speech
-
ప్రతిపక్షంగా గుర్తించేంత దాకా పోరాటం ఆగదు: YSRCP
అమరావతి, సాక్షి: ఏపీలో ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే ప్రధాన ప్రతిపక్షం ఉండాల్సిందేనని వైఎస్సార్సీపీ పట్టుబడుతోంది. ఈ క్రమంలో ఇవాళ ఇటు గవర్నర్ నుంచి, అటు స్పీకర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. గవర్నర్ ప్రసంగాన్ని(Governor Speech) వైఎస్సార్సీపీ బాయ్కాట్ చేసింది.సోమవారం ఉదయం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ ప్రసంగం మొదలైన కాసేపటికే వైఎస్సార్సీపీ(YSRCP) సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రజా సమస్యలు వినిపించేందుకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, రెడ్బుక్ రాజ్యాంగం నుంచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. అయినా స్పందన లేకపోవడంతో వైఎస్సార్సీపీ నిరసనకు దిగింది. ఈ క్రమంలో వైఎస్ జగన్(YS Jagan) నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా బయటకు వచ్చేశారు.సభలో ఉండేది ఒకటి అధికార పక్షం, మరోకటి ప్రతిపక్ష పక్షం. ఆ హోదాకు ఎంతో విలువ ఉంటుంది. ప్రజల గొంతుక వినపడాలంటే.. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వా ల్సిందే. ప్రజలు, రైతుల కష్టాలు చెప్పాలంటే ప్రతిపక్షం ఉండాల్సిందే. అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ముక్తకంఠంతో నినదించాం అని వైఎస్సార్సీ ఎమ్మెల్సీ బొత్స అన్నారు.రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. రైతుల బాధలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేవు. కేంద్రంతో మాట్లాడుతున్నాం.. ప్రయత్నిస్తున్నాం అని మాత్రమే చెబుతున్నారు. మిర్చికి వెంటనే మద్ధతు ధర ప్రకటించాలి. మేం రైతుల తరఫున పోరాడితే కేసులు పెడుతున్నారు. కూటమి గ్యారెంటీ అంటేనే మోసం అని అర్థం అవుతుంది. తొమ్మది నెలలు గడుస్తున్నా సూపర్ సిక్స్ హామీల అమలు నోచుకోలేదు. అందుకే ప్రజా సమస్యలపై ప్రజా క్షేత్ర స్థాయిలో పోరాటం చేస్తాం. ప్రభుత్వ చొక్కా పట్టుకుంటాం అని బొత్స అన్నారు. అబద్ధాలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వానికి తాలిబన్లకు పెద్ద తేడా లేదు. వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని సీనియర్ నేత పెద్దిరెడ్డి అన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా?: MLC వరుదుకల్యాణిఏపీలో ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు?నిరుద్యోగులు...రైతులు.. మహిళలు.. చిన్నపిల్లలను అందరినీ మోసం చేశారు15 వేల కోట్లు విద్యుత్ ధరలు పెంచారునిత్యావసర ధరలు 60% పెంచారుప్రజల తరపున ప్రశ్నిస్తారనే భయంతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదుతొమ్మిది నెలల్లో లక్ష కోట్లకు పైగా అప్పులు చేశారుచంద్రబాబుకి కూడా అప్పు రత్న అవార్డు ఇస్తావా పవన్ సమాధానం చెప్పాలిపథకాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారువైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేహోదా ఇచ్చే వరకూ పోరాడుతాం కూటమి నిరంకుశత్వంగా వ్యహరిస్తోందిప్రతిపక్ష గొంతు నొక్కడం కోసమే ఇలా చేస్తున్నారునోటీసులు కూడా ఇవ్వకుండా ఛానల్స్ బహిష్కరించిన పరిస్థితి ఎప్పుడైనా ఉందా?: ఎమ్నెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అసెంబ్లీ సమావేశాల కవరేజ్కు సాక్షి(Sakhi TV) సహా పలు ఛానెల్స్పై కూటమి ప్రభుత్వం నిషేధం విధించడాన్ని YSRCP సభ్యులు తీవ్రంగా తప్పుబట్టారు. -
ఏడేళ్ల చిన్నారి నోట పేరెంటింగ్ పాఠాలు..!
బెస్ట్ పేరెంట్స్, పిలల పెంపకం గురించి సైకాలజీలు, ప్రముఖులు విద్యావేత్తల ప్రసంగాల్లో వింటుంటాం. కానీ వాటిని ఓ ఏడేళ్ల చిన్నారి అలవోకగా ఆశ్చర్యపరిచేలా చెబుతుంటే..ఇది నిజమేనా అనిపిస్తుంది కదా..!. కానీ ఇది నమ్మకతప్పని సత్యం. పట్టుమని పదేళ్లు కూడా లేని ఓ చిన్నారి తల్లిదండ్రుల పెంపకం, చిన్నారులతో పేరెంట్స్ ఎలా వ్యవహరించాలి వంటి వాటి గురించి విస్తుపోయేలా చెప్పేస్తుంది. ఆ ప్రసంగం ఓ చిన్నారి చెబుతున్న చిట్టి మాటల్ల లేవు. ఓ అనుభవశాలి లేదా నిపుణులు చెబుతున్న విలువైన పాఠాలే వలే ఉన్నాయి. చిన్నారుల వద్ద అపార జ్ఞానం ఉంటుందనేందుకు ఈ చిన్నారే ఉదాహరణ అనేలా అద్భతంగా ప్రసంగించింది పేరెంటింగ్ గురించి. మరీ ఆ చిన్నారి ఎవరు..? ఆమె చెబుతున్న అద్భుతమైన పేరెంటింగ్ చిట్కాలేంటో చూద్దామా..!.టెడ్ స్పీకర్ మోలీ రైట్ అనే ఏడేళ్ల చిన్నారి పేరెంటింగ్ గురించి చక చక మాట్లాడేస్తోంది. పిల్లలతో ప్రతి పేరెంట్ సంభాషణ ఎలా ఉంటుందనే ప్రశ్న లెవనెత్తి.. ప్రతి తల్లిదండ్రులు తమ పెంపకం గురించి ఆలోచించుకునేలా ప్రసంగించింది. సైకాలజీ నిపుణుల మాదిరిగా పిల్లలను ఎలా పెంచితే మంచిదో విపులంగా వివరించింది. ఇవన్నీ ఓ ఏడేళ్ల చిన్నారి నోటి నుంచి వస్తున్నాయా..? అని ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ చిన్నారి స్పీచ్ తల్లిదండ్రులందర్నీ తమ తీరుపై విశ్లేషించుకునేలా చేస్తుంది. అంతేగాదు తమ పిల్లల తెలితేటలను ఎంత తక్కువగా అంచనావేస్తున్నామనే విషయాన్ని గ్రహించేలా చేస్తుంది కూడా. చివరగా ఆమె ప్రసంగంలో పేరెంటింగ్ అనేది జీవితాంత నేర్చుకునే ఓ అద్భుతమైన ప్రక్రియ అని, ఇక్కడ చిన్నారులే వారికి గురువుల్లా కొత్త కొత్త విషయాలను తెలుసుకునేలా చేస్తారంటూ వయసుకి మించి పెద్ద పెద్ద విషయాలను చెప్పింది ఆ చిన్నారి మోలీ. అంతేగాక చాలామంది తల్లిదండ్రులు చేసే సాధారణ తప్పులని ఎత్తి చూపడమే కాకుండా పిల్లలతో ఎలా వ్యవహరించాలనే దానిపై దృష్టి సారించేలా చేసింది. అలాగే పిల్లలకు పేరెంటింగ్గా అందివ్వాల్సిన భద్రత, సంరక్షణ గురించి నొక్కి చెప్పింది. దీంతోపాటు తల్లిదండ్రులు ఎక్కువ సేపు ఫోన్, ల్యాప్టాప్ స్క్రీన్లకే పరిమితం కావొద్దనే విషయాన్ని హైలెట్ చేసింది. పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకునే ప్రతి తల్లిదండ్రులు వారితో గడిపేందుకు సమయం కచ్చితంగా కేటాయించాలని నొక్కి చెప్పింది. ఆ చిన్నారి టెడ్ స్పీకర్ నుంచి ప్రతి తల్లిదండ్రులు నేర్చుకోవాల్సి అమూల్యమైన పాఠాలేంటో చూద్దామా..!. గర్భం నుంచే కనెక్షన్ ప్రారంభం..తల్లి గర్భం ధరించినప్పటి నుంచే తల్లిదండ్రులుగా ఉండటం ప్రారంభమవుతుందన్న విషయాన్ని గుర్తు చేసింది. కడుపుతో ఉన్నప్పటి నుంచే పొట్టను నిమురుతూ శిశువుతో బలమైన బంధాన్ని ఏర్పరుచుకుంటారని, అక్కడ నుంచి ఇరువురి మధ్య బలమైన బంధం ఏర్పడుతుందని చెప్పుకొచ్చింది. ఇదే విషయాన్ని పరిశోధనలు సైతం జనన పూర్వం నుంచే తల్లి ద్వారా శిశువుకి భద్రతా భావాన్ని ప్రభావితం చేస్తుందని వెల్లడించాయి. సేవా, కమ్యూనికేషన్శిశువుగా ఉన్నప్పుడు చిన్నారులకు చేసే సేవ, వారితో జరిపే కమ్యూనికేషన్ని బట్టి తల్లిదండ్రులే తన సంరక్షకులని గుర్తించడం జరుగుతుందని అంటోంది. అలాగే అధ్యయనాల్లోకూడా నవజాత శిశువులకు చేసే సపర్యలు, వారితో మాట్లాడే చర్య ఇవన్నీ భావోద్వేగా మేధస్సుకి కీలకమైన నాడీ సంబంధాలను బలపరుస్తుందని పేర్కొంది కూడా. ఆట రీచార్జ్ అయ్యేలా చేస్తుంది..పిల్లలు ఆట ద్వారా చాలా నేర్చుకుంటారు. కథ చెప్పడం, పాడటం వంటి కార్యకలాపాలతో వారికి సమస్య పరిష్కార సామర్థ్యాలను, భావోద్వేగ నియంత్రణ, సామాజిక నైపుణ్యాలు తదితరాలు మెరుగుపడతాయని అంటోంది చిన్నారి మోలీ. ఆట మాదిరిగా సాధన చేయిస్తే చదువులో కూడా మెరుగ్గా రాణించగలుగుతారని నిపుణులు చెబుతున్నారు.నోరు విప్పనివ్వండి..మనలో చాలామంది పిల్లలు గట్టిగా మాట్లాడకూదనో లేక ఎదురు తిరగకూడదనో గమ్మున మాట్లాడనివ్వరు పెద్దలు. కానీ ఇది వారి ఎదుగుదలన అణిచేస్తుందట. ఆత్మవిశ్వాసం సన్నగిల్లే ప్రమాదం కూడా ఉంటుందట. వారి భావాలను, ఆలోచనలను చెప్పే స్వేచ్ఛని ఇస్తే... బలమైన కమ్యునికేషన్ నైపుణ్యాలు అవడతాయి. బొమ్మలు కంటే విలువైంది వారితో గడపటం..విహార యాత్రలకు తిప్పడం, విలువైన బొమ్మలు కొనడం వంటి వాటికంటే ముఖ్యమైనది వారితో గడపటం. వారి అంతులేని ప్రశ్నలకు ఓపికగా మీరిచ్చే సమాధానాలు వారికి భావోద్వేగ భద్రత, స్వీయ ప్రాముఖ్యతను తెలియజేస్తుందట.మన సర్కిలే వారి భవిష్యత్తుకి సోపానం..మనకు ఉండే స్నేహితులు, బంధువుల కారణంగా వారికి మంచిగా పెరిగే వాతావరణాన్ని అందిస్తుందట. ప్రపంచ దృష్టి కోణంపై వారికొక అవగాహన ఏర్పడతుందట. ఇదే వారికి ఉపాధ్యాయల పట్ల ఎలా వ్యవహరించాలనేది తెలుసుకునేలా చేస్తుందట కూడా. వారి ఆలోచనకు విలువ ఇద్దాం..తల్లిదండ్రులు చేసే అతిపెద్ద తప్పుల్లో ఒకటి వారి కలలను పిల్లలపై రుద్దడమేనని చెబుతోంది చిన్నారి మోలీ. వారేమి అవ్వాలనుకుంటున్నారు, అభిరుచి తదితరాల గురించి తెలుసుకుని మార్గదర్శకత్వం చేయాలే తప్ప మన ఆశలను వారిపై బలవంతంగా రుద్దకూడదట. అప్పుడే పిల్లలు మంచిగా వృద్ధిలోకి రాగలుగుతారంటోంది మోలీ. పిలల్లు అభివృద్ధి చెందేలా పెంచుతున్నామా లేదా అని విశ్లేషించుకునేలా..? అద్భుతంగా ప్రసంగించింది పిన్న వయస్కురాలైన టెడ్ స్పీకర్ మోలీ.(చదవండి: పని చేసే తల్లుల బ్రెస్ట్ ఫీడింగ్ పాట్లు..! నటి రాధికా ఆప్టే సైతం..) -
మదర్స్ ప్రైడ్ : తల్లిని తలుచుకొని నీతా అంబానీ భావోద్వేగం
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్పర్సన్ నీతా అంబానీ ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ 2025లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె తన తల్లి పూర్ణిమ దలాల్ను గుర్తు చేసుకుని భావోద్వాగానికి లోనయ్యారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎక్స్ ఖాతాలో దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తోంది. 'మదర్స్ ప్రైడ్' అని క్యాప్షన్తో షేర్ చేసిన ఈ పోస్ట్లో నీతా అంబానీ ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతున్న 50 సెకన్ల వీడియో కూడా ఉంది.బోస్టన్లో జరిగిన సమావేశంలో నీతా అంబానీ మాట్లాడుతూ.. తన ప్రసంగానికి ముందు తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో ప్రసంగించే అవకాశం తనకు లభించడం పట్ల తన 90 ఏళ్ల తల్లి ఎంత గర్వ పడిందో, ఎంతగా చలించిపోయిందో వివరించారు. చిన్నతనంలో హార్వర్డ్లో చదవాలని నీతా అంబానీకా చాలా కోరికగా ఉండేదట. కానీ ఆర్థిక పరిమితుల కారణంగా వెళ్లలేకపోయింది. కానీ ఇప్పుడు అదే హార్వర్డ్ వేదికపై ఆమె ప్రసంగించే అవకాశం దక్కడంతో నీతా తల్లి ఎంతో సంబరపడిపోయింది. ఇదే విషయాన్ని తన కోడళ్లు శ్లోకా మెహతా, రాధిక మర్చంట్లను ఫోన్ చేసి మరీ ఈ విషయాన్ని చెప్పి ఎంతో సంతోషడిపోయింది, చాలా భావోద్వేగానికి గురైంది అంటూ నీతా అంబానీ చెప్పారు. తనను ఆహ్వానించి తల్లిని సంతోషపెట్టినందుకు హార్వర్డ్ కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు నీతా. Mother's Pride: in an inspiring and heart-warming moment, Reliance Foundation Founder & Chairperson,Mrs. Nita Ambani shares how her mother felt proud that the same Harvard they aspired for but could not send young Nita because of financial constraints, has today invited her to… pic.twitter.com/R7as81bX9E— Reliance Foundation (@ril_foundation) February 17, 2025 అలాగే నీతా అంబానీ రాపిడ్ ఫైర్ అనే మరో విభాగంలో నీతా అంబానీ చాలాచక్కగా సమాధానాలిచ్చారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆమె భర్త రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం హాజరైన వారిని ఆకట్టుకుంది, ప్రేక్షకుల నుండి హర్షధ్వానాలు వచ్చాయి. ప్రధానమంత్రి మోదీ జీ దేశానికి గొప్పవారైతే, తన భర్త ముఖేష్ నా ఇంటికి మంచివారు అంటూ సమాధానమిచ్చారు. ఘఇదీ చదవండి: ఉన్నపాటుగా ప్రాణాలు తీస్తున్న గుండెపోటు : ఎలా గుర్తించాలి? -
రేవంత్వి దొంగ మాటలు: కేటీఆర్
సాక్షి,మహబూబ్నగర్జిల్లా: సీఎం రేవంత్ ఏ ఒక్క హామీనైనా అమలు చేశారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. మంగళవారం(ఫిబ్రవరి 18) అమన్గల్ల్లో జరిగిన రైతుదీక్షలో కేటీఆర్ మాట్లాడారు.‘సీఎం రేవంత్ 420 హామీలు ఇచ్చారు. రైతుబంధు, రుణమాఫీ ఎవరికైనా వచ్చాయా. తులం బంగారం వచ్చిందా. ఏదీ రాలేదు.దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ కొడంగల్కు, తల్లి గారి ఊరికి, అత్తగారి ఊరికి ఎవరికీ ఏమీ చేయలేదు. 42 శాతం రిజర్వేషన్లని చెప్పి బీసీలను మోసం చేసిండు. రైతులను మోసం చేసిండు. అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చాడు. సన్యాసి రేవంత్కు పాలన చేతనైతలేదు ’అని కేటీఆర్ ఫైరయ్యారు. -
నువు మళ్లీ గెలిస్తే రాజకీయాలు వదిలేస్తా: కేటీఆర్
సాక్షి,నారాయణపేటజిల్లా:ఏడాదిగా కొడంగల్లో దుర్యోధనుడి పాలన సాగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.సోమవారం(ఫిబ్రవరి10) కోస్గిలో జరిగిన బీఆర్ఎస్ ‘రైతుదీక్ష’లో కేటీఆర్ మాట్లాడారు.‘ఇక్కడ కురుక్షేత్ర యుద్దం సాగుతోంది. 14 నెలలుగా రేవంత్రెడ్డి తన కుటుంబ సభ్యుల కోసం పని చేస్తున్నాడు.అల్లుడికి కట్నం కోసం లగచర్ల భూములు గుంజుకున్నాడు. కుట్రతో అదానీకి,తన అల్లుడి కంపెనీకి భూములు ఇస్తున్నాడు. బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేయించారు.లగచర్ల బాధితుల తరపున బీఆర్ఎస్ ఢిల్లీలో పోరాడింది. గిరిజనులు తలచుకుంటే రేవంత్రెడ్డి కొడంగల్లో మళ్లీ గెలవడు. రేవంత్ రెడ్డి దమ్ముంటే రాజీనామాచేసి కొడంగల్లో పోటీ చేసి గెలువు.ఇక్కడ మా పార్టీ అభ్యర్దికి 50 వేల మెజార్టీ కంటే ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేస్తా’అని కేటీఆర్ సవాల్ చేశారు.రైతుదీక్షలో కేటీఆర్ కామెంట్స్..రాష్ట్రంలో 25 శాతం మంది రైతులకు కూడ రుణమాఫీ కాలేదుతమ హయాంలో 73 వేల కోట్ల రూపాయలను 12 సార్లు రైతుల ఖాతాల్లో రైతుబంధు వేశాంఈ ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు 17 వేల 500 రూపాయలు బాకీ ఉందిఎప్పుడు ఎన్నికలు వచ్చినా కొడంగల్లో బీఆర్ఎస్ అభ్యర్ది నరేందర్ రెడ్డి గెలుపు ఖాయంఇక్కడి కంది రైతుల దాన్యం కొనుగోలు చేయలేని దుస్దితి నెలకొందిరాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలోనైనా పూర్తి స్దాయిలో రుణమాఫీ జరిగితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాలగచర్లలో భూములకు ఒక్కో ఎకరానికి నీవు ఇచ్చే 20 లక్షలకు అదనంగా పార్టీ పరంగా 5 లక్షల రూపాయలు ఇస్తాం రేవంత్ రెడ్డి సొంత పొలాలు కంపెనీలకు ఇవ్వాలితెలంగాణలో ఎక్కడ రైతులకు,పార్టీ కార్యకర్తలకు నష్టం కలిగినా మేం రక్షణగా ఉంటాంకొడంగల్ ఎత్తిపోతల పథకం కేవలం కమీషన్ల కోసమే -
‘మార్గదర్శి’పై ఎంపీ మిథున్రెడ్డి ఫైర్
సాక్షి,న్యూఢిల్లీ: మార్గదర్శి స్కామ్ దేశంలోనే చాలా పెద్ద స్కామ్ అని, ఈ స్కామ్లో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం(ఫిబ్రవరి10) మిథున్రెడ్డి లోక్సభలో బడ్జెట్పై చర్చలో భాగంగా మాట్లాడారు.‘ మార్గదర్శి లక్షల మంది డిపాజిటర్లను మార్గదర్శి ముంచేసింది. మార్గదర్శి అక్రమాలపై కేంద్రం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇంత పెద్ద స్కామ్ జరిగితే ఏం చర్యలు తీసుకున్నారు. ప్రతిసారి ఈ అంశాన్ని లోక్సభలో ప్రస్తావిస్తూనే ఉన్నాం. ఇంత పెద్ద స్కాం జరిగితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఏం చేస్తోంది. రూ.2వేల600కోట్లు డిపాజిట్లుగా సేకరించారు. విశాఖ స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరిస్తున్నారా..కేంద్రం దీనికి సమాధానం చెప్పాలి.మిథున్రెడ్డి ఇంకా ఏమన్నారంటే..మార్గదర్శి రూ. 2600 కోట్ల రూపాయలు వసూలు చేసిందిఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి వసూలు చేసిందిడిపాజిటర్లకు న్యాయం జరగాలిదీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్గా చర్యలు తీసుకోవాలిఒకవైపు 75 వేల మెడికల్ సీట్లని కేంద్రం చెబుతోందికానీ ఏపీ ప్రభుత్వం మాత్రం మాకు మెడికల్ సీట్లు వద్దని సరెండర్ చేస్తుంది ఏపీలో 17 మెడికల్ కళాశాల నిర్మాణాన్ని ఆపేశారు.కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోని మెడికల్ కాలేజీల నిర్మాణానికి డబ్బులు ఇప్పించాలికేంద్రం విద్య, వైద్యంపై దృష్టి పెట్టాలిపోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించవద్దుపోలవరం నిర్మాణానికి అరకొరగా నిధులు ఇస్తున్నారురాజధాని అమరావతికి నిధులు వచ్చేలా చర్యలు తీసుకోవాలిపదేళ్ల తర్వాత రైల్వే జోన్ ఇచ్చారువాల్తేర్ డివిజన్ రెండుగా విభజించి అన్యాయం చేశారువాల్తేర్ డివిజన్ విశాఖ జోన్లోనే ఉంచాలివిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాంతిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో నాపై దాడిచేశారు: ఎంపీ గురుమూర్తి తిరుపతిలో తనపై జరిగిన దాడి అంశాన్ని లోక్సభలో 377 నిబంధన కింద లేవనెత్తిన ఎంపీ గురుమూర్తిఏపీలో ప్రజాస్వామ్య విలువలపై దాడి జరిగిందితిరుపతి కార్పొరేషన్ ఎన్నికల సమయంలో నాపైన, మహిళా కార్పొరేటర్లపై దాడికి పాల్పడ్డారుఎన్నికల నేపథ్యంలో రాజ్యాంగ విధులు నిర్వహిస్తున్న సమయంలో మమ్మల్ని అడ్డుకున్నారుతిరుపతి జిల్లా పోలీసులు దాడులు నిరోధించడంలో ఫెయిల్ అయ్యారుబాధ్యులపై చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర చూస్తున్నారుఈ దాడులపై వెంటనే దర్యాప్తు జరపాలిదాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి -
‘ఆప్’కు ఢిల్లీ ప్రజల షాక్: ప్రధాని మోదీ
సాక్షి,న్యూఢిల్లీ:ఢిల్లీ ప్రజలకు ఈరోజు పండుగ లాంటిదని,ఆప్ నుంచి వారికి విముక్తి లభించిందని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలో బీజేపీ విజయం సాధించిన సందర్భంగా శనివారం(ఫిబ్రవరి 8) సాయంత్రం బీజేపీ హెడ్క్వార్టర్స్లో జరిగిన సంబరాల్లో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీని గెలిపించిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.‘ఈ విజయంతో ఢిల్లీలో చరిత్ర సృష్టించాం. హర్యానా,మహారాష్ట్రలో గెలిచి రికార్డు సృష్టించాం. ఢిల్లీని ఇక అభివృద్ధి బాటలో నడిపిస్తాం.మీ ప్రేమను అభివృద్ధిలో చూపిస్తాం.ఢిల్లీ ప్రజల అభివృద్ధికి మోదీ గ్యారెంటీ. ఢిల్లీ ప్రజలు చూపించిన ప్రేమను అనేక రెట్లు వారికి తిరిగి ఇస్తాం. ఢిల్లీ ఎన్నికల్లో ప్రజలే విజేతలుగా నిలిచారు. మీ విశ్వాసాన్ని అభివృద్ధిలో తీసుకొస్తాం.ఢిల్లీ అనేది మినీ ఇండియా. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు.డబుల్ ఇంజిన్ సర్కార్తో ఢిల్లీ వేగంగా అభివృద్ధి చెందుతుంది. షాట్కట్ రాజకీయాలకు ప్రజలు షాకిచ్చారు. నేను పూర్వాంచల్ నుంచి ఎంపీగా ఉన్నందుకు గర్వపడుతున్నా. దేశ ప్రజలు ఎన్డీఏపై విశ్వాసం చూపిస్తున్నారు. చాలా స్టేట్లలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిందిఅవినీతికి వ్యతిరేకంగా పార్టీ పెట్టి ఆమ్ఆద్మీపార్టీ నేతలు అవినీతిలో మునిగిపోయారు. కాంగ్రెస్ పార్టీ అయితే వరుసగా మూడోసారి సున్నా సాధించింది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలను మిత్రులు కూడా గమనించింది. యమునా నదిని కాలుష్య కోరల నుంచి రక్షిస్తాం. ఢిల్లీ తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే కాగ్ రిపోర్టు బయటపెడతాం. కాంగ్రెస్కు ఓటములలో మెడల్ ఇవ్వొచ్చు. కాంగ్రెస్ నిజ స్వరూపం ఇండియా కూటమి పార్టీలకు అర్థమైంది. అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే ఎంతో పోరాడారు. ఆప్ ఓటమితో అన్నా హజారే కూడా ఎంతో సంతోషిస్తున్నారు’అని మోదీ పేర్కొన్నారు. -
Big Question: జగన్ స్పీచ్.. దెబ్బకు పోలీసుల్లో మార్పు
-
ఇక నుంచి జగన్ 2.Oని చూస్తారు..
-
ఇక కార్యకర్తల కోసం ఎలా పని చేస్తానో చూపిస్తా... వైఎస్సార్సీపీ నేతలతో సమావేశంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా
-
పోలవరం ఎత్తు తగ్గింపు వద్దు: రాజ్యసభలో వైవీ సుబ్బారెడ్డి
సాక్షి,న్యూఢిల్లీ:పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపును వ్యతిరేకిస్తున్నామని,ఈ నిర్ణయం రాష్ట్రానికి పట్టిన చంద్ర గ్రహణమని రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై వైవీ సుబ్బారెడ్డి సోమవారం(ఫిబ్రవరి3) రాజ్యసభలో మాట్లాడారు. ‘పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు గోదావరి ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. 150 ఫీట్ల ఎత్తుతో 194 టీఎంసీల నీటిని నిలువ చేసుకునే అవకాశం ఇచ్చారు. 41.15 మీటర్లకు ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం టీవల నిర్ణయం తీసుకుంది. 135 ఫీట్లకే ప్రాజెక్టు ఎత్తు పరిమితం చేశారు.ఇది ప్రజల ఆకాంక్షలకు,ట్రిబ్యునల్ ఇచ్చిన నిర్ణయానికి విరుద్ధం. ఈ విషయంపై టీడీపీ ప్రభుత్వం మౌనంగా మద్దతు తెలిపింది.ఈ నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నిర్ణయం రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం. 55 వేల కోట్ల రూపాయల అంచనాలకి ఆమోదం తెలపాలి.పోలవరం ఎత్తు తగ్గించడం వల్ల ఆయకట్టుకు పూర్తిగా నీరు ఉండదు, విశాఖపట్నానికి నీరు అందించే అవకాశం కోల్పోతాం. ఉత్తరాంధ్ర జిల్లాలకు సుజన స్రవంతి నీరు అందదు.పోలవరం కెనాల్స్కు సరిపడా నీరు అందదు. ఈ విషయంలో ప్రధాని జోక్యం చేసుకుని పోలవరం ఎత్తును యథాతథంగా ఉంచాలిసూపర్సిక్స్ పేరు చెప్పి చంద్రబాబు మోసం చేశారు..ఏపీలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపైన తీవ్ర వేధింపులకు పాల్పడుతున్నారని,గుడ్ గవర్నెన్స్ అంటే ఇదేనా అని రాజ్యసభ ఎంపీ వైవీసుబ్బారెడ్డి ప్రశ్నించారు. ‘ఏకంగా సోషల్ మీడియా కార్యకర్తలపై ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కేసులు పెడుతున్నారు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం నడవడం లేదు.రెడ్బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు.ప్రధాని,హోంమంత్రి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి.చంద్రబాబు ఏపీలో మేనిఫెస్టో అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. సూపర్సిక్స్ పేరుతో మేనిఫెస్టో ఇచ్చారు.20 లక్షల ఉద్యోగాలు,ఫ్రీ బస్సు ఇస్తామన్నారు. రైతులకు 20వేలు ఇస్తానన్నారు. మేనిఫెస్టో అమలు చేయకపోతే ఎన్నికల సంఘం,సుప్రీంకోర్టు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఆ పార్టీపై చర్యలు తీసుకోవాలి.వక్ఫ్ సవరణ బిల్లును మేం వ్యతిరేకిస్తున్నాం. ఈ బిల్లుపై తొందరపాటు తగదు.ఏపీలో ఇప్పటివరకు జనాభా లెక్కలు జరగలేదు.ఏపీలో ప్రత్యేకంగా జనాభా లెక్కల కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి.వైఎస్సార్సీపీ కృషివల్లే కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ మూడో బ్లాస్ట్ ఫర్నేస్లో ఉత్పత్తి ప్రారంభించబోతోంది. ఉద్యోగుల జీతాలను సైతం చెల్లించలేకపోతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడడానికి దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం.సెయిల్లో విలీనం చేయడంలో విఫలమయ్యారు.వైజాగ్ స్టీల్ ప్లాంట్కు సొంతగనులు కేటాయించాలి’అని వైవీసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.ఏపీలో రైతులు సంక్షోభంలో ఉన్నారు: రాజ్యసభలో ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ఏపీలో రైతులు సంక్షోభంలో ఉన్నారుకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరి పండించే రైతులను ఆదుకోవాలిరైతులను ఆదుకునేందుకు నాడు వైఎస్ జగన్ 11 పథకాలు అమలు చేశారుఆ పథకాలన్నిటినీ ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందిరైతులను ఆదుకోవడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందిఆదాయాలు ఉన్నా రైతులను ఎందుకు ఆదుకోవడం లేదునా ప్రసంగానికి అడ్డుపడి, రాజకీయాలకే పరిమితం కాకండిరైతుల సంక్షేమం కోసం రైతు భరోసా సున్నా వడ్డీ, ఉచిత పంట బీమా , జల కళ పథకాలను వైఎస్ జగన్ అమలు చేశారుచంద్రబోస్ ప్రసంగానికి పదేపదే అడ్డుపడ్డ టీడీపీ ఎంపీలు, మంత్రి పెమ్మసాని -
యూపీఏపైనా రాహుల్ విమర్శలు.. లోక్సభలో ఆసక్తికర పరిణామం
న్యూఢిల్లీ:ఇటీవల జరిగిన డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం అంశంపై లోక్సభలో రాహుల్గాంధీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. సోమవారం(ఫిబ్రవరి3) లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాహుల్గాంధీ మాట్లాడారు. మోదీ ప్రభుత్వానికి దేశ ఆర్థిక వ్యవస్థపై సీరియస్నెస్ లేదని విమర్శించారు. ట్రంప్ ప్రమాణస్వీకారానికి మోదీని ఆహ్వానించాలని అడిగేందుకే దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ను ముందుగా అమెరికా పంపారని రాహుల్గాంధీ అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షనేతగా ఉన్న రాహుల్గాంధీ ఆధారాల్లేని ఆరోపణలు చేయవద్దని మంత్రి కిరణ్ రిజిజు హితవు పలికారు.ఇది రెండు దేశాల మధ్య సంబంధాలకు సంబంధించి అంశమని,ప్రధానమంత్రికి ఆహ్వానంపై ఏది పడితే అది మాట్లాడవద్దని సూచించారు. దీనికి స్పందించిన రాహుల్గాంధీ మీ మనశ్శాంతికి భంగం కలిగించినందుకు క్షమాపణలు చెబుతున్నానన్నారు. అనంతరం రాహుల్ చైనా ఆక్రమణలపై మాట్లాడారు. భారత్లో కొంత భాగాన్ని చైనా ఆక్రమించుకుందని ప్రధాని మోదీ చెప్పేదానికి,సైన్యం చెప్పేదానికి పొంతన లేదని విమర్శించారు. వెంటనే స్పీకర్ ఓంబిర్లా కలుగజేసుకుని ఆధారాలు లేకుండా ఇలాటి విషయాలు సభలో మాట్లాడడం సరికాదన్నారు.యూపీఏనూ విమర్శించిన రాహుల్గాంధీ..యువతకు ఉద్యోగాల కల్పన అంశంపై రాహుల్గాంధీ లోక్సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన దేశం వృద్ధి చెందుతోంది. అయితే వృద్ధిలో ప్రస్తుతం వేగం తగ్గింది. ఉద్యోగాలు కల్పించే విషయంలో గత యూపీఏ, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వాలు రెండు యువతకు సమాధానం చెప్పలేకపోయాయని రాహుల్ అన్నారు. మేకిన్ ఇండియా మంచిదే అయినప్పటికీ దానితో ఒరిగేది ఏమీ లేదన్నారు. జీడీపీలో తయారీ రంగ వాటా తగ్గిపోయిందని రాహుల్ విమర్శించారు. -
వికసిత భారతమే ఏకైక లక్ష్యం..
-
పార్లమెంట్ లో ఉపరాష్ట్రపతి ప్రసంగం
-
ఆరోగ్యశ్రీ అంటే వైఎస్సార్.. రైతుబంధు అంటే కేసీఆరే గుర్తొస్తారు: కేటీఆర్
సాక్షి, నల్గొండ: కాంగ్రెస్ పాలన కొత్త సీసాలో పాత సార అన్నట్లుగా ఉందని, పాలిచ్చే ఆవును కాదని దున్నపోతును తెచ్చుకున్నామని రైతులు అనుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నల్లగొండలో మంగళవారం జరిగిన బీఆర్ఎస్ రైతు ధర్నాలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఇవాళ రైతు మహాధర్నాకు వచ్చినట్లు అనిపించలేదు. మళ్లీ మన ప్రభుత్వం వచ్చిందనే విధంగా నల్గొండలో అపూర్వ స్వాగతం లభించింది. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారనే రీతిలో స్వాగతం ఉంది. బ్రహ్మాండమైన విజయోత్సవ ఊరేగింపులా అనిపించింది.‘కేసీఆర్ 12సార్లు రైతుబంధు ఇచ్చారు కానీ ఇలా ప్రచారం చేసుకోలేదు. ఆరోగ్యశ్రీ అంటే వైఎస్సార్, రైతుబంధు అంటే కేసీఆర్ గుర్తొస్తారు. రుణమాఫీ,రైతుబంధు, వరికి బోనస్ అన్నింటిలో మోసాలే. మోసం చేయడంలో కాంగ్రెస్ నేతలు చరిత్ర సృష్టించారు.పంజాబ్,హరియాణాను తలదన్నేలా వరి పండించడంలో తెలంగాణను నెంబర్ వన్ చేశారు కేసీఆర్. జనవరి 26నే రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. కేసీఆర్ రైతు బంధు కింద 73 వేల కోట్లు ఇచ్చారు.నల్గొండ రైతులు అవస్థలకు,పిల్లలు జీవచ్ఛవాలుగా మారడానికి కారణం కాంగ్రెస్ నేతలే. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారు. ఏ ఊర్లో అయినా వంద శాతం రుణమాఫీ జరిగిందని చూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా.రుణమాఫీ 25 శాతం కూడా కాలేదు.గ్రామ సభల్లో హామీల అమలుపై జనాలు నిలదీస్తున్నారు. నల్గొండ నుంచే ప్రభుత్వంపై రైతు పోరు ప్రారంభిస్తున్నాం. దరఖాస్తుల వ్యాపారంతో రాష్ట్రంలో జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులు మాత్రమే సంతోషంగా ఉన్నారు’అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. -
గవర్నర్ తో అసత్యాలు, అబాద్ధాలు చదివించింది కూటమి సర్కార్
-
Republic Day 2025: జెండా ఎగురవేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్
లక్నో: 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లక్నోలోని తన అధికారిక నివాసంలో జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు.ఈ రోజున భారతదేశం తన రాజ్యాంగాన్ని అమలు చేయడం ద్వారా సార్వభౌమ, సంపన్న, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. సుదీర్ఘ పోరాటం తర్వాత దేశం 1947 ఆగస్టు 15న స్వతంత్రం దక్కించుకుంది. భారతదేశం డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నాయకత్వంలో ఒక రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసింది. రాజ్యాంగంలోని ప్రతి ఆర్టికల్ను రూపొందించే బాధ్యత బాబా సాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్కు అప్పగించారు. ఆయన 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభకు ముసాయిదాను సమర్పించారు. 1950 జనవరి 26న భారతదేశం సొంత రాజ్యాంగాన్ని అమలు చేసిందని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: దేశ ప్రజలకు ప్రధాని మోదీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు -
భూమన గూస్బంప్స్ స్పీచ్ దద్ధరిల్లిన తిరుపతి
-
జగనన్న కటౌట్ కే వణికిపోతున్నారు.. రోజా మాస్ స్పీచ్
-
YS Jagan: నేను జైల్లో ఉన్నప్పుడు నా భార్య నా కోసం.. గూస్ బంప్స్ స్పీచ్
-
రాజ్యాంగంపై చర్చ.. వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్రెడ్డి కీలక ప్రసంగం
సాక్షి,న్యూఢిల్లీ: రాజ్యాంగంలోని ఆర్టికల్ 81,82 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరగాలని వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం(డిసెంబర్16) రాజ్యసభలో రాజ్యాంగంపై జరిగిన చర్చలో నిరంజన్రెడ్డి పాల్గొని మాట్లాడారు. ‘దేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజనలో తగిన ప్రోత్సాహం ఉండాలి. నియోజకవర్గాల పునర్విభజన సమయంలో మా రాష్ట్రాల అభిప్రాయాలను కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. ఎన్నికల సంస్కరణలను తీసుకురావాల్సిన అవసరం ఉంది. రోజురోజుకి ఎన్నికల ఖర్చు భారీగా పెరిగిపోతోంది. ఎన్నికల్లో పోటీకి దిగాలంటే ఖర్చును చూసి భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో తగిన చట్టాలు రావాలి. ప్రజా ప్రాతినిధ్య చట్టాలలో తగిన మార్పులు రావాలి. నాణ్యమైన విద్య,వైద్యం తమ పిల్లలకు అందించే క్రమంలో తల్లిదండ్రులు పేదరికంలోకి జారుకుంటున్నారు. పేదరికానికి ప్రధాన కారణాలు విద్య,వైద్యం ఖర్చు పెరగడమే. దేశంలో ఆర్థిక అసమానతలు,ఆదాయ వ్యత్యాసాలు పెరుగుతున్నాయి.రాజ్యాంగ ఉద్దేశాలు ఇంకా పరిపూర్ణంగా సాధించలేదు. రాజ్యసభ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కనుక రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలి.సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు పని భారం పెరుగుతోంది.141 కోట్ల జనాభాకు కేవలం 35 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులున్నారు. ట్రిబ్యునల్స్ నుంచి నేరుగా సుప్రీంకోర్టుకే అప్పీల్కు వెళ్లకుండా, హైకోర్టులకు తగిన ప్రాధాన్యత కల్పించాలి’అని నిరంజన్రెడ్డి పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఏపీలో రాజ్యాంగ విరుద్ధ పాలన జరుగుతోంది: ఎంపీ విజయసాయిరెడ్డి -
అదానీ, అల్లుడి కోసమే రేవంత్ పాలన: కేటీఆర్
సాక్షి,మహబూబాబాద్: ఏడాదిలో ఇరవైఎనిమిదిసార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. లగచర్ల ఫార్మాసిటీ బాధితులకు న్యాయం చేయాలని సోమవారం(నవంబర్ 25) మహబూబాబాద్ పట్టణంలో జరిగిన బీఆర్ఎస్ మహాధర్నాలో కేటీఆర్ మాట్లాడారు.‘చిన్న సన్న కారు రైతులపై రేవంత్రెడ్డి జులుం ప్రదర్శిస్తున్నారు. లగచర్లలో సొంత అల్లుడి కోసం రేవంత్ పేదల భూములు లాక్కుంటున్నారు. రేవంత్రెడ్డికి బుద్ధి చెప్పాలి. లగచర్లలో పేదల భూములను వెంటనే తిరిగి ఇచ్చేయాలి’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. మహాధర్నాలో కేటీఆర్ ఇంకా ఏమన్నారంటే.. లగచర్లలో 3 వేల ఎకరాల భూములను చెరబట్టాలని చూశారుసీఎం రేవంత్ రెడ్డి.. తన సొంత నియోజకవర్గంలో ఓటేసి గెలిపించిన ప్రజలను ఇబ్బంది పెడుతున్నారుఢిల్లీకి 28 సార్లు వెళ్లి 28 రూపాయలు కూడా తేలేదురేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో తిరుగుబాటు ఎదుర్కొంటున్నాడులగచర్లకు అధికారులు పోతే నిరసన వ్యక్తం చేశారు.. రేవంత్ రెడ్డి పోతే ఉరికించి కొట్టేవాళ్ళుప్రధాని మోదీ.. రైతులు ఏడాది పాటు నిరసన తెలిపితే నల్ల చట్టాలు వెనక్కి తీసుకున్నారురేవంత్ రెడ్డి రైతులతో పెట్టుకున్నారుజైల్లో పెట్టిన 30 మందికి సంఘీభావంగా మానుకోటలో ధర్నా చేస్తామంటే.. అడ్డుకునే ప్రయత్నం చేశారుఎవరికోసం ఫార్మా విలేజ్..?.. అల్లుడి కోసం పేదవాళ్ల భూములు లాక్కుంటున్నారుముఖ్యమంత్రి పేదల కోసం పనిచేయడం లేదు..అదాని కోసం.. అల్లుడి కోసం.. అన్నదమ్ముల కోసం పనిచేస్తున్నారుపేద ప్రజల కోసం సీఎం రేవంత్ రెడ్డి పనిచేయడం లేదుఇంకా నాలుగు రోజులు అయితే ఈ ప్రభుత్వానికి ఏడాది పూర్తవుతుంది.. ఆరు గ్యారెంటీలు అన్నారు .. ఒక హామీ అయినా అమలైందారేవంత్ రెడ్డికి మహారాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారు.. కాంగ్రెస్ పార్టీని తన్ని వెళ్ళగొట్టారునేను వస్తే రాళ్లతో కొడతామని కొంతమంది ఎమ్మెల్యేలు అంటున్నారు.అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాళ్లతో కొడతామంటే పోలీసులు ఏం చేస్తున్నారుమానుకోట రాళ్ల మహత్యం ఏంటో తెలంగాణ ఉద్యమంలో చూపించాంకోర్టు ద్వారా అనుమతి తెచ్చుకుంటే.. వెయ్యి మంది వస్తారు అనుకుంటే 20 వేల మంది వచ్చారుప్రభుత్వం మీద ఎన్నో వ్యతిరేకత ఉందో మానుకోట మహా ధర్నా చూస్తే అర్థమవుతుందినాలుగేళ్లు గట్టిగా కొట్లాడుదాం.. ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడికి వస్తాంఢిల్లీకి వెళ్లి గిరిజనులు వివిధ కమిషన్లకు తమ బాధ చెప్తుంటే.. వాళ్లు కూడా ఎంతో బాధపడ్డారుగిరిజనుల రిజర్వేషన్ 6 శాతం నుంచి 10 శాతానికి పెంచారుమానుకోట మొదటి అడుగు మాత్రమే.. రాష్ట్రంలోని ప్రతి తండా, పల్లెకు వెళ్లి మద్దతు కూడా కడతాముఇదీ చదవండి: మహబూబాబాద్లో హైటెన్షన్..కేటీఆర్ ఫ్లెక్సీలు చింపివేత -
అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారు
-
పింక్ చొక్కాలు కాజేసిన భూములను పేదలకు పంచుతాం: మంత్రి పొంగులేటి
సాక్షి,కరీంనగర్జిల్లా: ధరణి చట్టంతో పేదల భూములను పింక్ చొక్కాల వారు కాజేశారని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. బుధవారం(నవంబర్ 20)వేములవాడలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా విజయోత్సవ సభలో పొంగులేటి పాల్గొని మాట్లాడారు.‘నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేశాం.రాబోయే నాలుగు ఏళ్ళలో 20 లక్షల ఇళ్ళు నిర్మించి ఇస్తాం.ఇందిరమ్మ ఇళ్ళు నిరంతర ప్రక్రియ..ప్రతి పేదవాడికి పక్కా ఇళ్ళు ఉండాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.దేశానికే రోల్ మోడల్గా తెలంగాణ రెవెన్యూ చట్టం 2024 రాబోతోంది.ధరణి చట్టంతో పేదల భూములను పింక్ చొక్కాల వారు కాజేశారు.ఆ భూములను ప్రజా ప్రభుత్వం తీసుకుని పేదలకు పంచి పెడుతాం’అని పొంగులేటి తెలిపారు. -
చిన్నారుల్లో మాటలు రావడం చాలా ఆలస్యమవుతుందా..?
కొందరు చిన్నారుల్లో మాటలు రావడం చాలా ఆలస్యమవుతుంది. దాంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలువుతుంది. తమకు దగ్గరి వాళ్లలో లేదా తమ బంధువుల్లో ఇలాగే జరిగిందనీ, మాటలు రావడం కొందరిలో ఇలాగే ఆలస్యమవుతుంటుందని సముదాయించడం మామూలే. ఇలా పిల్లలకు మాటలు రావడంలో ఆలస్యం జరగడానికి కారణాలేమిటి, ఆ సమస్యలను అధిగమించడం ఎలా అన్న అంశాలపై అవగాహన కోసం ఈ కథనం.పిల్లల్లో సాధారణంగా 10 నెలలు లేదా ఏడాది నాటికి కొన్ని కొన్ని ముద్దుమాటలు (బాబ్లింగ్) మొదలవుతుంది. రెండేళ్ల వయసు నాటికి తమ భావాలను చాలావరకు కమ్యూనికేట్ చేయ గలుగుతుంటారు. మూడేళ్లకు దాదాపుగా అన్ని మాటలూ వచ్చేస్తాయి. కానీ కొందరు పిల్లల్లో మాట రావడం కాస్త ఆలస్యమవుతుంది. వినికిడి వ్యవస్థ బాగుందని తెలిశాక... అలా మాటలు రావడం ఆలస్యమైన పిల్లల్లో చాలామంది సాధారణంగా స్కూల్లో చేర్చే వయసు నాటికి తమంతట తామే మాట్లాడగలుగుతారు. కారణాలు... పిల్లల్లో మాటలు రావడం ఆలస్యం కావడానికి అనేక కారణాలు ఉంటాయి. వీటిల్లో... వినడానికి అవసరమైన వినికిడి వ్యవస్థ, అలాగే మాట్లాడటానికి అవసరమైన వోకల్ కార్డ్స్, మాట్లాడేందుకు ఉపయోగపడే గొంతులోని కండర నిర్మాణం... ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ, కొందరిలో సహజంగానే మాటలు రావడం ఆలస్యమవుతుంటుంది. అలాగే చిన్నారుల్లో వారి భాష ఓ స్థాయి పరిణతికి రావడంలో జరిగే ఆలస్యం (లాంగ్వేజ్ మెచ్యురేషన్ డిలే) కావడం కూడా దీనికి కారణం. చాలావరకు వంశ΄ారంపర్యంగా ఇలా జరుగుతుంటుంది. అమ్మాయిలతో ΄ోలిస్తే ఈ సమస్య అబ్బాయిల్లోనే ఎక్కువ.కొన్ని సందర్భాల్లో అనారోగ్యాలకు సూచిక... కొందరు చిన్నారుల్లో మాటలు రావడంలో ఆలస్యం జరగడం అనేది కొన్ని సందర్భాల్లో అండర్లైయింగ్ ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. ఇలా మాటలు రాక΄ోవడం చాలా రకాల ఆరోగ్య సమస్యలను సూచించే ఒక లక్షణం కావచ్చు. ఉదా: వినికిడి లోపాలు, మానసికమైన సమస్యలూ, ఆటిజం వంటి కండిషన్, భాషను అర్థం చేసుకోవడం, అభివ్యక్తీకరించడంలో సమస్యలు... మొదలైనవాటిల్లో ఏదో ఒకదానివల్ల మాటలు రావడం ఆలస్యం కావచ్చు.కొన్నిసార్లు అది ఎదుగుదల సమయంలో వచ్చే ఇతర ఆరోగ్య లోపాల వల్ల కూడా అయి ఉండవచ్చు. ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ డిజార్డర్ ఉన్న పిల్లలు భాషను ఒక కమ్యూనికేటివ్ సాధనంగా వాడటంలో విఫలమవుతారు. అయితే వారిలోని తెలివితేటలు, వినికిడి, ఉద్వేగభరితమైన ఫీలింగ్స్... తదితర విషయాల్లోనూ మామూలుగానే ఉంటారు. తమ సంజ్ఞలు, సైగల ద్వారా కమ్యూనికేషన్ అంతా సాధారణంగానే చేస్తు్తంటారుగానీ, మాటలు లేదా పదాలు పలకడం (వర్బల్ ఎక్స్ప్రెషన్స్) ద్వారా తమ అభి్ర΄ాయాలను వెల్లడించడం మాత్రం చాలా పరిమితంగా ఉంటుంది.ఈ పిల్లల విషయంలో పరిష్కారాలేమిటి? ఇలాంటి పిల్లల విషయంలో... వారు మాటలు నేర్చుకోవడం / మాట్లాడటం అనే ప్రక్రియ ఎందుకు ఆలస్యం అవుతోందో తెలుసుకోవడం తప్పనిసరి. ఇందుకు పూర్తిస్థాయి ఇవాల్యుయేషన్ అవసరం. ఇందుకోసం... ‘ఎర్లీ లాంగ్వేజ్ మైల్స్టోన్ స్కేల్ టెస్ట్’, ‘స్టాన్ఫోర్డ్ ఇంటెలిజెన్స్ టెస్ట్’, ఆడియోమెట్రీ, బ్రెయిన్ స్టిమ్యులస్ రెస్పాన్స్ టెస్ట్ వంటి పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. ఈ పరీక్షల వల్ల మాటలు రాక΄ోవడానికి కారణాలేమిటి, ఆ కారణాల తీవ్రత ఎంత, వాటి ప్రభావాలు ఏ మేరకు ఉన్నాయన్న పలు విషయాలు తెలుస్తాయి. ఇలాంటి పిల్లలున్నవారు ఒకసారి మీ కుటుంబ పిల్లల డాక్టర్కూ అటు తర్వాత అవసరాన్ని బట్టి స్పీచ్ థెరపిస్ట్కూ చూపించాలి. ఒకసారి సమస్యనూ, తీవ్రతనూ తెలుసుకుంటే... ఆ తర్వాత ‘స్పీచ్ పాథాలజిస్ట్’లు పిల్లలకు మాటలు వచ్చే శిక్షణను మొదలుపెడతారు. తల్లి దండ్రులకూ కొంత శిక్షణ అవసరం... ఇలాంటి పిల్లలకు మాటలు నేర్పే విషయంలో తల్లిదండ్రులు చాలా ఓపికతో వ్యవహరించాల్సి ఉంటుంది. వాళ్లకూ కొంత శిక్షణ అవసరమవుతుంది. తల్లిదండ్రులు పూర్తి సహనంతో ఉంటూ, భాష విషయంలోతామూ పిల్లల స్థాయికి చేరుకుని, వాళ్లకు మాటలు నేర్పాలి. తల్లిదండ్రులు నిత్యం ఆ పిల్లలను ఉత్సాహపరుస్తూ... వారికి భాషతోటు ఇతర నైపుణ్యాలూ నేర్పడానికి సంసిద్ధంగా ఉండాలి.(చదవండి: నలుపు తగ్గేదెలా..?) -
చరిత్రలో లేని గెలుపు: ఫలితాలపై స్పందించిన ట్రంప్
ఫ్లోరిడా: అమెరికా ఎన్నికల ఫలితాలు ఎవరూ ఊహించలేదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ దూసుకుపోతున్న సందర్భంగా ఫ్లోరిడాలో బుధవారం(నవంబర్ 6) ట్రంప్ తన అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. ట్రంప్ మాట్లాడుతుండగా ఆయన అభిమానులు ట్రంప్..ట్రంప్ నినాదాలతో హోరెత్తించారు. తన గెలుపు అమెరికాకు ఉపయోగమని ఈ సందర్భంగా ట్రంప్ చెప్పారు. అమెరికా ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికన్లకు సువర్ణయుగం రాబోతోందన్నారు. రిపబ్లికన్లకు 300కుపైగా సీట్లు వచ్చే అవకాశం ఉంది. పాపులర్ ఓట్లు కూడా మాకే ఎక్కువ వచ్చాయి. ఇక అమెరికాలోకి అక్రమ వలసలు ఉండవు. అందరూ చట్టబద్ధంగానే రావాల్సి ఉంటుంది. సరిహద్దులు మూసివేస్తా. అక్రమ వలసలు అడ్డుకుంటాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తా.‘నా విజయంలో నా వెన్నంటి ఉన్న నా కుటుంబానికి కృతజ్ఞతలు. ఇది మొత్తం అమెరికన్లు గర్వించే విజయం. వైఎస్ ప్రెసిడెంట్ అభ్యర్థి జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా చిలుకూరి బాగా పనిచేశారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా వాన్స్ ఎంపిక సరైనదేనని తేలింది. తొలుత వాన్స్ ఎంపికపై వ్యతిరేకత వచ్చింది.’అని ట్రంప్ గుర్తు చేశారు. ట్రంప్ ప్రసంగించిన వేదికపైనే ట్రంప్ కుటుంబ సభ్యులతో పాటు ఉపాధ్యక్ష అభ్యర్థి వాన్స్ కూడా ఉన్నారు.#WATCH | West Palm Beach, Florida | Republican presidential candidate #DonaldTrump says, "...This is a movement that nobody has ever seen before. Frankly, this was, I believe, the greatest political movement of all time. There has never been anything like this in this country and… pic.twitter.com/MEcRDSAI72— ANI (@ANI) November 6, 2024 ఇదీ చదవండి: అమెరికా ఎన్నికల ఫలితాల అప్డేట్స్ -
Watch Live: ట్రంప్ విక్టరీ స్పీచ్
-
డెమోక్రాట్లలో నిరాశ.. కమల ప్రసంగం రద్దు..!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు ట్రంప్ తొలినుంచి హావా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే రెండు కీలక స్వింగ్ స్టేట్స్ నార్త్ కరోలినా, జార్జియాలో విజయం సాధించి మరో నాలుగింటిలో లీడ్లో ఉన్నారు. దీంతో ట్రంప్ గెలుపు ఖాయమన్న భావన ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఇటు రిపబ్లికన్లలో జోష్ నెలకొనగా అటు డెమోక్రాట్లు నిరాశలో మునిగిపోయారు. ట్రంప్ బుధవారం ఫ్లోరిడాలో తన అభిమానులనుద్దేశించి ప్రసంగించనుండగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్ మాత్రం బుధవారం తన షెడ్యూల్ను రద్దు చేసుకున్నారు. నిజానికి బుధవారం ఉదయం ఆమె హవర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించాల్సి ఉంది. ఫలితాలు అంత ఆశాజనకంగా లేకపోవడంతో ఆమె తన ప్రసంగాన్ని రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: కీలక ‘స్వింగ్’లో ట్రంప్ హవా.. -
ఇకపై నేచురల్ బ్యూటీ కాదు.. సాయి పల్లవికి కొత్త పేరు పెట్టిన నాగచైతన్య! (ఫొటోలు)
-
మళ్లీ YSRCP గెలవడం ఖాయం
-
మాటే మంత్రం.. తడబడే మాటకు తర్ఫీదు ఇస్తున్నారు
మాటలే మంటలు రేపుతాయి.. చెలరేగిన మంటలను నోటి మాటలే చల్లార్చుతాయి. నోట్ల కట్టల కంటే నోటి మాటకే పదునెక్కువ. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఇందులో ప్రతి ఒక్కటీ తీసిపడేయలేని నిత్యసత్యాలే. మనం మాట్లాడే మాటకున్న విలువను తెలియజేసే సామెతలు. మనిషికి ఉన్న 64 కళల్లో వాక్చాతుర్యం ఒకటి. మాటలే కదా ఎన్నయినా మాట్లాడతాం అనుకుంటే పొరపడినట్లే.. మైక్ పట్టుకుని నలుగురిలో అనర్గళంగా మాట్లాడటం అందరికీ సాధ్యం కాదు. ప్రపంచంలో 514 రకాల భయాలు ఉండగా.. అందులో ప్రథమ స్థానంలో పబ్లిక్ స్పీచ్ నిలిచింది. రెండో స్థానంలో మరణం ఉందని అమెరికాకు చెందిన పలు సర్వే సంస్థలు తెలియజేస్తున్నాయి. నలుగురిలో ప్రసంగించాలంటే.. మనసులో ఏదో తెలియని భయం. మైక్ పట్టుకున్న చేతికి వణుకు మొదలవుతుంది. వీటిని అధిగమించిన వారికే ఏ రంగంలోనైనా ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. మనలో చాలా మందికి ఎన్నో చెప్పాలని మనసులో ఉంటుంది. అయితే బయటకు చెప్పడానికి మాటలు రావడంలేదు అంటారు. అధికారం కోసం రాజకీయ నాయకులు, ఉద్యోగం, పదోన్నతి కోసం ఇంటర్వ్యూను ఎదుర్కొనాల్సిన అభ్యర్థులు, విద్యార్థులు, తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడంలో వ్యాపార సంస్థలు, తాను తీసుకున్న కేసును గెలిపించడం కోసం న్యాయవాది తదితర రంగాల్లోని వ్యక్తులకు వాక్చాతుర్యం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఇటువంటి వారిలో అవసరమైన వారికి మాటలు నేరి్పంచడానికి నగరంలో పదుల సంఖ్యలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. ఏ రంగంలోని వారికైనా సమయం, సందర్భానుసారం మాట్లాడే మెళకువలు నేర్పిస్తామంటున్నారు. ఆ భయం ఎందుకు? వేదికపై మైక్ పట్టుకుని మాట్లాడాలంటే భయంతో కాళ్లు చేతులు ఎందుకు వణుకుతున్నాయి. నలుగురిలో మాట్లాడాలంటే మాట ఎందుకు తడబడుతోంది. మనసులోని భావాన్ని చెప్పడంలో వెనుకాడటానికి కారణం.. ఇలా ఎన్నో ప్రశ్నలకు అనుభవం లేకపోవడం, సిగ్గు, బిడియం మొదలైనవి కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈ కారణాలే మాటల తడబాటుకు కారణాలట. ఒక్కోసారి నలుగురిలో నవ్వులపాలవుతున్నారు. ఆ భయం పోవాలంటే ఏం చేయాలనే అంశాలపై ఫోకస్ చేస్తున్నారు. బృందాలుగా ఏర్పాటు చేసి ఒక అంశంపై చర్చలు పెడుతున్నారు. మైక్ పట్టుకుని తనకు నచి్చన అంశంపై ధారాళంగా మాట్లాడాలని ఆహా్వనిస్తున్నారు. మనసులో మాటను స్వేచ్ఛగా ప్రకటించేందుకు అవసరమైన టిప్స్ ఇస్తున్నారు. నాలుగు రోజుల నుంచి 10 రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు. దీనికి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకూ ఫీజు తీసుకుంటున్నారు.ఆకట్టుకున్నవారికే అందలం..మాట్లాడే సబ్జెక్ట్పై పట్టుండాలి. చెప్పే మాటల్లో కొత్తదనం కనిపించాలి. మాట్లాడే సమయంలో హావభావాలు, శారీరక కదలికలు ఇతరులను ఆకర్షించాలి. మన మాటలకు ఎదుటి వ్యక్తి ఫీలింగ్స్ పసిగట్టాలి. సందర్భానుసారం అందరినీ ఆకట్టుకునేందుకు ప్రయతి్నంచాలి. ఈ అంశాల్లో పట్టున్న వారిని మాత్రమే ప్రజలు ఆదరిస్తారు. నాయకుడనే కిరీటం అందిస్తారు. అధికారం కట్టబెడతారు.మాటలతోనే గుర్తింపు.. తొలినాళ్లలో నలుగురిలో మాట్లాడటానికి ఇబ్బందిపడాల్సి వచ్చేది. దీన్ని అధిగమించేందుకు శిక్షణ తీసుకున్నాను. ప్రొఫెషన్ పరంగా ఇప్పుడు వేలాది మంది ఉన్న సభల్లో డయాస్పై అనర్గళంగా మాట్లాడగలుగుతున్నాను. టీవీ షోల్లో పాల్గొంటున్నా. ఎదుటి వ్యక్తి ఎలా చెబితే వింటాడో మనం గుర్తించగలగాలి. మన ఆలోచనలను వరుసక్రమంలో పెట్టుకోవాలి. సందర్భానుసారం ఆకట్టుకునే విధంగా మాట్లాడితే మనకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. – పల్లవి, సైకాలజిస్టు, హైదరాబాద్సెల్ఫ్ కాని్ఫడెన్స్ పెరిగింది.. పబ్లిక్ స్పీచ్ అందరికీ అవసరమే. ఉద్యోగంలో భాగంగా కాన్ఫరెన్స్లో మాట్లాడాల్సి ఉంటుంది. గతంలో అనుకున్నంత గొప్పగా మాట్లాడలేకపోయాననే ఆలోచన ఉండేది. శిక్షణ తీసుకున్నప్పుడు చాల విషయాలు నేరి్పంచారు. సెల్ఫ్ కాని్ఫడెన్స్ మన కెరీర్కు ఎంతగానో ఉపయోగపడుతుంది. స్పీచ్కి సబ్జెక్ట్ ఎంత ముఖ్యమో.. ఆరంభం, ముగింపు రెండూ అంతే ముఖ్యం. – కిరణ్రెడ్డి, పోలీసు పీఆర్ఓ, సైబరాబాద్మాటలు వెనక్కి వచ్చేవి.. నాకు కమ్యూనికేషన్ ఫీల్డ్ అంటే ఇష్టం. పది మందిలో మాట్లాడాలంటే నా మనసులో మాటలు వెనక్కి వచ్చేవి. ట్రైనింగ్లో చేరినప్పుడు ఎలా ఉంటుందోనని భయపడ్డాను. లెక్చర్ ఇస్తారని ఊహించుకున్నాను. ఇక్కడ ప్రాక్టికల్గా నేరి్పస్తున్నారు. మైక్ ముందు ఐదు నిమిషాలు మాట్లాడితే బోలెడు తప్పులుండేవి. వాటిని సరిదిద్దుకుంటున్నా. పది నిమిషాలు మాట్లాడగలుగుతున్నాను. – సింధుశ్రీ, విద్యారి్థనిఅవకాశాలు కోల్పోతున్నారు.. ఆకట్టుకునే విధంగా మాట్లాడటం తెలియక చాలామంది అవకాశాలు కోల్పోతున్నారు. 15 ఏళ్ల విద్యార్థి నుంచి 70 ఏళ్ల వయసు వారికీ వాక్చాతుర్యం అవసరం. స్కిల్ అనేది జీవితాంతం ఉంటుంది. ఎక్కువగా రాజకీయ నాయకులు, విద్యార్థులు, ఉద్యోగులు వస్తున్నారు. సుమారు 800 బ్యాచ్లలో ఐదువేల మందికిపైగా శిక్షణ ఇచ్చాం. శిక్షణ అనంతరం తమలో మార్పు కనిపించింది అంటున్నారు.– దన్నారపు కల్పన, మీడియా జంక్షన్ డైరెక్టర్ -
నన్ను టార్గెట్ చేసిన వారికి.. నేనేంటో చూపిస్తా..
-
ఇండియాలో ఎక్కడికి వెళ్లిన నన్ను గుర్తుపట్టేది తెలుగు సినిమా వల్లనే..
-
‘హిందువులు ఎక్కడున్నా ఐక్యంగా మెలగాలి’
నాగ్పూర్: దేశవ్యాప్తంగా విజయదశమి వేడుకలు జరుగుతున్నాయి. దసరా సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్పూర్లోగల రేషమ్బాగ్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఆయుధ పూజలు చేశారు. అనంతరం సంఘ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.సంఘ్ త్వరలోనే 100వ ఏడాదిలోకి అడుగుపెడుతున్నట్లు మోహన్ భగవత్ తెలిపారు. భారతదేశం అన్ని రంగాల్లోనూ పురోగమిస్తున్నదని, మన దేశ విశ్వసనీయత, ప్రతిష్ట మరింతగా పెరిగిందన్నారు. జమ్మూకశ్మీర్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని మోహన్ భగవత్ పేర్కొన్నారు. యువత మార్గనిర్దేశకత్వంలో భారత్ అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నదన్నారు.బంగ్లాదేశ్లో హిందూ సమాజంపై హింసాకాండ జరుగుతున్నదని, అయితే హిందువులు ఐక్యంగా ఉన్నప్పుడు ఇలాంటి అకృత్యాలకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు. బంగ్లాదేశ్లోని హిందువులు తమను తాము రక్షించుకునేందుకు వీధుల్లోకి వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు వారికి సహాయం అందించాలని అన్నారు. అఘాయిత్యాలకు పాల్పడే స్వభావం ఉన్నంత కాలం.. హిందువులే కాదు మైనార్టీలందరూ ప్రమాదంలో పడతారని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. #WATCH | Nagpur, Maharashtra | #VijayaDashami | RSS chief Mohan Bhagwat says, "What happened in our neighbouring Bangladesh? It might have some immediate reasons but those who are concerned will discuss it. But, due to that chaos, the tradition of committing atrocities against… pic.twitter.com/KXfmbTFZ5D— ANI (@ANI) October 12, 2024ఇది కూడా చదవండి: భక్తిభావంతో మెలగాలి -
నెల్లూరులో వైఎస్సార్సీపీ జెండా ఎగరేస్తాం..
-
కశ్మీర్లో బీజేపీదే గెలుపు: ప్రధాని మోదీ
జమ్మూ:కశ్మీర్లో తొలిసారి పూర్తిమెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.జమ్మూలో శనివారం(సెప్టెంబర్28)నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు.‘కశ్మీర్లో ఇప్పటికే పూర్తయిన రెండు దశల ఎన్నికల్లో పోలింగ్ సరళి చూస్తే ప్రజల మూడ్ ఎలా ఉందో అర్థమవుతోంది.రెండు దశల పోలింగ్లో భారీగా ఓటింగ్ శాతం నమోదైంది.ప్రజలంతా బీజేపీకే ఓటు వేశారు’అని మోదీ అన్నారు.జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే రెండు దశల పోలింగ్ పూర్తవగా మూడో దశ పోలింగ్ ఆదివారం జరగనుంది.మొత్తం ఐదు దశల్లో కశ్మీర్ ఎన్నికలను ఎన్నికల కమిషన్ నిర్వహిస్తోంది. ఇదీచదవండి: నిర్మలాసీతారామన్పై కేసు నమోదు -
ప్రభుత్వాన్ని జైలు నుంచే నడవపచ్చని నిరూపించాం: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వచ్చాక తొలిసారి ఆదివారం పార్టీ కార్యాలయానికి వచ్చారు. అక్కడ ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో సంభాషించారు. తనకు జైల్లో పుస్తకాలు చదవడానికి, ఆలోచించడానికి చాలా సమయం దొరికిందని కేజ్రీవాల్ అన్నారు. తాను గీతను చాలాసార్లు చదివానని, ఈ రోజు నేను మీ ముందుకు ‘భగత్ సింగ్ జైల్ డైరీ’తీసుకువచ్చానని అన్నారు. భగత్ సింగ్ జైలులో చాలా లేఖలు రాశారు. భగత్ సింగ్ బలిదానం జరిగిన 95 ఏళ్ల తర్వాత ఒక విప్లవ ముఖ్యమంత్రి జైలుకు వెళ్లాడు. నేను ఎల్జీకి జైలు నుంచి ఒక లేఖ రాశాను. జాతీయ జెండా ఎగురవేసేందుకు అతిషీకి అనుమతివ్వాలని ఆగస్టు 15వ తేదీకి ముందు లేఖ రాశాను. ఆ లేఖ ఎల్జీకి అందలేదు. మరోసారి లేఖ రాస్తే కుటుంబ సభ్యులను కలిసే అవకాశాన్ని నిలిపివేస్తామని హెచ్చరించారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచాక తమకంటే క్రూరమైన పాలకుడు ఈ దేశానికి వస్తాడని బ్రిటీష్ వారు కూడా ఊహించి ఉండరు అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.తాను జైల్లో ఉన్నప్పుడు ఒకరోజు సందీప్ పాఠక్ తనను కలవడానికి వచ్చాడు. అతను నాతో రాజకీయాల గురించి మాట్లాడాడు. దేశంలో ఏమి జరుగుతోంది, పార్టీలో ఏమి జరుగుతోంది అని నేను అడిగాను. ఇది జరిగాక సందీప్ పాఠక్ను బ్లాక్లిస్ట్లో పెట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీని విచ్ఛిన్నం చేయడం, కేజ్రీవాల్ ధైర్యాన్ని దెబ్బతీయడం వారి లక్ష్యం. వారు ఒక ఫార్ములా తయారుచేశారు. కేజ్రీవాల్ను జైలుకు పంపితే ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ఫీలింగ్లో ఉన్నారు. అయితే మా పార్టీ విచ్ఛిన్నం కాలేదు. మా ఎమ్మెల్యేలు విచ్ఛిన్నం కాలేదు. వారి పెద్ద కుట్రలకు వ్యతిరేకంగా పోరాడే శక్తి ఆమ్ ఆద్మీ పార్టీకి మాత్రమే ఉంది.ప్రభుత్వాన్ని జైలు నుంచే నడపవచ్చని నిరూపించామని కేజ్రీవాల్ అన్నారు.ప్రభుత్వాన్ని జైలు లోపల నుండి ఎందుకు నడపకూడదని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అప్పుడు మేము ప్రభుత్వాన్ని నడపగలమని నిరూపించాం. బీజేపీయేతర ముఖ్యమంత్రులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఎప్పుడైనా మిమ్మల్ని అరెస్టు చేసే ప్రయత్నం జరిగితే భయపడవద్దు. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీకి వారి కుట్రలన్నింటిని తిప్పికొట్టే శక్తి ఉంది ఎందుకంటే మనం నిజాయితీపరులం. వారు నిజాయితీ లేనివారు కాబట్టి మన నిజాయితీకి భయపడతారని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: సెబీ చీఫ్పై మరోసారి కాంగ్రెస్ ఆరోపణలు -
సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు భూమిపూజ
-
సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు భూమిపూజ
-
వడ్డీతో సహా చెల్లిస్తా..
-
పంద్రాగస్టు స్పీచ్తో సరికొత్త రికార్డు
-
పవన్ కళ్యాణ్ ఇండిపెండెన్స్ డే స్పీచ్
-
ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే స్వాతంత్య్రం
-
2047 నాటికి వికసిత భారత్ మన లక్ష్యం
-
Independence Day 2024: ప్రధాని మోదీ ఖాతాలో అరుదైన ఘనత..
భారతదేశం రేపు (ఆగస్టు 15) 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రాత్మక ఎర్రకోటపై నుంచి వరుసగా 11వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇంతకుముందు ఈ ఘనతను పండిట్ జవహర్లాల్ నెహ్రూ సాధించారు. నెహ్రూ దేశ మొదటి ప్రధానమంత్రిగా వరుసగా 11 స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాలు చేశారు.ఈ సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు దాదాపు నాలుగువేల మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. వీరిలో రైతులు, యువత, మహిళలు, అల్పాదాయ వర్గాలవారు ఉన్నారు. ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్న మొత్తం 117 మంది భారతీయ అథ్లెట్లు ఎర్రకోటలో జరిగే వేడుకల్లో పాల్గొననున్నారు. ప్రధాని మోదీ గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఒలింపిక్ అథ్లెట్లను కలిసే అవకాశం ఉంది.వేడుకలకు హాజరయ్యే ప్రత్యేక అతిథులను 11 బృందాలుగా విభజించారు. వీరిలో వెయ్యిమంది మంది అతిథులు వ్యవసాయం, రైతు సంక్షేమ రంగానికి చెందినవారు. యువజన విభాగం నుంచి 600 మంది, మహిళా శిశు అభివృద్ధి నుంచి 300 మంది అతిథులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి 300 మంది, గిరిజన శాఖ నుంచి 350 మంది అతిథులు హాజరుకానున్నారు. అతిథుల పూర్తి జాబితా... విభాగం అతిథుల సంఖ్య వ్యవసాయం , రైతు సంక్షేమం 1,000 మంది అతిథులు యువజన వ్యవహారాలు 600 మంది క్రీడా విభాగానికి సంబంధించినవారు 150 మంది మహిళా, శిశు అభివృద్ధి శాఖ 300 మంది పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ 300 మంది గిరిజన వ్యవహారాలశాఖ 350 మంది పాఠశాల విద్య, అక్షరాస్యత రంగాలకు చెందినవారు 200 మంది బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్/మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ 200 మంది ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ నుంచి.. 150 మంది నీతి ఆయోగ్కు చెందినవారు 1,200 మంది -
తెలుగు ప్రేక్షాకుల ఎనర్జీ వేరే లెవెల్..
-
ఎస్వోటీ, గ్రేహండ్స్ తరహాలో హైడ్రా: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: నగరాభివృద్ధికి హైడ్రాను సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఔటర్ లోపల ఉన్న నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. హైదరాబాద్ రోడ్లపై నీరు ఆగకుండా ఉండేందుకు వాటర్ హార్వెస్టింగ్లను ఏర్పాటు చేస్తామని రేవంత్ తెలిపారు. మూసీని సబర్మతి, లండన్ థీమ్స్ తరహాలో డెవలప్ చేస్తాం. త్వరలోనే మూసీ ప్రక్షాళనకు కన్సల్టెంట్లను నియమిస్తామని సీఎం పేర్కొన్నారు.ఎస్వోటీ, గ్రేహండ్స్ తరహాలోనే హైడ్రా తెస్తున్నాం. దీని పరిధి 2వేల కిలోమీటర్లకు విస్తరించాం. ప్రపంచంతో పోటీ పడేలా చేసేందుకే సంస్కరణలు తెస్తాం. నగరంలో సరస్సులు అదృశ్యమవుతున్నాయని.. నాలాల కబ్జాలతో హైదరాబాద్ అతలాకుతలమవుతోందని రేవంత్ అన్నారు.మల్లన్నసాగర్ నుంచి ఉస్మాన్సాగర్కు జలాల తరలింపునకు ప్రణాళిక సిద్ధం చేశామన్న సీఎం.. రూ.6 వేల కోట్ల ప్రతిపాదనలు కేంద్రానికి ఇచ్చామని రేవంత్ చెప్పారు. -
‘సూపర్సిక్స్’ అమలు ఎప్పుడు?: లోక్సభలో ఎంపీ మిథున్రెడ్డి
సాక్షి,ఢిల్లీ: ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను సారీ సిక్స్ గా మార్చవద్దని వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్రెడ్డి కోరారు. సోమవారం(జులై 29) లోక్సభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా మిథున్రెడ్డి మాట్లాడారు. ఏపీలో సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడం లేదని, సూపర్ సిక్స్ అమలుకు గడువు ప్రకటించాలని డిమాండ్ చేశారు. శాంతిభద్రతలు లేకుండా పెట్టుబడులు ఎలా..ఏపీలో శాంతిభద్రతలు దిగజారితే పెట్టుబడులు ఎలా వస్తాయి. నా నియోజకవర్గంలో నన్ను తిరగకుండా అడ్డుకున్నారు. నాపైన దాడి చేశారు. నా వాహనాన్ని ధ్వంసం చేశారు. అన్ని టీవీ చానల్స్ చూస్తుండగానే దాడి జరిగింది. నాపైనే దాడి చేసి నాకు వ్యతిరేకంగా హత్యాయత్నం కేసు పెట్టారు. ఏపీలో శాంతిభద్రతలను కాపాడాలి. హింసకు చరమ గీతం పాడాలి. అమరావతికి రుణం వద్దు.. గ్రాంట్గా కావాలి..పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి బాధ్యులు ఎవరు. అమరావతికి ఇచ్చే రూ. 15వేల కోట్లు రుణంగా కాకుండా గ్రాంట్గా ఇవ్వాలి. విశాఖ స్టీల్ ప్లాంట్కు గనులు కేటాయించాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం. పదేళ్లు గడిచిన విశాఖ మెట్రో, కడప స్టీల్ ప్లాంట్ ఊసే లేదు. ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యత ఇవ్వాలి. చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలి. బడ్జెట్లో రూ. 11 లక్షల కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గించవద్దు’అని మిథున్రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. -
Budget 2024: గంటన్నరలోపే బడ్జెట్ స్పీచ్
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ స్పీచ్ సమయాన్నిగణనీయంగా తగ్గించుకున్నారు. మంగళవారం(జులై 23) పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా నిర్మల తన స్పీచ్ను కేవలం 86 నిమిషాల్లోనే ముగించారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఇదే ఆమె అతి చిన్న బడ్జెట్ ప్రసంగం కావడం గమనార్హం. 2020లో ఆమె ఏకంగా రెండు గంటల నలభై నిమిషాల పాటు అత్యంత ఎక్కువ సమయం బడ్జెట్ ప్రసంగం చేశారు. నిర్మల తొలిసారి ఆర్థిక మంత్రి అయిన 2019లోనూ 2 గంటల 17 నిమిషాలు, 2021లో గంట 50 నిమిషాలు, 2022లో గంట 32 నిమిషాలు, 2023లో గంటగ 27 నిమిషాలు బడ్జెట్ ప్రసంగాలు చేశారు. -
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం
-
నీతా అంబానీ ప్రసంగం: తండ్రీ కూతుళ్ల భావోద్వేగం
బిలియనీర్ ముఖేష్ అంబానీ, నీతా దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ , రాధికా మర్చంట్ వివాహవేడుకలు ఘనంగా ముగిసాయి. ప్రతీ వేడుకను ఘనంగా నిర్వహించడం మాత్రమే కాదు, దేశ విదేశాలనుంచి వచ్చిన అతిథులెవ్వరికీ ఏలోటూ లేకుండా చాలా శ్రద్ధ వహించి, శభాష్ అనిపించుకున్నారు నీతా అంబానీ. పెళ్లిలో అత్యంత కీలకమైందీ, ప్రతీ గుండెను ఆర్ద్రం చేసే సన్నివేశంలో కూడా నీతా తన పెద్దరికాన్ని చాటుకున్నారు. రాధిక కన్యాదానం సమయంలో నీతా ఉద్వేగ ప్రసంగం నెట్టింట వైరల్గా మారింది.Nita Ambani explains the broader significance of Kanyadaan as a union where two families come together, one gaining a son and the other a daughter. Speaking just before the Kanyadaan ceremony during Anant and Radhika's wedding, Mrs. Ambani underscores the importance of daughters… pic.twitter.com/URjchATLTf— Filmfare (@filmfare) July 16, 2024కొత్తకోడలు రాధిక మర్చంట్ను తన కోడలిగా ఆనందంతో కుటుంబంలోకి స్వాగతించడమే కాకుండా, రాధిక తల్లిదండ్రులు వీరేన్ మర్చంట్ , శైలా మర్చంట్లకు ఆమె భరోసా ఇచ్చిన తీరు విశేషంగా నిలిచింది. ‘‘కూతుర్ని ఇవ్వడం అంత తేలిక కాదు. తమ గుండెల్లో దాచుకుని పెంచుకున్న కూతుర్ని మెట్టింటికి పంపడం, ఆ భారాన్ని భరించడం కష్టం. నేనూ ఒక కూతురిని, ఒక కూతురికి తల్లిని , అత్తగారిని. రాధికను మా కూతురిలా చూసుకుంటాం. ఆడపిల్లలే పెద్ద వరం. మన ఆడపిల్లలు మన ఇంటిని స్వర్గంగా మారుస్తారు. మీరు మీ కుమార్తెను మాకు ఇవ్వడం కాదు, మరో కొడుకును, కొత్త కుటుంబాన్ని పొందారంటూ వారికి ధైర్యం చెప్పారు. అలాగే మీకు అనంత్ ఏంతో, మాకు రాధిక కూడా అంతే’’ అంటూ రాధిక పేరెంట్స్ను ఊరడించారు. ఈ సందర్భంగా హిందూ వివాహ ఆచారాల్లో కన్యాదానం అంటే ఏమిటో, అమ్మాయిని లక్ష్మితో సమానంగా భావిస్తారంటూ కుమార్తె ప్రాముఖ్యత ఏంటో ప్రపంచ అతిథుల ముందు నీతా అంబానీ వివరించారు. దీంతో నూతన వధువు రాధిక, ఆమె తల్లితండ్రులతోపాటు అక్కడున్న వారంతా భావోద్వేగానికి లోనయ్యారు. నీతా అంబానీ వాగ్దానం‘‘ముఖేష్, నేను మా కుమార్తెగా, అనంత్ సహచరిగా, ఇషా, ఆనంద్,, శ్లోక, ఆకాష్ మాదిరిగానే రాధికను కూడా గుండెల్లో పెట్టుకుని ప్రేమిస్తాం, రక్షిస్తామని వాగ్దానం చేస్తున్నాం. పృథ్వీ, ఆదియా, కృష్ణ, వేదాలకు మంచి అత్త, పిన్ని దొరికింది. నా ప్రియమైన రాధికను హృదయపూర్వకంగా మా ఇంట్లో అతి పిన్న వయస్కురాలిగా శ్రీమతి రాధిక అనంత్ అంబానీగా స్వాగతిస్తున్నాం’’ అంటూ చోటీ బహూను అందరి కరతాళ ధ్వనుల మధ్య అంబానీ కుటుంబంలోకి ఆమెను ఆహ్వానించారు. జామ్ నగర్లో అనంత్ అంబానీ-రాధికకు ఘనంగా ఆహ్వానం పలుకుతున్న వీడియో నెట్టింట్ సందడి చేస్తోంది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) కాగా జూలై 12న అనంత్ అంబానీ తన చిరకాల ప్రేయసి రాధికా మర్చంట్తో కలిసి వివాహ బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో 3 రోజుల పాటు వివాహ వేడుకలన్నీ అట్టహాసంగా జరిగాయి. అనంతరం అనంత్, రాధిక దంపతులకు శుభప్రదమైన ఆశీర్వాద కార్యక్రమం మంగళ్ ఉత్సవ్ లేదా గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు ఈ గ్రాండ్ వెడ్డింగ్కు హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలు, దేశ విదేశాలకు చెందిన క్రీడా, రాజకీయ, వ్యాపార దిగ్గజాలు హాజరయ్యారు. -
అదే ప్రార్థిస్తున్నా.. వేడుకలో ముఖేష్ అంబానీ స్పీచ్
బిలియనీర్ ముఖేష్ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకలో ప్రసంగించారు. అనంత్, రాధికలకు స్వర్గంలోని వారి తాత ముత్తాతల ఆశీర్వాదం ఉంటుందని, వారి శ్రేయస్సు కోసం భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని భావోద్వేగంతో పేర్కొన్నారు.వేడుకలకు విచ్చేసిన అతిథులను ఉద్దేశించి ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. "అనంత్, రాధికలకు స్వర్గంలో ఉన్న వారి తాత ముత్తాతల ఆశీర్వాదం ఉంటుంది. అనంత్, రాధికల జీవితం సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో నిండాలని నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను” అన్నారు.ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ సెంటర్ వేదిక వద్ద అనంత్ అంబానీ, తన చిరకాల స్నేహితురాలు రాధిక మర్చంట్ను పెళ్లాడారు. గ్లోబల్ సెలబ్రిటీలు, బిజినెస్ టైకూన్లు, ఇతర ప్రముఖుల సమక్షంలో వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతన్నాయి. -
రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగం
-
రాహుల్ వర్సెస్ బీజేపీ.. దద్దరిల్లిన లోక్సభ
ప్రతిపక్షనేతగా లోక్సభలో రాహుల్గాంధీ తన గళం విప్పారు. పలు కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటు వేదికగా నిలదీశారు. ప్రతిపక్షనేతగా ముందు ముందు తన శైలి ఎలా ఉండబోతుందనేదానిపై తొలి సెషన్లోనే సంకేతాలిచ్చారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ రాహుల్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సభలో గందరగోళానికి కారణమయ్యాయి. ఈ సందర్భంగా మోదీ మొదలుకుని అమిత్ షా ఇతర బీజేపీ నేతలు రాహుల్పై ఎదురుదాడికి దిగారు. వీరికి సమాధానం చెబుతూనే అటు స్పీకర్ ఓంబిర్లాకు రాహుల్ పలు సూచనలు చేశారు. రాహుల్ ప్రసంగిస్తుండగా బీజేపీ ఎంపీలు పదే పదే అంతరాయం కలిగించారు. మొత్తంగా సోమవారం(జులై1)న లోక్సభలో రాహుల్ వర్సెస్ ఆల్ అన్నట్లుగా మారింది. పదేళ్లలో నేనూ బాధితుడినే.. దేశమంతా ఏకమై రాజ్యాంగాన్ని రక్షించేందుకు కృషి చేసిందని రాహుల్గాంధీ అన్నారు. గత పదేళ్లలో బీజేపీని ఎదుర్కొన్న లక్షలాదిమందిపై దాడి జరిగిందని ఆరోపించారు. తానూ బాధితుడినేనని తనపై చాలా కేసులు మోపారన్నారు. నాకు రెండేళ్ల జైలుశిక్ష పడింది. నా ఇల్లు తీసేసుకున్నారు. ఈడీ విచారణను 55 గంటల పాటు ఎదుర్కొన్నానని రాహుల్ తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చలో భాగంగా రాహుల్ ప్రసంగించారు. ప్రతిపక్షంలో ఉండటం గర్వంగా, సంతోషంగా ఉందన్నారు. ప్రతిపక్షంలోనే సత్యం ఉందన్నారు. పవర్లో ఉండటం కంటే ఇదే గొప్పదన్నారు.శివుడి ఫొటో చూపిస్తూ మాటల తూటాలు..ప్రసంగంలో ఆర్ఎస్ఎస్, బీజేపీపై విమర్శల దాడి చేసిన రాహుల్ గాంధీ సభలో ఒక సందర్భంలో శివుని ఫొటో చూపించారు. శివుని ఎడమ చేతి వెనుక ఉన్న తత్రిశూలం హింసకు గుర్తు కాదన్నారు. హింసకే అయితే కుడిచేతిలో ఉండేదని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. సభలో ఇలాంటి మతపరమైన ఫొటోల ప్రదర్శనకు రూల్స్ ఒప్పుకోవని స్పీకర్ ఓం బిర్లా రాహుల్కు చెప్పారు.ప్రధానితో సహా బీజేపీ నేతల ఎదురుదాడి.. ఇంతలో ప్రధాని మోదీ జోక్యం చేసుకుని రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. హిందువులను హింసావాదులుగా రాహుల్ పేర్కొనడం సరైనది కాదని దుయ్యబట్టారు. అటు కేంద్ర మంత్రి అమిత్ షా కూడా రాహుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమర్జెన్సీ, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు కారకులైన వారికి అహింస గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ప్రధాని, షా వ్యాఖ్యలకు రాహుల్ స్పందించారు. తాను కేవలం బీజేపీని ఉద్దేశించి మాత్రమే వ్యాఖ్యలు చేశానని వివరణ ఇచ్చారు. కేవలం బీజేపీ, ఆర్ఎస్ఎస్లే మొత్తం హిందూ సమాజం కాదని రాహుల్ స్పష్టం చేశారు.రైతులకు కనీసం సంతాపం తెలపలేదు..రాష్ట్రపతి ప్రసంగంలో నీట్, అగ్నివీర్ల ప్రస్తావన లేదని, నీట్ను వాణిజ్య పరీక్షగా మార్చారని రాహుల్ ఆరోపించారు. గతంలో ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాల వల్ల 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారన్నారు. వారికి సంతాపంగా సభలో కనీసం మౌనం కూడా పాటించలేదని విమర్శించారు. బీజేపీ హయాంలో రాజ్యాంగబద్ధ సంస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ఫైర్ అయ్యారు. మీ విధానలతో ప్రజలకు ఒరిగిందేంటి..దేవుడితో ప్రత్యక్షంగా మాట్లాడతానని స్వయంగా ప్రధానే చెప్పిన విషయాన్ని రాహుల్ సభలో గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం జమ్మూకశ్మీర్ను రెండు ముక్కలు చేసిందని మండిపడ్డారు. అల్లర్లతో మణిపుర్ అట్టుడికినా ప్రధాని అటువైపు వెళ్లలేదు.మణిపూర్లో తన కళ్లముందే పిల్లలపై బుల్లెట్ల వర్షం కురిసిందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.నోట్ల రద్దు వల్ల యువత ఉపాధి కోల్పోయిందన్నారు. జీఎస్టీ కారణంగా వ్యాపారులు, ప్రజలు అనేక బాధలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానాల వల్ల దేశ ప్రజలకు కలిగిన లాభమేంటని రాహుల్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.స్పీకర్కూ రాహుల్ చురకలు..ప్రసంగిస్తుండగా తన మైక్ను మళ్లీ కట్ చేశారని రాహుల్గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు సభలో మైకులు ఎవరి నియంత్రణలో ఉంటాయని ప్రశ్నించారు. మైక్ కట్ చేశారని రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ ఓంబిర్లా స్పందించారు. అలాంటిదేమీ జరగలేదని వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా లోక్సభలో స్పీకర్ వ్యవహారశైలిని కూడా తప్పుబట్టారు రాహుల్ గాంధీ. తొలి రోజు ప్రధాని మోదీ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు స్పీకర్ తలవంచారని, తాను షేక్ హ్యాండ్ ఇస్తే నిటారుగా నిలుచున్నారని రాహుల్ గుర్తుచేశారు. తన కంటే వయసులో మోదీ పెద్దవారైనందునే తలవంచానని స్పీకర్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. -
సభలో సుష్మాను గుర్తు చేసిన బన్సూరీ
న్యూఢిల్లీ: ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో న్యూఢిల్లీ స్థానం నుంచి గెలుపొంది, పార్లమెంట్లో కాలుమోపిన బన్సూరీ స్వరాజ్ తన తల్లి, బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ను గుర్తుకు తెచ్చారు. తన తల్లి మాదిరిగానే సంస్కృతంలో పార్లమెంట్ సభ్యత్వం తీసుకున్న ఆమె సుష్మా జ్ఞాపకాలను అందరికీ గుర్తు చేశారు.తాజాగా లోక్సభలో ఆమె ప్రసంగిస్తున్నప్పుడు అక్కడున్నవారికి సుష్మా స్వరాజ్ శైలి కనిపించింది. బన్సూరీ తన తల్లి సుష్మా స్వరాజ్ మాదిరిగానే తన అభిప్రాయాలను సభలో బలంగా వినిపించారు. ఆ సమయంలో ఆమె హావభావాలు తల్లి సుష్మ మాదిరిగానే ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.బన్సూరీ తన తల్లి సుష్మా స్వరాజ్ మాదిరిగానే సభలో ప్రసంగిస్తున్నప్పుడు తన వేలు పైకెత్తి సమస్యలపై ఘాటుగా తన స్పందనను తెలియజేశారు. సోమవారం సభలో ఆమె తీరుతెన్నులు సరిగ్గా సుష్మా స్వరాజ్ను పోలివున్నాయని సీనియర్ నేతలు అంటున్నారు. సుష్మా స్వరాజ్ తీరులోనే బన్సూరీ.. గౌరవనీయ స్పీకర్ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పదేళ్లలో తొలిసారిగా మాటలు, చేతలు ఒకటిగా ఉండే ప్రభుత్వం వచ్చిందని ఆమె అన్నారు. अध्यक्ष जी.... जब बांसुरी स्वराज ने मां सुषमा स्टाइल में दिया लोकसभा में भाषण, देखिए#loksabha | #bansuriswaraj pic.twitter.com/D993ySEFIg— NDTV India (@ndtvindia) July 1, 2024 -
పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
-
ఈ రోజు మనది కాకపోవొచ్చు.. కానీ మనం రేపు కొట్టే దెబ్బ ఎలా ఉండాలి అంటే..
-
ఈ రోజు మనది కాకపోవొచ్చు.. కానీ మనం రేపు కొట్టే దెబ్బ ఎలా ఉండాలి అంటే..
-
ఇది ఇంటర్వెల్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది..
-
కొందరు చిల్లర రాజకీయాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్నారు
-
తెలంగాణ ఆత్మగౌరవానికి పదేళ్ల పట్టాభిషేకం
-
KK రాజు ఎమ్మెల్యే అయితే మీ ఇంట్లో మనిషి అయినట్టే..
-
చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం: సీఎం వైఎస్ జగన్
-
మీ జగన్ గెలిస్తేనే స్కీములు కొనసాగింపు
-
కిక్కిరిసిన కర్నూల్
-
కూటమితో లాభం లేదు..
-
ఇండియా కూటమిపై విరుచుకుపడ్డ ప్రధాని
-
ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఉదాహరణలతో వివరించిన సీఎం జగన్
-
విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం..
-
వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..
-
నాకు బిడ్డలు లేరు, ప్రజల బిడ్డల కోసమే నా తపన.. ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటన.. ఇంకా ఇతర అప్డేట్స్
-
సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..
-
ఇది క్లాస్ వార్..దద్దరిల్లిన నరసాపురం
-
అవ్వా, తాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్ రియాక్షన్..
-
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది
-
చంద్రబాబుది బోగస్ రిపోర్ట్.. జగన్ది ప్రోగ్రెస్ రిపోర్ట్... టంగుటూరు, మైదుకూరు, కలికిరి ఎన్నికల సభల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
మళ్ళీ మీ జగన్ కే అధికారం ఎందుకు ఇవ్వాలో చెబుతాను..!
-
మోసగాళ్లకు ఓటుతో బుద్ధి చెప్పాలి.. ఎన్నికల ప్రచార సభల్లో రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు ..ఇంకా ఇతర అప్డేట్స్
-
Watch Live: వెంకటగిరిలో సీఎం జగన్ బహిరంగ సభ
-
వదల బొమ్మాలి.. వదల..