steve jobs
-
వారి కోసం జుకర్బర్గ్ ఫ్యావరెట్ హుడీ వేలం : మార్క్ డ్యాన్స్ వైరల్ వీడియో
మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ తనకెంతో ఇష్టమైన పాత హుడీని వేలం వేశారు. తద్వారా వచ్చిన సొమ్మును టెక్సాస్ పాఠశాల సంక్షేమం కోసం వినియోగించనున్నారు. బిజినెస్ ఇన్సైడర్ ప్రకారం, ఈ ప్రియమైన హూడీతోపాటు బిడ్ దక్కించుకున్న వ్యక్తికి జుకర్బర్గ్ స్వయంగా చేతితో రాసిన నోట్ కూడా దక్కింది. దీనిని ఫేస్బుక్ స్టేషనరీలో రూపొందించారట.2019లో తరచుగా ధరించే నల్లటి హూడీ లాస్ ఏంజిల్స్లో జరిగిన వేలంలో భారీ ధరకు అమ్ముడు బోయింది. జూలియన్స్ ఆక్షన్స్ వారి "స్పాట్లైట్: హిస్టరీ అండ్ టెక్నాలజీ" సిరీస్లో భాగంగా గత గురువారం ఈ వేలం నిర్వహించింది. దీనికున్న పర్సనల్ టచ్, క్రేజ్ అభిమానులను స్పష్టంగా ఆకట్టుకున్నాయి. దీంతో చాలా వేగంగా బిడ్డింగ్ జరిగింది. దాదాపు 22 బిడ్లు వచ్చాయి. చివరకు రూ.13 లక్షల కంటే ఎక్కువ ధర పలికింది. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) ఇది తన ఆల్-టైమ్ ఫేవరెట్లలో ఒకటిగా అభివర్ణించారు జుకర్బర్గ్. , "నేను తొలినాళ్లలో దీన్ని ఎప్పుడూ ధరించేవాడిని. దాని లోపల మా అసలు మిషన్ స్టేట్మెంట్ కూడా ప్రింట్ అయి ఉంది" అని గుర్తు చేసుకున్నారు. ఈ హూడీ 2010 నాటిది. ఇదే ఏడాది జుకర్బర్గ్ టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యారు. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తం సొమ్మను టెక్సాస్లోని పాఠశాల పిల్లలకు మద్దతు ఇవ్వడానికి అంకితం చేస్తామని మార్క్ ప్రకటించారు. దీంతోపాటు పాటు ఆపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ధరించిన సిగ్నేచర్ బో టై కూడా వేలంలో అమ్ముడైన ఇతర ప్రసిద్ధ వస్తువులలో ఒకటిగా దాదాపు రూ. 31 కోట్లకు బిడ్దక్కించుకుంది. దీని అసలు ధర వెయ్యి డాలర్లుమాత్రమే.మార్క్ డ్యాన్స్, భార్య ఫిదా మరోవైపు మార్చి 1న, భార్య ప్రిస్సిల్లా చాన్ పుట్టినరోజు సందర్భంగా జుకర్బర్గ్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ టక్సేడోలో పార్టీలో ఎంట్రీఇచ్చి టక్సేడోను చింపేసి మరీ, ఒక్క ఉదుటున స్టేజ్పైకి అద్భుతమైన నీలిరంగు జంప్సూట్లో పాట పాడి, డ్యాన్స్ చేశాడు. దీంతో చాన్ ఫిదా అయిపోయింది. తెగ వైరలవుతోంది. 2025 గ్రామీ అవార్డుల వేడుకలో బెన్సన్ బూన్ బ్యూటిఫుల్ థింగ్స్ ప్రదర్శన ఇస్తున్నప్పుడు ధరించిన జంప్సూట్ కూడా ఇలాంటిదేనట. -
కుంభమేళాపై స్టీవ్ జాబ్స్ లేఖ.. ఎన్ని కోట్లు పలికిందంటే?
ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన కార్యక్రమాలలో.. భారతదేశంలో జరిగే 'మహా కుంభమేళా' (Maha Kumbh Mela) ఒకటి. ఇటీవల ప్రారంభమైన ఈ కార్యక్రమానికి కోట్లాది మంది భక్తులు విచ్చేస్తున్నారు, పవిత్ర సంగమం వద్ద పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి దివంగత స్టీవ్ జాబ్స్ భార్య 'లారెన్ పావెల్ జాబ్స్' కూడా వచ్చారు.మహా కుంభమేళాకు వచ్చిన లారెన్ పావెల్ జాబ్స్ తన పేరును 'కమల'గా మార్చుకున్నారు. కాగా ఇప్పుడు ఆపిల్ కో ఫౌండర్ స్టీవ్ జాబ్స్ చేతితో రాసిన ఓ లేఖ (Letter) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1974లో రాసిన ఈ లేఖలో స్టీవ్ జాబ్స్ కుంభమేళా కోసం భారతదేశాన్ని సందర్శించాలని రాసినట్లు తెలుస్తోంది.50 ఏళ్లకింద స్టీవ్ జాబ్స్ రాసిన ఈ లేఖ బోన్హామ్స్ వేలంలో 500312 డాలర్లు లేదా రూ.4.32 కోట్లుకు పలికింది. ఇది స్టీవ్ జాబ్స్ స్వయంగా రాసిన మొదటి లేఖ కావడం గమనార్హం. ఈ కారణంగానే దీనిని చాలామంది సొంతం చేసుకోవడానికి ప్రయత్నించారు.స్టీవ్ జాబ్స్ 19వ పుట్టిన రోజుకు ఒక రోజు ముందు.. అతని చిన్ననాటి స్నేహితుడు టిమ్ బ్రౌన్కు ఈ లేఖను పంపించారు. ఇందులో ఆయన ఆధ్యాత్మిక, ఆత్మపరిశీలనకు సంబంధించిన చాలా విషయాలను వెల్లడించారు. అంతే కాకుండా బౌద్ధమతాన్ని గురించి ప్రస్తావిస్తూ.. కుంభమేళా కోసం భారతదేశాన్ని సందర్శించాలనే తన ఆకాంక్షను కూడా అందులో వెల్లడించారు.భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ.. తాను చాలా సార్లు ఏడ్చినట్లు లేఖలో పేర్కొన్నారు. ఏప్రిల్లో ప్రారంభమయ్యే కుంభమేళా కోసం నేను భారతదేశానికి వెళ్లాలనుకుంటున్నాను. నేను మార్చిలో ఎప్పుడో బయలుదేరుతాను, కానీ ఇంకా ఖచ్చితంగా తెలియలేదని అందులో ప్రస్తావించారు.స్టీవ్ జాబ్స్ మొదట ఉత్తరాఖండ్లోని నీమ్ కరోలి బాబా ఆశ్రమాన్ని సందర్శించాలని అనుకున్నారు. అయితే, నైనిటాల్కు చేరుకోగానే, నీమ్ కరోలి బాబా అంతకుముందు సంవత్సరం మరణించినట్లు అతను కనుగొన్నాడు. నిరుత్సాహపడకుండా, జాబ్స్ కైంచి ధామ్లోని ఆశ్రమంలో ఉండి, నీమ్ కరోలి బాబా బోధనల నుంచి ఓదార్పు పొందారు. ఆ సమయంలో ఆయన పూర్తిగా ఆధ్యాత్మికతలో మునిగిపోయారు. ఆ తరువాత ఆయనలో చాలా మార్పు వచ్చిందని కూడా చెప్పారు.ఇప్పుడు, స్టీవ్ భార్య లారెన్ పావెల్ జాబ్స్, మహా కుంభమేళా 2025కి హాజరవడం ద్వారా అతని చిరకాల కోరికలలో ఒకదాన్ని నెరవేర్చింది. ఈమె జనవరి 15 వరకు నిరంజినీ అఖారా క్యాంపులోని కుంభ్ టెంట్ సిటీలో ఉండనున్నారు. ఆ తరువాత జనవరి 20న అమెరికాలోనూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి హాజరవుతారు.ఇదీ చదవండి: కుంభమేళాలో స్టీవ్ జాబ్స్ భార్యకు అస్వస్థతఈ కుంభమేళా కారణంగా రాష్ట్ర ఆర్థిక వృద్ధి కూడా భారీగా పెరుగుతుందని చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి కేటాయించిన బడ్జెట్ రూ.7,000 కోట్లు కాగా.. రాష్ట్రానికి వచ్చే ఆదాయం రూ. 2 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి వచ్చే సందర్శకులు సగటున రూ. 5,000 ఖర్చు చేస్తే ఏకంగా రూ. 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని చెబుతున్నారు. ఈ ఖర్చు రూ.10వేలకు పెరిగితే.. వచ్చే ఆదాయం రూ. 4 లక్షల కోట్లకు చేరుతుంది.Steve Jobs letter to his friend about planning to visit Kumbh Mela in India.The thing to notice here is, he used the word "Shanti" before concluding. pic.twitter.com/s4yN2pupjr— Kartik Jaiswal (@draken73jp) October 24, 2021 -
కుంభమేళాలో స్టీవ్ జాబ్స్ భార్యకు అస్వస్థత
దివంగత యాపిల్ సహ వ్యవస్థాపకుడు 'స్టీవ్ జాబ్' భార్య 'లారెన్ పావెల్ జాబ్స్' ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా 2025కు హాజరయ్యారు. అయితే.. కొత్త వాతావరణం కారణంగా ఆమె అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని నిరంజనీ అఖాడాకు చెందిన మహా మండలేశ్వర్ స్వామి 'కైలాసనంద గిరి మహారాజ్' వెల్లడించారు.లారెన్ పావెల్ జాబ్స్ ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని, ఆరోగ్యం కుదుటపడిన తరువాత ఆమె త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరిస్తారని కైలాసనంద గిరి మహారాజ్ చెప్పారు. ఇంత రద్దీగా ఉండే ప్రదేశానికి ఆమె ఎప్పుడూ వెళ్లలేదు. అంతే కాకుండా లారెన్ చాలా సాదాసీదాగా ఉంది, పూజా సమయంలో కూడా మాతో పాటు ఉండేవారని ఆయన పేర్కొన్నారు.ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు లారెన్ పావెల్ జాబ్స్ హాజరై.. ఆమె పేరును 'కమల'గా మార్చుకున్నట్లు కైలాసనంద గిరి మహారాజ్ పేర్కొన్నారు. అంతే కాకుండా ఆమె భారతదేశానికి రావడం ఇది రెండోసారి, ఇప్పుడు ధ్యానం చేసుకోవడానికి మన దేశానికి వచ్చినట్లు చెబుతున్నారు.లారెన్ పావెల్ జాబ్స్ జనవరి 15 వరకు నిరంజినీ అఖారా క్యాంపులోని కుంభ్ టెంట్ సిటీలో ఉండనున్నారు. ఆ తరువాత జనవరి 20న అమెరికాలోనూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి హాజరవుతారు.మంగళవారం జరిగే మొదటి అమృత స్నాన్ లేదా పవిత్ర స్నానానికి కనీసం 3-4 కోట్ల మంది ప్రజలు గంగా, యమునా, సరస్వతి నదుల సంగమ ప్రదేశమైన త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానం చేస్తారు. సనాతన ధర్మానికి చెందిన 13 అఖాడాలకు చెందిన సాధువులు ఒక్కొక్కరుగా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు.మహా కుంభమేళా అనేది ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత ముఖ్యమైన మతపరమైన సమ్మేళనాలలో ఒకటి. ఇది ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. దీనికి సుమారు 40 కోట్ల మందికిపైగా ప్రజలు వచ్చే అవకాశం ఉందని సమాచారం. కుంభమేళా ప్రారంభమైన మొదటిరోజే.. 50 లక్షల మందికి పైగా ప్రజలు మొదటి పవిత్ర స్నానం చేశారు.రూ.2 లక్షల కోట్ల ఆదాయంఈ కుంభమేళా కారణంగా రాష్ట్ర ఆర్థిక వృద్ధి కూడా భారీగా పెరుగుతుందని చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి కేటాయించిన బడ్జెట్ రూ.7,000 కోట్లు కాగా.. రాష్ట్రానికి వచ్చే ఆదాయం రూ. 2 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి వచ్చే సందర్శకులు సగటున రూ. 5,000 ఖర్చు చేస్తే ఏకంగా రూ. 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని చెబుతున్నారు. ఈ ఖర్చు రూ.10వేలకు పెరిగితే.. వచ్చే ఆదాయం రూ. 4 లక్షల కోట్లకు చేరుతుంది.2019లో జరిగిన ప్రయాగ్రాజ్ అర్ధ కుంభమేళా సమయంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు 1.2 లక్షల కోట్ల రూపాయలు వచ్చిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. ఆ సమయంలో 24 కోట్లమంది కుంభమేళా సందర్శించారని పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ కార్యక్రమ సంస్కృతుల సంగమం అని.. భిన్నత్వంలో ఏకత్వ సందేశంగా అభివర్ణించారు. -
Maha Kumbh 2025: ప్రయాగ్రాజ్కు స్టీవ్ జాబ్స్ సతీమణి
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో రేపటి (జనవరి 13) నుంచి కుంభమేళా జరగనుంది. ఈ మేళాకు భారీ ఎత్తున స్వామీజీలు, ప్రముఖులు, భక్తులు హాజరుకానున్నారు. ఆపిల్ సహ వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్ (Apple co-founder Steve Jobs) భార్య, ప్రపంచంలోని అత్యంత ధనవంతురాలైన మహిళల్లో ఒకరైన లారెన్ పావెల్ కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రయాగ్రాజ్కు తరలిరానున్నారు. ఈ సమాచారాన్ని ఆధ్యాత్మిక గురువు స్వామి కైలాశానంద జీ తెలిపారు.స్వామి కైలాసానంద(Swami Kailasananda) మీడియాతో మాట్లాడుతూ ‘లారెన్ మా గురువును కలవడానికి వస్తున్నారు. ఆమె నా కూతురు లాంటిది. మేము ఆమెకు మా గోత్రాన్ని కూడా ఇచ్చి, కమల అని పేరు పెట్టాం. ఆమె భారతదేశానికి రావడం ఇది రెండోసారి. మహా కుంభమేళాకు అందరికీ స్వాగతం. ఆమె మూడు నాలుగు రోజులు ఇక్కడ ఉంటారు. ఆమె మహా కుంభమేళాకు వచ్చి, సాధువులను కలుసుకుని, మన సంప్రదాయాలను పాటిస్తారు.ప్రపంచంలోని చాలా మంది ఏదో ఒక గురువు మార్గదర్శకత్వంలో ముందుకుసాగుతున్నారు. ఈ నేపధ్యంలో చాలా మంది కుంభమేళాకు తరలి వస్తున్నారు. ఇది ఒక మతపరమైన ఉత్సవం. ప్రపంచం నలుమూలల నుండి భారతదేశానికి తరలివస్తున్నారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం వ్యాపారవేత్త లారెన్ 17 రోజుల పాటు భారత్లో ఉండనున్నారు. ఈ సమయంలో ఆమె సాధువుల మధ్య సాధారణ జీవితాన్ని గడుపుతారు. ఆమె భర్త స్టీవ్ లాగే, లారెన్కు కూడా హిందూ, బౌద్ధమతాలతో ప్రత్యేక అనుబంధం ఏర్పరుచుకున్నారు.లారెన్ జనవరి 13న ప్రయాగ్రాజ్(Prayagraj)కు చేరుకోనున్నారు. లారెన్ పావెల్, ఆమె కుటుంబం ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచ బిలియనీర్ల వార్షిక జాబితాలో 59వ స్థానంలో ఉన్నారు. టైమ్స్ మ్యాగజైన్ ఆమెను ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన మహిళల జాబితాలో చేర్చింది. ఆమె జనవరి 29 వరకు నిరంజని అఖాడాకు చెందిన ఆచార్య మహామండలేశ్వర్ స్వామి ఆశ్రమంలో బసచేయనున్నారు. ఇది కూడా చదవండి: Delhi Elections: బీజేపీ రెండవ జాబితా విడుదల -
జీవిత పాఠాలు నేర్పిన గురువులు
మీలో ఆశలు రేకిత్తించి వాటిని సాధించేందుకు ఓదారి చూపే ప్రతి వ్యక్తి గురువే. అలా అందరి జీవితాల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది గురువులు తారసపడుతారు. అలాంటి వారి సలహాలు, సూచనలు సామాజికంగా, ఆర్థికంగా ఎదిగేందుకు ఉపయోగపడుతాయి. అలా గురువుల సాయంతో కొందరు వ్యాపారాల్లో స్థిరపడి మరెందరికో ఉపాధి కల్పిస్తున్నారు. అలాంటి వ్యాపార దిగ్గజాలు తమ గురువుల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. అవేంటో తెలుసుకుందాం.వారెన్బఫెట్జీవితంలో కష్టనష్టాలు వారెన్బఫెట్కి అనేక పాఠాలు నేర్పాయి. తన తండ్రి హోవార్డ్ బఫెట్, కోచ్ బెంజమిన్ గ్రాహం, భార్య సుసాన్ బఫెట్ నుంచి ఎన్నో ఆర్థికపాఠాలు నేర్చుకున్నట్లు ఆయన చెప్పారు. సొంతంగా డబ్బు సంపాదించడం ఎలాగో తన తండ్రి నుంచి నేర్చుకున్నట్లు తెలిపారు. పెట్టుబడి నిర్వహణకు సంబంధించిన ఎన్నో విషయాలు ఆయన నేర్పించారని పేర్కొన్నారు.బిల్గేట్స్మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్గేట్స్ తనకు వారెన్బఫెట్ ఎన్నో విషయాల్లో మార్గనిర్దేశం చేశారని చెప్పారు. హార్వర్డ్ యూనివర్సిటీలో మధ్యలో చదువు మానేసిన తర్వాత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నానని తెలిపారు. ఆ సమయంలో వారెన్బఫెట్ దీర్ఘకాల లక్ష్యాలతో డబ్బు ఎలా సంపాదించాలో నేర్పించినట్లు చెప్పారు.జెఫ్బెజోస్అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్బెజోస్ వారెన్బఫెట్, జేపీ మోర్గాన్ ఛైర్మన్ జామీ డిమోన్, డిస్నీ సీఈఓ బాబ్ ఇగర్లను తన గురువులుగా భావిస్తున్నట్లు చెప్పారు. వారెన్బఫెట్ తన పుస్తకాల్లో ఎన్నో విషయాలు పంచుకుంటారని, దాదాపు అన్నింటిని చదవడానికి ఇష్టపడతానని బెజోస్ అన్నారు. సంక్షిష్టమైన కంపెనీ ద్వారా పెట్టుబడి పెడుతూ డబ్బు ఎలా సంపాదించాలో డిమోన్ను చూసి నేర్చుకోవాలన్నారు. దీర్ఘకాలిక లక్ష్యాలను ఎలా నెరవేర్చుకోవాలో ఇగర్ ద్వారా తెలుసుకున్నానని చెప్పారు.ఇలాన్మస్క్ఎక్స్(ట్విటర్), టెస్లా, స్పేస్ఎక్స్ వంటి కంపెనీల అధినేత ఇలాన్మస్క్ స్పేస్ఎక్స్ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ జిమ్ కాంట్రెల్ను గురువుగా భావిస్తారు. మస్క్ కంపెనీలో పనిచేస్తున్న ఉన్నతాధికారులకు కాంట్రెల్ మెంటార్గా వ్యవహరిస్తున్నారు. యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్జాబ్స్ పుస్తకాలు ఇప్పటికీ చదువుతున్నట్లు మస్క్ చెప్పారు. అవి తనకు మార్గదర్శకాలుగా పనిచేస్తాయని వివరించారు. బెంజమిన్ ఫ్రాంక్లిన్, నికోలా టెస్లా, థామస్ ఎడిసన్, ఐసాక్ న్యూటన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ పుస్తకాలు ఎంతో ప్రేరణ ఇస్తాయన్నారు.ఇదీ చదవండి: 2.75 లక్షల ఫోన్ నంబర్లకు చెక్మార్క్ జుకర్బర్గ్మెటా వ్యవస్థాపకులు మార్క్ జుకర్బర్గ్ యాపిల్ వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్ను ఎంతో ఆరాధించేవారు. మేనేజ్మెంట్ నిర్వహణతోపాటు కంపెనీకి ప్రత్యేకంగా బ్రాండింగ్ ఎలా తీసుకురావాలో స్టీవ్ దగ్గరి నుంచి నేర్చుకున్నట్లు మార్క్ తెలిపారు. -
స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్ రెజ్యూమ్స్: ఫోటోలు చూశారా?
యాపిల్ కో-ఫౌండర్ స్టీవ్ జాబ్స్, మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ రెజ్యూమ్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని వారు 18ఏళ్ల వయసులో ఉన్నప్పుడు క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. టెక్ ప్రపంచంలో ఎవరికివారే అన్నట్టు ఎదిగిన వీరి రెజ్యూమ్స్ ఇక్కడ చూడవచ్చు.స్టీవ్ జాబ్స్ రెజ్యూమ్ ప్రకారం, ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీపై మక్కువ ఉందని తెలుస్తోంది. ఇది 1973లో రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో తనకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉందని ప్రస్తావించారు.ఇక బిల్ గేట్స్ రెజ్యూమ్ గమనిస్తే.. ఇది 1971లో క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో కోబాల్ట్, బేసిక్, పీడీపీ-10, పీడీపీ-8, సీడీసీ-6400 వంటి కంప్యూటర్లతో సహా వివిధ ప్రోగ్రామింగ్ భాషలలో తనకు అనుభవం ఉన్నట్లు వెల్లడించారు. అందులోనే తన జీతం అప్పట్లో 15000 డాలర్లుగా ప్రస్తావించారు. 970లలో ఒక విద్యార్థికి ఇది చాలా ఎక్కువ శాలరీ అనే చెప్పాలి.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ రెజ్యూమ్స్ ఎంతోమంది నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. దీనిపైన కొంతమంది తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు.Steve Jobs and Bill Gates’ resumes at age 18: pic.twitter.com/tFTltp80jM— Jon Erlichman (@JonErlichman) August 27, 2024 -
యాపిల్ ఉత్పత్తులు.. ఆసక్తికర అంశాలు (ఫొటోలు)
-
యాపిల్ కంప్యూటర్ దశాబ్దాల చరిత్ర - విస్తుపోయే ఆసక్తికర విషయాలు (ఫోటోలు)
-
ఇప్పటికీ తన విధానమే పాటిస్తున్నాం..: బిల్గేట్స్
యాపిల్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో స్టీవ్ జాబ్స్కు టెక్ ప్రపంచంలో ఎల్లప్పుడూ ప్రత్యేకస్థానం ఉంటుంది. కంపెనీ సమావేశాలు ఏర్పాటు చేసినా, కొత్త ఉత్పత్తులు విడుదలైనా ఆయన చేసే ప్రసంగం, తన వ్యవహారశైలి అందరినీ కట్టిపడేసేది. తాజాగా ఇదే విషయాన్ని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వెల్లడించారు. బహిరంగ వేదికలపై స్టీవ్ జాబ్స్లా తాను వ్యవహరించలేనని, ఆయన చాలా సహజంగా ప్రవర్తిస్తూ ఎదుటి వారిని తన మాటలతో ఆకట్లుకునేవారని గేట్స్ ఓ పాడ్కాస్ట్లో తెలిపారు. ఈ సందర్భంగా బిల్గేట్స్ మాట్లాడుతూ.. ‘స్టీవ్ జాబ్స్ చాలా సహజంగా ఉంటారు. స్టేజ్పై మాట్లాడటానికి ముందు ఆయన రిహార్సల్స్ చూడటం ఎంతో సరదాగా ఉంటుంది. కొన్నిసార్లు వేదికపై మాట్లాడుతుంటే అప్పటికప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తుంది. ఆ స్థాయిని నేను ఎప్పటికీ అందుకోలేను. మైక్రోసాఫ్ట్ ప్రారంభించిన తొలి నాళ్లలో వాటి ఉత్పత్తుల గురించి వివిధ రకాల వ్యక్తులకు వివరించడమే కీలక ప్రక్రియగా ఉండేది. విద్య, వైద్యం, ఏఐకి సంబంధించి మైక్రోసాఫ్ట్ ఉత్పత్తుల గురించి అభిప్రాయ సేకరణ కోసం ఇప్పటికీ కొన్నిసార్లు స్టీవ్ జాబ్స్ అనుసరించే కమ్యూనికేషన్ విధానాన్నే పాటిస్తున్నాం’ అని చెప్పారు. కంపెనీకి సంబంధించి నూతన ఉత్పత్తుల విడుదలతో పాటు, ఇతర సమావేశాల్లో ప్రసంగించేందుకు స్టీవ్ చాలా రోజుల ముందు నుంచి సిద్ధమయ్యేవారట. ఈ విషయాన్ని 2015లో విడుదలైన ‘బికమింగ్ స్టీవ్ జాబ్స్’ అనే పుస్తకంలో రచయితలు బ్రెంట్ ష్లెండర్, రిక్ టెట్జెలీలు వెల్లడించారు. తామా గతంలో ఒక రోజంతా స్టీవ్ జాబ్స్తో ఉన్నామని పుస్తకంలో తెలిపారు. ఇదీ చదవండి: క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? కీలక మార్పులు చేసిన బ్యాంకులు చిన్న ప్రజెంటేషన్ కోసం ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని, స్లైడ్స్కు ఎలాంటి రంగులు వాడాలి? స్టేజ్పై తన వ్యవహారశైలి ఎలా ఉండాలి? ఎక్కడ స్పాట్ లైట్ పడాలి? ఇలా ప్రతి విషయంలో ఎంతో ప్రణాళికతో వ్యవహరించేవారని వివరించారు. -
సొంత కంపెనీల్లోనే ఉద్యోగాలు కోల్పోయిన సీఈవోలు వీరే!
ఇటీవల ఓపెన్ఏఐ కంపెనీ తన సీఈఓ 'శామ్ ఆల్ట్మన్'ను పదవి నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వార్త టెక్ ప్రపంచంలో పెద్ద చర్చలకు దారి తీసింది. సీఈఓ జాబ్ కూడా గ్యారెంటీ కాదని కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. 2022లో 969 మంది సీఈఓలు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయగా.. ఈ ఏడాది మొదటి తొమ్మిది ఈ సంఖ్య 1425 కు చేరింది. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ (World of Statistics) ప్రకారం, తాము నెలకొల్పిన సంస్థల నుంచి తమ సీఈఓ పదవులు కోల్పోయిన వారు ఎవరనేది ఈ కథనంలో తెలుసుకుందాం. స్టీవ్ జాబ్స్ (Steve Jobs) యాపిల్ కంపెనీ కో ఫౌండర్, సీఈఓ స్టీవ్ జాబ్స్ ఒకప్పుడు ఆ కంపెనీలోనే తన సీఈఓ జాబ్ కోల్పోయిన సంగతి బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. సంస్థ ప్రారంభమైనప్పుడు అతని వయసు 21 సంవత్సరాలు మాత్రమే, అయితే ఆ కంపెనీ స్థాపించిన సుమారు 9 సంవత్సరాలకు కంపెనీ బోర్డు సీఈఓగా తొలగించి, ఆ స్థానంలో జాన్ స్కూల్లేను నియమించింది. ఆ తరువాత 1997లో స్టీవ్ జాబ్స్ సీఈఓగా బాధ్యతలు చేపట్టాడు. ఈయన 2011లో అనారోగ్య కారణాల వల్ల కన్నుమూశాడు. ప్రస్తుతం ఈ స్థానంలో 'టిమ్ కుక్' ఉన్నారు. అంకితి బోస్ (Ankiti Bose) జిలింగో కో-ఫౌండర్, సీఈఓ అంకితి బోస్ కొన్ని ఆర్ధిక అవకతవకల దర్యాప్తు కారణంగా 2022లో సీఈఓగా తొలగించారు. బోర్డు ఆమోదం లేకుండానే.. ఆమె జీతం దాదాపు 10 రెట్లు పెరగటం కారణంగా సీఈఓగా తొలగించినట్లు తెలుస్తోంది. అప్పట్లో ఈ వార్త టెక్ ప్రపంచంలో పెద్ద సంచలనంగా మారింది. పరాగ్ అగర్వాల్ (Parag Agrawal) ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఎక్స్ (ట్విటర్) సంస్థను కొనుగోలు చేసిన తరువాత కంపెనీలో చాలామంది సీనియర్ ఎగ్జిక్యూటివ్లను తొలగించారు. 2021లో సీఈఓగా ఎంపికైన పరాగ్ అగర్వాల్ ఆ సమయంలో కంపెనీని విడిచిపెట్టిన మొదటి వ్యక్తి. విధుల నుంచి తొలగించినందుకు నష్టపరిహారంగా పరాగ్ అగర్వాల్ దాదాపు 40 మిలియన్ల డాలర్ల భారీ మొత్తాన్ని అందుకున్నట్లు సమాచారం. ఫనీష్ మూర్తి (Phaneesh Murthy) ప్రముఖ ఐటీ సంస్థ 'ఐగేట్' (iGate) ప్రెసిడెంట్, సీఈఓ ఫనీష్ మూర్తికి తన సహోద్యోగితో సంబంధం ఉందనే కారణంగా తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. అరాసెలి రోయిజ్ అనే ఉద్యోగి లైంగిక వేధింపుల దావా వేసినప్పుడు విచారణంలో దోషిగా తేలడం వల్ల ఈయన సీఈఓగా తొలగించారు. ఈయన ఇన్ఫోసిస్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొన్నట్లు సమాచారం. జాక్ డోర్సే (Jack Dorsey) 2006లో ప్రారంభమైన మైక్రోబ్లాగింగ్ స్టార్టప్ ట్విటర్ కో-ఫౌండర్ అండ్ సీఈఓ 'జాక్ డోర్సే' 2008లో కొన్ని కారణాల వల్ల తన పదవి కోల్పోయాడు. ఆ తరువాత ఆయన స్థానంలోకి పరాగ్ అగర్వాల్ నియమితుడై సీఈఓ బాధ్యతలు చేపట్టారు. శామ్ ఆల్ట్మాన్ (Sam Altman) సంస్థలో జరుగుతున్న అంతర్గత చర్చల్లో నిజాయతీ పాటించడం లేదని, బోర్డు తీసుకునే నిర్ణయాలకు అతడు అడ్డుపడుతున్నాడని.. ఓపెన్ఏఐకి నాయకత్వం వహించే అతడి సామర్థ్యంపై బోర్డు నమ్మకం కోల్పోయిందనే కారణంగా 'ఓపెన్ఏఐ' (OpenAI) 'శామ్ ఆల్ట్మన్'ను సీఈఓ పదవి నుంచి తొలగించింది. ఇదీ చదవండి: ఆ రెండు కార్ల ఖరీదే రూ.20 కోట్లు - అట్లుంటది అంబానీ ఫ్యామిలీ అంటే.. తమ కంపెనీలలోనే సీఈఓ పదవి కోల్పోయిన వ్యక్తుల జాబితాలో యాహూ సీఈఓ కరోల్ బార్ట్జ్ (2011), హెచ్టీసీ సీఈఓ పీటర్ చౌ (2015), తైవాన్కు కంప్యూటర్ కంపెనీ ఏసర్ సీఈఓ జియాన్ఫ్రాంకో లాన్సి (2011), విప్రో జాయింట్ సీఈఓలు గిరీష్ పరంజ్పే & సురేష్ వాస్వానీ (2011), మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీఫెన్ ఎలోప్, హెచ్పీ సీఈఓ మార్క్ హర్డ్ (2010) ఉన్నారు. -
టెక్ దిగ్గజం యాపిల్ కో-ఫౌండర్కి గుండెపోటు!
వోజ్నియాక్ గుండెపోటుకు గురవ్వడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నెటిజన్లు యాపిల్ కో-ఫౌండర్ గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా వోజ్నియాక్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ➤వోజ్గా సుపరిచితులైన వోజ్నియాక్ 1976లో టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. మరో యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ స్టీవ్జాబ్స్తో కలిసి వోజ్నియాక్ తొలి యాపిల్ కంప్యూటర్ను తయారు చేశారు. ➤ యాపిల్ కంప్యూటర్ 2 డిజైనింగ్లో వోజ్నియాక్ ప్రముఖ పాత్ర పోషించారు. అదే కంప్యూటర్.. పర్సనల్ కంప్యూటర్ల విభాగంలో సరికొత్త రెవెల్యూషన్ను క్రియేట్ చేసింది. ఇంజినీరింగ్ ఇన్నోవేషన్స్తో యాపిల్ను ప్రపంచంలో నెంబర్ వన్ టెక్ కంపెనీగా అవతరించేలా కృషి చేశారు. ➤ అయినప్పటికీ 1985లో వోజ్నియాక్ యాపిల్ సంస్థ నుంచి బయటకు వచ్చారు. పర్సనల్ కంప్యూటర్ టెక్నాలజీ తన దృష్టికి అనుగుణంగా లేదని భావించారు. ఆ తర్వాత మొదటి యూనివర్సల్ రిమోట్ కంట్రోల్ను అభివృద్ధి చేసిన సీఎల్ 9 ని స్థాపించడంతో పాటు సహా కొత్త వెంచర్లను ప్రారంభించారు. ➤ వోజ్నియాక్ టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్ విభాగాల్లో విశేషమైన కృషి చేసినందుకు గాను 11 డాక్టరేట్లు సొంతం చేసుకున్నారు. ➤ కాలేజీ చదివే రోజుల్లో యాపిల్ కో-ఫౌండర్కి క్రీమ్ సోడా అంటే మహా ప్రీతి. అందుకే దాని పేరుమీద ‘క్రీమ్ సోడా కంప్యూటర్’ పేరుతో ఓ కంప్యూటర్ను తయారు చేశారు. ఆ కంప్యూటర్కి కీబోర్డ్, స్క్రీన్లు ఉండవు. పంచ్ కార్డ్ ప్రోగ్రామ్తో దీనిని ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. ఇదే క్రీమ్ సోడా కంప్యూటర్ యాపిల్ తన తొలి యాపిల్ కంప్యూటర్ను విడుదల చేయడానికి కారణమైంది. ➤ 1981లో స్వల్ప విమాన ప్రమాదం జరిగింది. ప్రమాదంతో సదరు విమానంలో ఉన్న వోజ్నియాక్ మతి స్థిమితం కోల్పోయారు. తర్వాత కొన్ని వారాలకు మళ్లీ సాధారణ స్థితికి చేరుకున్నారు. మతి మరుపుతో విమన ప్రమాదం జరగడం, మతి స్థిమితం కోల్పోవడం గురించి మరిచిపోయినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. -
రహస్యాలన్నీ బట్టబయలు.. ఎలాన్ మస్క్ బయోగ్రఫీలో ఏమేం ఉంటాయంటే
అపరకుబేరుడు ఎలాన్ మస్క్ బయోగ్రఫీ కాపీలు హాట్ కేకుల్లో అమ్ముడు పోతున్నాయి. ‘ఎలాన్ మస్క్’ పేరుతో విడుదలైన మస్క్ బయోగ్రఫీ కాపీలు కేవలం వారం రోజుల వ్యవధిలోనే 92,560 అమ్ముడుపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా బయోగ్రఫీ పుస్తకాలు ఎన్ని అమ్ముడు పోయాయో సిర్కానా అనే మీడియా సంస్థ ట్రాక్ చేస్తుంది. ఆ కంపెనీ అందించిన సమాచారం మేరకు విడుదలైన వారంలో ఎక్కువ మొత్తంలో అమ్ముడు పోయిన పుస్తకాల్లో మొదటిది యాపిల్ కో- ఫౌండర్ స్టీవ్ జాబ్స్ బయోగ్రఫీ కాగా.. రెండోది ఎలాన్ మస్క్ బయోగ్రఫీయేనని సిర్కానా వెల్లడించింది. వారంలోనే అన్ని పుస్తకాల ప్రొఫెసర్, ఆథర్, ప్రముఖ మీడియా సంస్థ సీఎన్ఎన్ మాజీ సీఈవో వాల్టర్ సెఫ్ ఐజాక్సన్ (Walter Seff Isaacson) యాపిల్ కోఫౌండర్ స్టీవ్ జాబ్స్ బయోగ్రఫీని రాశారు. అయితే, అక్టోబర్ 5, 2011లో స్టీవ్ జాబ్స్ మరణించిన వారం రోజుల తర్వాత ఆ పుస్తకాన్ని విడుదల చేశారు. విడుదలైన వారం రోజుల్లో 3,83,000 కాపీలు అమ్ముడుపోయాయి. మస్క్ బయోగ్రఫీ కోసం రెండేళ్ల సమయం వాల్టర్ మస్క్ బయోగ్రఫీ రాసేందుకు సుమారు రెండేళ్ల పాటు శ్రమించారు. మస్క్ అటెండ్ అయ్యే సమావేశాలు. ఇచ్చిన ఇంటర్వ్యూలు, కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని, మస్క్ అనుచరుల్ని, సలహాదారుల్ని ఇలా అందరి నుంచి సమాచారం సేకరించి బుక్ రాశారు. ఎలాన్ మస్క్ బయోగ్రఫీ బుక్ ఎప్పుడు విడుదలైంది? Walter Isaacson's biography of Elon Musk sold 92,560 copies in its first week on sale! 📚 pic.twitter.com/WkfgtByzp6 — Dima Zeniuk (@DimaZeniuk) September 22, 2023 ఎలాన్ మస్క్ బయోగ్రఫీని వాల్టర్ ఐజాక్సన్ రాశారు. సెప్టెంబర్ 12,2023న విడుదల చేశారు. మస్క్ బయోగ్రఫీ బుక్లో ఏముంటుంది? ఎలాన్ మస్క్! ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. అలాంటి టార్చ్ బేరర్ బాల్యం, బాధలు, కష్టాలు, కన్నీళ్లు, పలువురి మహిళలతో నెరిపిన సంబంధాలు, తన తండ్రి ఎర్రోల్ మస్క్తో ఉన్న అనుబంధాలతో సహా బిలియనీర్ జీవితంలోని అనేక కోణాలను వెల్లడించింది. పలు నివేదికల ప్రకారం.. మస్క్ గర్ల్ ఫ్రెండ్లు, మాజీ భార్యలు, మాజీ గర్ల్ఫ్రెండ్లు, పలువురి మహిళలతో సంతానం వంటి అనేక కొత్త విషయాలు మస్క్ జీవిత చరిత్రలో ఉన్నట్లు తేలింది. దీంతో పాటు టెస్లా కార్ల షేర్ల తగ్గింపు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపుకుడు బిల్గేట్స్తో వాగ్వాదం గురించి బయోగ్రఫీలో రాశారు. వాల్టర్ ఇప్పటికే వాల్టర్ ఇప్పటికే రాసిన ఐన్స్టీన్, బెంజిమన్ ఫ్రాంక్లిన్ పుస్తకాలు ఎక్కువగా అమ్ముడు పోయిన జాబితాలో నిలిచాయి. బయోగ్రఫీపై ఎలాన్ మస్క్ స్పందన Cool, although it’s kinda weird seeing so many close-up pics of my face 😂 — Elon Musk (@elonmusk) September 22, 2023 తన బయోగ్రఫీ కాపీలు ఊహించని విధంగా అమ్ముడుపోవడంపై మస్క్ స్పందించారు. ‘క్లోజప్లో నా ఫోటోలు చూడటానికి విచిత్రంగా ఉన్నప్పటికి చాలా బాగుంది అంటూ’ చమత్కరించారు. -
ప్రపంచ చరిత్రలో నష్ట జాతకుడు ఇతనే!
ప్రపంచంలో అత్యంత అదృష్టవంతుడు ఎవరో తెలుసా? జపాన్కు చెందిన సుటోము యమగుచి. ఎందుకంటే? ఇతను రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో హిరోషిమా, నాగసాకి అణు బాంబు దాడుల నుండి బయటపడిన వ్యక్తి . 1945 ఆగస్ట్ 6న అమెరికా యుద్ధ విమానం ఎనోలా గే 'లిటిల్ బాయ్' అనే బాంబును హిరోషిమాపై జారవిడిచింది. ఒక్క క్షణంలోనే నగరంలోని రెండున్నర లక్షల జనాభాలో 80 వేల మందిని మృత్యువు బలి తీసుకుంది. సరిగ్గా ఆ బాంబు ప్రదేశం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సుటోము ప్రాణాలతో బయటపడ్డారు. సుటోము యమగచి ఉన్న ప్రాంతంలో ప్రాణాలతో బయపడింది ఇయన ఒక్కరే. జపాన్ ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన ఏకైక వ్యక్తి ఇతడే. అందుకే ఇతను ప్రపంచంలోనే అంత్యంత లక్కీయస్ట్ పర్సన్గా గుర్తింపు పొందారు. మరి ప్రపంచంలో అత్యంత దురదృష్టవంతుడు ఎవరో తెలుసా? రోనాల్డ్ వేన్! వ్యాపార ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ మూడవ కో-ఫౌండర్. మరి అన్ లక్కీయస్ట్ పర్సన్ ఎందుకో తెలుసా? 290 బిలియన్ డాలర్ల షేర్లను కేవలం 800 డాలర్లకే అమ్మాడు. కాబట్టే ఇతనే వరల్డ్లోనే అన్ లక్కీయస్ట్ పర్సన్గా అప్రతిష్టను మూటగట్టుకున్నారు. సీఎన్బీసీ ‘ది ఫిల్తీ రిచ్ గైడ్’ ప్రకారం.. ఏప్రిల్ 1, 1976న కాలిఫోర్నియాలో స్టీవ్ వోజ్నియాక్ (21), స్టీవ్ జాబ్స్ (25), అనుభవంలోనూ, ఇటు వయస్సుల్లో పెద్దవారైన రోనాల్డ్ వేన్ (42) ముగ్గురు కలిసి టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీని ప్రారంభించారు. అదే రోజు యాపిల్ ముగ్గురు వ్యవస్థాపకుల్లో ఒకరైన రోనాల్డ్ వేన్.. కంపెనీలో ఎవరి బాధ్యతలు ఏంటో తెలుపుతూ ఓ అగ్రిమెంట్ రాశారు. దీంతో పాటు యాపిల్ ప్రొడక్ట్కు సంబంధించిన తొలి లోగోని తయారు చేశారు. ఐజాక్ న్యూటన్ ఒక చెట్టు కింద యాపిల్ తింటున్న ఫోటోని తయారు చేసింది ఇతనే. ఈ లోగోని ఏడాది కంటే తక్కువ కాలం ఉపయోగించింది యాపిల్ సంస్థ. ఇక, స్టీవ్ వోజ్నియాక్, స్టీవ్ జాబ్స్,రోనాల్డ్ వేన్ల భాగస్వామ్యంలో యాపిల్ సేవల్ని ప్రారంభించింది. కేవలం 12 రోజుల వ్యవధిలో అమెరికాలోనే తొలి యాపిల్ 1 కంప్యూటర్ను అమ్మిన కంప్యూటర్ రీటైల్ సంస్థ ‘బైట్ షాప్’ తమకు 100 కంప్యూటర్లను తయారు చేసి పెట్టాలంటూ యాపిల్కు ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ రానైతే వచ్చింది. తయారు చేసేందుకు చేతిలో చిల్లిగవ్వలేదు. అప్పుడే కంప్యూటర్ల తయారీకి వినియోగించే పరికరాల కోసం స్టీవ్ జాబ్స్ 15,000 డాలర్ల లోన్ తీసుకున్నారు. నిర్ధేశించిన గడువులోగా స్టీవ్ జాబ్స్ యాపిల్ కంప్యూటర్లను తయారు చేసి ఇచ్చారు. ఒప్పందం ప్రకారం.. కంప్యూటర్లను తయారు చేసి ఇవ్వనైతే ఇచ్చారు. కానీ తయారు చేసిన కంప్యూటర్ల తాలుకు బిల్స్ ఆగిపోయాయి. ఓ వైపు లోన్, మరో వైపు బైట్ షాప్ నుంచి రావాల్సిన డబ్బులు రాలేదు. అందుకే సంస్థలో కొనసాగితే ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని బయపడ్డారు రోనాల్డ్ వేన్. యాపిల్ సంస్థ నష్టపోతే యువకులైన వోజ్నియాక్, జాబ్స్కు ఏమీ కాదు. ఎందుంకటే వాళ్ల చేతిలో ఏమీ లేవు. వేన్ అలా కాదే. అప్పటికే ధనవంతుడు. ఆస్తిపాస్తులు బాగానే సంపాదించారు. అందుకే తాను యాపిల్ సంస్థను వదిలేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికే యాపిల్లో ఉన్న తన 10 శాతం వాటాను కేవలం 800 డాలర్లకు తన సహచరులకు అమ్మారు. ఆ విధంగా యాపిల్ సంస్థను విడిచిపెట్టాలని వేన్ తీసుకున్న నిర్ణయం అతనికి పెద్ద నష్టాన్ని మిగిల్చింది. నేడు,యాపిల్లో 10 శాతం వాటా విలువ 95 బిలియన్ల కంటే ఎక్కువగా ఉంటుంది. అదే వాటా వేన్ను సైతం ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరిగా నిలబెట్టేది. కానీ ఆ నిర్ణయమే ప్రపంచంలోనే అత్యంత అన్లక్కియస్ట్ పర్సన్గా నిలబెట్టింది. ఆశ్చర్యకరంగా, వేన్ తన నిర్ణయానికి చింతించలేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. యాపిల్ సంస్థ అభివృద్ది చెందలేదని, తాను రాబోయే 20 సంవత్సరాల పాటు డాక్యుమెంటేషన్ విభాగంలో విభాగంలో విధులు నిర్వహించాల్సి వచ్చేదని పేర్కొన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. చదవండి👉 ఆ ఇద్దరు ఉద్యోగుల కోసం.. రెండు కంపెనీల సీఈవోలు పోటీ..రేసులో చివరికి ఎవరు గెలిచారంటే? -
ఐఫోన్ 14పై స్టీవ్ జాబ్స్ కూతురు.. ఇది కూడా ఎగతాళేనా?
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్..గత ఏడాది జరిగిన 'యాపిల్ ఫార్ అవుట్ 2022 ఈవెంట్'లో ఐఫోన్ 14 సిరీస్తో పాటు సిరీస్ 8, ఎయిర్పాడ్స్ ప్రో, వాచీ ఎస్ఈ2 లను విడుదల చేసింది. ఈ సందర్భంగా యాపిల్ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ కుమార్తె ఈవ్ జాబ్స్ ఐఫోన్ 13తో పోలిస్తే కొత్త ఐఫోన్ 14 పెద్దగా అప్డేట్ ఏమీ లేదంటూ ఓ సెటైరికల్ మీమ్ను షేర్ చేశారు. అయితే త్వరలో ఐఫోన్ 15 సిరీస్ విడుదల కానున్న తరుణంలో ఈవ్ జాబ్స్ ఐఫోన్ 14 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐఫోన్ 14 లేకుండా జీవించలేనని వ్యాఖ్యానించారు.ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు టెక్ వరల్డ్ చర్చనీయాంశంగా మారాయి. ఐఫోన్ 14 లేకపోతే జీవించలేను న్యూయార్స్ మ్యాగజైన్ ‘ది స్ట్రాటజిస్ట్’తో జరిగిన ఇంటర్వ్యూలో ఏ వస్తువులు మీ దగ్గర లేకపోతే జీవించలేరన్న ఇంటర్వ్యూర్ ప్రశ్నకు ఈవ్ జాబ్స్ స్పందించారు. తాను 9 వస్తువులు లేకపోతే జీవించలేనని ఆవేంటో చెప్పారు. వాటిల్లో ఐఫోన్ 14కూడా ఉంది. నిజం చెబుతున్నారా? దీంతో ఇంటర్వ్యూ చేసే యాంకర్ గతంలో ఐఫోన్ 14పై వేసిన సెటైర్ల గురించి ప్రస్తావించారు. అందుకు ఆమె ‘ఇది క్రియేటివ్స్ కోసం సృష్టించిన టూల్ అని, దాని డిజైన్ మాస్టర్ పీస్ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. మనుషుల జీవన విధానాల్ని సమూలంగా మార్చిన ఐఫోన్ 14 జీనియస్ అని అన్నారు. కొందరు ఈ విషయంపై ఈవ్ జాబ్స్ నిజం చెబుతున్నారా? లేదంటే సెటైర్లు వేస్తున్నారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ధరించిన చొక్కాలాంటిదే మరోటి కొనుక్కోవడం సాధారణంగా యాపిల్ విడుదల చేసే ఐఫోన్లన్నీ దాదాపు ఒకే తరహాలో ఉంటాయి. టెక్నాలజీ పరంగా ఫోన్లలో మార్పులు చేస్తుందే తప్పా డిజైన్లో పెద్దగా మార్పులుండవు. ఈవ్ జాబ్స్ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఐఫోన్ 14 విడుదల సమయాలో ఓ మీమ్ను నెటిజన్లతో పంచుకున్నారు. ‘ఐఫోన్ 13 నుంచి ఐఫోన్ 14కు మారడం అంటే ప్రస్తుతం ధరించిన చొక్కాలాంటిదే మరోటి కొనుక్కోవడం లాంటిది’ అని చెప్పే మీమ్ను తన ఇన్స్టా స్టోరీలో పోస్ట్చేసింది. దీంతో ఈ పోస్ట్ వైరల్గా మారింది. గుర్రపుస్వారీలో నిష్టాతురాలు స్టీవ్ జాబ్స్ నలుగురు పిల్లలలో ఈవ్ జాబ్స్ చిన్న. ఆమె స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్, సైన్స్, టెక్నాలజీలో ప్రావీణ్యం సంపాదించింది. మోడల్, గుర్రపుస్వారీలో నిష్టాతురాలు కూడా. చదవండి👉 ‘ఐఫోన్’ పరువు తీసిన యాపిల్ బాస్ కూతురు, సమర్ధించిన టిమ్ కుక్ -
ఈ కంప్యూటర్ మౌస్ ధర కోటిన్నర? అసలు స్టోరీ ఏమిటంటే!
న్యూఢిల్లీ: దిగ్గజ టెక్ కంపెనీ యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ అంటే ఒక ఇన్సిపిరేషన్. ఆపిల్ కంప్యూటర్లతో, టెక్నాలజీకి విప్లవ బాటలు వేసిన స్ఫూర్తిమంతుడు స్టీవ్ జాబ్స్. అలాంటి స్టీవ్ జాబ్స్కే ప్రేరణగా నిలిచిన కంప్యూటర్ మౌస్ 147,000 పౌండ్లకు (రూ. 1,48,89,174) అమ్ముడైంది. కంప్యూటింగ్ ఐకాన్ డగ్లస్ ఎంగెల్బార్ట్ రూపొందించిన అరుదైన మూడు-బటన్ల మౌస్, కోడింగ్ కీసెట్ బోస్టన్-ఆధారిత ఆర్ఆర్ నిర్వహించిన వేలంలో దాని అంచనా 12వేల పౌండ్ల కంటే దాదాపు 12 రెట్ల రికార్డు ధరను దక్కించుకోవడం విశేషం. మెట్రో అందించిన రిపోర్ట్ ప్రకారం కంప్యూటర్ వాడకలో అత్యంత కీలకమైన మౌస్ రూ. 1.49 కోట్లను సాధించింది. ఎంగెల్బార్ట్ రూపొందించిన అరుదైన, తొలి త్రి-బటన్ కంప్యూటర్ మౌస్, (సుమారు 4″ x 2.75″ x 2.5″) దిగువన ఉన్న రెండు మెటల్ డిస్క్లను (X-యాక్సిస్, Y-యాక్సిస్కు అనుగుణంగా) వినియోగిస్తుంది. కోడింగ్ కీసెట్లోని ఐదు కీలను ఉపయోగించి మొత్తం 31 వేర్వేరు కీ ప్రెస్లను తయారు చేయవచ్చు. ఈ సెటప్ని ఉపయోగించి, వినియోగదారు తమ ఎడమ చేతితో టైప్ చేయవచ్చు. "మదర్ ఆఫ్ ఆల్ డెమోస్" దీన్ని అభివర్ణిస్తారు. ఇపుడు వాడుతున్న మౌస్లకు ఇది మాతృక. స్టీవ్ జాబ్స్ 1979లో ఒక పరిశోధనా కేంద్రాన్ని సందర్శించినప్పుడు మౌస్ , గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ (GUI)ని చూశారు. దీన్ని ఆపరేట్ చేయడం ఎంత సులభమో గ్రహించి చాలా సంతోష పడ్డారుట. దాంతో ఆపిల్ కంప్యూటర్లకు కూడా దీనిని అనుసరించాలని భావించారు. కానీ 245-పౌండ్ల జిరాక్స్ మౌస్ పని తీరు సరిగ్గాలేకపోవడంతో 12-పౌండ్లతో వన్ బటన్ మౌస్ రూపొందించాలని నిర్ణయించుకున్నారట. ఆర్ఆర్వేలంపై సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ బాబీ లివింగ్స్టన్ మాట్లాడుతూ ఎంగెల్బార్ట్ ఆవిష్కరణ కంప్యూటర్ చరిత్ర పరిణామంలో ఈ పరికరం కీలక పాత్ర పోషించింది. ఆధునిక జీవిత గమనాన్ని మార్చివేసిందన్నారు. SOLD! a computer mouse and coding keyset created by Doug Engelbart, as used in the 'Mother of All Demos,' sold for $178,936 @RRAuction. https://t.co/r9fz431woY#Xerox #Computer #Consign #Auction #History pic.twitter.com/f4uQZBiZJ4 — RR Auction (@RRAuction) March 17, 2023 -
స్టీవ్ జాబ్స్ పాత చెప్పులు వేలం: రికార్డు ధర
న్యూఢిల్లీ: యాపిల్ కోఫౌండర్ దివంగత స్టీవ్ జాబ్స్ పాత చెప్పులు రికార్డ్ ధరకు అమ్ముడు బోవడం విశేషంగా నిలిచింది. అమెరికాలో జూలియెన్స్ ఆక్షన్ కంపెనీ ఆదివారం నిర్వహించిన వేలంలో స్టీవ్ జాబ్స్ ధరించిన బిర్కెన్స్టాక్ కంపెనీ సాండల్స్ అత్యధిక ధరను దక్కించుకున్నాయి. 2,20,000 వేల డాలర్లు (సుమారు రూ.1.78 కోట్లు) ఒక వ్యక్తి వీటిని సొంతం చేసుకున్నారు. (అరిగిపోయిన చెప్పులకు అన్ని వేల డాలర్లా? ఎవరివో గుర్తు పట్టగలరా?) 1970ల మధ్యకాలంలో స్టీవ్ జాబ్స్కి ఎంతో ఇష్టమైన బ్రౌన్ స్వెడ్ బిర్కెన్స్టాక్ సాండిల్స్ అత్యధిక ధరతో రికార్డు సృష్టించాయని జూలియన్స్ ఆక్షన్ పేర్కొంది. వేలంలో వీటికి 60 వేల డాలర్ల ధర వస్తుందని భావించారు. ఈ సాండల్స్కి నాన్ ఫంజిబుల్ టోకెన్ ధర 2,18.750 డాలర్లుగా నిర్ణయించారు. అయితే, రికార్డు స్థాయిలో రెండు లక్షల ఇరవై వేల డాలర్లు వచ్చాయి. అయితే ఈ సాండల్స్ని కొనుగోలు చేసిన ఎవరు కొనుగోలు చేశారు అనే వివరాలను మాత్రం జూలియెన్స్ కంపెనీ వెల్లడించ లేదు. 1976లో స్టీవ్ వోజ్నియాక్ కలిసి కాలిఫోర్నియాలో యాపిల్ కంపెనీని ప్రారంభించారు స్టీవ్ జాబ్స్. ఆధునిక టెక్నాలజీతో, పాపులర్ యాపిల్ ఉత్పత్తులతో ఆధునిక టెక్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న స్టీవ్ జాబ్స్ క్యాన్సర్తో 2011లో కన్నుమూశారు. ఇదీ చదవండి: ElonMusk బ్లూటిక్ బాదుడు పక్కా,ముహూర్తం ఫిక్స్ -
అరిగిపోయిన చెప్పులకు అన్ని వేల డాలర్లా? ఎవరివో గుర్తు పట్టగలరా?
న్యూఢిల్లీ: యాపిల్ కో ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ధరించిన పాత, అరిగిపోయిన చెప్పులు ఆన్లైన్లో వేలానికి ఉంచారు. 1970, 80ల కాలంలో ఆయన వేసుకున్న బ్రౌన్ స్వెడ్ లెదర్ బిర్కెన్స్టాక్ అరిజోనా చెప్పులను వేలానికి ఉంచింది. వీటి 60వేలు- 80 వేల డాలర్లు (మన కరెన్సీలో రూ. 48లక్షల నుంచి 64 లక్షలకు పైనే) ధర నిర్ణయించారని వేలం జూలియన్స్ ఆక్షన్స్ నిర్వాహకుడు వెల్లడించారు. ఇదీ చదవండి: యాపిల్ గుడ్న్యూస్: ఇండియాలో నాలుగురెట్లు పెరగనున్న ఉద్యోగాలు! ఈ వేలం నవంబర్ 11న మొదలు కాగా, నవంబర్ 13న ముగియనుంది. మార్క్ షెఫ్, స్టీవ్ జాబ్స్ హోమ్ మేనేజర్, 1980 లలో కాలిఫోర్నియాలోని అల్బానీలో బిర్కెన్స్టాక్ చెప్పులను భద్రపరిచారు. జూలియన్స్ వేలం వెబ్సైట్లోని తాజా సమాచారం ప్రకారం, బిడ్ 15 వేల డాలర్ల వద్ద వద్ద ప్రారంభమై 22,500 డాలర్ల వద్ద ఉంది. బిడ్ గెలిచిన వాళ్లు చెప్పులతోపాటు, చెప్పుల ఎన్ఎఫ్టీని కూడా సొంతం చేసుకోవచ్చు. అలాగే ఫోటోగ్రాఫర్ జీన్ పిగోజీ బుక్"ది 213 మోస్ట్ ఇంపార్టెంట్ మెన్ ఇన్ మై లైఫ్" ను కూడా దక్కించుకోవచ్చు. (క్యూ కడుతున్న టాప్ కంపెనీలు: అయ్యయ్యో ఎలాన్ మస్క్!) ఆయనకి ప్రత్యేకంగా ఉండటం ఇష్టం ఉండేది కాదు, సాధారణంగా ఉంటూనే, అత్యాధునిక టెక్నాలజీపై దృష్టి పెట్టేవారని వోగ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టీవ్ జాబ్స్ మాజీ భార్య క్రిస్సన్ బ్రెన్నాన్ తెలిపారు. స్టీవ్ జాబ్స్ వార్డ్రోబ్ లో చెప్పులు కూడా ఉండేవి. అవి ఆయన యూనిఫాంలో భాగం. ఒక బిజినెస్ మేన్గా స్పెషల్గా కంటే కూడా సింపుల్ డిజైన్, చెప్పులు కంఫర్ట్గా ఉన్నాయో లేదో మాత్రమే ఆలోచించేవారని ఆమె గుర్తు చేసుకున్నారు. యాపిల్ చరిత్రలో అనేక కీలకమైన క్షణాల్లో స్టీవ్ జాబ్స్ ఈ చెప్పులను ధరించినట్లు వేలం సంస్థ పేర్కొంది. 1976లో సహ-వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్తో కలిసి లాస్ ఆల్టోస్ గ్యారేజీలో యాపిల్ కంప్యూటర్ ఆవిష్కరణ సందర్భంగా ఇదే చెప్పులను ధరించారట. మరోవైపు ఈ సాండిల్స్ను ఇప్పటికే పలుఎగ్జిబిషన్స్లో ప్రదర్శించారు. 2017లో ఇటలీలోని మిలన్లో సలోన్ డెల్ మొబైల్, 2017లో జర్మనీలోని రహ్మ్స్లోని బిర్కెన్స్టాక్ హెడ్క్వార్టర్స్, న్యూయార్క్లోని సోహోలో, జర్మనీలోని కొలోన్లో IMM కోల్న్ ఫర్నిచర్ ఫెయిర్ వంటి అనేక ప్రదర్శనలలో వీటిని ఉంచారు. అలాగే 2018లో Die Zeit మ్యాగజైన్ కోసం Zeit ఈవెంట్ బెర్లిన్,ఇటీవల, జర్మనీ స్టట్గార్ట్లోని ది హిస్టరీ మ్యూజియం వుర్టెంబర్గ్లో ఉంచడం విశేషం. (హ్యుందాయ్ భారీ ఆఫర్, ఆ కారుపై లక్ష దాకా డిస్కౌంట్) కాగా ఫాదర్ ఆఫ్ డిజిటల్ రివల్యూషన్, స్టీవ్జాబ్స్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 1976లో యాపిల్ సంస్థను నెలకొల్పి కోట్లాదిమంది అభిమానులతో యాపిల్ మ్యాక్స్, ఐఫోన్లు, ల్యాప్టాప్లు, ఐప్యాడ్లు, యాపిల్ వాచెస్..ఇలా యాపిల్ అనే బ్రాండ్ను విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం. అందుకే రోడ్లపై పడేసిన కోక్ బాటిల్స్ అమ్ముకునే స్థాయినుంచి గ్లోబల్ టెక్ లీడర్గా ఎదిగిన ఆయన ప్రస్తానం పలువురికి స్ఫూర్తిదాయకం. గతంలో చార్టర్ఫీల్డ్స్ వేలం వేసిన స్టీవ్ జాబ్స్ ఉద్యోగ దరఖాస్తు సుమారు రూ.1.6 కోట్లకు విక్రయించబడింది. ఇదే ఉద్యోగ దరఖాస్తు 2018 ఏడాది నిర్వహించిన ఆక్షన్లో సుమారు రూ.1.2 కోట్లకు అమ్ముడైన సంగతి తెలిసిందే. -
వేలాది మంది ఉద్యోగుల తొలగింపు, ‘యాపిల్ సంస్థను అమ్మేయండి’!
స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ట్విటర్ను కొనుగోలు తర్వాత ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్ని భారీ ఎత్తున తొలగించారు. ప్రపంచ వ్యాప్తంగా ట్విటర్లో 7500 మంది పని చేస్తుండగా..అందులో సగం మందికి పైగా తొలగిస్తున్నట్లు మెయిల్స్ పంపారు. ఇలా వేలాది మంది ఉద్యోగుల్ని ఒకేసారి తొలగించడం కొత్తేమి కాదని, సంస్థ సంక్షోభ సమయంలో యాపిల్ కో- ఫౌండర్ స్టీవ్ జాబ్ సైతం సిబ్బందికి ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. ఎలన్ మస్క్ - ట్విటర్ మధ్య కొనుగోలు ఒప్పొందం పూర్తయిన వెంటనే శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విటర్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. వెళ్లే సమయంలో తన చేతులో ఓ సింక్ పట్టుకొని కనిపించారు. ట్విటర్ హెడ్క్వార్టర్స్లోకి ఎంటర్ అవుతున్నానని, ఇక అది సింక్ కావాల్సిందే అని మస్క్ తన వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఆ తర్వాత రెండ్రోజుల్లో వరల్డ్ వైడ్గా ట్విటర్లో పనిచేస్తున్న ఉద్యోగుల తొలగింపులో భాగంగా..తొలత మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్, లీగల్ ఎగ్జిక్యూటీవ్ విజయ గద్దెలపై వేటు వేశారు. సగానికి పైగా ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపారు. యాపిల్ ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇలా దిగ్గజ సంస్థలు ఉద్యోగుల్ని ఫైర్ చేయడం తొలిసారి కాదని, యాపిల్ సైతం అర్ధాంతరంగా ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇచ్చిన 1990 నాటి చరిత్రని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. అమెరికాకు చెందిన వెబ్ సాఫ్ట్వేర్ కంపెనీ ‘రూబీ ఆన్ రైల్స్’ క్రియేటర్,37 సిగ్నల్స్ కో- ఫౌండర్,సీటీవో డేవిడ్ హీనెమీయర్ హాన్సన్ నివేదిక నాడు యాపిల్ తన ఉద్యోగుల్ని తొలగించిన అంశాన్ని ప్రస్తావించింది. యాపిల్ను అమ్మేయండి 1997లో యాపిల్ చిక్కుల్లో పడింది. కంపెనీ స్టాక్ 12 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. దీంతో స్టాక్ మార్కెట్లో కంపెనీ విలువ పడిపోవడం ప్రారంభమైంది. ఆ సమయంలో కంప్యూటర్ మ్యానిఫ్యాక్చరింగ్ విభాగంలో యాపిల్కు కాంపిటీటరైన ‘డెల్’ విమర్శలు చేసింది. డెల్ అధినేత మైఖేల్ డెల్ యాపిల్ సంస్థను అమ్మేసి వాటాదారులకు డబ్బును తిరిగి ఇవ్వాలని పిలునిచ్చారు. ఆ పిలుపే యాపిల్ సంస్థలో ప్రకంపనలు రేపింది. అప్పుడే యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ జూలై 1997లో సంస్థలోకి తిరిగి వచ్చారు. ఉద్యోగులపై వేటు ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టెక్కించేలా స్టీవ్ జాబ్ వచ్చీ రాగానే యాపిల్ సీఈవో గిల్ అమేలియో అడ్వైజర్గా జాయిన్ అయ్యారు. మైక్రోసాఫ్ట్తో జత కలిసి నిక్స్ ది న్యూటన్ ప్రాజెక్ట్పై వర్క్ చేయడం ప్రారంభించారు.ఆ మరుసటి నెలలో (ఆగస్ట్) యాపిల్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ప్రాజెక్ట్లను భారీగా నిలిపివేసింది. అప్పటికి, యాపిల్ నిర్వహణ వ్యయాలను ప్రతి ఏడాది 500 మిలియన్ల మేర తగ్గించుకోవాలని భావించింది.అందుకే ఊహించని విధంగా స్టీవ్ జాబ్స్ 4,100 యాపిల్ ఉద్యోగుల్ని తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వ్యత్యాసం అదే అయితే నాటి యాపిల్ పరిస్థితుల్ని గుర్తు చేసుకుంటున్న నెటిజన్లు స్టీవ్ జాబ్స్కు..మస్క్కు అసలు పోలికే లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తన ఆలోచనలతో ప్రపంచాన్ని మార్చగలనని ఆలోచించేంత పిచ్చి ఉన్న మస్క్ను ఈ తరం ‘స్టీవ్ జాబ్స్’గా అభివర్ణిస్తుంటారు నెటిజన్లు. కానీ ఇప్పుడు వాళ్లే మస్క్ డబ్బు కోసం ఉద్యోగుల్ని తొలగించారని, స్టీవ్ జాబ్స్ సంస్థ కోసం ఉద్యోగుల్ని తొలగించాల్సి వచ్చిందంటూ చర్చించుకుంటున్నారు. చదవండి👉 ‘ట్విటర్లో నా ఉద్యోగం ఊడింది’, 25 ఏళ్ల యశ్ అగర్వాల్ ట్వీట్ వైరల్ -
‘ఐఫోన్’ పరువు తీసిన యాపిల్ బాస్ కూతురు, సమర్ధించిన టిమ్ కుక్
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్.. ఐఫోన్ 14 సిరీస్తో పాటు సిరీస్ 8, ఎయిర్పాడ్స్ ప్రో, వాచీ ఎస్ఈ2లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఐఫోన్ 14 సిరీస్పై యాపిల్ సీఈవో టిమ్ కుక్ అసంతృప్తి వ్యక్తం చేశారు. లేటెస్ట్ సిరీస్ ఫోన్లపై యాపిల్ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ కుమార్తె ఈవ్ జాబ్స్ వేసిన మీమ్స్ సమర్ధించారు. 'యాపిల్ ఫార్ అవుట్ 2022 ఈవెంట్' జరిగింది. ఈ ఈవెంట్లో సీఈవో టిమ్ కుక్ ఐఫోన్ 14 సిరీస్లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్లను రిలీజ్ చేయగా.. వాటిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఫోన్లలో ఎలాంటి ఆవిష్కరణలు లేవనే విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చదవండి👉 ఐఫోన్ కోసం దుబాయ్ వెళ్లాడు..కానీ చివరికి ఈ క్రమంలో ఐఫోన్ 14 సిరీస్పై టిమ్కుక్ స్పందించారు. గత పదేళ్లుగా యాపిల్ కస్టమర్లలో నేను ఒకరిని. తొలిసారి బ్లాక్ బెర్రీ నుంచి ఐఫోన్ 4ఎస్కు షిఫ్ట్ అయ్యా. నాటి నుంచి మార్కెట్లో ఏ ఐఫోన్ వచ్చినా వెంటనే కొనుగోలు చేస్తుంటా. ఈ ఏడాది కూడా 256 జీబీ సిల్వర్ కలర్ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ను కొనుగోలు చేశా. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ను ఉద్దేశిస్తూ..‘‘నా కొత్త బొమ్మతో రెండు వారాల పాటు ఆడిన తరువాత, "డైనమిక్ ఐలాండ్" తప్ప.. ఆశ్చర్యపోయేలా ఆవిష్కణలు లేవని గట్టి నమ్మకంతో చెప్పగలను. సెల్ఫీ కెమెరా, నోటిఫికేషన్లు, అలెర్ట్స్, ఇతర కార్యకలాపాల్ని అనుసంధానం చేసేలా ఫేస్ ఐడి సెన్సార్ మాత్రమే ఉందని అన్నారు. స్టీవ్ జాబ్స్ కూతురు చెప్పింది నిజమే స్టీవ్ జాబ్స్ కూతురు ఈవ్ జాబ్స్ కొత్త ఐఫోన్ 14 సిరీస్పై సెటైర్ వేశారు. పాత స్మార్ట్ఫోన్ల లాగానే కొత్త జనరేషన్ ఫోన్లు ఉన్నాయని అర్ధం వచ్చే ఓ మీమ్ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఐఫోన్ 13 నుంచి ఐఫోన్ 14కి అప్గ్రేడ్ అవుతున్నానని..ఓ వ్యక్తి తాను వేసుకున్న షర్ట్ లాంటిదే మరో షర్ట్ చేతిలో పట్టుకొని ఉన్న మీమ్ను ఈవ్ జాబ్స్ షేర్ చేసింది. ఆ మీమ్నే టిమ్ కుక్ సమర్ధించారు. చదవండి👉 ఐఫోన్ కోసం దుబాయ్ వెళ్లాడు..కానీ చివరికి -
ఆపిల్ ఐఫోన్14: స్టీవ్ జాబ్స్ కుమార్తె సెటైర్..ఏమైంది?
న్యూఢిల్లీ: ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఐఫోన్ 14 సిరీస్ను టెక్ దిగ్గజం ఆపిల్ ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా లాంచ్ చేసింది. అయితే లేటెస్ట్ ఐఫోన్ 14 ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ కుమార్తె ఈవ్ జాబ్స్కు నచ్చినట్టు లేదు. అందుకే సెటైర్ వేయడం ఇంటర్నెట్లో హాట్టాపిక్గా నిలిచింది. ఊహించని విధంగా మీమ్ను పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో మీమ్ ఫెస్టివల్ జరుగుతోంది. స్టీవ్ జాబ్స్ కుమార్తె ఈవ్ ఇన్స్టాగ్రామ్లో ఆపిల్ ఐఫోన్, 13, 14ని పోలుస్తూ ఒక స్టోరీ పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు ఫన్నీగా కమెంట్ చేస్తున్నారు. ఆపిల్ ప్రకటన తరువాత ఐఫోన్14ను అప్డేట్ చేసుకుంటున్నా అని క్యాప్షన్తో ఒక పోస్ట్ పెట్టారు. ఐఫోన్ 13తోపోలిస్తే. కొత్త ఐఫోన్ 14 పెద్దగా అప్డేట్ ఏమీ లేదంటూ ఐఫోన్ లవర్స్ పెదవి విరుస్తున్న సందర్భంలో ఈవ్ పోస్ట్ చర్చకు దారి తీసింది. మరోవైపు యుఎస్లోని ఐఫోన్ మోడల్స్లో ఇ-సిమ్ యాక్టివేషన్పై కూడా యూజర్లు అంసతృప్తిగా ఉన్నారు. తాజా అప్డేట్స్పై సోషల్ మీడియా మీమ్స్ ఒక రేంజ్లో పేలుతున్నాయి. "తదుపరి ఐఫోన్లో మైక్రోఫోన్ ఉండదు. ఇక మీరు నేరుగా మీరు మాట్లాడాలను కుంటున్న వారి దగ్గరకు వెళ్లాలి." అని ఒక యూజర్ కమెంట్ చేయగా, "త్వరలో ఇది ఐఫోన్కు బదులుగా ఇ-ఫోన్ అవుతుందని మరొకరు వ్యాఖ్యానించడం గమనార్హం. అలాగే ఈ సిమ్స్ ఇండియాకు రాకపోవడం మంచిదైంది. ఐఫోన్ 14 సిరీస్ సిమ్ ట్రేతో ఉండడం గొప్ప విషయం. లేదంటే ఇక్కడ చాలా గందరగోళ పరిస్థితి ఉండేది. తాము ఇంకా ఇ-సిమ్లకు సిద్ధంగా లేం అంటూ ఇండియన్ యూజర్ ఒకరు రాశారు. కాగా బుధవారం రాత్రి నిర్వహించిన "ఫార్ అవుట్" మెగా ఈవెంట్లో ఆపిల్ ఐఫోన్ 14, ఎయిర్పాడ్స్ ప్రో, ఆపిల్ వాచ్ అల్ట్రాలను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 మాక్స్ను ఆవిష్కరించింది. ఐఫోన్ 14 ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 9 నుండి ప్రారంభం. ఐఫోన్ 14 సెప్టెంబర్ 16 నుండి , ఐఫోన్ 14 ప్లస్ అక్టోబర్ 7 నుండి సేల్కు అందుబాటులో ఉంటాయి. ఇండియాలో ఐఫోన్ 14 ప్రారంభ ధర రూ. 79,900, ఐఫోన్ 14 ప్లస్ ప్రారంభ ధర రూ. 89,900గా ఉంటుంది. Eve Jobs, the daughter of Steve Jobs and Laurene Powell Jobs, reacts to today’s iPhone announcement on her Instagram. pic.twitter.com/bfn2VtbpsA — Yashar Ali 🐘 (@yashar) September 7, 2022 -
యాపిల్ పెను సంచలనం
Apple first company to cross $3 trillion market cap milestone: కార్పొరేట్ రంగంలో యాపిల్ కంపెనీ పెను సంచనలం సృష్టించింది. ఏకంగా 3 ట్రిలియన్ డాలర్ల(3 X రూ.75లక్షల కోట్లుపైనే) వాల్యూ మార్క్ను అందుకున్న తొలి కంపెనీగా అవతరించింది. సోమవారం (జనవరి 3, 2022)న మధ్యాహ్నాం మార్కెట్లో షేర్ల ధరల పెరుగుదలతో ఈ ఘనత సాధించింది ఈ అమెరికన్ మల్టీనేషనల్ టెక్ దిగ్గజం. స్టీవ్ జాబ్స్ 2007లో ఫస్ట్ యాపిల్ ఐఫోన్ను లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి విలువతో పోలిస్తే.. ఇప్పుడు యాపిల్ షేర్లు 5,800 శాతం రెట్లు పెరిగాయి ఇప్పుడు. కరోనా టైంలోనూ ఈ కార్పొరేట్ జెయింట్ హవాకు అడ్డుకట్ట పడకపోవడం విశేషం. 2020 మొదట్లో 200 శాతం పెరిగాయి షేర్ల ధరలు. మొత్తంగా ఇప్పుడు మూడు ట్రిలియన్ డాలర్ల మార్కెట్ను దాటేసింది. స్టీవ్ జాబ్స్ 1976లో ఓ కంప్యూటర్ కంపెనీగా మొదలైన యాపిల్ కంపెనీ.. ఇన్కార్పోరేటెడ్గా(విలీన కంపెనీగా) హార్డ్వేర్, సాఫ్ట్వేర్, మీడియా సర్వీసులను అందిస్తున్న విషయం తెలిసిందే. 2 ట్రిలియన్ మార్కెట్ను అందుకున్న కేవలం పదిహేడు నెలలకే.. అది చిప్ కొరత లాంటి అసాధారణ సమస్యను ఎదుర్కొంటూనే 3 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ మార్క్ను టచ్ చేయగలగడం మరో విశేషం. యాపిల్ తొలి ఆఫీస్ నా జీవితంలో ఈ మార్క్ను కంపెనీ సాధిస్తుందని ఊహించలేదు.. కానీ, రాబోయే ఐదు పదేళ్లలో యాపిల్ ఊపు ఎలా ఉండబోతుందో ఈ గణాంకాలే చెప్తున్నాయి అంటున్నారు కంపెనీలో 2.75 మిలియన్ షేర్లు ఉన్న ప్యాట్రిక్ బర్టోన్(ఈయన మెయిన్ స్టే విన్స్లో లార్జ్ క్యాప్ గ్రోత్ ఫండ్కి కో-ఫోర్ట్ఫోలియో మేనేజర్). యాపిల్ కంపెనీ 2018లో 1 ట్రిలియన్ డాలర్ మార్క్ అందుకుంది. ఆగష్టు 2020లో 2 ట్రిలియన్ డాలర్ మార్క్ అందుకుంది. ఈ క్రమంలో మరో టెక్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంది యాపిల్. మొత్తంగా 2 ట్రిలియన్ డాలర్ మార్క్ దాటిన తొలి కంపెనీ మాత్రం సౌదీ ఆరామ్కో(సౌదీ అరేబియన్ ఆయిల్ కంపెనీ). ప్రస్తుతం యాపిల్ మొదటి స్థానంలో ఉండగా, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్(గూగుల్), సౌదీ ఆరామ్కో, అమెజాన్లో తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాయి. చదవండి: యాపిల్+మేక్ ఇన్ ఇండియా= 50 బిలియన్ డాలర్లు!! -
45 ఏళ్ల క్రితం కంప్యూటర్.. దీని విలువ కోట్లలోనే!
45 ఏళ్ల క్రితం స్టీవ్ జాబ్స్ స్వయంగా తయారుచేసిన యాపిల్–1 కంప్యూటర్ ఇది. అమెరికాలో మంగళవారం జరిగిన జాన్ మోరాన్ ఆక్షనీర్స్ వేలంపాటలో ఇది దాదాపు రూ.3 కోట్ల ధర పలికింది. ఎయిర్ బెలూన్ రికార్డు ఫ్రాన్స్లో 3,637 మీటర్ల ఎత్తులో ఎగురుతున్న హాట్ ఎయిర్ బెలూన్పై ఎక్కువ సేపు నిలబడి ప్రయాణించి కొత్త ప్రపంచ రికార్డును సృష్టించిన ఈయన పేరు రెమీ ఓవర్డ్. బుధవారం చాటెలార్ట్లో తీసిందీ ఫొటో. -
సమయమే సంపద
కాలం ఎంతో విలువైనది. ఎవరికోసం ఆగనిది. బిరబిరమంటూ సాగిపోయే ఉధృతమైన నదీ ప్రవాహానికి మానవ మేధాశక్తితో ఆనకట్ట వేయవచ్చు. కానీ, నిరవధికంగా సాగిపోయే కాలప్రవాహానికి మాత్రం ఎవ్వరూ అడ్డుకట్ట వేయలేరన్నది వాస్తవమే కదా..!! కాలం మనకు ఉచితంగా లభిస్తుంది. కానీ కాలం విలువను వెలకట్టలేమన్నది జగమెరిగిన సత్యం. సకల ప్రాణుల్ని, సమస్త జగత్తునూ నడిపించేదీ, హరించేదీ కాలమే. సృష్టి, స్థితి, వినాశం అనే ప్రధానమైన కార్యాలకు సాక్షీభూతంగా నిలిచేదీ కాలమే. అత్యంత బలవత్తరమైన కాలప్రభావాన్ని ఎవరూ అతిక్రమించలేరు. ఏ భౌతిక సాధనాలూ, ఆధ్యాత్మిక సాధనలూ కాలాన్ని బంధించలేవు. ‘‘పారే నది లో ఈ క్షణం తాకిన నీటిని మరుక్షణం ఎలాగైతే తాకలేమో అలాగే గతించిన కాలాన్ని పట్టుకోలేం. అందుచేత కాలమహిమను గుర్తించండి’’ అన్న చాణుక్యుని వాక్యాలు ఎంతో అర్థవంతమైనవి. జీవితంలో ప్రతిక్షణం వెలకట్టలేనిదే. గడిచిపోయిన క్షణం తిరిగిరాదు. అందుకే, కాలాన్ని విధి గా పాటించడం లేదా సమయపాలనకు కట్టుపడడం అనేది ప్రతివారికీ అత్యంత ముఖ్యమైన విధి. సమయపాలనకు సంబంధించి రకరకాల నిర్వచనాలు మనకు నిత్యమూ కనబడుతూ ఉంటాయి. సమయానికి మనం అనుకున్న పనిలో, విహితమైన తీరులో, ఏకాగ్ర చిత్తంతో నిమగ్నం కావడాన్నే సమయపాలన అని చెప్పుకోవచ్చు. ఏదైనా పనికోసం మనం సమయాన్ని కేటాయిస్తే, అది మనకు ఆ కార్య పరిపూర్ణతకు ఉపకరించి, సంతృప్తిని కలిగిస్తుంది. ఏదైనా ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించడంకోసం సమయాన్ని కేటాయిస్తే, అది మనలో మేధాశక్తినీ పెంచడమే గాక, వ్యక్తిత్వాన్ని శిఖరాగ్రానికీ చేరుస్తుంది. అమేయమైన సారాన్ని నింపుకున్న పుస్తకాలను గానీ, గ్రంథాలను గానీ చదవడానికి సమయాన్ని కేటాయిస్తే, మనలో మనోవికాసం పెంపొందుతుంది. ఎప్పుడూ ఏదో ఒక పనిలోనే నిమగ్నం కాకుండా, ఒకింత నవ్వుకోవడానికి సమయాన్ని కేటాయిస్తే, అది మన జీవితాన్ని ఆహ్లాదమయం చేస్తుంది. కొంత సమయాన్ని పక్కవాడికి సహాయం చేయడానికి కేటాయిస్తే, అది మనకు ఆత్మానందాన్ని కలిగిస్తుంది. దైనందిన జీవితంలో వ్యాయామానికి సమయాన్ని కేటాయిస్తే, అది మనకు ఆరోగ్యప్రదాయినియై సంతసాన్ని కలిగిస్తుంది. సమయం విలువ ప్రతివారూ గుర్తెరగడం అత్యంత ముఖ్యం. ప్రత్యేకించి, పిల్లలకు సమయానికి తగినట్లుగా పనులు అలవాటు చేయడం తల్లితండ్రుల బాధ్యత. ముఖ్యంగా ఉదయాన నిద్రలేవడం నుంచీ, రాత్రి పడుకునే వరకు, వాళ్ళు ఏ సమయానికి ఏం చేయాలో తెలియజెప్పడం తప్పనిసరిగా చేయాలి. ముందు కొంత బద్ధకించినా, కొన్ని రోజులకు సమయం ప్రకారం పనులు చేయడం వారికి అలవాటుగా మారుతుంది. జీవితానికి ఉత్తమ బాటను పరుస్తుంది. ‘‘ క్షణము గడిచిన దాని వెన్కకు మరల్ప సాధ్యమే మానవున కిలాచక్రమందు’ అంటాడు గుర్రం జాషువ. ఒక్క మాటలో చె ప్పాలంటే విశ్వవిఖ్యాతి గడించిన మహనీయులందరూ ఏ రంగానికి చెందిన వారైనా కాలం విలువ బాగా తెలిసిన వారే సమయాన్ని సద్వినియోగపరచుకున్నవారే. కాలం అనేది మనం ఆపితే ఆగదు. కాబట్టి ఏ సమయంలో ఏ పని చెయ్యాలో ఆ సమయంలో ఆ పని చేస్తే సమయం సద్వినియోగపరిచినట్లే. ప్రపంచంలో గొప్పవాళ్ళయిన వ్యక్తులందరూ కాలం విలువ తెలిసిన వాళ్ళే. ప్రతీ క్షణాన్నీ సద్వినియోగం చేసినవాళ్ళే. అందువల్లనే, ఆది శంకరాచార్యులు, ఏసుక్రీస్తు, వివేకానందస్వామి మొదలైన మహాపురుషులు చిన్నవయస్సులోనే శరీరాన్ని చాలించినప్పటికీ, తాము జీవించి ఉన్న స్వల్పమైన సమయంలోనే అద్వితీయమైన, అప్రతిహతమైన విజయాలను సాధించగలిగారు. ‘‘యువతీ యువకుల్లారా.. మీరంతా మేల్కొనండి. లక్ష్యసాధనకోసం శ్రమించే క్రమంలో ప్రతి క్షణాన్నీ సద్వినియోగపరచండి. మీరు మండే నిప్పు కణికలు అని గమనించండి. కాబట్టి కాలం విలువ ఎరిగినవారై, బద్ధకాన్ని వదలండి.’’ అంటూ స్వామి వివేకానంద ఇచ్చిన సందేశం ఎంతో విలువైనది. సమయం విలువను కాల రాచే మహమ్మారిలాంటి జాడ్యం సోమరితనం. సాధారణంగా మనసు సుఖాన్ని, బుద్ధి హితాన్ని కోరుకుంటాయి. పరీక్షలొస్తున్నాయి చదవడం వెంటనే ఆరంభించమని బుద్ధి చెబుతుంది. ఏమీ ఫరవాలేదు, పరీక్షలు బాగా దగ్గరకొచ్చాక చదవొచ్చని మనస్సు చెబుతుంది. మనం మనస్సు పలికిన మాటే వింటాం. బుద్ధి చెప్పింది వినం. అందుకే ఎంతో అనర్థం జరుగుతోంది. ప్రతి వ్యక్తీ, తన మనసును అదుపులో ఉంచుకుంటే సోమరితనాన్ని జయించి, కాలాన్ని ఉపయోగించుకుని తగిన రీతిలో సార్థకత్వాన్ని సాధించడం కష్టమైన పని కాదు. జగత్ప్రసిద్ధమైన ఆపిల్ కంపెనీ సహవ్యవస్థాపకుడైన స్టీవ్ జాబ్స్ మాట్లాడుతూ, ‘‘నీ సమయం ఎంతో విలువైనది. ఆ సమయాన్ని వినియోగించి నీ జీవితాన్ని స్వర్గమయం చేసుకో. కాలాన్ని వ్యర్థం చేసుకుని, ఇంకొకరి జీవితంలో నీవు బతకకు’’ అంటారు. కాలం విలువ తెలుసుకుని, ప్రగతిని సాధిస్తూ, ముందుకు సాగమని, ఇంకొకరితో తనను పోల్చుకోకుండా ధరిత్రిలో మరొక కొత్త చరిత్రను లిఖించమనే ప్రబోధమూ ఈ మాటల్లో దాగి ఉంది. ‘‘ప్రపంచంలో అతి విలువైన వస్తువులు రెండు.. మొదటిది సహనం, రెండోది కాలం.’’ అంటారు లియో టాల్స్టాయ్. సృష్టిలో మనకు లభించే అత్యంత విలువైన సంపద కాలమే. కానీ అత్యంత దయనీయంగా నిత్యమూ మనం వృథా చేసేదీ కాలాన్నే..!! ‘‘సమయం ప్రధానమైన విషయాల్లో ఒకటి కాదు. సమయమే అత్యంత ప్రశస్తమైన సంపద’’ అని యువత గ్రహిస్తే, వారి భవిత బంగరు బాట కావడం కష్టమేమీ కాదు. కాలాన్ని సద్వినియోగపరచిన ప్రతి వ్యక్తీ చేయగలిగేది మహేంద్రజాలమే. సమయం విలువను కాల రాచే మహమ్మారిలాంటి జాడ్యం సోమరితనం. సాధారణంగా మనసు సుఖాన్ని, బుద్ధి హితాన్ని కోరుకుంటాయి. పరీక్షలొస్తున్నాయి చదవడం వెంటనే ఆరంభించమని బుద్ధి చెబుతుంది. ఏమీ ఫరవాలేదు, పరీక్షలు బాగా దగ్గరకొచ్చాక చదవొచ్చని మనస్సు చెబుతుంది. మనం మనస్సు పలికిన మాటే వింటాం. బుద్ధి చెప్పింది ఏ మాత్రం వినం. అందుకే ఎంతో అనర్థం జరుగుతోంది. ప్రతి వ్యక్తీ, తన మనసును అదుపులో ఉంచుకుంటే సోమరితనాన్ని జయించి, కాలాన్ని ఉపయోగించుకుని తగిన రీతిలో సార్థకత్వాన్ని సాధించడం కష్టమైన పని ఏమాత్రం కాదు. –వ్యాఖ్యాన విశారద, వెంకట్ గరికపాటి -
అప్పుడే పదేళ్లు.. ఆయన సింగిల్ పీస్: ఆపిల్ సీఈఓ భావోద్వేగ లేఖ
ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ 10వ వర్ధంతి సందర్భంగా ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ స్టీవ్ జాబ్స్ కృషిని గుర్తు చేసుకున్నారు.ఈ సందర్భంగా ఉద్యోగులకు ఒక లేఖ రాశారు. ప్రస్తుతం ఆపిల్ సాధించిన ఘన విజయాలను చూసేందుకు జాబ్స్ ఉండి ఉంటే బావుండేదని టిమ్ కుక్ అభిప్రాయపడ్డారు. తన ట్విటర్లో స్టీవ్కు సంబందించిన ఒక వీడియోను కూడా పోస్ట్ చేశారు. అభిరుచి ఉన్న వ్యక్తులు ప్రపంచాన్ని మంచిగా మార్చగలరు" అని స్టీవ్ నమ్మాడు. అపుడే దశాబ్దం గడిచిపోయిందంటే నమ్మలేకుండా ఉన్నాం. కానీ మీ ఉనికి ఎప్పటికీ సజీవమే ఆయనకు నివాళులర్పించారు. ఆపిల్ తన హోమ్పేజీలో జాబ్స్కు నివాళుర్పించింది.. స్టీవ్ మరణించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా టిమ్ కుక్ఉద్యోగులకు ఒక లేఖ రాశారు.. స్టీవ్ వదిలిపెట్టిన అసాధారణ వారసత్వాన్ని గుర్తు చేసుకొనేందుకు ఇదొక అపూర్వ సందర్భం అని కుక్ తెలిపారు. ఆయనొక మేధావి.ఎంతో దూరదృష్టి గలవాడు. ప్రపంచం ఎలా ఉండబోతోందో చూడాలని సవాల్ చేసిన మనిషి. వాస్తవానికి తాను స్టీవ్ గురించి ఆలోచించని రోజు లేదని కుక్ పేర్కొన్నారు. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా అద్భుతమైన వినూత్నమైన ఉత్పత్తులను తీసుకువచ్చాం. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలతో మమేకమయ్యేలా ఇన్నోవేటివ్ ఉత్సత్తులపై దృష్టి సారించాం. ఇందుకు చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. విశ్వంలో కూడా తమంతట తాముగా సత్తా చాటేలా ప్రోత్సహించాం. స్టీవ్ మనందరికీ ఇచ్చిన అనేక బహుమతులలో ఇదొకటి. (Steve jobs: ఫాదర్ ఆఫ్ ది డిజిటల్ రెవల్యూషన్ గుడ్ బై స్పీచ్ విన్నారా?) ఈ క్రమంలో మీ అద్భుతమైన పని తీరు, మీలో దిగి వున్న ఆయన స్ఫూర్తిని చూసేందుకు స్టీవ్ ఇక్కడ ఉండి వుంటే బావుండేదని ఉద్యోగులనుద్దేశించి టిమ్ కుక్ రాశారు. కానీ అన్నింటికంటే ముఖ్యంగా భవిష్యత్తులో ఏమి సృష్టించబోతున్నారో చూడాలని భావిస్తున్నానన్నారు. తాను గర్వించదగ్గ విజయాలు ఇంకా చాలా రాబోతున్నాయని స్టీవ్ ముందే ఊహించారు. ఆయన ప్రతిరోజూ ఎవ్వరూ చూడని భవిష్యత్తును ఊహించుకుంటూ,తన ఆలోచనలకు జీవం పోసేలా నిర్విరామంగా కృషి చేశారంటూ టిమ్ కుక్ పేర్కొన్నారు. ఎదగడం ఎలాగే నేర్పిన వ్యక్తి స్టీవ్. ఆయనకు ఆయనేసాటి. ఆయనను మిస్ అవుతున్నాను. కానీ ఎప్పటికే ఆయనే స్ఫూర్తి అంటూ టిమ్ కుక్ స్టీవ్కు ఘన నివాళులర్పించారు. కాగా కేన్సర్తో బాధపడుతూ ఆపిల్ సీఈఓ పదవినుంచి వైదొలిగిన రెండు నెలల తరువాత 2011, అక్టోబర్ 5న 56 సంవత్సరాల వయస్సులో స్టీవ్ జాబ్స్ కన్నుమూశారు. స్టీవ్ స్థానంలో టిమ్ కుక్ సీఈఓగా బాధ్యతలను స్వీకరించారు. సుమారు 2026 వరకు ఈ బాధ్యతల్లో టిమ్ కొనసాగనున్నారు. “People with passion can change the world for the better.”— SJ. Hard to believe it’s been 10 years. Celebrating you today and always. pic.twitter.com/x2IUnlO7ta — Tim Cook (@tim_cook) October 5, 2021 -
జీవితం వడ్డించిన విస్తరి కాదు..అయినా లెజెండ్గా ఎదిగాడు
సాక్షి, హైదరాబాద్: కంప్యూటర్ మాంత్రికుడు, ఫాదర్ ఆఫ్ ది డిజిటల్ రెవల్యూషన్గా చరిత్రలో నిలిచిపోయిన ఘనత ఆయనది. ఎవరి పేరు చెబితే స్మార్ట్ఫోన్ రంగంలో గొప్ప బ్రాండ్ ఇమేజ్ గుర్తు వస్తుందో ఆయనే ప్రపంచంలోనే పాపులర్ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఆపిల్ సహ వ్యవస్థాపకుడు, ఆపిల్ మాజీ చైర్మన్, సీఈఓ స్టీవ్ పాల్ జాబ్స్ . టెక్ ప్రియులను విషాదంలో ముంచేస్తూ అక్టోబరు 5న స్టీవ్ జాబ్స్ కన్నుమూశారు. ఈ సందర్భంగా స్పెషల్ స్టోరీ. ఒక్కరోజులో స్టీవ్ జాబ్స్ ఈ కీర్తిని సంపాదించలేదు. ఆయన జీవితం వడ్డించిన విస్తరి అంతకన్నా కాదు. బాల్యంలో అనేక కష్టాలు పడుతూ, చిన్నా చితకా ఉద్యోగాలు చేస్తూ ఎదిగిన వ్యక్తిత్వం ఆయనది. ఆ తరువాత కూడా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఆపిల్ లాంటి కంపెనీని స్థాపించి చరిత్రలో తనకంటూ ఒకస్థానాన్ని మిగిల్చుకున్న వ్యక్తి స్టీవ్ జాబ్స్. దేశంలోని టాప్ 100 సీఈఓలకు సీఈఓ కోచింగ్ అందించడంలో కీలకపాత్ర, కేవలం స్టార్టప్ కంపెనీలకే కాదు అనేక కార్పొరేట్ కంపెనీలకు ఆయనొక మార్గదర్శకుడు. శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియాలోని ఒక సిరియన్ ముస్లిం కుటుంబంలో స్టీవ్ పాల్ జాబ్స్ 1955, ఫిబ్రవరి 24న జన్మించాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో పాల్, క్లారా దంపతులకు ఆ తరువాత దత్తతకువెళ్లిపోయాడు. ఒకవైపు నచ్చని చదువు, మరోవైపు తల్లితండ్రుల కష్టాల నేపథ్యంలో చదువు శ్రద్ధగా పెట్టలేక పోయాడు. పేపర్ బాయ్గా పనిచేశాడు. ఎలక్ట్రానిక్స్ స్టోర్లోని గిడ్డంగిలో పనిచేశాడు. అయినా తను అనుకున్న రంగంపై చిత్తశుద్ధితో కఠోర శ్రమ చేసి ఒక లెజెండ్గా ఎదిగాడు. 1972లో అమెరికాలో అత్యంత ఖరీదైన ప్రైవేట్ యూనివర్సిటీ అయిన రీడ్ కాలేజీలో చేరి, అది నచ్చక దాన్ని వదిలేశాడు. కాలిగ్రఫీ కోర్సు నేర్చుకున్నాడు. స్నేహితులతో కలిసి నేలపై పడుకునేవాడు. ఖాళీ కోక్ బాటిల్స్ అమ్ముకుని జీవించేవాడు. అంతేకాదు వారానికి ఒకసారయినా కడుపు నిండా భోంచేసేందుకు ఏడు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి మరీ ఇస్కాన్ దేవాలయంలో ఉచిత భోజనం తినేవాడు. అలా 1974లో జాబ్స్ అట్టారి ఒక వీడియో గేమ్ కంపెనీలో టెక్నీషియన్గా ఉద్యోగం సాధించాడు. ఈ కంపెనీ వ్యవస్థాపకుడు, అధిపతి అభిమానాన్ని చూరగొన్నాడు. 15 సంవత్సరాల వయస్సులోనే ఒక కారునుసొంతం చేసుకున్నాడు. అదే సంవత్సరంలో, ఉద్యోగాలు ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసం ఇండియాకు వచ్చాడు. జైన, బౌద్ధమతంపై తీవ్రంగా ఆకర్షితుడయ్యాడు. 7 నెలలు భారతదేశంలో ఉన్నాడు . పూర్తి శాకాహారిగా మారిపోయాడు. కొంతకాలం తరువాత కాలిఫోర్నియకు వెళ్లిపోయాడు. జాబ్స్ స్నేహితుడు, క్లాస్మేట్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్లంటే ఎంతో ఇష్టమైన స్టీఫెన్ వోజ్నియాకి కలుసుకోవడంతో అతని జీవితం కీలక మలుపు తిరిగింది. 1975 మార్చి 5న, హోమ్మేడ్ కంప్యూటర్స్ క్లబ్ సమావేశం, ఆ తరువాత స్టీఫెన్ వోజ్నియాక్తో కలిసి ఈ ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం స్టీవ్స్ను, మినీ బస్సును, వోజ్నియాక్ తకెంతో ఇష్టమైన ప్రోగ్రామబుల్ కాలిక్యులేటర్ విక్రయించగా వచ్చిన సొమ్ముతో ఒక కంపెనీని మొదలు పెట్టారు. క్లబ్లో రెడీమేడ్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్లను విక్రయాలను మొదలు పెట్టారు. 21 ఏళ్ల వయసులో 1976, ఏప్రిల్ 1న కాలిఫోర్నియాలోని లాస్ ఆల్టోస్లో గ్యారేజిలో ఆపిల్ పేరుతో కంపెనీ మొదలు పెట్టారు. అలా తొలి ఆవిష్కారం "ఆపిల్ కంప్యూటర్" కు భారీ క్రేజ్ వచ్చింది. ఆ తరువాత ఆపిల్ 2 రిలీజ్ చేశాడు. ఇదొక సంచలనం. తద్వారా కోట్ల రూపాయల విలువైన కంపెనీగా ఆపిల్ అవతరించింది. జనవరి 3, 1977లో ఆపిల్ కంప్యూటర్ కంపెనీతో ఆపిల్ కార్పొరేషన్గా మారింది. మాకింతోష్ కంప్యూటర్లను కూడా రిలీజ్ చేశాడు. పెప్సీ జాన్ కెల్లీని ఆపిల్ కంపెనీకి తీసుకురావడంతో ఆపిల్ కంపెనీ సీఈవో గారావడం మరింత దూసుకు పోయింది ఆపిల్. ఇంతలో ఆర్థిక మంద్యం ఐబీఎంతో పోటీ, మరోవైపు బోర్డులో విబేధాలతో స్టీవ్జాబ్స్ ఆపిల్ కంపెనీకి గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. 1985లో జాబ్స్ NeXT Incని కంప్యూటర్ కంపెనీ, సినిమా నిర్మాణ సంస్తలను స్థాపించాడు. ఇక్కడా అనేక విజయాలతోపాటు, ఇబ్బందులు తప్ప లేదు. చివరికి పోగొట్టుకున్నచోటే వెతుకున్నట్టుగా కొన్నాళ్లకే ఆపిల్ కంపెనీలో తిరిగి చేరిపోయాడు. ఇక అప్పటినుంచి స్టీవ్ జాబ్స్ వెనుదిరిగి చూసింది లేదు. ఎన్నో వినూత్న, విప్లవాత్మక ఆవిష్కరణలకు నాంది పలికాడు. మొదటి తరం ఐపాడ్ అక్టోబర్ 23, 2001 న విడుదలైంది. తొలి ఐఫోన్ జనవరి 2007లో వెలుగులోకి వచ్చింది. అత్యాధునిక ఫీచర్ల ఐపాడ్, ఐఫోన్లను ఈ ప్రపంచానికి పరిచయం చేశాడు. ప్రతి ఇంటికి కంప్యూటర్, అదీ చవక ధరలో అన్న తన కలను సాకారం దిశగా అడుగులు వేశాడు. 2003లో జాబ్స్ ప్రాణాంతక ప్యాంక్రియాటిక్ కేన్సర్ బారిన పడ్డాడు. ఆరంభంలో ఈ వ్యాధి చికిత్సకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నాడు జాబ్స్. దాదాపు తొమ్మిది నెలలపాటు అపరేషన్ చేయించుకోవడానికి నిరాకరించాడు. కానీ వ్యాధి మరింత ముదరడంతో, జూలై 2004లో, ప్యాంక్రియాటోడ్యూడెనెక్టమీ ఆపరేషన్ చేసి కణితిని తొలగించారు. కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటింది.జాబ్స్ ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. 2009లో, జాబ్స్ తన అనారోగ్యం గురించి అందరికీ తెలియజేయడంతో పాటు తన వ్యాపారాన్ని టిమ్ కుక్కి అప్పగించాడు. అనంతరం 2009లో కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. కారు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి లివర్ డోనేషన్ కారణంగా తను బతికి ఉన్నానని ప్రకటించాడు. అంతేకాదు అందరూ అవయవదానంపై ఆలోచించాలని కూడా విజ్ఞప్తి చేశాడు. 2010 ప్రారంభంలో తిరిగి పనిలో పడినా అనారోగ్యం కారణాల రీత్యా ఆగస్టు 24, 2011న, జాబ్స్ తన పదవీ విరమణను ప్రకటించాడు. ఫలితంగా ఆయన వారసుడిగా టిమ్ కుక్ రంగంలోకి వచ్చాడు. చివరికి ఎనిమిది సంవత్సరాల పాటు క్యాన్సర్తో పోరాడి 56 ఏళ్ల వయసులో అక్టోబర్ 5, 2011 ఈ లోకాన్ని వీడాడు జాబ్స్. 2011లో ఆపిల్ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. 2011 లో ఫోర్బ్స్ మ్యాగజైన్ స్టీవ్ జాబ్స్ నికర ఆస్తులను 7 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. అమెరికా బిలియనీర్ల ర్యాంకింగ్లో అతడిని 39 వ స్థానంలో నిలిపింది. 2007లో, ఫార్చ్యూన్ మ్యాగజైన్ జాబ్స్ని వ్యాపారంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా పేర్కొంది. 2010లో అతను ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో 17 వ స్థానంలో నిలిచాడు. 2011 లో, స్టీవ్ జాబ్స్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. 2012 లో, స్టీవ్ జాబ్స్ "మన కాలంలోని గొప్ప పారిశ్రామికవేత్త" గా ఖ్యాతి దక్కించుకున్నాడు. మరణానంతరం గ్రామీ ట్రస్టీస్ అవార్డును అందుకున్నారు. డిస్నీ చిత్రం "జాన్ కార్టర్", పిక్సర్ కార్టూన్ "బ్రేవ్" అతనికి అంకితం ఇచ్చింది.. స్టీవ్ జాబ్స్ గురించి 10 పుస్తకాలు. 6 డాక్యుమెంటరీలు, 3 ఫీచర్ ఫిల్మ్లు రావడం విశేషం. జాబ్స్ వ్యక్తిగత విషయానికి వస్తే స్టాన్ఫోర్డ్ బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేట్ విద్యార్థి లారెల్ పావెల్ ప్రేమించాడు జాబ్స్. మార్చి 18, 1991 వీరు వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. -
పాఠాలు చెప్పని గురువులు.. అయినా గెలిచిన శిష్యులు
Happy Teacher's Day 2021: గురువంటే బడిత పట్టి పాఠాలు నేర్పేవాడు మాత్రమే కాదు. శిష్యుడంటే పలక పట్టి దిద్దాల్సిన అవసరమూ లేదు. గెలుపు తీరాలను తాకిన వాళ్ల నుంచి పాఠాలు నేర్చుకునే వాళ్లను శిష్యులుగానే భావించొచ్చు. అలాగే వాళ్లకు ప్రత్యక్ష పాఠాలు చెప్పకుండా ‘సక్సెస్’ స్ఫూర్తిని నింపే మార్గదర్శకులు గురువులే అవుతారు. ద్రోణుడికి ఏకలవ్య శిష్యుడిలాగా.. వెతికితే వ్యాపార, టెక్ రంగాల్లో రాటుదేలిన ఎంతో మంది మేధావులు మనకు కనిపిస్తారు. వాళ్లలో గురువుల్ని మించిన శిష్యులుగా, వాళ్ల ‘లెగసీ’కి వారసులుగా ఆయా రంగాల్లో పేరు సంపాదించుకుంటున్న కొందరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ►సుందర్ పిచాయ్(పిచాయ్ సుందరరాజన్).. 49 ఏళ్ల ఈ టెక్ మేధావి అల్ఫాబెట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా, గూగుల్ సీఈవోగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మెటీరియల్స్ ఇంజినీర్గా కెరీర్ను మొదలుపెట్టిన సుందర్ పిచాయ్.. 2004లో గూగుల్లో అడుగుపెట్టారు. ఇంతకీ ఈయన గురువు ఎవరో తెలుసా? విలియమ్ విన్సెంట్ క్యాంప్బెల్ జూనియర్. అమెరికా వ్యాపార దిగ్గజంగా పేరున్న విన్సెంట్ క్యాంప్బెల్.. మొదట్లో ఫుట్బాల్ కోచ్ కూడా. ఆపై టెక్నాలజీ వైపు అడుగులేసి.. యాపిల్ లాంటి ప్రముఖ కంపెనీలకు పని చేశారు. సుందర్ పిచాయ్.. అంతకంటే ముందు గూగుల్ ఫౌండర్లు ల్యారీ పేజ్, సెర్గీ బ్రిన్, ఎరిక్ షిమిడెట్, జెఫ్ బెజోస్(అమెజాన్ బాస్), జాక్ డోర్సే, డిక్ కోస్టోలో(ట్విటర్), షెరీల్ శాండ్బర్గ్(ఫేస్బుక్) లాంటి ప్రముఖులెందరికో ఈయనే మెంటర్ కూడా. ఇక యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్కు వ్యక్తిగత గురువుగా చాలాకాలం పని చేశారు విన్సెంట్ క్యాంప్బెల్. ►మార్క్ జుకర్బర్గ్.. ఫేస్బుక్ ఫౌండర్ కమ్ సీఈవో. చిన్నవయసులోనే బిలియనీర్గా ఎదిగిన ఈ ఇంటర్నెట్ ఎంట్రెప్రెన్యూర్.. ఎవరి స్ఫూర్తితో ఈ రంగంలోకి అడుగుపెట్టాడో తెలుసా? టెక్ మేధావి స్టీవ్ జాబ్స్. అవును.. ఈ విషయాన్ని స్టీవ్ జాబ్స్ తన బయోగ్రఫీలోనూ రాసుకున్నాడు. ఇది చాలామందిని విస్తుపోయేలా చేసింది. అయితే స్టీవ్ జాబ్స్ చనిపోయిన చాన్నాళ్లకు ఓ అమెరికన్ టాక్ షోలో జుకర్బర్గ్ మాట్లాడుతూ.. ఇదే విషయాన్ని నిర్ధారించాడు. ► రిచర్డ్ బ్రాన్సన్ బ్రిటిష్ వ్యాపారవేత్త, వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు. లేకర్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు, బ్రిటన్ వ్యాపారదిగ్గజం ఫ్రెడ్డీ లేకర్ను తన గురువుగా ఆరాధిస్తుంటాడు. ఆయన స్ఫూర్తితోనే తాను ఇవాళ ఉన్నానంటూ చాలా ఇంటర్వ్యూలో గురుభక్తిని చాటుకుంటాడు బ్రాన్సన్. ►సత్య నాదెళ్ల.. మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవోగా ఉన్న సత్య నాదెళ్ల.. సంస్థ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ను గురువుగా ఆరాధిస్తుంటాడు. తన కెరీర్ ఎదుగుదలకు గేట్స్ ఇచ్చిన ప్రోత్సాహం, ప్రోద్భలమే కారణమని చెప్తుంటారు. గొప్ప విజయాలు సాధించేందుకు గేట్స్ చెప్పే సూత్రాలు పాటిస్తే చాలాని తనలాంటి వాళ్లకు సూచిస్తుంటాడు సత్య నాదెళ్ల. ►రతన్ నవల్ టాటా(రతన్ టాటా).. ప్రముఖ వ్యాపారవేత్త. టాటా గ్రూపుల మాజీ చైర్మన్. ప్రస్తుతం టాటా చారిటబుల్ ట్రస్ట్ వ్యవహారాలు చూసుకుంటున్న ఈ పెద్దాయన(83).. ఫ్రెండ్లీబాస్ తీరుతో, సహాయక కార్యక్రమాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇంతకీ ఈయన ఎవరిని గురువుగా భావిస్తాడో తెలుసా?.. టాటా గ్రూపుల మాజీ చైర్మన్ జహంగీర్ రతన్జీ దాదాబాయ్ టాటా(జేఆర్డీ టాటా)ని. ►ఎలన్ మస్క్.. బహుతిక్కమేధావిగా పేరున్న మస్క్ తనకు గురవంటూ ఎవరూ లేరని తరచూ ప్రకటనలు ఇస్తుంటాడు. అంతేకాదు స్పేస్ఎక్స్ బిజినెస్ డెవలప్మెంట్ వ్యవహారాలను చూసుకునే జిమ్ కాంట్రెల్ ఓ ఇంటర్వ్యూలో ‘మస్క్ రాకెట్ సైన్స్ గురించి తనంతట తానే తెలుసుకున్నాడ’ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కూడా. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. కంప్యూటర్ సైంటిస్ట్-గూగుల్ ఫౌండర్ ల్యారీ పేజ్తో దగ్గరగా ఎలన్మస్క్ పని చేశాడని, ఆ ప్రభావంతోనే మస్క్ రాటుదేలాడని. ►బిల్ గేట్స్.. వ్యాపార మేధావిగా పేరున్న బిల్గేట్స్కు, అమెరికా ప్రముఖ వ్యాపారవేత్త వారెన్ బఫెట్కు మధ్య అపర కుబేరుడి స్థానం కోసం చాలాకాలం పోటీ నడిచిన విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ, బఫెట్ను అన్నింటా తాను గురువుగా భావిస్తానని బిల్గేట్స్ చాలా ఇంటర్వ్యూల్లో చెప్తుంటాడు. అంతేకాదు ఇద్దరూ వ్యాపార సలహాలు, ఛారిటీలకు సంబంధించిన వ్యవహారాలపై చర్చించుకుంటారు కూడా. - సాక్షి, వెబ్డెస్క్ స్పెషల్ -
ఆరుకోట్లకు అమ్ముడుపోయిన అటోగ్రాఫ్! ఎవరిదంటే..
Steve Jobs Autograph: టెక్నాలజీ ఎరాలో యాపిల్ ఆవిష్కరణ ఒక కీలక పరిణామమనే చెప్పొచ్చు. అందుకే యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ను ఓ పాథ్ మేకర్గా భావిస్తుంటారు. చనిపోయాక కూడా ఆయన లెగసీ కొనసాగుతూనే వస్తోంది. తాజాగా ఆయన సంతకంతో ఉన్న ఓ కంప్యూటర్ మ్యానువల్.. వేలంపాటలో సుమారు ఆరు కోట్ల రూపాయలను దక్కించుకుని వార్తల్లో నిలిచింది. 1977లో యాపిల్ II కంప్యూటర్ రిలీజ్ అయ్యింది. దాదాపు రెండేళ్లపాటు నడిచిన ఈ వెర్షన్.. పర్సనల్ కంప్యూటింగ్లో, కంప్యూటర్ల బిజినెస్లో విప్లవాత్మక మార్పునకు కారణమైంది. అలాంటి కంప్యూటర్కు చెందిన మ్యానువల్పై స్టీవ్ జాబ్స్, యాపిల్ సెకండ్ సీఈవో మైక్ మర్క్కులా 1980లో సంతకం చేశారు. యూకేకు చెందిన ఎంట్రప్రెన్యూర్ మైక్ బ్రివర్(తర్వాత యూకే యాపిల్ కంప్యూటర్కు ఎండీ అయ్యాడు) కొడుకు జులివాన్ కోసం దానిపై సంతకం చేశారు వాళ్లు. ‘‘జులివాన్.. మీ జనరేషన్ నడక కంప్యూటర్లతో మొదలైంది. మార్పునకు సిద్ధం కండి’ అంటూ దాని మీద స్టీవ్ జాబ్స్ చేత్తో రాసిన రాత కూడా ఉంది. మైక్తో స్టీవ్ జాబ్స్ బోస్టన్కు చెందిన ఆర్ఆర్ ఆక్షన్స్ కంపెనీ ఈ అటోగ్రాఫ్ కాపీని వేలం వేసింది. మొత్తం 46 బిడ్లు దాఖలు కాగా, విన్నింగ్ బిడ్ 7,87,484 డాలర్ల(మన కరెన్సీలో 5.8కోట్ల రూపాయలకు పైనే) బిడ్ ఓకే అయ్యింది. ఇండియానా పొలిస్ కోల్ట్స్కు చెందిన.. జిమ్ ఇర్సే దీనిని దక్కించుకున్నట్లు తెలస్తోంది. ‘‘ఆరోజు జాబ్స్, మర్క్కులా మా ఇంటికి వచ్చారు. బెడ్రూంలో ఉన్న నేను.. ఆ విషయం తెలిసి పరిగెత్తుకుంటూ వెళ్లా. నా ఆత్రుత చూసి దగ్గరికి తీసుకుని.. నా దగ్గర ఉన్న మ్యానువల్పై సంతకం చేసిచ్చారు వాళ్లు’ అని ఆనాటి సంగతిని గుర్తు చేసుకున్నాడు జులివాన్. ఇక 1973లో స్టీవ్ జాబ్స్ ఓ కంపెనీలో ఉద్యోగం కోసం చేసుకున్న చేతిరాత దరఖాస్తు కాపీని.. యూకేలోని ప్రముఖ సంస్థ చార్టర్ఫీల్డ్స్ వేలం వేయగా సుమారు రూ. కోటిన్నరకు పోయింది. చదవండి: IPO-ప్రజల నుంచి 70వేల కోట్లు!! -
స్టీవ్ జాబ్స్ ఉద్యోగ దరఖాస్తు వేలం.. ఎంతో తెలుసా?
లండన్: స్టీవ్ జాబ్స్ అంటే తెలియనివారు ఉండరు. స్టార్టప్ కంపెనీలను స్ధాపించే వారికి స్టీవ్ ఏంతో ఆదర్శం. ప్రారంభంలో అతను కూడా ఒక కంపెనీలో ఉద్యోగిగా చేరి, ఆపిల్ కంపెనీ స్థాపించడంలో ఎంతగానో కృషి చేశారు. అమెరికాలోని పోర్ట్ ల్యాండ్కు చెందిన రీడ్ కాలేజీ నుంచి తప్పుకున్న తరువాత ఉద్యోగం నిమిత్తం స్టీవ్ ఓ ఉద్యోగానికి చేశాడు. కంప్యూటర్ డిజైన్ టెక్నీషియన్తో పాటు, ఇంగ్లీష్ లిటరేచర్ను తన నైపుణ్యంగా అప్లికేషన్లో పేర్కొన్నాడు. 1973లో చేసిన ఈ దరఖాస్తును యూకేలోని ప్రముఖ సంస్థ చార్టర్ఫీల్డ్స్ వేలం వేయగా భారీ ధరకు అమ్ముడైంది. స్టీవ్ జాబ్స్ చేతితో రాసిన ఉద్యోగ దరఖాస్తు సుమారు రూ. 1.6 కోట్లకు వేలంలో విక్రయించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న ప్రారంభమైన బిడ్డింగ్ మార్చి 24న ముగిసింది. కాగా, స్టీవ్ అప్లికేషన్ వేలంలో ఇంత ధరకు అమ్ముడవడం ఇదే మొదటిసారి కాదు, గతం లో 2018 లో ఓ ఐటీకంపెనీ వ్యవస్థాపకుడు కొనుగోలు చేశాడు. ఆ ఇద్దరూ కలుసుకుంది అక్కడే.. 1974 లో అటారీ కంపెనీలో చేరిన స్టీవ్ జాబ్స్ తన ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్ను అక్కడే కలిశాడు. జాబ్స్, వోజ్నియాక్ 1976 లో అమెరికాలోని కాలిఫోర్నియాలోని లాస్ ఆల్టోస్లో జాబ్స్ గ్యారేజీలో ఆపిల్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. స్టీవ్ జాబ్స్ 2011లో కాన్సర్తో మరణించారు. చదవండి: ఆపిల్ సంస్థకు భారీ జరిమానా -
ఆపిల్ కంప్యూటర్ ఖరీదు రూ.11కోట్లు?
ఆపిల్ కంప్యూటర్ ఖరీదు రూ.11కోట్లు ఎందుకని ఆశ్చర్య పోతున్నారా? దీనిలో అంత స్పెషల్ ఏముంది అని అనుకుంటున్నారా. ఇది అన్ని ఆపిల్ కంప్యూటర్ ల మాదిరిగా మాత్రం కాదు. ఈ 'ఆపిల్ -1' కంప్యూటర్ ను కంపెనీ వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్నియాక్ కలిసి 1976లో రూపొందించారు. ఆపిల్ సంస్థ నుంచి వచ్చిన తొలి కంప్యూటర్ ఇది. అమెరికాకు చెందిన కృష్ణ బ్లేక్ అనే వ్యక్తి 1978లో ఈ 'ఆపిల్ -1' కంప్యూటర్ ను సుమారు 666 డాలర్లకు కొనుగోలు చేశారు. ఇది ఇంకా పనిచేస్తుండటం విశేషం. చెక్క కేసుతో తయారు చేసిన 'ఆపిల్ -1' కంప్యూటర్ ప్రస్తుతం ఈ-బేలో1,500,000 డాలర్లకు(సుమారు రూ.11 కోట్లు) అమ్మకానికి ఉంది. 1976లో తీసుకొచ్చిన అసలు ధర కంటే ప్రస్తుతం 2,250 రెట్లు ఎక్కువ. షిప్పింగ్ ఛార్జి 450 డాలర్లు(రూ.32వేలు) అదనం. ఎవరైనా విదేశీయులు కొనుగోలు చేస్తే అంతర్జాతీయ ఛార్జీలు వర్తిస్తాయి. దీనితో పాటు ఎలా ఉపయోగించాలో తెలిపే ఒక యూజర్ మాన్యువల్ బుక్ కూడా ఉంది. "ఇది చాలా పురాతనమైన, విలువైన వస్తువు కాబట్టి దీన్ని దొంగిలించే ప్రమాదం ఎక్కువగా ఉంది అని ప్రస్తుతం ఫ్లోరిడా బ్యాంక్ ఖజానాలో భద్రపరిచినట్లు" కృష్ణ బ్లేక్ తెలిపారు. చదవండి: బిగ్ బ్యాటరీతో వస్తున్న గెలాక్సీ ఎఫ్ 62 స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు -
స్టీవ్ జాబ్స్ కలను నెరవేర్చిన యాపిల్ సీఈఓ
కాలిఫోర్నియా: మొబైల్ ఫోన్లను సాంకేతింగా, ఆకర్శనియంగా తీర్చిదిద్దడంలో యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఓ ట్రెండ్ సెట్ చేశారు. కాగా స్టీవ్ జాబ్స్ 2011సంవత్సరంలో క్యాన్సర్తో మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టీవ్ జాబ్స్, టిమ్ కుక్లు ఇద్దరు సాంకేతికంగా యాపిల్ను నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టారు. స్టీవ్ మరణించాక కుక్ సీఈఓగా బాధ్యతలు చేపట్టే సమయానికి 400 బిలియన్ డాలర్లు మాత్రమే యాపిల్ వద్ద మూలధనంగా ఉండేది. కానీ ఇప్పుడు కుక్ సారథ్యంలో యాపిల్ సంస్థ ఆదాయం ఐదు రెట్లు పెరిగింది. ప్రస్తుతం యాపిల్ సంస్థ మార్కెట్లో ఐఫోన్లతో తన హవా కొనసాగిస్తు యూఎస్లో 2 ట్రిలియన్ డాలర్ల ఆదాయం సాధించిన మొదటి కంపెనీగా రికార్డు సృష్టించింది. యాపిల్ సంస్థ బ్రాండ్ కోల్పోకుండా కుక్ తీవ్రంగా శ్రమించారు. ఆయన ఎదుర్కొన్న ముఖ్య సవాళ్లు: ఎఫ్బీఐ విపరీత ఆంక్షలు, చైనాతో యూఎస్ ట్రేడ్ వార్, కరోనా వైరస్, ఆర్థిక మాంధ్యం ఇన్ని సమస్యలను అధిగమంచి యాపిల్ను ఉన్నత స్థానంలో కుక్ నిలిపాడు. పౌర హక్కులు, పునరుత్పాదక శక్తి లభ్యతపై తన అభిప్రాయాన్ని ప్రపంచానికి చెప్పి మేధావుల మన్ననలను అందుకున్నారు. వినియోగదారులను ఆకట్టుకోవడానికి ప్రత్యేక సాఫ్టవేర్, వారంటీ ప్రోగ్రామ్లు సంగీతం, వీడియో, ఆటలు తదితర విభాగాలను ప్రారంభించి వినియోగదారులను ఆకట్టుకోవడంలో విజయం సాధించారు. ఎంటర్టైన్మెంట్ యాప్ నెట్ఫ్లక్స్ను కొనుగోళ్లు చేసి కుక్ తన సత్తా చాటాడు. కంపెనీలకు రేటింగ్ ఇచ్చే ఫార్చ్యూన్ సంస్థ యాపిల్ 50 బిలియన్ వార్షిక ఆదాయాన్ని సంపాదిస్తున్నట్టు పేర్కొంది. మరోవైపు ఇవ్స్ సంస్థ అంచనా ప్రకారం యాపిల్ సేవల విభాగంలో 750బిలియన్ డాలర్ల మూలధనం ఉన్నట్లు తెలిపింది. స్టీవ్ జాబ్స్ కలలు కన్న యాపిల్ సంస్థను కుక్ నెరవేరుస్తున్నారని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: శాంసంగ్కు బై, ఆపిల్కు సై : వారెన్ బఫెట్ -
అతను మాయ చేసేవాడు
వాషింగ్టన్: ప్రత్యర్థి సంస్థ యాపిల్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో స్టీవ్ జాబ్స్ సారథ్య నైపుణ్యాలపై టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించారు. ఉద్యోగుల్లో స్ఫూర్తి నింపి, సుదీర్ఘంగా గంటల కొద్దీ పనిచేసేలా మాయ చేయడంలో జాబ్స్ ఆరితేరిన వ్యక్తని కితాబిచ్చారు. అథఃపాతాళంలోకి జారిపోతున్న యాపిల్ను మళ్లీ నిలబెట్టి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటిగా నిలిపిన జాబ్స్ 2011లో క్యాన్సర్తో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ‘అతను మాట్లాడుతుంటే అందరూ మంత్ర ముగ్ధులైపోవడం నేను చూశాను. అయితే, నేను కూడా ఒక చిన్న పాటి మంత్రగాణ్ని కావడంతో ఆయన మాయలు, మంత్రాలేవీ నా మీద ప్రభావం చూపేవి కావు‘ అని ఒక ఇంటర్వ్యూలో గేట్స్ పేర్కొన్నారు. టాలెంట్ను గుర్తించడంలోను, వారిలో స్ఫూర్తి నింపడంలోనూ జాబ్స్ను మించినవారెవరూ ఇప్పటిదాకా తనకు కనిపించలేదని చెప్పారు. -
సింహావలోకనం
మార్గదర్శకమైన మార్గాన్ని కనిపెట్టే వైతాళికు నికి తను నమ్మిన నిజాల మీద నిర్దుష్టమైన విశ్వాసం ఉండాలి. మూర్ఖమైన పట్టు దల ఉండాలి. ఓ గుడ్డి లక్ష్యం ఉండాలి. ఓ రకమైన పెళుసుదనం ఉండాలి. ఇన్ని లేకపోతే ఏదో ఒక సంద ర్భంలో తన విశ్వాసం సడలుతుంది. సడలిందా? అతను పోయే అధఃపాతాళానికి మరెవ్వరూ పోలేరు. అలాంటి మార్గాన్ని ఎంచుకుని తన జీవితకాలంలో అఖండ విజయాన్ని సాధించిన అద్భుత పరిశోధ కుడు స్టీవ్జాబ్స్. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పరప తిని సాధించిన ఐఫోన్ ప్రారంభదశకి ఆద్యుడు. ఈ దశలోనే ఇలాంటి మరొక మూర్ఖపు పట్టు దలతో విజయాన్ని సాధించిన ఇద్దరి పేర్లు ఏనాడూ కెమెరా ముందు నిలబడని నన్ను ‘వద్దు బాబోయ్!’ అంటున్నా వినిపించుకోకుండా 5 పాటలూ, 42 సీన్లూ ఉన్న ఓ సినీమాలో టైటిల్ రోల్ వేయించి నాకు 39 సంవత్సరాల, 300 సినీమాల కెరీర్ని ఇచ్చిన వ్యక్తి నిర్మాత రాఘవ. చాలా సందర్భాలలో నా కారణంగా రాఘవగారు భయంకరమైన ఫెయి ల్యూర్ చవి చూస్తారని భయపడి ఆయనతో అనేవా డిని. ఆయన కేవలం నవ్వి ఊరుకునేవారు. మరొక వ్యక్తి– ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త ఎస్. భావనారాయణగారు. ఊహించని ఉష్ణోగ్ర తల్లో లోహాల్ని కరిగించే మూసలు– ఆ ఉష్ణోగ్రతను తట్టుకునే ఏ మిశ్రమ లోహంతో తయారుకావాలి? సంవత్సరాల తరబడి తపస్సు చేసి– ఫలితాన్ని కనుగొని ఆ వ్యాపారానికి ‘కింగ్’గా నిలవడం నాకు తెలుసు. ఆ రోజుల్లోనే చిరంజీవి హీరోగా ఆయనకి నేను ‘ఐ లవ్ యూ’ రాశాను. ఆయనది విపరీతమైన instinct తొలి రోజుల్లోని ఒక చిత్రాన్ని చూసి ‘మారుతీరావుగారూ! ఈ కుర్రాడు చిదక్కొట్టేస్తాడు– అలా చూస్తూండండి’ అన్నారు. అలా చెప్పిన మరొక కన్నడ హీరో ‘ఒందానొందు కాలదల్లి’ చూశాక శంక రనాగ్ని. ఇద్దరూ దరిమిలాను అక్షరాలా ఆ పని చేశారు. తర్వాత రెండు చిత్రాలు తీసి, ఫెయిలయి ‘లాభం లేదు మారుతీరావుగారూ! నా ‘గురి’ తప్పింది. ఇంక సినీమాలు తీయను’ అని సన్య సించారు. ఏతావాతా స్టీవ్జాబ్స్ తన పరిధిలోకి వచ్చి తనని ప్రభావితం చేసేవారిపట్ల అతి క్రూరుడు. తను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అని నమ్మి, ప్రపం చాన్ని నమ్మించిన వ్యాపారి. తన ధోరణి సాగకపోతే పసివాడిలాగా ఏడ్చేవాడు. ఆ ఏడుపు నిస్సహాయత కాదు. తన అహంకారానికి ఆటవిడుపు. స్టీవ్ జాబ్స్కి భారతీయ తత్వ సిద్ధాంతమన్నా, సంస్కృతి అన్నా మక్కువ. భారతదేశం వచ్చి ఎన్నో దేవాలయాలు, సంస్థలను చూశాడు. ఆయన నమ్మ కాల పునాదుల్లో కనీసం రెండయినా భారతీయ ఆలో చనా వ్యవస్థ ఇటుకలు ఉన్నాయేమో! స్టీవ్జాబ్స్ ఏ కాలేజీకి వెళ్లలేదు. వెళ్లిన ఒక్క కాలేజీ చదువుని అర్ధంతరంగా వదిలి వచ్చేశాడు. తన మామగారి కారు గరాజ్లో పరిశోధనలు ప్రారం భించి మొట్టమొదటి ‘మెకంతోష్’కి రూపకల్పన చేశాడు. వ్యాపార రంగం దిగ్భ్రాంతమయింది. తర్వాత అతని జీవితం చరిత్ర. చివరికి కేన్సర్తో కన్నుమూశాడు. మరణ శయ్యమీద స్టీవ్ జాబ్స్ చెప్పిన మాటలు ఏ శ్రీశ్రీ రవిశంకరో, ఏ సద్గురు జగ్గీ వాసుదేవో చెప్పిన సూక్తులలాగ వినిపిస్తాయి. ‘అవసానం కొందరికి అవలోకన. కొందరికి కేవలం యాతన. చాలామందికి నా జీవితం పెద్ద విజయానికి నిదర్శనం. కానీ అందులో చాలా కొద్ది ఆనందమే ఉంది. ఐశ్వర్యం నాకు వ్యసనం. జీవిత మంతా నన్ను ఏమార్చిన మాఫియా. ఇప్పుడు ఆఖరి క్షణాలలో మృత్యువు సమక్షంలో ఈ ఐశ్వర్యం అర్థం లేనిదని అర్థమయింది. నీ కారుని నడపటానికి ఓ మనిషిని జీతానికి కుదుర్చుకోవచ్చు. కానీ– నీ అనారోగ్యాన్ని పంచుకోడానికి నువ్వు ఎప్పుడూ ఒంటరివి’. మిత్రుడు, ప్రముఖ హాస్య రచయిత డాక్టర్ తంబు కేన్సర్తో వెళ్లిపోయాడు. చివరి రోజుల్లో ఆయన ఆత్మీయ మిత్రుడు కళ్లనీళ్లు పెట్టుకుంటూ ‘చెప్పరా, నీ కోసం నేను ఏం చెయ్యమన్నా చేస్తాను’ అన్నాడు రుద్ధ కంఠంతో. ‘అయితే నా మూత్రాన్ని నా తరఫున నువ్వు పొయ్యి’ అన్నాడట తంబు అనే డాక్టర్. ఎంత భయంకరమైన నిస్సహాయత. మళ్లీ స్టీవ్జాబ్స్: ‘నీ తెలివితేటలు పెరిగి, విజ్ఞత పుంజుకున్నకొద్దీ నీకొకటి అర్థమవుతుంది. 30 రూపాయల వాచీ, 30 వేల రూపాయల వాచీ అదే కాలాన్ని సూచిస్తుంది. వాచీ కాలం విలువని పెంచదు. అర్థంలేని నీ ‘వానిటీ’కి రంగులు దిద్దు తుంది. చివరికి నీ జీవితంలో ఆరుగురే ఉత్తమమైన వైద్యులున్నారు: సూర్యరశ్మి, విశ్రాంతి, వ్యాయామం, ఆహారం, ఆత్మవిశ్వాసం, స్నేహితులు. దేవుడిచ్చిన మనుషుల్ని కాపాడుకో. ఒకరోజు వాళ్ల అవసరం నీకుంటుంది. ‘తొందరగా వెళ్లాలనుకుంటే ఒంటరిగా వెళ్లు. ఎక్కువ దూరం వెళ్లాలనుకుంటే నలుగురైదుగురుతో నడువు. ఎందుకు? ఆలోచించని జీవన ప్రయాణం ఏమారుస్తుంది. ‘ఆలోచన’ అడుగుల్ని అంచనా వేయిస్తుంది’. ఈ మాట ‘నడక’ గురించి కాదు. ‘జీవన ప్రయాణం’ గురించి. వ్యాసకర్త : గొల్లపూడి మారుతీరావు -
స్త్రీలోక సంచారం
అర్చనా సింగ్ పోలీస్ కానిస్టేబుల్. కొత్వాలి స్టేషన్లో ఆమె డ్యూటీ. కొత్వాలి ఝాన్సీ జిల్లాలో ఉంది. ఝాన్సీ జిల్లా ఉత్తర ప్రదేశ్లో ఉంది. అర్చనకు 30 ఏళ్లు. పెళ్లైంది. పదేళ్ల కూతురు, ఇంకో ఆర్నెల్ల కూతురు ఉన్నారు. భర్తకు హరియాణాలో ఉద్యోగం. ప్రైవేట్ కంపెనీలో చేస్తాడు. అర్చన తల్లిదండ్రులు కాన్పూర్లో ఉంటారు. అర్చన పెద్ద కూతురు కాన్పూర్లో అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పెరుగుతోంది. భర్తకు, తల్లిదండ్రులకు, పెద్ద కూతురికి దూరంగా అర్చన 2016 నుంచి కొత్వాలీలో డ్యూటీ చేస్తోంది. ఇప్పుడు నెలల బిడ్డ, తను ఉంటున్నారు. ఆదివారం ఉదయం అకస్మాత్తుగా ఉత్తర ప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అర్చనను పిలిపించారు. ఆమెతో కొద్దిసేపు మాట్లాడారు. ఆ తర్వాత అర్చనను ఆగ్రాకు బదలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు! అర్చన సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయింది. ఏం జరిగిందో ఆమెకు తెలియలేదు. కానైతే మంచే జరిగింది. తను కోరుకుంటున్నదే జరిగింది. ఆగ్రాలో ఉంటే పెద్దకూతురితో, భర్తతో కలిసి ఉండేందుకు వీలవుతుంది. తల్లిదండ్రులూ దగ్గరగా ఉంటారు. కుటుంబ సభ్యులతో ఉంటూ రోజూ డ్యూటీకి వెళ్లి రావడమంత సంతోషం ఏముంటుంది.. ఈ చిన్ని జీవితానికి! ఆమెకు ఇంతటి ‘మహర్దశ’ను పట్టించింది చిన్న కూతురు. ఎప్పట్లాగే ఆ.. నెలల బిడ్డను తనతో పాటు డ్యూటీకి తెచ్చిన అర్చన ఆ బిడ్డను తన కళ్ల ఎదుటే ఓ బల్ల మీద ఉంచి తన పనిలో తను ఉన్నప్పుడు ఎవరో ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆ ఫొటోను చూసిన వెంటనే లక్నోలోని ‘టైమ్స్’ పత్రిక ఆమె గురించి రాసింది. ఆ వార్త చదివిన డీజీపి వెంటనే అర్చనకు ‘వరం’ ఇచ్చారు. అన్నీ వెంట వెంటనే! అర్చనైతే చాలా హ్యాపీగా ఉంది. డీజీపీని, కొత్వాలీలో తనతో కలిసి పని చేసినవారిని, తనను కలుపుకుని పనిచేసినవారిని, పత్రికా ప్రతినిధులను తలచుకుని తలుచుకుని ధన్యవాదాలు తెలుపుతోంది. ఇప్పుడిక అర్చన తన విధులను మరింత ధ్యాసగా నిర్వర్తించడానికి ఆమె కుటుంబం ఆమెకు తోడ్పడుతుంది. అర్చన గురించి డీజీపీ తను చదివిన వార్తను ట్యాగ్ చేస్తూ ఏం ట్వీట్ చేశారో చూడండి. ‘‘21 శతాబ్దపు అచ్చమైన మహిళ. ఏ బాధ్యతనైనా నిబద్ధతతో చేస్తుంది. అందుకు ఒక నిదర్శనం అర్చన.’’ ఆపిల్ కో–ఫౌండర్ స్టీవ్ జాబ్స్ నలుగురి పిల్లల్లో పెద్దమ్మాయి లీసా బ్రెనన్ రచయిత్రి. ఆమె కొత్త పుస్తకం ‘స్మాల్ ఫ్రై’ ఇటీవలే మార్కెట్లోకి వచ్చింది. ఆ పుస్తకంలోని కొన్ని భాగాల్లో తండ్రితో తనకున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా రాసుకున్నారు లీసా. స్టీవ్ జాబ్స్ 2011 అక్టోబర్లో క్యాన్సర్తో చనిపోయారు. ఆపిల్ కంపెనీ పెట్టే ప్రయత్నాల్లో ఉన్నప్పుడు తను ప్రేమించిన యువతితో విడిపోయి పక్కకు వచ్చేశాడు స్టీవ్. ఆ తర్వాతి ఏడాది పుట్టిన అమ్మాయే లీసా. అయితే స్టీవ్ ఆమెను తన కూతురు కాదనేశాడు. వైద్యపరీక్షల్లో నిర్ధారణ అయ్యాక గానీ లీసాకు తనే తండ్రి అని అంగీకరించలేక పోయాడు. ఇవన్నీ లీసా పెద్దగా మనసులో పెట్టుకున్నట్లు లేదు. తొమ్మిదేళ్ల వయసులో తండ్రితో కలిసి స్కేటింగ్కి వెళ్లే టప్పుడు వాళ్లిద్దరి మధ్య సంభాషణ ఎలా ఉండేదో తన ‘స్మాల్ ఫ్రై’ పుస్తకంలో ఒక చోట రాశారు లీసా. ‘‘హే, స్మాల్ ఫ్రై, లెట్ అజ్ బ్లాస్ట్. వియ్ ఆర్ లివింగ్ ఆన్ బారోడ్ టైమ్’’ అనేవారట స్టీవ్. ‘అరువు తెచ్చుకున్న సమయాన్ని ఉత్తేజంతో నింపుకుందాం’ అని ఆయన మాటలకు అర్థం. లీసాకు అది అర్థం అయింది కానీ, ‘స్మాల్ ఫ్రై’ అనే మాటను తనకు తెలిసిన అర్థంలోనే తీసుకుని, తను కూడా తండ్రిని.. ‘ఓకే ఫ్యాట్ ఫ్రై, లెటజ్ గో’ అనేదట. ‘స్మాల్ ఫ్రై’ అనే మాటకు రెండు అర్థాలున్నాయి. ప్రాముఖ్యంలేని మనిషి లేదా వస్తువు అనేది ఒక అర్థం. పిల్ల చేప అనేది ఇంకో అర్థం. ఇవి రెండూ కాకుండా.. లీసా అనుకున్న అర్థం వీటికి భిన్నమైనది. ఫ్రెంచి ఫ్రైస్ ఉంటాయి కదా.. బంగాళ దుంపలతో చేసేవి.. వాటిల్లో తినగా అడుగున మిగిలిపోయిన తునకల్ని స్మాల్ ఫ్రైస్ అంటారని అనుకున్న లీసా.. తనను అంత మాట అన్న తండ్రిపై ప్రతీకారంగా ‘ఫ్యాట్ ఫ్రై’ అనేసిందట. ఆ తర్వాత తెలుసుకుందట.. తండ్రి తనను పిల్ల చేప (ఎదుగుతున్న చేప) అనే అర్థంలో ‘స్మాల్ ఫ్రై’ అని అన్నాడని. చివరికి అదే మాటను ఆమె తన పుస్తకానికి టైటిల్గా పెట్టుకున్నారు. -
‘టెక్ గురు’ల పిల్లలు.. టెక్నాలజీకి దూరం
ఏడాది రెండేళ్ల వయసున్న పిల్లలు కూడా స్మార్ట్ఫోన్లతో చెడుగుడు ఆడేస్తున్న కాలమిది. వాళ్లంతా తెలివిమీరిన పిల్లలని, మనకు ఇప్పటికీ అవి కష్టమేనని అంటుండటమూ చూస్తుంటాం. కానీ నూతన ఆవిష్కరణలతో టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించిన ‘టెక్ గురు’లు మాత్రం తమ పిల్లలను టెక్నాలజీకి దూరంగా ఉంచడం గమనార్హం. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్, యాపిల్ సంస్థతో కొత్త పోకడలకు శ్రీకారం చుట్టిన స్టీవ్స్జాబ్స్లు తమ పిల్లల విషయంలో తీసుకున్న జాగ్రత్తలు చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే! చిన్న వయసులోనే సాంకేతికత అతి వినియోగం వల్ల పిల్లల్లో తలెత్తే సమస్యలు, వారిపై చూపే ప్రభావాన్ని గుర్తించడమే దీనికి కారణం. 14 ఏళ్లదాకా ఫోన్ ముట్టనివ్వలేదు.. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ తమ పిల్లలకు 14 ఏళ్ల వయసు వచ్చే వరకూ ఏ టెక్నాలజీ కూడా వారి దగ్గరకు చేరకుండా ఆంక్షలు పెట్టారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనే ఈ విషయం వెల్లడించారు. గాడ్జెట్ల అతి వినియోగం వల్ల నిద్ర దూరమవుతుందని.. అరకొర నిద్రతో ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. పిల్లలు కొంచెం పెద్దయ్యాక మాత్రం పరిమిత సమయం పాటు గాడ్జెట్లను ఉపయోగించేలా అవకాశమిచ్చారట. మిగతా సమయాన్ని పిల్లలు తమ మిత్రులు, బంధువులను కలిసేందుకు, హోంవర్క్ చేసేందుకు ఉపయోగించుకునేలా జాగ్రత్తలు తీసుకున్నారట. ఇదంతా 2007లో ఆయన మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఉన్నపుడే జరిగింది. పిల్లలకు 14 ఏళ్లు వచ్చే వరకు సెల్ఫోన్లు కూడా ఇవ్వలేదు. స్టీవ్జాబ్స్... ఐఫోన్లు, ఐపాడ్స్ వంటి నూతన ఆవిష్కరణలతో ప్రపంచం దృష్టిని ఆవిష్కరించిన యాపిల్ మాజీ సీఈవో, దివంగత స్టీవ్జాబ్స్ తమ పిల్లలను అసలు ఐపాడ్స్ను ఉపయోగించనివ్వలేదట. 2010లో కొత్తగా రూపొందించిన ఐపాడ్ను మీపిల్లలు ఇష్టపడ్డారా? అని ఓ విలేకరి స్టీవ్ను అడిగితే.. ‘వాళ్లు ఐపాడ్ను అస్సలు ఉపయోగించలేదు. ఇంటివద్ద పిల్లలు ఏ మేరకు టెక్నాలజీ ఉపయోగించాలనే దానిపై నియంత్రణ విధించాం..’’ అని సమాధానం ఇచ్చారు. తమ ఇంట్లో ఐపాడ్ల వినియోగాన్నే నిషేధించుకున్నామని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఐపాడ్ డిజైన్లో పాలుపంచుకున్న జోనాథాన్ కూడా తమ పిల్లలకు ఐప్యాడ్ల వినియోగంపై నిబంధనలు విధించినట్టు చెప్పడం గమనార్హం. ఇక తన 12 ఏళ్ల మేనల్లుడు సోషల్ మీడియాను ఉపయోగించడం ఇష్టం లేదని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా చెప్పారు. వీరేకాదు.. చాలామంది ‘టెక్ గురు’లు కూడా ఇదే తరహాలో వ్యవహరించడం గమనార్హం. ‘టెక్ గురు’లు ఇళ్లల్లో విధించిన ఆంక్షల్లో కొన్ని.. ♦ పిల్లలకు 14 ఏళ్లు వచ్చే వరకు స్మార్ట్ ఫోన్లు, ఐప్యాడ్ల వంటివి ఇచ్చేందుకు నో. ♦ ముఖ్యంగా భోజన సమయాల్లో ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించరాదు ♦ వారంలో గాడ్జెట్స్ను ఎన్ని గంటలు ఉపయోగించాలనే పరిమితి. (మరీ చిన్నపిల్లలైతే పూర్తిగా నిషేధం) ♦ రాత్రి నిద్రపోవడానికి ముందే అన్ని పరికరాలు ఆఫ్ చేసేయాలి ♦ బెడ్రూంలలోకి ఎలక్ట్రానిక్ పరికరాలు నిషిద్ధం ♦ పిల్లలు ఉపయోగించే సామాజిక మాధ్యమాలపై నియంత్రణ -
ఇదే స్టీవ్జాబ్స్ రెజ్యుమె
వాషింగ్టన్: టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ 1973లో ఉద్యోగం కోసం నింపిన ఓ దరఖాస్తు వచ్చే నెలలో వేలానికి రానుంది. తాను పోర్ట్ ల్యాండ్లోని రీడ్ కాలేజీలో చదువుతున్నట్లు ఈ దరఖాస్తులో స్టీవ్ తెలిపారు. ఎలక్ట్రానిక్స్ టెక్ లేదా డిజైన్ ఇంజనీర్ విభాగంలో తనకు నైపుణ్యమున్నట్లు వెల్లడించారు. కంప్యూటర్, క్యాలిక్యులేటర్లపై పనిచేయగలనని అందులో చెప్పారు. తప్పులతడకగా వివరాలు నింపిన ఈ దరఖాస్తులో తనకు ఫోన్ నంబర్ లేదని పేర్కొన్నారు. తనకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందని ఆ దరఖాస్తులో స్టీవ్ తెలిపారు. మార్చి 8 నుంచి 15 వరకూ ఆర్ఆర్ ఆక్షన్స్ నిర్వహించనున్న వేలంలో ఈ దరఖాస్తుకు సుమారు రూ.32 లక్షలు పలకవచ్చని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ దరఖాస్తు నింపిన మూడేళ్ల అనంతరం స్టీవ్ వోజ్నియాక్తో కలిసి యాపిల్ను ప్రారంభించారు. దరఖాస్తుతో పాటు స్టీవ్ సంతకం చేసిన 2001 మ్యాక్ ఓఎస్ మాన్యువల్ పుస్తకం, ఐఫోన్ డిజైన్పై ప్రచురితమైన వార్తాపత్రిక కథనం క్లిప్ కూడా వేలానికి రానున్నాయి. వేలంలో మ్యాక్ మాన్యువల్ రూ.16.17 లక్షలు(25 వేల డాలర్లు), వార్తాకథనం క్లిప్ రూ.9.70 లక్షల(15 వేల డాలర్లు) ధర పలకవచ్చని నిర్వాహకులు భావిస్తున్నారు. -
వేలానికి స్టీవ్ జాబ్స్ అప్లికేషన్
ఆపిల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన స్టీవ్ జాబ్స్ నాలుగు దశాబ్దాల క్రితం ఉద్యోగానికి చేసుకున్న దరఖాస్తు ఒకటి వేలానికి రాబోతుంది. దీని ధర 50,000 డాలర్లు పలుకుతుందని పలువురు అంచనా వేస్తున్నారు. అంటే మన కరెన్సీలో ఇది సుమారు రూ.32 లక్షలు. ఈ దరఖాస్తు 1973 నాటిదని తెలుస్తోంది. పేరు స్టీవ్ జాబ్స్ అని, రీడ్ కాలేజీ అడ్రస్తో ఈ అప్లికేషన్ ఉంది. బోస్టన్ కు చెందిన ఆర్ఆర్ ఆక్షన్ దీన్ని వేలానికి ఉంచుతోంది. మార్చి 8 నుంచి 15 మధ్యలో ఈ వేలం నిర్వహించనుంది. అయితే, ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నది ఈ అప్లికేషన్లో లేదు. ప్రత్యేక నైపుణ్యాల సెక్షన్ కింద స్టీవ్ జాబ్స్, టెక్ లేదా డిజైన్ ఇంజనీర్ అని పేర్కొన్నారు. మూడేళ్ల అనంతరం స్టీవ్ జాబ్స్, అతని మిత్రుడు స్టీవ్ వొజ్నాయిక్ ఆపిల్ కంపెనీని స్థాపించారు. స్టీవ్ జాబ్స్ కేన్సర్ కారణంగా 2011లో 56 ఏళ్ల వయసులోనే ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇటీవలే ఆపిల్, స్టీవ్ జాబ్స్ పేరుతో ఉన్న ఇటాలియన్ క్లోతింగ్ కంపెనీకి వ్యతిరేకంగా సాగించిన న్యాయపోరాటంలో ఓడిపోయింది. -
వేలానికి స్టీవ్ జాబ్స్ కారు, దక్కేది ఎవరికో?
టెక్ దిగ్గజం ఆపిల్ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్ జాబ్స్ ఒకప్పుడు వినియోగించిన బీఎండబ్ల్యూ జెడ్8 లగ్జరీ కారు మరోసారి వేలానికి వస్తోంది. ఈ కారును వేలం వేయనున్నట్లు ఆర్ఎం సోథిబే వేలం సంస్థ ప్రకటించింది. వేలంలో ఈ కారు 3 లక్షల డాలర్ల నుంచి 4 లక్షల డాలర్ల వరకు పలికే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ కారు అసలు ధర 1,28,000 డాలర్లు. డిసెంబర్లో న్యూయార్క్లో ఈ కారును వేలం వేయనున్నారు. ఈ కారును ప్రస్తుతం అంత అద్భుతమైనది కానప్పటికీ, ఐకానిక్ మోడల్గా నిలుస్తోంది. ఈ మోడల్ కారును జేమ్స్ బాండ్ మూవీలో యాక్టర్ పియర్స్ బ్రాస్నన్ కూడా వాడారు. స్టీవ్ 2000 అక్టోబరులో దీన్ని కొనుగోలు చేశారని.. 2003 వరకు వినియోగించారని సోథిబే సంస్థ తెలిపింది. దీన్ని తొలుత కొనుగోలు చేసినప్పటి నుంచి ఏడాదికి 1000 మైళ్ల కంటే తక్కువే ప్రయాణించింది. మూడేళ్ల పాటు ఈ కారును తన వద్దనే ఉంచుకున్న స్టీవ్ జాబ్స్ అనంతరం లాస్ ఏంజిలెస్కు చెందిన ఓ వ్యక్తికి విక్రయించారు. ప్రస్తుతం ఈ కారు మరోసారి అమ్మకానికి వస్తోంది. ఒరాకిల్ సంస్థ సీఈవో లారీ ఎల్లిసన్ ఈ కారును కొనుగోలు చేయాలని ఆసక్తిగా ఉన్నట్లు తెలిపింది. బీఎండబ్ల్యూ జెడ్8 1999, 2003 మధ్య కాలంలో తయారు చేశారు. ఈ మోడల్ ముందు భాగం అంత ఆకర్షణీయంగా లేనప్పటికీ, డిజైన్ ఐకానిక్గా నిలుస్తోంది. -
స్టీవ్జాబ్స్ చెప్పినట్లుగానే..
న్యూయార్క్: ప్రపంచ మార్కెట్లో ప్రకంపనలు సష్టించిన తొట్టతొలి ఐఫోన్ను ఆవిష్కరించి ఈ రోజుకు సరిగ్గా పదేళ్లు. అంటే 2007, జూన్ 29వ తేదీన ఈ స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించిన సందర్భంగా ఆపిల్ మాజీ సీఈవో స్టీవ్ జాబ్స్ మాట్లాడుతూ ‘ఓ విప్లవాత్మకమైన ఉత్పత్తి మార్కెట్లోకి వచ్చిప్పుడు అది అన్నింటిని మార్చేస్తుంది’ అన్నారు. అప్పుడు ఆ మాటలకు అర్థం తెలియలేదు. ఇప్పుడు అక్షరాల అదే జరుగుతోంది. నేడు సమాజంలో సామాజిక సంబంధాలు, విలువలూ అన్నీ స్మార్ట్ఫోన్ల విప్లవంతో మారిపోతున్నాయి. ఒకప్పుడు ముచ్చట్ల కోసం మిత్రులంతా కలసి పార్కుకో, హోటల్కో వెళ్లాలని ప్లాన్ చేసుకునేవారు. వీలున్న వారు విహార యాత్రలకు వెళ్లేవారు. సరదాగా గడిపేవారు. ఇప్పటికీ పార్కులకు, హోటళ్లకు, విహార యాత్రలకు వెళుతున్న వారు ఉన్నారు. కాకపోతే ఒంటరిగా, స్మార్ట్ఫోన్ తోడుగా. అలా గడిపిన తాలూకు జ్ఞాపకాలను ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. టెలిఫోన్లు అందుబాటులోకి వచ్చినప్పుడు కుటుంబాలు, బంధుమిత్రులు ముఖాముఖి కలసుకొని మాట్లాడుకోవడం తగ్గిపోయింది. స్మార్ట్ఫోన్ల రాకతో మాట్లాడుకోవడం కూడా పడిపోయింది. లిపి సందేశాలను పంపించుకోవడం అలవాటైంది. ప్రజలు మత్తుపదార్థాలకు బానిసలైనట్లుగానే సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లకు ప్రజలు బానిసలవుతున్నారని మార్కెటింగ్ ప్రొఫెసర్ ఆడమ్ అట్లర్ ‘ఇర్రెసిస్టిబుల్’ అనే పుస్తకంలో తెలిపారు. అటు మత్తు పదార్థాల విషయంలో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ల విషయంలో మానవ మెదడు ప్రకియ ఒకేలాగా ఉంటుందని ఆయన చెప్పారు. ఆయన ఈ విషయాన్ని నిరూపించడం కోసం స్మార్ట్ఫోన్లను ఎక్కువగా ఉపయోగించేవారిలో కొంత మందిని ఎంపిక చేసి వారి స్మార్ట్ఫోన్లను స్క్రీన్లు కనిపించకుండా టేబుల్పై పెట్టించారు. ఫోన్ల నుంచి వారిని దష్టిని మళ్లించేందుకు వారితో మాటలు కూడా కలిపారు. వారంతా అన్యమస్కంగా తమ ఫోన్లనే చూస్తుండి పోయారు. ఫోన్లను చేతుల్లోకి తీసుకొని చూసుకోకుండా కొన్ని నిమిషాలు కూడా ఉండలేకపోయారు. అడిక్షనంటే ఇదేనంటూ ఆయన తేల్చారు. ఫేస్బుక్ను ఎక్కువ వాడుతున్న వారు తక్కువ సంతోషంతో ఉంటున్నారని పలు అధ్యయనాల్లో ఇప్పటికే తేలింది. ఫేస్బుక్ను తక్కువగా ఉపయోగిస్తున్న వారే ఎక్కువ సంతోషంతో ఉంటున్నారట. స్మార్ట్ఫోన్లను తెగ ఉపయోగించే భార్య భర్తలను ఓ సర్వేలో వారి వైవాహిక సంబంధాల గురించి ప్రశ్నించగా తీవ్ర అసంతప్తిని వ్యక్తం చేశారు. కొన్ని జంటలు మానసిక ఆందోళనకు కూడా గురవుతున్నాయి. 1980, 1990, 2000, 2010లో పుట్టిన తరాల మధ్య స్మార్ట్ఫోన్లలో వచ్చిన విప్లవాత్మక మార్పులు ఎలా ఉన్నాయో, అలాగే ఆ తరాల పిల్లల మధ్య, వారి అలవాట్ల మధ్య ఎంతో తేడాలు ఉన్నాయి. 1995 తర్వాత పుట్టిన తరాన్ని ఐజెన్ లేదా జెన్జీ తరం అని పిలుస్తారు. వారు కౌమారత్వాన్ని పూర్తిగా స్మార్ట్ఫోన్లతోనే గడిపారు. 2009 నుంచి 2016 సంవత్సరాల మధ్య (స్మార్ట్ఫోన్లు ఉండడం సాధారణమైన రోజుల్లో) అమెరికాలో కళాశాలకు వెళ్లే విద్యార్థుల్లో మానసిక ఆందోళన రెండింతలు పెరిగిందని ‘అమెరికన్ ఫ్రెష్ మేన్ సర్వే’ వెల్లడించింది. అదే కాలంలో యువతీ యువకుల ఆత్మహత్యల రేటు కూడా రెట్టింపయిందని ‘ది సెంటర్స్ పర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్’ తెలిపింది. స్మార్ట్ఫోన్ల వినియోగం వల్ల యువతలో మద్యం సేవించడం గణనీయంగా తగ్గిందని, టీనేజీ సెక్స్ కోసం వెంపర్లాడడం కూడా బాగా తగ్గిందని సర్వేలు తెలియజేస్తున్నాయి. స్మార్ట్ఫోన్ కూడా ఓ పరికరమని, అన్ని పరికరాల్లోలాగానే సానుకూల ఫలితాలతోపాటు ప్రతికూల ఫలితాలు ఉంటాయని స్మార్ట్ఫోన్లను తయారుచేసే దిగ్గజ సంస్థలు చెబుతున్నాయి. ఏదేమైనా నేటి ఇంటర్నెట్ యుగంలో స్మార్ట్ఫోన్లపై ఆధారపడకుండా బతికే రోజులు పోయాయనే చెప్పవచ్చు. స్మార్ట్ఫోన్లు ప్రపంచంలో ప్రతిదాన్ని మార్చేస్తుందని నాడు స్టీవ్ జాబ్స్ అన్నారుగానీ, ఇంతగా మార్చేస్తుందని ఆయనకు కూడా తెలియదు కాబోలు! -
స్టీవ్ జాబ్స్కు ఆపిల్ గొప్పకానుక
కపెర్టినో/కాలిఫోర్నియా: ఆపిల్ సంస్థ తన ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. మరో రెండు నెలల్లో తమ సంస్థ కొత్త ఉన్నత కార్యాలయ సముదాయాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పింది. అదే రోజు సంస్థ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ పేరిట నిర్మించిన ప్రత్యేక థియేటర్ను కూడా ప్రారంభించి ఆయన జయంతి కానుకగా అందించనుంది. ఈ మేరకు తన వెబ్సైట్లో ఆపిల్ సంస్థ ఒక వార్తా ప్రకటనను విడుదల చేసింది. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని క్యూపర్టినోలో ఉన్న పాత కార్యాలయం నుంచి దాదాపు 12,000మందిని తరలించనుంది. ఈ ప్రక్రియ ఏప్రిల్ నెల నుంచి ప్రారంభించి మొత్తం ఆరు నెలల్లో పూర్తి చేయనుంది. మొత్తం 175 ఎకరాల వైశాల్యంలో ఒక పెద్ద రింగు మాదిరిగా 2.8 మిలియన్ చదరపు అడుగుల వెడల్పులో ఆపిల్ తన ప్రధాన కార్యాలయాన్ని నిర్మించింది. దీనిని రెనివబుల్ ఎనర్జీ ఆధారిత భవనంగా నిర్మించింది. ఇందులో తమ సంస్థకు పేరు ప్రఖ్యాతలు తెచ్చి క్యాన్సర్ కారణంగా కన్నుమూసిన స్టీవ్ జాబ్స్ పేరిట దాదాపు వెయ్యిమంది కూర్చునే సామార్థ్యం ఉన్న పెద్ద ఆడిటోరియాన్ని నిర్మించింది. దీనికే స్టీవ్ జాబ్స్ ఆడిటోరియం అని నామకరణం చేసింది. 2011లో క్యాన్సర్ కారణంగా స్టీవ్ జాబ్స్ కన్నుమూశారు. -
పదేళ్ల ఐఫోన్ గురించి 10 ఆసక్తికర విషయాలు...
ఆపిల్ ఐఫోన్ అంటే ఎవరూ తెలియని వారండరేమో.. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రొడక్ట్ తెగ ఫేమస్ అయింది. కుర్రకారు మదిని ఎక్కువగా దోచుకున్న స్మార్ట్ ఫోన్ ఏదైనా ఉందా అంటే అది ఐఫోనే. అంతలా ఇష్టపడతారు యువత. ఎలాగైనా ఆపిల్ ఐఫోన్ కొనుక్కోవాలని యువత ఉత్సాహ పడుతుంటారు. కుర్రకారును ఇంతగా ఆకట్టుకున్న ఐఫోన్కు జనవరి 9 అంటే నేడు చాలా స్పెషల్. ఆ స్పెషల్ ఏమిటో తెలుసా? నేటికి ఐఫోన్ పదేళ్లు పూర్తిచేసుకుంది. ఐఫోన్ నుంచి ఇంకా ఉత్తమమైన స్మార్ట్ఫోన్ రావాల్సిఉందని 10వ వార్షికోత్సవ సందర్భంగా ఆ కంపెనీ సీఈవో టిమ్ కుక్ అభిప్రాయం వ్యక్తంచేశారు. అంటే పదేళ్ల వార్షికోత్సవంగా మరో సూపర్ ఐఫోన్ ను మన ముందుకు తీసుకురాబోతున్నారని సిగ్నల్ ఇచ్చేశారు. 10వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఐఫోన్ గురించి మరిన్ని విశేషాలు: 2007 జనవరి 7న ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఈ ఫోన్ను ప్రవేశపెట్టారు. శాన్ఫ్రాన్సిస్కో వేదికగా లాంచ్ అయిన ఈ ఫోన్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన మొదటి ఐఫోన్. మొదటి తరం ఐఫోన్ మొదట అమెరికాలోనే ప్రవేశపెట్టారు. 2007 నవంబర్లో యూకే, జర్మనీ, ఫ్రాన్స్లలో ఐఫోన్ను విక్రయించడం ప్రారంభించారు. అయితే మొదటి ఐఫోన్ను భారత్లో ప్రవేశపెట్టలేదు. భారత్లోకి ఐఫోన్ 2008 ఆగస్టులో ప్రవేశించింది. ఐఫోన్ 3జీ ఫోన్ను మొదట భారత్ లో లాంచ్ చేశారు. వొడాఫోన్, ఎయిర్టెల్ నెట్వర్క్తో భారత్లోకి ప్రవేశించింది. ఐఫోన్ లాంచ్ చేసినప్పుడు, దీనికసలు ఎలాంటి యాప్ స్టోర్ లేదు. స్టీవ్ జాబ్స్ ఐఫోన్ ను ప్రవేశపెట్టిన కొన్ని రోజులకే సిస్కో దీనిపై దావా వేసింది. 'ఐఫోన్' ట్రేడ్ మార్కు వాస్తవానికి తమదంటూ సిస్కో ఉత్తర కాలిఫోర్నియా ఫెడరల్ జిల్లా కోర్టులో దావా వేసింది. అనంతరం రెండు కంపెనీలు కూర్చొని ట్రేడ్ మార్కు సమస్యను సెటిల్ చేసుకున్నాయి. 2016 లో టైమ్ మ్యాగజీన్ విడుదల చేసిన అన్ని సమయాల్లో అత్యంత ప్రభావితమైన 50 గాడ్జెట్ల జాబితాల్లో ఐఫోన్ టాప్లో నిలిచింది. ఐఫోన్ టెక్నాలజీకి సంబంధించిన 200 పేటెంట్ హక్కులు ఆపిల్ వద్ద ఉన్నాయి. 2016 జూన్ నాటికి ఆపిల్ ఐఫోన్ విక్రయాలు 1 బిలియన్(100 కోట్ల) మార్కును చేధించాయి. కూపర్టినోలో జరిగిన ఉద్యోగుల సమావేశంలో ఈ విషయాన్ని ఆపిల్ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు. 1 బిలియన్ మార్కును కంపెనీ చేధించి, రికార్డు సృష్టించిందని ఆయన ఆనందం వ్యక్తంచేశారు. ఐఫోన్ ఫోన్లలో అత్యంత ఖరీదైన భాగమేదంటే అది రెటీనా స్క్రీనే. 2007 జూన్ నుంచి ఐఫోన్ విక్రయాలు ప్రారంభం అయిన తర్వాత కంపెనీకి ఎక్కువ రెవెన్యూలు ఈ ఫోన్నుంచే వస్తున్నాయి. గత త్రైమాసికంలో(2016 క్యూ4) కంపెనీ రెవెన్యూలో ఐఫోన్ విక్రయాలు 60 శాతం నమోదు అయ్యాయి. ఈ రెవెన్యూలు మరో 14 శాతం పెరిగే అవకాశముందని కంపెనీ వ్యక్తంచేస్తోంది. ఆపిల్ ఐఫోన్ యాడ్ లో ఎప్పుడూ సమయం 9.41am గానే కనిపిస్తోంది. ఇందుకు కారణం స్టీవ్ జాబ్స్ మొదట ఐఫోన్ ను ఆ సమయంలోనే ప్రవేశపెట్టారు. -
ఆ ఆరుగురి గురించి క్లుప్తంగా....
వాషింగ్టన్: జీవితంలో పైకి రావాలంటే ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని, ఉత్తమ వేతనాలు కలిగిన ఉన్నత పదవులను అధిష్టించాలని మనలో చాలా మంది భావిస్తారు. మనకు నచ్చిన రంగంలో రాణించాలంటే. పేరు ప్రఖ్యాతులతో పాటు అస్తుపాస్తులు అపారంగా సంపాదించాలంటే ఉన్నత విద్యలు అభ్యసించాల్సిన అవసరం ఏమీలేదని, రాణించాలనుకున్న రంగం పట్ల సరైన అవగాహన, అందుకు అవసరమైన తెలివితేటలు, అంతకన్నా చేసే పని పట్ల చిత్తశుద్ధి, అకుంఠిత దీక్ష ఉంటే సరిపోతుందని ప్రపంచంలో ఇప్పటికే ఎంతో మంది నిరూపించారు. వారిలో ఆరుగురి గురించి క్లుప్తంగా.... బిల్గేట్స్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బిల్గేట్స్ పర్సనల్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ప్రోగామ్ అభివృద్ధిపై తన 13వ ఏటనే దృష్టిని కేంద్రీకరించారు. 1973లో హార్వర్డ్ యూనివర్శిటీలో చేరారు. డిగ్రీ పూర్తిచేయకుండానే కాలేజ్ చదవుకు స్వస్తి చెప్పారు. ‘మైక్రోసాఫ్ట్’ను స్థాపించారు. కంపెనీని ఉన్నతస్థాయికి తీసుకెళ్లి పేరు ప్రఖ్యాతులతోపాటు అపార అస్తులను సంపాదించారు. అయినా తృప్తి పడకుండా వర్ధమాన దేశాల్లో పేదరికాన్ని సాధ్యమైనంత మేరకు తగ్గించి, ప్రజలకు కావాల్సిన ఆరోగ్య సౌకర్యాలను అందుబాటులోకి తేవాలన్న సత్సంకల్పంతో ‘బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్’ను స్థాపించి సామాజిక సేవ చేస్తున్నారు. స్టీవ్ జాబ్స్ మరో పర్సనల్ కంప్యూటర్ పయనీర్. పోర్ట్లాండ్లోని రీడ్ కాలేజీలో చేరారు. మధ్యలోనే కాలేజీ చదువుకు స్వస్తి చెప్పారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆపిల్ కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరయ్యారు. యూనివర్శిటీ చదువును మధ్యలో వదిలేయడం పట్ల ఆయన ఎన్నడూ పశ్చాతపడలేదు. పైగా మంచిపని చేశానని చెప్పుకున్నారు. ‘తల్లిదండ్రులు తమ జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్మును యూనివర్శిటీ చదువుల పేరిట తగలేయడం ఇష్టం అనిపించలేదు. అందుకే చదువును అర్ధాంతరంగా వదిలేసాను. అప్పుడు నేను జీవితంలో ఏం కావాలనుకుంటున్నానో కూడా నాకు క్లారిటీ లేదు. ఆరోజున పునరాలోచించి చదువు మానేయడం నేను జీవితంలో తీసుకున్న మంచి నిర్ణయాల్లో మంచి నిర్ణయం’ అని ఆయన వ్యాఖ్యానించారు. స్టీవ్ జాబ్స్ పిక్సర్ అనే సంస్థను కూడా స్థాపించారు. తొలి యానిమేటెడ్ సినిమాను నిర్మించిన ఈ సంస్థను తర్వాత డిస్నీ కొనుగోలు చేసింది. జెస్సికా ఆల్బా ‘సిన్ సిటీ’ లాంటి అవార్డు సినిమాల ద్వారా ఆమె మనకు ముందుగానే పరిచియం. ఆమె దానికే పరిమితం కాకుండా 2011లో వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు. ‘హానెస్ట్ కంపెనీ’ని ఏర్పాటు చేశారు. ఈకో ఫ్రెండ్లీ హౌజ్హోల్డ్ క్లీనింగ్ ఉత్పత్తులను ప్రారంభించారు. తాజా అంచనాల ప్రకారం ఇప్పుడు ఆమె కంపెనీ ఆస్తుల విలువ వంద కోట్ల డాలర్లు. డిగ్రీ కూడా చదవని ఆమె, వ్యాపార రంగంలో స్వీయకృషితో పైకొచ్చిన అమెరికా సంపన్నుల్లో ఒకరిగా 2015లో ప్రత్యేక గుర్తింపును పొందారు. రిచర్డ్ బ్రాన్సన్ పదో తరగతి కూడా చదువుకోలేదు. 16వ ఏటనే తన చదువుకు స్వస్తి చెప్పారు. మ్యూజిక్ ఆల్బమ్స్ ద్వారా వందల కోట్ల డాలర్లను ఆర్జించారు. ‘రోలింగ్ స్టోన్స్, సెక్స్ పిస్టల్స్’ కళాకారులతో కాంట్రాక్టులు కుదుర్చుకొని ప్రపంచ ప్రఖ్యాతి చెందారు. ‘చదువు ముఖ్యం కాదని నేను చెప్పడం లేదు. ఓ సైంటిస్ట్ కావాలన్నా, టెక్నీషయన్ కావాలన్నా, మేథమెటీషియన్ కావాలన్నా చదువు తప్పనిసరి. సక్సెస్ఫుల్ వ్యాపారవేత్త కావాలంటే బిజినెస్ స్కూల్కు వెళ్లి చదవుకోవాల్సిన అవసరం లేదు. జీవితాన్ని, అందులోని అనుభవాలను చదువుకుంటే చాలు’ అని ఆయన తన గురించి చెప్పుకున్నారు. బ్రాన్సన్ వర్జినీయా మొబైల్ ఫొన్ కంపెనీని స్థాపించారు. నోకియా బూమ్ రాకముందు ఈ ఫోన్లను బాగా అమ్ముడుపోయేవి. మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్ వ్యవస్థాపకుల్లో ఒకరైన జుకర్బర్గ్ 2004లో సంస్థను స్థాపించారు. దానిపై దృష్టిని కేంద్రీకరించడం కోసం హార్వర్డ్ యూనివర్శిటీలో చదువుకు స్వస్తి చెప్పారు. నెలకు 150 కోట్ల యూజర్లు కలిగిన ఫేస్బుక్ ఆస్తి 25వేల కోట్ల డాలర్లు. ‘ఏ రిస్క్ తీసుకోకపోవడమే జీవితంలో మనిషి చేసే అతి పెద్ద రిస్క్. యూనివర్శిటీ చదువుకు స్వస్తి చెప్పడం రిస్కే కావచ్చు. కానీ ఆ రిస్క్ నాలాంటి వాళ్లకు ఎంతో కలసొచ్చింది’ అని ఆయన తన గురించి చెప్పుకున్నారు. ఓప్రా విన్ప్రే మిసి్సిసీపిలో జన్మించిన విన్ప్రే జీవితంలో కటిక దరిద్య్రాన్ని అనుభవించారు. టీనేజీలోనే ప్రెగ్నెన్సీ సమస్యను ఎదుర్కొన్నారు. ఉన్నత చదువులను అభ్యసించాలనే లక్ష్యంతో టెన్నీస్ స్టేట్ యూనివర్శిటీలో చేరారు. అక్కడ వివిధ కళల్లో ఆరితేరారు. అక్కడ చదువు కొనసాగిస్తున్నప్పుడు స్థానిక రేడియో స్టేషన్లో ఉద్యోగం వచ్చింది. చదువుకు స్వస్తి చెప్పారు. కష్టపడి పనిచేశారు. ప్రపంచంలోనే మంచి రేడియో షో హోస్ట్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. స్వయం కృషితో అమెరికాలో పైకొచ్చిన సంపన్నుల్లో ఐదో వ్యక్తిగా మన్ననలు అందుకున్నారు. ‘జీవితంలో వైఫల్యం అనేది ఏదీ ఉండదు. ప్రతి వైఫల్యం జీవితానికి ప్రత్యామ్నాయ దారి చూపుతుంది’ అని ఆమె చెప్పారు. -
ఆ పుస్తకం షారూఖ్ ఆలోచనలు మార్చేసింది
హీరోగా వ్యాపారా వేత్తగా బిజీగా ఉండే బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్, ఏ మాత్రం కాళీ సమయం దొరికినా పుస్తకాలు చదువుతూ కాలం గడుపుతాడు. ఎక్కువగా ఫిక్షన్, నాన్ ఫిక్షన్ రచనలను ఇష్టపడే షారూఖ్, ఇటీవల చదివిన స్టీవ్ జాబ్స్ బయోగ్రఫి, వ్యాపారం పట్ల తన ఆలోచనా విధానాన్ని మార్చేసిందంటున్నాడు. యాపిల్ సహ వ్యవస్థాపకుడైన స్టీవ్ జాబ్స్ సూచించినట్టుగా ఒక సమయంలో కేవలం ఒక పని మీదే దృష్టి పట్టాలని నిర్ణయించుకున్నాడు షారూఖ్. ప్రస్తుతం తన వ్యాపార సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా క్రియేటివ్ ఫీల్డ్కు సంబంధించిన ఎన్నో వ్యాపారాలు చేస్తున్నాడు షారూఖ్. సినిమా నిర్మాణంతో పాటు విజువల్ ఎఫెక్ట్స్, టివి ప్రొడక్షన్, యాడ్ ఫిలిం మేకింగ్ లాంటి రంగాల్లో ఉన్న షారూఖ్, టివి, యాడ్ రంగాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. పూర్తిగా సినీ రంగం మీద దృష్టి పెట్టాలన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటించాడు షారూఖ్ ఖాన్. -
'స్టీవ్ జాబ్స్ ఐఫోన్ కనిపెట్టలేదు'
ఆపిల్ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఐఫోన్ కనిపెట్టలేదని కేవలం దాని డిజైన్ మాత్రమే రూపొందించారని అమెరికా ప్రతినిధుల సభలో మైనారిటీలకు లీడర్ గా వ్యవహరిస్తున్న నాన్సీ పెలోసీ అన్నారు. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం(జీపీఎస్), డిజిటల్ కెమెరాలను ఫెడరల్ రీసెర్చ్ రూపొందించిందని, వాటన్నింటిని ఆపిల్ గుదిగుచ్చి ఐఫోన్ ను తయారు చేసిందని డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ ప్లాట్ ఫాంలో వ్యాఖ్యానించారు. జీపీఎస్, ఫ్లాట్ స్క్రీన్, ఎల్ఎల్ డీ, డిజిటల్ కెమెరా, వైర్ లెస్ డేటా కంప్రషన్, వాయిస్ రికగ్నిషన్ తదితర టెక్నాలజీలను మొత్తం ఫెడరల్ రీసెర్చ్ నుంచే తీసుకున్నట్లు తెలిపారు. వీటన్నింటికి ప్రత్యక్ష ఆధారాలు లేకపోయినా, నేడు పెద్ద దిగ్గజాలుగా రాణిస్తున్న కంపెనీలు అన్నీ ఫెడరల్ రీసెర్చ్ నుంచి టెక్నాలజీని తీసుకున్నవేనని ఆమె అన్నారు. -
ఉద్యోగుల కారు నంబర్లూ గుర్తుపెట్టుకున్నా..
► వారాంతాల్లోనూ పని చేస్తూనే ఉండేవాణ్ని ► మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ లండన్: పని వేళల్లో ఉద్యోగులను అనుక్షణం పర్యవేక్షించేవాణ్నని, వారి లెసైన్స్ ప్లేట్లన్నీ కూడా గుర్తుపెట్టుకునే వాణ్నని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తెలిపారు. అప్పట్లో సెలవు తీసుకోవాలనే ఆలోచనే ఉండేది కాదని, వారాంతాల్లో కూడా పనిచేస్తూనే ఉండేవాణ్నని వివరించారు. బీబీసీ రేడియోకి ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా అప్పట్లో తన మేనేజ్మెంట్ తీరును వివరించిన గేట్స్.. కొన్ని జ్ఞాపకాలనూ నెమరువేసుకున్నారు. ‘నాకు సెలవులు తీసుకోవాలనే ఆలోచనే ఉండేది కాదు. నా విధానాలు, ప్రమాణాలను మా కంపెనీలో పనిచేసే మిగతావారిపై రుద్దకుండా ఉండటానికి కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సి వచ్చేది. నాకు ప్రతీ ఒక్కరి లెసైన్సు ప్లేటు (వాహనం నంబరు) కూడా గుర్తుండేది. పార్కింగ్ లాట్లోకి చూసి ఎవరు వచ్చారు, ఎవరు వెళ్లారన్నవి లెక్కేసుకునే వాణ్ని’ అని బిల్ గేట్స్ చెప్పారు. అయితే కంపెనీ పరిమాణం పెరుగుతున్న కొద్దీ తాను నిబంధనలు కూడా క్రమంగా సడలించాల్సి వచ్చిందని తెలిపారు. టెక్ దిగ్గజం యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్తో తన అనుబంధాన్ని కూడా గేట్స్ వివరించారు. స్టీవ్ ఒకోసారి చాలా కఠినంగా ఉండేవాడని, ఒకోసారి ఎంతగానో ప్రోత్సహించేవాడిగా ఉండేవాడని ఆయన చెప్పారు. తామిద్దరం కలిసి కూడా పనిచేశామన్నారు. యాపిల్ 2కి తాను సాఫ్ట్వేర్ కూడా రాశానని గేట్స్ చెప్పారు. ఎదుటివారి నుంచి అసాధారణమైన పనిని రాబట్టగలిగే దిట్ట జాబ్స్ అని కితాబిచ్చారు. క్లాసులో అమ్మాయిల మధ్య నేనొక్కణ్నే.. పంథొమ్మిదో ఏట హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి బైటికొచ్చి, మైక్రోసాఫ్ట్ను ప్రారంభించిన గేట్స్.. తన కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నారు. క్లాసు మొత్తంలో మిగతా అబ్బాయిలెవరూ లేకుండా మొత్తం అమ్మాయిల మధ్యలో తానొక్కడే ఉండేలా మైక్రోసాఫ్ట్ మరో వ్యవస్థాపకుడు పాల్ అలెన్తో కలసి షెడ్యూలింగ్ సాఫ్ట్వేర్ను మార్చేసిన వైనాన్ని ఆయన వివరించారు. అలెన్ కాలేజీ చదువు అప్పటికే పూర్తయిపోవడంతో అది తనకు లాభించిందని గేట్స్ తెలిపారు. అయితే అమ్మాయిలతో మాట్లాడటంలో తాను అంతంతమాత్రమేనని, దీంతో అంతమంది చుట్టూ ఉన్నా వారితో పెద్దగా మాట్లాడేవాణ్ని కానని ఆయన చెప్పారు. -
స్టీవ్ జాబ్స్ కూడా ఓ శరణార్థే!
ప్రముఖ బ్రిటన్ గ్రాఫిటీ చిత్రకారుడు బాన్క్సీ వేసిన ఓ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న శరణార్థుల సమస్యను మరోసారి చర్చకు తీసుకువచ్చింది. ఉత్తర ఫ్రాన్స్ కలైస్ పట్టణంలోని శరణార్ధుల శిబిరం వద్ద యాపిల్ సంస్థ స్థాపకుడు దివంగత స్టీవ్ జాబ్స్ చిత్రాన్ని బాన్క్సీ గోడపై వేశాడు. ఈ చిత్రంలో స్టీవ్ జాబ్స్ పాతకాలపు యాపిల్ కంప్యూటర్ను చేతిలో పట్టుకొని భుజాన నల్లని బ్యాగు వేసుకొని ఉన్నాడు. ఇటీవల అనేక దేశాలు.. శరణార్థుల వల్ల ఆర్థికంగా నష్టపోతున్నామనే భావిస్తున్నాయి. దీనిని తప్పుపడుతూ బాన్క్సీ ఈ చిత్రాన్ని వేశాడు. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం స్టీవ్ జాబ్స్ కూడా సిరియా నుంచి ఒక శరణార్థి లాగే అమెరికాలోకి ప్రవేశించాడని, జాబ్స్ ద్వారా ఆ దేశానికి ఆర్ధికంగా మేలే జరిగింది అనే విషయాన్ని బాన్క్సీ వెల్లడించాడు. 'ది జంగిల్' అనే శరణార్థుల శిబిరం వద్ద ఈ చిత్రాన్ని గమనించిన అధికారులు.. దీనిని అమూల్యమైన సంపదగా భావించి సంరక్షిస్తామని తెలిపారు. అలాగే ధ్వంసమైన పడవలో అవస్థలు పడుతున్న శరణార్థులు.. ఓ ఖరీదైన నౌక సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్న దృశ్యాన్ని సైతం బాన్క్సీ అద్భుతంగా ఆవిష్కరించి శరణార్థుల సమస్యలను కళ్లకు కట్టాడు. -
'మీరంతా స్టీవ్ జాబ్స్లాగా పనిచేయండి'
మధుర: ఆపిల్ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్లాగా అందరూ పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన పార్టీ కార్యకర్తలకు హితబోధ చేశారు. ఉత్తరప్రదేశ్లో పార్టీకి పునరుజ్జీవం తీసుకురావాలని సూచించారు. ఢిల్లీ నుంచి రెండు గంటలపాటు డ్రైవింగ్ ద్వారా మధురకు చేరుకున్న ఆయన అక్కడ ఓ ఆలయాన్ని సందర్శించిన అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడారు. 'స్టీవ్ జాబ్స్ తాను ఉన్నస్వల్ప స్థాయి నుంచి భారీ స్థాయిలో దృష్టి సారించి విజయం సాధించారు. అలాగే మీరు పనిచేయాలి. మన సిద్ధాంతం మనకు విజయం సాధించి పెడుతుంది. మనల్ని నెంబర్ 1గా నిలుపుతుంది. అలాగే, మీరంతా నరేంద్ర మోదీపై విమర్శల దాడి చేయండి.. అదే సమయంలో తనపై తాను దాడి చేసుకోవడంలో మోదీ బెస్ట్ అనే విషయం మరవకండి. ప్రధాని చేసిన కనీస వాగ్దానాలు కూడా నెరవేర్చలేకపోయారు. నల్లధనం వెనక్కి తీసుకొస్తానని దాదాపు 15 లక్షలమందిని ముందు పెట్టుకొని మోదీ ప్రమాణం చేసి ఆ మాటే మరిచిపోయారు' అని ఆయన విమర్శించారు. -
వేలానికి స్టీవ్ జాబ్స్ తయారీ ఆపిల్ కంప్యూటర్
న్యూయార్క్: 40 ఏళ్ల నాటి ఆపిల్ తొలితరం కంప్యూటర్ ఒకటి వేలానికి రానుంది. 1977లో ఆపిల్ సంస్థ మాజీ సీఈఓ స్టీవ్ జాబ్స్, స్టీవ్ వొజ్నియాక్తో కలిసిదీన్ని స్వయంగా చేతితో తయారుచేసింది కావడం విశేషం. ఇది దాదాపు 3,30,000 పౌండ్ల ధర (దాదాపు రూ.3.3 కోట్లపైమాటే) పలకనుందని అంచనా వేస్తున్నారు. ఆపిల్-1 మదర్ బోర్డు వినియోగించిన ఈ తొలితరం కంప్యూటర్ను వాస్తవానికి బైట్షాప్ 437 పౌండ్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఇది చక్కగానే పనిచేస్తుండటం విశేషం. దీన్ని ఈనెల 21న బన్హామ్స్లో వేలం వేయనున్నారు. ప్రారంభ ధర 3,30,000 పౌండ్లుగా నిర్ణయించారు. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
ట్రైలర్: స్టీవ్ జాబ్స్ నిడివి: 2 ని. 40 సె. హిట్స్: 28,70,219 స్టీవ్ జాబ్స్పై బయోగ్రఫికల్ డ్రామా ఫిల్మ్ వస్తోంది. అక్టోబర్లో విడుదల కానున్న ఈ ‘స్టీవ్ జాబ్స్’ చిత్రానికి ‘స్లమ్డాగ్ మిలియనీర్’ ఫేం డానీ బోయెల్ దర్శకత్వం వహించారు. జర్మన్-ఐరిష్ నటుడు మైఖేల్ ఫాస్బెండర్ స్టీవ్ జాబ్స్గా నటించారు. ‘‘ట్రైలర్లో మైఖేల్ను చూస్తే అచ్చంగా స్టీవ్ జాబ్స్ను చూస్తున్నట్లుగానే ఉంది’’ అంటున్నారు సినీ విశ్లేషకులు. ట్రైలర్లో వినిపిస్తున్న డైలాగులు ప్రేక్షకులలో సినిమా పట్ల ఆసక్తి రేపుతున్నాయి. డ్యాన్స్ వీడియో: చానింగ్ టటమ్ నిడివి: 30 సె. హిట్స్: 23,52,261 హాలీవుడ్ డ్యాన్స్ ఫిల్మ్ ‘సెట్ అప్’తో నటుడు, నృత్యకారుడు చానింగ్ టటమ్కు వచ్చిన పేరు ఇంతా అంతా కాదు. అతని నృత్యరీతులు ప్రేక్షకులను అబ్బురపరిచాయి. అభిమానులు అతడిని ‘మెగాస్టార్’ అని, ఈ కాలపు ‘జెన్ కెల్లీ’ అని కూడా అంటున్నారు. చానింగ్ సరికొత్త నృత్యరీతుల వీడియో యూట్యూబ్లో ఆబాలగోపాలాన్నీ ఆకట్టుకుంటోంది. 30 సెకండ్లలో 7 డ్యాన్స్ స్టెప్లు వేసి ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తాడు చానింగ్. ట్రైలర్: ఆల్ ఈజ్ వెల్ నిడివి: 2 ని. 49 సె. హిట్స్: 15,13,813 ‘ఓ మై గాడ్’ ఫేమ్ ఉమేశ్ శుక్లా దర్శకత్వంలో రానున్న ‘ఆల్ ఈజ్ వెల్’ పోస్టర్లు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆగస్ట్లో విడుదల కానున్న ఈ చిత్రంలో రిషి కపూర్, అభిషేక్ బచ్చన్లు తండ్రీ కొడుకులుగా నటించారు. ఉమేశ్ శుక్లా సినిమాలో బోలెడు కామెడీ ఉంటుంది. నవ్విస్తూనే మనల్ని ఆలోచనల్లోకి తీసుకువెళతాడు దర్శకుడు. ‘త్రీ ఇడియట్స్’ సినిమాలోని ఫేమస్ డైలాగ్ ‘ఆల్ ఈజ్ వెల్’. ఈ డైలాగ్లాగే సినిమా హిట్ అవుతుందా? లేదా? అనేది చూద్దాం. ట్రైలర్: క్యాలెండర్ గర్ల్స్ నిడివి: 1 ని. 31 సె. హిట్స్: 2,16,837 నిజజీవిత సంఘటనల ఆధారంగా సినిమాలు తీయడంలో మాధుర్ బండార్కర్ దిట్ట. ఈ దర్శకుడు ఇప్పుడు ఫేమస్ క్యాలెండర్లకు పోజులు ఇచ్చే మోడల్స్పై ‘క్యాలెండర్ గర్ల్స్’ సినిమా తీశాడు. ఈ సినిమా కోసం ఆయన ఎంతో గ్రౌండ్వర్క్ చేశాడట. క్యాలెండర్ మోడల్స్ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని సినిమా ప్రతిబింబిస్తుంది. బికినీలతో నిల్చున్న అందాల బొమ్మల పోస్టర్ యూట్యూబ్లో హల్చల్ చేస్తోంది. సినిమా ఆగస్ట్ 7న విడుదల కానుంది. టీజర్: స్నోడెన్ నిడివి: 1 ని. 27 సె. హిట్స్: 3,25,687 లూకె హర్డింగ్ ‘ది స్నోడెన్ ఫైల్స్’ పుస్తకం ఆధారంగా ఇప్పుడు ‘ది స్నోడెన్’ పేరుతో హాలివుడ్ సినిమా రూపుదిద్దుకుంటోంది.ఆలివర్ స్టోన్ దర్శకత్వం వహించారు. ‘ది స్నోడెన్’కు సంబంధించి తాజా టీజర్లో ఎలాంటి దృశ్యాలూ కనిపించవు. అమెరికా జాతీయ జెండా మాత్రం కనిపిస్తుంది. జెండాపై ఉన్న తెలుపు భాగంలో ‘నిఘా నీడలో... అందరికీ న్యాయం, స్వేచ్ఛ’ అనే క్యాప్షన్ ఒకటి ఆకర్షణీయంగా మెరుస్తుంటుంది. ట్రైలర్: మసాన్ నిడివి: 2 ని. 32 సె. హిట్స్: 12,01,474 కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘మసాన్’ చిత్రానికి అనూహ్యమైన స్పందన లభించింది. దర్శకుడు నీరజ్కు ఇది తొలి సినిమా. ఒక చిన్న పట్టణంలో నలుగురు సాధారణ వ్యక్తుల జీవితం ఆధారంగా ఈ కథ నడుస్తుంది. రీచా చద్దా అభినయానికి మంచి పేరు వస్తోంది. సామాజిక వాస్తవాల ఆధారంగా మరిన్ని సినిమాలు తీయాలనుకుంటున్నాడు నీరజ్. ‘మసాన్’కు ఇప్పటికే మీడియాలో మంచి ప్రచారం లభించింది. సినిమా జూలై 24న విడుదల కానుంది. -
హరేకృష్ణా ఆలయమే అన్నం పెట్టింది!
కష్టకాలం యాపిల్ కంపెనీ వ్యవస్థాపకుడు స్టీవ్జాబ్స్ ఎదుగుదల ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథమే. అత్యంత దుర్భరమైన పరిస్థితుల నుంచి ఎదిగి, ప్రపంచానికి ‘ఐ ఫోన్’ అనే గిఫ్ట్ను ఇచ్చిన జాబ్స్ తన ఉన్నతి గురించే కాదు, జీవితంలో తను పడిన ఇబ్బందులను గురించి చెప్పుకోవడానికీ ఏనాడూ వెనుకాడలేదు. ఇలా జాబ్స్ 2005లో స్టాన్పోర్డ్ వర్సిటీలో చేసిన ప్రసంగంలో తన ప్రస్థానం గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. ‘‘నాకు కాలేజీ డార్మ్రూమ్ ఉండేది కాదు. స్నేహితుల గదుల్లో తలదాచుకొనే వాడిని, గచ్చు మీదే నిద్రపోయేవాడిని. ఇక తిండి మరో కష్టం. దీని కోసం ఎన్నో పాట్లు పడ్డాను. అయితే వారానికి ఒకసారి మాత్రం మంచి భోజనం కడుపారా తినేవాడిని. అది హరేకృష్ణా టెంపుల్లో. ఆదివారం రాత్రికల్లా ఉచితంగా భోజనం పెట్టే అక్కడికి చేరుకొనేవాడిని. దీని కోసం ఏడు కిలోమీటర్ల దూరం నడిచేవాడిని. ఇప్పుడు ఆ కష్టాలన్నీ రొమాంటిక్ అనిపిస్తాయి..’’ అని జాబ్స్ ఆ ప్రసంగంలో హరేకృష్ణా టెంపుల్ తనను ఏ విధంగా ఆదరించిందీ వివరించారు. -
టిమ్ కుక్ 'గే' ఎఫెక్ట్: స్టీవ్ జాబ్స్ విగ్రహం ధ్వంసం!
మాస్కో: ఆపిల్ కంపెనీ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ విగ్రహాన్ని ధ్వంస చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రష్యాలోని సెయింట్ పీటర్ బర్గ్ లో గత శుక్రవారం చోటు చేసుకుంది. తాను స్వలింగ సంపర్కుడినని ఆపిల్ కంపెనీ ప్రస్తుత సీఈవో టిమ్ కుక్ వెల్లడించిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐఫోన్ రూపంలో ఆరు అడుగుల స్టీవ్ జాబ్స్ విగ్రహాన్ని సెయింట్ పీటర్స్ బర్గ్ కాలేజీ ఆవరణలో 2013 సంవత్సరం జనవరిలో రష్యాకు చెందిన జెడ్ఈఎఫ్ఎస్ గ్రూప్ ప్రతిష్టించింది. స్వలింగ సంపర్కులకు వ్యతిరేకంగా జెడ్ఈఎఫ్ఎస్ సంస్థ ప్రచారం నిర్వహిస్తోంది. ఈ కారణంగా తాము స్టీవ్ జాబ్స్ విగ్రహాన్ని తొలగించినట్టు ఆ సంస్థ తెలిపింది. -
స్టీవ్ జాబ్స్ బ్రతికే ఉన్నాడా?
బ్రెజిల్:ఆపిల్ సృష్టికర్త స్టీవ్ జాబ్స్ బ్రతికే ఉన్నాడా? ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వార్త ఇది. బ్రెజిల్ లో స్టీవ్ జాబ్స్ బ్రతికే ఉన్నాడని వార్తలతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2011 అక్టోబర్లో కేన్సర్తో చనిపోయిన స్టీవ్ జాబ్స్ బ్రతికే ఉన్నాడనే ఊహాగానాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. అందుకు కారణం స్టీవ్ సజీవంగానే ఉన్నాడనే సెల్ఫీ ఫోటోనే. బ్రెజిల్ లోని ఒక నగరంలో స్టీవ్ నివసిస్తున్నాడనేది ఆ ఫోటో సారాంశం. వీల్ చైర్ లో దర్శనమిచ్చిన ఆ ఫోటోలోని వ్యక్తి స్టీవ్ జాబ్స్ ను పోలి ఉండటం కాస్తా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆ ఫోటో క్రింద 'స్టీవ్ జాబ్స్ ఇజ్ ఇన్ రియో డి జనిరియో' అనే ఒక క్యాప్షన్ కూడా ఉంది. గత మూడు సంవత్సరాల క్రితం ఆయన చనిపోయే సమయానికి జీవిత చరిత్ర ‘స్టీవ్ జాబ్స్’ అనే పుస్తకం కూడా వెలువడింది. దీనికి గ్రంథకర్త వాల్టర్ ఐజాక్సన్. జాబ్స్తో ఐజాక్సన్కి చాలా సాన్నిహిత్యం ఉండేదట. రెండేళ్ల వ్యవధిలో దాదాపు నలభైసార్లు జాబ్స్ని ఇంటర్వ్యూ చేశారు ఐజాక్సన్. జాబ్స్ ఎక్కడా దేవుడి గురించి మాట్లాడలేదు. ఓసారి మాత్రం ఆ సందర్భం వచ్చింది. మాటల మధ్యలో - ‘‘దేవుణ్ణి మీరు విశ్వసిస్తారా?’’ అని అడిగారు ఐజాక్సన్. ‘‘ఏమో చెప్పలేను ఫిఫ్టీ ఫిఫ్టీ’’ అన్నారు జాబ్స్. ‘‘కానీ ఒకటనిపిస్తోంది. ఈ జన్మలో మనం సంపాదించిన జ్ఞానం, పోగేసుకున్న వివేకం మన మరణం తర్వాత ఎలాగో కొనసాగుతాయని’’ అన్నారు. కొన్ని క్షణాల మౌనం తర్వాత మళ్లీ అన్నారు. ‘‘ఈ జనన మరణాలన్నవి ఆన్-ఆఫ్ లాంటివి అనిపిస్తుంది. ఆఫ్ క్లిక్ చేస్తే ఇక అంతే. అయిపోయినట్లు. ముగిసినట్లు. ఆపిల్ పరికరాలకు కూడా ఆన్-ఆఫ్ స్విచ్ పెట్టడం నాకు ఇష్టముండేది కాదు’’ అని చెప్పారని ఐజాక్స్ వెల్లడించారు. -
స్టీవ్ జాబ్స్తో మా జాబులు గల్లంతు...
స్టాక్హోం: ఆపిల్ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్ జాబ్స్పై ఫిన్లాండ్ ప్రధాని అలెగ్జాండర్ స్టబ్ అక్కసు వెళ్లగక్కారు. స్టీవ్ జాబ్స్ కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేసి విక్రయించడం వల్లే తమ దేశంలో పలువురు ఉద్యోగాలు కోల్పోయారనీ, ఫిన్లాండ్ కంపెనీలు ఆత్మరక్షణలో పడిపోయాయనీ చెప్పారు. ‘మా ఆర్థిక వ్యవస్థ ఐటీ, పేపర్ అనే రెండు దిమ్మెలపై నిలబడి ఉండేది. ఐఫోన్ రాకతో నోకియా (ఫిన్లాండ్ కంపెనీ) సంక్షోభంలో పడిపోయింది. ఐప్యాడ్ ప్రవేశంతో పేపరు వినియోగం క్షీణించింది..’ అని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టబ్ వ్యాఖ్యానించారు. మొబైల్ పరికరాల ఉత్పత్తిలో ఒకనాడు ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిన నోకియా సంక్షోభంలో చిక్కుకోవడంతో ఫిన్లాండ్కు కష్టాలు మొదలయ్యాయి. హ్యాండ్సెట్ల వ్యాపారాన్ని నోకియా గత ఏప్రిల్లో అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్కు విక్రయించింది. రెండేళ్లు పీడించిన ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కేందుకు ఫిన్లాండ్ అష్టకష్టాలు పడుతోంది. ఈ నేపథ్యంలోనే స్టబ్ గత నెలాఖరులో ఆ దేశ ప్రధానమంత్రి అయ్యారు. ‘మార్పు ఇప్పుడే మొదలైంది. మా ఐటీ పరిశ్రమ గేమింగ్ వైపు మళ్లుతోంది.. అడవులు కాగితం ఉత్పత్తి కేంద్రాలుగా కాకుండా బయోఎనర్జీ సెంటర్లుగా ఆవిర్భవిస్తున్నాయి. దేశం వెంటనే ఆర్థికాభివృద్ధి సాధిస్తుందని నేను చెప్పలేను. జాతీయ స్థాయిలో సంస్థాగత సవరణలు, ఈయూ మార్కెట్ సరళీకరణ, ప్రపంచస్థాయిలో వ్యాపారాన్ని పెంచుకోవడం అనే మూడు చర్యలతో అభివృద్ధిని వేగవంతం చేయవచ్చు...’ అని ఆయన పేర్కొన్నారు. -
మరణానికి కొన్ని నెలల ముందు...
నమో నాస్తికా! ఆపిల్ కంపెనీ సీఈవో స్టీవ్ జాబ్స్ పాంక్రియాస్ కేన్సర్తో చనిపోయేనాటికి ఆయన వయసు యాభై ఆరు. 2011 అక్టోబర్లో ఆయన చనిపోయారు. అదే నెలలో ఆయన జీవిత చరిత్ర ‘స్టీవ్ జాబ్స్’ వెలువడింది. గ్రంథకర్త వాల్టర్ ఐజాక్సన్. జాబ్స్తో ఐజాక్సన్కి చాలా సాన్నిహిత్యం ఉంది. రెండేళ్ల వ్యవధిలో దాదాపు నలభైసార్లు జాబ్స్ని ఇంటర్వ్యూ చేశారు ఐజాక్సన్. జాబ్స్ ఎక్కడా దేవుడి గురించి మాట్లాడలేదు. ఓసారి మాత్రం ఆ సందర్భం వచ్చింది. ఓ మధ్యాహ్నం జాబ్స్ ఇంటి వెనుక లాన్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు జాబ్స్, ఐజాక్సన్. మాటల మధ్యలో - ‘‘దేవుణ్ణి మీరు విశ్వసిస్తారా?’’ అని అడిగారు ఐజాక్సన్. ‘‘ఏమో చెప్పలేను ఫిఫ్టీ ఫిఫ్టీ’’ అన్నారు జాబ్స్. ‘‘కానీ ఒకటనిపిస్తోంది. ఈ జన్మలో మనం సంపాదించిన జ్ఞానం, పోగేసుకున్న వివేకం మన మరణం తర్వాత ఎలాగో కొనసాగుతాయని’’ అన్నారు. కొన్ని క్షణాల మౌనం తర్వాత మళ్లీ అన్నారు. ‘‘ఈ జనన మరణాలన్నవి ఆన్-ఆఫ్ లాంటివి అనిపిస్తుంది. ఆఫ్ క్లిక్ చేస్తే ఇక అంతే. అయిపోయినట్లు. ముగిసినట్లు. అందుకేనేమో ఆపిల్ పరికరాలకు ఆన్-ఆఫ్ స్విచ్ పెట్టడం నాకు ఇష్టముండేది కాదు’’ అని చెప్పారు. మరణానికి ముందు కొన్ని నెలలు జాబ్స్, జీవితం గురించి దేవుడి ఉనికి గురించి ఎక్కువగా ఆలోచించారని ఐజాక్సన్ రాశారు. -
సత్వం: సింపుల్ స్టీవ్
ఒక శిల్పాన్ని మైకేలాంజిలో ఒక్కడే అత్యద్భుతంగా చెక్కగలడు; కానీ కంపెనీలను నడపడం ఏ ఒక్కరివల్లో కాదు, వేలాది మంది కావాలి, అందరూ బ్రహ్మాండమైన వాళ్లు కావాలి. క్రీములోంచి క్రీమును తీసుకోవాలి. - స్టీవ్ జాబ్స్ ఫిబ్రవరి 24న స్టీవ్ జాబ్స్ జయంతి గోడలకు వేసే సున్నం కూడా ‘ప్యూర్’ వైట్గా ఉండాలనేవాడట స్టీవ్ జాబ్స్. మామూలు తెలుపు కాదు; స్వచ్ఛమైన తెలుపు! ఒక ఉత్పత్తి ఎలా ఉండాలీ అన్న విషయంలో స్టీవ్జాబ్స్కు చాలా స్పష్టత ఉంది. సాధారణంగా ఉండాలి. స్వచ్ఛంగా ఉండాలి. ‘సంక్లిష్టంగా కన్నా సింపుల్గా ఉండటం కష్టం. సింపుల్గా ఉండాలంటే నీ ఆలోచనలన్నింటినీ ఒక కొలిక్కి తెచ్చుకోవాల్సి ఉంటుంది’ అంటాడు జాబ్స్. స్టీవ్ అభిమానించే జర్మన్ ఇండస్ట్రియల్ డిజైనర్ డైటర్ రామ్స్ ఒక మాట చెబుతుంటాడు: ‘ఏ ప్రొడక్టయినా ఇంగ్లీష్ బట్లరులా ఉండాలి. కళ్లముందు కనబడకూడదు; కానీ ఎప్పుడూ అందుబాటులో ఉండాలి’. ఈ విధానాన్నే ‘యాపిల్’ ఉత్పత్తుల డిజైన్లలో జాబ్స్ అనుసరించాడు. చిత్రంగా, స్టీవ్ జీవితం చాలా సంక్లిష్టంగా సాగింది. సాధారణతనూ, అందునా స్వచ్ఛత కోసం తహతహలాడటం వెనుకా ఈ కారణాలూ ఉండొచ్చు. స్టీవ్జాబ్స్ జీవితం సున్నా నుంచి కూడా మొదలుకాలేదు; మైనస్తో ప్రారంభమైంది. పెళ్లికాని ప్రేమికుల అవాంఛిత గర్భంగా జన్మించాడు. పెంపుడు తల్లిదండ్రుల దగ్గర పెరిగాడు. ఐదు సెంట్ల కోసం ఖాళీ కోక్ సీసాలు ఏరాడు. కాలేజ్ డ్రాపౌట్, హిప్పీల ప్రభావం, డ్రగ్స్తో స్నేహం, వ్యక్తిగత అశాంతి, ఆధ్యాత్మికతను అన్వేషిస్తూ 1973లో యువకుడిగా భారతదేశం రావడం, నీమ్ కరోలీబాబాను కలిసిన తర్వాత బౌద్ధం వైపు మొగ్గడం, ఆహార్యం మార్చుకోవడం, గుండు కొట్టించుకోవడం, అమెరికాకు తిరిగివెళ్లడం, ‘యాపిల్ కంప్యూటర్’ స్థాపించడం, పర్సనల్ కంప్యూటర్స్, టాబ్లెట్స్, మ్యూజిక్, యానిమేషన్ రంగంలో తనదైన ముద్ర వేసిన ఆలోచనాపరుడిగా పేరుగడించడం... సినిమా కథలా లేదూ! తర్వాత ఆధ్యాత్మికతను ‘గట్టున’ పెట్టినా ‘మినిమలిస్ట్’గానే బతికాడు స్టీవ్. ఆయన ఇంట్లో పెద్దగా సామాన్లు, ఫర్నిచర్ కూడా ఉండేవికాదట! ఐన్స్టీన్ ఫొటో మాత్రం ఉండేది. ‘తనచుట్టూ వస్తువులు ఉండాలని కోరుకోరు. ఉన్నవాటి గురించి మాత్రం పర్టిక్యులర్గా ఉంటారు’ అంటారు స్టీవ్తో పనిచేసిన జాన్ స్కలీ. ఈ జాన్ స్కలీ ‘పెప్సీ’ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, ‘అక్కడే తియ్యటినీళ్లను అమ్ముతూ జీవితాంతం గడుపుతావా? లేదా ప్రపంచాన్ని మార్చడానికి ఒక అవకాశం కోరుకుంటావా?’ అని తన దగ్గరికి పిలుచుకున్నాడు స్టీవ్. తనతో పనిచేసేవాళ్లు ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉండాలని కోరుకుంటాడు స్టీవ్. ‘ఒక శిల్పాన్ని మైకేలాంజిలో ఒక్కడే అత్యద్భుతంగా చెక్కగలడు; కానీ కంపెనీలను నడపడం ఏ ఒక్కరివల్లో కాదు, వేలాది మంది కావాలి, అందరూ బ్రహ్మాండమైన వాళ్లు కావాలి. క్రీములోంచి క్రీమును తీసుకోవాలి’ అనేవాడు. ‘ఒక భాగస్వామిని ఎన్నుకునేప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటాం? ఎందుకంటే అతడు నీ సగం కంపెనీ. అలాంటప్పుడు మూడో వ్యక్తిని తీసుకునేప్పుడు? నాలుగు? ఐదు? ఒక కంపెనీని ప్రారంభించినప్పుడు తీసుకున్న మొదటి పదిమంది మీదే కంపెనీ విజయమో, అపజయమో ఆధారపడి ఉంటుంది’ అంటాడు జాబ్స్. గుప్పెడు పాటలు జేబులో ఉంటే చాలనుకునే వినియోగదారుడికి దోసిళ్లకొద్దీ పాటలు చెవుల్లో పోశాడు జాబ్స్. అయితే, ‘ఒక ఉత్పత్తి బంగారుబాతని తెలిసిపోయాక, ఏ కంపెనీనైనా దాన్నే నమ్ముకుని సుదీర్ఘంగా అక్కడే ఆగిపోతుంది. సృజన మందగిస్తుంది. ఈలోపు జరిగే సాంకేతిక మార్పుల్ని అందుకోలేక ఆ కంపెనీ అక్కడే నిలిచిపోతుంది, దాంతో పోటీదారులు దూసుకెళ్లిపోతారు’ అనేవాడు. అందుకే తమ ‘యాపిల్’ ఉత్పత్తులు ఏ ఒక్కదానికో పరిమితం కాకుండా చూసుకున్నాడు. ‘నేను ఏదో ఒకరోజు చనిపోతానని గుర్తుంచుకోవడమే నా జీవితంలోని ఎంపికలని ప్రభావితం చేసింది. బయటి అంచనాలు, గర్వం, ఓటమి భయం ఇవేవీ మృత్యువు ముంగిట నిలవ్వు. బయటి రణగొణధ్వనుల్లో నీ అంతర్వాణి వినకుండాపోయే పరిస్థితి తెచ్చుకోవద్దు’ అని చెప్పిన స్టీవ్జాబ్స్ 2011లో తన 56వ ఏట క్యాన్సర్తో మరణించాడు. మనుషులకన్నా వాళ్లు చేసే పని గొప్పదనేవాడు స్టీవ్. ఆయన గొప్పతనం ‘యాపిల్’ రూపంలో కనబడుతూనే వుంది. -
విజయవంతమైన అపజయాలు..!
వారి జీవితాలు వ్యక్తిత్వ వికాస గ్రంథాలు. ఉక్కిరిబిక్కిరి చేసే కష్టాల్లో కూడా వారి వ్యక్తిత్వాలు ఊరటనిస్తాయి. ‘నేటి పరాజయమే రేపటి విజయానికి సూచిక’ అనే స్ఫూర్తిని పంచుతాయి. ఓటమి ఎన్నడూ జీవితానికి ముగింపు కాదు... అన్న సత్యాన్ని చాటి చెబుతాయి. విజయం కోసం కసితో ప్రయత్నించాలనే సందేశాన్ని ఇస్తాయి. వారి తొలి ప్రయత్నాలు ఫెయిలయ్యాయి. పలువురి హేళనకు గురయ్యాయి. అయితే ఆ అపజయాల బాటే అంతిమంగా విజయం ముంగిటకు చేర్చింది. ఈ ప్రస్థానాన్ని బట్టి వారి వైఫల్యాలను ఫెయిల్యూర్స్ గా చూడలేం. ఆ అపజయాలను విజయానికి సోపానాలుగా భావిస్తే, యువత వాటినుంచే స్ఫూర్తిని అలవరచుకోవచ్చు! అసమర్థుడే... విజేత అయ్యాడు! సంపన్న కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యమే కానీ.. చర్చిల్ వ్యక్తిగత జీవితంలో అసమర్థుడనే పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో వైఫల్యాల మధ్య 62 యేళ్ల వయసుకు బ్రిటన్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యాక గానీ చర్చిల్ సమర్థత ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. ఆరో తరగతి ఫెయిలైన ఆయనే నోబెల్ బహుతి స్థాయికి ఎదిగాడంటే ఆశ్చర్యం కలగమానదు. దీనికంతటికీ ఆయన పట్టుదల, కృషే కారణం. అందుకే ఆయన జీవితం నుంచి ఎంతో స్ఫూర్తిని పొందవచ్చు. పరాజయం అతడి పుట్టినిల్లు! అమెరికా అధ్యక్షపీఠం అనే అంతిమ విజయం సాధించేంత వరకూ ప్రతి అధ్యాయంలోనూ లింకన్ జీవితంలో అన్నీ ఎదురుదెబ్బలే. ఒక వ్యక్తి తన జీవితంలో ఎన్ని రకాలుగా ఎదురుదెబ్బలు తినగలడో అన్నిరకాలుగానూ విధి లింకన్ జీవితంలో ఆడుకుంది. అయితే వాటన్నింటికీ ఎదురునిలిచి అత్యున్నత స్థాయికి చేరగలడమే అబ్రహం లింకన్ను ఒక చెక్కుచెదరని ధీశాలిగా ప్రపంచం ముందు నిలిపింది. చీకటి నుంచి పుట్టిన దివ్వె... ఇప్పుడంటే.. ఆమెను అంతా ‘నల్లకలువ’గా కీర్తిస్తున్నారు, ఆమె సంపాదనను చూసి నోళ్లు వెళ్లబెడుతున్నారు. ప్రస్తుతం బుల్లితెర మీద ఆమెను టాక్ షోల రాణిగా చూస్తున్నారు కానీ.. బాల్యం నుంచి ఒక నీగ్రోగా ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వాటన్నింటినీ తట్టుకొని ఈ స్థాయికి ఎదిగిందంటే.. ఓప్రా ఓరిమికి హ్యాట్సాఫ్ చెప్పవచ్చు. ప్రపంచం తక్కువ అంచనా వేసింది... సినిమా మేకింగ్కు సంబంధించి స్పీల్బర్గ్ సినిమాలు ఇప్పుడు ఎంతోమందికి అత్యుత్తమ గ్రంథాలు. సినిమా సక్సెస్కు అవి సిలబస్ లాంటివి. అదంతా ఇప్పుడు... దర్శకుడు కాక ముందు స్పీల్బర్గ్ కాలిఫోర్నియా స్కూల్ ఆఫ్ థియేటర్లో బీఏ చదవడానికి దరఖాస్తు చేసుకుంటే... తిరస్కరణకు గురయ్యింది. ఒకసారి కాదు రెండు సార్లు కాదు... మూడుసార్లు! ఈ దిగ్దర్శకుడికి ఆర్ట్స్లో బ్యాచిలర్ డిగ్రీ చేయడానికి కూడా అర్హత లేదని డిసైడ్ చేసింది యూనివర్సిటీ. తనకు ఇంత అవమానాన్ని మిగిల్చిన డిగ్రీని మాత్రం ిస్పీల్బర్గ్ అంత తేలికగా వదల లేదు. దర్శకుడిగా మారిన ఎన్నో ఏళ్ల తర్వాత... 2002లో గ్రాడ్యుయేషన్ మీద తన కసి తీర్చుకున్నాడు. ఒంటరిగా అడ్డంకులు దాటిన వండర్... హ్యారీ పోటర్ సిరీస్తో ప్రపంచానికి ఒక మాయ ప్రపంచాన్ని పరిచయం చేసిన రౌలింగ్ ఘనతను ప్రపంచం అంత సులువుగా గుర్తించలేదు. ఈ రచనలను అచ్చొత్తించడానికి ఒక్క పబ్లిషర్ కూడా ముందుకు రాలేదు. వ్యక్తిగతంగా కూడా అనేక కష్టాలు. వైవాహికజీవితం విఫలమైంది. పిల్లలు కూడా ఆమెకు భారమే అయ్యారు. అలా డిపెండెంట్ హోదాలో ఉన్న రౌలింగ్ ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ధనిక మహిళల్లో ఒకరిగా నిలిచారు. - జీవన్రెడ్డి