south zone
-
రియాన్ పరాగ్ మెరుపులు వృథా.. దేవధర్ ట్రోఫీ విజేత సౌత్జోన్
దేశవాళీ జోనల్ వన్డే క్రికెట్ టోర్నీ దేవధర్ ట్రోఫీలో మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని సౌత్జోన్ జట్టు అజేయ విజేతగా నిలిచింది. పుదుచ్చేరిలో గురువారం జరిగిన ఫైనల్లో సౌత్జోన్ 45 పరుగుల తేడాతో ఈస్ట్జోన్ జట్టును ఓడించి తొమ్మిదోసారి దేవధర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్జోన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 328 పరుగులు చేసింది. రోహన్ (75 బంతుల్లో 107; 11 ఫోర్లు, 4 సిక్స్లు) సెంచరీ సాధించాడు. మయాంక్ (63; 4 ఫోర్లు), జగదీశన్ (54; 2 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం 329 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈస్ట్జోన్ 46.1 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌటైంది. రియాన్ పరాగ్ (95; 8 ఫోర్లు, 5 సిక్స్లు) మెరిపించినా మిగతావాళ్లు రాణించడంలో విఫలమయ్యారు. సౌత్జోన్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు తీయగా... వైశాఖ్, కౌశిక్, విద్వత్ రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు. టోర్నీలో 354 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్లు తీసిన రియాన్ పరాగ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. 𝗦𝗢𝗨𝗧𝗛 𝗭𝗢𝗡𝗘 are WINNERS of the #DeodharTrophy 2023-24! 🙌 Congratulations to the @mayankcricket-led unit 👏👏 East Zone fought hard in a high-scoring battle here in Puducherry 👌👌 Scorecard - https://t.co/afLGJxp77b#Final | #SZvEZ pic.twitter.com/x6PEjFp5Pr — BCCI Domestic (@BCCIdomestic) August 3, 2023 చదవండి: IND vs WI: టీమిండియా బౌలర్ అరుదైన ఘనత.. రెండో భారత క్రికెటర్గా -
శతక్కొట్టిన రోహన్.. మరోసారి మెరిసిన మాయాంక్ అగర్వాల్
ఈస్ట్ జోన్తో జరుగుతున్న దియోదర్ ట్రోఫీ 2023 ఫైనల్లో సౌత్ జోన్ ఓపెనర్లు రోహన్ కున్నుమ్మల్, మయాంక్ అగర్వాల్ రెచ్చిపోయారు. కున్నుమ్మల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి 68 బంతుల్లో శతక్కొట్టగా (75 బంతుల్లో 107; 11 ఫోర్లు, 4 సిక్సర్లు).. మాయంక్ అగర్వాల్ టోర్నీలో నాలుగో అర్ధసెంచరీతో (83 బంతుల్లో 63; 4 ఫోర్లు) మెరిశాడు. ఫలితంగా సౌత్ జోన్ భారీ స్కోర్ సాధించింది. కున్నుమ్మల్, మయాంక్లతో పాటు జగదీశన్ (54), ఆఖర్లో సాయి కిషోర్ (24 నాటౌట్) రాణించడంతో సౌత్ జోన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. ఈస్ట్ జోన్ బౌలర్లలో ఉత్కర్ష్ సింగ్, రియాన్ పరాగ్, షాబాజ్ అహ్మద్ తలో 3 వికెట్లు, మణిశంకర్, ఆకాశ్దీప్ చెరో వికెట్ పడగొట్టారు. That celebration 🔥pic.twitter.com/v5gqNKB90i — CricTracker (@Cricketracker) August 3, 2023 సూపర్ ఫామ్లో మయాంక్.. దియోదర్ ట్రోఫీ 2023 ఎడిషన్లో సౌత్ జోన్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో అతను ఏకంగా 6 మ్యాచ్ల్లో 4 అర్ధసెంచరీలు సాధించాడు. తొలి మ్యాచ్లో నార్త్ జోన్పై 64 పరుగులు చేసిన మయాంక్.. ఆతర్వాత మ్యాచ్లో వెస్ట్ జోన్పై 98 పరుగులు చేసి తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. అనంతరం నార్త్ ఈస్ట్ జోన్పై 32 పరుగులతో పర్వాలేదనిపించిన మయాంక్.. ఆతర్వాత ఈస్ట్ జోన్పై మరో అర్ధసెంచరీతో (84) మెరిశాడు. ఆ తర్వాత సెంట్రల్ జోన్తో జరిగిన మ్యాచ్లో 0 పరుగులకే రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన మయాంక్.. తాజాగా ఈస్ట్ జోన్తో జరుగుతున్న మ్యాచ్లో మరో అర్ధశతకంతో (63) రాణించాడు. -
రెచ్చిపోయిన మయాంక్ అగర్వాల్.. సత్తా చాటిన సాయి సుదర్శన్
దియోదర్ ట్రోఫీ-2023లో సౌత్ జోన్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ భీకర ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో 3 మ్యాచ్ల్లో 2 హాఫ్ సెంచరీలు సహా 194 పరుగులు (64, 98, 32) చేసిన మయాంక్.. ఇవాళ (జులై 30) ఈస్ట్ జోన్తో జరిగిన మ్యాచ్లో మరో మ్యాచ్ విన్నింగ్ హాఫ్సెంచరీతో (88 బంతుల్లో 84; 6 ఫోర్లు, సిక్స్) ఇరగదీశాడు. మయాంక్కు ఐపీఎల్ హీరో సాయి సుదర్శన్ (53) తోడవ్వడంతో ఈస్ట్ జోన్పై సౌత్ జోన్ 5 వికెట్ల తేడాతో గెలుపొంది, ఫైనల్కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్ జోన్.. కౌశిక్ (8-1-37-3), సాయి కిషోర్ (10-0-45-3), విధ్వత్ కావేరప్ప (9-2-40-2), విజయ్కుమార్ వైశాఖ్ (1/62), వాషింగ్టన్ సుందర్ (1/41) ధాటికి 46 ఓవర్లలో 229 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ విరాట్ సింగ్ (49) టాప్ స్కోరర్గా నిలువగా.. సుభ్రాంషు సేనాపతి (44), 9, 10వ నంబర్ ఆటగాళ్లు ఆకాశదీప్ సింగ్ (44), ముక్తర్ హుస్సేన్ (33) రాణించారు. గుర్తింపు కలిగిన ఆటగాళ్లు అభిమన్యు ఈశ్వరన్ (12), రియాన్ పరాగ్ (13) చేతులెత్తేశారు. అనంతరం బరిలోకి దిగిన సౌత్ జోన్.. 44.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 230 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. మయాంక్ అగర్వాల్, సాయి సుదర్శన్ అర్ధసెంచరీలతో రాణించగా.. జగదీశన్ (32) పర్వాలేదనిపించాడు. ఓపెనర్ రోహన్ కున్నుమ్మల్ (18), అరుణ్ కార్తీక్ (1) తక్కువ స్కోర్లకే వెనుదిరగగా.. రోహిత్ రాయుడు (24 నాటౌట్).. వాషింగ్టన్ సుందర్ (8 నాటౌట్) సాయంతో సౌత్ జోన్ను విజయతీరాలకు చేర్చాడు. ఈస్ట్ జోన్ బౌలర్లలో అవినోవ్ చౌదరీ 2 వికెట్లు పడగొట్టగా.. ఆకాశ్ దీప్, రియాన్ పరాగ్, షాబాజ్ అహ్మద్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇవాళే జరిగిన మరో మ్యాచ్లో నార్త్ ఈస్ట్ జోన్పై సెంట్రల్ జోన్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ ఈస్ట్ జోన్.. సర్వటే (10-2-19-3), యశ్ కొఠారీ (2-1-4-2), సరాన్ష్ జైన్ (10-0-39-2) ధాటికి 49 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌట్ కాగా.. శివమ్ చౌదరీ (85 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), యశ్ దూబే (72; 7 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీలతో రాణించడంతో సెంట్రల్ జోన్ 33 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
రాణించిన మయాంక్ అగర్వాల్.. నిప్పులు చెరిగిన కావేరప్ప.. ప్రత్యర్ధి 60కే ఆలౌట్
దేశవాలీ వన్డే టోర్నీ దియోదర్ ట్రోఫీ-2023లో సౌత్ జోన్ జట్టు భారీ విజయం సాధించింది. వి జయదేవన్ (డక్వర్త్ లూయిస్కు ప్రత్యామ్నాయం) పద్ధతిలో ఆ జట్టు 185 పరుగుల భారీ తేడాతో నార్త్ జోన్పై గెలుపొందింది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (64; 7 ఫోర్లు)తో పాటు ఓపెనర్ కున్నుమ్మల్ (70; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), ఎన్ జగదీశన్ (72; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్జోన్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. సౌత్జోన్ ఇన్నింగ్స్లో పడిక్కల్ (17), వాషింగ్టన్ సుందర్ (5) విఫలం కాగా.. రికీ భుయ్ (31), అరుణ్ కార్తీక్ (21) పర్వాలేదనిపించారు. నార్త్ జోన్ బౌలర్లలో రిషి ధవన్, మయాంక్ మార్కండే చెరో 2 వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ, మయాంక్ యాదవ్, మయాంక్ డాగర్, నితీశ్ రాణా తలో వికెట్ దక్కించుకున్నారు. సౌత్ జోన్ ఇన్నింగ్స్ తర్వాత వర్షం అడ్డుతగలడంతో విజేడీ (వి జయదేవన్) పద్ధతిన నార్త్ జోన్ లక్ష్యాన్ని 246 పరుగులకు కుదించారు. అయితే విధ్వత్ కావేరప్ప (5/17), విజయ్కుమార్ వైశాఖ్ (2/12), వాసుకి కౌశిక్ (1/11), నిప్పులు చెరగడంతో నార్త్ జోన్ 23 ఓవర్లలో 60 పరుగులకే కుప్పకూలింది. గుర్తింపు పొందిన ప్లేయర్లు అభిషేక్ శర్మ (1), గత ఐపీఎల్లో సెంచరీ చేసిన ప్రభ్సిమ్రన్సింగ్ (2), నితీశ్ రాణా (4), రిషి ధవన్ (6) దారుణంగా విఫలమయ్యారు. నార్త్ జోన్ ఇన్నింగ్స్లో శుభమ్ ఖజూరియా (10), మన్దీప్ సింగ్ (18 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సౌత్ జోన్ బౌలర్లలో పేసర్లు కాకుండా రవిశ్రీనివాసన్ సాయికిషోర్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ పడగొట్టారు. విజేడీ పద్ధతి అంటే.. వి జయదేవన్ పద్ధతి.. క్రికెట్లో డక్వర్త్ లూయిస్ పద్ధతికి ప్రత్యామ్నాయంగా రూపొందించబడిన పద్ధతి. 2007లో సునీల్ గవాస్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సాంకేతిక కమిటీ భారతదేశంలోని అన్ని పరిమిత ఓవర్ల దేశీయ మ్యాచ్లకు ఈ పద్ధతిని ఆమోదించింది. వర్షం ప్రభావిత వన్డే, టీ20 మ్యాచ్లలో లక్ష్య స్కోర్లను లెక్కించడానికి ఈ పద్దతి ఉపయోగించబడుతుంది. కేరళకు చెందిన భారతీయ ఇంజనీర్ జయదేవన్ రూపొందించిన ఈ పద్ధతిని అంతర్జాతీయ మ్యాచ్ల్లో డక్వర్త్ లూయిస్ పద్ధతికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించేందుకు 2012లో బీసీసీఐ ప్రతిపాదించింది. అయితే క్లయివ్ లాయిడ్ నేతృత్వంలోని ఐసీసీ కమిటీ ఇందుకు ఒప్పుకోలేదు. విజేడీ పద్ధతిని తమిళనాడు ప్రీమియర్ లీగ్, కర్ణాటక ప్రీమియర్ లీగ్, గతంలో ఇండియన్ క్రికెట్ లీగ్ల్లో ఉపయోగించారు. -
ప్రియాంక్ కెప్టెన్ ఇన్నింగ్స్ వృధా.. దులీప్ ట్రోఫీ విజేతగా సౌత్ జోన్
దులీప్ ట్రోఫీ-2023 విజేతగా సౌత్ జోన్ నిలిచింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో వెస్ట్జోన్పై 75 పరుగుల తేడాతో సౌత్ జోన్ విజయం సాధించింది. ఇది సౌత్జోన్కు 14వ దులీప్ ట్రోఫీ విజయం కావడం గమనార్హం. 182/5 ఓవర్నైట్ స్కోర్తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన వెస్ట్జోన్.. అదనంగా కేవలం 40 పరుగులు మాత్రమే చేసి ఓటమి చవి చూసింది. వెస్ట్ జోన్ కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ (95), సర్ఫరాజ్ ఖాన్ (48) పోరాడినా.. ఓటమి తప్పలేదు. సౌత్ జోన్ బౌలర్లు వాసుకి కౌషిక్ (4/36), సాయి కిశోర్ (4/57) చెలరేగడంతో వెస్ట్జోన్ కుప్పకూలింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో సౌత్ జోన్ 213 పరుగులకు ఆలౌటైంది. అనంతరం వెస్ట్జోన్ తన మొదటి ఇన్నింగ్స్లో 146 పరుగులకే చాపచుట్టేసింది. సౌత్ జోన్ బౌలర్ కావేరప్ప ఏకంగా ఏడు వికెట్లు తీసి వెస్ట్ జోన్ను దెబ్బకొట్టాడు. దీంతో 67 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌత్ జోన్ 230 పరుగుల వద్ద తమ ఇన్నింగ్స్ ముగించింది. దీంతో వెస్ట్జోన్ ఎదుట 298 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. అనంతరం వెస్ట్జోన్ 222 పరుగులకే పరిమితమైంది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ అవార్డులను సౌత్ జోన్ బౌలర్ కావేరప్ప సొంతం చేసుకున్నాడు. చదవండి: Ind Vs Wi: ఇంత తక్కువ ప్రైజ్మనీ ఎందుకివ్వడం.. మిక్సీలు, గ్రైండర్లు ఇవ్వడం బెటర్! -
నిరాశపరచిన తిలక్ వర్మ.. చేతులెత్తేసిన పుజారా, సూర్యకుమార్, సర్ఫరాజ్ ఖాన్
వెస్ట్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2023 ఫైనల్లో సౌత్ జోన్ జట్టు పట్టు బిగిస్తుంది. మూడో రోజు ఆట సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో లభించిన 67 పరుగుల లీడ్తో కలుపుకుని మొత్తంగా 248 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. సెకెండ్ ఇన్నింగ్స్లో సౌత్ జోన్ 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి, ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. వాషింగ్టన్ సుందర్ (10), విజయ్కుమార్ వైశాఖ్ (1) క్రీజ్లో ఉన్నారు. సౌత్ జోన్ సెకెండ్ ఇన్నింగ్స్లో తిలక్ వర్మ (3) నిరాశపరచగా.. మయాంక్ అగర్వాల్ (35), హనుమ విహారి (42), రికీ భుయ్ (27) పర్వాలేదనిపించారు. కావేరప్ప దెబ్బకు కుప్పకూలిన వెస్ట్ జోన్.. ఈ మ్యాచ్లో కర్ణాటక పేసర్ విధ్వత్ కావేరప్ప (7/53) దెబ్బకు వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 146 పరుగులకే కుప్పకూలింది. వెస్ట్ జోన్ బ్యాటర్లలో పృథ్వీ షా (65) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. టీమిండియా స్టార్ ప్లేయర్లు ఛతేశ్వర్ పుజారా (9), సూర్యకుమార్ యాదవ్ (8) దారుణంగా విఫలం కాగా.. అప్కమింగ్ హీరో అంటూ ఊదరగొట్టబడుతున్న సర్ఫరాజ్ ఖాన్ డకౌటై నిరాశపరిచాడు. కావేరప్పతో పాటు విజయకుమార్ వైశాఖ్ (2/33), కౌశిక్ (1/26) వికెట్లు పడగొట్టారు. అంతకుముందు సౌత్జోన్ తొలి ఇన్నింగ్స్లో 213 పరుగులకు ఆలౌటైంది. హనుమ విహారి (63) అర్ధసెంచరీతో రాణించగా.. తిలక్ వర్మ (40), మయాంక్ అగర్వాల్ (28), వాషింగ్టన్ సుందర్ (22 నాటౌట్) పర్వాలేదనిపించారు. షమ్స్ ములానీ (3/29), నగవస్వల్లా (2/62), చింతన్ గజా (2/27), డి జడేజా (2/33), సేథ్ (1/47) సౌత్ జోన్ను దెబ్బకొట్టారు. -
మార్కు చూపించిన తిలక్ వర్మ.. కెప్టెన్ ఇన్నింగ్స్తో విహారి! ఫైనల్లో జట్టును..
Duleep Trophy 2023- West Zone vs South Zone, Final: ప్రతిష్టాత్మక దులిప్ ట్రోఫీ-2023లో భాగంగా వెస్ట్ జోన్- సౌత్ జోన్ మధ్య బుధవారం ఫైనల్ ఆరంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్ట్ జోన్ కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్కు దిగిన సౌత్ జోన్ ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్ రవికుమార్ సమర్త్ 7 పరుగులకే పెవిలియన్ చేరగా.. మరో ఓపెనింగ్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ 28 పరుగులు చేయగలిగాడు. ఈ క్రమంలో తెలుగు తేజాలు తిలక్ వర్మ, హనుమ విహారి జట్టును ఆదుకునే బాధ్యత తీసుకున్నారు. మార్కు చూపించిన తిలక్ వర్మ.. కెప్టెన్ ఇన్నింగ్స్తో విహారి వన్డౌన్లో వచ్చిన హైదరాబాదీ బ్యాటర్ తిలక్ 87 బంతుల్లో 40 పరుగులు సాధించగా.. విహారి 63 పరుగుల(130 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో)తో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు కలిసి మూడో వికెట్కు 79 పరుగులు జతచేశారు. ఇక నగ్వాస్వల్లా బౌలింగ్లో వికెట్ కీపర్ హర్విక్ దేశాయ్కు క్యాచ్ ఇచ్చి తిలక్ పెవిలియన్ చేరగా.. షామ్స్ ములాని విహారి వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. వెలుతురు లేమి కారణంగా వీరిద్దరు అవుటైన తర్వాత సౌత్ జోన్ వరుసగా వికెట్లు కోల్పోయింది. రికీ భుయ్ 9, సచిన్ బేబి 7, సాయి కిషోర్ 5 పరుగులు మాత్రమే చేశారు. తొలిరోజు ఆట ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు స్కోరు చేసింది సౌత్ జోన్ జట్టు. వాషింగ్టన్ సుందర్(9), విజయ్కుమార్ వైశాక్(5) క్రీజులో ఉన్నారు. వెస్ట్ జోన్ బౌలర్లలో అర్జాన్ నగ్వాస్వల్లా, చింతన్ గజా, షామ్స్ ములాని రెండేసి వికెట్లు తీయగా.. అతిత్ సేత్కు ఒక వికెట్ దక్కింది. ఇక వెలుతురు లేమి కారణంగా మొదటి రోజు 25 ఓవర్ల ఆట సాధ్యపడలేదు. విహారి 46వ ఫిఫ్టీ వెస్ట్ జోన్తో దులిప్ ట్రోఫీ సందర్భంగా సౌత్ జోన్ కెప్టెన్ హనుమ విహారి అర్ధ శతకంతో మెరిశాడు. ఫస్ట్క్లాస్ కెరీర్లో అతడికి ఇది 46వ ఫిఫ్టీ. ఇక ఈ మ్యాచ్లో 63 పరుగులు సాధించడం ద్వారా విహారి ఫస్ట్క్లాస్ క్రికెట్లో 8706 రన్స్ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 23 సెంచరీలు, 46 అర్ధ శతకాలు ఉన్నాయి. చదవండి: Ind Vs WI: దవడ పగిలినా బౌలింగ్ చేసి.. దిగ్గజ బ్యాటర్ వికెట్ తీసి! -
అర్జున్ టెండూల్కర్కు గోల్డెన్ చాన్స్
దేవధర్ ట్రోఫీ ఇంటర్ జోనల్ వన్డే క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే సౌత్ జోన్ జట్టును ప్రకటించారు. సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్కు మంచి గోల్డెన్ చాన్స్ లభించింది. దేవధర్ ట్రోఫీలో భాగంగా అర్జున్ సౌత్ జోన్ జట్టులోకి ఎంపికయ్యాడు. దేశవాళీ క్రికెట్లో అర్జున్ గోవా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక 15 మంది సభ్యులతో కూడిన సౌత్ జోన్ జట్టులో హైదరాబాద్కు చెందిన రోహిత్ రాయుడు, ఆంధ్ర క్రికెటర్ రికీ భుయ్లకు స్థానం లభించింది. మయాంక్ అగర్వాల్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. దేవధర్ ట్రోఫీ ఈనెల 24 నుంచి ఆగస్టు 3 వరకు పుదుచ్చేరిలో జరుగుతుంది. సౌత్ జోన్ జట్టు: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), రోహన్ కున్నుమ్మల్ (వైస్ కెప్టెన్), ఎన్ జగదీషన్ (వికెట్ కీపర్), రోహిత్ రాయడు, కెబి అరుణ్ కార్తీక్, దేవదత్ పడిక్కల్, రికీ భుయ్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, వి కావరప్ప, వి విక్షక్ వి, మోహిత్ రెడ్కర్, సిజోమోన్ జోసెఫ్, అర్జున్ టెండూల్కర్, సాయి కిషోర్. చదవండి: #BrijBhushanSharan: 'చుప్'.. మైక్ విరగ్గొట్టి రిపోర్టర్తో దురుసు ప్రవర్తన Duleep Trophy 2023: ఇవాళ్టి నుంచి దులీప్ ట్రోఫీ ఫైనల్.. 2011లో చివరిసారిగా -
ఇవాళ్టి నుంచి దులీప్ ట్రోఫీ ఫైనల్.. 2011లో చివరిసారిగా
బెంగళూరు: దేశవాళీ ఫస్ట్క్లాస్ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీ ఫైనల్ నేడు బెంగళూరులో మొదలుకానుంది. హనుమ విహారి సారథ్యంలోని సౌత్ జోన్ జట్టు ప్రియాంక్ పాంచాల్ కెప్టెన్సీలోని డిఫెండింగ్ చాంపియన్ వెస్ట్ జోన్ జట్టుతో తలపడనుంది. గత ఏడాది ఫైనల్లో వెస్ట్ జోన్ జట్టు 294 పరుగుల తేడాతో సౌత్ జోన్ జట్టును ఓడించింది. సౌత్ జోన్ చివరిసారి 2011లో దులీప్ ట్రోఫీ టైటిల్ గెలిచింది. వెస్ట్ జోన్ జట్టు 19సార్లు చాంపియన్గా నిలిచింది. విహారితోపాటు మయాంక్ అగర్వాల్, తిలక్ వర్మ, రికీ భుయ్, సాయి సుదర్శన్ ఆటతీరుపై సౌత్ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. పృథ్వీ షా, పుజారా, సూర్యకుమార్ యాదవ్, సర్ఫరాజ్లతో వెస్ట్ జోన్ కూడా పటిష్టంగా ఉంది. చదవండి: విండీస్తో తొలి టెస్టు.. ఓపెనర్గా జైశ్వాల్, గిల్ మూడో స్థానంలో -
5 ఓవర్లకు 53 నిమిషాలు.. గెలుపు అడ్డుకోవడం కోసం ఇన్ని కుట్రలా?
మాములుగా క్రికెట్లో ఐదు ఓవర్లు బౌలింగ్ వేయడానికి 20 నిమిషాలు పడుతుంది. మహా అయతే మరో ఐదు నిమిషాలు అదనంగా పట్టొచ్చు. కానీ ఆ ఐదు ఓవర్లు బౌలింగ్ చేయడానికి దాదాపు 53 నిమిషాలు తీసుకోవడం అంటే ఎంత సమయం వృథా చేశారో అర్థమయి ఉంటుంది. ఈ సంఘటన దులీప్ ట్రోపీ సెమీఫైనల్లో చోటుచేసుకుంది. మ్యాచ్లో సౌత్ జోన్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే సౌత్ విజయానికి చేరువవుతున్న దశలో నార్త్ కెప్టెన్ జయంత్ యాదవ్ బంతి బంతికీ ఫీల్డింగ్ను మారుస్తూ సమయం వృథా చేసేందుకు ప్రయత్నించాడు. వెలుతురులేమి, వర్షం కారణంగా ఆట నిలిచిపోవాలని అతను ఆశించాడు. మ్యాచ్ ‘డ్రా’ అయితే తొలి ఇన్నింగ్స్లో 3 పరుగుల ఆధిక్యం సాధించిన నార్త్జోన్ ముందంజ వేసేది. కానీ సౌత్ ఆ అవకాశం ఇవ్వలేదు. చివరి రోజు ఓవర్కు 6.05 పరుగుల రన్రేట్తో దూకుడుగా ఆడి ఆటను ముగించింది. చివరకు జయంత్ బౌలింగ్లోనే భారీ సిక్స్తో సాయికిషోర్ (15 నాటౌట్) మ్యాచ్ ముగించడం విశేషం. అయితే నార్త్జోన్ కెప్టెన్ జయంత్ యాదవ్ వైఖరిపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యర్థి జట్టు గెలుపును అడ్డుకోవడం కోసం శతవిధాల ప్రయత్నించాడు. తన కపటబుద్ధి బయటపెట్టాడు.. ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధం అంటూ కామెంట్ చేశారు.. సౌత్జోన్ 36.1 ఓవర్లలో 8 వికెట్లకు 219 పరుగులు చేసి విజయాన్నందుకుంది. మయాంక్ అగర్వాల్ (57 బంతుల్లో 54; 7 ఫోర్లు), కెప్టెన్ హనుమ విహారి (42 బంతుల్లో 43; 8 ఫోర్లు), రికీ భుయ్ (29 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్), తిలక్ వర్మ (19 బంతుల్లో 25; 2 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. మయాంక్, విహారి మూడో వికెట్కు 47 బంతుల్లోనే 59 పరుగులు జోడించి జట్టును విజయం దిశగా నడిపించారు. వీరిద్దరు ఔటైన తిలక్ వర్మ, సాయికిషోర్లు జట్టును విజయతీరాలకు చేర్చారు. చదవండి: 39 ఏళ్ల తర్వాత.. యూరో అండర్-21 చాంపియన్ ఇంగ్లండ్ Womens Ashes 2023: యాషెస్ సిరీస్ విజేతగా ఇంగ్లండ్.. ఆఖరి మ్యాచ్లో ఆసీస్ ఓటమి -
మయాంక్ అగర్వాల్ సూపర్ ఇన్నింగ్స్.. ఫైనల్లో సౌత్జోన్
బెంగళూరు: దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో సౌత్జోన్ విజయలక్ష్యం 215 పరుగులు...మూడో రోజు 21 పరుగులు చేయగా, చివరి రోజు శనివారం చేతిలో 10 వికెట్లతో మరో 194 పరుగులు సాధించాలి. అయితే రెండు సార్లు మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించింది. చివర్లో కూడా వర్షసూచన కనిపించింది. మ్యాచ్ ‘డ్రా’ అయితే తొలి ఇన్నింగ్స్లో 3 పరుగుల ఆధిక్యం సాధించిన నార్త్జోన్ ముందంజ వేసేది. కానీ సౌత్ ఆ అవకాశం ఇవ్వలేదు. చివరి రోజు ఓవర్కు 6.05 పరుగుల రన్రేట్తో దూకుడుగా ఆడి ఆటను ముగించింది. చివరి రోజు సౌత్ 36.1 ఓవర్లలో 8 వికెట్లకు 219 పరుగులు చేసి విజయాన్నందుకుంది. మయాంక్ అగర్వాల్ (57 బంతుల్లో 54; 7 ఫోర్లు), కెపె్టన్ హనుమ విహారి (42 బంతుల్లో 43; 8 ఫోర్లు), రికీ భుయ్ (29 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్), తిలక్ వర్మ (19 బంతుల్లో 25; 2 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. మయాంక్, విహారి మూడో వికెట్కు 47 బంతుల్లోనే 59 పరుగులు జోడించి జట్టును విజయం దిశగా నడిపించారు. విహారి వెనుదిరిగే సమయానికి సౌత్ మరో 74 పరుగులు చేయాలి. ఈ దశలో భుయ్, తిలక్ 33 బంతుల్లోనే 50 పరుగులు జోడించి మళ్లీ గెలుపు బాట వేశారు. సౌత్ విజయానికి చేరువవుతున్న దశలో నార్త్ కెపె్టన్ జయంత్ యాదవ్ బంతి బంతికీ ఫీల్డింగ్ను మారుస్తూ సమయం వృథా చేసేందుకు ప్రయత్నించాడు. వెలుతురులేమి, వర్షం కారణంగా ఆట నిలిచిపోవాలని అతను ఆశించాడు. అయితే చివరకు జయంత్ బౌలింగ్లోనే భారీ సిక్స్తో సాయికిషోర్ (15 నాటౌట్) మ్యాచ్ ముగించాడు. ఫైనల్లో వెస్ట్జోన్... సెంట్రల్ జోన్, వెస్ట్జోన్ మధ్య జరిగిన మరో సెమీస్ ‘డ్రా’గా ముగిసింది. దాంతో తొలి ఇన్నింగ్స్లో 92 పరుగుల ఆధిక్యం సాధించిన వెస్ట్జోన్ ఫైనల్ చేరింది. 390 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సెంట్రల్ 4 వికెట్లకు 128 పరుగులే చేసింది. రింకూ సింగ్ (30 బంతుల్లో 40; 3 ఫోర్లు, 3 సిక్స్లు) ధాటిగా ఆడాడు. -
5 వికెట్లతో చెలరేగిన వైశాక్..! పుజారా జట్టుకు ఓటమి తప్పదా?!
Duleep Trophy 2023- South Zone vs North Zone, 2nd Semi-Final- బెంగళూరు: సౌత్జోన్ సీమర్ వైశాక్ విజయ్కుమార్ (5/76) నిప్పులు చెరిగే బౌలింగ్తో నార్త్జోన్ను కూల్చేశాడు. దీంతో దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో నార్త్జోన్ రెండో ఇన్నింగ్స్లో 56.4 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోరు 51/2తో శుక్రవారం మూడో రోజు ఆట కొనసాగించిన నార్త్ జట్టు 160 పరుగులు జోడించి మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ప్రభ్సిమ్రాన్ సింగ్ (63; 11 ఫోర్లు), హర్షిత్ రాణా (38; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. మూడు పరుగుల స్వల్ప ఆధిక్యంతో కలిపి నార్త్ జట్టు సౌత్ జట్టుకు 215 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా... ఆట ముగిసే సమయానికి సౌత్జోన్ రెండో ఇన్నింగ్స్లో వికెట్ కోల్పోకుండా 21 పరుగులు చేసింది. ఆఖరి రోజు విజయానికి 194 పరుగుల దూరంలో ఉంది. పుజారా శతకం సెంట్రల్ జోన్తో జరుగుతున్న మరో సెమీఫైనల్లో చతేశ్వర్ పుజారా (133; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో కదంతొక్కగా, సూర్యకుమార్ యాదవ్ (52; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించాడు. దీంతో వెస్ట్ భారీ లక్ష్యంవైపు దూసుకెళుతోంది. ఆట నిలిచే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 9 వికెట్లకు 292 పరుగులు చేసింది. సౌరభ్ 4, సారాంశ్ 3 వికెట్లు తీశారు. ప్రస్తుతం వెస్ట్ 384 పరుగుల ఆధిక్యంలో ఉంది. వర్షం కారణంగా చివరి రోజు ఆట సాధ్యంకాకుండా మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో వెస్ట్ జోన్ జట్టుకు ఫైనల్ బెర్త్ ఖరారవుతుంది. చదవండి: బజ్బాల్ ఆట చూపించాడు.. అరుదైన రికార్డు కొల్లగొట్టాడు -
Duleep Trophy: ఆదుకున్న మయాంక్, తిలక్..
Duleep Trophy 2023- South Zone vs North Zone, 2nd Semi-Final- బెంగళూరు: కష్టాల్లో ఎదురీదుతున్న సౌత్జోన్ జట్టును హైదరాబాద్ రైజింగ్ స్టార్ ఠాకూర్ తిలక్ వర్మ (46; 5 ఫోర్లు, 1 సిక్స్), సీనియర్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (76; 10 ఫోర్లు)తో కలిసి గట్టెక్కించాడు. దీంతో దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో సౌత్జోన్ తొలి ఇన్నింగ్స్లో 195 పరుగులకు ఆలౌటైంది. నార్త్జోన్ 3 పరుగుల ఆధిక్యంతోనే సరిపెట్టుకుంది. ఓవర్నైట్ స్కోరు 63/4తో రెండో రోజు ఆట కొనసాగించిన సౌత్జోన్ను మయాంక్, తిలక్ నడిపించారు. ఐదో వికెట్కు ఇద్దరు 110 పరుగులు జోడించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నార్త్జోన్ ఆట నిలిచే సమయానికి 11 ఓవర్లలో 2 వికెట్లకు 51 పరుగులు చేసింది. క్రికెట్కు తమీమ్ గుడ్బై చిట్టోగ్రామ్: వన్డే ప్రపంచకప్కు మూడు నెలల ముందు బంగ్లాదేశ్ జట్టు సీనియర్ ప్లేయర్, కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ సంచలన ప్రకటన చేశాడు. తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి వెంటనే తప్పుకుంటున్నట్లు భావోద్వేగంతో ప్రకటించాడు. బుధవారం అఫ్గానిస్తాన్తో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ ఓడగా ...తర్వాతి రోజే ఈ ప్రకటన వచ్చింది. 16 ఏళ్ల కెరీర్ లో 34 ఏళ్ల తమీమ్ ఇక్బాల్... 241 వన్డేల్లో 14 సెంచరీలు, 56 అర్ధ సెంచరీలతో 8313 పరుగులు... 70 టెస్టుల్లో 10 సెంచరీలతో 5134 పరుగులు... 78 టి20 మ్యాచ్ల్లో ఒక సెంచరీ, ఏడు అర్ధ సెంచరీలతో కలిపి 1758 పరుగులు సాధించాడు. చదవండి: ఒక్క బంతి ఎక్కువ తీసుకున్నా గోవిందా! నాడు తండ్రి సచిన్ వికెట్ తీసి.. ఇప్పుడేమో -
భారత క్రికెట్ పరిస్థితి చూస్తే నవ్వొస్తుంది.. సిగ్గుతో తలదించుకోవాలి..!
టీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ భారత దేశవాలీ సెలెక్టర్ల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. గడిచిన రంజీ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన కేరళ ఆఫ్ స్పిన్నర్ జలజ్ సక్సేనాను సౌత్ జోన్ తరఫున దులీప్ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడంపై ధ్వజమెత్తాడు. మధ్యప్రదేశ్, భారత-ఏ జట్ల తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినా జలజ్ను ఎంపిక చేయకపోవడంపై సెలక్టర్లను నిలదీశాడు. జట్ల ఎంపికలో సెలెక్టర్లు అవళింభిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. భారత క్రికెట్లో హాస్యాస్పదమైన విషయాలు చాలా జరుగుతున్నాయని, జలజ్ ఉదంతం ఇందుకు ఓ ఉదాహరణ మాత్రమే అని అన్నాడు. రంజీల్లో రాణించినా మిగతా దేశవాలీ టోర్నీలకు ఎంపిక చేయకపోతే రంజీ ట్రోఫీ ఆడటంలో అర్ధమే లేదని తెలిపాడు. భారత క్రికెట్లో ఇలాంటి పరిస్థితులను చూస్తుంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందని వాపోయాడు. There are many laughable things happening in Indian cricket. The highest wicket taker in Ranji Trophy not being picked even for the South Zone team is as baffling as it gets. Just renders the Ranji Trophy useless..what a shame https://t.co/pI57RbrI81 — Venkatesh Prasad (@venkateshprasad) June 18, 2023 ఈ విషయాలను ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్ ఫోరమ్కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. బీసీసీఐ జూనియర్ సెలెక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ అయిన వెంకటేశ్ ప్రసాద్ ఈ ఏడాది ఆరంభంలో టీమిండియాకు కేఎల్ రాహుల్ను ఎంపిక చేసినప్పుడు కూడా ఇలాగే సెలెక్టర్లను నిలదీశాడు. కేఎల్ రాహుల్ ఫామ్లో లేకపోయినా టీమిండియాకు ఎలా ఎంపిక చేస్తారని ప్రసాద్ నాడు సెలెక్టర్లను ప్రశ్నించాడు. కాగా, 36 ఏళ్ల జలజ్ సక్సేనా 2022-23 రంజీ సీజన్లో 7 మ్యాచ్ల్లో 6 సార్లు 5 వికెట్ల ఘనత సాధించి 50 వికెట్లు పడగొట్టాడు. ఆ సీజన్లో ఇతనే లీడింగ్ వికెట్టేకర్. ఓవరాల్గా జలజ్ తన దేశవాలీ కెరీర్లో 133 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 104 లిస్ట్-ఏ, 66 టీ20లు ఆడాడు. ఈ మధ్యప్రదేశ్ ఆల్రౌండర్ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కూడా ఓ మ్యాచ్ ఆడాడు. I DONT understand selection committee these days BABA INDRAJITH plays for Rest of India against MP in the first week of March 2023. There has been no first class matches post that , but he doesn't feature for SOUTH ZONE in the duleep trophy. Can someone tell me why??#bcci — DK (@DineshKarthik) June 14, 2023 ఇదిలా ఉంటే, దులీప్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన సౌత్ జోన్ జట్టుపై టీమిండియా వెటరన్ వికెట్కీపర్ దినేశ్ కార్తీక్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమిళనాడు ఆటగాడు బాబా ఇంద్రజిత్ను జట్టుకు ఎంపిక చేయకపోవడంపై డీకే సౌత్ జోన్ సెలెక్టర్లను నిలదీశాడు. -
హైదరాబాద్లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు
-
హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పునర్వ్యవస్థీకరణ పూర్తి.. నయా స్వరూపం ఇలా..
సాక్షి, హైదరాబాద్: సిటీ పోలీసు కమిషనరేట్ పునర్ వ్యవస్థీకరణ కొలిక్కి వచి్చంది. నగరంలో కొత్తగా రెండు జోన్లు, 10 డివిజన్లు, 13 ఠాణాలు ఏర్పాటు కానున్నాయి. దీంతో జోన్ల సంఖ్య ఐదు నుంచి ఏడుకు, డివిజన్లు 17 నుంచి 27కు, ఠాణాలు 60 నుంచి 73కు చేరనున్నాయి. ఈ మార్పు చేర్పుల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న కొన్ని డివిజన్లు మాయమవుతుండగా.. ఠాణాల పరిధులు మారుతున్నాయి. పక్షం రోజుల్లో వీటికి సంబంధించిన కార్యాలయాల ఎంపిక పూర్తి చేయాలని, కొత్త ఏడాది నుంచి పని ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇటీవల పోలీసు విభాగానికి 3,966 పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటి నుంచి సిటీకి మూడు డీసీపీ, 12 ఏసీపీ, 26 ఇన్స్పెక్టర్ సహా 1,252 పోస్టులు వచ్చాయి. గతేడాది డిసెంబర్లో నగర కొత్వాల్గా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. వీటిలో భాగంగానే పునర్ వ్యవస్థీకరణపైనా ఆయన దృష్టి పెట్టారు. ప్రభుత్వ అనుమతితో ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన తుది నివేదికకు ఇటీవలే ప్రభుత్వ ఆమోదం లభించింది. వచ్చే జనవరి 1 నుంచి పని ప్రారంభించేందుకు సీపీ ఆనంద్ సన్నాహాలు చేస్తున్నారు. ఈస్ట్ జోన్: ప్రస్తుతం సుల్తాన్బజార్, కాచిగూడ, మలక్పేట డివిజన్లు.. సుల్తాన్బజార్, చాదర్ఘాట్, అఫ్జల్గంజ్, కాచిగూడ, నల్లకుంట, ఉస్మానియా యూనివర్సిటీ, మలక్పేట, సైదాబాద్, అంబర్పేట్ ఠాణాలు ఉన్నాయి. తాజా మార్పుచేర్పులతో నార్త్జోన్, సెంట్రల్ జోన్లలోని కొన్ని ఠాణాలు దీంట్లోకి వస్తున్నాయి. కాచిగూడ, మలక్పేట డివిజన్లు మాయమై అంబర్పేట, చిలకలగూడ, ఉస్మానియా యూనివర్సిటీ పేరు తో కొత్తవి వస్తున్నాయి. వారాసిగూడ పేరుతో కొత్త ఠాణా, చిలకలగూడ, లాలాగూడ, నారాయణగూడ ఠాణాలు ఈ జోన్లోకి వస్తున్నాయి. నార్త్జోన్: ఇందులో గోపాలపురం, మహంకాళి, బేగంపేట సబ్–డివిజన్లు, గోపాలపురం, తుకారాంగేట్, లాలాగూడ, చిలకలగూడ, మహంకాళి, మార్కెట్, మారేడ్పల్లి, కార్ఖానా, బేగంపేట, బోయిన్పల్లి, బొల్లారం, తిరుమలగిరి ఠాణాలు ఉన్నాయి. తాజా మార్పుచేర్పులతో తిరుమలగిరి కేంద్రంగా డివిజన్ ఏర్పడుతోంది. తాడ్బన్లో కొత్త ఠాణాతో పాటు మధ్య మండల నుంచి రామ్గోపాల్పేట ఈ జోన్లోకే వస్తోంది. సౌత్ జోన్: ప్రస్తుతం చార్మినార్, మీర్చౌక్, ఫలక్నుమా, సంతోష్నగర్ డివిజన్లు, చార్మినార్, బహదూర్పుర, కామాటిపుర, హుస్సేనిఆలం, కాలాపత్తర్, మీర్చౌక్, డబీర్పుర, మొఘల్పుర, రెయిన్బజార్, ఫలక్నుమా, చాంద్రాయణగుట్ట, శాలిబండ, ఛత్రినాక, కంచన్బాగ్, భవానీనగర్, మాదన్నపేట, సంతోష్నగర్ ఠాణాలు ఉన్నాయి. పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ జోన్లో ఉండే ఫలక్నుమా డివిజన్ మాయమవుతోంది. దాని స్థానంలో బహదూర్పుర వస్తుండగా.. పోలీసుస్టేషన్ల 11కు తగ్గుతున్నాయి. వెస్ట్ జోన్: ప్రస్తుతం పంజగుట్ట, బంజారాహిల్స్, ఆసిఫ్నగర్ డివిజన్లు, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్సార్నగర్, ఆసిఫ్నగర్, హుమాయున్నగర్, లంగర్హౌస్, గోల్కొండ, టప్పాచబుత్ర, షాహినాయత్గంజ్, హబీబ్నగర్, కుల్సుంపుర, మంగళ్హాట్ ఠాణాలు ఉన్నాయి. తాజా మార్పుచేర్పులతో ఆసిఫ్నగర్ డివిజన్ ఈ జోన్ నుంచి మాయమవుతోంది. దీని స్థానంలో జూబ్లీహిల్స్ పేరుతో కొత్తది వస్తోంది. మాసబ్ట్యాంక్, రెహ్మత్నగర్, ఫిలింనగర్, బోరబండల్లో కొత్త ఠాణాలు వస్తున్నాయి. వీటితో పాటు ఈ జోన్లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్సార్నగర్ ఠాణాలు మాత్రమే ఉంటాయి సౌత్ ఈస్ట్ జోన్: కమిషనరేట్లో ఆరో జోన్గా సౌత్ ఈస్ట్ ఏర్పడుతోంది. ఇందులో కొత్తగా ఏర్పాటయ్యే చాంద్రాయణగుట్ట, సైదాబాద్ సబ్–డివిజన్లతో పాటు ఈస్ట్ నుంచి వచ్చే మలక్పేట, సౌత్ నుంచి వచ్చే సంతోష్నగర్ డివిజన్లు ఉండనున్నాయి. ఆ రెండు జోన్ల నుంచి వేరయ్యే చంద్రాయణగుట్ట, కంచన్బాగ్, చాదర్ఘాట్, మలక్పేట, మాదన్నపేట, సైదాబాద్, రెయిన్బజార్, భవానీనగర్, సంతోష్నగర్లతో పాటు కొత్తగా బండ్లగూడ, ఐఎస్ సదన్ ఠాణాలు ఈ కొత్త జోన్లో ఉంటాయి. సౌత్ వెస్ట్ జోన్: ఏడో జోన్గా పరిగణించే సౌత్ వెస్ట్ మరో కొత్త జోన్గా అవతరిస్తోంది. ఇందులో వెస్ట్, సెంట్రల్ జోన్ల నుంచి వేరైన ఆసిఫ్నగర్, బేగంబజార్తో పాటు కొత్తగా గోల్కొండ, కుల్సుంపుర డివిజన్లు వచ్చి చేరుతున్నాయి. ఆ రెండు జోన్ల నుంచే విభజించిన ఆసిఫ్నగర్, హుమాయున్నగర్, హబీబ్నగర్, బేగంబజార్, షాహినాయత్గంజ్, మంగళ్హాట్, గోల్కొండ, లంగర్హౌస్, కుల్సుంపుర, టప్పాచబుత్ర ఠాణాలతో పాటు కొత్తగా టోలిచౌకి, గుడిమల్కాపూర్ పోలీసుస్టేషన్లు రానున్నాయి. సెంట్రల్ జోన్: ప్రస్తుతం ఈ జోన్లో అబిడ్స్, చిక్కడపల్లి, సైఫాబాద్ డివిజన్లు.. అబిడ్స్, నారాయణగూడ, బేగంబజార్, గాంధీనగర్, ముషీరాబాద్, చిక్కడపల్లి, నాంపల్లి, రామ్గోపాల్పేట, సైఫాబాద్ పోలీసుస్టేషన్లు ఉన్నాయి. తాజా మార్పు చేర్పులతో గాం«దీనగర్ డివిజన్గా ఏర్పడుతోంది. దోమలగూడ, లేక్ పోలీసు, ఖైరతాబాద్ల్లో కొత్త ఠాణాలు ఏర్పాడుతున్నాయి. నారాయణగూడ, బేగంబజార్, నాంపల్లి, రామ్గోపాల్పేట్ ఠాణాలు ఈ జోన్లో ఉండవు. -
294 పరుగులతో సౌత్జోన్ ఓటమి.. దులీప్ ట్రోఫీ విజేత వెస్ట్జోన్
దులీప్ ట్రోఫీ 2022 విజేతగా వెస్ట్జోన్ నిలిచింది. 529 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్జోన్రెండో ఇన్నింగ్స్లో 234 పరుగులకే కుప్పకూలింది. దీంతో 294 పరుగులతో వెస్ట్జోన్ ఘన విజయం సాధించింది. ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగుల క్రితం రోజు స్కోరుతో ఐదో రోజు ఆటను ప్రారంభించిన సౌత్జోన్ మరో 80 పరుగులు చేసి మిగతా నాలుగు వికెట్లు కోల్పోయింది. సౌత్జోన్ బ్యాటింగ్లో రోహన్ కన్నుమ్మల్ 93 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. హైదరాబాద్కు చెందిన రవితేజ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి ఆకట్టుకున్నాడు. హాఫ్ సెంచరీతో మెరిసిన రవితేజ 53 పరుగులు చేసి ఔటయ్యాడు. వెస్ట్జోన్ బౌలర్లలో షామ్స్ ములాని 4, జైదేవ్ ఉనాద్కట్, అతిత్ సేత్ తలా రెండు వికెట్లు తీయగా.. తనుస్ కొటేన్, చింతన్ గజా చెరొక వికెట్ తీశారు. డబుల్ సెంచరీతో మెరిసిన యశస్వి జైశ్వాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవగా.. జైదేవ్ ఉనాద్కట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 376/3తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్ట్జోన్ 4 వికెట్లకు 585 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. యశస్వి జైస్వాల్ (265; 30 ఫోర్లు, 4 సిక్స్లు) తన ఓవర్నైట్ స్కోరుకు మరో 56 పరుగులు జోడించి అవుటయ్యాడు. సర్ఫరాజ్ ఖాన్ (127 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్స్) సెంచరీతో చెలరేగగా... హెట్ పటేల్ (51 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో రాణించాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో సౌత్జోన్ 327 పరుగులకు ఆలౌట్ కాగా.. వెస్ట్జోన్ తొలి ఇన్నింగ్స్లో 270 పరుగులకు ఆలౌటైంది. చదవండి: 'అండర్సన్ రిటైర్ అయితే ఇలానే ఏడుస్తానేమో!' BGT in 2021, Duleep Trophy in 2022 - Rahane continues to dominate as a captain in red ball format. pic.twitter.com/s3V6bxsUEE — Johns. (@CricCrazyJohns) September 25, 2022 -
శతకం బాదిన సర్ఫరాజ్ ఖాన్.. సౌత్జోన్ విజయలక్ష్యం 529
దులీప్ ట్రోఫీ ఫైనల్ 2022లో భాగంగా వెస్ట్జోన్.. సౌత్జోన్ ముందు 529 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. 3 వికెట్ల నష్టానికి 376 పరుగుల క్రితంరోజు స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన వెస్ట్ జోన్ తమ రెండో ఇన్నింగ్స్ను 4 వికెట్ల నష్టానికి 585 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తద్వారా వెస్ట్జోన్కు 528 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించినట్లయింది. డబుల్ సెంచరీతో మెరిసిన యశస్వి జైశ్వాల్ 265 పరుగులు చేసి ఔటవ్వగా.. శ్రేయాస్ అయ్యర్ 71 పరుగులు స్కోరు వద్ద వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ శతకంతో చెలరేగాడు. సౌత్జోన్ బౌలర్లను ఉతికారేసిన సర్ఫరాజ్ 178 బంతుల్లో 127 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. సర్ఫరాజ్కు తోడుగా హేల్ పటేల్ కూడా అర్థ సెంచరీతో రాణించాడు. అంతకు ముందు ఓవర్నైట్ స్కోరు 318/7తో ఆట కొనసాగించిన సౌత్జోన్ తమ తొలి ఇన్నింగ్స్లో 327 పరుగులకు ఆలౌటైంది. చదవండి: ఫెదరర్ మ్యాచ్కు ముందు నాటకీయ పరిణామం.. పిచ్చి పరాకాష్టకు డబుల్ సెంచరీతో చెలరేగిన యశస్వి జైశ్వాల్.. -
డబుల్ సెంచరీతో చెలరేగిన యశస్వి జైశ్వాల్..
కోయంబత్తూర్ వేదికగా సౌత్జోన్తో జరుగుతోన్న దులీప్ ట్రోపీ ఫైనల్లో వెస్ట్జోన్ భారీ అధిక్యం దిశగా అడుగులు వేస్తోంది. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్లో భారత యువ ఆటగాడు.. వెస్ట్జోన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. జైస్వాల్ 235 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో 23 ఫోర్లు, మూడు సిక్స్లు ఉన్నాయి. జైస్వాల్ అద్భుత ఇన్నింగ్స్ ఫలితంగా వెస్ఠ్జోన్ మూడో రోజు ఆటముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 376 పరుగులు సాధించింది. ప్రస్తుతం వెస్ట్జోన్ ఓవరాల్గా 319 పరుగుల అధిక్యం సాధించింది. ప్రస్తుతం క్రీజులో జైస్వాల్(209), సర్ఫరాజ్ ఖాన్(30) పరుగులతో క్రీజులో ఉన్నారు. అదే విధంగా వెస్ట్జోన్ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ 71 పరుగులతో రాణించాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో సౌత్జోన్ 327 పరుగులకు ఆలౌటైంది. దీంతో కేవలం 57 పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రమే లభించింది. సౌత్ జోన్ బాబా ఇంద్రజిత్ (125 బంతుల్లో 118; 14 ఫోర్లు) సెంచరీతో మెరిశాడు. మరోవైపు తొలి ఇన్నింగ్స్లో వెస్ట్ జోన్ 270 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. కాగా తొలి ఇన్నింగ్స్లో జైస్వాల్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. Yashasvi Jaiswal. Duleep Trophy final. 209* 🔥💗pic.twitter.com/liHFLoalL2 — Rajasthan Royals (@rajasthanroyals) September 23, 2022 చదవండి: భారత్, ఇంగ్లండ్, పాకిస్తాన్ కాదు.. టీ20 ప్రపంచకప్ విజేత ఆ జట్టే: భారత మాజీ ఆటగాడు -
యశస్వి జైశ్వాల్ సెంచరీ.. భారీ ఆధిక్యం దిశగా వెస్ట్జోన్
సౌత్ జోన్, వెస్ట్జోన్ మధ్య జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్ ఆసక్తికరంగా సాగుతుంది. టీమిండియా యువ క్రికెటర్.. వెస్ట్జోన్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ సూపర్ సెంచరీతో మెరిశాడు. 119 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న యశస్వి ఇన్నింగ్స్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం 140 పరుగుల లీడ్లో ఉన్న వెస్ట్ జోన్ భారీ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. కాగా శ్రేయాస్ అయ్యర్.. యశస్వి జైశ్వాల్కు సహకరిస్తూ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు. అంతకముందు సౌత్జోన్కు తొలి ఇన్నింగ్స్లో 57 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. 7 వికెట్ల నష్టానికి 318 పరుగుల క్రితం రోజు స్కోరుతో మూడోరోజు ఆటను కొనసాగించిన సౌత్జోన్ జట్టు మరో 9 పరుగులు మాత్రమే జత చేసి 327 పరుగులకు ఆలౌట్ అయింది.బాబా ఇంద్రజిత్ (125 బంతుల్లో 118; 14 ఫోర్లు) సెంచరీతో చెలరేగాడు. మనీశ్ పాండే (48), కృష్ణప్ప గౌతమ్ (43), రోహిన్ కున్నుమ్మల్ (31) రాణించారు. వెస్ట్జోన్ బౌలర్లో ఉనాద్కట్ 4 వికెట్లు తీయగా.. సేత్ 3, చింతన్ గజా రెండు వికెట్లు తీశారు. అంతకు ముందు వెస్ట్జోన్ తొలి ఇన్నింగ్స్లో 270 పరుగులకు ఆలౌటైంది. చదవండి: 'బేబీ ఏబీ' విధ్వంసం.. మరొక్క బంతి మిగిలి ఉంటేనా! సచిన్ క్లాస్..యువీ మాస్; ఇండియా లెజెండ్స్ ఘన విజయం -
645 పరుగుల తేడాతో భారీ విజయం: కొత్త రికార్డు నమోదు
కోయంబత్తూర్: దేశవాళీ జోనల్ ఫస్ట్క్లాస్ టోర్నీ దులీప్ ట్రోఫీలో కొత్త రికార్డు నమోదైంది. ఆదివారం ముగిసిన సెమీఫైనల్లో సౌత్జోన్ ఏకంగా 645 పరుగుల భారీ తేడాతో నార్త్జోన్ను చిత్తుగా ఓడించి ఫైనల్లోకి అడుగు పెట్టింది. దులీప్ ట్రోఫీ చరిత్రలో పరుగుల తేడాపరంగా ఇదే అతి పెద్ద విజయం కావడం విశేషం. ఓవర్నైట్ స్కోరు 157/1తో ఆదివారం ఆట కొనసాగించిన సౌత్జోన్ తమ రెండో ఇన్నింగ్స్ను 4 వికెట్ల నష్టానికి 316 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. హైదరాబాద్ క్రికెటర్ టి.రవితేజ (104 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీ సాధించడం విశేషం. అనంతరం 740 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన నార్త్జోన్ 30.4 ఓవర్లలో 94 పరుగులకే కుప్పకూలింది. తనయ్ త్యాగరాజన్, సాయికిశోర్, కృష్ణప్ప గౌతమ్ తలా 3 వికెట్లు పడగొట్టారు. మ్యాచ్లో 10 వికెట్లు తీసిన సాయికిశోర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. మరో సెమీస్లో సెంట్రల్జోన్ను 279 పరుగులతో ఓడించి వెస్ట్జోన్ ఫైనల్ చేరింది. -
రవితేజ మెరుపు శతకం, పదేసిన సాయికిషోర్.. ఫైనల్లో సౌత్ జోన్, వెస్ట్ జోన్
హైదరాబాద్ ఆటగాడు తెలుకపల్లి రవితేజ (120 బంతుల్లో 104 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), తమిళనాడు యువ కిషోరం రవి శ్రీనివాసన్ సాయికిషోర్ (10/98) రెచ్చిపోవడంతో నార్త్ జోన్తో జరిగిన దులీప్ ట్రోఫీ రెండో సెమీ ఫైనల్లో సౌత్ జోన్ 645 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మరోవైపు షమ్స్ ములానీ (5/72), చింతన్ గజా (3/49) చెలరేగడంతో కొయంబత్తూర్ వేదికగా సెంట్రల్ జోన్తో జరిగిన తొలి సెమీ ఫైనల్లో వెస్ట్ జోన్ 279 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఈ రెండు జట్లు (సౌత్ జోన్, వెస్ట్ జోన్) ఈనెల 21 నుంచి 25 వరకు కొయంబత్తూర్ వేదికగా జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. సౌత్ జోన్-నార్త్ జోన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. వికెట్ నష్టానికి 157 పరుగుల వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన సౌత్ జోన్.. మరో 159 పరుగులు జోడించి 316/4 స్కోర్ వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. మయాంక్ అగర్వాల్ ఓవర్నైట్ స్కోర్కు మరో 11 పరుగులు జోడించి 64 పరుగుల వద్ద ఔటవగా.. రవితేజ సూపర్ ఫాస్ట్గా సెంచరీ సాధించి ప్రత్యర్ధికి 740 పరుగుల భారీ టార్గెట్ను నిర్ధేశించారు. కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నార్త్ జోన్ కృష్ణప్ప గౌతమ్ (3/50), సాయికిషోర్ (3/28), తనయ్ త్యాగరాజన్ (3/12) దెబ్బకు కేవలం 94 పరుగులు మాత్రమే చేసి ఆలౌటై ఓటమిపాలైంది. నార్త్ జోన్ ఇన్నింగ్స్లో ఓపెనర్లు యష్ దుల్ (59), మనన్ వోహ్రా (11) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్: 630/8 డిక్లేర్ (కున్నుమ్మల్ 143, హనుమ విహారి 134, రికీ భుయ్ 103) నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్: 207 ఆలౌట్ (నిషాంత్ సింధు 40, సాయికిషోర్ 7/70) సౌత్ జోన్ సెకెండ్ ఇన్నింగ్స్: 316/4 డిక్లేర్ (రవితేజ 104, కున్నుమ్మల్ 77) నార్త్ జోన్ సెకెండ్ ఇన్నింగ్స్: 94 ఆలౌట్ (యశ్ ధుల్ 59, సాయికిషోర్ 3/28) ఇక వెస్ట్ జోన్-సెంట్రల్ జోన్ల మధ్య జరిగిన తొలి సెమీఫైనల్ విషయానికొస్తే.. వెస్ట్ జోన్ నిర్ధేశించిన 500 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 2 వికెట్ల నష్టానికి 22 పరుగుల స్కోర్ వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన సెంట్రల్ జోన్ మరో 199 పరుగులు జోడించి మిగిలిన 8 వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. రింకూ సింగ్ (65) ఒక్కడే హాఫ్ సెంచరీతో ప్రతిఘటించే ప్రయత్నం చేశాడు. వెస్ట్ జోన్ బౌలర్లలో షమ్స్ ములానీ (5/72), చింతన్ గజా (3/49), ఉనద్కత్ (1/44), అతిత్ సేథ్ (1/20) వికెట్లు పడగొట్టారు. వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్: 257 ఆలౌట్ (పృథ్వీ షా 60, రాహుల్ త్రిపాఠి 67, కుమార్ కార్తీకేయ 5/66) సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్: 128 ఆలౌట్ (కరణ్ శర్మ 34 , ఉనద్కత్ 3/24, తరుష్ కోటియన్ 3/17) వెస్ట్ జోన్ సెకెండ్ ఇన్నింగ్స్: 371 ఆలౌట్ (పృథ్వీ షా 142, హెథ్ పటేల్ 67, కుమార్ కార్తీకేయ 3/105) సెంట్రల్ జోన్ సెకెండ్ ఇన్నింగ్స్: 221 ఆలౌట్ (రింకూ సింగ్ 65, షమ్ ములానీ 5/72) -
Duleep Trophy 2022: సాయికిశోర్కు 7 వికెట్లు
సేలం (తమిళనాడు): ఎడంచేతి వాటం స్పిన్నర్ ఆర్.సాయికిశోర్ (7/70) ఏడు వికెట్లతో తిప్పేయడంతో... నార్త్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్లో సౌత్ జోన్ జట్టుకు భారీ ఆధిక్యం లభించింది. ఓవర్నైట్ స్కోరు 17/0తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన నార్త్ జోన్ జట్టు 67 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. యశ్ ధుల్ (39; 4 ఫోర్లు, 1 సిక్స్), నిశాంత్ (40; 4 ఫోర్లు, 2 సిక్స్లు) మినహా మిగతా వారు విఫలమయ్యారు. 423 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన సౌత్ జోన్ జట్టు ప్రత్యర్థిని ఫాలోఆన్ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆట ముగిసే సమయానికి సౌత్ జోన్ రెండో ఇన్నింగ్స్లో 28 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 157 పరుగులు చేసింది. రోహన్ (77; 9 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించాడు. మయాంక్ అగర్వాల్ (53 బ్యాటింగ్; 6 ఫోర్లు), టి.రవితేజ (19 బ్యాటింగ్; 2 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం సౌత్ జోన్ ఓవరాల్ ఆధిక్యం 580 పరుగులకు చేరుకుంది. -
మ్యాజిక్ చేసిన హార్ధిక్ పాండ్యా బౌలర్.. భారీ ఆధిక్యంలో సౌత్ జోన్
దులీప్ ట్రోఫీ 2022లో భాగంగా సేలం వేదికగా నార్త్ జోన్తో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో సౌత్ జోన్ పటిష్ట స్థితిలో ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 580 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతుంది. సౌత్ జోన్ సెకెండ్ ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 157 పరుగులు చేసింది. ఓపెనర్ రోహన్ కున్నుమ్మల్ (72 బంతుల్లో 77; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడి హాఫ్ సెంచరీతో అలరించగా.. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (76 బంతుల్లో 53 నాటౌట్; 6 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో రాణించాడు. అంతకుముందు స్పిన్నర్ రవి శ్రీనివాసన్ సాయి కిషోర్ కెరీర్లో అత్యుత్తమ గణాంకాలు (7/70) నమోదు చేయడంతో నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 207 పరుగులకే చాపచుట్టేసింది. నార్త్ జోన్ ఇన్నింగ్స్లో నిశాంత్ సింధు (40) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌత జోన్.. రోహన్ కున్నమ్మల్ (225 బంతుల్లో 143; 16 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ హనుమ విహారి (255 బంతుల్లో 134; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), వికెట్కీపర్ రికీ భుయ్ (170 బంతుల్లో 103 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సూపర్ శతకాలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్ను 630 పరుగుల వద్ద (8 వికెట్ల నష్టానికి) డిక్లేర్ చేసింది. పృథ్వీ షా మెరుపు శతకం.. ఓటమి దిశగా సెంట్రల్ జోన్ కొయంబత్తూర్ వేదికగా సెంట్రల్ జోన్తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో వెస్ట్ జోన్ జట్టు పట్టుబిగించింది. పృథ్వీ షా మెరుపు శతకంతో మెరవడంతో ఆ జట్టు రెండో ఇన్నింగ్స్ను 371 పరుగుల వద్ద ముగించి, ప్రత్యర్ధి ముందు 500 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సెంట్రల్ జోన్ 22 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది. మరో రెండు రోజు ఆట మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్లో ఫలితం తేలడం ఖాయంగా కనిపిస్తుంది. సెంట్రల్ జోన్ గెలవాలంటే మరో 468 పరుగులు చేయాలి ఉంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 257 పరుగులు చేసి ఆలౌటైంది. పృథ్వీ షా (78 బంతుల్లో 60; 10 ఫోర్లు), రాహుల్ త్రిపాఠి (67) అర్ధశతకాలతో రాణించారు. కుమార్ కార్తీకేయ (5/66) వెస్ట్ జోన్ను దారుణంగా దెబ్బకొట్టాడు. అనంతరం వెస్ట్ జోన్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 128 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ కరణ్ శర్మ (34) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఉనద్కత్, తనుశ్ కోటియన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. -
హనుమ విహారి అజేయ శతకం.. భారీ స్కోర్ దిశగా సౌత్ జోన్
దులీప్ ట్రోఫీ 2022లో భాగంగా సేలం వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 15) సౌత్ జోన్-నార్త్ జోన్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సౌత్ జోన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ రోహన్ కున్నమ్మల్ (225 బంతుల్లో 143; 16 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ హనుమ విహారి (220 బంతుల్లో 107 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) సూపర్ శతకాలతో చెలరేగారు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (59 బంతుల్లో 49; 6 ఫోర్లు, సిక్స్) పరుగు తేడాతో హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ జోన్ 2 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసి భారీ స్కోర్ దిశగా సాగుతుంది. విహారికి జతగా బాబా ఇంద్రజిత్ (37 బంతుల్లో 20; ఫోర్) క్రీజ్లో ఉన్నాడు. నార్త్ జోన్ బౌలర్లలో నవ్దీప్ సైనీ, నిశాంత్ సింధుకు తలో వికెట్ దక్కింది. మరోవైపు, కొయంబత్తూర్ వేదికగా సెంట్రల్ జోన్-వెస్ట్ జోన్ జట్ల మధ్య ఇవాళే మొదలైన తొలి సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న వెస్ట్ జోన్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీ షా (78 బంతుల్లో 60; 10 ఫోర్లు), రాహుల్ త్రిపాఠి (64 నాటౌట్) అర్ధశతకాలతో రాణించగా.. లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు షమ్స్ ములానీ (41), తనుష్ కోటియన్ (36) పర్వాలేదనిపించారు. వెస్ట్ జోన్ను సెంట్రల్ జోన్ స్పిన్నర్ కుమార్ కార్తీకేయ (5/66) దారుణంగా దెబ్బకొట్టగా.. అంకిత్ రాజ్పుత్, అనికేత్ చౌదరీ, గౌరవ్ యాదవ్, కరణ్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి రాహుల్ త్రిపాఠికి జతగా చింతన్ గజా (5) క్రీజ్లో ఉన్నాడు. -
అదనపు సొలిసిటర్ జనరల్గా సూర్యకరణ్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాది టి.సూర్యకరణ్ రెడ్డి హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సౌత్జోన్ నుంచి భారత అదనపు సొలిసిటర్ జనరల్గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి సూర్యకరణ్రెడ్డి మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో కూడిన సౌత్జోన్ పక్షాన అదనపు సొలిసిటర్ జనరల్గా నియమితులైన తొలి తెలుగు వ్యక్తి సూర్యకరణ్రెడ్డి కావడం గమనార్హం. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న ఆయన శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. -
ఏపీ, తెలంగాణ స్విమ్మర్లకు పతకాల పంట
సాక్షి, విజయవాడ: సౌత్జోన్ అక్వాటిక్స్ చాంపియన్ షిప్లో రెండో రోజూ ఆంధ్రప్రదేశ్ (ఏపీ), తెలంగాణ స్విమ్మర్లు తమ పతకాల వేట కొనసాగించారు. శుక్రవారం జరిగిన పోటీల్లో వారు తొమ్మిదేసి పతకాలను గెల్చుకున్నారు. తెలంగాణ తరఫున గ్రూప్–2 బాలుర 200 మీటర్ల బ్యాక్స్ట్రోక్లో వై.జశ్వంత్ రెడ్డి (తెలంగాణ; 2ని:21.14 సెకన్లు) పసిడి పతకం సాధించాడు. గ్రూప్–2 బాలుర 50 మీటర్ల బటర్ఫ్లయ్లో సూర్యాన్షు (తెలంగాణ; 28.37 సెకన్లు), గ్రూప్–1 బాలికల 200 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్లో ముప్పనేని శ్రీజ (తెలంగాణ; 3ని:12.72 సెకన్లు), గ్రూప్–1 బాలుర 200 మీటర్ల బటర్ఫ్లయ్లో యష్ వర్మ (తెలంగాణ; 2ని:13.67 సెకన్లు) రజత పతకాలను దక్కించుకున్నారు. గ్రూప్–1 బాలుర 800 మీటర్ల ఫ్రీస్టయిల్లో చల్లగాని అభిలాష్ (తెలంగాణ; 9ని:30.39 సెకన్లు), గ్రూప్–1 బాలికల 50 మీటర్ల బటర్ఫ్లయ్లో చెన్నవోజుల కృష్ణప్రియ (తెలంగాణ; 35.15 సెకన్లు), గ్రూప్–2 బాలికల 50 మీటర్ల బటర్ఫ్లయ్లో కాల్వ సంజన (తెలంగాణ; 32.97 సెకన్లు) కాంస్యాలు కైవసం చేసుకున్నారు. గ్రూప్–3 బాలికల 4్ఠ50 మీటర్ల మెడ్లేలో, గ్రూప్–2 బాలుర 4్ఠ100 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలేలో తెలంగాణ బృందాలకు కాంస్యాలు లభించాయి. ఆంధ్రప్రదేశ్ తరఫున గ్రూప్–1 బాలుర 50 మీటర్ల బటర్ఫ్లయ్లో ఎం.వాసురామ్ (ఆంధ్రప్రదేశ్; 27.11 సెకన్లు), గ్రూప్–1 బాలుర 200 మీటర్ల బ్రెస్ట్స్ట్రోక్లో ఎం.లోహిత్ (ఆంధ్రప్రదేశ్; 2ని:25.76 సెకన్లు), గ్రూప్–4 బాలుర 50 మీటర్ల ఫ్రీస్టయిల్లో ఎం. తీర్ధు సామదేవ్ (ఆంధ్రప్రదేశ్; 31.81 సెకన్లు) స్వర్ణ పతకాలను హస్తగతం చేసుకున్నారు. గ్రూప్–1 బాలుర 200 మీటర్ల ఫ్రీస్టయిల్లో ఎం. వాసురామ్ (ఆంధ్రప్రదేశ్; 2ని: 03.94 సెకన్లు) రజతం గెలిచాడు. గ్రూప్–2 బాలుర 200 మీటర్ల బ్రెస్ట్స్ట్రోక్లో మొహమ్మద్ పర్వేజ్ మహరూఫ్ (ఆంధ్రప్రదేశ్; 2ని:48.57 సెకన్లు) కాంస్యం నెగ్గాడు. గ్రూప్–1 బాలుర 4్ఠ100 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలేలో, గ్రూప్–3 బాలుర 4్ఠ50 మీటర్ల మెడ్లేలో, గ్రూప్–4 బాలికల 4్ఠ50 మీటర్ల మెడ్లేలో, గ్రూప్–4 బాలికల 4్ఠ50 మీటర్ల మెడ్లేలో ఆంధ్రప్రదేశ్ బృందాలకు కాంస్యాలు లభించాయి. -
సౌత్జోన్కు మరో ఓటమి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ జోనల్ మహిళల అండర్–23 క్రికెట్ టోర్నమెంట్లో సౌత్జోన్ జట్టు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. వడోదరలో శనివారం నార్త్జోన్తో జరిగిన మ్యాచ్లో సౌత్జోన్ 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. టోర్నీలో సౌత్కు ఇది వరుసగా రెండో ఓటమి. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్జోన్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 221 పరుగులు సాధించింది. ఎల్. నేత్ర (42; 6 ఫోర్లు), ఎన్. అనూష (36; 5 ఫోర్లు), సంజుల నాయక్ (35 నాటౌట్, 2 ఫోర్లు) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో గులియా, టీపీ కన్వర్, ఎన్ఎం చౌహాన్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం నార్త్జోన్ జట్టు 46.4 ఓవర్లలో 5 వికెట్లకు 224 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ హెచ్బీ డియోల్ (64; 11 ఫోర్లు), తానియా భాటియా (71 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధసెంచరీలు చేశారు. సౌత్జోన్ బౌలర్లలో సజన 2 వికెట్లు తీసింది. -
సౌత్జోన్ కెప్టెన్గా గౌహర్ సుల్తానా
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ జోనల్ అండర్–23 మహిళల వన్డే టోర్నమెంట్లో సత్తాచాటిన ముగ్గురు హైదరాబాద్ ప్లేయర్లు సౌత్ జోన్కు ఎంపికయ్యారు. కేరళలో ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే ఈ మూడు రోజుల టోర్నమెంట్లో పాల్గొనే సౌత్ జోన్ జట్టుకు హైదరాబాద్కు చెందిన గౌహర్ సుల్తానా కెప్టెన్గా వ్యవహరించనుంది. ఆమెతో పాటు స్రవంతి నాయుడు, అనన్య ఉపేంద్రన్ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇదే జట్టులో స్టాండ్ బైగా హిమని యాదవ్, కావ్య కూడా ఉన్నారు. మరోవైపు బరోడాలో ఈ నెల 9 నుంచి 13 వరకు జరుగనున్న ఇంటర్ జోనల్ మ్యాచ్లకు డి. రమ్య, రచన ఎస్ కుమార్ ఎంపికయ్యారు. ఇదే జట్టులో స్టాండ్బైగా లక్ష్మీ ప్రసన్న కొనసాగుతుంది. మహిళల అండర్–23 క్రికెట్ ప్రాబబుల్స్కు ఎంపికైన వారి జాబితాను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ప్రకటించింది. 20 మందితో కూడిన ఈ బృందంలో రచన, శ్రావణి, ప్రణతి రెడ్డి, రమ్య, స్నేహ మోరే త్రిష, ప్రసన్న, అనురాధ నాయక్ (వికెట్ కీపర్), చరిష్మ, శ్రావ్య (వికెట్ కీపర్), కె. అనిత, వర్ష, శ్రావీణ, భవ్య, మమత (వికెట్ కీపర్), భావన, ప్రణతి, వినయ శ్రీ, చిత్రా మహేశ్వరి, క్రాంతిలకు చోటు దక్కింది. -
అశ్విన్ అజేయ శతకం
చెన్నై: బీసీసీఐ అండర్–23 సౌత్జోన్ వన్డే లీగ్లో ఆంధ్ర జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. కర్ణాటకతో సోమవారం మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలి మ్యాచ్ సెంచరీ హీరో అశ్విన్ హెబర్ (121 బంతుల్లో 137 నాటౌట్; 13 ఫోర్లు, 4 సిక్సర్లు) ఈ మ్యాచ్లోనూ మరో భారీ శతకంతో జట్టుకు ఘనవిజయాన్ని అందించాడు. తొలుత కర్ణాటక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 324 పరుగులు చేసింది. దేవ్ పడిక్కల్ (112; 11 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీతో పాటు... నిష్కల్ (67; 6 ఫోర్లు), భరత్ (65; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయడంతో జట్టు భారీ స్కోరు సాధించింది. ఆంధ్ర బౌలర్లలో హరిశంకర్ రెడ్డి, కేవీ శశికాంత్ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం అశ్విన్ జోరుతో ఆంధ్ర 44.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసింది. రికీ భుయ్ (52; 5 ఫోర్లు, 3 సిక్స్లు), చైతన్య (32 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. -
సౌత్జోన్కు మరో పరాజయం
సాక్షి, హైదరాబాద్: ఎన్సీఏ అండర్–16 ఇంటర్ జోనల్ క్రికెట్ టోర్నమెంట్లో సౌత్జోన్ జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. ఈసీఐఎల్ గ్రౌండ్స్లో జరిగిన ఈ మ్యాచ్లో ఈస్ట్జోన్ జట్టు 2 పరుగుల తేడాతో గెలుపొందింది. ఓవర్నైట్ స్కోరు 140/2తో రెండోరోజు శనివారం తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన ఈస్ట్జోన్ జట్టు 67 ఓవర్లలో 9 వికెట్లకు 188 పరుగులు చేసింది. దిబ్యా మజుందార్ (64) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం సౌత్ జోన్ జట్టు 64 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. శుభాంగ్ హెగ్డే (69), ప్రతీక్ రెడ్డి (34) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో సుశాంత్ మిశ్రా, పంకజ్ యాదవ్ చెరో 3 వికెట్లు తీశారు. ఎన్ఎఫ్సీ గ్రౌండ్స్లో వెస్ట్జోన్తో జరిగిన మ్యాచ్లో నార్త్జోన్ జట్టు 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓవర్నైట్ స్కోరు 158/2తో రెండోరోజు తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన నార్త్జోన్ జట్టు 65 ఓవర్లలో 9 వికెట్లకు 241 పరుగులు చేసింది. మయాంక్ (63), అన్మోల్ శర్మ (56) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. వెస్ట్జోన్ బౌలర్లలో యతిన్, యువరాజ్ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం బరిలోకి దిగిన వెస్ట్జోన్ 55.3 ఓవర్లలో 219 పరుగులకే ఆలౌటైంది. ప్రజ్ఞ్నేశ్ (52), వరుణ్ (56), యశస్వి జైశ్వాల్ (64) అర్ధసెంచరీలు చేశారు. నార్త్జోన్ బౌలర్లలో అన్షుల్ కాంబోజ్ 40 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా... ముస్తఫా యూసుఫ్ 54 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. -
సౌత్జోన్ కు తొలి విజయం
ముస్తాక్ అలీ టి20 టోర్నీ ముంబై: దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీలో సౌత్జోన్ జట్టు రెండు వరుస పరాజయాల తర్వాత విజయాల బోణీ చేసింది. గురువారం ఇక్కడి వాంఖెడే స్టేడియంలో వెస్ట్జోన్ తో జరిగిన మ్యాచ్లో సౌత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్ట్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 140 పరుగులు చేసింది. దీపక్ హుడా (21 బంతుల్లో 32; 1 ఫోర్, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. ఆదిత్య తారే (19 బంతుల్లో 26; 4 ఫోర్లు), ఇర్ఫాన్ పఠాన్ (17 బంతుల్లో 26; 4 ఫోర్లు) రాణించారు. సౌత్జోన్ బౌలర్లలో సీవీ మిలింద్ 3 వికెట్లతో చెలరేగగా... రాహిల్ షా, ఎం. అశ్విన్ , విజయ్ శంకర్ తలా రెండు వికెట్లు పడగొటా్టరు. అనంతరం సౌత్జోన్ జట్టు 17.4 ఓవర్లలో 5 వికెట్లకు 141 పరుగులు చేసి గెలిచింది. మయాంక్ అగర్వాల్ (46 బంతుల్లో 70; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీతో చెలరేగగా... విష్ణు వినోద్ (20 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. వెస్ట్ బౌలర్లలో ఇర్ఫాన్ పఠాన్ , శౌర్య, ఈశ్వర్, ప్రవీణ్ తాంబే తలా ఓ వికెట్ తీశారు. మరో మ్యాచ్లో ఈస్ట్జోన్ జట్టు 8 వికెట్ల తేడాతో నార్త్జోన్ ను చితు్తగా ఓడించింది. యువరాజ్సింగ్ (24 బంతుల్లో 38; 4 సిక్సర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. గౌతమ్ గంభీర్ (13 బంతుల్లో 20; 4 ఫోర్లు), శిఖర్ ధావన్ (15 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించడంతో మొదట బ్యాటింగ్ చేసిన నార్త్జోన్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులు చేసింది. అనంతరం యువ బ్యాట్స్మన్ విరాట్ సింగ్ (48 బంతుల్లో 74 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ మనోజ్ తివారి (43 బంతుల్లో 75 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో ఈస్ట్జోన్ జట్టు 16.3 ఓవర్లలో 2 వికెట్లకు 162 పరుగులు చేసి గెలిచింది. వీరిద్దరూ 87 బంతులో్లనే 149 పరుగులు జతచేసి ఈస్ట్ను గెలిపించారు. -
హైదరాబాద్ ఏజీ జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: సౌత్జోన్ అకౌంటెంట్ జనరల్ (ఏజీ) ఫుట్బాల్ టోర్నమెంట్లో హైదరాబాద్ ఏజీ జట్టు సత్తా చాటింది. లాల్బహదూర్ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో హైదరాబాద్ జట్టు టైటిల్ను కై వసం చేసుకుంది. ఫైనల్లో హైదరాబాద్ ఏజీ జట్టు పెనాల్టీ షూటౌట్లో 3-2 గోల్స్ తేడాతో ఏజీ కర్ణాటక జట్టుపై విజయం సాధించింది. నిర్ణీత సమయంతో ఇరు జట్లు గోల్స్ చేయకపోవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. హైదరాబాద్ జట్టు తరఫున తట్టమ్ నాయుడు, నిజామ్, సయ్యద్ ఖలీల్ గోల్స్ చేయగా...మురళి, నబిల్ ఏజీ కర్ణాటక జట్టుకు గోల్స్ అందించారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో అర్జున అవార్డు గ్రహీత హబీబ్, ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎల్వీ సుధీర్ కుమార్ పాల్గొన్నారు. -
సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఎంపిక
రాజరాజనరేంద్రపురం (రాజానగరం) : తమిళనాడులోని అన్నా యూనివర్సిటీలో ఈనెల 24 నుంచి 27 వరకు జరిగే సౌత్ జో¯ŒS ఇంటర్ యూనివర్సిటీ పురుషుల టేబుల్ టెన్నిస్ పోటీలకు ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలోని ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఐదుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. వీరిలో ఎం.చంటిబాబు (దేవరపల్లి), వై.కుమార్శివదుర్గావెంకటేష్ (రాజమహేంద్రవరం), ఎ¯ŒS.శ్రీరామ్, జి. వీరవెంకటసత్యనారాయణ (గొల్లలమామిడాడ), పి. చంద్రశేఖర్ (అమలాపురం) ఉన్నారని యూనివర్సిటీ పీడీ ఎసత్యనారాయణ తెలిపారు. ఈ క్రీడాకారులకు ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు, రిజిస్ట్రార్ ఆచార్య ఎ. నరసింహరావు, ఇతర అధ్యాపకులు అభినందనలు తెలిపారు. వాలీబాల్ పోటీలకు విద్యార్థినుల ఎంపిక రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : కేరళలోని కాలికట్ యూనివర్సిటీలో ఈనెల 24 నుంచి 29 వరకు జరిగే సౌత్ జో¯ŒS ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ (మహిళలు) పోటీలకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి 12 మందిఎంపికయ్యారు. వీరిలో ఈ.సంధ్య, ఎం.సుబ్బలక్ష్మి, ఎల్.ఉషారాణి, కె.అరుణ, ఎం.ఈశ్వరి, సీహెచ్.గాయిత్రీ, ఎస్.కుమారి, షేక్, శిరీషా, కె.సంధ్యవెంకటదుర్గ, పి.స్వాతి, ఎం.దుర్గాభవాని, కె.శైలజ ఉన్నారని యూనివర్సిటీ పీడీ ఎసత్యనారాయణ తెలిపారు. విద్యార్థులకు ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు, రిజిస్ట్రార్ ఆచార్య నరసింహారావు అభినందనలు తెలిపారు. -
హాకీలో ఎస్ఆర్కేఆర్ విద్యార్థుల ప్రతిభ
భీమవరం : అంతర్ కళాశాలల హాకీ పోటీల్లో భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలిచారని ప్రిన్సిపాల్ డాక్టర్ జి.పార్థసారథివర్మ చెప్పారు. సోమవారం కళాశాల వద్ద విలేకరులతో మాట్లాడుతూ విశాఖపట్నంలోని ఎల్.బుల్లయ్య కళాశాలలో ఈనెల 2 నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రా వర్సిటీ అంతర్ కళాశాల హకీ పోటీలు జరిగాయన్నారు. తమ కళాశాల హాకీ జట్టులోని జె.మహేష్కుమార్, ఏవీఎస్ పవ¯ŒS ఈనెల మూడో వారంలో చెన్నైలో నిర్వహించే సౌత్జో¯ŒS పోటీలకు ఎంపికయ్యారన్నారు. వీరితో పాటు ఎ¯ŒS.సాయికిరణ్ను బైస్టాండ్గా ఎంపిక చేశారన్నారు. అంతర్ కళాశాలల పోటీల్లో విజయం సాధించిన హాకీ బృందాన్ని కళాశాల డైరెక్టర్ సాగి విఠల్ రంగరాజు, ప్రిన్సిపాల్ పార్థసారథివ ర్మ, పీడీ పి.సత్యనారాయణరాజు అభినందించారు. -
సెమీస్లో సౌత్జోన్, ఈస్ట్ జోన్
ఎఫ్సీఐ ఇంటర్ జోనల్ బ్యాడ్మింటన్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ఎఫ్సీఐ ఇంటర్ జోనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో సౌత్ జోన్, ఈస్ట్ జోన్ జట్లు సెమీఫైనల్కు చేరుకున్నారుు. ఎల్బీ స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన టీమ్ చాంపియన్షిప్ తొలి క్వార్టర్స్ ఫైనల్లో సౌత్జోన్ జట్టు... వెస్ట్ జోన్ జట్టుపై గెలుపొందింది. సింగిల్స్ మ్యాచ్లో సిద్ధార్థ్ ఠాకూర్ 21-8, 21-8తో లిఖిత్పై గెలుపొందాడు. డబుల్స్ మ్యాచ్లో సిద్ధార్థ్- సృజన్ జోడీ 21-15, 21-10తో లిఖిత్- సుశ్రుత్ జంటపై విజయం సాధించింది. రెండో క్వార్టర్ ఫైనల్లో ఈస్ట్ జోన్ జట్టు... నార్త్ ఈస్ట్ జట్టును ఓడించి సెమీస్కు చేరుకుంది. మహిళల క్వార్టర్స్ మ్యాచ్ల్లో నార్త్జోన్ జట్టు... ఈస్ట్ జోన్పై గెలుపొందింది. టేబుల్ టెన్నిస్ ఈవెంట్లో బుధవారం జరిగిన పురుషుల టీమ్ చాంపియన్షిప్లో నార్త్ఈస్ట్, వెస్ట్జోన్ జట్లు... మహిళల విభాగంలో ఈస్ట్జోన్, హెడ్క్వార్టర్ జట్లు గెలుపొందాయి. ఈ పోటీలను ఎఫ్సీఐ చీఫ్ జనరల్ మేనేజర్ ఒ.పి. డాని ప్రారంభించారు. -
టెన్నికాయిట్ జట్ల ఎంపిక
హైదరాబాద్: సౌత్ జోన్ టెన్నికాయిట్ చాంపియన్షిప్లో పాల్గొనే రాష్ట్ర జట్లను ఎంపికచేశారు. జాతీయ టెన్నికాయిట్ సమాఖ్య కార్యదర్శి లక్ష్మీకాంతం ఈ టోర్నీలో పాల్గొనే పురుషుల, మహిళల జట్లను శుక్రవారం ప్రకటించారు. తమిళనాడులోని వెల్లూరులో ఈ నెల 14 నుంచి 16 వరకు ఈ చాంపియన్షిప్ జరుగనుంది. పురుషుల జట్టు ఎన్. రాకేశ్, డి. వెంకటేశ్, ఎస్. సందీప్, ఎన్. ప్రవీణ్, మొహమ్మద్ యాసీన్, బి. చందర్ మహిళల జట్టు బి. ప్రియాంక, కె. శిరీష, ఎం. హేమలత, వి. నర్మద, వై. అర్చన, డి. అనూష -
పాతబస్తీలో లేట్నైట్ రోమియో
- పోలీసుల అదుపులో 170 మంది యువకుల చార్మినార్ (హైదరాబాద్) పాతబస్తీలో సౌత్ జోన్ పోలీసులు శుక్రవారం అర్థరాత్రి తనిఖీలు నిర్వహించారు. ఆపరేషన్ లేట్ నైట్ రోమియో పేరుతో 17పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ తనిఖీలు జరిగాయి. పనీ పాట లేకుండా రోడ్లపై తిరుగుతున్న సుమారు 170 మంది ఆకతాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి శనివారం ఉదయం 11 గంటలకు చార్మినార్లోని ఓ ఫంక్షన్ హాల్లో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి యువకుల తల్లిదండ్రులు కూడా హాజరు కానున్నారు. -
నగరంలో కార్డన్ సెర్చ్
హైదరాబాద్ : డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు సౌత్ జోన్ పరిధిలో ఆదివారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని హుక్కా సెంటర్లు, హార్స్ రైడింగ్ సెంటర్లు, రిసార్ట్స్పై దాడులు చేశారు. ఈ దాడుల్లో 250మంది యువకులను అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. 11 గుర్రాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడినవారిలో చాలామంది ఇంజనీరింగ్ విద్యార్థులున్నారు. హుక్కా సెంటర్లలో పట్టుబడిన యువకులకు ఆదివారం కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు. అలాగే సైబరాబాద్ అదనపు డీజీపీ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు రాయదుర్గం అంజయ్య నగర్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 20మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు చూపించని 40 బైక్లు, 7 ఆటోలు, 5 పెద్ద సిలిండర్లు, 9 చిన్న సిలిండర్లు, విద్యుత్ వైర్లు, టపాసులు స్వాధీనం చేసుకున్నారు. -
సిటీలో యువకులకు కౌన్సెలింగ్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరంలో పలువురు యువకులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. అర్ధరాత్రి వరకు రోడ్ల మీద తిరుగుతూ.. ఫైటింగ్లకు దిగుతున్న యువకులను సక్రమ మార్గంలో పెట్టడానికి సౌత్జోన్ పోలీసులు నూతన మార్గాలను ఆశ్రయించారు. బుధవారం రోజున పాతబస్తీలో 102 మంది యువకులను గుర్తించి ఒక్కచోటకు చేర్చి రాత్రిళ్లు రోడ్లపై తిరిగితే జరిగే పరిణామాలు, పర్యావసనాలను అర్థమయ్యే విధంగా చెప్పారు. యువకులతో పాటు తల్లిదండ్రులను కూడా పిలిచి కౌన్సెలింగ్ నిర్వహించారు. గతంలో ఇదే ప్రాంతంలో స్ట్రీట్ఫైట్కు దిగి నబీల్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు అప్రమత్తమైనట్టు సమాచారం. ఇకపై ఎలాంటి నేరాలు జరగకుండా చూస్తామని పోలీసులు తెలపారు. -
కొనసాగిన 'లేట్ నైట్ రోమియో'
చాంద్రాయణగుట్ట: అర్థరాత్రి రోడ్లపై తిరుగుతూ, కాలక్షేపం చేసే పోకిరీ రాయుళ్ల భరతం పట్టేందుకు నగర పోలీసులు చేపట్టిన 'ఆపరేషన్ లేట్నైట్ రోమియో' మంగళవారం రాత్రి కూడా సాగింది. మొత్తం 17 పోలీస్స్టేషన్ల పరిధిలో అర్థరాత్రి పనీపాటా లేకుండా తిరిగే 110 మంది యువకులను సౌత్జోన్ డీసీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ ఫలక్నుమా నబీల్ ఫంక్షన్ హాల్కు తరలించారు. బుధవారం ఉదయం వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ చేయనున్నారు. తమ పిల్లలను అదుపులో పెట్టుకోవాలని, మరోసారి వారు అర్థరాత్రి రోడ్లపై కనిపిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించనున్నారు. -
రామగుండంలో ప్రారంభమైన కానిస్టేబుల్ రిక్రూట్మెంట్
జ్యోతినగర్: కరీంనగర్ జిల్లా రామగుండంలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) కానిస్టేబుల్ నియామక ప్రక్రియ సోమవారం ఉదయం ప్రారంభమైంది. కానిస్టేబుల్ జనరల్ డ్యూటీకి సంబంధించి తొలిరోజు మహిళా అభ్యర్థులకు శరీర దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎత్తు, బరువులను పరిశీలించడంతోపాటు పరుగుపందెం నిర్వహిస్తున్నారు. ఇందుకు పెద్ద ఎత్తున అభ్యర్థులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 62,500 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల కాగా, సౌత్జోన్ పరిధిలో కరీంనగర్లో ఇవి జరుగుతున్నాయి. -
పోలీసుల అదుపులో 106మంది యువకులు
హైదరాబాద్: అర్ధరాత్రి దాటిన తర్వాత రోడ్లపై సంచరిస్తున్న జులాయిల పనిపట్టేందుకు పోలీసులు మరోసారి పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. 110 మందిని అదుపులోకి తీసుకుని వారిని ఫలక్నుమాలోని బషేరా ఫంక్షన్ హాల్కు తరలించారు. చాంద్రాయణగుట్ట, ఛత్రినాక, ఫలక్నుమా, కాంచన్బాగ్, మెయిన్బజార్ తదితర ప్రాంతాల్లో మొత్తం 17 పోలీస్ స్టేషన్ల పరిధిల్లో శనివారం అర్ధరాత్రి సౌత్జోన్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. పట్టుబడిన వారికి వారి తల్లిదండ్రులను పిలిపించి అడిషినల్ డీసీపీ బాబూరావు ఆదివారం ఉదయం బషేరా ఫంక్షన్ హాల్లో కౌన్సెలింగ్ ఇచ్చారు. శుక్రవారం అర్ధరాత్రి కూడా 300 మందిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. -
30 ఏళ్ల తర్వాత ‘తూర్పు’ క్రీడాకారుడు
క్రికెట్లో రాణిస్తున్న పేదింటి కుసుమం లెప్ట్ హ్యాండ్ బౌలర్గా ప్రతిభ కాకినాడ స్పోర్ట్స్ : అతడు పుట్టింది నిరుపేద కుటుంబంలోనే. తండ్రి ఆటో డ్రైవర్. తల్లి గృహిణి. చిన్నతనం నుంచీ క్రికెట్ అంటే అతడికి ప్రాణం. కృషి, పట్టుదల ఉంటే క్రికెట్లో రాణించవచ్చని నిరూపించాడు. వసీం అక్రం, జహీర్ఖాన్ తన ఆదర్శ బౌలర్లు. ఎడమ చేతి బౌలరుగా అంచెలంచెలుగా రాణిస్తూ దాదాపు 30 ఏళ్ల తరువాత జిల్లా నుంచి సౌత్జోన్ పోటీలకు ఎంపికై రికార్డు సృష్టించాడు. పెద్దాపురానికి చెందిన సీహెచ్ వీరరాఘవులు, మణిల కుమారుడు స్టీఫెన్. పెద్దాపురం ఏఆర్ కళాశాలలో ఇంటర్ చదివిన స్టీఫెన్ ప్రస్తుతం దూరవిద్యలో డిగ్రీ చేస్తున్నాడు. ఈ నెల 7 నుంచి 13 వరకు హైదరాబాద్లో జరిగిన సుబ్బయ్య పిళ్ళై ట్రోఫీలో స్టీఫెన్ ఆంధ్రా తరఫున ఆడి హైదరాబాద్పై 3, కేరళపై 4, గోవాపై 3, కర్నాటకపై 1 చొప్పున వికెట్లు తీశాడు. తద్వారా ముంబైలో ఈ నెల 29 నుంచి వచ్చే నెల 3 వరకూ జరగనున్న సౌత్జోన్ దియాధర ట్రోఫీకి ఎంపికయ్యాడు. ఎంపిక పత్రాలను జిల్లా క్రికెట్ సంఘ కార్యదర్శి కె.బాపిరాజుకు ఏసీఏ ఆపరేషన్స్ డెరైక్టర్, మాజీ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్, కార్యదర్శి గోకరాజు గంగరాజు శనివారం అందజేశారు. స్టీఫెన్ 2010-11లో బీసీసీఐ బౌలింగ్ శిక్షణకు హాజరయ్యాడు. గతంలో అండర్-16, 19, 22, 25, రంజీ పోటీలకు జిల్లా నుంచి ఎంపికై ప్రతిభ చూపాడు. స్టీఫెన్ను జిల్లా క్రికెట్ సంఘ అధ్యక్షుడు డాక్టర్ కేటీ మ్యాథ్యూస్, కార్యదర్శి కె.బాపిరాజు, కోశాధికారి సత్యనారాయణ, కోచ్ డి.రవికుమార్ అభినందించారు. -
విజయం దిశగా సౌత్
సెంట్రల్తో దులీప్ ట్రోఫీ ఫైనల్ న్యూఢిల్లీ: ఓపెనర్ లోకేశ్ రాహుల్ (132 బంతుల్లో 121 బ్యాటింగ్; 12 ఫోర్లు; 5 సిక్సర్లు) భీకరమైన ఫామ్తో రెండో ఇన్నింగ్స్లోనూ అజేయ సెంచరీతో అదరగొట్టడంతో దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్ విజయం దిశగా దూసుకెళుతోంది. 301 పరుగుల లక్ష్యంతో శనివారం తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన సౌత్ జోన్ రాహుల్ దూకుడుతో ఆట ముగిసే సమయానికి 44 ఓవర్లలో వికెట్ నష్టానికి 184 పరుగులు చేసింది. ఆటకు నేడు (ఆదివారం) చివరి రోజు . సౌత్ జట్టు మరో 117 పరుగులు చేస్తే ట్రోఫీ దక్కించుకోవచ్చు. సౌత్ చేతిలో ఇంకా తొమ్మిది వికెట్లు ఉండడంతో సెంట్రల్ జోన్ పరాభవం ఇక లాంఛనమే. రాహుల్తో పాటు అపరాజిత్ (60 బంతుల్లో 30 బ్యాటింగ్; 3 ఫోర్లు; 1 సిక్స్)క్రీజులో ఉన్నాడు. అంతకుముందు తమ రెండో ఇన్నింగ్స్లో సెంట్రల్ జోన్ 105.5 ఓవర్లలో 403 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రాబిన్ బిస్త్ (174 బంతుల్లో 112; 8 ఫోర్లు; 4 సిక్సర్లు) శతకం సాధించాడు. ముర్తజా (67 బంతుల్లో 50; 6 ఫోర్లు; 1 సిక్స్) రాణించాడు. ఎస్.గోపాల్కు నాలుగు, ఓజాకు మూడు వికెట్లు దక్కాయి. -
ఫైనల్లో సౌత్జోన్
సెమీస్లో చిత్తుగా ఓడిన ఈస్ట్జోన్ దులీప్ ట్రోఫీ క్రికెట్ రోహ్టక్: దేశవాళీ జోనల్ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీలో సౌత్జోన్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం ఇక్కడ మూడో రోజే ముగిసిన మ్యాచ్లో సౌత్జోన్ ఇన్నింగ్స్ 118 పరుగుల తేడాతో ఈస్ట్జోన్ను చిత్తుగా ఓడించింది. ఫాలోఆన్లో రెండో ఇన్నింగ్స్ ఆడిన ఈస్ట్జోన్ 23.4 ఓవర్లలో 62 పరుగులకే కుప్పకూలింది. శుక్లా (18), సౌరభ్ తివారి (13) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. శరత్కు 4 వికెట్లు దక్కగా, స్టువర్ట్ బిన్నీ 3 వికెట్లు తీశాడు. అంతకు ముందు గురువారం ఈస్ట్ తమ తొలి ఇన్నింగ్స్లో కూడా పేలవ ప్రదర్శన కనబర్చి 84 పరుగులకే ఆలౌటైంది. సౌరభ్ తివారి (17), రాణా దత్తా (17)లదే అత్యధిక స్కోరు. తొలి ఇన్నింగ్స్లో కూడా 4 వికెట్లు పడగొట్టిన బిన్నీ.. ఈస్ట్ను దెబ్బ తీశాడు. ప్రజ్ఞాన్ ఓజాకు 3 వికెట్లు దక్కాయి. గంభీర్ సెంచరీ: సెంట్రల్జోన్తో జరుగుతున్న మరో సెమీస్లో నార్త్జోన్ కెప్టెన్ గంభీర్ (242 బంతుల్లో 167; 18 ఫోర్లు) సెంచరీ చేశాడు. నార్త్జోన్ తమ తొలి ఇన్నింగ్స్లో 457 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో 538 పరుగులు చేసిన సెంట్రల్జోన్కు 81 పరుగుల ఆధిక్యం లభించింది. నార్త్ బ్యాట్స్మెన్లో సెహ్వాగ్ (32), యువరాజ్ (47), రసూల్ (44) ఫర్వాలేదనిపించారు. గురువారం సెంట్రల్ బ్యాట్స్మన్ నమన్ ఓజా (348 బంతుల్లో 217; 23 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీ చేశాడు. -
30 నుంచి సౌత్జోన్ క్యారమ్ చాంపియన్షిప్
హైదరాబాద్ జట్లకు రవీందర్, సవిత నేతృత్వం సాక్షి, హైదరాబాద్: సౌత్జోన్ క్యారమ్ చాంపియన్షిప్నకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నెల 30 నుంచి జూన్ 1 వరకు జరిగే ఈ పోటీలకు కొంపల్లిలోని శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కాలేజీ వేదికగా నిలువనుంది. మహిళలు, పురుషుల విభాగాల్లో మూడు రోజుల పాటు ఈ టోర్నీ జరగనుంది. టీమ్ చాంపియన్షిప్తో పాటు మహిళలు, పురుషులు, జూనియర్ బాలురు, బాలికల సింగిల్స్ పోటీలు కూడా నిర్వహిస్తారు. టీమ్ ఈవెంట్ మాత్రం రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో, వ్యక్తిగత పోటీలు నాకౌట్ పద్ధతిలో జరుగుతాయి. ఈ టోర్నమెంట్లో ఆంధ్ర, హైదరాబాద్ జట్లతో పాటు కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, కర్ణాటక జట్లు పాల్గొంటాయి. ఇందులో పాల్గొనే హైదరాబాద్ జట్లను ఎంపిక చేశారు. పురుషుల జట్టుకు రవీందర్ గౌడ్ (ఏజీ ఆఫీస్), మహిళల బృందానికి సవితాదేవి సారథ్యం వహిస్తారు. సురేశ్ కుమార్ కోచ్గా వ్యవహరిస్తారు. పురుషుల జట్టు: రవీందర్ గౌడ్ (కెప్టెన్), ఎండీ అహ్మద్, నవీన్, వసీమ్, సాయి సంతోష్, సాయిబాబా, నరేశ్, మహేశ్, మేనేజర్: ఆర్. బాల రాజు. మహిళల జట్టు: సవితా దేవి (కెప్టెన్), శ్రీవాణి, పద్మజ, మాధవి, మౌనిక, అశ్విని, శ్వేత, సాయిలక్ష్మి, మేనేజర్: ఎస్. భావన. జూనియర్ బాలురు: కళ్యాణ్, రమేశ్, శ్యామ్, వినీత్; జూనియర్ బాలికలు: స్రవంతి, చరిష్మా గౌడ్, రాశి, అమృత. -
నాకౌట్ ఆశలు గల్లంతు
బెంగళూరు: రంజీ ట్రోఫీలో ఈ ఏడాది చెత్త ప్రదర్శన కనబర్చిన హైదరాబాద్ ఇప్పుడు దేశవాళీ వన్డేల్లోనూ అదే బాట పట్టింది. గత మ్యాచ్లో తమిళనాడు చేతిలో చిత్తుగా ఓడిన జట్టు...ఇప్పుడు ఆంధ్ర చేతిలోనూ పరాజయం పాలైంది. సౌత్జోన్ వన్డే టోర్నీ (సుబ్బయ్య పిళ్లై ట్రోఫీ)లో భాగంగా సోమవారం ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఆంధ్ర 6 వికెట్ల తేడాతో హైదరాబాద్పై ఘన విజయం సాధించింది. ఆంధ్ర బౌలర్ల ధాటికి ముందుగా హైదరాబాద్ 47.5 ఓవర్లలో 166 పరుగులకే కుప్పకూలగా, ఆంధ్ర 40.1 ఓవర్లలో 4 వికెట్లకు 167 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. తాజా ఓటమితో హైదరాబాద్ నాకౌట్ అవకాశాలను దాదాపు కోల్పోయింది. సౌత్జోన్ నుంచి తమిళనాడు, కర్ణాటక జట్లు అర్హత సాధించాయి. ఆదుకున్న విహారి, హబీబ్... టాస్ గెలిచిన హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టు స్కోరు 7 పరుగులకే ఓపెనర్లు సుమన్ (5), అక్షత్ (1) పెవిలియన్ చేరారు. అయితే ఈ దశలో హనుమ విహారి (70 బంతుల్లో 43; 5 ఫోర్లు) ఆదుకున్నాడు. రవితేజ (11)తో కలిసి అతను మూడో వికెట్కు 46 పరుగులు జోడించాడు. అయితే రవితేజతో పాటు సందీప్ రాజన్ (7), విహారి వెంటవెంటనే వెనుదిరిగారు. ఫామ్లో ఉన్న ఆశిష్ రెడ్డి (9)తో పాటు షిండే (15), కనిష్క్ (0) కూడా ఏడు పరుగుల వ్యవధిలోనే నిష్ర్కమించారు. అయితే వికెట్ కీపర్ హబీబ్ అహ్మద్ (49 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేశాడు. చివరి ఆటగాళ్లు ఓజా (11), రవికిరణ్ (11)ల అండతో అతను స్కోరును 150 పరుగులు దాటించాడు. ఆంధ్ర బౌలర్లలో లెగ్స్పిన్నర్ దాసరి స్వరూప్ కుమార్ 21 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా, విజయ్కుమార్కు 2 వికెట్లు దక్కాయి. గెలిపించిన భరత్... సునాయాస విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర 9 పరుగుల వద్ద ఓపెనర్ ప్రశాంత్ (6) వికెట్ కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ శ్రీకర్ భరత్ (87 బంతుల్లో 60; 6 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి షాట్లతో ఇన్నింగ్స్ను నడిపించాడు. రెండో వికెట్కు జ్యోతి కృష్ణ (55 బంతుల్లో 36; 5 ఫోర్లు) తో 60 పరుగులు జోడించిన భరత్, మూడో వికెట్కు బోడ సుమంత్ (35 బంతుల్లో 27; 3 ఫోర్లు)తో 56 పరుగులు జత చేశాడు. భరత్ వెనుదిరిగినా...రికీ భుయ్ (28 బంతుల్లో 27 నాటౌట్; 4 ఫోర్లు) మ్యాచ్ను ముగించాడు. -
దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్జోన్
చెన్నై: బౌలింగ్లో విశేషంగా రాణించిన సౌత్జోన్... దులీప్ ట్రోఫీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. హైదరాబాద్ బౌలర్ ప్రజ్ఞాన్ ఓజా (6/48) కీలక వికెట్లు తీయడంతో ఆదివారం ముగిసిన సెమీఫైనల్లో సౌత్ జట్టు ఇన్నింగ్స్ 38 పరుగుల తేడాతో సెంట్రల్ జోన్పై విజయం సాధించింది. ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవాలంటే 258 పరుగులు చేయాల్సిన దశలో చివరి రోజు బ్యాటింగ్కు దిగిన సెంట్రల్ జట్టు రెండో ఇన్నింగ్స్లో 57.2 ఓవర్లలో 220 పరుగులకు ఆలౌటైంది. ముఖ్యంగా ఓజా నాలుగు ఓవర్ల వ్యవధిలో రాబిన్ బిస్త్ (20), శలభ్ శ్రీవాస్తవ (2), నమన్ ఓజా (0)లను అవుట్ చేయడంతో సౌత్ విజయం ఖరారైంది. అంతకుముందు 467/9 ఓవర్నైట్ స్కోరుతో ఆఖరి రోజు ఆట కొనసాగించిన సౌత్ జట్టు కేవలం ఒక్క ఓవర్ మాత్రమే ఆడి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. -
సెంట్రల్ జోన్ 209 ఆలౌట్
చెన్నై: సౌత్జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 85.4 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. పీయూష్ చావ్లా (56) మినహా మిగతా వారు విఫలమయ్యారు. మిథున్, ఓజా చెరో మూడు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన సౌత్జోన్ శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 63 ఓవర్లలో 2 వికెట్లకు 137 పరుగులు చేసింది. ముకుంద్ (61), అపరాజిత్ (35) క్రీజులో ఉన్నారు. ఉన్ముక్త్ సెంచరీ: కొచ్చిలో ఈస్ట్జోన్తో జరుగుతున్న మరో సెమీస్లో నార్త్జోన్ పటిష్ట స్థితిలో నిలిచింది. ఉన్ముక్త్ చంద్ (116), ఇయాన్ దేవ్సింగ్ (95 రిటైర్డ్హర్ట్) రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో 112 ఓవర్లలో 2 వికెట్లకు 329 పరుగులు చేసింది. -
సెంట్రల్ జోన్ 123/5 : దులీప్ ట్రోఫీ
చెన్నై: సౌత్ జోన్ పేసర్ అభిమన్యు మిథున్ (3/24) పదునైన బంతులతో రెచ్చిపోవడంతో దులీప్ ట్రోఫీ సెమీస్లో సెంట్రల్ జోన్ పరుగులు తీసేందుకు ఇబ్బందిపడింది. ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఈ నాలుగు రోజుల మ్యాచ్లో తొలి రోజు ఆట ముగిసేసమయానికి సెంట్రల్ జోన్ 50.2 ఓవర్లలో ఐదు వికెట్లకు 123 పరుగులు చేసింది. వర్షం కారణంగా పూర్తి స్థాయి ఓవర్లు ఆడేందుకు వీలు పడలేదు. మూడో ఓవర్ నుంచే మిథున్ ప్రత్యర్థి ఇన్నింగ్స్ను దెబ్బతీశాడు. దీంతో 13 పరుగుకే రెండు వికెట్లు కోల్పోయిన సెంట్రల్ను ఓపెనర్ ముకుల్ దాగర్ (105 బంతుల్లో 45; 6 ఫోర్లు) కొద్దిసేపు ఆదుకున్నాడు. బిస్త్ (18)తో కలిసి మూడో వికెట్కు 56 పరుగులు జోడించాడు. తనను కూడా మిథున్ పెవిలియన్కు చేర్చడంతో సెంట్రల్ కష్టాల్లో పడింది. నార్త్ జోన్ 33/0 కొచ్చి: మరో సెమీఫైనల్కు వర్షం అడ్డంకిగా నిలి చింది. దీంతో నార్త్ జోన్, ఈస్ట్ జోన్ మధ్య జరుగుతున్న ఈ 4 రోజుల మ్యాచ్లో కేవలం 17 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ముందుగా బ్యాటింగ్కు దిగిన నార్త్ జోన్ నిదానంగా ఆడడంతో వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేయగలిగింది. క్రీజులో జీవన్జ్యోత్ (18), ఉన్ముక్త్ చంద్ (12) ఉన్నారు.