర్ బాబుకు స్వాగతం పలికే సందర్బంలో ప్రత్తిపాడు, గుంటూరు రూరల్ మండల కార్యకర్తలు బాహాబాహికి దిగారు. దీంతో కార్యక్రమం రసాభాసగా మారింది. హైదరాబాదు నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న మంత్రి కిషోర్ బాబుకు నగరశివారులోని నాగార్జున యూనివర్సిటీనుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎదురేగి స్వాగతం పలికారు. నగంరలోని ఆర్టీసీ బస్టాండ్ వద్దకు రాగానే మంత్రి కాన్వాయ్లో మా వాహనం ముందుండాలంటే, మా వాహనం ముందుండాలనే విషయంలో పార్టీ నాయకులు బోనబోయిన శ్రీనివాస్యాదవ్, ప్రత్తిపాడు మండల అధ్యక్షుడు గింజుపల్లి శివరారామప్రసాద్ తనయుడు గింజుపల్లి వెంకటేశ్వరరావు అనుచరుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది క్రమంగా శృతి మించి ఘర్షణకు దారితీసింది. ప్రత్తిపాడు నియోజకవర్గంలో మీ పెత్తనం ఏమిటంటూ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అనుచరులను వెంకటేశ్వరరావు అనుచరులు ప్రశ్నించి మంత్రి కాన్వాయ్ ముందు ఘర్షణకు దిగారు. ఒక దశలో మంత్రి కాన్వాయ్ను నిలిపి కార్ల బాయినెట్పైకి ఎక్కి రచ్చరచ్చ చేశారు. ఇరువర్గాలు ఆగ్రహావేశాలలో మంత్రి కాన్వాయ్ ముందు బైఠాయించి, మంత్రి దీనిపై సమాధానం చెప్పాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ పరిణామాలతో టీడీపీ శ్రేణులు ఖంగుతిన్నాయి. ఘర్షణ ఎంతకీ సమసిపోకపోవడంతో మంత్రి రావెల కారు దిగి వచ్చి ఇరువర్గాలకు నచ్చచెప్పారు. దీంతో సమస్య సద్దుమణిగింది. దాదాపు రెండు గంటలకుపైగా జరిగిన వివాదంతో ఆర్టీసి బస్టాండ్ నుంచి ఇటు ఆటోనగర్కు, ఇటు పొన్నూరు రోడ్డు వరకు ట్రాఫిక్ పెద్ద ఎత్తున నిలిచి పోయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
తరుగుతున్న పచ్చ‘ధనం’
ఒంగోలు టౌన్, న్యూస్లైన్: భూతాపం, వాతావరణంలో హరిత వాయువుల గాఢత రెట్టింపవుతోంది. ఒంగోలు నగరంతో పాటు జిల్లాలోని వివిధ పట్టణాలు ఉడికిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు నానాటికీ పెరిగిపోతుండటంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. స్వచ్ఛమైన గాలి కూడా పీల్చుకోలేకపోతున్నారు. పచ్చదనం కనుమరుగవడమే వీటన్నింటికీ ప్రధాన కారణమని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. పట్టణీకరణ పేరుతో విచక్షణా రహితంగా చెట్లను నరికేస్తుండటంతో చూద్దామన్నా పచ్చదనం కనిపించడం లేదు. మున్సిపల్, కార్పొరేషన్ అధికార యంత్రాంగం మొక్కలు నాటించడంపై కనీస దృష్టి కూడా సారించడం లేదు. సర్వేలో భయానక వాస్తవాలు: వాతావరణ శాఖ, పర్యావరణ, సామాజిక అటవీ శాఖలకు చెందిన విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల నగరాలు, పట్టణాల్లో పచ్చదనంపై సర్వే నిర్వహిం చాయి. ఆ సర్వేలో భయానక వాస్తవాలు వెలుగుచూశాయి. దీంతో ఆందోళన చెందిన ఆయా శాఖల ఉన్నతాధికారులు జిల్లాల వారీగా సేకరించిన పచ్చదనం శాతాలను ఆయా జిల్లాల కలెక్టర్లతో పాటు పలు శాఖలకు పంపించారు. దీనిపై తక్షణమే స్పందించాలని ఆదేశాలు జారీ చేశారు. సాధారణంగా నగరం, పట్టణం భూ విస్తీర్ణంలో 33 శాతం మొక్కలు, చెట్లు, వనాలతో నిండి ఉండాలి. అలాంటిది ఊహకందని రీతిలో పచ్చదనం కనుమరుగవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో ఒంగోలు నగరంతోపాటు ఏడు మున్సిపాలిటీలున్నాయి. పచ్చదనం విషయంలో అన్నీ వెనుకబడే ఉన్నాయి. ఒంగోలు నగరం పరిస్థితి అత్యంత దారుణం. ఒంగోలు నగర విస్తీర్ణం 135 చదరపు కిలోమీటర్లు. ఇందులో 33 శాతం విస్తీర్ణంలో మొక్కలు, చెట్లు, పచ్చదనంతో కళకళలాడాల్సి ఉంది. అలాంటిది ఇటీవల లెక్కల ప్రకారం ఒంగోలు నగరంలో కేవలం 3 శాతం మాత్రమే పచ్చదనం ఉన్నట్లు తేలింది. అద్దంకి మున్సిపాలిటీలో ప్రస్తుతం కేవలం 2 శాతం మాత్రమే పచ్చదనం ఉంది. అదేవిధంగా చీమకుర్తిలో 18, చీరాలలో 4, గిద్దలూరులో 20, కందుకూరులో 3, కనిగిరిలో 16, మార్కాపురంలో 2 శాతం మాత్రమే పచ్చదనం ఉన్నట్లు అధికారుల సర్వేల్లో తేటతెల్లమైంది. మొక్కల పెంపకంపై అవగాహన కల్పించాలి ఏ.కోటేశ్వరరావు, వృక్ష శాస్త్ర నిపుణుడు, సింగరాయకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పట్టణాలు, నగరాల్లో మొక్కల పెంపకంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలి. పాఠశాల దశ నుంచే విద్యార్థులకు మొక్కల పెంపకంపై ఆసక్తి పెరిగేలా చర్యలు తీసుకోవాలి. ఒక చెట్టును కొడితే రెండు చెట్లు పెంచే విధంగా కఠినమైన చర్య లు తీసుకోకపోతే భవి ష్యత్ తరాలకు మంచి ఆరోగ్యాన్ని అందించలేం. శీతోష్ణస్థితిలో విపరీతమైన మార్పులు వస్తున్నాయంటే మొక్కలను విచక్షణా రహితంగా నరకడమే ప్రధా న కారణం. మన దేశం లో పర్యావరణం, చెట్ల సంరక్షణపై కఠిన చట్టాలున్నప్పటికీ వాటి ఆచరణ లోపం వల్లనే ఈ పరిస్థితి ఎదురవుతోంది. -
నెట్ లేకుండానే ఫేస్బుక్ యాక్సెస్
న్యూఢిల్లీ: మొబైల్ వినియోగదారులు ఇంటర్నెట్/డేటా కనెక్షన్ లేకుండానే ఫేస్బుక్ను యాక్సెస్ చేసుకునే సర్వీస్ను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. ఈ సర్వీస్ కోసం 3 రోజులకైతే రూ.4, వారానికైతే రూ.10, నెలకైతే రూ.20 చొప్పున చార్జీ వసూలు చేస్తామని బీఎస్ఎన్ఎల్ డెరైక్టర్ అనుపమ్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. ఈ సర్వీస్ ద్వారా మొబైల్ వినియోగదారులు తమ ఫేస్బుక్ అకౌంట్లను యాక్సెస్ చేసుకోవచ్చని, మెసేజ్ల స్టేటస్ను చూడొచ్చని, మెసేజ్లను పోస్ట్ చేయవచ్చని, ఫ్రెండ్ రిక్వెస్ట్లకు స్పందించవచ్చని, ఫ్రెండ్స్ వాల్స్పై రైట్ చేయవచ్చని, బర్త్డే రిమైండర్స్ను చూడొచ్చని, ఎలాంటి ఇంటర్నెట్/డేటా కనెక్షన్ లేకుండానే మెసేజ్లు పంపించవచ్చని వివరించారు. యూఎస్ఎస్డీ ద్వారా యుటోపియా మొబైల్ భాగస్వామ్యంతో ఈ సర్వీస్ను అందిస్తున్నామని పేర్కొన్నారు. అన్ని రకాల మొబైల్ ఫోన్లలలో ఈ సర్వీస్ను ఉపయోగించుకోవచ్చని వివరించారు. తూర్పు, దక్షిణ జోన్లలో ఈ సర్వీస్ను తక్షణం అందిస్తామని, ఆ తర్వాత పశ్చిమ, ఉత్తర జోన్లకు విస్తరిస్తామని తెలిపారు. టెలికం కంపెనీలు అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా(యూఎస్ఎస్డీ) టెక్నాలజీ ద్వారా తమ మొబైల్ వినియోగదారులకు అలర్ట్లు పంపిస్తాయి. ఈ టెక్నాలజీ ద్వారానే బీఎస్ఎన్ఎల్ ఈ సర్వీస్ను అందిస్తోంది. -
ప్యాలియేటివ్ కేర్వేదన-సాంత్వన!
కొన్నిసార్లు జబ్బు చాలా మంచిది. అది బంధాలను బలంగా చేస్తుంది. అందర్నీ దగ్గర చేస్తుంది. కళ్లు చెమర్చేలా చేస్తుంది. అన్నీ అమర్చేలా చూస్తుంది. సన్నిహితులెవరో చెబుతుంది. కానీ చికిత్సకు లొంగే జబ్బు అయితేనే మంచిది. అందులోనూ డబ్బు ఉంటేనే జబ్బు మంచిది. కానీ ఆ వచ్చిన రుగ్మత ఒకపట్టాన లొంగనిదైతే? ఎప్పటికీ తగ్గనిదైతే? మృత్యువొక్కటే దానికి మందైతే? అయితే ఆ వేదన ఒక్క రోగిదే కాదు... అనుభవించే అందరిదీ. పక్కనుండే పలువురిదీ. ఇక మరణం అనివార్యమని నిర్ధారించే జబ్బు వస్తే... ఆ వచ్చే కష్టాలు కేవలం చికిత్సాపరమైనవి మాత్రమే కాదు. మరెన్నో! ముఖ్యంగా శారీరకంగా కలిగే నొప్పులు, తెంచుకోలేని పాశాలు, మానసికమైన క్లేశాలు... వీటన్నింటినుంచీ విముక్తి ఎలా? మరణమే శరణ్యమనే పరిస్థితుల్లో సంవేదననుంచి సాంత్వన ఇచ్చే ‘ప్యాలియేటివ్ కేర్’పై అవగాహన కోసం ఈ ప్రత్యేక కథనం. హాస్పిటల్ కాదది... హాస్పిస్ ఒక రోగికి వచ్చిన జబ్బు కారణంగా ఇక మరణం తప్పదు. అలాంటి రోగిని ఏ హాస్పిటల్ చేర్చుకుంటుంది? పైగా అలాంటి రోగులను చేర్చుకోడానికి విముఖత చూపుతుంది. ఫలానా దగ్గర రోగికి నయమైపోయిందనే కీర్తి వస్తే గొప్పగానీ... ఫలానాయన అంత పెద్ద ఆసుపత్రిలోనూ చనిపోయారంటే అది ఆసుపత్రికి అపకీర్తి కదూ! అందుకే అలాంటివారిని చేర్చుకోడానికి హాస్పిటళ్లు ముందుకు రావు. చెవికి చేదుగా వినిపించినా, మనసుకు కష్టంగా అనిపించినా ఇది సత్యం. మరి హాస్పిటళ్లే ముందుకు రాకపోతే వారికి వేదన నుంచి విముక్తి ఎలా? అందుకే ఇలాంటి రోగులకు సాంత్వన కలిగించేందుకు ఉద్భవించినవే ‘హాస్పిస్’లు. ఒక్కమాటలో చెప్పాలంటే... అది ఇల్లైనా కావచ్చు లేదా హాస్పిటల్ వంటి వసతైనా కావచ్చు. కానీ రోగి తన చివరి రోజు వరకూ నొప్పీ, బాధా లేకుండా ప్రశాంతంగా బతికేలా చేసే ఇన్పేషెంట్ వసతి సౌకర్యమే ‘హాస్పిస్’. హాస్పిస్ కాదేమో... హాస్-‘పీస్’ ఏమో! మరణం తప్పదని తెలిశాక మనసు దెబ్బతింటుంది. శారీరక బాధలకు మానసిక వేదన తోడుగా వస్తుంది. ఇలా రెట్టింపైన బాధలను తగ్గించే మార్గం ఏదైనా ఉంటే అది హాస్పిస్. పెదవిపై ‘హాసాన్ని’, మనస్సుకు శాంతిని... అదే ‘పీస్’ ఇప్పించే ఆ ప్రదేశాన్ని ‘హాస్పిస్’ అనడం కంటే హాస్-పీస్ అనడం సముచితమేమో! క్యూర్ లేని చోట కావాల్సిందే... కేర్ కొన్ని జబ్బులకు ఇక చికిత్స జరిగే పరిస్థితి ఉండదు. ఉదాహరణకు మెటస్టెసస్ దశకు చేరిన క్యాన్సర్కు ఇక చికిత్స చేసే మార్గం మిగలదు. కీమోథెరపీ, రేడియేషన్ ప్రక్రియ, శస్త్రచికిత్సలూ ఇవేవీ పనిచేయవు. కానీ ఆ దశలో అంతులేని శారీరక వేదన ఉంటుంది. ఇలాంటి అవసానదశలో ఉన్నవారికీ కొన్ని శారీరక బాధలుంటాయి. అవి మరీ తీవ్రంగానూ ఉంటాయి. ఆ సంవేదనలకు కావాల్సింది శమన చికిత్సఒక్కటే. లక్షణాలకు చేసే ఉపశమన చికిత్స ఒక్కటే. ఆ చికిత్సను అందిస్తూ, రోగుల బాధల తీవ్రత తగ్గించే కేర్ను అందిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న మాట ఇది... ‘ప్యాలియేటివ్ కేర్’ అంటే ఒక రోగికి ఇక జబ్బును నయం చేసే చికిత్స ఇవ్వడం సాధ్యం కాదని నిర్ధారణ అయినప్పుడు రోగికి తీవ్ర లక్షణాల బాధ నుంచి విముక్తి కలిగించే చికిత్స (సింప్టమ్యాటిక్ ట్రీట్మెంట్), మానసిక వేదననుంచి దూరం చేసే మానసిక చికిత్స (సైకలాజికల్ ట్రీట్మెంట్), ఆత్మతృప్తిని ప్రసాదించే ఆధ్యాత్మిక చికిత్స (స్పిరిట్యువల్ ట్రీట్మెంట్) ఇవ్వాలనీ, రోగి బంధువులను సైతం ఆవేదననుంచి దూరం చేసేలా ఈ కార్యకలాపాలు ఉండాలని, తద్వారా రోగి జీవననాణ్యతను (క్వాలిటీ ఆఫ్ లైఫ్ను) మెరుగుపరచాలనీ చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ). అంతేకాదు... రోగికీ, అతడి బంధువులకూ అవసరమైన మానసిక, సామాజిక బలాన్నీ ప్రసాదించాలని పేర్కొంటోంది. ఆ అపోహే వద్దు... రోగిని బాధల నుంచి విముక్తం చేసేలా వ్యవహరిస్తారనే మాట ఒక్కోసారి కొందరిలో తప్పుడు అభిప్రాయాలను కలిగించవచ్చు. రోగికి తీవ్రమైన బాధా, నొప్పీ ఉంటాయి కాబట్టి వాటి నుంచి విముక్తం కలిగించడానికి ‘కారుణ్యమరణం’ కలిగిస్తారేమో అనే అపోహ ఉంటుంది. కానీ ప్యాలియేటివ్ కేర్లో రోగికి కారుణ్యమరణం కలిగేలా చేయరు. మరణాన్ని ముందుకు తీసుకురారు. అది వచ్చినప్పుడు దాన్ని ఆలస్యం చేయరు. జబ్బు వచ్చినా, రుగ్మతతో రుజాగ్రస్తమైనా రోగి తన సహజమరణం సమీపించినప్పుడే చనిపోయేలా చేస్తారు. ఆ సమయంలోనూ వారు పెద్దగా బాధపడని విధంగా తాత్విక దృక్పథం కలిగి ఉండేలా రోగికీ, కుటుంబ సభ్యులందరికీ తగిన కౌన్సెలింగ్ ఇస్తారు. అయితే ఎంతగా కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికీ రోగితో ఉండే భావోద్వేగ పరమైన బంధాల వల్ల అది సరిపోయినంత అని ఎవరూ చెప్పలేరు. అలా చేయడం సాధ్యమూ కాదు. అంగట్లో అన్నీ ఉన్నా రోగి నోట్లో మందూ కరవే... సాధారణంగా చివరిదశలో తీసుకుంటున్న రోగికి ప్రధానంగా అవసరమైనవి నొప్పిని తెలియకుండా చేసే మందులు. వీటిని వైద్యుల పర్యవేక్షణలో అవసరం ఉన్నవారికే ఇస్తే ఆ మందులను ‘ఓపియాయిడ్స్’ అనవచ్చు. కానీ ఒక మత్తు కోసం, ఒక దుర్వ్యసనం కోసం దుర్వినియోగం చేస్తే వాటిని ‘నార్కోటిక్స్’ అంటారు. అందుకే వీటి లభ్యత తక్కువ. సాధారణ మెడికల్ షాపుల్లో ఇవి దొరకనే దొరకవు. ఇవి దొరికే ప్రత్యేకమైన మందుల దుకాణాలుంటాయి. అక్కడా ఎంతో మంది ఉన్నత స్థాయి వైద్యాధికారుల అనుమతులతోనే వీటిని విక్రయిస్తారు. అంతేకాదు... వీటి ప్రిస్క్రిప్షన్ కూడా ప్రత్యేకంగానే ఉంటుంది. ఆ ప్రిస్కిప్షన్ ఉంటేనే ఈ మందు దొరకడం సాధ్యమవుతుంది. విచిత్రం ఏమిటంటే... వీటిపై కఠినాతికఠినమైన నిబంధనలు ఉండటం వల్ల ఈ మందుల తయారీకి అవసరమైన పంట అయిన ‘ఓపియమ్’ ప్రపంచంలో పండే మొత్తం పంటలో 90 శాతం భారత్లో పండుతోంది. కానీ నొప్పుల నివారణ కోసం కేవలం 5 శాతం కంటే తక్కువకే ఇక్కడ దీని లభ్యత పరిమితమైంది. అంతెందుకు ఈ తరహా రోగులు రాష్ట్రమంతటా విస్తరించి ఉన్నా... ఈ బాధానివారిణులు మాత్రం కేవలం ప్రస్తుతం ‘హైదరాబాద్’లో మాత్రమే లభ్యమవుతున్నాయి. మొదటి కారణం... ‘ప్యాలియేటివ్ కేర్’ చికిత్స ప్రక్రియలపై అవగాహన తక్కువగా ఉండటం. రెండో కారణం... వీటి లభ్యతపై కఠినమైన నిబంధనలు అమలవుతూ ఉండటం. ఈ పరిమితుల దృష్ట్యా ప్యాలియేటివ్ కేర్ అవసరమైన రోగులు ఎందరో దీనికి దూరంగా నొప్పులతో విసిగిపోతూ, బాధలతో వేసారిపోతూ దుర్భరంగా జీవిస్తున్నారు. హాస్పిస్ నుంచి హాస్పిటల్కు తరలిస్తారా? ప్యాలియేటివ్ కేర్ దొరికే హాస్పిస్ నుంచి రోగిని హాస్పిటల్కు తరలించేందుకు అవకాశమే ఉండదు. ఎందుకంటే ఇక రోగికి మృత్యువు తప్పదని తెలిశాకే ఇక్కడికి చేర్చుతారు. ఒకవేళ రోగి సంక్లిష్ట దశల్లోకి వెళ్లి మరణానికి చేరువవుతుంటే బాధానివారణకు అవసరమైన చర్యలు చేపడతారు తప్ప... ఆసుపత్రికి తీసుకెళ్లరు. అయితే కొందరు రోగులు తమ పరిస్థితిని గుర్తెరిగాక... తమ సొంత ఇంట్లోనో, తమకు ఇష్టమైన చోటో ప్రశాంతంగా కన్నుమూద్దామని భావిస్తారు. అలాంటి రోగుల కోరిక మేరకు వారు తమకు ఇష్టమైన, అనువైన చోటికి వెళ్లవచ్చు. విజయ సంతృప్తి... ఆత్మతృప్తి ఒక కఠినమైన, సంక్లిష్టమైన కేసును స్వీకరించి రోగిని బతికిస్తే ఆ డాక్టర్కు తన వృత్తిపరంగా విజయసంతృప్తి లభిస్తుంది. కానీ మరణం తథ్యమని తెలిసిన ఒక రోగికి కేవలం బాధ నుంచి విముక్తి కలిగిస్తే ఏమొస్తుంది? కనీసం ఫీజు కూడా రాదు. అందుకే కేవలం ఆత్మతృప్తి కోసమే ఈ రంగాన్ని ఎంచుకుని సేవలందించే వారే భారత్లో ప్యాలియేటివ్ కేర్లో కొనసాగుతున్నారు. సేవాపథంలో సాగుతున్నారు. విజయసంతృప్తికీ... ఆత్మతృప్తికీ... తెచ్చుటలో ఉన్న హాయికీ... ఇచ్చుటలో ఉన్న హాయికీ తేడా తెలిసిన వారే ఈ కేర్ కోసం క్రతువు సాగిస్తున్నారు. చివరగా... ఉర్దూ మహాకవి, గజల్ చక్రవర్తి గాలిబ్ అంటాడూ... మృతియే లేకున్న ఈ బతుకుకు రుచే లేదు అని వచిస్తాడు. మరణం కూడా గొప్ప ఆనందకర అనుభవమేనని ప్రవరిస్తాడు. గోరు ఊడిన సుఖం లాంటిదే మరణమంటూ మృత్యువును నిర్వచిస్తాడు. ఎప్పటికైనా తప్పనప్పుడు ఆనందంగా ఆహ్వానించమని ఉద్బోధిస్తాడు. ఆ తాత్విక స్థాయిని, ఆధ్యాత్మిక భావననూ, ఆ అంతర్దర్శనాన్ని అందరూ దర్శించగలిగేలా చేసే పవిత్రక్షేత్రమే ఈ ప్యాలియేటివ్ కేర్ సెంటర్. ఓ వ్యక్తికి చివరగా దొరకాల్సిన సేవల మజిలీ... ఈ మలిమజిలీ! మేలిమి మలిమజిలీ!! బాధా విముక్తి కోసం శక్తిమేర ప్రయత్నం చివరకు తీసుకుని తీసుకుని మరణించే కొన్ని జబ్బుల చివరి దశ చాలా బాధాకరంగా ఉంటుంది. కొన్ని జబ్బులు భయంకరమైన శారీరక వేదనలను కలిగిస్తాయి. ఆ దశలో తీవ్రమైన నొప్పులతో, వికారాలతో, వాంతులు, భ్రాంతులూ, మింగలేకపోవడాలూ, విరేచనాలూ, విలాపాలూ విషాదాలూ వంటి బాధలు శరీరాన్ని వేదనకూ, మనసును ఆవేదనకూ గురిచేస్తాయి. శత్రువుకూ ఈ పరిస్థితి వద్దనే బాధనుంచి విముక్తి కోసం శక్తిమేరకు ప్రయత్నించే సిబ్బంది హాస్పిస్లో నిరంతరం పనిచేస్తుంటుంది. కలచివేసే నొప్పిని అణచివేసేందుకూ, తొలిచేసే బాధను ఆవలికి తోసేసేందుకు కృషి చేస్తుంది. ఇక్కడ బాధానివారణా నిపుణులుంటారు. వీరిని ప్యాలియేటివ్ కేర్ స్పెషలిస్టులంటారు. మందులందించే నర్సులుంటారు. సలహాలతో సాంత్వన పరిచే కౌన్సెలర్లుంటారు. స్వచ్ఛంద సేవకులుంటారు. ముక్తిని పొందాలనుకుని భక్తిని ఆశ్రయించేవారికి మనసును సేదదీర్చేలా మాట్లాడే మానవీయమూర్తులుంటారు. ఔషధాల కోసం ఫార్మసిస్టులూ, పౌష్టికాహారం కోసం అవసరమైన న్యూట్రిషనిస్టులు... ఇలా వీళ్లంతా కలిసికట్టుగా పనిచేస్తూ మన గుండెబరువులను వారు పంచుకుంటూ, మన వేదనలను ఆవలికి తోస్తూ ఉంటారు. పునరావాసం కాదది... మరణావాసం ప్రపంచంలోని మొట్టమొదటి హాస్పిస్ను పధ్నాల్గవ శతాబ్దంలో సెయింట్ జాన్స్ ఆఫ్ జెరూసెలం రోడ్స్లో ప్రారంభించారు. పతితులూ, పథికులూ, నొప్పి చేత పీడితులూ, బాధాసర్పదష్టులు అలా వెళ్తూ వెళ్తూ, మార్గమధ్యంలో మరణవేదన బారిన పడితే వారికి దిక్కెవరు... అన్న ఆలోచననుంచి పుట్టిందే ఈ మొట్టమొదటి హాస్పిస్. లాటిన్లో హాస్పెస్ అనే మాటకు అర్థం... ‘అనుకోని ఓ అపరిచిత అతిథికి అవసరమైన ఆతిథ్యమిచ్చి చివరివరకూ వేదనలనుంచీ, రోదనలనుంచీ విముక్తి కల్పించడం’. దీనికి సుదీర్ఘమైన నేపథ్యమూ ఉంది. పదకొండో శతాబ్దం నుంచే యుద్ధాల్లో గాయపడి కోలుకోలేకున్నవారూ, అంతుతెలియని జబ్బులతో తీసుకుంటున్నవారూ, మార్గమధ్యంలో రోగగ్రస్తులై దారీతెన్నూ తెలియని ప్రస్థాన పథికులూ... ఆ ప్రవాసాల్లో చివరి వరకూ నివాసముండి, ప్రశాంతంగా కనుమూయడానికి అవసరమైన కేంద్రాలుండేవి. ప్రధానంగా ఇవి సుదీర్ఘప్రయాణం చేసే యాత్రికులకోసం ఉద్దేశించినవి. ఇక ఎప్పటికీ జబ్బు తగ్గదని తెలిసిపోయాక, తేలిపోయాక వీరికి కలిగిన రుగ్మతనూ, రుజాగ్రస్త అవస్తను ‘టెర్మినల్ ఇల్నెస్’ అనేవారు. ఇల్లేలేనివారి ఇల్నెస్ను, వారి వెల్నెస్ను పట్టించుకునే వారెవరు? వారికోసమూ ఏదైనా ఏర్పాటు ఉండాలనే మానవీయమూర్తుల తాత్వికత నుంచి ఆవిర్భవించిన చికిత్సా ప్రక్రియ ఇది. ప్రేమను పంచుతూ రోగికి చివరి వరకూ చేసే సేవ పేరే ‘ప్యాలియేటివ్ కేర్’! ఆ కేర్ను అందిస్తూ చివరివరకూ ఉంచే మరణావాసమే ‘హాస్పిస్’. మరి ఆ సామాజిక బలం దొరుకుతోందా? దురదృష్టవశాత్తూ మరణమే శరణ్యమైన రోగులకు సామాజిక స్థ్యైర్యాన్ని అందించే పరిస్థితి భారత్లో లేదు. మనదేశంలో మరణాన్ని ఒక కీడుగా పరిగణిస్తారు. ఒక చెడుగా చూస్తారు. అందుకే తప్పనిసరిగా మరణించే రోగిని చేర్చుకోడానికి ఆసుపత్రులూ అంత సుముఖంగా ఉండవు. అలాంటి వారికి అద్దెకు ఇల్లు ఇవ్వడానికి యజమానులూ సిద్ధంగా ఉండరు. మన దేశంలోని అత్యంత దురదృష్టకరమైన పరిస్థితి ఏమిటంటే... క్యాన్సర్ నాలుగో దశతో ఇక తప్పనిసరిగా మరణిస్తాడనే రోగి ఉన్న కుటుంబానికి ఇల్లే అద్దెకు ఇవ్వరు. తమ ఇంటిలో ఆ రోగి మరణించడాన్ని అంగీకరించరు. ఇక ఇల్లే ఇవ్వని వారు ఇల్నెస్ గురించీ, వారి వెల్నెస్ గురించీ ఆలోచిస్తారనుకోవడం అత్యాశే. అందుకే ఈ తరహా రోగులకు అవసరమైన సామాజిక స్థైర్యం (సోషల్ సపోర్ట్) అందడం లేదు. అలాంటి వారికి ఇప్పుడు ‘హాస్పిస్’లే ఒక వరం. కానీ మరో దురదృష్టపరిస్థితి ఏమిటంటే... భారతదేశంలో ప్రతిష్ఠాత్మకమైన హాస్పిటల్కు అనుబంధంగానైనా ఒక హాస్పిస్ కూడా లేదు. మన రాష్ట్రంలోనూ ఒక్క హైదరాబాద్లో తప్ప ఇంకెక్కడా ఈ వసతి లేదు. స్పర్శ్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలోనే కొందరు మానవీయ వైద్య నిపుణుల చొరవతో ఈ కార్యక్రమం సాగుతోంది. అలాంటి రోగుల అవసరాలను తీరుస్తోంది. ఎదురుగా ఎన్నెన్నో సవాళ్లు... ఈ తరహా చికిత్స సౌకర్యాల ఏర్పాటుకు ఎన్నో సవాళ్లు అడ్డంకిగా ఉంటాయి. ముఖ్యంగా వసతి. ఒకచోట అందరూ చనిపోయేవారే ఉంటారని తెలిశాక అలాంటి ఆవాసాన్ని తమ పొరుగునే ఉండాలని కోరుకునేంత మానవీయ, మాననీయ మూర్తులెవరు? ఇక చికిత్స ఎంతగా చేసినా ఫలితం ఉండదు. చేయాల్సిన చికిత్సల్లా లక్షణాలను బట్టి కనిపించే బాధలకు లేపనం పూయడం లాంటిదే. నొప్పికి మందు వేయడం లాంటిదే. తాత్కాలికంగా ఉపశమనం కలిగించడం లాంటిదే. అలాంటప్పుడు రోగికీ ఆ విషయం తెలిశాక, బంధువలకూ సంగతి అర్థమయ్యాక తగ్గని రోగం కోసం డాక్టర్కు ఫీజు చెల్లించాలంటే ఇష్టపడేవారెవరు? అది సరే... అన్నీ తెలిసి ఫీజు అడగాలంటే సదరు వైద్యుడికి మాత్రం మొహమాటం ఉండనే ఉంటుంది కదా. కాబట్టి ఫీజు వసూలుకు అవకాశం లేదు. ఒకవేళ అడిగినా అది మానవత్వం కాదు. కాబట్టి ఈ తరహా ‘ప్రాక్టీస్’ను ఎంచుకునే అవకాశమే తక్కువ. అందుకే భారత్లో అత్యున్నత స్థాయిలో ‘ప్యాలియేటివ్ కేర్’ కోర్సే లేదు. మన రాష్ట్రంలోనూ ఈ తరహా అత్యున్నత స్థాయి విద్య చదివిన వారూ పెద్దగా లేరు. దేశవ్యాప్తంగానూ ఒకరిద్దరే ఈ తరహా అత్యున్నత స్థాయి విద్యను అభ్యసించిన వారున్నారు. మరి సమాజానికి ఈ తరహా సేవలూ కావాలి కదా. అందుకే చొరవ తీసుకని కొందరు మానవత్వంతో తమకు చేతనైన పరిధిలో ఇలాంటి సేవ అందిస్తున్నారు. ప్యాలియేటివ్ కేర్లోని ప్రధాన లక్ష్యాలు రోగికి నొప్పి నుంచి లక్షణాల బాధలనుంచి విముక్తి కలిగించడం. మరణం తథ్యమని తెలిశాక ఆ సమయం వరకూ సాధ్యమైనంత మేరకు మంచి, సాధారణ జీవితాన్నే అందించడం. సామాజిక, ఆధ్యాత్మిక, మనశ్శాంతిని ఇచ్చే సాంత్వన ప్రక్రియలను అనుసరించడం. సంఘపరంగా అవసరమైన స్థైర్యాన్ని అందించడం. మరణం వరకూ మామూలుగానే ఉండేలా, తన దైనందిన పనులన్నీ ఇదివరకులాగే చురుగ్గా చేసుకునేలా రోగిని ప్రోత్సహించడం. అలాంటి స్ఫూర్తిని రోగిలో రగిలించడం. రోగి కుటుంబాన్ని సైతం అన్ని విధాలా మానసికంగా సిద్ధం చేసి, వారినీ మామూలుగా ఉంచేందుకు ప్రయత్నించడం, వారిలోని బాధను తొలగించడానికి కృషి చేయడం. పై విషయాలన్నీ జరిగేందుకు అవసరమైన వ్యక్తులతో ఒక సమూహం (టీమ్)గా ఏర్పడి అన్ని విషయాల్లోనూ రోగికీ, అతడి బంధువులకూ ఆ బృందం ఒక భరోసాగా నిలవడం. చేయూతనివ్వడం. రోగి అనునిత్యం సానుకూల దృక్పథంతోనూ, మంచి నాణ్యమైన జీవనప్రమాణాలతోనూ జీవించేలా చేయడం. హైదరాబాద్లోని ‘స్పర్శ్’ స్వచ్ఛందంగా... వసూళ్లకు అవకాశం లేని ఈ రంగంలోకి ప్రవేశించి, సమాజానికి తమ వంతు సేవగా తమ భాగస్వామ్యాన్ని అందజేస్తున్నారు కొందరు డాక్టర్లు. వారిలో ప్రధానమైన వారు డాక్టర్ ఫణిశ్రీ. ఆమె ఈ సంస్థకు మెడికల్ డెరైక్టర్గా పనిచేస్తున్నారు. పైగా ఆమె ప్యాలియేటివ్ కేర్లో శిక్షణపొందిన నిపుణురాలు. అలాగే డాక్టర్ సుబ్రహ్మణ్యం కూడా ఈ స్పర్శ్ సంస్థకు అధ్యక్షుడిగా, ప్రధాన ట్రస్టీగా, కోశాధికారిగా సేవలందిస్తున్నారు. ఇక మరికొందరు స్వచ్ఛంద సేవకులు సైతం ఈ కృషిలో భాగస్వామ్యం వహిస్తున్నారు. హాస్పిస్ సౌకర్యాన్ని తమ సేవామందిరం బయటకూడా అందిస్తున్నారు. అంటే ఇండ్లకు వెళ్లీ కడగండ్లు తీర్చే సేవా చేస్తున్నారు. వీరు తమ సేవలన్నింటినీ ఉచితంగా అందజేస్తున్నారు. ఇందుకుగాను ఎలాంటి డబ్బునూ వీళ్లు రోగుల నుంచి లేదా వారి బంధువులు, సన్నిహితుల నుంచి స్వీకరించరు. కానీ ఈ తరహా సేవలకు, మందులకూ పెద్ద ఎత్తున నిధులు అవసరం. అందుకోసం ఒకవేళ రోగి బంధువులూ, సన్నిహితులూ తమ వంతు విరాళాలు అందించదలచుకుంటే తమ స్పర్శ్ సంస్థకు ఇవ్వాల్సిందిగా కోరతారు. రోగికి కావాల్సింది ఆత్మీయ స్పర్శ: కాబట్టే ఈ సంస్థకు విజిటింగ్ అవర్స్ అంటూ ఉండవు. సందర్శకులెప్పుడైనా రావచ్చు. తుదిఘడియల్లో తోడుగా ఉంటూ... తామున్నామన్న భరోసా ఇస్తూ... చివరి వరకూ రోగి వెంటే నడుస్తూ, వారితో కలిసి చదువుతూ, ఆడుతూ, పాడుతూ, ఆనందింపజేస్తూ తమ స్పర్శను వారికి అందించవచ్చు. హైదరాబాద్లో స్పర్శ్ చిరునామా స్పర్శ్ హాస్పిస్,సెంటర్ ఫర్ ప్యాలియేటివ్ కేర్, ప్లాట్ నెం. 85, (8-2-703/2/1), రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్ - 500 034. ఫోన్: 040 2338 4039, 94904 48222. ఈ-మెయిల్ : hospicesparsh@gmail.com వెబ్సైట్: www.sparshhospice.org - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి -
సామాజిక పరిణీత
సేవ ఇటీవల ప్రకటించిన జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ‘ఇష్క్జాదే’ చిత్రానికిగాను ‘ప్రత్యేక ప్రశంస’ అందుకుంది నటి పరిణీతి చోప్రా. సెలబ్రిటీ మేనేజర్ నుంచి సెలబ్రిటీగా మారింది. ఒకప్పుడు రాణీ ముఖర్జీ దగ్గర మేనేజర్గా పనిచేసేది. రాణితో పాటు సెట్స్కు వెళ్లేది. ‘‘మీ కజిన్ ప్రియాంకా చోప్రాలా నువ్వు కూడా సినిమాల్లో నటించ వచ్చు కదా?’’ అని అడిగింది రాణీముఖర్జీ ఒకరోజు. తనకు ఇష్టం లేదని చెప్పింది పరిణీతి. ఇష్టం లేదంటే మాత్రం? కల్యాణం వచ్చినా, కక్కొచ్చినా... సినిమాల్లో ఛాన్సు వచ్చినా... ఆగదు కదా! స్క్రీన్టెస్ట్ అవసరం లేకుండానే యశ్రాజ్ ఫిల్మ్లో అవకాశం సంపాదించిది. ‘బిగ్ బి’లాంటి వారి చేత బిగ్ ప్రశంసలు అందుకుంది. ‘‘గ్లామర్ డాల్లా లేదు. పక్కింటి అమ్మాయిలా సహజ సౌందర్యంతో ఉంది’’ అని విమర్శకుల ప్రశంసలు అందుకొంది. నటన సంగతి పక్కనబెడితే...సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం అంటే పరిణీతికి ఇష్టం. షబానా ఆజ్మీ ‘మిజ్వాన్ వెల్ఫేర్ సొసైటీ’కి మద్దతుగా ‘విల్స్ లైఫ్స్టయిల్ ఇండియా ఫ్యాషన్ వీక్’లో ర్యాంప్ వాక్ చేసింది. ‘‘నా ప్రాధాన్యత ర్యాంప్ వాక్ కాదు. మిజ్వాన్కు నా వంతుగా సహాయపడడానికి చేశాను’’ అంటున్న పరిణీతి టీవిలో పర్యావరణ సంబంధమైన కార్యక్రమాల్లోనూ పాల్గొంటుంది. పర్యావరణ స్పృహను పెంచడానికి, విద్యుత్ సౌకర్యానికి నోచుకొని గ్రామాల్లో వెలుగులు నింపడానికి రకరకాల స్వచ్ఛందసంస్థలతో కలిసిపనిచేస్తోంది. ‘‘హీరోతో పార్కుల వెంట తిరుగుతూ పాటలు పాడే హీరోయిన్ పాత్రలు నాకు ఇష్టం లేదు’’ అని కెరీర్ మొదట్లో ప్రకటించిన పరిణీతి, కెరీర్ ఊపందుకున్నాక కూడా... వీలు చేసుకొని రకరకాల సామాజికసేవా కార్యక్రమాలలో పాల్గొంటోంది. మెచ్చదగ్గ అమ్మాయే! -
టెన్త్ సైన్స్, సోషల్ పరీక్ష 11 గంటలకు
హైదరాబాద్: పదో తరగతి సామాన్య శాస్త్రం(సైన్స్), సాంఘిక శాస్త్రం(సోషల్) పరీక్ష జరిగే వేళలను సవరించారు. సైన్స్, సోషల్ పరీక్షలను ఉదయం 9.30 గంటల నుంచి కాకుండా 11 గంటల నుంచి నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ మన్మథరెడ్డి బుధవారం తెలిపారు. గతంలో సైన్స్ పేపర్-1, సోషల్ పేపర్-1 పరీక్షలనే ఉదయం 11 గంటల నుంచి జరపాలని నిర్ణయించిన విషయం తెలిసింది. అయితే కొన్ని పరీక్షలను 9.30 నుంచి మరికొన్ని పరీక్షలను 11 గంటల నుంచి ప్రారంభిస్తే విద్యార్థులు ఆయోమయానికి గురయ్యే ప్రమాదం ఉందని అధికారులు భావించారు. ఈ నేపథ్యంలో 7నుంచి జరిగే అన్ని పరీక్షలు(సైన్స్ రెండు పేపర్లు, సోషల్ రెండు పేపర్లు) ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు నిర్వహించాలని తాజాగా నిర్ణయించారు. 3, 4 తేదీల్లో మేథమేటిక్స్ పేపర్-1, మేథమేటిక్స్ పేపర్-2 పరీక్షలు మాత్రం ఉదయం 9.30 గంటలకే ప్రారంభం అవుతాయి -
బిఫోర్ దే పాస్...
ఇండియా, పాకిస్థాన్ల మధ్య చిన్న చిన్న గ్రామాలలో నివసించే ఆదివాసీలు ద్రోక్పాస్ల గురించి పెద్ద విషయాలే చెప్పు కోవచ్చు. విషాదమేమిటంటే ఇప్పుడు వారి జనాభా రెండు వేల అయిదు వందలు మాత్రమే! ద్రోక్పాస్లు మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా... ఎన్నో ఆదివాసుల తెగలు ప్రమాదం అంచున ఉన్నాయి. తన మిత్రుడు ఒక రోజు, ప్రమాదకర స్థితిలో ఉన్న ఆదివాసి తెగల గురించి చెప్పినప్పుడు బ్రిటిష్ ఫొటోగ్రాఫర్ జిమ్మి నెల్సన్ ఆశ్చర్యపడ్డాడు. ఆ ఆశ్చర్యానికి దుఃఖం కూడా తోడైంది. ‘బిఫోర్ దే పాస్ అవే’ అనుకున్నాడేమో భుజానికి కెమెరా తగిలించుకొని ప్రపంచం మొత్తం తిరిగాడు. అది మామూలు కెమెరా కాదు...యాభై ఏళ్ల ‘ప్లేట్ ఫిల్మ్ కెమెరా’ అద్భుతమైన స్పష్టత దాని సొంతం. ‘‘వారి దగ్గర డబ్బులేక పోవచ్చుగానీ చాలా సంపన్నులు. ఈ విషయాన్ని ఆధునిక ప్రపంచానికి చాటడానికి బిఫోర్ దే పాస్ అవే... ప్రాజెక్ట్ చేపట్టాను. డబ్బుతో కొలవలేని గొప్ప సంస్కృతి వారి సొంతం’’ అంటాడు నెల్సన్. ‘బిఫోర్ దే పాస్ అవే’ ఫొటో సిరీస్లో ఫొటోలు మాత్రమే కాదు...కన్నీటి తడి కూడా కనిపిస్తుంది. ఆర్ట్ ఎటాక్! సమ్థింగ్ స్పెషల్ విక్టర్ గీసే బొమ్మలు ఆహా అనిపించడంతో పాటు నోరూరిస్తాయి. అరవై అయిదు సంవత్సరాల ఈ బ్రెజిల్ ఆర్టిస్ట్ నట్స్, గ్రేప్స్, బేబికార్న్...మొదలైన వాటిని ఉపయోగించి బొమ్మలు గీస్తుంటాడు. తన కళకు ప్రత్యామ్నాయ కళ అని కూడా పేరు పెట్టుకున్నాడు. కొందరేమో ‘ఆర్ట్ ఎటాక్’ అని సరదాగా పిలుస్తారు. గతంలో ఆర్ట్ డెరైక్టర్గా పని చేసిన విక్టర్ ‘‘నా బొమ్మలు పిల్లలతో పాటు పెద్దలను అలరిస్తున్నాయి’’ అని మురిసిపోతు న్నాడు. బిస్కట్లతో రూపొందించిన బొమ్మలకైతే భలే క్రేజు. ఈ బొమ్మలను తన ఫేస్బుక్ పేజీలో పెట్టినప్పుడు మంచి స్పందన వచ్చింది. కొందరు వీటి నుంచి స్ఫూర్తి పొంది తాము కూడా తయారుచేయడం మొదలెట్టారు. అందుబాటులో ఉండే పదా ర్థాలు, వస్తువులను ఉపయోగించి బొమ్మలు గీయడానికి ప్రాధా న్యత ఇస్తాడు విక్టర్. డిష్ క్లాత్స్, ఫ్లోర్ క్లాత్స్...ఇలా ఏవైనా సరే. సాధారణ వస్తువులతో అసాధారణమైన చిత్రాలను సృష్టించడం తన పని అని చెబుతాడు. ‘‘మనసు బాగ లేనప్పుడు... బొమ్మలు గీస్తాను. వాటిని చూస్తే కొత్త ఉత్సాహం వస్తుంది. నా ఆర్ట్ నాకు థెరపీలాగా పని చేస్తుంది’’ అంటున్నాడు విక్టర్. యుద్ధంలో గెలిస్తేనే... లైఫ్ బుక్- కత్రినా కైఫ్ ప్రతి రోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోకపోతే ఆరోజు వృథా అయిపోయినట్లు అనిపిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోకపోతే సరికొత్తగా ఏమీ చేయలేం. నేర్చుకోవడం, నేర్చుకున్న విషయాలను పక్కనపెట్టడం కాకుండా వాటిని తగిన సందర్భాలలో అన్వయించుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను. ఒక కెరీర్ను ఎంచుకున్నామంటే... నిరంతరం మనతో మనం యుద్ధం చేయడమే. ప్రతికూలత అనే శత్రువులను ఆ యుద్ధంలో సంహరించడం మీదే కెరీర్లో మన విజయం ఆధారపడి ఉంటుంది. ఈ దేశంలో పెరగలేదు, హిందీ రాదు...ఇవి నాకు మైనస్ పాయింట్లుగా నిలిచాయి. ఈ దేశంలో మళ్లీ పెరిగే అవకాశం లేకపోవచ్చుగానీ హిందీ నేర్చుకునే అవకాశం మాత్రం ఉందిగా. ఈ పని కోసం కష్టపడ్డాను. విమర్శ అనేది బాధ పెట్టవచ్చుగాక...కానీ దాన్ని ఎప్పుడూ సీరియస్గా తీసుకోను. ఒక వ్యక్తి మరో వ్యక్తి గురించి మంచిగా మాట్లాడడం అనేది అరుదు. ‘ఇది లోకనైజం’ అని అన్ని విమర్శలనూ ఒకే గాటన కట్టలేం. కొన్ని విమర్శలు మన విజయానికి మెట్లలాంటివి. కుండల్లో గుర్రాలు పరుగెత్తిస్తాడు! మన జాతీయాలు ‘టీలు తాగారా... టిఫిన్లు చేశారా?’ ‘అరే... ఎక్కడ చచ్చార్రా... ఇక్కడ ఒక్కడూ లేడూ’ ‘అది ఇలా కాదు... ఇలా చేయండి’ ఇలాంటి డైలాగులు మన నిత్యజీవితంలో ఎన్నోచోట్ల వినబడుతుంటాయి. హడావిడి ఎక్కువ చేసి, పనేమీ చేయని వాళ్లు మనకు అక్కడక్కడా తారసపడుతూనే ఉంటారు. ఇలాంటి వాళ్ల కోసమే పుట్టిన జాతీయం- ‘కుండల్లో గుర్రాలు’ తాము ఏమాత్రం పని చేయకుండా ఇతరులను తెగ హడావిడి పెట్టేవాళ్లను ‘‘అబ్బో... కుండల్లో గుర్రాలు పరుగెత్తిస్తున్నాడు’’ అనో ‘‘ఏమీ చేయలేడు...కుండల్లో గుర్రాలు పరుగెత్తించడంలో మాత్రం సిద్ధహస్తుడు’’ అంటుంటారు. గుర్రాలను ఎక్కడ పరుగెత్తిస్తారు? రోడ్డు మీదో, ఊరి బయటో. మరి కుండల్లో పరుగెత్తిస్తారా ఎవరైనా! వంట గురించి ఏమీ తెలియకపోయినా వంటగదిలో దూరి ‘అలా చేయాలి ఇలా చేయాలి’ అని ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ల విషయంలోనూ ఇది ఉపయోగిస్తారు. -
సాంఘిక శాస్త్రం
సంపన్నమైన భారత భౌగోళిక నైసర్గిక వ్యవస్థకు మూలం, బలం ఇక్కడి శీతోష్ణస్థితి పరిస్థితులు. మానవ మనుగడకు కావాల్సిన అన్ని అవసరాలు తీర్చడంలో ప్రముఖ పాత్ర వహించే వాతావరణ స్థితిగతులపై శీతోష్ణస్థితి ప్రభావం అధికంగా ఉంటుంది. విశాల భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో రకరకాల ఉష్ణోగ్రతలు, వర్షపాత విస్తరణలు నెలకొని ఉన్నాయి. అవి కూడా స్థిరంగా ఉండకుండా మార్పులకు లోనవుతున్నాయి. భారతదేశ శీతోష్ణస్థితి మన దేశ శీతోష్ణస్థితిని ‘ఉష్ణమండల రుతుపవన శీతోష్ణస్థితి’గా పిలుస్తారు. ‘రుతువు’ను ఆంగ్లంలో ‘మాన్సూన్’ అంటారు. ఇది ‘మౌసమ్’ అనే అరబిక్ పదం నుంచి వచ్చింది. దేశం మొత్తం మీద ఒకే రకమైన రుతుపవన శీతోష్ణస్థితి ఉన్నప్పటికీ ఉష్ణోగ్రత, వర్షపాతం, పవనాలు, ఆర్ధ్రత, పీడన మేఖలలు విభిన్నంగా ఉన్నాయి. రాజస్థాన్లో ఉష్ణోగ్రత అత్యధికంగా 50C (జూన్లో), కార్గిల్ సమీపంలోని డ్రాస్ వద్ద అత్యల్ప ఉష్ణోగ్రత-40C (డిసెంబర్లో) నమోదైంది. మాసిన్రామ్ (మేఘాలయ)లో అత్యధిక వర్షపాతం 1141 సెం.మీ. అయితే జైసల్మీర్ (రాజస్థాన్)లో అత్యల్ప వర్షపాతం 12 సెం.మీ. నమోదవుతుంది. మన దేశ వాతావరణాన్ని నాలుగు రుతువులుగా (కాలాలుగా) విభజించారు. అవి.. 1. శీతాకాలం 2. వేసవికాలం 3. నైరుతి రుతుపవన కాలం 4. ఈశాన్య రుతుపవన కాలం రుతుపవనాలు ఉష్ణోగ్రతల్లోని వైవిధ్యం, అంతర ఆయనరేఖా అభిసరణ స్థానం, ట్రోపో ఆవరణం పైభాగంలో వాయుప్రసరణం లాంటి అనేక కారణాల వల్ల ‘రుతుపవనాలు’ ఏర్పడుతున్నాయి. భారత ఉపఖండం, హిందూ మహాసముద్రాల మధ్య రుతువులను (కాలం) అనుసరించి పవనాలు వీయడాన్ని, వెనుకకు మరలడాన్ని ‘రుతుపవనాలు’ అంటారు. ఈ పవనాల దిశను బట్టి రెండు రకాల రుతుపవన కాలాలుగా గుర్తించారు. అవి... నైరుతి రుతుపవనాలు: (జూన్ మధ్య నుంచి సెప్టెంబర్ వరకు వీస్తాయి) వేసవిలో భారత భూభాగంపై తీవ్రమైన అల్ప పీడన వ్యవస్థ ఏర్పడుతుంది. అదే సమయంలో సముద్ర ప్రాంతంలో అధిక పీడనం ఏర్పడుతుంది. ఈ అధిక పీడన ప్రాంతం నుంచి అల్ప పీడన ప్రాంతం వైపు వీచే గాలులను నైరుతి రుతుపవనాలుగా పిలుస్తారు. ఇవి భారతదేశ నైరుతి దిశగా మొదట కేరళ తీరంలో ప్రవేశిస్తాయి. మలబార్ తీరంలో (కేరళ) అధిక వర్షాలకు ఇవే కారణం. ఈశాన్య రుతుపవనాలు: (సెప్టెంబరు మధ్య నుంచి డిసెంబరు మధ్య వరకు వీస్తాయి) శీతాకాలంలో సముద్ర భాగంపై అల్పపీడనం ఏర్పడటం వల్ల ఈ పవనాలు భూభాగం నుంచి సముద్రాల వైపు ఈశాన్య దిశ నుంచి వీస్తాయి. నైరుతి రుతుపవనాలే ఉత్తర భారతదేశంలో తిరోగమనం చెంది ఈశాన్య రుతుపవనాలుగా మారుతాయి. అందుకే వీటిని తిరోగమన రుతుపవనాలుగా కూడా పిలుస్తారు. ఇవి మొదట పంజాబ్లో ప్రవేశిస్తాయి. ఈ కాలంలో తుఫాన్లు అధికంగా వస్తాయి. రుతుపవనారంభం వేసవికాలంలో భారత భూభాగంపై ఏర్పడిన అల్పపీడన వ్యవస్థ, భూమధ్యరేఖా ప్రాంతపు తేమతో కూడిన పవనాలను హిందూ మహాసముద్రం ఆకర్షిస్తుంది. ఈ సముద్ర ప్రభావిత గాలుల వల్ల ఉరుములు, మెరుపులు సంభవించిన తర్వాత అకస్మాత్తుగా వర్షం కురుస్తుంది. దీన్నే ‘రుతుపవనారంభం’ అంటారు. ఇది మొదటగా కేరళ తీరంలో ప్రారంభ మవుతుంది. వర్షపాత విస్తరణ- సమస్యలు దేశమంతా (తమిళనాడు తీరం మినహా) నైరుతి రుతుపవనాల వల్లే అధిక వర్షం కురుస్తుంది. తమిళనాడు తీరంలో మాత్రం ఈశాన్య రుతుపవనాల వల్ల అధిక వర్షం పడుతుంది. దేశంలోని వర్షపాత విస్తరణను గమనిస్తే పశ్చిమబెంగాల్, ఒడిశా తీరాల నుంచి పశ్చిమంగా, వాయవ్యంగా పోయేకొద్దీ వర్షపాతం తగ్గుతుంది. దక్షిణాన పశ్చిమ, తూర్పు తీరాల నుంచి దక్కన్ పీఠభూమి అంతర్భాగాల వైపు వెళ్తూ ఉంటే వర్షపాతం తగ్గుతుంది. వర్షపాత విస్తరణలో ఈ విధమైన అనిశ్చితి, క్రమరహిత, అధిక వైవిధ్యత, అసమానతల వల్ల వ్యవసాయాభివృద్ధి కుంటుపడుతోంది. వర్షపాతంలోని తీవ్రతల వల్ల అతివృష్టి (వరదలు), అనావృష్టి (కరువులు) ఏర్పడుతున్నాయి. ఈ కారణాల వల్లే ‘భారతీయ వ్యవసాయం అంటే రుతుపవనాలతో జూదం’ అనే నానుడి వచ్చింది. కరువు - తీవ్రమైన కరువు భారత వాతావరణ విభాగం ప్రకారం సామాన్య వర్షపాతంలో 75 శాతం కంటే తక్కువ కురిసిన స్థితిని ‘కరువు’ అనీ, 50 శాతం కంటే తక్కువ వర్షపాతం ఉండే స్థితిని ‘తీవ్రమైన కరువు’ అని పిలుస్తారు. కరువు నష్టాల నియంత్రణకు ప్రభుత్వం ‘కరువుకు గురయ్యే ప్రాంతాల ప్రణాళిక’ (drought prone area plan) ను 1973లో రూపొందించింది. -
సాంఘిక శాస్త్రం
జాతీయవాద ఉద్యమాలు ఆధునిక ప్రపంచ యుగ ప్రారంభంలో ఆర్థికంగా, సైనికంగా బలంగా మారిన యూరప్లోని ప్రధాన దేశాల మధ్య విద్వేషాలు పెరిగాయి. ఒక జాతి ప్రజలందరూ ఒకే దేశ భౌగోళిక ప్రాంత పాలనలోనే ఉండాలనే వాదనతో పొరుగు దేశాలతో యుద్ధానికి కాలుదువ్వాయి. ఈ జాతీయవాద ఉద్యమాలు మొదట ఫ్రాన్సలో ప్రారంభమయ్యాయి. వీటికి ఆద్యుడు నెపోలియన్. నెపోలియన్ ఆగడాలను నిలువరించడానికి మిగతా యూరప్ దేశాలన్నీ ఏకమై ఆయనను ఓడించాయి. ఈ దేశాలన్నీ వియన్నా సమావేశాన్ని (క్రీ.శ. 1815) నిర్వహించాయి. ఫ్రెంచి ప్రజల జాతీయ విప్లవ భావాలను అణగదొక్కాయి. పర్యావసానంగా 1830, 1848లలో ఫ్రెంచి తిరుగుబాట్లు తలెత్తాయి. జర్మనీ, ఇటలీల్లోనూ ఏకీకరణ ఉద్యమాలు చెలరేగాయి. సామ్యవాద ఉద్యమాలు కూడా ఆరంభమై చివరికి ఫ్రాన్సలోనే ప్రపంచంలో మొట్టమొదటి క మ్యూనిస్టు ప్రభుత్వం (క్రీ.శ. 1871) ఏర్పడింది. ప్రధానంగా చదవాల్సిన అంశాలు : ఫ్రాన్సలో 1848 తిరుగుబాటు చెలరేగడానికి కారణాలు, సార్డీనియా నాయకత్వం కింద ఇటలీ ఏ విధంగా ఏకీకరణ సాధించింది? జర్మనీ ఏకీకరణలో బిస్మార్క నిర్వహించిన పాత్ర గురించి విద్యార్థులు బాగా చదవాలి. పై అంశాల నుంచి 4 మార్కుల ప్రశ్నను అడిగే వీలుంది. అలాగే రెడ్షర్ట్స, కార్బోనరి, యంగ్ ఇటలీల నేపథ్యం, వాటి లక్ష్యం, వాటి నాయకుల గురించి విపులంగా తెలుసుకోవాలి. కార్లమార్క్స, కౌంట్కవూర్, గారీబాల్డీ భావాలు, అవి వారి లక్ష్యాలను చేరుకోవడానికి ఎలా తోడ్పడ్డాయో విశ్లేషించుకోవాలి. వీటి నుంచి 2 మార్కుల ప్రశ్న లేదా, 1 మార్కు ప్రశ్న వచ్చే ఆస్కారం ఉంది. ప్రపంచ రాజకీయ పటాన్ని ముందుంచుకొని ఆయాదేశాల భౌగోళిక చిత్రాన్ని గమనిస్తూ అధ్యయనం చేస్తే మ్యాప్ పాయింటింగ్కు ఉపయోగపడుతుంది. ఈ చాప్టర్ నుంచి ఒక నాలుగు మార్కుల ప్రశ్న, లేదా ఒక రెండు మార్కుల ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. వాటితోపాటు ఒక 1 మార్కు ప్రశ్న, ఆబ్జెక్టివ్ ప్రశ్నలు రెండు (2ణ బీ = 1 మార్కు) రావచ్చు. అంటే పాఠ్యాంశం నుంచి విద్యార్థులు మొత్తం 4 నుంచి 6 మార్కులు పొందే అవకాశముంది. పాఠ్యాంశంలోని ప్రధానాంశాలు {ఫాన్సలోని కోర్సికా దీవిలో జన్మించిన ‘నెపోలియన్ బోనపార్టీ’ ఆధునిక ప్రపంచ చరిత్రలో ప్రముఖ స్థానాన్ని పొందాడు. మంచి విద్యావంతుడైన నెపోలియన్పై ‘రూసో’ ప్రభావం చాలా ఉంది. క్రీ.శ. 1785లో ఫ్రెంచి సైన్యంలో చేరిన నెపోలియన్ వివిధ హోదాల్లో అనేక యుద్ధాల్లో ముఖ్య పాత్ర పోషించి, ఫ్రాన్స విజయ పరంపరను కొనసాగించాడు. క్రీ.శ. 1804లో ఫ్రాన్స చక్రవర్తిగా ప్రకటించుకున్న నెపోలియన్ ‘నేలపై పడి ఉన్న ఫ్రాన్స కిరీటాన్ని నేను నా కత్తితో పెకైత్తాను’ అని సమర్థించుకున్నాడు. అనేక దురాక్రమణపూరిత యుద్ధాల ద్వారా మిగతా యూరప్ దేశాలను వణికించాడు. ‘ఖండాంతర వ్యవస్థ’ను ప్రవేశపెట్టి ఇంగ్లండ్ వర్తక వాణిజ్యాలను ధ్వంసం చేశాడు. నెపోలియన్ ఆగడాలను నిలువరించాలని నిశ్చయించుకున్న యూరప్ దేశాలు ‘మెటర్నిక్’ (ఆస్ట్రియా చాన్స్లర్) నాయకత్వం లో ఉమ్మడి సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. క్రీ.శ. 1813 లీప్జిగ్ యుద్ధం (బ్యాటిల్ ఆఫ్ నేషన్స), క్రీ.శ. 1815 వాటర్లూ యుద్ధాల్లో నెపోలియన్ను ఓడించాయి. మెటర్నిక్ కన్వీనర్గా యూరప్ దేశాల కూటమి క్రీ.శ. 1815లో ఆస్ట్రియా రాజధాని ‘వియన్నా’లో సమావేశమైంది. ఈ సమావేశంలో వివిధ దేశాల జాతీయ విప్లవ భావాలను విస్మరించడం వల్ల యూరప్లో జాతీయవాద ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగానే క్రీ.శ. 1830లో ఫ్రెంచి విప్లవం వచ్చింది. ఇది ఇతర యూ రప్ దేశాలకు మార్గదర్శకమైంది. అందువల్ల ‘ఫ్రాన్స తుమ్మినప్పుడల్లా యూరప్కు జలుబు చేస్తుందని’ చెబుతారు. ఫ్రాన్సలో క్రీ.శ. 1848లో జరిగిన మరో తిరుగుబాటులో ‘లూయి ఫిలిప్’ రాజరిక పాలన రద్దయి, లూయి బ్లాంక్ ఆధ్వర్య ంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. ఈ పరిణామం ఇటలీ, జర్మనీల్లో జాతీయ చైతన్యం ఉద్భవించడానికి తోడ్పడింది. ప్రష్యా ప్రధానమంత్రి ‘ఓట్టోవోన్ బిస్మార్క’ తన క్రూరమైన బలప్రయోగ విధానంతో జర్మనీ ఏకీకరణను క్రీ.శ. 1871లో సాధించాడు. జోసెఫ్ మజ్జిని, కౌంట్కవూర్, గారిబాల్డీ, విక్టర్ ఎమ్మాన్యూల్-2 కృషి ఫలితంగా క్రీ.శ. 1870లో ఇటలీ ఏకీకరణ సాధ్యమైంది. యూరప్ సమాజంలో ఆర్థికపరమైన అసమానతలను నిర్మూలించడానికి 19వ శతాబ్దంలో సామ్యవాద ఉద్యమాలు ఆవిర్భవించాయి. వీటిలో చురుకైన పాత్ర పోషించినవారు... రాబర్ట ఓవెన్, సెయింట్ సైమన్, లూయీ బ్లాంక్, కార్లమార్క్స. క్రీ.శ. 1848 తిరుగుబాటు తర్వాత ఫ్రాన్స లో ఏర్పడిన రిపబ్లిక్ ప్రభుత్వ విధానాలను సామ్యవాదులు విభేదించారు. రిపబ్లికన్లు, సామ్యవాదులు ఒక అంగీకారానికి వచ్చి నెపోలియన్-3 నాయకత్వంలో రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. తర్వాత నెపోలియన్-3 రాజరికం వైపు మరలి క్రీ.శ. 1852లో చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. ఈయన చేసిన అనేక యుద్ధాల వల్ల ఫ్రాన్స ఆర్థిక వ్యవస్థ పతనమైంది. సామ్యవాదుల నాయకత్వంలో ప్రజలు తిరుగుబాటు చేసి క్రీ.శ. 1871లో పారిస్లో ‘కమ్యూన్’ ప్రభుత్వాన్ని నెలకొల్పారు. ప్రపంచంలో ఏర్పాటైన మొదటి కమ్యూనిస్టు ప్రభుత్వం ఇదే. కాని దీన్ని ఫ్రెంచ్ సైన్యం తీవ్రంగా అణచివేసింది. -
సోషల్
ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని ఇంగ్లిష్లో ‘డెమోక్రసీ’ అంటారు. ఈ పదానికి మూలం గ్రీకుభాషలోని ‘డెమోస్’, ‘క్రేషియా’ అనే పదాలు. డెమోస్ అంటే ప్రజలు, క్రేషియా అంటే పరిపాలన, డెమోక్రసీ అంటే ప్రజాపాలన. {పజలందరి చేతిలో సార్వభౌమాధికారం ఉన్న ప్రభుత్వమే అత్యుత్తమ ప్రభుత్వం అని అరిస్టాటిల్ పేర్కొన్నాడు. ప్రజలు తమకోసం తాము ఏర్పాటు చేసుకుని తామే నడుపుకునే ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యంగా (గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్) అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహంలింకన్ నిర్వచించాడు. {పజాస్వామ్యాన్ని బలోపేతం చేసేవి స్వేచ్ఛాపూరిత ఎన్నికలు, బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీలు, పాలనా యంత్రాంగం, చైతన్యవంతులైన ప్రజలు ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమ అధికారం. ప్రజాస్వామ్యం రెండు రకాలు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పరోక్ష (ప్రాతినిధ్య) ప్రజాస్వామ్యం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ప్రాచీన కాలంలో స్పార్టా, ఏథెన్స (గ్రీక్రాజ్యాలు)ల్లో ఉండేది. భారతదేశం, అమెరికాలు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశాలు. పౌర హక్కులు నైతిక హక్కు: వృద్ధులు తమ పిల్లల సేవలను పొందే హక్కు. చట్టపరమైన హక్కు: చట్టం రక్షణ కలిగిన హక్కులు, ఆస్తిలో స్త్రీలకు సమాన హక్కులు. రాజకీయ హక్కులు: ఓటుహక్కు, ఎన్నికల్లో పోటీచేసే హక్కు, ప్రభుత్వ విధానాలను విమర్శించే హక్కు. సామాజిక హక్కులు: జీవించేహక్కు, మాట్లాడేహక్కు, కుటుంబహక్కు, మతస్వేచ్ఛ హక్కు, ఆరోగ్య రక్షణ హక్కు, సంఘాలను ఏర్పర్చుకునే హక్కు. ఆర్థికహక్కులు: పనిహక్కు, వేతనం కోరే హక్కు, పింఛన్ పొందే హక్కు. భారత రాజ్యాంగం 6 ప్రాథమిక హక్కులను నిర్దేశించింది. అవి. 1. సమానత్వపు హక్కు, 2. స్వాతంత్య్రపు హక్కు, 3. పీడనాన్ని నిరోధించే హక్కు, 4. మత స్వాతంత్య్రపు హక్కు, 5. సాంస్కృతిక విద్యా విషయక హక్కులు, 6. రాజ్యాంగ పరిహారాల హక్కు. నైతిక విధులు: తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దలపట్ల విధేయత, సోదరుల పట్ల ప్రేమాభిమానాలు, మహిళలపట్ల గౌరవం, వికలాంగుల పట్ల ఆదరణ చట్టపరమైన విధులు: రాజ్యాంగాన్ని గౌరవించడం, పన్నులు చెల్లించడం, రాజ్యంపట్ల విధేయత, రోడ్డు భద్రతా నియమాలు పాటించడం (ఈ విధులు పాటించని వారు శిక్షార్హులు) భారత రాజ్యాంగం పౌరులకు 11 రకాల ప్రాథమిక విధులను నిర్ణయించింది. ఐతే వీటికి న్యాయ సంరక్షణ లేదు. చైనా, తైవాన్ దేశాల్లో నిర్బంధ సైనిక శిక్షణ అమల్లో ఉంది. ఉత్తమ జీవనాన్ని సమకూర్చడానికి రాజ్యం కొనసాగుతుంది అని అరిస్టాటిల్ పేర్కొన్నాడు. ఎన్నికల నిర్వహణ బాధ్యతను స్వయం ప్రతిపత్తి గల ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఆరేళ్లు. ఇది రద్దు కాదు. అందువల్ల దీన్ని శాశ్వత సభ అంటారు. లోక్ సభ సభ్యుల పదవీకాలం ఐదేళ్లు. లోక్సభ శాశ్వత సభ కాదు. ఎలక్టోరేట్ అంటే ఓటర్ల సముదాయం (అర్హతగల 18 ఏళ్లు నిండిన వయోజనులు) దేశంలో మొదటిసారి క్రీ.శ.1884లో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించారు. మొదటి సాధారణ ఎన్నికలు 1952లో నిర్వహించారు. వయోజన ఓటింగ్ హక్కు ప్రాతిపదికన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలని మన రాజ్యాంగంలోని 326వ అధికరణ పేర్కొంటోంది. నియోజకవర్గ ఎన్నికల అధికారిని రిటర్నింగ్ అధికారి అంటారు. పోలింగ్ కేంద్రం అధికారిని ‘ప్రిసైడింగ్ అధికారి’ అని పిలుస్తారు. రెఫరెండమ్ అంటే ప్రజాభిప్రాయసేకరణ పునరాయనం (రీకాల్) అంటే వెనుకకు పిలవడం. భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. ప్రస్తుత భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ వి.ఎస్. సంపత్. మనదేశంలో మొదటిసారిగా 1892లో ప్రాంతీయ మండళ్లకు ఎన్నికలు నిర్వహించారు. ఎగువ సభను రాజ్యసభ, పెద్దల సభ , రాష్ట్రాల పరిషత్తు , శాశ్వత సభ అని పిలుస్తారు. దిగువ సభను లోక్సభ , ప్రతినిధుల సభ, శాసనసభ అని పిలుస్తారు. రాజకీయ పార్టీ అంటే ఉమ్మడి రాజకీయ విశ్వాసాలు, ఆసక్తులు కలిగి రాజ్యాధికారాన్ని సంపాదించడానికి సంఘంగా ఏర్పడిన వ్యక్తుల సమూహం. ప్రతిపక్షపార్టీ అంటే ప్రజల ఓట్లు పొంది అధికారంలోకి రావడానికి ప్రయత్నించే రాజకీయ పార్టీ. ఐతే సంబంధిత సభలో ఆ పార్టీ కనీసం ఒక సీటైనా గెలవాలి. {పస్తుతం మనదేశంలో ఆరు పార్టీలు జాతీయపార్టీలుగా గుర్తింపులో ఉన్నాయి. అవి... కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, బీఎస్పీలు. మనదేశంలో ప్రజాప్రాతినిధ్య చట్టం - 1950 ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తారు. 15వ లోక్సభ సాధారణ ఎన్నికలను 2009లో నిర్వహించారు. సామ్యవాదం ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం బలంగా ఉండాలంటే వాటికి సామ్యవాద పునాదులు అవసరం. ఈ సామ్యవాదం దోపిడీ, అణచివేత, అసమానత, అన్యాయానికి వ్యతిరేకం. పెట్టుబడిదారీ విధానానికి కూడా వ్యతిరేకం. ఉత్పత్తి సాధనాలను ప్రభుత్వాధీనంలో ఉంచి సమాజశ్రేయస్సుకు వినియోగించడమే సామ్యవాదం (సోషలిజం). ప్రజాస్వా మ్యం పౌరుల సమానత్వంపై ఆధారపడితే, సామ్యవాదం వ్యక్తుల మధ్య, వర్గాల మధ్య సమానత్వానికి ప్రాధాన్యతనిస్తుంది. భారతదేశం ప్రజాస్వామ్య సామ్యవాదాన్ని బలపరుస్తోంది. మన రాజ్యాంగ ప్రవేశికలో సామ్యవాదం అనే పదాన్ని 42వ రాజ్యాంగ సవరణ (1976) ద్వారా చేర్చారు. మన రాజ్యాంగ పీఠిక (ప్రవేశిక) ‘భారతదేశం ఒక సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం’ అని తెల్పుతోంది. మన రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు సామ్యవాద తరహా సమాజ స్థాపనకు దోహదపడుతున్నాయి. ఆదేశిక సూత్రాలకు, ప్రాథమిక హక్కులకు సంఘర్షణ తలెత్తినప్పుడు ఆదేశిక సూత్రాలే అధిక్యత పొందుతాయి. కాంగ్రెస్ పార్టీ ఆవడి (మద్రాస్-1955)లో నిర్వహించిన మహాసభలో సామ్యవాద తరహా సమాజ నిర్మాణమే తన గమ్యంగా నిర్ణయించింది. జాతీయీకరణ అంటే దేశంలోని ఉత్పత్తి సాధనాలను ప్రభుత్వ యాజమాన్య పరిధిలోకి తెచ్చి, నిర్వహించే విధానం. -
సాంఘిక శాస్త్రం
భారతదేశ ఉనికి - క్షేత్రీయ అమరిక ‘‘భౌగోళిక పరిస్థితుల కారణంగా భవిష్యత్లో అంతర్జాతీయ వేదికపై భారతదేశం విస్తృత ప్రాధాన్యం సంతరించుకుంటుంది’’. - లార్డ కర్జన్ (బ్రిటిష్ గవర్నర్ జనరల్) ఎన్నో ప్రత్యేకతలతో, మరెన్నో విభిన్నతలతో విశాల భారత భౌగోళిక క్షేత్రం ప్రపంచంలోనే విశిష్ట లక్షణాలను కలిగి తన ఉనికిని చాటుకుంటోంది. సారవంతమైన మృత్తికలు, సమృద్ధికరమైన పంటలు, అనేక ఖనిజ నిక్షేపాలను భారత భూమి కలిగి ఉంది. పురాతన కాలం నుంచే వివిధ మతాలు, భాషలు, కులాలు, తెగలు, ఆచారాలు, అలవాట్లు, సంస్కృతులతో విలసిల్లుతోంది. ఏకత్వంలో భిన్నత్వం-భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ ప్రధాన బలంగా మారింది. ఉనికి : 32,87,263 చ.కి.మీ. వైశాల్యం ఉన్న భారతదేశం ప్రపంచంలో 7వ స్థానం కలిగిఉంది. భౌగోళికంగా 8ని4’ నుంచి 37ని6’ వరకు ఉన్న ఉత్తర అక్షాంశాలు, 68ని7’ నుంచి 97ని25’ వరకు ఉన్న తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. ఉత్తరం నుంచి దక్షిణం వరకు 3214 కి.మీ. పొడవు, తూర్పు నుంచి పడమర వరకు 3000 కి.మీ. వెడల్పుతో వ్యాపించి ఉంది. దేశ ఉత్తర భాగం చివరన మంచుతో కప్పిన హిమాలయ పర్వతాలు, దక్షిణ భాగం చివరన కన్యాకుమారి (తమిళనాడు), పశ్చిమ చివరన ఉప్పునీటి చిత్తడి నేలలున్న రాణా ఆఫ్ కచ్ (గుజరాత్), తూర్పు చివరన దట్టమైన అడవులు, కొండలున్న మయన్మార్ (బర్మా), చైనాలు మన దేశ సరిహద్దు భాగాలు. సరిహద్దు రేఖలు: 1. మెక్మోహన్ రేఖ: భారత్, చైనా మధ్య ఉన్న విభజన రేఖ. 2. రాడ్క్లిఫ్ రేఖ: వాయవ్య సరిహద్దు రేఖ భారత్, పాకిస్థాన్లను వేరు చేస్తోంది. 3. డ్యూరాండ్ రేఖ: భారత్, అఫ్ఘానిస్తాన్లను విభజిస్తోంది. తీర రాష్ట్రాలు (9):1. కేరళ, 2. కర్ణాటక, 3. గోవా, 4. మహారాష్ర్ట, 5. గుజరాత్, 6. పశ్చిమబెంగాల్, 7. ఒడిశా, 8. ఆంధ్రప్రదేశ్, 9. తమిళనాడు. గుజరాత్ అతి పొడవైన (1058 కి.మీ.) తీరరేఖ ఉన్న రాష్ర్టం. గోవా అతిచిన్న తీరరేఖ ఉన్న రాష్ర్టం. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు 972 కి.మీ. తమిళనాడుకు మూడు సముద్రాలతో (హిందూమహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్రం) తీరరేఖ ఉంది. దీవులు: భారతదేశంలో మొత్తం 247 దీవులున్నాయి. టెర్షియరీ యుగానికి చెందిన శిలలతో ఏర్పడ్డ అండమాన్, నికోబార్ దీవులు బంగాళాఖాతంలో ఉన్నాయి. వీటి విస్తీర్ణం 8248 చ.కి.మీ. పగడపు దీవులైన లక్షదీవులు 32 చ.కి.మీ.ల విస్తీర్ణంతో అరేబియా సముద్రంలో ఉన్నాయి. శిలా ఉపరితలం కలిగిన ‘పంబన్ దీవి’ భారత్, శ్రీలంకల మధ్య ఉంది. భారతదేశం - ఇండియా: పూర్వం మన దేశాన్ని భరతుడనే రాజు పాలించడంతో ‘భారతదేశం’ అనే పేరు వచ్చింది. గ్రీకులు సింధు నదిని ‘ఇండస్’గా, దాని వెంట నివసించే ప్రజలను ‘ఇండోయి’లుగా పిలిచేవారు. తర్వాత కాలంలో బ్రిటిషర్లు ‘ఇండస్’ను ‘ఇండియా’గా పిలవడం ప్రారంభించారు. భారతదేశం - ఉపఖండం: సాధారణంగా ఖండానికి ఉండే లక్షణాలున్న ప్రాంతాన్ని ‘ఉపఖండం’గా పిలుస్తారు. అలాంటి విశిష్ట లక్షణాలు, భౌగోళిక విస్తీర్ణం ఉన్న భారతదేశం కూడా ‘ఉపఖండం’గా పేరుగాంచింది. భారతదేశ ఉపఖండ లక్షణాలు : విస్తీర్ణపరంగా 7వ స్థానం, జనాభా పరంగా 2వ స్థానంతో భారతదేశం ప్రపంచంలోనే విభిన్న భౌతిక పరిస్థితులను కలిగి ఉంది. అనేక పెద్ద నదులు దేశాన్ని భౌతికంగా విభజిస్తున్నాయి. రకరకాల శీతోష్ణస్థితులు, మృత్తికలు దేశంలో విస్తరించి ఉన్నాయి. పంటలు, అటవీ, జంతు, ఖనిజ సంపదలు అపారంగా ఉన్నాయి. భారతదేశంలో వివిధ మతాలు, జాతులు, తెగలు, కులాలు, భాషలు, ఆచారాలు, అలవాట్లకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. ముఖ్యాంశాలు: భారతదేశానికి 15200 కి.మీ. పొడవైన భూభాగ సరిహద్దు, 6100 కి.మీ. పొడవైన తీరరేఖ ఉన్నాయి. {పస్తుతం దేశంలో 28 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి. విస్తీర్ణపరంగా రాజస్థాన్ పెద్ద రాష్ర్టం. గోవా చిన్న రాష్ర్టం. కేంద్రపాలిత ప్రాంతాల్లో పెద్దది అండమాన్ - నికోబార్ దీవులు, చిన్నది లక్షదీవులు. దేశంలో మొదట సూర్యోదయమయ్యే రాష్ర్టం : అరుణాచల్ప్రదేశ్ గుజరాత్లోని ద్వారకా నగరం కంటే అరుణాచల్ప్రదేశ్ తూర్పు అంచున సుమారు రెండు గంటల ముందు సూర్యోదయమవుతుంది. -
సోషల్
1. రాత్రి, పగలు ఒకదాని తర్వాత ఒకటి సంభవించడానికి కారణం? భూభ్రమణం 2. గ్రామీణ రహదారులు అధికంగా విస్తరించిన జిల్లా? కడప 3. సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? సూర్యుడు కన్పించకుండా భూమికి చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు 4. గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి ఉద్దేశించిన పథకం? TRYSEM 5. మన రాష్ర్టంలో అడవులు ఎక్కువగా ఉన్న ప్రాంతం? ఉత్తర తెలంగాణ 6. అసైన్డ భూమి అంటే? ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన భూమి 7. రైతుమిత్ర గ్రూపులో గరిష్ఠంగా ఎంతమంది రైతులు సభ్యులుగా ఉండాలి? 15 8. NABARDను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1982 9. కిసాన్ క్రెడిట్ కార్డులను అతి ఎక్కువగా తీసుకున్నవారు ఏ రాష్ర్టంలో ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ 10. మన రాష్ర్టంలో ఈశాన్య రుతుపవన కాలం? అక్టోబరు నుంచి డిసెంబరు వరకు 11. బంగాళాఖాతంలో ఎక్కువగా ఏ కాలంలో వాయుగుండాలు ఏర్పడతాయి? ఈశాన్య రుతుపవన కాలం 12. కరువు రావడానికి కారణం? అనావృష్టి 13. ‘బూడిద విప్లవం’ వేటి ఉత్పత్తికి సంబంధించింది? ఎరువులు 14. డ్రిప్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ పథకాలకు అయ్యే వ్యయంలో ప్రభుత్వం ఎంత శాతం సబ్సిడీగా ఇస్తుంది? 80 15. రోజూ ‘తినడానికి తిండి’ పొందే హక్కు మొదటిసారిగా ఏ రాష్ర్టంలో అమల్లోకి వచ్చింది? కర్ణాటక 16. చౌకధరల దుకాణాలకు బియ్యాన్ని ఎవరు సరఫరా చేస్తారు? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 17. భూ సంస్కరణల ప్రధాన లక్ష్యం? వ్యవసాయాభివృద్ధి 18. గ్రామీణ బ్యాంకులు రైతులకిచ్చే స్వల్పకాలిక రుణాల చెల్లింపునకు గరిష్ఠ కాల పరిమితి? 15 నెలలు 19. భూగర్భ జలశాఖ కరువు ప్రాంతాల అభివృద్ధికి ఎలా తోడ్పడుతుంది? గొట్టపు బావులు నిర్మించడం ద్వారా 20. బీడీ ఆకులు లభించే అడవులు ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉన్నాయి? తెలంగాణ 21. కోడిమాంసం వినియోగంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ర్టం? ఆంధ్రప్రదేశ్ 22. చాలాకాలం వరకు నీటిని నిల్వ ఉంచుకునే శక్తి ఉన్న మృత్తికలు? నల్లరేగడి 23. ‘/\‘ - ఈ వాతావరణ స్థితి సంకేతం దేన్ని సూచిస్తుంది? వడగండ్లు 24. మూఢాచారాలు, మూఢనమ్మకాలను నిర్మూలించడానికి ఉపయోగపడేది? అక్షరాస్యత 25. ఆదర్శప్రాయమైన స్థానిక సంస్థలను నిర్వహించిన రాజులు? చోళులు 26. ‘దీపం పథకం’ లబ్దిదారులు? మహిళలు 27. పంట దిగుబడిని ఆధారంగా చేసుకొని శిస్తు వసూలు చేసిన బ్రిటిష్ గవర్నర్ జనరల్? విలియంబెంటింక్ 28. {బిటిష్ పాలనా కాలంలో మద్రాస్ రాష్ర్టం లో అమలు చేసిన భూమి శిస్తు పద్ధతి? రైత్వారీ పద్ధతి 29. ప్లాసీ యుద్ధం తర్వాత బ్రిటిష్ పాలనకు వ్య తిరేకంగా తూర్పు భారతదేశంలో జరిగిన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నవారు? రైతులు 30. మన దేశ వ్యవసాయ రంగం వెనుకబడటానికి ప్రధాన కారణం? చిన్న భూకమతాలు 31. {బిటిషర్లు కల్పించిన నీటిపారుదల సౌకర్యాల వల్ల ఆహార పదార్థాల దిగుబడి పెరిగింది. అయినప్పటికీ వాటి ధరలు పెరగడానికి కారణం? నీటిపై విధించిన అధిక శిస్తు 32. పోస్టు ద్వారా ఉత్తరాలు పంపే సౌకర్యాన్ని కల్పించిన బ్రిటిష్ అధికారి? డల్హౌసీ 33. గ్రామీణ నాగరికత కలిగినవారు? ఆర్యులు 34. కాలువలను తవ్వించి నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరిచిన ఢిల్లీ సుల్తాన్? ఫిరోజ్ షా తుగ్లక్