sunitha reddy
-
వధూవరులకు వైఎస్ జగన్ ఆశీస్సులు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ నేత అవుతు సునీతారెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ కార్యక్రమం గురువారం గుంటూరు జిల్లా కుంచనపల్లిలోని శ్రీ శ్రీనివాస కన్వెన్షన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరై నూతన వధూవరులు శ్రీవల్లి, రవితేజరెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసి.. ఆశీర్వదించారు. -
మహానటి సునీత..
-
వైఎస్ వివేకా కేసు..బయటపడ్డ కుట్ర..పుత్రిక డ్రామా
-
Watch Live: మీడియాతో ఎంపీ అవినాష్రెడ్డి
-
చీకటి ఒప్పందం వల్లే నాపై కుట్రలు సునీత బండారం బయటపెట్టిన అవినాష్ రెడ్డి
-
‘దస్తగిరిని అడ్డంపెట్టుకుని సునీత నాటకమాడుతోంది’
సాక్షి, వైఎస్సార్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీత చెప్పేవన్నీ అబద్ధాలేనని దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘దస్తగిరి వాంగ్మూలాన్ని నిజం చేసే ప్రయత్నం జరుగుతుంది. సీబీఐ వద్ద దస్తగిరి స్టేట్మెంట్ తప్ప ఏ ఒక్క ఆధారం లేదు. సునీత దస్తగిరిని అడ్డంపెట్టుకుని ఓ బూటకం ఆడుతుంది. ఇంటి తలుపులు బద్దలైతే అన్నీ బాగున్నాయని సీబీఐకి చెప్పింది. ఇంటి తలుపులు బద్దలు కొట్టారనేది విడిచిపెట్టి ఇంట్లో వాళ్లే చంపారని సునీత ప్రస్తావిస్తోంది. చంపినప్పుడు లెటర్ రాశాడన్నారు, చేతి వేళ్లు నరికితే రక్తపు మరకలు ఉండవా.. అసలు ఎలా రాయగలడు?. దస్తగిరి, రంగన్న చెప్పిన సమాచారం పూర్తి విరుద్ధంగా ఉంది. రెండో భార్య సమీమ్కు ఆస్తి గొడవలున్నాయి. ఆస్తి పత్రాలు దొంగిలించాల్సిన అవసరం ఎవరికి ఉంది?. దీన్ని కూడా సీబీఐ పట్టుకోలేకపోయింది’ అని డాక్టర్ చైతన్యరెడ్డి తెలిపారు. -
షర్మిల, సునీతలు శత్రువుల చేతుల్లో కీలుబొమ్మలు: వైఎస్సార్ సోదరి విమలమ్మ
సాక్షి, అమరావతి: ‘వైఎస్ కుటుంబ ఆడపడుచులు షర్మిల, సునీత అన్యాయంగా మాట్లాడుతున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి కుటుంబ గౌరవానికి భంగం కలిగిస్తున్నారు. నేనూ వైఎస్ కుటుంబ ఆడపడుచునే. వివేకానందరెడ్డి అందరికంటే నాకే ఎక్కువ సన్నిహితుడు. ఆ కుటుంబ ఆడపడుచుగా చెబుతున్నా.. మా అన్నయ్య వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో ఎంపీ అవినాష్రెడ్డికిగానీ వైఎస్ భాస్కర్రెడ్డికిగానీ ఎలాంటి సంబంధంలేదు’.. అని వైఎస్ రాజశేఖర్రెడ్డి సోదరి విమలమ్మ విస్పష్టంగా ప్రకటించారు. ‘కొంగు పట్టుకుని షర్మిల ఓట్లు అడుగుతున్న వీడియో చూసి చాలా బాధపడ్డాను. వైఎస్ కుటుంబ పరువును ఆమె రోడ్డుకీడుస్తున్నారు. ఆమెలో నాయకత్వ లక్షణాల్లేవు. నిత్యం వైఎస్ అవినాష్ను విమర్శిస్తున్నారు. అతను హత్యచేయడంగానీ చేయించడంగానీ వాళ్లు చూశారా? సీఎం జగన్పై కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరు హత్యచేశారో షర్మిల, సునీతే నిర్ణయించేస్తే ఇక కోర్టులు, జడ్జీలు ఎందుకు?’ అని ఆమె సూటిగా ప్రశ్నించారు. విజయవాడలో శనివారం విమలమ్మ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పలు కీలక అంశాలపై ఇలా సూటిగా స్పందించారు. ఆమె ఇంకా ఏమన్నారంటే.. వైఎస్సార్ శత్రువుల చేతుల్లో కీలుబొమ్మలుగా షర్మిల, సునీత.. వైఎస్ రాజశేఖరరెడ్డి శత్రువులంతా ఒక్కటయ్యారు. ఈ తరుణంలో వైఎస్ కుటుంబం అంతా కలిసికట్టుగా ఉండాలి. కానీ, వైఎస్ శత్రువుల చేతుల్లో షర్మిల, సునీత కీలుబొమ్మలయ్యారు. వాళ్లిద్దరి చూట్టూ ప్రస్తుతం వైఎస్ కుటుంబ శత్రువులే ఉన్నారు. షర్మిల, సునీతలకు చెబుతున్నా.. వారు నోరు మూసుకోవాలి. పేద ప్రజలకు మంచి చేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూడటం సరికాదు. వారిద్దరూ ఎందుకిలా చేస్తున్నారో అర్థంకావడంలేదు. డబ్బు కోసమో పదవి కోసమే తెలీడం లేదుగానీ అసూయ, ద్వేషంతో వ్యవహరిస్తున్నారు. ఏదో ఆశించే ఇదంతా చేస్తున్నారు. జగన్ సీఎం అయ్యాక బంధువులు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని దూరం పెట్టారు. వాళ్ల పనులు కావడంలేదనే ఇలా ప్రవర్తిస్తున్నారనిపిస్తోంది. వారికి మంచి చెప్పాలని చూశాను. అప్పటి నుంచి నాతో మాట్లాడటం మానేశారు. హంతకుడు దస్తగిరి దర్జాగా తిరుగుతున్నాడు.. షర్మిల, సునీత తామేది మాట్లాడినా చెల్లుతుందని అనుకుంటున్నారు. మా ఇంట్లో అమ్మాయిలు ఇలా అన్యాయంగా మాట్లాడుతుంటే బాధ కలుగుతోంది. వివేకానందరెడ్డిని కిరాతకంగా హత్యచేశాను అని చెప్పిన దస్తగిరి మాత్రం బయట దర్జాగా తిరుగుతున్నాడు. అతని మాటలు నమ్మి అవినాష్రెడ్డిని విమర్శిస్తారా? ఏ తప్పూ చేయని వైఎస్ భాస్కర్రెడ్డి ఏడాదిగా జైల్లో ఉన్నారు. అవినాష్ బెయిల్ రద్దుచేయాలని షర్మిల, సునీత కోర్టులో కేసులు వేశారు. కానీ, వివేకాను హత్యచేశాను అని చెప్పిన దస్తగిరి బెయిల్పై ఉన్నా వారెందుకు పట్టించుకోవడంలేదు? షర్మిల, సునీత ఎన్ని మాటలంటున్నా అవినాష్ ఒక్క మాటా కూడా అనడంలేదు. వైఎస్కు వివేక ఎలాగో.. జగన్కు అవినాశ్ అలా.. వైఎస్ రాజశేఖర్రెడ్డి, వివేకానందరెడ్డి ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. రాజశేఖర్రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బాధ్యతలు చూసేవారు. అందుకే పులివెందుల, కడప జిల్లాలో పార్టీ బాధ్యతలను వివేకాకు అప్పగించారు. వారిద్దరిలో ఒకరు ఎంపీగా పోటీచేస్తే మరొకరు ఎమ్మెల్యేగా పోటీచేసేవారు. అలా ఓటమి అన్నది లేకుండా గెలుస్తూ వచ్చారు. నాడు వైఎస్ రాజశేఖర్రెడ్డికి వివేకానందరెడ్డి ఎలానో ప్రస్తుతం వైఎస్ జగన్కు వైఎస్ అవినాశ్ అలా అండగా ఉన్నారు. కానీ, వైఎస్ హఠాన్మరణం తర్వాత మారిన పరిస్థితుల్లో వైఎస్ జగన్ తన తండ్రి ఆశయ సాధన కోసం పార్టీ పెట్టారు. దురదృష్టవశాత్తూ ఆనాడు వివేకానందరెడ్డి కాంగ్రెస్ వైపు ఉండిపోయారు. ఆ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా జగన్ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బాధ్యతలు చూసుకోవాల్సి వచ్చింది. అందుకే పులివెందుల, కడప జిల్లాల్లో పార్టీ బాధ్యతలను చూసుకునేందుకు అవినాష్రెడ్డిని ఎంపిక చేసుకున్నారు. దీంతో అవినాష్ తనపై పెట్టిన బాధ్యతను ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు. పులివెందులను, కడప జిల్లాను అభివృద్ధి చేస్తున్నారు. అసలు అవినాష్ను ఎంపీగా గెలిపించాలనే వివేకానందరెడ్డి చివరివరకూ ప్రచారం చేశారు కదా. ఈ విషయాన్ని గుర్తించయినా షర్మిల, సునీత అవినాష్ మీద దుష్ప్రచారాన్ని మానుకోవాలి. ప్రజలకు మంచి చేస్తున్న జగన్కు అండగా నిలవాలి. వారిద్దరూ మరోసారి కూర్చుని చర్చించి జగన్కు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా. ఎందుకంటే జగన్ శత్రువులంతా ఒక్కటయ్యారు. బయట శత్రువులంతా ఒక్కటైతే కుటుంబం అంతా కలిసికట్టుగా ఉండి ఎదుర్కోవాలి. ఆ కుటుంబ ధర్మాన్ని పాటించాలని షర్మిల, సునీతలకు సూచిస్తున్నా. జగన్ను మళ్లీ సీఎంను చేయండి.. ఇక వైఎస్ రాజశేఖరరెడ్డి కోట్లాది మంది ప్రజల గుండెల్లో దేవుడిగా ఉన్నారు. వైఎస్, వివేకా ఇద్దరూ ఫ్యాక్షన్ రాజకీయాలకు వ్యతిరేకం. మా నాన్నను హత్యచేసిన తరువాత కూడా ఎలాంటి ప్రతికార రాజకీయాలకు పాల్పడకుండా వారు ఫ్యాక్షన్ను అంతంచేశారు. కానీ, ప్రశాంతంగా ఉన్న పులివెందులలో ప్రస్తుతం కొందరు అల్లర్లు రేకెత్తించేందుకు యత్నిస్తుండటం బాధ కలిగిస్తోంది. తండ్రి రాజశేఖర్రెడ్డి ఆశయాలను సాధించేందుకు జగన్ ప్రజలకు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. పేద ప్రజలకు అంత మంచి చేస్తున్న జగన్ మరోసారి సీఎం కావాలి. అందుకోసం రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు అందరినీ గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. -
వైఎస్ విమలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
ఒక్కొకరుగా ముసుగు తీస్తున్నారు.. కుట్ర క్లియర్..
-
CbnPolitricks: ముసుగు తీద్దామా? వద్దా?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఐదో వర్థంతి నాడు(మార్చి 15న).. ఆయన కుమార్తె సునీత రాజకీయ ప్రకటన చేయబోతున్నట్లు పులివెందులలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే తండ్రి హత్య కేసులో ఆయన ప్రత్యర్థి వర్గంతోనే మొదటి నుంచి వెంట నడుస్తున్న సునీత.. ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ విషయంలోనూ ఆ వర్గం సూచనలే పాటించబోతున్నట్లు స్పష్టమౌతోంది. ఈ క్రమంలో ఆమెకు ఊహించని ఝలక్ సైతం తగిలినట్లు సమాచారం!. తండ్రి వివేకా వర్థంతినాడు రాజకీయానికి నర్రెడ్డి సునీత సిద్ధమైంది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగడమే కాదు.. మరో నెలరోజుల్లో జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని బలంగా నిర్ణయించుకున్నారని ఆమె వర్గీయులే ఇప్పుడు చర్చిస్తున్నారు. ఇందుకోసం ముందుగానే.. ‘వివేకా కుటుంబం ఎన్నికల్లో పోటీ చేస్తే బాగుంటుంది’ అంటూ ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్రెడ్డితో లీకులు చేయించి గ్రౌండ్ లెవల్లో రెడీ అయ్యారు. తొలుత వివేకా మొదటి భార్య సౌభాగ్యమ్మ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగినా.. ఈ లిస్ట్లో ఇప్పుడు సునీత కూడా చేరారు. టీడీపీ అభ్యర్థిగానే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆమె ఉవ్విళ్లూరుతున్నట్లు సమాచారం. సునీత మనసులో.. తల్లి సౌభాగ్యమ్మ కాదు.. తెలుగు దేశం కండువా తానే కప్పుకోవాలి.. టీడీపీ అభ్యర్థిగానే కడప ఎంపీ లేదంటే పులివెందుల అసెంబ్లీకి పోటీ చేయాలి. ఒకవేళ మరీ వ్యతిరేకత కనిపిస్తే అప్పుడు తల్లిని సీన్లోకి తెచ్చి సానుభూతి ఓట్లకు ట్రై చేద్దాం.. ఇదీ సునీత మనసులో మాటగా పులివెందుల రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వివేకా కేసుపై మాట్లాడే వంకతో.. మొన్నీమధ్యే ఢిల్లీలో ప్రెస్మీట్ పెట్టి మరీ చంద్రబాబుకు ధన్యవాదాలు తెలపడంతో తన పని మరింత తేలికైందని భావించారామె. అయితే.. ఇక్కడే చంద్రబాబు తన మార్క్ చూపించారు. అలా ఇచ్చేస్తే.. ఎలా? పులివెందుల పరిణామాలపై అప్రమత్తమైన చంద్రబాబు.. కొందరు టీడీపీ పెద్దల్ని సునీతతో మాట్లాడించారు. ఒకవేళ సునీతకు టికెట్ ఇస్తే ఇన్నాళ్లూ చేసిన విమర్శలకు విలువ లేకుండా పోతుందని.. టీడీపీకి ఆమె అందిస్తున్న చీకటి సహకారం గురించి ప్రజల్లోకి బలంగా వెళ్తుందని ఆమెకు సర్దిచెప్పే యత్నం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి తెలుగుదేశం కండువా కప్పుకునే ఆలోచన పక్కనపెట్టాలని.. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని ఆమెను ప్రొత్సహిస్తున్నట్లు సమాచారం. అప్పుడు టీడీపీ-జనసేనతో పాటు బీజేపీ, అవసరమైతే కాంగ్రెస్ మద్ధతు ఇప్పించే బాధ్యతను చంద్రబాబే తీసుకుంటారని సునీతకు వాళ్లు భరోసా ఇచ్చే యత్నమూ చేశారు. అయితే.. ఊహించని ఈ పరిణామంతో కంగుతిన్న సునీత డైలమాలో పడ్డట్లయ్యింది. స్వతంత్ర అభ్యర్థి అంటే అసలు జనం పట్టించుకుంటారా?.. పైగా ఇన్నాళ్లూ వెనకుండి నడిపించి ఇప్పుడు టికెట్ ఇవ్వరా? అని టీడీపీ పెద్దల్ని ఆమె ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో సునీత అభ్యంతరాల గురించి బాబుతో మాట్లాడాలని ఆ టీడీపీ పెద్దలు.. ఈ గ్యాప్లో ప్రస్తుత పరిస్థితిని తన వర్గంతో చర్చించాలని సునీత నిర్ణయించుకున్నారు. కొసమెరుపు.. వైఎస్సార్సీపీని ఎలాగైలా బద్నాం చేయాలనే పచ్చ బ్యాచ్ కుట్ర మరోసారి బట్టబయలైంది. ఆత్మీయ సమావేశం కడపలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న సునీత.. అంతకు ముందు పులివెందులలో ఓ ఫంక్షన్ హాల్ కోసం ట్రై చేస్తే అనుమతి దొరకలేదని.. వైఎస్సార్సీపీ నేతల ఒత్తిళ్ల వల్లే ఇదంతా జరిగిందని ప్రచారం చేయించారు. యెల్లో మీడియా సైతం దీనిని కథనాలుగా ప్రచురించుకున్నాయి. అయితే ఇదంతా ఒట్టి కట్టుకథేనని ఇప్పుడు తేలింది. -
వివేకా హత్య.. సునీత దంపతుల కుట్రే!
సాక్షి, అమరావతి: ‘వైఎస్ వివేకానందరెడ్డిని ఆయన కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్రెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్రెడ్డే హత్య చేయించి ఉండొచ్చు. ఈ హత్య వెనుకనున్న ఏదో విషయాన్ని దాచిపెట్టాలని వారు ప్రయత్నిస్తున్నారు. వివేకం సార్ రెండో పెళ్లితో ఆ ఇంట్లో తలెత్తిన ఆస్తి గొడవలకు ఆయన హత్యకు ఏదైనా సంబంధం ఉందా.. అనిపిస్తోంది. కూతురు, అల్లుడు, పెద్ద బావమరిదే ఈ దారుణానికి తెగించి ఉండొచ్చు’.. అని వైఎస్ వివేకానందరెడ్డి పీఏగా చేసిన ఎంవీ కృష్ణారెడ్డి వెల్లడించారు. ‘వివేకానందరెడ్డి రాసిన లెటర్ పోలీసులకు వెంటనే ఇచ్చేసి ఉంటే దర్యాప్తు సక్రమంగా సాగేది. కానీ, ఆ లెటర్ను దాచిపెట్టమని ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్రెడ్డి ఎందుకు చెప్పారు? ఈ కేసుతో సంబంధంలేని ఎంపీ అవినాశ్రెడ్డి, వైఎస్ భాస్కర్రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డిల పేర్లు చెప్పాలని నన్ను ఎందుకు బెదిరించారు? నేను అబద్ధం చెప్పకపోతే తన భర్త రాజశేఖర్రెడ్డి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది’ అని సునీత ఎందుకు అన్నారని కూడా ఆయన వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వివేకానందరెడ్డిని పాశవికంగా హత్య చేశానన్న దస్తగిరిని అప్రూవర్గా మార్చడం ఏమిటీ? అతను చెప్పే కట్టుకథలను పట్టుకుని సీబీఐ దర్యాప్తు చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. వైఎస్ వివేకానందరెడ్డి చివరివరకు కూడా వైఎస్ జగన్ను సీఎం చేయడానికి, వైఎస్ అవినాశ్రెడ్డిని ఎంపీగా గెలిపించడానికే కృషిచేశారని ఆయన స్పష్టంచేశారు. వివేకాకు పీఏగా దాదాపు 37ఏళ్ల పాటు పనిచేసిన కృష్ణారెడ్డి.. ఆయనకు అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తునిగా గుర్తింపు పొందారు. ఆయన కుటుంబ వ్యవహారాలతో సహా అన్ని విషయాలు సమగ్రంగా తెలిసిన వ్యక్తి. 2019, మార్చి 15 ఉదయం వివేకానందరెడ్డి మృతిచెందిన విషయాన్ని కృష్ణారెడ్డే మొదటగా గుర్తించి ఆయన కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో పోలీసులు, తరువాత సీబీఐ అధికారుల చేతిలో చిత్రహింసలకు గురైన బాధితుడు కూడా కృష్ణారెడ్డే. వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించిన అన్ని పరిణామాలను సమీపం నుంచి పరిశీలిస్తున్న కీలకవ్యక్తి అయిన కృష్ణారెడ్డి ‘సాక్షి’కి ఇచి్చన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విషయాలను వెల్లడించారు. సాక్షి: 2019, మార్చి 15న ఏ సమయంలో మీరు వివేకానందరెడ్డి ఇంటికి వెళ్లారు? కృష్ణారెడ్డి: రోజూ వెళ్లినట్లే ఆ రోజు కూడా ఉ.5.30కే వివేకం సార్ ఇంటికి వెళ్లాను. ఇంట్లో లైట్వేసి లేదు. అంటే సారు ఇంకా నిద్ర నుంచి లేవలేదని అనుకున్నా. బయట లైట్ దగ్గర కూర్చుని పేపర్ చదువుకుంటూ ఉన్నా. కాసేపటి తరువాత సౌభాగ్యమ్మకు ఫోన్చేసి సార్ ఇంకా నిద్ర లేవలేదు.. మీరు ఫోన్చేసి నిద్ర లేపుతారా అని అడిగాను. రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చి ఉంటారు.. కాసేపు నిద్రపోనీ అని ఆమె చెప్పారు. కాసేపటికే వంట మనిషి లక్ష్మమ్మను ఆమె కొడుకు ప్రకాశ్ తన బైక్ మీద తీసుకొచ్చాడు. ఆలస్యమైంది కిటికీ వద్దకు వెళ్లి సారును నిద్రలేపు అని చెప్పాను. ఆ సమయంలో వాచ్మెన్ రంగన్న మెయిన్ డోర్ ముందర నిద్రపోతూ ఉన్నాడు. లక్ష్మమ్మ వచ్చేసరికి రంగన్న నిద్రలేచి ఉత్తరం వైపు ఉన్న పార్కు వైపు వెళ్లాడు. ఇంతలో ‘సార్ పడిపోయాడు’ అని అరుచుకుంటూ రంగన్న వచ్చాడు. మేము ఆ వైపు పరిగెత్తి వెళ్లాం. ఇంటికి ఉత్తరం వైపు ఉన్న తలుపు తెరచి ఉంది. లోపలికి వెళ్లి చూస్తే సార్ హాల్లోగానీ బెడ్రూమ్లోగానీ లేరు. అక్కడ రక్తపు మరకలు ఉన్నాయి. బాత్రూమ్లో చూస్తే వివేకం సార్ రక్తపుమడుగులో పడి ఉన్నారు. నేను సార్ చేయిపట్టుకుని నాడి చూశాను. నాడి కొట్టుకోవడంలేదు. ఆయన చనిపోయారని నిర్ధారించుకున్నా. సాక్షి: ఆ వెంటనే మీరు ఏం చేశారు? కృష్ణారెడ్డి: నేను వెంటనే సార్ అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్రెడ్డికి ఫోన్ చేసి చెప్పాను. బావ మనకు లేరు.. ఎవరో ఏదో చేశారు. రక్తపు మడుగులో ఉన్నారు. తల మీద గాయం ఉంది అని చెప్పాను. సరే అని ఆయన ఫోన్ పెట్టేశారు. నేను 6.15కు కాల్ చేశాను. నర్రెడ్డి రాజశేఖర్రెడ్డి నాతో 47 సెకన్లు మాట్లాడి ఫోన్ పెట్టేశారు. ఆ తరువాత సార్ పెద్ద బావమరిది శివప్రకాశ్రెడ్డికి కాల్ చేశాను. కానీ, ఆయన ఫోన్ కలవలేదు. నాకు సౌభాగ్యమ్మ ఫోన్ నుంచి కాల్ వచి్చంది. నేను మేడంకు కూడా విషయం చెప్పాను. సాక్షి: ఆ తరువాత ఏం జరిగింది? కృష్ణారెడ్డి: నేను, ప్రకాశ్ అక్కడ ఉండగా వీల్ చెయిర్ దగ్గర లెటర్ దొరికింది. ఆ లెటర్ చదివాను. తన మాజీ డ్రైవర్ తనను చంపినట్లు వివేకం సార్ ఆ లెటర్లో రాసి ఉంది. ఇంతలో సౌభాగ్యమ్మ నాకు ఫోన్ చేశారు. అల్లుడు రాజశేఖర్రెడ్డికి ఫోన్ ఇమ్మన్నాను. ఆమె ఆయనకు ఫోన్ ఇస్తే ఆ లెటర్లో రాసింది చదివి వినిపించాను. ఆ లెటర్ను దాచిపెట్టు. ఎవరికి చెప్పొద్దు.. అని రాజశేఖర్రెడ్డి చెప్పారు. లెటర్ గురించి పోలీసులకు చెప్పకపోతే ఇబ్బంది అవుతుంది కదా అని అన్నాను. ఏం ఇబ్బంది అవ్వదు.. మేం చూసుకుంటాం.. ఆ లెటర్ జాగ్రత్తగా దాచిపెట్టు అని ఆయన చెప్పారు. దాంతో ఆ లెటర్ విషయం పోలీసులకుగానీ ఎవరికీగానీ చెప్పలేదు. వంట మనిషి లక్ష్మమ్మ కొడుకు ప్రకాశ్కు ఆ లెటర్ ఇచ్చి మా ఇంట్లో ఇచ్చి రమ్మన్నాను. ఇంతలో రాజశేఖరరెడ్డి మళ్లీ నాకు ఫోన్ చేశారు. అప్పటికే సీఐ శంకరయ్య వచ్చారని చెప్పాను. ఆయన నా ఫోన్తో సీఐ శంకరయ్యతో మాట్లాడారు. తరువాత శంకరయ్య చెప్పినట్లుగా పోలీసు కంప్లైంట్ ఇవ్వమని రాజశేఖరరెడ్డి నాతో చెప్పారు. నేను అలానే చేశాను. సాక్షి: ఆ లెటర్ అప్పుడే పోలీసులకు ఇచ్చేసి ఉంటే ఈ కేసు దర్యాప్తు వేరే విధంగా ఉండేది కదా? కృష్ణారెడ్డి: ఆ లెటర్ అప్పుడే పోలీసులకు ఇచ్చి ఉంటే కేసు దర్యాప్తు సరైన విధంగా జరిగేది. కానీ, నాకు ఇష్టంలేకపోయినా రాజశేఖరరెడ్డి చెప్పడంతోనే ఆ లెటర్ను దాచి ఉంచాల్సి వచి్చంది. సాక్షి: మిమ్మల్ని ఎందుకు అరెస్టు చేశారు? కృష్ణారెడ్డి: నన్ను పోలీసులు ఎందుకు అరెస్టుచేశారో నాకే తెలీదు. లెటర్ దాచిపెట్టమని రాజశేఖరరెడ్డి చెప్పాడు. పోలీసులతో ఇబ్బంది వస్తుందని చెప్పినా తాను చూసుకుంటానని లెటర్ దాచి పెట్టమన్నాడు. టీడీపీ ప్రభుత్వం ఒత్తిడో.. వీళ్లు వాళ్లూ లాలూచీ అయి కృష్ణారెడ్డిని అరెస్టుచేయిస్తే సరిపోతుందని అనుకున్నారో తెలీదు. సాక్షి: మిమ్మల్ని అరెస్టు చేశాక ఏం జరిగింది? కృష్ణారెడ్డి: నన్ను అదేరోజు సాయంత్రం పోలీసులు అరెస్టుచేసి డీటీసీలో 13 రోజులపాటు ఉంచారు. బాగా కొట్టారు. రాజశేఖర్రెడ్డి చేశాడా.. శివశంకర్రెడ్డి చేసి ఉంటాడా చెప్పు అని తీవ్రంగా కొట్టారు. నాకు తెలీదని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. సాక్షి: పోలీసులకు ముందు నర్రెడ్డి రాజశేఖర్రెడ్డి మీద అనుమానం కలిగిందా? కృష్ణారెడ్డి: పోలీసులు ముందు నర్రెడ్డి రాజశేఖర్రెడ్డినే అనుమానించారు. వివేకం సార్ను ఆయనే హత్య చేయించి ఉంటాడా అని అడిగారు. నాకేమీ తెలీదని చెప్పాను. పోలీసులు కొట్టడంతో దాదాపు ఏడాదిపాటు నా చేతితో ఏమీ పట్టుకోలేకపోయాను. సాక్షి: లెటర్ను దాచి పెట్టమన్న రాజశేఖర్రెడ్డిని ఎందుకు ప్రశి్నంచరు అని మీరు పోలీసులను అడగలేదా? కృష్ణారెడ్డి: పోలీసులు నన్ను కొడుతూ ఉంటే నేనేం మాట్లాడను. నా మాట వాళ్లు వినిపించుకుంటే కదా. సాక్షి: రాజశేఖర్రెడ్డిని పోలీసులు ఎందుకు విచారించలేదు? కృష్ణారెడ్డి: ఎందుకు విచారించలేదో మరి. సీబీఐ వాళ్లకు కూడా అదే విషయం చెప్పాను. కానీ, వాళ్లు కూడా పట్టించుకోలేదు. వాళ్ల మధ్య ఏం ఒప్పందం ఉందో తెలీదు. సాక్షి: ఎంపీ అవినాశ్రెడ్డి సీఐ శంకరయ్యను బెదిరించారనే ఆరోపణ కూడా ఉంది కదా? కృష్ణారెడ్డి: సీఐ శంకరయ్య పక్కనే నేనున్నా. ఆయన్ని ఎవరూ బెదిరించనే లేదు. సాక్షి: సీబీఐ కేసు దర్యాప్తు చేపట్టిన తరువాత ఎంపీ అవినాశ్రెడ్డి, శివశంకర్రెడ్డి పేర్లు చెప్పమని మీ మీద ఒత్తిడి వచి్చందా? కృష్ణారెడ్డి: ఎంపీ అవినాశ్, శివశంకర్రెడ్డి పేర్లు చెప్పాలని రాంసింగ్ నన్ను బాగా వేధించారు. వాళ్లిద్దరూ నన్ను బెదిరించారని చెప్పమన్నారు. అలాంటిదేమీ లేదని నేను చెప్పడంతో నన్ను బాగా కొట్టారు. ఉన్నది ఉన్నట్లు చెబుతాగానీ అబద్ధం చెప్పనని నేను అంటే మరింత గట్టిగా కొట్టేవారు. కొట్టినా చంపినా నాకు తెలిసింది ఇంతే అని చెప్పాను. సాక్షి: ఎంపీ అవినాశ్రెడ్డి, శివశంకర్రెడ్డి పేర్లను ఇరికించాలని సీబీఐ అధికారి రాంసింగ్ ఎందుకు భావించారు? కృష్ణారెడ్డి: సునీత, రాజశేఖరరెడ్డితో రాంసింగ్ ఏం కమిట్ అయ్యారో.. వాళ్లద్దరి పేర్లు చెప్పాలనే వేధించారు. సాక్షి: సీబీఐ అధికారి రాంసింగ్ మీతో ఎలా వ్యవహరించారు? కృష్ణారెడ్డి: ఒకరోజు రాంసింగ్ ఫోన్చేశారు. తాము చెప్పినట్లు విన్నారు కాబట్టే రంగన్న, దస్తగిరిలను రక్షించాం. నేను కూడా చెప్పినట్లు వింటే రక్షిస్తామన్నారు. కడప సెంట్రల్ జైలు గెస్ట్హౌస్కు నా పిల్లలతో రమ్మని చెప్పారు. ఆ విషయాన్ని రాజశేఖర్రెడ్డికి చెబితే రాంసింగ్ చెప్పినట్లు చేయమన్నారు. మా ఇద్దరు కొడుకులతో సెంట్రల్ జైలు గెస్ట్హౌస్కు వెళ్లాం. వాళ్లు చెప్పినట్లు వినకపోతే జైలుకు పంపిస్తామని బెదిరించారు. తాము పెద్దపెద్ద వాళ్లనే జైలుకు పంపాం.. నువ్వెంత అని అన్నారు. నాకు తెలిసిందే చెబుతా తప్పా మీరు చెప్పమన్నట్లు అబద్ధం చెప్పలేనని నేను అన్నా. దాంతో కర్ర తీసుకుని నా కొడుకుల ముందే దాదాపు 20 సార్లు తీవ్రంగా కొట్టారు. సాక్షి: మీ అబ్బాయి పెళ్లిని చెడగొట్టారు అంటారు.. కృష్ణారెడ్డి: మేం సెంట్రల్ జైలు గెస్ట్హౌస్ నుంచి ఇంటికి వచి్చన మర్నాడే మా అబ్బాయికి సంబంధం కుదిరిన వారి నుంచి ఫోన్ వచి్చంది. పెళ్లి సంబంధం రద్దు చేసుకుంటున్నామని చెప్పారు. నా మీద కేసు ఉంది.. నేను జైలుకు వెళ్లాను.. మా ఆస్తులన్నీ తీసేసుకుంటామని సునీత, రాజశేఖర్రెడ్డి వారికి ఫోన్చేసి చెప్పారట. వాళ్లను హైదరాబాద్ పిలిపించుకుని మరీ బెదిరించి పెళ్లి సంబంధం రద్దుచేసుకునేలా చేశారు. వాళ్లు చెప్పినట్లు వినాలని నన్ను ఒప్పించేందుకు సునీత, రాజశేఖర్రెడ్డి అలా చేశారు. ఈ సంబంధం కాకపోతే మరో సంబంధం కుదురుతుందని నేను వారికి లొంగలేదు. సాక్షి: మీరు రాంసింగ్ మీద ఫిర్యాదు చేశారు కదా? కృష్ణారెడ్డి: నేను ఎంతమందితో చిత్రవధలకు గురయ్యేది. టీడీపీ ప్రభుత్వంలో ముందు పోలీసులు కొట్టారు. సునీత, రాజశేఖర్రెడ్డి హైదరాబాద్ పిలిపించుకుని బెదిరించారు. మా అబ్బాయి పెళ్లి సంబంధం చెడగొట్టారు. సీబీఐ అధికారి రాంసింగ్ నన్ను కడపలో కొట్టారు. ఢిల్లీ పిలిపించుకుని గొడ్డును బాదినట్లు కొట్టారు. ఇక ఎంతమందితో దెబ్బలు తినాలి.. అందుకే ఎస్పీకి ఫిర్యాదు చేశాను. నాకు ప్రాణహాని ఉంది.. భద్రత కల్పించాలని కోరాను. పులివెందుల కోర్టులో కూడా పిటిషన్ వేశాను. సాక్షి: వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని ఎంపీ అవినాశ్రెడ్డి చెప్పారని ఒక ఆరోపణ వచి్చంది. ఆయన అలా చెప్పారా? కృష్ణారెడ్డి: ఆ మాటే వినలేదు. అసలు ఆ విషయం ఎలా బయటకు వచి్చందో కూడా నాకు తెలీదు. సాక్షి: దస్తగిరి ఎలాంటి వ్యక్తి? కృష్ణారెడ్డి: దస్తగిరి డ్రైవర్గా ఉండేవాడు. ప్రవర్తన సరిగా లేదని తీసేశారు. వివేకం సార్ను ముసలోడా అనేవాడు. డ్యాన్స్ చేసేవాడు.. వెక్కిరించేవాడు. దాంతో సౌభాగ్యమ్మ అతనిని పని నుంచి తీసేశారు. అతని ఇంట్లో వాళ్లు వచ్చి బాధపడితే సౌభాగ్యమ్మను ఒప్పించి మళ్లీ పనిలో పెట్టించాను. కానీ, ఆ తరువాత దస్తగిరి మరింత మారిపోయాడు. వివేకం సార్ షమీమ్ ఇంటికి వెళ్లాలంటే ఇతనే డ్రైవర్. దాంతో దస్తగిరికే ఆయన ప్రాధాన్యం ఎక్కువ ఇచ్చేవారు. దస్తగిరి డబ్బు మనిషి. సాక్షి: హత్య ప్రదేశంలో సాక్ష్యాధారాలను చెరిపేయాలని ఎంపీ అవినాశ్రెడ్డి మీతో చెప్పారని కొందరు ఆరోపిస్తున్నారు? దీనిపై ఏమంటారు? కృష్ణారెడ్డి: అసలు వివేకం సార్ మృతదేహాన్ని బాత్రూమ్ నుంచి తీసుకువచి్చనప్పుడు ఎంపీ అవినాశ్రెడ్డి అక్కడ లేనేలేరు. అక్కడ సాక్ష్యాలను చెరిపి వేయించింది ఎర్ర గంగిరెడ్డే. ఎంపీ అవినాశ్రెడ్డిని రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికే ఆ ఆరోపణలు చేస్తున్నట్లుగా ఉంది. అక్కడ తుడిపించి వేసింది గంగిరెడ్డే. అక్కడున్న అందరూ అది చూశారు. సాక్షి: సీబీఐ అధికారులు పిలిస్తే మీరు ఢిల్లీ వెళ్లారు కదా.. అక్కడ ఏం జరిగింది? కృష్ణారెడ్డి: సీఐబీ అధికారులు నోటీసు ఇస్తే ఢిల్లీ వెళ్లాను. నర్రెడ్డి రాజశేఖర్రెడ్డికి చెప్పే వెళ్లాను. నన్ను ఢిల్లీలో నెలరోజులు ఉంచి తీవ్రంగా వేధించారు. ఎంపీ అవినాశ్రెడ్డి, శివశంకర్రెడ్డి పేర్లు చెప్పాలని అక్కడ కూడా రాంసింగే వేధించారు. నాకు తెలిసింది ఇప్పటికే చెప్పాను. లెటర్ దాచి పెట్టడమే నేను చేసిన తప్పు.. అది కూడా రాజశేఖర్రెడ్డి చెబితేనే చేశాను.. అంతకుమించి నాకేమీ తెలీదని చెప్పాను. దాంతో వాళ్లు నన్ను కొట్టేవారు. రోజూ రాత్రి సునీత, రాజశేఖర్రెడ్డి ఫోన్ చేసేవారు. నన్ను తీవ్రంగా కొడుతున్నారని వారికి నేను చెప్పేవాడిని.. నెల రోజులవుతోందని చెప్పినా వారు పట్టించుకోలేదు. సాక్షి: మామా అల్లుళ్ల మధ్య సంబంధాలు ఎలా ఉండేవి? కృష్ణారెడ్డి: నర్రెడ్డి రాజశేఖర్రెడ్డి మీద వివేకం సార్కు మంచి అభిప్రాయంలేదు. అల్లుడు కాబట్టి తప్పదు కదా. ఆయన మీద సార్ తరచూ కోప్పడేవారు. ఆ కుటుంబంలో ఏం జరుగుతోందో నాకు తెలీదు. కానీ, అల్లుడి మీద సార్ గట్టిగా అరుస్తూ ఉండేవారు. వివేకం సార్ రెండో భార్య షమీమ్ విషయంలోనే వాళ్ల మధ్య గొడవలు జరిగేవి. సాక్షి: వివేకానందరెడ్డి రెండో పెళ్లి చేసుకోవడంతో ఆ కుటుంబంలో గొడవలు జరిగేవా? కృష్ణారెడ్డి: షమీమ్ అనే ఆవిడను వివేకం సార్ రెండో పెళ్లి చేసుకోవడంతో ఆ కుటుంబంలో గొడవలు జరిగేవి. ఒకరోజు సౌభాగ్యమ్మ, సునీత, రాజశేఖర్రెడ్డి, శివప్రకాశ్రెడ్డి కలిసి వివేకం సార్తో గొడవ పడ్డారు. తాను షమీమ్ను పెళ్లి చేసుకోవడమే కాదు ఆమెతో తనకు ఒక అబ్బాయి కూడా ఉన్నాడని సార్ చెప్పారు. ఆ ఇద్దరి బాధ్యతతోపాటు ఆమెకున్న ఇద్దరు చెల్లెళ్లకు పెళ్లి చేయడం కూడా తన బాధ్యతేనని అన్నారు. సాక్షి: సునీత ఎందుకు అంతగా కేకలు వేశారు? కృష్ణారెడ్డి: నా మీద సునీత కోపంతో అరుస్తూ ఉంటే రాజశేఖర్రెడ్డి ఆమెను సముదాయించేందుకు యత్నించారు. ‘ఈ కేసు విషయంలో కృష్ణారెడ్డి సహకరించకపోతే రాజశేఖర్రెడ్డి జైలుకు వెళ్లాల్సి వస్తుంది’ అని సునీత ఆయనతో అంది. నాకేమీ అర్థం కాలేదు. వివేకం సార్ హత్యలో వీళ్ల పాత్ర ఉందేమోనని మొదటిసారి అనిపించింది. అంటే నాతో అబద్ధం చెప్పించి వేరెవరినో నాశనం చేయాలని సునీత భావిస్తోందని అర్థమైంది. సాక్షి: వివేకానందరెడ్డిని ఎవరు చంపి ఉంటారు? మీతో ఎందుకు అబద్ధం చెప్పించాలని చూస్తున్నారు? కృష్ణారెడ్డి: ఎంపీ అవినాశ్రెడ్డి, భాస్కర్రెడ్డి, శివశంకర్రెడ్డి పేర్లు చెప్పాలని సునీత, రాజశేఖర్రెడ్డి ఎందుకు ప్రయత్నిస్తున్నారో అర్థంకావడంలేదు. నాతో ఒక అబద్ధం చెప్పించాలని ప్రయత్నిస్తున్నారంటే.. దాని వెనుక వాళ్లకేదో ఉద్దేశం ఉండే ఉంటుంది. ఎవర్నో కాపాడేందుకు.. ఏదో నిజాన్ని దాచేందుకే వాళ్లిద్దరూ ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోంది. సీబీఐ అధికారి రాంసింగ్ కూడా నాతో అబద్ధాలు చెప్పాలని ఎందుకు పట్టుబట్టారో తెలీడంలేదు. కేసు దర్యాప్తు సక్రమంగా సాగితేనే వాస్తవాలు బయటకొస్తాయి. కానీ, సీబీఐ తీరు సక్రమంగాలేదు. అదే బాధేస్తోంది. సాక్షి: చివరగా.. వివేకా హత్య గురించి ఏమంటారు? కృష్ణారెడ్డి: జరుగుతున్నదంతా చూస్తే.. సునీత, రాజశేఖర్రెడ్డి, శివప్రకాశ్రెడ్డిల మీదే అనుమానం కలుగుతోంది. వీళ్లే వివేకం సార్ను ఏమైనా చేసి మరొకరి మీద నింద వేయాలని చూస్తున్నారా అనిపిస్తోంది. ఆస్తి గొడవలు, షమీమ్ విషయం.. ఆస్తి వేరొకరికి పోతుందనే చేశారా అనిపిస్తోంది. ఎందుకంటే అబద్ధం చెప్పమని నన్ను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఎవరైనా నిజం చెప్పాలని అంటారు. కానీ, అబద్ధం చెప్పమని వీళ్లు ఎందుకు అంటున్నారన్నది చూడాలి. అందుకే వివేకం సార్ను వీళ్లే ఏమైనా చేశారనిపిస్తోంది. నేను అబద్ధం చెప్పకపోతే తన భర్త రాజశేఖర్రెడ్డి జైలుకు పోతారని కూడా సునీత నా ముందే అంది. -
వివేకా, సునీతమ్మకు మాటల్లేవ్!
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో.. సునీతా దంపతులపై ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా పని చేసిన కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా నర్రెడ్డి సునీత యెల్లో మీడియా వేదికగా సంచలన ఆరోపణలు చేయగా.. సాక్షితో కృష్ణారెడ్డి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో కృష్ణారెడ్డి పలు నిజాల్ని పంచుకున్నారు. ‘‘వివేకానందరెడ్డితో నాది 35 ఏళ్ల అనుబంధం. ఆయన హత్య గురించి ముందు నాకే తెలిసింది. వెంటనే ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్రెడ్డికి ఫోన్ చేశాను. వివేకాను ఎవరో ఏదో చేశారని స్పష్టంగా చెప్పాను. అయితే.. లెటర్ విషయం ఎవరికీ చెప్పొద్దని నర్రెడ్డి రాజశేఖర్రెడ్డి నాతో అన్నారు. అలాగే ఈ కేసులో అసలు గుండెపోటు కోణం ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నాకు తెలియదు. .. వివేకా హత్య జరిగిన రోజే నన్ను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టారు. సీబీఐ ఎస్పీ రాంసింగ్, సునీతా దంపతులు నన్ను బెదిరించారు. తాము చెప్పిన పేర్లు సీబీఐ ముందు చెప్పాలని నన్ను ఒత్తిడి చేశారు. వివేకా కేసులో అవినాష్రెడ్డి, శివశంకర్రెడ్డి పేర్లు చెప్పాలన్నారు. నానా హింసలకు గురి చేశారు. లేదంటే జైలుకు పంపిస్తామన్నారు. .. వివేకానందరెడ్డి, సునీతమ్మ చాలాకాలంగా మాట్లాడుకోలేదు. వివేకా రెండో వివాహం విషయంలో గొడవలు జరిగాయి. రెండో భార్య షమీమ్ కొడుకును వారసుడిగా చేస్తారనే వివేకా చెక్ పవర్ తొలగించారు. వివేకానందరెడ్డికి అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్రెడ్డిపై మంచి అభిప్రాయం లేదు. అల్లుడిపై ఆయన ఎప్పుడూ కోపంగానే ఉండేవారు అని తెలిపారాయన. -
నారా ప్రొడక్షన్స్.. నర్రెడ్డి సునీత యాక్షన్
-
వైఎస్ వివేకాను చంపిందెవరు?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగినపుడు ముఖ్యమంత్రి స్థానంలో అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడే ఇప్పుడు అమాయకంగా... హత్య చేసిందెవరు? అని ప్రశ్నిస్తున్నారు. ఇది వారం రోజుల్లో తేల్చాల్సిన కేసు అని చెబుతున్న వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత... హత్య జరిగాక రెండు నెలలపాటు అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడిని ప్రశ్నించనే లేదు. అంతే కాదు.. హత్య చేశానని, తన తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు మరికొందరితో కలిసి వివేకాను తనే గొడ్డలితో నరికానని అంగీకరించిన దస్తగిరి ఇప్పుడు జైలు నుంచి విడుదలై దర్జాగా బయట తిరుగుతున్నాడు. సునీతకు, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఆత్మీయుడిగా మారాడు. చంద్రబాబు అనుకూల మీడియాకు వీఐపీ నాయకుడైపోయాడు. వివేకా గుండెపోటుతో చనిపోయారని సునీత బావగారు శివప్రకాశ్రెడ్డితో సహా పలువురికి ఫోన్లు చేసి చెప్పిన నాటి టీడీపీ మంత్రి ఆదినారాయణరెడ్డి.. తర్వాత ఓడిపోవటంతో బీజేపీలోకి ఫిరాయించారు. వీళ్లలో హత్య చేసిన వాళ్లు... చేయించిన వాళ్లు... దాన్ని కప్పిపుచ్చి రాజకీయ ప్రత్యర్థుల్ని ఇరికించడానికి ప్రయత్నిస్తున్న వారు... అంతా ఉన్నారు. అందరూ కలిసి లోతైన కుట్రతో కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డిపై, ఆయన కుటుంబంపై దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు ఈ కుట్రను మరింత లోతుకు తీసుకెళుతున్నారు. కుట్రలో భాగంగానే... చంద్రబాబు అనుకూల తోక పత్రికకు అధిపతిగా వ్యవహరిస్తున్న వ్యక్తి మూడు రోజుల కిందట నర్రెడ్డి సునీతతో సహా చంద్రబాబును కలిశారు. కడప ఎంపీగా సునీతను పోటీకి దింపటంపై అక్కడ చర్చ జరిగింది. చివరకు సునీతను పోటీ చేయించని పక్షంలో ఆమె చేత విస్తృతంగా ప్రచారం చేయించాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రచారమంటే... నియోజకవర్గంలో తిరగటం మాత్రమే కాదు. జాతీయ స్థాయిలో మీడియా సమావేశాలు కూడా. అందులో భాగమే ఢిల్లీలో సునీత ప్రెస్ కాన్ఫరెన్స్. దానికి కొనసాగింపే శనివారం ‘హూ కిల్డ్ బాబాయ్’ అంటూ బహిరంగ సభలో చంద్రబాబు ఊగిపోవటం. ఇదంతా ఒక స్కెచ్. సూత్రధారి చంద్రబాబు. పాత్రధారులు సునీత నుంచి దస్తగిరి, బీటెక్ రవి వరకూ ఎందరో!!. వివేకా హత్యతో లాభమెవరికి? జాతీయ, అంతర్జాతీయ నేర పరిశోధన ప్రమాణాలు చెప్పేదొకటే.. ఒక నేరం వల్ల ఎవరికి లాభం ఉంటుందో వారే దోషులు, కుట్రదారులు. అలా చూసినప్పుడు వివేకా హత్యతో లాభమెవరికి? ఆయన్ను అడ్డు తొలగించుకోవాలనుకున్నది ఎవరు? ఈ కోణంలో పరిశీలించినప్పుడు వచ్చే సమాధానాలు రెండే. వివేకా సంపాదించిన ఆస్తులు తమకే దక్కాలని, ఆయన రాజకీయ వారసత్వమూ తమకే ఉండాలని వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి పంతం పట్టారు. కాకపోతే షమీమ్ అనే మహిళను వివేకా రెండో వివాహం చేసుకున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఆమెతో వివేకాకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఈ రెండో వివాహంతో వివేకా కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. వివాహాన్ని వివేకా మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు, చిన్న బావమరిది అయిన నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటి నుంచి సౌభాగ్యమ్మ పులివెందులలో నివాసం ఉండకుండా హైదరాబాద్లో ఉన్న కుమార్తె సునీత వద్ద ఉంటున్నారు. సునీత నర్రెడ్డి ? ఆస్తి మొత్తం మాకే దక్కాలి.... వివేకా రెండో వివాహాన్ని ఆయన కుమార్తె సునీత తీవ్రంగా వ్యతిరేకించారు. తన తండ్రి యావదాస్తీ తమకే చెందాలని ఆమె పంతం పట్టారు. కానీ వివేకానందరెడ్డి తన రెండో భార్యకు ఆస్తిలో వాటా ఇస్తానన్నారు. ఓ ఇల్లు ఇచ్చేశారు. హైదరాబాద్లోనూ ఒక ఇల్లు కొనుగోలు చేసి తన కుమారుడిని అక్కడే ఉంచి బాగా చదివిస్తానని షమీమ్కు మాట ఇచ్చారు. దాన్ని వివేకా మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత తీవ్రంగా వ్యతిరేకించారు. వాగ్వాదానికి దిగారు. అక్కడితో ఆగకుండా కుటుంబానికి చెందిన కంపెనీల్లో ఆయనకున్న చెక్ పవర్ను రద్దు చేశారు. షమీమ్తో సునీత గొడవ పడ్డారు. పరస్పరం దారుణంగా దూషించుకుంటూ వారిద్దరి మధ్య సాగిన వాట్సాప్ చాటింగ్ వివరాలను కూడా దర్యాప్తు సంస్థలు వెలికి తీశాయి. సౌభాగ్యమ్మ, సునీత మొండి పట్టుదల చూశాక వివేకా కాస్త జాగ్రత్తపడ్డారు. తన ఆస్తిలో షమీమ్కు వాటా కల్పిస్తూ వీలునామా రాస్తానన్నారు. అందుకోసం స్టాంపు పేపర్లు కూడా తెప్పించుకున్నారు. అదిగో... అలా స్టాంపు పేపర్లు తెచ్చిన రోజుల వ్యవధిలోనే వివేకా హఠాత్తుగా హత్యకు గురయ్యారు. ఆయన్ను హత్య చేశాక దస్తగిరి సహా హంతకులు ఆ ఇంటిలో ఉన్న బీరువాలో ఏవో స్టాంపు పేపర్లు, రౌండ్ సీల్ కోసం వెతికారని ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగయ్య తన వాంగ్మూలంలో పేర్కొనడం ఇక్కడ ప్రస్తావనార్హం. పైపెచ్చు వివేకా హత్య జరిగిన కొన్ని నెలలకే కుటుంబానికి చెందిన భూములు, ఇతర ఆస్తులన్నింటినీ సునీత తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీన్ని బట్టి హత్య వల్ల ఎవరికి లబ్ధి కలిగిందో తెలుస్తోంది కదా!. మరి హత్య చేయించిందెవరో కనుక్కోవటానికి ఇంతకన్నా ఏం కావాలి? మాటమార్చి... చంద్రబాబు గూటిలోకి తన తండ్రి వివేకా హత్య వెనుక అప్పటి టీడీపీ ప్రభుత్వంలోని మంత్రి ఆదినారాయణ రెడ్డి, అప్పటి టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఉన్నారని సునీత 2019 మార్చిలో చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్రెడ్డి విజయం కోసం తన తండ్రి చివరి వరకూ కృషి చేశారని కూడా చెప్పారు. 2019 మార్చి 21న హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించి మరీ ఇవన్నీ చెప్పిన సునీత... 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలని, వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎంను చేసి తన తండ్రి కోరిక నెరవేర్చాలని ప్రజలను కోరారు. కానీ 2020లో స్థానిక సంస్థల ఎన్నికల తరువాత ఆమె పూర్తిగా ప్లేటు ఫిరాయించారు. సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్రెడ్డి, బావ శివప్రకాశ్రెడ్డి... చంద్రబాబు గుప్పిట్లోకి వెళ్లి టీడీపీ రాజకీయ కుట్రలో భాగస్వాములయ్యారు. చంద్రబాబు? రాజకీయ లబ్ధికి ఇదే అదను.. 2019 మార్చి 15న వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నిజానికి కడప జిల్లాలోను, పులివెందులలోను టీడీపీకి ప్రధాన అడ్డంకి వైఎస్ వివేకా. ఆయన అడ్డు తొలగింది. వైఎస్సార్సీపీ అధిపతి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉండే కడప ఎంపీ అవినాశ్రెడ్డిని దీనిలో ఇరికించి దుష్ప్రచారం సాగిస్తే... కడప జిల్లాలో తాము పాగా వేయొచ్చనేది బాబు దురాలోచన. అందుకే... మార్చి 15న వివేకా హత్య విషయం బయటకు వచ్చిన తరవాత బాబు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. తన సొంత మనిషి అయిన అప్పటి రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును రంగంలోకి దింపారు. ఆయన అందరినీ ప్రభావితం చేస్తూ దర్యాప్తును ఆదిలోనే తప్పుదోవ పట్టించారు. నిజానికి ఈ హత్య విషయంలో సునీత లక్ష్యం ఒక్కటే. హత్య వెనుకనున్న తన భర్త, బావగార్ల పేర్లు బయటకు రాకుండా ఉండటం. బాబు లక్ష్యమేమో తన ప్రత్యర్థులను ఇరికించటం. అందుకే ఈ విజాతి ధ్రువాలు రెండూ ఆకర్షించుకుని... ఒకరి లక్ష్యానికి మరొకరు సాయంగా నిలిచారని... రానురాను కుట్రను మరింత లోతుల్లోకి తీసుకెళుతున్నారని ఈ వ్యవహారాన్ని దగ్గర్నుంచి పరిశీలిస్తున్నవారు చెప్పే మాట. ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్రెడ్డిలపై సందేహాలు రేకెత్తించేలా పచ్చ మీడియా ద్వారా అభూతకల్పనలతో దుష్ప్రచారం చేయటం... హత్య వెనుక ఉన్న కుట్రదారుల పాత్ర బయటకురాకుండా కేసును సంక్లిష్టంగా మార్చటం... ఇవన్నీ ఇందులో భాగంగానే జరిగిపోయాయి. చంద్రబాబు గ్యాంగ్కు కృతజ్ఞతలతో.. మీ సునీత బహుశా... నాలుగేళ్లుగా తాము సాగిస్తున్న కుట్రను మరింత పదునెక్కించాలనుకున్నారో, ఇకపై ముందుకు వెళ్లాలంటే ముసుగు తీయక తప్పదని భావించారో గానీ... సునీత ముసుగు తీశారు. రెండ్రోజుల కిందట ఢిల్లీలో బాబు స్క్రిప్టును చదువుతూ... ఆఖరికి టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభికి కూడా కృతజ్ఞతలు చెప్పారంటే టీడీపీ ఏ స్థాయిలో సునీతకు సహకరించిందో... ఈ కుట్ర ఎంత లోతైనదో తెలియకమానదు. వైఎస్సార్సీపీ టికెట్టుపై గెలిచి... ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని దూషిస్తూ సమాజంలో వర్గవిభేదాలు సృష్టించేందుకు కుట్రపన్నిన ఎంపీ రఘురామకృష్ణరాజు... ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను అత్యంత పరుషపదంతో దూషించిన టీడీపీ నేత పట్టాభి... సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతూ అత్యంత వివాదాస్పదుడిగా మారిన టీడీపీ నేత, పి.గన్నవరం అభ్యర్థి మహాసేన రాజేశ్.. తమ పార్టీ విధానాలతో నిమిత్తం లేకుండా చంద్రబాబు కోసమే పనిచేస్తున్న కాంగ్రెస్ నేత తులసిరెడ్డి, సీపీఐ నారాయణ... బీజేపీలో ఉంటూ బాబు ఎజెండాను అమలు చేస్తున్న సీఎం రమేశ్... బాబు లాయరు సిద్ధార్థ లూథ్రా... నిరపరాధులను హింసించి, వేధించి కేసు దర్యాప్తును పక్కదారి పట్టించిన సీబీఐ అధికారి రామ్సింగ్... సీఎం వైఎస్ జగన్పై తీవ్రస్థాయిలో దుష్ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా... వీళ్లందరికీ సునీత కృతజ్ఞతలు తెలిపారు. అంటే తాను ఆ పచ్చ ముఠాలో సభ్యురాలినేనని విస్పష్టంగా ప్రకటించారు. విశేషమేంటంటే వీళ్లందరిలో ఓ ఉమ్మడి లక్షణం ఉంది. అది... తమ వృత్తులు, పార్టీలకు అతీతంగా చంద్ర బాబు కోసం పనిచేయటం. వైఎస్ జగన్ను తీవ్రంగా వ్యతిరేకించటం. అది చాలదూ... సునీత పాత్రను బయటపెట్టడానికి!!. ఇంకా వివేకా ఎవరెవరికి అడ్డంకిగా ఉన్నారు? ఆయన హత్యతో ఏ పాత్ర«ధారికి ఎలాంటి లాభం? ఇవన్నీ ఒకసారి చూద్దాం... ఆదినారాయణ రెడ్డి? గుండెపోటు అని మొదట చెప్పింది ఈయనే... వివేకా గుండెపోటుతో చనిపోయారని మీడియా సాక్షిగా బయటకు చెప్పింది నాటి మంత్రి ఆదినారాయణ రెడ్డి. వివేకా బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్రెడ్డి తనకు ఫోన్ చేసి గుండెపోటుతో వివేకా మరణించారని చెప్పారని, సిగరెట్లు ఎక్కువ తాగుతారు కనక అలా జరిగి ఉండొచ్చని తాను కూడా అన్నానని ఆయన స్వయంగా మీడియాకు వెల్లడించారు. అంతేకాదు.. శివప్రకాశ్ రెడ్డి ఇదే విషయాన్ని ఎన్నికల ప్రచారం కోసం వెళుతున్న ఎంపీ అవినాశ్రెడ్డికి చెప్పటంతో... ఆయన తన వాహనాన్ని నిలిపేసి, వెనక్కు తిరిగి వివేకా ఇంటికి వచ్చారు. మరి గుండెపోటు అని ప్రచారం చేయాల్సిందిగా శివప్రకాశ్రెడ్డికి చెప్పిందెవరు? ఆదినారాయణ రెడ్డికి ఆయనే అడ్డంకి... 2014 ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణ రెడ్డి... టీడీపీకి అమ్ముడుపోయారు. వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేయకుండా అనైతికంగా టీడీపీ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. 2019 ఎన్నికల్లో ఆయన్ను కడప ఎంపీ అభ్యర్థిగా చంద్రబాబు నిర్ణయించారు. కానీ ఎంపీగా గెలవటానికి వివేకానందరెడ్డి ప్రధాన అడ్డంకిగా నిలిచారు. జిల్లాపై పూర్తి పట్టున్న వివేకా రంగంలో ఉంటే తాను ఎంపీగా గెలవడం అసాధ్యమని ఆది నారాయణ రెడ్డి గుర్తించారు. ఈ నేపథ్యంలో వివేకా హత్యకు గురయ్యారు. వివేకా హత్య ఆదినారాయణరెడ్డికి రాజకీయంగా ప్రయోజనం కలిగించేదే కదా? నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ? లేఖను దాచి... గుండెపోటని ప్రచారం చేసి వివేకా హత్య కేసు దర్యాప్తు పక్కదారి పట్టించడంలో సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, బావ నర్రెడ్డి శివప్రకాశ్రెడ్డిది కీలకపాత్ర. ఎందుకంటే హత్యకు గురైనప్పుడు వివేకా తన స్వదస్తూరితో రక్తంతో ఓ లేఖను రాశారు. ఆ లేఖను చూసిన ఎవరికైనా... అది మామూలు మరణం కాదని, ముమ్మాటికీ హత్యేనని తెలిసిపోతుంది. అలాంటి లేఖను ఆ రోజు (2019, మార్చి 15) ఉదయం 6.10 గంటలలోపే వివేకా పీఏ కృష్ణారెడ్డి చూశారు. ఆ విషయాన్ని వెంటనే సునీత భర్త రాజశేఖరరెడ్డికి ఫోన్లో చెప్పారు. ‘మేం వచ్చే వరకు ఆ లేఖను గానీ, వివేకా సెల్ఫోన్ను గానీ ఎవరికీ ఇవ్వవద్దు. పోలీసులకు కూడా చెప్పొద్దు’ అని వారు పీఏ కృష్ణారెడ్డిని ఆదేశించారు. ఆ లేఖను గనక వెంటనే పోలీసులకు ఇవ్వమని వారు చెప్పి ఉంటే... మొత్తం వ్యవహారం మరోలా ఉండేది. వివేకాది హత్య అని తేలిపోయేది. ఎవరూ మృతదేహం వద్దకు వెళ్లేవారు కాదు. పోలీసులు తమ పని తాము చేసేవారు. కానీ లేఖను ఉద్దేశపూర్వకంగా గోప్యంగా ఉంచటంతో... వ్యవహారం మొత్తం వారు ప్లాన్ చేసినట్టే సాగింది. బీటెక్ రవి... ? వివేకా ఉంటే ఇక అంతే.. పులివెందుల నియోజకవర్గంలో కనీసస్థాయిలోనైనా పట్టు సాధించాలన్నది టీడీపీ నేత బీటెక్ రవి లక్ష్యం. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో 2019 ఎన్నికల్లో యథేచ్చగా అక్రమాలు సాగించవచ్చనేది ఆయన పన్నాగం. కానీ వివేకా వైఎస్సార్సీపీకి పెద్దదిక్కుగా నిలబడటంతో బీటెక్ రవి ఆటలు సాగలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను దొంగదెబ్బ తీసిన బీటెక్ రవికి పులివెందుల అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కకుండా చేయాలని వివేకా పంతం పట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయన హత్యకు గురయ్యారు. హత్యకు ముందు రోజు కొమ్మారెడ్డి పరమేశ్వర రెడ్డి(ఈయనకు వివేకాతో ఆర్థిక విభేదాలు తలెత్తాయి)తో బీటెక్ రవి రెండుసార్లు సమావేశమయ్యారు. ఈ భేటీలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి తర్వాత కొద్ది రోజులకే అనుమానాస్పద రీతిలో మృతి చెందారు కూడా. సిట్ దర్యాప్తులో నార్కో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినా పరమేశ్వరరెడ్డి తిరస్కరించడం సందేహాలకు తావిచ్చేదే. రామ్సింగ్? చంద్రబాబు చేతిలో పావు... వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు ఎంతటి సిద్ధహస్తుడో వివేకా కేసులో సీబీఐ తీరే నిరూపిస్తోంది. వాస్తవానికి ఈ కేసులో నిశితమైన దర్యాప్తు జరిగి దోషులు బయటపడాలని మొదటి నుంచీ భావిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి... కేసును సీబీఐ దర్యాప్తు కోసం అప్పగించాలని సునీత కోరగానే సరేనన్నారు. సీబీఐకి అప్పగించారు. కాకపోతే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోగానే ముందస్తు కుట్రతో బీజేపీలోకి పంపిన తన మనుషులు సీఎం రమేశ్, సుజనా చౌదరి ద్వారా చంద్రబాబు చక్రం తిప్పటం మొదలెట్టారు. సీబీఐ దర్యాప్తు అధికారిగా నియమితుడైన రామ్సింగ్ వివాదాస్పద వ్యవహార శైలే అందుకు తార్కాణం. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాల్సిన ఆయన ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చేసినట్టుగా ఎంపీ అవినాశ్ రెడ్డి, వైఎస్ భాస్కర్రెడ్డిలను లక్ష్యంగా చేసుకుని కేసును పక్కదారి పట్టించారు. దస్తగిరిని ఢిల్లీకి తీసుకువెళ్లి బెదిరించి... ప్రలోభాలకు గురిచేసి అప్రూవర్గా మార్చారు. తాము అనుకున్నది అతని అప్రూవర్ వాంగ్మూలంగా నమోదు చేశారు. పీఏ కృష్ణారెడ్డిని, మరికొందర్ని ఢిల్లీకి తీసుకువెళ్లి తీవ్ర చిత్రహింసలు పెట్టారు. తాను చెప్పిందే చెప్పాలని వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. వైఎస్సార్ జిల్లాలో పలువురిని అక్రమంగా నిర్బంధించి చిత్ర హింసలకు గురి చేయడంతో వారి కుటుంబాలు బెంబేలెత్తిపోయాయి. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు రామ్సింగ్ స్వయంగా అసత్య ఆరోపణలు చేశారు. కడపలో తాను కార్లో వెళ్తుంటే ఆగంతకులు వచ్చి హత్య చేస్తానని బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించగా ఆయన కారుపై ఎలాంటి దాడి జరగలేదని... ఎవరూ బెదిరించలేదని నిర్ధారణ అయ్యింది. అనేక ఫిర్యాదులు రావటంతో ఇంతటి వివాదాస్పదుడైన రామ్సింగ్ను న్యాయస్థానం ఆదేశాలతో కేంద్ర హోమ్ శాఖ ఈ కేసు దర్యాప్తు నుంచి తప్పించింది. నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్రెడ్డి? రాజకీయ వారసత్వం మాకే దక్కాలి.. వివేకానందరెడ్డి రాజకీయ వారసత్వంపై ఆయన అల్లుడు, చిన బావమరిది నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్రెడ్డి కన్నేశారు. ఆయన తరువాత రాజకీయ వారసత్వంగా తమకే పదవులు దక్కాలని భావించారు. కానీ వివేకానందరెడ్డి తన రెండో భార్య షమీమ్తో తనకు కలిగిన కుమారుడిని రాజకీయ వారసుడిగా ప్రకటించాలని నిర్ణయించారు. దాంతో రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్రెడ్డి కంగుతిన్నారు. షమీమ్ ఇంటికి వెళ్లి ఆమెను తీవ్రంగా హెచ్చరించారు. ఆమె కుమారుడిని కిడ్నాప్ చేస్తామని కూడా బెదిరించారు. వారిద్దరికి భయపడి ఆమె పులివెందుల నుంచి హైదరాబాద్ వెళ్లిపోయి ఓ అజ్ఞాత ప్రదేశంలో ఉండేవారు. అంటే వివేకానందరెడ్డి రాజకీయ వారసత్వం తమకే దక్కాలని నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్రెడ్డి ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడ్డారన్నది సుస్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే వివేకానందరెడ్డి 2019 ఎన్నికల ముందు హత్యకు గురయ్యారు. దస్తగిరి? హత్య చేసి... హైడ్రామా తండ్రిని చంపినవారిపై ఎవరికైనా కోపం, కక్ష ఉంటాయి. కానీ వివేకానందరెడ్డిని ఎంత పాశవికంగా హత్య చేసిందీ వెల్లడించిన దస్తగిరితో వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి అత్యంత సన్నిహితంగా ఉండటం విస్మయం కలిగించేదే. వివేకాను హత్య చేసిన నలుగురిలో దస్తగిరి ఉన్నారన్నది నిర్ధారణ అయ్యింది. కానీ అదే దస్తగిరిని అప్రూవర్గా మార్చి ఎంపీ అవినాశ్రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిపై నిరాధారణ ఆరోపణలు చేయిస్తున్నారంటే... వెనుక ఎవరున్నారన్నది కీలకం. చంద్రబాబు, ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి, సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివప్రకాశ్రెడ్డి...ఇలా అందరూ దస్తగిరికి బహిరంగంగానే సహకరిస్తున్నారు. వివేకా హత్యకు ముందు రూ.500 కు కూడా అప్పులు చేసిన దస్తగిరి ప్రస్తుతం ఓ కాన్వాయ్తో కూడిన బొలేరో వాహనాలను కొనుగోలు చేసి దర్జాగా తిరుగుతున్నారు. ఇక దస్తగిరి చేస్తున్న దుష్ప్రచారాన్ని పదే పదే టీడీపీ అనుకూల మీడియా ప్రసారం చేస్తోంది. ఆయన ఇంటర్వ్యూలు ప్రసారం చేస్తోంది. అంటే దస్తగిరి ఇష్టానుసారంగా చెబుతున్న కట్టుకథలు, చేస్తున్న అసత్య ఆరోపణల వెనుక చంద్రబాబు ముఠా, సునీత కుటుంబమే ఉందన్నది స్పష్టమవుతోంది కదా!. సెల్ఫోన్లో డేటా డిలీట్ చేశారెందుకు? ఆ రోజు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పులివెందుల చేరుకున్న సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డికి వివేకా రాసిన లేఖను, సెల్ఫోన్ను కృష్ణారెడ్డి అందజేశారు. వారు ఆ సెల్ఫోన్లోని డేటాను డిలీట్ చేశారు. సునీత ఆదేశాలతో సాయంత్రం 5 గంటలకు కృష్ణారెడ్డి ఆ లేఖను, సెల్ఫోన్ను పోలీసులకు ఇచ్చారు. ‘‘ఆ రోజు ఉదయం పీఏ కృష్ణా రెడ్డి ఫోన్ చేసి గాయాలతో వివేకా బాత్రూమ్లో పడి ఉన్నారని చెప్పారు. మా నాన్నకు గతంలో కూడా గుండె సమస్య ఉన్నందున బాత్రూమ్లో పడి తలకు బలమైన గాయం అయి ఉండొచ్చని భావించా. అందుకే పోలీసులకు అలాగే ఫిర్యాదు చేయమని కృష్ణారెడ్డితో చెప్పా’’ అని సిట్ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో సునీత పేర్కొన్నారు. లేఖను చూశాకైనా... వివేకా మృతదేహాన్ని చూశాకైనా ఒక డాక్టరైన సునీతకు ఎలాంటి అనుమానమూ రాలేదంటే ఏమనుకోవాలి? ఉద్దేశపూర్వకంగా నిజాలు దాటిపెట్టారని భావించనవసరం లేదా? తండ్రిని ఓడించినా... సునీతకు ఇష్టులే వివేకానందరెడ్డిని 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే చంద్రబాబు దొంగదెబ్బ తీసి ఓడించారు. 2017లో వైఎస్సార్ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వైఎస్ వివేకాను పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎంపిక చేశారు. జిల్లాలో మెజార్టీ ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు వైఎస్సార్సీపీ వారే కావడంతో ఆయన గెలుపు నల్లేరుపై నడకేనని భావించారు. వివేకా ఎమ్మెల్సీగా ఎన్నికైతే జిల్లాలో టీడీపీకి ఉనికే ఉండదని చంద్రబాబు భావించారు. అందుకే వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను ప్రలోభాలకు గురి చేసి వివేకాను కుట్రతో ఓడించారు. అక్రమాలకు పాల్పడి బీటెక్ రవి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ కుట్రలో చంద్రబాబు, ఆయన ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి సర్వంతామై వ్యవహరించారు. కానీ ఆ ముగ్గురూ సునీతకు, ఆమె భర్త, బావగారికిçప్పుడు అత్యంత సన్నిహితులైపోవటమే విచిత్రం. – సాక్షి, అమరావతి -
వివేకానంద్ రెడ్డి హత్య.. అసలు నిజాలు..
-
అడ్డంగా దొరికిపోయిన సునీత
-
దస్తగిరిది ఎంత క్రిమినల్ మైండ్ అంటే..
వైఎస్సార్, సాక్షి: వివేకా కేసులో దస్తగిరి అప్రూవర్గా మారడం వెనుకా పెద్ద కుట్ర దాగి ఉందని.. కేసు మొదటి నుంచి అతను అబద్ధాలే చెబుతున్నాడని అంటున్నారు దేవిరెడ్డి శంకర్రెడ్డి తనయుడు డా.చైతన్యరెడ్డి. ఈ కేసులో తాజాగా జరుగుతున్న పరిణామాలపై.. దస్తగిరి చేసిన ఆరోపణలపై ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. దస్తగిరి ఎవరి డైరెక్షన్లో మాట్లాడుతున్నాడో అందరికీ అర్థమవుతోంది. చంద్రబాబు చెప్పడం.. సునీత చెప్పడం.. దస్తగిరి ఆరోపణలు చేయడం. ఈ డ్రామాలు, కథలు ఇప్పటివి కాదు. కేసు మొదటి నుంచి అతను అబద్ధాలే చెబుతున్నాడు. దస్తగిరి అంత క్రిమినల్ మైండ్ ఎవరికీ లేదు. ఇదంతా మా నాన్న(శంకర్రెడ్డి) బెయిల్ పిటిషన్ కోర్టులో నడుస్తుందనే చేస్తున్నారు. నా తండ్రిని చెయ్యని తప్పుకి రెండున్నరేళ్లు జైల్లో ఉంచారు. ఆయనకు బెయిల్ రాకుండా ఉండేందుకే కట్టుకథలు అల్లుతున్నారు. ఒకవేళ వాళ్లు అనుకున్నట్లు బెయిల్ తిరస్కరణకు గురైతే.. మళ్లీ నాలుగైదు నెలలు ఇలాంటివి ఏమీ ఉండవు.. దస్తగిరి అప్రూవర్గా మారడంలోనూ కుట్ర దాగుంది. హత్య జరిగిన తర్వాత డాక్యుమెంట్స్ కోసం వెతికామని దస్తగిరి చెబుతున్నాడు. ఆ టైంలో ఎవరైనా పారిపోవాలని చూస్తారుగానీ.. డాక్యుమెంట్స్ కోసం వెతుకుతారా?. వివేకా పీఏ కృష్ణారెడ్డి కూడా కిందపడి రక్తపు వాంతులతోనే వివేకానందరెడ్డి చనిపోయారని చెప్పారు. హత్య తరువాత మీడియా ఎదుట మాట్లాడింది మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి. హత్య జరిగిన నాడు.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి రాత్రంతా వాట్సాప్లో యాక్టీవ్గా ఉన్నారని అరోపిస్తున్నారు. అది ఎన్నికల టైం. ఒక ఎంపీగా ఆయనకు సవాలక్ష మెసేజ్లు వచ్చి ఉంటాయి. మరి అంతకు ముందెప్పుడు ఆయన అలా వాట్సాప్లో యాక్టివ్గా ఉన్నారో? లేదో? చూడండి. ఈ విషయాలన్నింటి గురించి ఎందుకు ప్రశ్నించడం లేదు. అసలు కేసు నిష్పక్షపాతంగా జరగడం లేదని వివేకా కూతురు సునీత ఎందుకు ప్రశ్నించరు?. ‘‘నేను కడప సెంట్రల్ జైలుకు మెడికల్ క్యాంపు కోసం వెళ్లాను. అక్కడ ఉండేవాళ్ల ఆరోగ్య పరీక్షల నిమిత్తమే వెళ్లా. నిజంగా దస్తగిరిని బెదిరించి ఉంటే.. అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదు?. పైగా జైల్లో ప్రతీ చోటా సీసీ కెమెరాలు ఉంటాయి. క్యాంపులో నాతో పాటు జైలు అధికారులు, వైద్యాధికారులు, సిబ్బంది కూడా ఉంటారు. అప్పుడే ఫిర్యాదు చేసి ఉంటే.. సాక్ష్యాధారాలతో పట్టుబడి ఉండే వాడిని కదా!. మూడు నెలల తర్వాత ఫిర్యాదు చేయడంలో ఆంతర్యం ఏమిటి?.. అని చైతన్య పశ్నించారు. -
సునీత వ్యాఖ్యల పై దేవులపల్లి అమర్ విశ్లేషణ
-
సునీత మాట్లాడినవన్నీ బాబు పలికించినవే
సాక్షి, అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కూతురు సునీత ఇన్నాళ్లూ ఎవరి ప్రతినిధిగా మాట్లాడుతున్నారో, తప్పుడు కేసును ఎలా అల్లుతున్నారో బట్టబయలైందని, ముసుగు తొలగిపోయిందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఢిల్లీలో శుక్రవారం మీడియా సమావేశంలో సునీత మాట్లాడిన మాటలే ఇందుకు నిదర్శనమన్నారు. ఆమె మాట్లాడినవన్నీ చంద్రబాబు పలికించినవే అనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏమీ ఉండదన్నారు. రాజకీయ కుట్రతోనే సునీతతో చంద్రబాబు మీడియా సమావేశం పెట్టించారని తెలిపారు. సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘వైఎస్ వివేకా ఎమ్మెల్సీగా ఓడిపోవడానికి మేమే కారణమని ఆరోపించడం విడ్డూరం. కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 2017లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ మెజార్టీతో గెలవడానికి టీడీపీకంటే వైఎస్సార్సీపీకి 160 ఓట్లు ఎక్కువ ఉన్నాయి. అందువల్లే తన చిన్నాన్న వైఎస్ వివేకాను పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ అభ్యర్థిగా నిలబెట్టారు. చంద్రబాబులా ఓడిపోయే సీటుకు పోటీ పెట్టలేదు. వైఎస్ చనిపోయిన తర్వాత వివేకా కాంగ్రెస్లోకి వెళ్లి జగన్ను రాజకీయంగా అంతుచూడాలని భావించారు. వైఎస్ విజయమ్మపై పులివెందుల శాసన సభ స్థానం నుంచి పోటీకి దిగారు. అయినా వివేకాను జగన్ దగ్గరకు తీసుకున్నారు. వివేకా అడగకుండానే ఆయన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా పెట్టారు. వివేకా సునాయసంగా గెలవాల్సింది. కానీ.. బలం లేకపోయినా ఆయనపై బీటెక్ రవిని చంద్రబాబు పోటీకి దింపి, అప్పట్లో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డితో కలిసి కుట్ర చేసి ఓడించారు. బీటెక్ రవి, ఆదినారాయణపై వివేకాకు కోపం ఉంది. అందుకే 2019 ఎన్నికల్లో వైఎస్ అవినాష్రెడ్డి తరఫున వివేకా అవిశ్రాంతంగా ప్రచారం చేశారు. ఆనాడు తండ్రి వివేకాను కుట్రపూరితంగా ఓడించిన బీటెక్ రవికి సునీత ఇప్పుడు కృజ్ఞతలు చెబుతున్నారు. వివేకాను ఏదన్నా చేయాలంటే బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డికే ఎక్కువ అవకాశం ఉంది. వివేకా హత్యకు కారకులైన వాళ్లను కాదని.. ఏడాది తర్వాత ఇంట్లో వాళ్లే హత్య చేశారని సునీత మాటమార్చారు. తండ్రి హత్యకు కారకులైన వారితో జట్టుకట్టి వాళ్లకే కృజ్ఞతలు చెబుతున్నారు’ అని సజ్జల మండిపడ్డారు. ఎన్నికల వేళ చంద్రబాబు రాజకీయ కుట్ర ‘సునీత చెప్పినట్లే హత్య కేసు సాధారణంగా వారం రోజుల్లో తేలిపోయేట్లయితే, అప్పట్లో అధికారంలో ఉన్న ఆమె మిత్రుడైన చంద్రబాబు ఆలోగా విచారణ పూర్తి చేసి ఎందుకు కేసు తేల్చలేదు? ఎన్నికలు దగ్గరవుతున్నందున చంద్రబాబు ఉసిగొల్పి ఆరోపణలు చేయించి తన అస్త్రాలను వాడుతున్నాడనటానికి ఇదొక ఉదాహరణ. రాజకీయ కోణంలోనే ఆమె బయటకు వచ్చింది. ప్రజా కోర్టులో తేలాలని అమె కూడా అంటోంది కదా.. అదే తేలుతుంది. కేసులకు, ప్రజలకు సంబంధం ఏముంది? సీఎం జగన్ ప్రజలకు ఏం చేస్తామని చెప్పారో దాని ప్రకారం ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆమెకు అన్యాయం జరిగిందని తప్పుడు ఆరోపణ చేసి, మీరు జగన్ను శిక్షించండి అని సునీత కోరడం విచిత్రం. ప్రజలంటే వీరికి ఎంత అలుసు? వివేకా హత్యలో సునీత కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉందేమోననే అనుమానం చాలా మందికి ఉంది. సీబీఐకి ఇచ్చిన కొన్ని వాంగ్మూలాలను లోతుగా చూస్తే అది కనిపిస్తోంది. దాన్ని తప్పించుకోడానికి దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఆమె తిప్పికొడుతున్నారేమో! విచారణ వాటి మీదా జరగాలి. ఆమె తండ్రిని ఎలా కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడో చెప్పిన హంతకుడినే సోదరుడి కింద చూస్తున్న సునీతను ఏమనాలి?’ అని సజ్జల ధ్వజమెత్తారు. చంద్రబాబు అవుట్సోర్సింగ్ ఏజెన్సీ జనసేన ‘వైఎస్సార్సీపీ నుంచి బయటకు వెళ్లిన వాళ్లను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్లంతా స్మగ్లర్లు, గూండాలు కాకుండా పోయారా? బీజేపీ వాళ్లు ఏమనుకుంటున్నారో మాకు తెలియదు కానీ చంద్రబాబు మాత్రం బీజేపీతో కలిసిపోయినట్లే ఫీల్ అవుతున్నాడు. వాళ్ల అండతో ఏదో ఒక రకంగా అర్జంటుగా కుర్చీ ఎక్కాలని బాబు తాపత్రయపడుతున్నట్లు స్పష్టమైపోయింది. పవన్ 24 సీట్లు తీసుకుని 240 సీట్లు అనుకుంటే ఎలా? జనసేనకు 30 వేల ఓట్లకు పైగా వచ్చిన 15 నియోజకవర్గాల్లో ఏడింటిని టీడీపీకి ఇచ్చాడు. మిగిలినవాటిలో ఓడిపోయేవన్నీ పవన్కు చంద్రబాబు ఇచ్చాడు. చంద్రబాబుకు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ పెట్టుకుని నేను వామనావతారం, పాతాళానికి తొక్కుతా అని పవన్ అంటే ప్రజలు నవ్వుతారు. తాడేపల్లిగూడెం సభ చూశాక బాబు, పవన్ కథ ముగిసిందన్నది అర్ధమైపోతోంది’ అని అన్నారు. -
'కడప గడ్డపై ఓ కపట నాటకం' తెరపైకి సౌభాగ్యమ్మ!
అడుగడుగునా రాక్షసత్వం కనిపించే అత్యంత విస్తృతమైన నాటకమిది. పాత్రలు ఎవరైనా.. ఆడించేది మాత్రం చంద్రబాబు నాయుడు, ఆయన కోసం పనిచేసే మనుషులే!!. చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడే అయినా... ఆయన మనుషులు అన్నిచోట్లా ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్, జనసేన, కమ్యూనిస్టులు... ఇలా ఎక్కడ ఉన్నా పనిచేసేది మాత్రం బాబు కోసమే. కాకపోతే ఎంతమంది ఎన్ని చేసినా... జనం మనసుల్లో తిరుగులేని స్థానం సంపాదించుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కోవటం ఆయనకు చేత కావటం లేదు. ప్రజాక్షేత్రంలో నేరుగా ఎదుర్కోవటం అసాధ్యమని భావించటంతో.. విషప్రచారమే లక్ష్యంగా జగన్పైకి సొంత కుటుంబీకులనే పంపటానికి కుట్రపన్నారు. కడప కేంద్రంగా... కుట్రలన్నిటికీ కేంద్రస్థానం లాంటి భయంకరమైన కూహకానికి తెరతీశారు. (సాక్షి, ప్రత్యేక ప్రతినిధి) : ఇడుపులపాయలో రెండ్రోజుల కిందట షర్మిల–సునీత కలిశారు. దానికి ఎల్లో మీడియా ఎందుకు అంత ప్రాధాన్యమిచ్చింది? హైదరాబాద్లో రెగ్యులర్గా కలిసే ఈ అక్కచెల్లెళ్లిద్దరూ ఒకరినొకరు ఇడుపుల పాయలో కలిస్తే అంత ప్రాధాన్యమెందుకు? ఎందుకంటే వైఎస్ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మను కడపలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించటమనేది ఇక్కడ దాదాపుగా ఖరారైంది. కాంగ్రెస్లో చేరి ఆ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే... బీజేపీకి తప్పుడు సంకేతాలు వెళ్లి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తమకు వ్యతిరేకంగా మారవచ్చని సునీత భయం. దీంతో... ఆమె తల్లి సౌభాగ్యమ్మను తెరపైకి తీసుకొచ్చారు. ఎందుకంటే బీజేపీలోని సీఎం రమేశ్, సుజనా చౌదరి లాంటి టీడీపీ నేతలే ఈ కేసులో ఆమెకు ఆర్థికంగా, న్యాయపరంగా సహకరించటంతో పాటు రికమెండేషన్లు, పైరవీల్లోనూ సాయం చేస్తున్నారు. ఇక తెలుగుదేశంలో చేరిపోతే... బాబు నాయుడితో, ఏబీఎన్ రాధాకృష్ణతో, వివేకాను అనైతికంగా ఓడించిన బీటెక్ రవితో తమ సత్సంబంధాలు బాహాటంగా బయటపడిపోతాయని... ఇన్నాళ్లూ కేసును వెనకనుంచి నడిపింది వీరేనన్న సత్యం వెల్లడయిపోతుందని భయం. దీంతో బాబు ప్లాన్ ప్రకారం... సునీత తల్లి సౌభాగ్యమ్మను స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టేటట్లుగా, దానికి కాంగ్రెస్, టీడీపీ నూరు శాతం మద్దతిచ్చేట్లుగా వీరి మధ్య ఒక అవగాహన కుదిరినట్లు తెలిసింది. ఇలా చేస్తే ప్రస్తుతం ఎంపీగా ఉన్న అవినాశ్ రెడ్డిపై వీలైనంత బురద జల్లవచ్చని, కుటుంబంలోని వ్యక్తి స్వతంత్రంగా పోటీ చేస్తున్నారనే ముసుగులో కుటుంబీకుల మద్దతు అడగవచ్చనేది వారి ఆలోచన. పైపెచ్చు కుటుంబంలోని వ్యక్తి ఇండిపెండెంట్గా పోటీ చేసినా... మద్దతివ్వకుండా ఆమెపై అభ్యర్థిని నిలబెట్టారనే కోణంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్ పైనా దు్రష్పచారం చేయాలనేది వారి కుట్ర. ఇది కుట్ర అని అడుగడుగునా తెలిసిపోతున్నా... పాత్రధారులు మాత్రం బాబు నాయుడి ఉచ్చులో పడి ఆయన చెప్పినట్లు చేసుకుంటూ పోతుండటమే అన్నిటికన్నా విచిత్రం. వివేకా హత్య జరిగిన నాటి నుంచి వరసగా మారుతున్న పరిణామాలు... దీన్లోని లోతైన కుట్ర కోణాన్ని చెప్పకనే చెబుతాయి. మీ నాన్నను చంపింది నేనే! అని చెప్పినా... ఇతను వివేకా మాజీ డ్రైవరు. వివేకాను తానే గొడ్డలితో నరికి నరికి కిరాతకంగా చంపానని స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చి న వ్యక్తి. రూ.500, వెయ్యి అప్పులు తెచ్చుకుని గాలికి తిరిగే ఈ దస్తగిరి ఆర్థిక పరిస్థితి... వివేకా కేసులో అప్రూవర్గా మారాక ఒక్కసారిగా టర్న్ అయింది. కార్లలో డ్రై వరును పెట్టుకుని తిరిగే స్థితికి వచ్చేశాడు. వివిధ కోర్టుల్లో ఈయనపై ఉన్న కేసుల కోసం లాయర్లను సునీత, చంద్రబాబు, బీటెక్ రవి పెడుతున్నారంటే ఈ కుట్రను తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. దస్తగిరి అప్రూవర్గా మారకముందే ముందస్తు బెయిలు కోసం కోర్టులో దరఖాస్తు చేశాడు. తన తండ్రిని అత్యంత కిరాతకంగా నరికి చంపానని స్వయంగా చెప్పిన దస్తగిరి బెయిలుకు.. వివేకా కుమార్తెగా సునీత ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు. వీళ్ల మధ్య ఉన్న ఎంత గాఢమైన లోపాయికారీ ఒప్పందం ఉందో తెలియటానికి ఇది చాలదూ!!. నాన్నను అనైతికంగా ఓడించినా... క్రికెట్ బెట్టింగుల్లో స్థానికంగా చిరపరిచితుడు. బెట్టింగుల్లో పోలీసులకూ దొరికాడు. 2017లో టీడీపీ తరఫున స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కడపలో పోటీ చేసి.. వైఎస్సార్సీపీ తరఫున బరిలో నిలిచిన వైఎస్ వివేకాను అనైతికంగా ఓడించాడు. చాలినంత మంది ఎంపీటీసీ, జెడ్పీటీసీల మద్దతు లేకపోయినా... నాటి సీఎం చంద్రబాబు, మంత్రి ఆదినారాయణరెడ్డి సాయంతో వాళ్లను రకరకాలుగా ప్రలోభపెట్టాడు. కొందరిని బెదిరించి లోబరచుకుని తనకు బలం లేకున్నా వివేకాను ఓడించగలిగాడు. తండ్రిని దుర్మార్గపు పద్ధతుల్లో ఓడించిన ఈ వ్యక్తి... ఇపుడు సునీత దంపతులకు అత్యంత సన్నిహితుడంటే ఏమనుకోవాలి? కేసు గురించి, కేసుద్వారా పొందాల్సిన రాజకీయ ప్రయోజనాల గురించీ వీరు నిత్యం సంప్రతింపులు జరుపుకొనే స్థాయిలో ఉన్నారంటే ఏమనుకోవాలి? ఈ కేసులో అవినాశ్పై బురద జల్లాలనుకున్న ప్రతిసారీ... మాట్లాడేది రవి. మాట్లాడించేది సునీత దంపతులు. బీటెక్ రవి తీవ్రమైన విమర్శలు చేయటం... దాన్ని ఎల్లో మీడియా విస్తతంగా ప్రచారం చేయటం... తరవాత చంద్రబాబు సహా టీడీపీ వాళ్లు ఇవే అంశాల్ని మాట్లాడటం వీళ్ల మోడెస్ ఆపరాండీ. బాబు శిష్యుల కలయిక దేనికోసం? కనెక్షన్ అనొచ్చు... రిలేషన్ అనొచ్చు. చంద్రబాబు నాయుడు, బీటెక్ రవి, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, సునీత, షర్మిల అందరూ ఇందులో భాగమే. ఆ రాష్ట్రమూ కాదు... ఆ పార్టీ కూడా కాదు. కానీ రేవంత్రెడ్డిని బీటెక్ రవి వెళ్లి కలిశాడంటే ఏమిటర్థం? అప్పటిదాకా తెలంగాణలోనే చావో రేవో అన్న షర్మిల... ఆ తరవాత కాంగ్రెస్లో చేరి నేరుగా ఏపీకి వచ్చి ఈ రకమైన మంత్రాంగం నడుపుతున్నారంటే ఏమనుకోవాలి? అయినా ఇది చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన సంఘటన. మూడు నెలల తరవాత మరో ప్రభుత్వం వచ్చింది. పోలీసులూ వారే... దర్యాప్తు మొదలుపెట్టిందీ వారే. ఇంత స్పష్టంగా నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఆదేశాలతో లేఖ, ఫోన్ దాచిపెడితే వారిని ఎందుకు విచారించలేదు? రాజకీయాలకు, విమర్శలకు ఈ సంఘటనను వాడుకుని... అసలు కేసును నీరుగార్చింది నాటి చంద్రబాబు ప్రభుత్వం కాదా? అసలు ఇన్ని కుట్రలు చేసే బదులు బాబు నేరుగా టీడీపీ టికెట్టే ఇవ్వవచ్చు కదా? అపుడు ప్రజల్లో ఎవరి బలం ఎంత ఉందో తెలిసిపోతుందిగా? కుట్రలకు, కుతంత్రాలకు విలువ ఉందో... లేక మంచి చేసిన ప్రభుత్వానికి విలువ ఉందో తేలిపోతుందిగా? ఏమంటావ్ బాబూ!!? మొదట చూశారు... కుమార్తెకు చెప్పారు వివేకా మృతదేహాన్ని మొదట చూసింది ఆయన పీఏ కృష్ణారెడ్డే. అక్కడే రక్తపు మరకలతో ఉన్న లేఖను, వివేకా మొబైల్ ఫోన్ను ఈయన తీసుకున్నాడు. అదే విషయాన్ని సునీతకు ఫోన్లో చెప్పాడు. సునీతతో పాటు వివేకా బావమరిది నర్రెడ్డి శివప్రసాద్ రెడ్డికి (ఈయన సునీత భర్త రాజశేఖరరెడ్డికి, సౌభాగ్యమ్మకు సొంత సోదరుడు) కూడా చెప్పాడు. ఈ విషయం కాల్ రికార్డ్స్లోనూ వెల్లడయింది. వివేకా గురించి సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి చెప్పగానే... ఆ లేఖను, వివేకా ఫోన్ను ఎవ్వరికీ ఇవ్వవద్దని కృష్ణారెడ్డిని ఆయన ఆదేశించారు. దీంతో ఆయన తదుపరి వచ్చి న బంధువులకు గానీ, పోలీసులకు గానీ ఎవ్వరికీ దీన్ని చూపించలేదు. ఆ లేఖను చూపించి ఉంటే...దాన్లోని రక్తాన్ని చూసైనా ఎవ్వరూ మృతదేహాన్ని ముట్టుకునేవారు కాదేమో. కానీ నర్రెడ్డి ఆదేశాలతో ఆయన ఎవ్వరికీ దీన్ని చూపించలేదు... చెప్పలేదు. ఈ విషయాన్ని సునీతే పోలీసుల దగ్గర అంగీకరించారు. అలా ఎందుకు చెప్పారని అడిగితే... కృష్ణా రెడ్డికి ప్రాణభయం ఉంటుందనే ఉద్దేశంతోనే అలా చెప్పామన్నారు. లేఖ రాసింది తన తండ్రేనని, చేతిరాత ఆయనదేనని కూడా సునీత పోలీసు డీజీపీ ఎదుట అంగీకరించారు. నిజానికి రక్తంతో రాసిన ఆ లేఖను ఎవరు చూసినా... అది సహజ మరణం కాదని తేలిగ్గా అర్థమవుతుంది. పోలీసులకో, అక్కడికి వచ్చి న వారికో వెంటనే ఆ లేఖను ఇచ్చి ఉంటే... అక్కడి వ్యవహారం మరోలా ఉండేది. ఇది చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు జరిగిన హత్య. అప్పటి పోలీసులు గానీ, సీబీఐ గానీ ఎందుకు ఈ లేఖ, ఫోన్ చూపించలేదని... ఫోన్లో నుంచి వివేకా– ఆయన రెండో భార్య షమీమ్ సంభాషణల్ని ఎందుకు డిలీట్ చేశారని, సునీతను దూషిస్తూ షమీమ్ లేవనెత్తిన అంశాలను ఎందుకు డిలీట్ చేశారని విచారించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అసలు ఆ కోణాన్నే పట్టించుకోలేదెందుకో..!!. ఈ హత్యలో ఎల్లో మీడియా చేస్తున్న మరో దు్రష్పచారమేంటంటే... ఎంపీ అవినాశ్రెడ్డి ముందే అక్కడకు చేరుకున్నారనేది. నిజానికి అవినాశ్ అక్కడకు చేరేసరికే జనం పోగై ఉన్నారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని, సిగరెట్లు ఎక్కువ తాగుతారు కనుకనే ఇలా జరిగిందని తనతో నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి చెప్పినట్లు స్వయంగా నాటి టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి చెప్పారు. అదే శివప్రకాశ్ రెడ్డి అవినాశ్కూ ఫోన్ చేసి, ‘‘బావ చనిపోయారు. అర్జెంటుగా అక్కడకు వెళ్లు’’ అన్నారు. దీంతో జమ్మలమడుగులో ఎన్నికల ప్రచారానికని అప్పుడే బయల్దేరిన అవినాశ్రెడ్డి.. వెంటనే యూ టర్న్ తీసుకుని అక్కడకు చేరుకున్నారు. ఆయన ఫోన్ చెయ్యకుండా ఉంటే అవినాశ్కు విషయం తెలిసేదే కాదు. ఆయన అక్కడకు రాకుండా ఎన్నికల ప్రచారానికి వెళ్లిపోయి ఉండేవారు. బావ చనిపోయారు.. వెళ్లమని చెప్పిన నర్రెడ్డి శివప్రసాద్... ఎలా చనిపోయారనేది కానీ, లెటర్– ఫోన్ సంగతి కానీ చెప్పలేదు. ఇదంతా ఒక్క స్కెచ్ ప్రకారం జరిగిందనటానికి ఇంతకన్నా ఏం కావాలి? ఆస్తి కోసం సునీతతో విభేదాలు వివేకా మరణించిన నాడు షమీమ్కు, వివేకాకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, మెసేజుల్లో చాలా అంశాలున్నాయి. ముఖ్యంగా సునీత గురించి జరిగిన ఎస్ఎంఎస్/సంభాషణలన్నీ ఆ తరవాత డిలీట్ చేసేశారు. ఎందుకు చేశారనేది దర్యాప్తు చేయనేలేదు. వివేకాకు, షమీమ్కు ఒక కుమారుడు ఉన్నాడనే అంశాన్ని సైతం రహస్యంగానే దాచిపెట్టారు. షమీమ్ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వివేకాను ఆయన కుమార్తె, అల్లుడు, బావమరిది ఏ రకంగా హింస పెట్టారు... చెక్ పవర్ తీసేసి ఆర్థికంగా ఎలా నిర్వీర్యం చేశారో స్పష్టంగా చెప్పారు. దస్తగిరి తాను వివేకాను చంపటానికి ముందు కొన్ని డాక్యుమెంట్ల కోసం ఇల్లంతా వెతికినట్లు సాక్షులు చెప్పారు. కానీ దర్యాప్తులో ఆ అంశాలకు విలువే ఇవ్వలేదు. అంతేకాదు. తొలుత ఛార్జిషీట్లో వివేకాకు, ఏ1గా పేర్కొన్న ఎర్ర గంగిరెడ్డికి ఆర్థికపరమైన వివాదాలున్నాయని, వివేకాకు ఏ2 సునీల్ యాదవ్ తల్లితోను, ఏ3 ఉమామహేశ్వరరెడ్డి భార్యతోను అక్రమ సంబంధాలున్నాయని స్పష్టంగా ఉన్నప్పటికీ... ఆ కోణాన్ని తరువాతి ఛార్జిషీట్లలో పూర్తిగా తొక్కిపట్టేశారు. దూరం 700 మీటర్లే అవినాశ్, వివేకా ఇళ్ల మధ్య ఉన్న దూరం ఏరియల్ డిస్టెన్స్ అయితే 250 మీటర్లు. రోడ్డు మార్గాన అయితే 700 మీటర్లు. గూగుల్ టేకవుట్ పేరు చెప్పి వివేకా ఇంట్లో ఉన్న ఒక మనిషిని అవినాశ్ ఇంటికి వచ్చినట్లు ఎలా నిర్ధారిస్తారు? ఆ రోజు ఉదయం అవినాశ్ ఎన్నికల ప్రచారం కోసం జమ్మలమడుగుకు బయలుదేరి పులివెందుల రింగ్రోడ్లోకి ప్రవేశించిన వెంటనే నర్రెడ్డి శివప్రసాద్ ఫోన్ చేసి వివేకా మరణం గురించి చెప్పారు. వెంటనే ఆయన యూ–టర్న్ తీసుకుని తనతో ఉన్న 3 వాహనాలతో సహా వివేకా ఇంటికి వెళ్లారు. ఫోన్ వచ్చి న రెండు నిమిషాల్లోనే ఎలా వచ్చారనేది సీబీఐ ప్రశ్న. నిజానికి రింగ్రోడ్డు (కృష్ణాలయం) నుంచి వివేకా ఇంటికి రెండు నిమిషాలు చాలు. పైపెచ్చు ఉదయాన్నే రోడ్లు ఖాళీగా ఉంటాయి కదా!. -
Viveka Case : సునీత పిటిషన్ జులై 3కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్ వివేకా హత్య కేసులో.. సునీతారెడ్డి పిటిషన్పై విచారణను వచ్చే నెల(జులై) 3వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఎంపీ అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్ను రద్దు చేయాలంటూ సునీతారెడ్డి వేసిన పిటిషన్పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలోని బెంచ్ ఇవాళ(జూన్ 19, సోమవారం) విచారణ జరిపింది. సునీత తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఈ నెలాఖరు (జూన్ 30) కల్లా వివేకా హత్య కేసుపై సిబిఐని దర్యాప్తు పూర్తి చేయమని ఇప్పటికే సుప్రీంకోర్టు గడువు విధించింది. ఈ విషయాన్ని సిద్ధార్థ లూథ్రా న్యాయస్థానానికి గుర్తు చేశారు. ఈ నెలాఖరుతో సిబిఐ దర్యాప్తు గడువు ముగుస్తున్నందున ఎంపీ అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్ను వెంటనే రద్దు చేయాలని కోరారు. అయితే ఈ విజ్ఞప్తిని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలోని బెంచ్ అంగీకరించలేదు. కేసు విచారణను జులై 3వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. తదుపరి విచారణ కోసం చీఫ్ జస్టిస్ CJI బెంచ్ ముందు లిస్ట్ చేయాలని ఆదేశించింది. అలాగే ఈ కేసులో వాదనలు వినిపించాల్సిందిగా ప్రతివాదులయిన అవినాష్ రెడ్డి, CBIలకు నోటీసులు జారీ చేసింది. Supreme Court is hearing a plea by the daughter of former MP late YS Vivekananda Reddy against a Telangana High Court order granting anticipatory bail to Kadapa MP YS Avinash Reddy in connection with her father's murder.#SupremeCourt #SupremeCourtofIndia pic.twitter.com/Xs5HCAjpXz — Bar & Bench (@barandbench) June 19, 2023 పిటిషన్కు కాలం చెల్లే అవకాశం! వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తునకు ఈ నెలాఖరు సుప్రీంకోర్టు డెడ్లైన్గా విధించిన సంగతి తెలిసిందే. అలాగే సునీతా రెడ్డి పిటిషన్ ను జులై 3కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో.. CBI చార్జిషీట్ దాఖలు చేస్తే గనుక ముందస్తు బెయిల్ రద్దు చేయాలన్న సునీత పిటిషన్ కు కాలం చెల్లిపోయే అవకాశం ఉంది. గత విచారణలో సునీత తీరుపై అసంతృప్తి వివేకా కేసుకు సంబంధించి సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న అవినాష్రెడ్డికి మే 31వ తేదీన షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. ఈ ఆదేశాల్ని సవాల్ చేస్తూ సునీతారెడ్డి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసింది. గత విచారణ సమయంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును కోరింది సునీత. అంతే కాదు, హైకోర్టు మినీ ట్రయల్ ను నిర్వహించిందని, తమ వాదనల్లో మెరిట్ పరిశీలించకుండా బెయిల్ ఇచ్చిందని తెలిపింది. దీనిపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అవినాష్ ను అరెస్ట్ చేయించాలన్న తాపత్రయం సునీతలో కనిపిస్తోందని, కేవలం ఇగో క్లాషెస్ కోసం వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోందని మొన్నటి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. Justice Surya Kant: Returnable on 7th July. Counsel: There is a connected matter. Justice Kant: List before first bench on 3rd July 2023, after getting appropriate orders from CJI. #SupremeCourt #SupremeCourtOfIndia — Live Law (@LiveLawIndia) June 19, 2023 తన వాదనే వినాలి, తాను చెప్పిందే నమ్మాలి అన్నట్టుగా కనిపించిన సునీత తీరు ఆశ్చర్యకరంగా ఉంది. ఏ న్యాయస్థానమయినా.. ఎలాంటి అభియోగాలపైనా అయినా.. వాదనలతో పాటు దానికి సంబంధించిన ఆధారాలను పరిశీలించిన పిమ్మటే నిర్ణయం తీసుకుంటుందన్న విషయాన్ని సునీత విస్మరించినట్టు కనిపించింది. ఇదీ చదవండి: మీ తీరు పంతాలకు పోయినట్టుంది.. సునీతతో సుప్రీంకోర్టు అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్కి కారణం ఇదే.. -
YS Viveka Case: మీ తీరు పంతాలకు పోయినట్టుంది.. సునీతతో సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ఎంపీ అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్ను రద్దు చేయాలంటూ సునీతారెడ్డి వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. సునీత రెడ్డి వేసిన పిటిషన్పై సీబీఐకి నోటీసులు ఇచ్చేందుకు నిరాకరించింది సుప్రీం కోర్టు. కేసును ఈ నెల 19కి వాయిదా వేసింది సర్వోన్నత న్యాయస్థానం. సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ A.అమానుల్లా నేతృత్వంలోని బెంచ్ ముందుకు ఈ పిటిషన్ విచారణకు రాగా కేసులో తానే వాదనలు వినిపిస్తానంటూ సునీతారెడ్డి ముందుకు వచ్చింది. దీనిపై స్పందించిన జస్టిస్ విక్రమ్ నాథ్ ఎవరైనా లాయర్ ను పెట్టుకోవాలని సూచించింది. సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ లుథ్రాను సునీతకు సాయం చేయాలని కోరింది. సునీత : సీబీఐ దర్యాప్తునకు అవినాష్ ఏ మాత్రం సహకరించడం లేదు. ఏప్రిల్ 24 తర్వాత 3 సార్లు నోటీసులిచ్చినా విచారణకు రాలేదు జస్టిస్ విక్రమ్ నాథ్ : ఈ కేసులో అంత అత్యవసరమైన పరిస్థితి ఏముంది? వెకేషన్ ముందున్న బెంచ్కు రావాల్సిన పరిస్థితి ఉందా? జస్టిస్ A.అమానుల్లా : ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలా? లేదా అన్నది దర్యాప్తు సంస్థ చూసుకుంటుంది. ఎవరిని ఎప్పుడు అరెస్టు చేయాలో, ఎవరిని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలో CBIకి తెలుసు. ఈ కేసులో చాలా సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నాయి. సునీత : ఇతర నిందితులతో కలిసి అవినాష్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారు. ఇదే కేసులో సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా హైకోర్టు ఆదేశాలిచ్చింది సుప్రీంకోర్టు : అవినాష్ రెడ్డి CBI ముందు హాజరవుతున్నారు కదా, అలాగే దర్యాప్తుకు సహకరిస్తున్నప్పుడు CBIకి కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరం ఏముంది? ఈ కేసులో మీరు తొందరపడి వ్యక్తిగతంగా వాదనలు వినిపించాలనుకుంటే నష్టపోతారు, మీరు (సునీతను ఉద్దేశించి) న్యాయశాస్త్రంలో నిష్ణాతులు కాకపోవచ్చు. మీ పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేస్తే.. తర్వాత వచ్చే లాయర్ కు సమస్య ఎదురవుతుంది. సెలవుల తర్వాత ఈ కేసును పరిశీలిద్దామా? సీనియర్ లాయర్ లుథ్రా: ఈ నెలాఖరులోగా సిబిఐకి ఇచ్చిన దర్యాప్తు గడువు ముగుస్తుంది సుప్రీంకోర్టు : మిస్టర్ లుథ్రా.. మీరు సమస్యలు సృష్టిస్తున్నారు. వాదనలు వద్దంటున్నా.. మీరు తలదూర్చాలనుకుంటున్నారు. ఈ కోర్టులోనే ఒక బెంచ్ విధించిన గడువుపై మేం మళ్లీ ఉత్తర్వులు ఇవ్వాలా? సునీత : ఈ కేసులో విచారణకు హాజరు కావాలని సిబిఐని ఆదేశించండి సుప్రీంకోర్టు : అలాంటి ఉత్తర్వులు మేమేలా ఇస్తాం? ఈ పిటిషన్ లో విచారణకు రావాలా లేదా అన్నది CBI ఇష్టం. జులై 3న రండి సునీత : హైకోర్టు అనేక అంశాలను పరిగణలోకి తీసుకోలేదు. సీబీఐ సేకరించిన సాక్ష్యాలను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా హైకోర్టు ఆదేశాలిచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను సమీక్షించే తుది అధికారం సుప్రీంకోర్టుకు ఉందని గతంలో మీరు చెప్పారు కదా జస్టిస్ A.అమానుల్లా : మీరు ఆరోపణలు చేస్తున్న నిందితుడు మీ కజినా? సునీత : అవును, అవినాష్ రెడ్డి నాకు సెకండ్ కజిన్ సీనియర్ లాయర్ లుథ్రా: ఈ కేసును రేపు పరిశీలించండి. రేపు అడ్వొకేట్ ఆన్ రికార్డును కోర్టు ముందుంచుతాం. నేను వాదనలు వినిపిస్తాను సుప్రీంకోర్టు : మీరు అడిగినట్టు CBIకి నోటీసులు ఇవ్వలేం. కేసును జూన్ 19వ తేదీకి (వచ్చే సోమవారం) వాయిదా వేస్తున్నాం తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ జారీ చేసిన బెయిల్ను సవాల్ చేస్తూ సునీతా రెడ్డి వేసిన పిటిషన్లో సిబిఐకి నోటీసులు జారీ చేయాలని కోరినా.. సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ఈ కేసులో సునీత తీరు పంతాలకు పోయి వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోందని అభిప్రాయపడింది. కేవలం అవినాష్ రెడ్డిని జైల్లో వేయించడమే లక్ష్యంగా సునీత తీరు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. కేసుకు సంబంధించి అదనపు పత్రాలు సమర్పించేందుకు సునీతకు అవకాశమిచ్చింది సుప్రీంకోర్టు. ఈ కేసును జూన్ 19న పరిశీలిస్తానని తెలిపింది. -
అవినాష్రెడ్డి సహకరిస్తున్నా.. లేదంటూ మెన్షన్!
సాక్షి, ఢిల్లీ: వివేకా హత్య కేసులో సుదీర్ఘ వాదనలు జరిగిన అనంతరం తెలంగాణ హైకోర్టు(వెకేషన్ బెంచ్) కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్మంజూరు చేసింది. అయితే ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్ సునీతారెడ్డి వేసిన పిటిషన్పై మంగళవారం విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది. జూన్ 13న జస్టిస్ అనురుద్ధ బోస్, జస్టిస్ రాజేశ్ బిందాల్తో కూడిన ధర్మాసనం సునీత దాఖలు చేసిన పిటిషన్ను విచారణ చేపట్టనుంది. తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ అవినాష్ రెడ్డికి ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలన్నది సునీత పిటిషన్ సారాంశం. ఇవాళ(శుక్రవారం) సుప్రీంకోర్టులో పిటిషన్పై మెన్షన్ చేసిన సునీత తరపు న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా విచారణ చేపట్టాలని కోరారు. వివేకా కేసులో దర్యాప్తు కోసం రావాలని సీబీఐ కోరుతున్నా.. అవినాష్రెడ్డి హాజరు కాలేదని న్యాయవాది లూథ్రా కోర్టుకు తెలిపారు. అయితే, ఇప్పటివరకు 7 సార్లు అవినాష్ రెడ్డి సీబీఐ ముందు హాజరు అయిన విషయం తెలిసిందే. బెయిల్ తర్వాత కూడా శనివారం రోజున అవినాష్రెడ్డి సీబీఐ ముందు హాజరయ్యారు. ఈ విషయాన్ని సమగ్రంగా వివరించకుండా.. అవినాష్రెడ్డి లక్ష్యంగా కొన్ని తప్పుడు వాదనలు వినిపించారు సునీత తరపు న్యాయవాది. ఇక తెలంగాణ హైకోర్టులో వెకేషన్ బెంచ్ ముందు జరిగిన వాదనల సందర్భంగా హైకోర్టు లేవనెత్తిన ప్రశ్నలను మాత్రం సునీత తన పిటిషన్లో సుప్రీంకోర్టు ముందు ఉంచకపోవడం గమనార్హం. ఎలాంటి ఆధారాలు లేకుండా, కేవలం హియర్ సే పేరుతో, కొన్ని కల్పిత కథనాలను సృష్టించి, వాటిని తెలుగుదేశం సహకారంతో ఎల్లో మీడియాలో పబ్లిష్ చేయించి వాటి ఆధారంగానే మరోసారి సుప్రీంకోర్టును సునీత ఆశ్రయించినట్టు తాజా పిటిషన్ ద్వారా అవగతమవుతోంది. దర్యాప్తునకు అవినాష్రెడ్డి అన్నివిధాలుగా సహకరిస్తున్నప్పటికీ.. సునీత తరపు న్యాయవాది మాత్రం ఆయన దర్యాప్తును అడ్డుకుంటున్నారంటూ ధర్మాసనానికి వినిపించారు. దీనిపై స్పందించిన బెంచ్.. పిటిషన్పై మంగళవారం విచారణ జరుపుతామని తెలిపింది. ఇదీ చదవండి: ఇది వ్యక్తిగత దాడి మాత్రమే కాదు! -
వివేకా హత్య కేసు: వైఎస్ విమలారెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, కర్నూల్: వైఎస్ వివేకా హత్య కేసు విషయమై వైఎస్సార్ సోదరి వైఎస్ విమలారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకాను చంపిన వారు బయట విచ్చలవిడిగా తిరుగుతున్నారని అన్నారు. అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, వైఎస్ విమలమ్మ బుధవారం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మిని ఆసుపత్రిలో పరామర్శించారు. అనంతరం, విమలమ్మ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీలక్ష్మి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. ఇంకా లిక్విడ్స్పైనే ఉన్నారని అన్నారు. ఈ క్రమంలోనే వివేకాను హత్య చేసిన వాళ్లు బయట తిరుగుతుంటే తప్పు చేయని అవినాష్ కుటుంబం ఎంతో బాధపడుతోంది. ఏ తప్పు చేయని అవినాష్ను టార్గెట్ చేయడం సరికాదు. తప్పు చేయలేదంటున్న వాళ్లు బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. వివేకా హత్యలో మా ఫ్యామిలీ వాళ్లు లేరని మొదట చెప్పిన వైఎస్ సునీత ఇప్పుడు ఎందుకు మాట మార్చిందో తెలియదు. సునీత వెనుక కొన్ని దుష్టశక్తులు ఉన్నాయి. అసత్య ఆరోపణల వల్ల అవినాష్ తల్లి తల్లడిల్లిపోతోంది. అవినాష్ రెడ్డి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. అవినాష్ను టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. న్యాయం జరుగుతుందున్న నమ్మకంతో అవినాష్ ఉన్నారు అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: అనారోగ్యంపై విష కథనాలా? -
వివేకా కేసు దర్యాప్తు జూన్ 30 వరకు పొడిగింపు
► వివేకా హత్య కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ హత్య కేసులో దర్యాప్తు గడువును జూన్ 30 వరకు పొడిగించింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ గడువు ఏప్రిల్ 30కి ముగియాల్సి ఉంది. తాజా ఉత్తర్వులతో సీబీఐకి మరో రెండు నెలల అదనపు గడువు వచ్చినట్టయింది. ► ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ గురించి ఈ సమయంలో అడగాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయలేదు. ఒక వేళ నిజంగానే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని సీబీఐ భావించి ఉంటే.. ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసి ఉండేది. లిఖిత పూర్వకంగా ప్రశ్నలు, సమాధానాలు ఇవ్వాలన్న హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేస్తున్నాం- చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ పూర్తి ఆదేశాలు 1. తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను పరిశీలించాం. కడప ఎంపీ అవినాష్ రెడ్డి వేసిన పిటిషన్ ఆధారంగా ఆదేశాలిచ్చారు. 2. వైఎస్ వివేకానందారెడ్డి ఆయన ఇంట్లో హత్యకు గురయ్యారు. ఆయన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి సోదరుడు. 3. హత్య గురించి వివేకా పీఏ MV కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఒక సిట్ ఏర్పాటయింది. అలాగే కేసును అడిషనల్ డైరెక్టర్ నేతృత్వంలో సిబిఐ దర్యాప్తు చేస్తోంది. 4. వివేకా కూతురు విజ్ఞప్తి మేరకు కేసును బదిలీ చేశాం. సిబిఐ వేసిన ఛార్జ్షీట్లో నలుగురి పేర్లు ఉన్నాయి. నవంబర్ 17, 2021న శివశంకర్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసింది. జనవరి 31, 2022న సిబిఐ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ను దాఖలు చేసింది 5. ఏప్రిల్ 16న దర్యాప్తుకు హాజరు కావాలని ఎంపీ అవినాష్రెడ్డికి సిబిఐ నోటీసులిచ్చింది. దీనిపై తెలంగాణ హైకోర్టును ఎంపీ అవినాష్రెడ్డి ఆశ్రయించారు. పిటిషన్ విచారించిన హైకోర్టు..లాయర్ సమక్షంలో విచారణ జరపాలని సిబిఐకి సూచించింది. 6. అలాగే ఏప్రిల్ 19 నుంచి 25 వరకు దర్యాప్తుకు హాజరు కావాలని ప్రశ్నలను లిఖిత పూర్వకంగా ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు సూచించింది. ఆ మధ్యంతర ఉత్తర్వులను మేం కొట్టివేస్తున్నాం. 7. ఈ సమయంలో అరెస్ట్ చేయాలా వద్దా అన్న అంశాల జోలికి వెళ్లడం లేదు. నిజంగా అవినాష్రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయాలని భావించి ఉంటే ఎప్పుడో అరెస్ట్ చేసి ఉండేవాళ్లు. సిబిఐ కూడా ఒక పద్ధతిలో దర్యాప్తు చేస్తోంది. సీబీఐ అరెస్టు చేస్తుందని మీరెందుకు ఊహిస్తున్నారు?. 8. కేసు దర్యాప్తు గడువును జూన్ 30 వరకు పొడిగిస్తున్నాం. 9. ఏప్రిల్ 25న తెలంగాణ హైకోర్టు ముందుకు రానున్న పిటిషన్ లో ముందస్తు బెయిల్ కు సంబంధించి ఎంపీ అవినాష్ తన వాదనలు వినిపించుకోవచ్చు 10. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాల ప్రభావం అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై ప్రభావం చూపరాదు. వైఎస్ అవినాష్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు అవినాష్ రెడ్డి ఎంపీగా బాధ్యత గల పదవిలో ఉన్నారు, ఎక్కడికి వెళ్లడం లేదు సిబిఐ ముందు ఇప్పటివరకు ఏడుసార్లు విచారణకు హాజరయ్యారు విచారణకు అవినాష్ రెడ్డి పూర్తిగా సహకరిస్తున్నాడు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులలోని పేరా 18 తప్పుడు గా అన్వయం చేస్తున్నారు అవినాష్ రెడ్డి ఎలాంటి సాక్ష్యం ధ్వంసం చేయలేదు, పైగా అన్ని వైపులా అవినాష్ పై దాడి జరుగుతోంది ► అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై రేపు(మంగళవారం) తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తాము ఇవాళ ఇచ్చిన తీర్పు ప్రభావం ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణపై ఉండకూడదని పేర్కొంది. ఇదీ చదవండి: ఏది నిజం? వివేకా హంతకులను నడిపిస్తుందెవరు? -
హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్: రెండో రోజు విశేషాలు ఇవే..
హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ కార్యక్రమాల్లో భాగంగా రెండో రోజు శనివారం ఉదయం 10 గంటలకు ‘ది లాస్ట్ హీరోస్–ఫూట్ సోల్జియర్స్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడ మ్’ అనే అంశంపై సీనియర్ పాత్రికేయులు, రచయిత పాలగుమ్మి సాయినాథ్ ప్రసంగించనున్నారు. కార్యక్రమానికి సునీతారెడ్డి సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. ► ఉదయం 10.50 నుంచి 11.35 గంటల వరకు ‘కాన్స్టిట్యూషన్ : ఏ సిస్ఫియన్ లైఫ్ ఇన్ లా’ అనే అంశంపై ప్రొఫెసర్ కల్పన కన్నబీరన్, ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడతారు. ప్రముఖ రచయిత్రి ఓల్గా సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. ► ఉదయం 11.40 గంటల నుంచి 12.25 వరకు ఎవరెస్టు అధిరోహించిన విజేతలు అపర్ణ తోట, పూర్ణ మాలావత్లతో ఉమా సుధీర్ ప్రత్యేక కార్యక్రమం. ► కావ్యధార వేదికపై ఉదయం10.50 గంటలకు బహు భాషా కవితా పఠనం. దీప్తి నావల్, జెర్రీ పింటో, కల్యాణీ ఠాకూర్లు పాల్గొంటారు. ► స్టోరీ టెల్లింగ్లో భాగంగా ఉదయం 10 .30 నుంచి 11.20 వరకు ప్రముఖ స్టోరీ టెల్లర్ దీపాకిరణ్ ఆసక్తికరమైన కథలు చెబుతారు. ► మధ్యాహ్నం 2 గంటల నుంచి 2.45 వరకు గోవా భాషలు (గోవా బార్డరీ బర్రెట్టో) అనే అంశంపైన ప్రముఖ కొంకణి రచయిత దామోదర్ మౌజో,జెర్రీ పింటో మాట్లాడతారు. గిరిధర్రావు సమన్వకర్తగా వ్యవహరిస్తారు. ► మధ్యాహ్నం 3.40 నుంచి 4.25 వరకు విమెన్ ఇన్ సైన్స్ అనే అంశంపైన చర్చా కార్యక్రమం ఉంటుంది. నస్రీన్ ,వినీత బాల్, సాగరి రాందాస్, తదితరులు పాల్గొంటారు. ► సాయంత్రం 5.20 నుంచి 6.20 గంటల వరకు ఫుగ్డీ అండ్ ధాలో కొంకణి జానపద నృత్యరూపకం. ధ్యానజ్యోతి మహిళా మండలి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ► సాయంత్రం 6.30 నుంచి 8 గంటల వరకు నాన్ నూకడ్ వేదికపై ప్రత్యేక సంగీత కార్యక్రమం. వరిజశ్రీ వేణుగోపాల్ నిర్వహిస్తారు. -
వివేకా హత్యపై వింత వాదనలు
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి వ్యవహరిస్తున్న తీరు సందేహాస్పదంగా మారుతోంది. వారిని అడ్డుపెట్టుకుని సాగుతున్న సీబీఐ దర్యాప్తుపై అనుమానాలు బలపడుతున్నాయి. వివేకా హత్యకు పరస్పర భిన్నమైన కారణాలు చెబుతూ సునీత, ఆమె భర్త ఎన్.రాజశేఖరరెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై పరిశీలకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ఆ దంపతులు వ్యవహార శైలిని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాలు ఆశించే.. వైఎస్ వివేకానందరెడ్డిని స్వయంగా హత్య చేసిన దస్తగిరిని సీబీఐ అప్రూవర్గా మార్చడాన్ని సునీత వ్యతిరేకించనే లేదు. పైగా అతడితో తరచూ మాట్లాడుతుండటం గమనార్హం. తండ్రిని హత్య చేసిన నిందితుడితో సత్సంబంధాలు నెరుపుతూ ఇతరులపై నిరాధార ఆరోపణలు చేయడం ఏమిటన్నది అంతు చిక్కకుండా ఉంది. కేవలం రాజకీయ ప్రయోజనాలను ఆశించే సునీత, ఎన్.రాజశేఖరరెడ్డి దంపతులు ఆ విధంగా వ్యవహరిస్తున్నాని స్పష్టమవుతోంది. ఉద్దేశపూర్వకంగానే.. బెంగళూరులో భూ వివాదం నేపథ్యంలోనే వైఎస్ వివేకాను ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి, సునీల్ యాదవ్, ఉమాశంకర్రెడ్డి హత్య చేశారని సీబీఐ పేర్కొంది. ఆ మేరకు దస్తగిరి వాంగ్మూలాన్ని ఆధారంగా ప్రస్తావించింది. భూ వివాదం నేపథ్యంలోనే తన తండ్రిని హత్య చేశారనే సునీత చెప్పుకొచ్చారు. కానీ తర్వాత కడప ఎంపీ టికెట్కు అడ్డు తొలగించుకోవడం కోసమే వైఎస్ అవినాశ్రెడ్డి, వైఎస్ భాస్కర్రెడ్డి ఈ హత్య చేయించారనే ప్రచారాన్ని సీబీఐ ఉద్దేశపూర్వకంగా ప్రచారంలోకి తెచ్చింది. అందుకు సునీత, భర్త ఎన్.రాజశేఖరరెడ్డి, అతడి సోదరుడు ఎన్.శివప్రకాశ్రెడ్డి సీబీఐ ముందు ఇచ్చిన వాంగ్మూలాలను ఆధారంగా చూపించారు. హత్యకు భూ వివాదం కారణమని చెప్పినవారే... అంతలోనే పూర్తి విరుద్ధంగా కడప ఎంపీ టికెట్ కోసం హత్య చేశారని ఆరోపించడం సందేహాస్పదంగా మారింది. చార్జ్షీట్లో స్పష్టంగా పేర్కొన్న ఎన్ఐఏ తాజాగా కడప ఎంపీ టికెట్ కోసమంటూ తాము చేసిన ఆరోపణల్లో పస లేదని నిర్ధారణ కావడంతో కొత్త పల్లవి అందుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో జగన్పై హత్యాయత్నం డ్రామా అని, ఆ తరహాలోనే ఎన్నికల్లో సానుభూతి పొందేందుకే వివేకాను హత్య చేయించారని నిరాధార ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది. నాడు వైఎస్ జగన్ను హత్య చేసేందుకే నిందితుడు విశాఖ విమానాశ్రయంలో దాడికి పాల్పడినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చార్జ్షీట్లో స్పష్టంగా పేర్కొంది. మరి అలాంటప్పుడు ఆ హత్యాయత్నం అంతా డ్రామా అని సునీత, ఆమె భర్త ఎన్.రాజశేఖరరెడ్డి ఆరోపించడం ఏమిటో అర్థం కావడం లేదు. తన తండ్రి వివేకా హత్య కేసులో అసలు దోషులెవరో తేల్చాలన్న అంశంపై సునీతకు చిత్తశుద్ధి లేదన్నది తద్వారా స్పష్టమవుతోంది. కేవలం తమ రాజకీయ, ఇతరత్రా ప్రయోజనాల కోసమే ఈ కేసును ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు వెల్లడవుతోంది. వీరి తీరు ఆది నుంచి సందేహాస్పదమే.. ► వివేకా మృతి చెందారని ఆయన పీఏ ఎంవీ కృష్ణారెడ్డి మొదట సునీత, ఆమె భర్త ఎన్.రాజశేఖరరెడ్డికే సమాచారమిచ్చారు. కానీ కాసేపటికే రాజశేఖరరెడ్డి సోదరుడు అప్పటి టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి ఫోన్ చేసి వైఎస్ వివేకా గుండెపోటుతో మరణించారని ఎలా చెప్పారు? ► వైఎస్ వివేకానందరెడ్డి మృతదేహాన్ని ఆయన అనుచరుడు ఇనయతుల్లా ఫొటోలు, వీడియోలు తీసి వారి కుటుంబ సభ్యులకు ఉదయం 6.30 గంటలకే వాట్సాప్ చేశాడు. ఆ ఫొటోలు చూసిన తరువాత అయినా ఆయన్ని హత్య చేశారని సునీత, ఆమె భర్త ఎందుకు గుర్తించ లేదు? ఆ తరువాత కూడా వారు పీఏ ఎంవీ కృష్ణారెడ్డికి ఫోన్ చేసి సందేహాస్పద మృతిగా పోలీసులకు ఫిర్యాదు చేయమని ఎందుకు చెప్పారు? ► వైఎస్ వివేకా రాసినట్లు చెబుతున్న లేఖ, ఆయన సెల్ఫోన్ను పీఏ ఎంవీ కృష్ణారెడ్డి స్వాధీనం చేసుకున్నారు. ఆ విషయాన్ని సునీత, ఆమె భర్త ఎన్.రాజశేఖరరెడ్డికి చెప్పారు. మరి వాటిని వెంటనే పోలీసులకు అప్పగించాలని వారు ఎందుకు చెప్పలేదు? తాము వచ్చే వరకు వాటిని దాచి ఉంచాలని సూచించారు. వారు మధ్యాహ్నానికి పులివెందుల చేరుకున్నాక... సాయంత్రం ఆ లేఖ, సెల్ఫోన్లను పోలీసులకు అప్పగించారు. అలా ఎందుకు చేశారు? పోలీసులకు అప్పగించే ముందు ఆ సెల్ఫోన్లోని ఏ డేటాను డిలీట్ చేశారు? ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదు? ► బాత్రూమ్లోని వివేకా మృతదేహాన్ని హాల్లోకి తీసుకురావాలని ఆయన పెద్ద బావమరిది శివప్రకాశ్రెడ్డి చెప్పారని ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి వాంగ్మూలం ఇచ్చాడు. శివప్రకాశ్రెడ్డి అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ► షమీమ్ అనే మహిళను వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకోవడంతో ఆ కుటుంబంలో విభేదాలు తలెత్తిన విషయం వాస్తవం కాదా? తన రెండో భార్యకు రూ.10 కోట్లు ఇవ్వాలన్న వివేకా నిర్ణయాన్ని ఆయన భార్య సౌభాగ్యమ్మ, సునీత, అల్లుడు ఎన్.రాజశేఖరరెడ్డి వ్యతిరేకించారు. కుటుంబ బ్యాంకు ఖాతాలకు సంబంధించి వివేకానందరెడ్డికి చెక్ పవర్ లేకుండా చేశారు. షమీమ్ ఇంటికి వెళ్లి ఆమెను బెదిరించారు. ఈ విషయాలను షమీమ్ స్వయంగా సీబీఐకి వెల్లడించారు. ఈ అంశాలపై సునీత ఎందుకు స్పందించడం లేదు? ► వివేకాకు తాము రాజకీయ వారసులు కావాలని ఆయన పెద్ద బావమరిది ఎన్.శివప్రకాశ్రెడ్డి, చిన బావమరిది, అల్లుడైన ఎన్.రాజశేఖరరెడ్డి భావించారు. అందుకు వివేకా సానుకూలంగా లేకపోవడంతో ఆయనపై ఆగ్రహం పెంచుకోవడం వాస్తవం కాదా? -
వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె ఇంటి వద్ద పోలీసు భద్రత
వైఎస్సార్ కడప: వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేశారు. తక్షణమే శాశ్వత పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. తన ఇంటి పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నారని.. ఎస్పీకి వైఎస్ సునీతారెడ్డి లేఖ రాశారు. లేఖలో ఫిర్యాదు అంశాలపై డీఎస్పీ స్థాయి అధికారితో విచారణకు ఆదేశించారు. -
విచారణ వేగవంతం చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: తన తండ్రి మృతిపై సీబీఐ విచారణ వేగవంతం చేయాలని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత నర్రెడ్డి డిమాండ్ చేశారు. తన తండ్రిని హత్య చేశారని, దీని వెనక రాజకీయ కుట్ర ఉందని ఆమె ఆరోపించారు. హత్య జరిగి రెండేళ్లయినా ఎవరు చేశారనేది ఇప్పటివరకు తెలియలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలం దర్యాప్తు సాగుతోందని ఈ మధ్యలో సాక్షులకు ఏమైనా అవుతుందేమోననే భయంతో ఉన్నానని చెప్పారు.శ్రీనివాసరెడ్డి మృతి దీనికి బలం చేకూర్చిందన్నారు. న్యూఢిల్లీలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. మాజీ సీఎం తమ్ముడు, ప్రస్తుత సీఎం బాబాయి మృతి విషయంలోనే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటి, న్యాయం కోసం ఇంకెంత కాలం చూడాలి అని ప్రశ్నించారు. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో తనకు అనుమానం ఉన్న 15 మంది పేర్లు రాసినట్లు తెలిపారు. ఇప్పటివరకు చార్జిషీటు దాఖలు చేయలేదని, అరెస్టులు కూడా చేయలేదని చెప్పారు. ఎంత కష్టమైనా నిందితుల్ని పట్టుకునే వరకు పోరాడతానని సునీత చెప్పారు. -
టీఆర్ఎస్లోకి మాజీ మంత్రి సునీతారెడ్డి
నర్సాపూర్: మాజీ మంత్రి వాకిటి సునీతారెడ్డి టీఆర్ఎస్లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు ఆమె శనివారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సమావేశమైనట్లు తెలిసింది. ఇప్పటికే ఆమె పలుమార్లు కేటీఆర్తో సమావేశమైన విషయం తెలిసిందే. తాజాగా శనివారం మరోసారి వారిద్దరు సమావేశమై పలు అంశాలపై చర్చించిన అనంతరం సీఎం కేసీఆర్తో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. ఏప్రిల్ 1న సోమవారం సీఎం కేసీఆర్ ఆమెకు అపాయింట్మెంట్ ఇచ్చారని తెలిసింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ భవన్లో సునీతారెడ్డితో పాటు ఇతర నాయకులు టీఆర్ఎస్లో చేరనున్నారు. కాగా ఏప్రిల్ 1న టీఆర్ఎస్లో చేరే విషయా -
మా నాన్నను హత్య చేసింది ఎవరో తేల్చాలి!
సాక్షి, హైదరాబాద్ : ‘నా తండ్రి మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కారకులైన వారి పేర్లు బయటపెట్టాలి. మంత్రి ఆదినారాయణరెడ్డి గుట్టును రట్టుచేయాలి. దర్యాప్తునకు అవసరమైన చాలా సమాచారం ‘సిట్’కు ఎప్పటికప్పుడు ఇస్తున్నాం. అయినా, ‘సిట్’అధికారులు ఏం చేస్తున్నారో అర్ధంకావటంలేదు’.. అని ఇటీవల దారుణ హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి కన్నీటిపర్యంతం అయ్యారు. హైదరాబాద్ సోమాజీగూడలోని ప్రెస్క్లబ్లో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే.. హత్యలో పరమేశ్వర్రెడ్డి పాత్ర.. తన తండ్రి హత్యలో పరమేశ్వర్రెడ్డి పాత్ర ఉందని ఆమె ఆరోపించారు. కసునూరు పరమేశ్వర్రెడ్డికి చాతినొప్పి అని మార్చి 14వ తేదీ తెల్లవారు జామున 4.30 గంటలకు ఆస్పత్రిలో చేరాడని.. అన్ని పరీక్షలు సాధారణం అని వచ్చాయన్నారు. వైద్యుల సలహా మేరకు సా.5.30కి ఆయన డిశ్చార్జి అయ్యాడన్నారు. హరిత హోటల్లో టీడీపీ కార్యకర్తలను కలుసుకుని తిరిగి అదే రాత్రి 8.30కి ఆస్పత్రిలో చేరాడన్నారు. మార్చి 15 తెల్లవారుజామున 4.30 గంటలకు సందర్శకుడు ఒకరు ఫోన్ తెచ్చి దానిలో ఏవో ఫొటోలను పరమేశ్వర్రెడ్డికి చూపినట్లు సునీతారెడ్డి వెల్లడించారు . హరిత హోటల్లో వారు హత్యకి ప్రణాళిక రచించా రా? ఆ సమయంలో 4.30కి అక్కడకు ఎవరు వచ్చారు.. వచ్చిన సందర్శకుడు ఫోనులో ఏం చూపా డని ఆమె ప్రశ్నించారు. అలాగే, బీటెక్ రవి ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో తన నేరచరిత్ర రికార్డును తానే ఒప్పు కోవటం అందరికీ తెలిసిందేనని సునీతా వివరించారు. రక్తపు మరకల్ని గంగిరెడ్డి ఎందుకు క్లీన్ చేయమన్నాడో కూడా విచారించి ఆ వివరాలు వెల్లడించాలని ఆమె డిమాండ్ చేశారు. దర్యాప్తు తీరులో అనేక అనుమానాలు.. కాగా, కేసు దర్యాప్తు జరిగే తీరులో అనేక అనుమా నాలు ఉన్నాయని డాక్టర్ సునీతారెడ్డి అభిప్రాయపడ్డారు. ‘నాన్న చనిపోయి ఇన్ని రోజులైనా వాస్తవాలను ఎందుకు బయటపెట్టడం లేదో అంతు చిక్క డం లేదన్నారు. మా బంధువులను అదుపులోకి తీసు కుని పది రోజులైంది. మాకున్న అనుమానాలపై అధికారులకు వివరాలిచ్చినా ఆ దిశగా విచారణ చేయడంలేదని ఆమె వాపోయారు. మనిషి పోయింది మాకే.. పైగా మా మీదే నింద పడిందని గద్గద స్వరంతో అన్నారు. నాన్న చనిపోయాడని నేను, చిన్నాన్న చనిపోయాడని జగన్ అన్న బాధలో ఉంటే సానుభూతి వదిలేసి నిందలు వేయడం న్యాయమా? అని ఆమె ప్రశ్నించారు. నిజంగా నాన్న హత్య కేసులో మా కుటుంబంలోని వ్యక్తికే సంబంధం ఉంటే.. చంద్రబాబునాయుడు ఇన్ని రోజులు బయటపెట్టకుండా ఆగేవారా?’అని సునీతా అన్నారు. మంత్రి ఆదిని విచారించరెందుకు? ఇదిలాఉంటే.. మంత్రి ఆదినారాయణరెడ్డి గురించి మాట్లాడుతూ.. ‘జమ్మలమడుగు నియోజకవర్గంలో నాన్నకు మంచి పేరు ఉంది. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆ ప్రాంతానికే ఎక్కువగా ఎంపీ నిధులు ఖర్చు చేశారు. మా నాన్న ప్రచారంతో ఆదినారాయణరెడ్డి భయపడ్డారు. ఎన్నికల్లో ఆయనకు మా నాన్న అడ్డంకిగా కనిపించారు. మా నాన్నను అడ్డు తొలగిస్తేనే ఎన్నికల్లో గెలుస్తానని భావించారు. ఈ విషయాన్ని ‘సిట్’అధికారుల దృష్టికి తాను ఎన్నిసార్లు తీసుకెళ్లినా వారు ఆయన్ను మాత్రం విచారించలేదు. పరమేశ్వర్రెడ్డి, బీటెక్ రవి, గంగిరెడ్డి తరచూ మాట్లాడుకునే వారని మీడియాలో వచ్చింది. ఆ విషయాల గురించి పోలీసులు విచారించరు. మా కుటుంబ సభ్యులను మాత్రం పదేపదే విచారిస్తున్నారు’.. అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. మా నాన్న లక్ష్యాలివే.. ‘వైఎస్ అవినాష్రెడ్డిని ఎంపీగా గెలిపించటం.. జగనన్నను సీఎంని చేయడమే నాన్న ముఖ్య లక్ష్యం. అందుకే అహోరాత్రులు కష్టపడుతున్నారు. అందులో భాగంగానే జమ్మలమడుగుకు వెళ్లి అల్లె ప్రభావతమ్మ మద్దతును కూడగట్టాడు. అంతే.. అదే రాత్రి కిరాతకంగా చంపేశారు. ‘సిట్’విచారణపై మాకు నమ్మకంపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారు సమగ్రంగా విచారణ చేయలేరు. పోలీస్ అధికారులపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు కూడా చేశాం. వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీని బదిలీ అని వార్త విన్నాం. అంటే ఎన్నికల కమిషన్ మా ఫిర్యాదు విశ్వసించినట్లు ఉంది. కాబట్టి స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలి. అందుకు మీ సహాయ సహకారాలు అవసరం. అందుకే ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటుచేశా. ప్లీజ్ హెల్ప్ మీ’.. అంటూ మీడియాను ఉద్దేశిస్తూ ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. మా కుటుంబ నాశనానికి బాబు కుట్ర తమ కుటుంబాన్ని సర్వనాశం చేసేందుకు సీఎం చంద్రబాబు కుట్ర చేస్తున్నాడని డాక్టర్ సునీతారెడ్డి ఆరోపించారు. జగనన్నకు నాన్నకు మధ్య మంచి అనుబంధముందని.. వారిమధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవన్నారు. ప్రజల్లో ఓ రకమైన భయం సృష్టించాలనే చంద్రబాబు ఓ పథకం ప్రకారం మాట్లాడుతున్నాడని ఆమె విమర్శిం చారు. విచారణ సవ్యంగా జరిగితే అన్ని బయటకు వస్తాయన్నారు. కాగా, వివేకా హత్య అనంతరం వెలుగుచూసిన లేఖలోని చేతి రాత తన తండ్రిదేనని.. కానీ, అందులోని భావం, పదాలు మాత్రం నాన్నవి కాదని సునీతా చెప్పారు. బలవంతంగా రాయించారా? దీనిని ఎవరు రాయించారు అనేది తేలాల్సి ఉందన్నారు. -
మా నాన్నను ఎవరు చంపారు?: సునీతా రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : తన తండ్రి హత్యతో పరమేశ్వరరెడ్డి పాత్ర ఉందని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి ఆరోపించారు. కేసు దర్యాప్తు జరిగే తీరులో అనేక అనుమానాలు ఉన్నాయని, సరైన రీతిలో జరగడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ప్రెస్క్లబ్లో బుధవారం సునీతా రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘నాన్న చనిపోయి ఇన్నిరోజులు అయినా ...వాస్తవాలను ఎందుకు బయటపెట్టడం లేదు. మా బంధువులను అదుపులోకి తీసుకుని పది రోజులైంది. మాకున్న అనుమానాలపై అధికారులకు వివరాలు ఇచ్చినా...ఆ దిశలో విచారణ చేయడం లేదు. మనిషి పోయింది మాకే. పైగా మా మీదే నింద పడింది. నాన్న చనిపోయాడని నేను, చిన్నాన్న చనిపోయాడని జగన్ అన్న బాధలో ఉంటే సానుభూతి వదిలేసి నిందలు వేయడం న్యాయమా?. నిజంగా నాన్న హత్యకేసులో మా కుటుంబంలోని వ్యక్తేకే సంబంధం ఉంటే...చంద్రబాబు నాయుడు ఇన్ని రోజులు బయట పెట్టకుండా ఆగేవారా?. మా నాన్నను ఎవరు చంపారనే దానికి సమాధానం కావాలి. అంతేకాకుండా నాన్న హత్యను రాజకీయం చేస్తున్నారు. మా నాన్న 70వ దశకం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీ నిధులు జమ్మలమడుగు కోసం ఖర్చు చేశారు. జగనన్న సీఎంని చేయడానికి, వైఎస్ అవినాష్ రెడ్డి గెలుపు కోసం నాన్న కృషి చేస్తున్నారు. కడపలో ఉన్న ప్రతి స్థానిక నేత మా నాన్నకు తెలుసు. జమ్మలమడుగు నియోజకవర్గంలో నాన్నకు మంచి పేరు ఉంది. మా నాన్న ప్రచారంతో ఆదినారాయణరెడ్డి భయపడ్డారు. ఎన్నికల్లో గెలవడానికి ఆదినారాయణరెడ్డికి మా నాన్న అడ్డంకిగా కనిపించారు. మా నాన్నను అడ్డు తొలగిస్తేనే ఎన్నికల్లో గెలుస్తానని ఆదినారాయణరెడ్డి భావించారు. ఈ విషయాన్ని సిట్ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా.. ఇప్పటివరకూ ఆదినారాయణరెడ్డిని మాత్రం విచారణ చేయలేదు. మా కుటుంబ సభ్యులను మాత్రం పదేపదే విచారిస్తున్నారు. మా కుటుంబం గురించి అడిగిన ప్రతి చిన్న విషయాన్ని సిట్ అధికారులకు వివరించాను. మా నాన్నది నలుగురికి సేవ చేసే తత్వం. ఆయన అలా చనిపోతారని నేను అనుకోలేదు. నాన్న చనిపోయిన విషయం సీఐ శంకరయ్యకు ఉదయం 6.40 గంటలకు తెలిపాం. ఈ కేసులో పరమేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశామన్నారు. అయితే మార్చి 14వ తేదీ ఉదయం పరమేశ్వర్ రెడ్డి ఛాతీ నొప్పి అంటూ ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆస్పత్రిలో చేరగానే వివేకానందరెడ్డి తనకు సన్నిహితుడని చెప్పారు. పరమేశ్వర్ రెడ్డి ఆ రోజంతా ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నారు. అదేరోజు సాయంత్రం ఆస్పత్రిలో గొడవ చేసి తనంతట తానే డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత టీడీపీ కార్యకర్తలను హరిత హోటల్లో పరమేశ్వర్ రెడ్డి కలిశారు. మళ్లీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. నాన్న హత్య జరిగినప్పుడు మంత్రి ఆదినారాయణరెడ్డికి...పరమేశ్వర్ రెడ్డికి మధ్య సంభాషణలు జరిగాయి. ఇన్నిరోజులు అయినా ఆదినారాయణరెడ్డిని, పరమేశ్వర్ రెడ్డిని ఎందుకు విచారణ చేయడం లేదు. ఆదినారాయణరెడ్డిని సీఎం చంద్రబాబు రక్షిస్తున్నారనే అనుమానం కలుగుతోంది. ఇవన్నీ చూస్తుంటే మాకు అనుమానం కలుగుతోంది. ఆదినారాయణ సిట్ విచారణ సరిగా లేనందునే మేము హైకోర్టును ఆశ్రయించాం. ఈ కేసును సక్రమంగా విచారణ చేయాలి. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తెగా న్యాయం కోసం మీడియా ముందుకు వచ్చాను.’ అని అన్నారు. సునీతా రెడ్డి ఈ సందర్భంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన తీరు, అనంతర పరిణామాలకు సంబంధించి పూర్తి వివరాలతో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. పూర్తి సారాంశం కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మా నాన్న హత్య కేసు దర్యాప్తుపై సందేహాలున్నాయి
సాక్షి, హైదరాబాద్: తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి ఇన్ని రోజులు కావస్తున్నా ఇంత వరకూ క్లూలు దొరకడం లేదని, అసలు దర్యాప్తు సరైన రీతిలో నడుస్తోందో, లేదో? అని తనకు అనుమానంగా ఉందని వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఆదివారం రాత్రి మీడియాకు తాను మాట్లాడి రికార్డు చేసిన వీడియోను విడుదల చేశారు. ‘మీరే చూస్తున్నారు కదండీ, నాన్న చనిపోయి ఇన్ని రోజులైనా ఎక్కడా ఏమీ క్లూస్ దొరకడం లేదు. ఈ దర్యాప్తు సరైన రీతిలో నడుస్తోందో లేదోనని అనుమానంగా ఉంది. తీరు చూస్తూంటే.. ఉదాహరణకు ఆ సంఘటన జరిగిన రోజు సీఐ శంకరయ్య అక్కడున్నారు. అక్కడ ఆ మనిషి ఉన్నాడు. మేం హైదరాబాద్ నుంచి దారిలో వస్తూ ఉన్నాము. మేం ఇన్సిస్ట్ చేయాల్సి వస్తోంది. కేసు పెట్టు అని చెప్పి.. ఆయన ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్. ఆయనకు తెలియదా? ఇది మర్డర్ కేసు పెట్టాలి అని చెప్పి.. ఆ సీన్లో లేకుండా ఉన్న మాకు అనుమానం వస్తోంది. చెప్పాల్సి వస్తోంది.. ప్లీజ్ కేసు పెట్టండి అనుమానం ఉంటే అని.. అంటే ఆయన ఏదైనా కవర్అప్ చేయాలని ప్రయత్నించాడా! ఎందుకలా ఆయన అప్పుడు ప్రవర్తించారు? కేసు పెట్టు అని చెప్పినాక కూడా తరువాత ఆయన బాడీని బయటకు మూవ్ చేయించాడు. గాయాలకు కట్లు కట్టించాడు. ఇన్స్పెక్టర్ గారికి తెలియదా? ఇది తప్పు.. పంచనామా జరగక ముందు భౌతికకాయాన్ని అలా తరలించకూడదని తెలియదా? అయినా ఆయన అలా ఎందుకు జరగనిచ్చారు? ఓకే అక్కడ ఉన్న మా మిత్రులు, బంధువులందరూ దుఃఖంలో మునిగి ఉన్నారు. వారికి అర్థం కావడం లేదు అనుకుందాం. ఈయనకు ఏమైంది? ఈయన ఇన్స్పెక్టర్ కదా? ఆయనకు రూల్స్ అన్నీ బాగా తెలుసు కదా? ఆయన కూడా ఈ నేరంలో భాగస్వామా? ఆయనకు ఎవరైనా ఆదేశాలిచ్చారా? ఈ దర్యాప్తును తారు మారు చేయడానికి సాయం చేయి అని? ఆయన పైన ఎవరున్నారు? లేక ఆయనకే నేరుగా ఇందులో ప్రమేయం ఉందా? నాకైతే అనుమానాలు వస్తున్నాయి. సొల్యూషన్స్ గానీ, జవాబులు గానీ అర్థం కావడం లేదు. దర్యాప్తు ప్రక్రియకు ఏమవుతోంది? ఇలా కావాలనే తప్పులు చేయమని ఎవరైనా పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చారా? ఆ నేరానికి కుటుంబ సభ్యులే కారణమని నింద మోపమని చెప్పారా? నాకు దీనికి త్వరలో సమాధానం దొరుకుతుందని భావిస్తున్నాను. నాకైతే ఓపిక నశిస్తోంది’ అని ఆమె పేర్కొన్నారు. -
అతను ఎందుకలా ప్రవర్తించాడు: సునీతారెడ్డి
సాక్షి, వైఎస్సార్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయి పది రోజులు దాటినా ఒక్క క్లూ దొరకలేదని, విచారణ సరైన పద్ధతిలో నడుస్తుందో లేదో అని ఆయన కుమార్తె వైఎస్ సునీతారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. సంఘటనా స్థలంలో సీఐ శంకరయ్య ఉన్నారు.. అయినా మేము హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత కేసు పెట్టమని చెప్పాల్సి వచ్చింది.. ఆయనొక ఇన్స్పెక్టర్, ఆయనకు కేసు పెట్టాలని తెలియదా అని ప్రశ్నించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అది హత్య అని సీన్లో లేని మాకు అనుమానం వస్తోంది. సీన్లో ఉన్న ఆయనకు మేము చెప్పాల్సి వచ్చింది. దీన్ని బట్టి చూస్తే ఆయన ఏదన్నా కవర్ చేయాలని ప్రయత్నించాడా?. ఎందుకు అతను అలా ప్రవర్తించాడు?. ఆయన సమక్షంలోనే మృతదేహాన్ని తరలించారు. కట్లు కూడా కట్టారు. సీఐకి తెలియదా అది తప్పు అని. పంచనామా జరగకుండా మృతదేహాన్ని తరలిస్తుంటే సీఐ ఏమి చేశారు. ఎందుకు అలా జరిగేలా చేశారు. అక్కడున్న మా ఫ్రెండ్స్, బంధువులకు షాక్లో ఏమీ అర్థం కాలేదు అనుకుందాం! మరి అన్నీ తెలిసిన సీఐ గారికి ఏమైంది?. ఆయనకు రూల్స్ బాగా తెలుసు కదా.. ఆయన కూడా ఈ క్రైమ్లో ఏమైనా భాగస్వామ్యులా?. ఆయనకు ఎవరైనా ఆదేశాలు ఇచ్చారా?. ఈ నేరాన్ని తారుమారు చేయడానికి ఆయన పైన ఎవరున్నారు?. లేదా ఆయనే నేరుగా దీనిలో ఉన్నారా? నాకైతే అనుమానాలు వస్తున్నాయి. కానీ దీనికి జవాబు దొరకడం లేదు. అసలు విచారణలో ఏమి జరుగుతోంది. అధికారులను ఎవరైనా తప్పు దోవ పట్టిస్తున్నారా. దానికోసం మా కుటుంబంపై నిందారోపణలు వేస్తున్నారా. త్వరలో నాకు సమాధానం దొరుకుతుందనుకుంటున్నా’’ అని అన్నారు. చదవండి : నాన్న హత్యపై విష ప్రచారం -
నాన్న హత్యపై విష ప్రచారం
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు ఇష్టారీతిన మాట్లాడుతుండటంతోపాటు సోషల్ మీడియాలో అబద్దపు ప్రచారం చేస్తూ విషం కక్కుతున్నారని ఆయన కుమార్తె సునీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నాన్న చనిపోయిన బాధలో ఉన్న తమను సోషల్ మీడియా ప్రచారంతో మరింత హింసకు గురిచేస్తున్నారన్నారు. ఈ మేరకు శనివారం భర్త రాజశేఖర్రెడ్డితో కలసి సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్కు ఫిర్యాదు చేశారు. వైఎస్ వివేకా ప్రతిష్టను దిగజార్చే లా ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, యూట్యూబ్లో నకిలీ కథనాలు ప్రసారం చేస్తున్నారని వాపోయారు. ఇందుకు బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. హైటెక్ సిటీ, గచ్చిబౌలి నుంచి కొందరు సోషల్ మీడియా ద్వారా చేస్తున్న పోస్టులతో కూడిన యూఆర్ఎల్ఎస్లను ఫిర్యాదు కాపీకి జత చేసి ఇచ్చారు. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సిట్ను ప్రభావితం చేస్తున్న బాబు... వైఎస్ వివేకా హత్యపై సిట్ చేస్తున్న విచారణను ప్రభావితం చేసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని సునీతారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర హోం శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సునీతారెడ్డి, భర్త రాజశేఖర్రెడ్డి, వైఎస్సార్సీపీ ఇంటెలెక్చువల్ ఫోరమ్ కోర్ టీమ్ సభ్యుడు ఎల్ఎం సందీప్రెడ్డితో రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ను శనివారం కలసి ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు తీరు, చంద్రబాబు తప్పుడు ప్రచారాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. హత్య జరిగి వారం రోజులైనా నిందితులు ఎవరనేది తేలలేదన్నారు. తమ కుటుంబసభ్యులను కావాలని టార్గెట్ చేస్తూ అనుమానితుల స్టేట్మెంట్లను, మెడికల్ రిపో ర్టులను మార్చే ప్రయత్నం జరుగుతోందని వివరించారు. సిట్ విచారణ నిష్పక్షపాతంగా జరిగే పరిస్థితి లేదన్నారు. ఒత్తిళ్లకు గురికాని ప్రత్యేక సంస్థ ద్వారా విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. -
వైఎస్ వివేకా హత్య కేసు: వారిపై చర్యలు తీసుకోండి
సాక్షి, హైదరాబాద్ : తన తండ్రి హత్యపై సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్కు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి ఫిర్యాదు చేశారు. కొంతమంది కావాలనే తన తండ్రి పేరు, ప్రతిష్టలను దిగజార్చేలా నకిలీ వార్తలను రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఈ మేరకు శుక్రవారం తన భర్త రాజశేఖరరెడ్డితో కలిసి సైబారాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా తప్పుడు వార్తలను ఫేస్బుక్, వాట్సాప్, ట్విటర్, యూట్యూబ్లలో ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తప్పులు వార్తలను ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కాగా, వైఎస్ వివేకానంద హత్య కేసు దర్యాప్తు జరుగుతున్న తీరు, చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారంపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘాన్ని, కేంద్ర హోం శాఖ కార్యదర్శిలకు సునీతారెడ్డి ఫిర్యాదు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సీఎం చంద్రబాబు నాయుడుతో సహా టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సునీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేసును తప్పుదోవ పట్టించడానికి అనేక కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. హత్య జరిగి ఇన్ని రోజులైనా కూడా.. నిందితులు ఎవరనే విషయం ఇప్పటికీ బయటకు రాలేదన్నారు. తమ కుటుంబసభ్యులపై మితిమీరిన దృష్టి పెడుతూ అసలైన అనుమానితుల స్టేట్మెంట్లను, మెడికల్ రిపోర్టులను మార్చే ప్రయత్నం జరుగుతోందని వివరించారు. సిట్ ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ నిష్పక్షపాతంగా జరిగే పరిస్థితి లేని నేపథ్యంలో ఎలాంటి ఒత్తిళ్లకు గురికాని ప్రత్యేక సంస్థ ద్వారా విచారణ జరిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సంబంధిత కథనాలు వైఎస్ వివేకా హత్య కేసులో సర్కార్ వింత పోకడ మా నాన్న హత్యపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ‘వైఎస్ వివేకా హత్య కేసులో అనుమానాలున్నాయి’ పుట్టెడు దుఃఖంలో ఉన్న మాపై తప్పుడు వార్తలా? బాబు డైరెక్షన్..‘సిట్’ యాక్షన్! -
మా నాన్న హత్యపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు
సాక్షి, న్యూఢిల్లీ: తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ హత్యకు వైఎస్ జగన్ కుటుంబమే బాధ్యత వహించాలంటూ.. దీన్ని ఓ ఎన్నికల ప్రచార అంశంగా మార్చి చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే మా వాళ్లనే ఇరికిస్తారేమోననే భయం కలుగుతోందన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు ఇష్టానుసారంగా మాట్లాడితే.. ఆయన కింద పనిచేస్తున్న సిట్ ప్రభావితమవ్వదా? అని నిలదీశారు. ఇక నిష్పక్షపాత విచారణ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో ఈ కేసు విచారణ నిష్పక్షపాతంగా జరిగే అవకాశం లేనందున.. దర్యాప్తు సంస్థను మార్చాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం తన భర్త రాజశేఖరరెడ్డితో కలసి ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని, కేంద్ర హోం శాఖ కార్యదర్శిని కలసి ఆమె ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు జరుగుతున్న తీరు, చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. హత్య జరిగి వారం రోజులైనా కూడా.. నిందితులు ఎవరనే విషయంఇప్పటికీ బయటకు రాలేదన్నారు. తమ కుటుంబసభ్యులపై మితిమీరిన దృష్టి పెడుతూ అసలైన అనుమానితుల స్టేట్మెంట్లను, మెడికల్ రిపోర్టులను మార్చే ప్రయత్నం జరుగుతోందని వివరించారు. సిట్ ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ నిష్పక్షపాతంగా జరిగే పరిస్థితి లేని నేపథ్యంలో ఎలాంటి ఒత్తిళ్లకు గురికాని ప్రత్యేక సంస్థ ద్వారా విచారణ జరిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ముందుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ ఆరోరాను కలసి.. దర్యాప్తు సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభావితం చేస్తున్న తీరును వివరించారు. దీనిపై స్పందించిన సునీల్ ఆరోరా కేసు దర్యాప్తు సంస్థను మార్చడంపై కేంద్ర హోం శాఖ కార్యదర్శిని కలవాలని సూచించారు. హైకోర్టు ఆదేశానుసారం తదుపరి చర్యలు.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సూచన మేరకు డాక్టర్ సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గాబాను కలసి వైఎస్ వివేకా హత్య కేసులో దర్యాప్తు సంస్థను మార్చాలని కోరారు. ఇదే విషయమై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశామని వివరించారు. దీనిపై స్పందించిన రాజీవ్ గాబా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో తదుపరి కోర్టు ఉత్తర్వులు వచ్చే వరకు వేచి చూద్దామని సూచించారు. అనంతరం అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు సునీత మీడియాకు తెలిపారు. -
కేంద్ర హోంశాఖకు సునీతారెడ్డి ఫిర్యాదు
-
కేంద్ర హోంశాఖకు సునీతారెడ్డి ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ: తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుపై దర్యాప్తు జరుగుతున్న విధానం సరిగా లేదని కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసినట్టు ఆయన కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి తెలిపారు. శుక్రవారం హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబాను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. తన తండ్రి హత్యకు కారకులెవరో నిగ్గు తేల్చేందుకు సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరినట్టు సునీతారెడ్డి మీడియాకు తెలిపారు. హైకోర్టులో ఇప్పటికే కేసు వేశారు కాబట్టి, హైకోర్టు నిర్ణయం వచ్చేంతవరకు వేచి చూడాలని తమకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి సూచించారని ఆమె వెల్లడించారు. తన తండ్రి హత్యపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నందున దర్యాప్తు సక్రమంగా జరిగేలా చూడాలంటూ అంతకుముందు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆమె కోరారు. ఈ కేసులో తమ కుటుంబ సభ్యులను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానం వ్యక్తం చేశారు. (ఈసీని కలిసిన వైఎస్ వివేకా కుమార్తె) -
ఈసీని కలిసిన వైఎస్ వివేకా కుమార్తె
-
జగనన్నపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారు: సునీతా రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ : తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సిట్ విచారణను తప్పుదోవ పట్టించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారంటూ ఆయన కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తండ్రి హత్యకేసును నిష్పక్షపాతంగా విచారించి, అసలు దోషులకు శిక్ష పడేలా చేయాలని ఆమె ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. కాగా తన తండ్రి హత్యపై జరుగుతున్న సిట్ విచారణ మీద రాజకీయ ఒత్తిళ్లు ఉన్నందున దర్యాప్తు సక్రమంగా జరిగేలా చర్చలు తీసుకోవాలంటూ సునీతా రెడ్డి నిన్న (గురువారం) రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి వినతి పత్రం సమర్పించారు. అయితే ఈ కేసు దర్యాప్తు విషయంలో తాము కలుగచేసుకునే అవకాశం లేదని, ఆ అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించడం లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరడం కానీ చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. దీంతో సునీతా రెడ్డి...కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. చదవండి....(ఏపీ సీఈవోకు సునీతా రెడ్డి ఫిర్యాదు) అనంతరం సునీతా రెడ్డి మాట్లాడుతూ...‘మా నాన్న హత్యకేసు విచారణ పారదర్శకంగా జరిగేలా చూడాలని కోరాం. కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ఎప్పటికప్పుడు, డీజీపీ, సీఎం చంద్రబాబుకు వివరాలు ఇస్తున్నారు. ముఖ్యమంత్రే తప్పుగా ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయంగా మా నాన్నహత్యను వాడుకోవాలని చూస్తున్నారు. అమాయకులను బలిపశువులు చేయాలని చూస్తున్నారు. దర్యాప్తులు ప్రభావితం చేసేలా చంద్రబాబు మాట్లాడుతున్నారు. మా అన్న జగన్ మీద కావాలనే ఆరోపణలు చేస్తున్నారు. మా కుటుంబ సభ్యులనే ఇరికిస్తారన్న అనుమానాలు కలుగుతున్నాయి. మా అన్నే నాన్నను చంపారన్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. సిట్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తుంది కాబట్టి విచారణ పాదర్శకంగా జరగటం లేదు. సీబీఐ లేదా మరే ఇతర విచారణ సంస్థతో దర్యాప్తు జరిపించండి. అదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాం. కేంద్ర హోంశాఖను కలవాలని ఈసీ సూచించింది. ఆ మేరకు కేంద్ర హోంశాఖను కలిసి విచారణ నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరతాం. అలాగే ఈ అంశంపై మా అమ్మ విజయవాడ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు’ అని తెలిపారు. -
ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిని కలిసిన సునీత
-
ఏపీ సీఈవోకు సునీతా రెడ్డి ఫిర్యాదు
సాక్షి, అమరావతి : దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి గురువారం ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేదిని కలిశారు. సీఈవో గోపాలకృష్ణ ద్వివేదిని సచివాలయంలో కలిసిన ఆమె...తన తండ్రి హత్యకేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఫిర్యాదు చేశారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యానించారని సునీతా రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం వ్యాఖ్యలు కేసు దర్యాప్తు చేస్తున్న విచారణ అధికారులను ప్రభావితం చేసేలా ఉన్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తన తండ్రి హత్యకేసును నిష్పక్షపాతంగా విచారణ చేసి అసలు దోషులకు శిక్షపడేలా చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత కేసును పక్కదారి పట్టించేలా టీడీపీ నేతల స్టేట్మెంట్లు ఉన్న పేపర్ కటింగ్స్ను సునీతారెడ్డి ...సీఈవోకు అందచేశారు. సునీతారెడ్డి తన భర్త రాజశేఖరరెడ్డితో కలిసి ఏపీ సచివాలయానికి వచ్చారు. చదవండి...(పుట్టెడు దుఃఖంలో ఉన్న మాపై తప్పుడు వార్తలా?) అనంతరం సునీతారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘సిట్’పై ప్రభావం చూపేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు ఉన్నాయి. దర్యాప్తు సంస్థపై సీఎం ఒత్తిడి ఉంటే కేసు తప్పుదారి పట్టే అవకాశం ఉంది. దర్యాప్తు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని, నిన్న మీడియాతో తాను ఏం మాట్లాడానో అవే విషయాలు ఎన్నికల ప్రధాన అధికారి దృష్టికి తీసుకు వెళ్లాను. ఈ ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల కమిషన్కు నివేదిక ఇస్తామని సీఈవో తెలిపారు.’ అని పేర్కొన్నారు. -
వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే
కౌడిపల్లి(నర్సాపూర్): రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి, డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని మహ్మద్గనర్గేట్ తండా, కొత్త చెరువుతండా, మొండి తండా, శేరితండాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని అన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చకుండానే ముందస్తుకు వెళ్లి ప్రజలను మోసం చేశారని తెలిపారు. మళ్లీ ఇప్పుడు గ్రామాల్లోరి వచ్చి ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని టీఆర్ఎస్ ఇచ్చిన హామీలకు ప్రజలు అధికారం అప్పగిస్తే కేసీఆర్ కుటంబంలో ఐదు ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. ప్రజలకు డబుల్బెడ్రూం, మూడెకరాల భూపంపిణీ తదితర ఏ ఒక్కహామీని సైతం నెరవేర్చలేదన్నారు. టీఆర్ఎస్ నాయకులకు సంక్షేమ పథకాలు, ట్రాక్టర్లు పంపిణీ చేశారని విమర్శించారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు తప్ప టీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. కేటీఆర్ను సీఎం చేయాలని ముందస్తుకు వెళుతున్నారని విమర్శించారు. గ్రామాలలో మంచినీళ్లు లేవుకాని మద్యం మాత్రం ఏరులై పారుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్లం, యూత్ అధ్యక్షుడు ప్రవీన్కుమార్, మాజీ ఎంపీపీ యాదాగౌడ్, మాజీ సీడీసీ దుర్గారెడ్డి, బీసీ, ఎస్సీ, మైనార్టీ సెల్ అధ్యక్షులు బోయిని వీరయ్య, శివ, సయ్యద్పాష, సోషల్ మీడియా అధ్యక్షుడు జీవన్గౌడ్, నాయకులు మధుసూదన్గౌడ్, ర«ఘు తదితరులు పాల్గొన్నారు. రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్న టీఆర్ఎస్ నాయకులు నర్సాపూర్: టీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు సునీతారెడ్డి ఆరోపించారు. సోమవారం రాత్రి ఆమె స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ నాయకులు అధికారంలో ఉన్నంత కాలం ప్రజలకు ఏమీ చేయలేదని, ప్రస్తుతం ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తూ ఆకట్టుకునేందుకు కుతంత్రాలు పన్నుతున్నారని ఆమె చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను తమ పార్టీలోకి లాక్కుంటున్నారన్నారు. ఇంకా నాయకులను లాక్కునేందుకు కుట్రలు పన్నుతూ టీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. నర్సాపూర్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలో మంచి బలం ఉందని, ప్రజలు తమ వెంటే ఉన్నారని ఆమె అన్నారు. ఉమ్మడి జిల్లాలో మెజారిటీ స్థానాలు కైవసం చేసకుంటామన్నారు. -
కత్తి వదిలేసినోడు యుద్ధం ఎలా చేస్తాడు?
మెదక్ జోన్: కత్తి వదిలేసినోడికి యుద్ధం ఎలా చేతనవుతుందని, మళ్లీ ఓట్లు ఎలా అడుగుతాడని ఆపద్ధర్మ ముఖ్యంత్రి కేసీఆర్ను ఉద్దేశించి టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. జనసమితి ఆధ్వర్యంలో ఆదివారం మెదక్ పట్టణంఓని టీఎన్జీఓ భవన్లో జనసమితి జిల్లా చైర్మన్ చడిమెల యాదగిరి అధ్యక్షతన రచ్చబండ రౌండ్టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ రూ. 1.39 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టి అందులో 70శాతం నిధులను దోచుకున్నారని ఆయన మండిపడ్డారు. కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టుల నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ అడ్డు తగులుతుందని లేనిపోని బురద చల్లే ప్రయత్నం చేస్తుందన్నారు. భూనిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసినందుకు మాయలమరాఠి కేసీఆర్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. అనంతరం టీజేఎస్ జిల్లా చైర్మన్ చడిమెల యాదగిరి మాట్లాడుతూ నియంత ్చ్ఛ వ్యవహారించిన టీఆర్ఎస్ పార్టీని ఇంటికీ పంపేందుకు అన్ని శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రైతులు, నిరుద్యోగులు, కార్మికులను, ఉద్యోగులు, విద్యార్థులతో పాటు కులసంఘాలను సైతం మోసం చేసిందన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజాస్వామ్యం బతికించేందుకు నోట్లు ముఖ్యం కాదని గ్రామగ్రామాన ప్రజలను చైతన్యం చేసి టీఆర్ఎస్ను ఓడిచేందుకు అందరం ఏకం కావాలన్నారు. అనంతరం టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు కొలుకురి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ... మెదక్ నియోజకవర్గంపై పూర్తి వివక్ష కొనసాగిందన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలి ఆస్తులు పెంచుకునే పనిలో ఎమ్మెల్యే, అమె భర్త అక్రమ సంపాదనకే ప్రాధాన్యత ఇచ్చారన్నారు. 22 కిలోమీటర్ల మెదక్ – చేగుంట, 2 కిలోమీటర్ల మెదక్ రోడ్డును నాలుగు సంవత్సరాలుగా నిర్మాణాలు చేస్తున్నారన్నారు. కాంట్రాక్టర్లను డబ్బుల కోసం వేధించడంతో వారు పనులు వదిలి వెళ్లిపోతున్నారని ఆయన పేర్కొన్నారు. కేవలం 10 మందికి కూడా ఉపాధి చూపించని పద్మాదేవేందర్ రెడ్డికి ఓట్లు ఎందుకు వేయాలని ఆయన ప్రశ్నించారు. సిద్దిపేట, సంగారెడ్డితో పొల్చుకుంటే ఒక్కశాతం కూడా మెదక్ అభివృద్ధి చెందలేదన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులతో పాటు కులసంఘాలు, విద్యాసంఘాలు, విద్యార్థిసంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు వివిధ పార్టీలకు చెందిన సుప్రబాతరావు, మామిండ్ల ఆంజనేయులు, బాల్రాజ్, కాముని రమేష్, దయాసాగర్, శ్రీకాంత్, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేడీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి శివ్వంపేట(నర్సాపూర్): రాష్ట్రంలో ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని డీసీసీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి సునీతారెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధి నవాబుపేట గ్రామంలో జెండావిష్కరణ చేశారు. గ్రామానికి చెందిన టీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ పార్టీలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమే మాట్లాడుతూ తెలంగాణ ప్రజల అభిష్టం మేరకు కాంగ్రెస్పార్టీ ప్రత్యేక తెలంగాణను ఇవ్వడం జరిగిందని దాన్ని ఆసరాగా తీసుకొని టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అన్ని రంగాల్లో ప్రజలను మోసం చేసిందన్నారు. నిరుద్యోగులకు ఎలాంటి ఉద్యోగాలు కల్పించకుండా ఇచ్చిన వాగ్ధానాలన్నింటిని తుంగలో తొక్కిందన్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. దళితులకు మూడెకరాలభూమి, డబుల్బెడ్రూమ్ ఇండ్ల ఆశ చూపి అధికారంలోకి వచ్చిన తర్వాత మరిచిపోయిందన్నారు. అధికార దాహంతో సీఎం కేసీఆర్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయనను గద్దె దింపే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. గ్రామస్థాయి నుంచి కార్యకర్తలు సైనికుడి వలే పార్టీ విజయానికి కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు యాదాగౌడ్, నాయకులు పాల్గొన్నారు. -
మారణహోమానికి మరో పేరు ‘గఢ్’
సునీతారెడ్డితో మానవ హక్కుల కార్యకర్త నందినీ సుందర్ ఛత్తీస్గఢ్లో ప్రభుత్వ బలగాలు చేస్తున్న చట్టవ్యతిరేక పనులు ప్రజలకు, రాజ్య యంత్రాంగానికి మధ్య జరుగుతున్నదానికే పరిమితం కాదని.. ఢిల్లీ యూనివర్సిటీ సోషియాలజీ ప్రొఫెసర్, మానవ హక్కుల కార్యకర్త నందినీ సుందర్ చెబుతున్నారు. అభివృద్ధి పేరుతో ఛత్తీస్గఢ్లో జరుగుతున్న విధ్వంసం, ప్రభుత్వబలగాలకు, మావోయిస్టులకు మధ్య సాగుతున్న సంకుల సమరంలో అక్కడి గిరిజనులు పదేళ్లుగా కంటినిండా నిద్రకు కూడా కరువయ్యారని ఆమె అన్నారు. సుప్రీంకోర్టు ఆదే శాలు అమలుకాని రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ అపఖ్యాతి పొందిందని ఆరోపించారు. కోట్లాది రూపా యలు వెచ్చించి గిరిజన యువతను ప్రత్యేక పోలీసులుగా మార్చి వారి గ్రామాలపై వారినే దాడు లకు పంపించడం కంటే వారిని అక్కడే టీచర్లుగా నియమిస్తే ప్రభుత్వం పట్ల ప్రజల ఆలోచనల్లో మార్పు వస్తుందంటున్న నందినీ సుందర్ ఇంటర్వ్యూలో చెప్పిన అభిప్రాయాలు ఆమె మాటల్లోనే.. సోషియాలజీ విద్యార్థి నుంచి బస్తర్లో కార్యకర్త వరకు మీ ప్రయాణం ఎలా సాగింది? ఇప్పటికీ నేను సోషియాలజీ విద్యార్థినే. బస్తర్ నాకెంతో నచ్చింది. అక్కడి వారి హక్కుల కోసం పోరాడాలనిపించింది. 1990లో విద్యార్థిగా తొలిసారి బస్తర్ సందర్శిం చాను. అక్కడి హక్కుల ఉల్లంఘన, అత్యాచారాలు, వేధింపులు నిజంగా వర్ణించలేనివి. గత 26 ఏళ్లుగా నా పరిశోధనలో భాగంగా బస్తర్లో ఎన్నో విషయాలు పరిశీలించాను. రెండు దశాబ్దాల కింద బస్తర్ ఎలా ఉండేది? బస్తర్ ఒక అద్భుతం. వర్ణించలేం. దేశంలోనే అదొక అందమైన అరణ్యం. ఇప్పడది పోలీసు క్యాంపుగా మారింది. చెట్లను నరికేసి క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. జగ్ దల్పూర్ చుట్టుపక్కల ఫ్యాక్టరీలు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే విధ్వంస మేనని పర్యావరణ నివేదికలు కూడా చెబుతున్నాయి. అక్కడ జీవ వైవిధ్యాన్ని ధ్వంసం చేశారు. స్థానికులను ఏమాత్రం పట్టించుకోలేదు. గ్లోబలైజేషన్ నేపథ్యంలో అక్కడ జరిగిన మార్పు ఏమిటి? ఛత్తీస్గఢ్ 2000 సంవత్సరంలో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. మైనింగ్ పాలసీని సరళీకరించారు. ప్రాజెక్టులకు పర్మిషన్ ఇచ్చారు. గూడేలను ఖాళీ చేయించారు. ఆ సమ యంలోనే మావోయిస్టులు వచ్చారు. వారికి పోటీగా సల్వాజుడుం మొదలైంది. సల్వాజుడుం కంటే ముందు నక్సల్స్ బస్తర్కి ఎలా వచ్చారు? 1980లో నక్సల్స్ బస్తర్కు వచ్చారు. స్థానికులపై వాళ్లు బలమైన ముద్ర వేశారు. స్థానిక యంత్రాంగం చేయలేని పనులు చేశారు. భూపంపిణీ చేశారు. పట్వారీలకు, ఫారెస్టు గార్డులకు వ్యతిరేకంగా ప్రజలకు మద్దతుగా నిల్చారు. స్థానికంగా భూపంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టారు. 30 ఏళ్ల వ్యవధిలో వాళ్లు ఆ ప్రాంతంపై పట్టు సాధిం చారు. వాస్తవానికి 1975–78 నుంచే బస్తర్లో గనుల తవ్వకం మొదలైంది. బైలదిల్లా చుట్టుపక్కల ప్రాంతాలు అప్పటినుంచే కాలుష్యానికి గురయ్యాయి. ప్రజలకు సంబం« దించి చాలా తక్కువ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. హక్కుల పరిరక్షణ సరే. కానీ మీలాంటి వారు అభివృద్ధిని అడ్డుకుంటున్నట్లు ఆరోపణ? చాలామంది ప్రజలు నిజమైన అభివృద్ధిని కోరుకుంటున్నారు. వారు అభివృద్ధికి వ్యతిరేకం కాదు. అసమానాభివృద్ధికి మాత్రమే వారు వ్యతిరేకం. అసలు అభి వృద్ధి అంటే ఏమిటి? పారిశ్రామిక వేత్తలకు, కాంట్రాక్టర్లకు మేలు చేసేదా, ప్రజలకు మేలు కలిగించేదా? ప్రాజెక్టుల వల్ల నిర్వాసి తులవుతున్న వారికి అభివృద్ధి పేరుతో పోగుపడుతున్న సంపదలో వాటా కలిగిస్తే అది వారికి మేలు కలిగించే అభివృద్ధి. ప్రత్యేకించి వాతావరణ మార్పు జరుగుతున్న నేటి దశలో అభివృద్ధి గురించి పాతపద్ధతిలో మనం ఆలోచించలేం. ఆదివాసీలకు మాత్రమే కాదు.. దేశం మొత్తానికి, ప్రపంచానికి కూడా మేలు చేకూర్చగల ప్రత్యేక అభి వృద్ధి నమూనా కావాలి. ప్రతి ఒక్కరూ తమకు స్కూలు, ఆసుపత్రి, ఉపాధి ఇతర కనీస సౌకర్యాలను కోరుకుంటున్నారు. వాటిని పొందగలిగితే అది నిజమైన అభివృద్ధి. మావోయిస్టు సానుభూతిపరురాలంటూ ఓ వైపు, మరోవైపు హత్యారోపణ.. ఎలా? ఇది అర్థం పర్థంలేని వ్యవహారం. ఇష్టానుసారంగా కేసులు పెట్టారు. ఇప్పుడయితే వారు తెలంగాణకు చెందిన ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. నిజనిర్ధారణ కమి టీలో భాగంగా ఛత్తీస్గఢ్ వెళుతున్నవారిని నిర్బంధించారు. గత ఏడాది డిసెంబర్ 25న నిజనిర్ధారణకు వెళ్లిన వారిలో హైకోర్టు లాయర్లు, జర్నలిస్టులు, ఆదివాసీ నేత, దళిత నేత కూడా ఉన్నారు. మావోయిస్టులతో లక్ష రూపాయల పెద్ద నోట్లు మార్చుకుంటున్నా రని వారిపై ఆరోపించారు. తెలంగాణ పోలీసులు వీరిని పట్టుకుని ఛత్తీస్గఢ్ పోలీసు లకు అప్పగించారు. చట్టపరమైన ఉల్లంఘనలకు వ్యతిరేకంగా ఉన్నవారిని, వాటిని విమర్శించే వారిని ఏదో ఒక ఆరోపణతో అరెస్టు చేయడంలో భాగమే ఇది. మా విషయానికి వస్తే 2011లో ఛత్తీస్గఢ్లో మూడు గిరిజన గూడేలను తగుల బెట్టారు. మహిళలపై అత్యాచారం చేసి చంపేశారు. ఈ ఉదంతంపై దర్యాప్తు చేయా లంటూ న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది. అయిదేళ్ల విచారణ తర్వాత గిరిజన గూడేలను పోలీసులే తగులబెట్టారని సీబీఐ ఇటీవలే నివేదిక ఇస్తే ఛత్తీస్గఢ్ ఐజీ దాన్ని ఖండించారు. సీబీఐ అబద్దాలు చెబుతోందని డీఐజీ కల్లూరి ప్రెస్ వాళ్లను పిలిచి మరీ చెప్పారు. తర్వాత పోలీసులు మా దిష్టిబొమ్మలను తగులబెట్టారు. నాతోటి పిటిష నర్లలో ఒకరైన మనీష్ కుంజాంపై దాడి చేశారు. ఈయన ఛత్తీస్గఢ్ ఆదివాసీ నేత. ఆ తర్వాత వెంటనే మాపై కల్పిత హత్యానేరం మోపారు. హత్యకు గురైన వ్యక్తి భార్యే నాకు తెలీదన్నారు. ఆమె ఎవరి పేరూ చెప్పలేదు. ఆమెకు ఏమీ తెలీదు. హతుడి గ్రామ ప్రజలు కూడా మా పేర్లు చెప్పలేదు. ఆ కేసు వివరాలను చూస్తే ఇది పోలీసులు అల్లిన కట్టుకథే అని స్పష్టంగా తెలుస్తుంది. జాతీయ మానవ హక్కుల సంస్థ నుంచి మీకు ఏమైనా మద్దతు దొరికిందా? మా పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ఈ కేసును విచారించడానికైనా, అరెస్టు చేయడానికైనా నాలుగు వారాల ముందే నోటీసు ఇవ్వాలని ఛత్తీస్గఢ్ ప్రభుత్వ కార్య దర్శికి, ఐజీకి ఆదేశాలు జారీ చేసింది. ఆ సమయంలో మేము కోర్టుకు వెళ్లవచ్చన్న మాట. అంటే గతంలోనే కాకుండా భవిష్యత్తులో కూడా కోర్టు మాకు రక్షణ కల్పించింది. మా విషయంలో వారు ఏం చేయాలనుకున్నా నాలుగు వారాలకు ముందుగా నోటీసు ఇవ్వాలి. దాన్ని బట్టి మేం కోర్టును సంప్రదించవచ్చు. ఈ మొత్తం ప్రక్రియను పరిశీలిస్తే మీ ప్రత్యర్థిని జైలులో పెట్టడం ద్వారా మీరు కేసును ఎన్నటికీ గెలవలేరు. న్యాయమూర్తులు చాలా శక్తివంతమైన ఆదేశాలిచ్చినా, అది అమలు జరుగుతోందా? ఏమాత్రం అమలు జరగడం లేదు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును అస్సలు పట్టించుకోలేదనే చెప్పాలి. సల్వాజుడుం సంస్థ ఏ పేరుతో కూడా ఎలాంటి చర్యలూ చేపట్టరాదని సుప్రీంకోర్టు చెప్పింది. ఎస్పీవోల వ్యవస్థను నిషేధించాలని చెప్పింది. అక్కడి ఎస్పీని తొలగించాలని చెప్పింది. కేవలం ట్రాఫిక్ విభాగంలో మాత్రమే పోస్ట్ ఇవ్వాలని ఆదేశించింది. కోర్టు చెప్పినదానికి విరుద్ధంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చేసింది. కోర్టు అలా ఆర్డర్ ఇచ్చిన నాటినుంచి సల్వాజుడుం పేరు మాత్రమే మార్చింది. ఎస్పీఓలకు గతంలో కంటే ఇప్పుడే మంచి జీతాలు ఇస్తున్నారు. వాళ్లవద్ద ఇప్పటికీ ఏకే–47 తుపాకులున్నాయి. వాటితో వారు ప్రజలను కాల్చి చంపుతున్నారు. నిజానికి ఎస్పీవోలు తమ పేరు మార్చుకున్నాక ఛత్తీస్గఢ్లో దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపైనే దాడి చేశారు. ఛత్తీస్గఢ్లో మార్పు వస్తుందంటారా? అలాంటి మార్పు జరుగుతుందని నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను. కొలంబి యాలో ప్రభుత్వానికి, గెరిల్లాలకు మధ్య నాలుగు దశాబ్దాల పోరాటం తర్వాత సయోధ్య కుదిరినప్పుడు అలాంటిది ఇక్క డెందుకు జరగదు? సుప్రీంకోర్టు కూడా గత సంవత్సరం శాంతిస్థాపన కోసం ఎవరో ఒకరు ఎందుకు చొరవ తీసుకోరని ప్రశ్నిం చింది. రాజకీయంగా తలుచుకుంటే శాంతిని నెలకొల్పలేరా? నక్సలైట్ల కాల్పుల్లో లేదా పోలీసుల కాల్పుల్లో చనిపోయినా నష్టపరిహారం అందించే చర్యలు చేపట్టాలి. నక్సల్స్ వ్యతిరేకం కార్యకలాపాలకు వెచ్చించే భారీ మొత్తంతో అభివృద్ధి చేయలేరా? ఎందుకు చేయలేం. సల్వాజుడుం పేరుతో పోలీసులుగా తయారు చేసేకంటే వారికి టీచర్ ఉద్యోగమే మంచిది కదా. అలా చేసినప్పుడు ప్రజలు తమ ప్రభుత్వం గురించి ఆలోచించే తీరులో చాలా మార్పు వస్తుంది. ప్రజలు పెద్ద స్థాయిలో తమ స్వరాలు వినిపించినప్పుడు శాంతి తప్పక ఏర్పడుతుంది. ఈశాన్య రాష్ట్రాలు, ఛత్తీస్ గఢ్లో పరిస్థితి సరిగా లేదు. 5వ షెడ్యూల్ ప్రకారం, చట్టం ప్రకారం సంక్షేమ కార్య క్రమాలు జరిగేలా చూడాలి. ఛత్తీస్గఢ్లో శాంతి సాధ్యమేనా? పదేళ్లుగా ఛత్తీస్గఢ్లో గిరిజనులు భయంతో బతుకుతున్నారు. సాధారణ జీవి తమే అక్కడ లేదు. తమ గూడెం ఉంటుందా లేదా అనే భయంతో బతుకుతున్నారు. ఎప్పుడు గూడేన్ని భద్రతా బలగాలు చుట్టుముడతాయో తెలీదు. తమ గూడేల చుట్టూ పర్వతాలు ఉన్నా వారు శాంతియుతంగా రాత్రిపూట నిద్రించే పరిస్థితి ఉండటం లేదు. పదేళ్లుగా ఇదే పరిస్థితి. ఛత్తీస్గఢ్లో శాంతి సాధ్యమే కానీ చాలా సమయం పడు తుంది. ఆ విశ్వాసం నాకుంది. (నందినీ సుందర్ ఇటీవల హైదరాబాద్ సందర్శించిన సందర్భంగా సాక్షికి ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇది కొంత భాగం) (నందినీ సుందర్తో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://goo.gl/Ckn8np https://www.youtube.com/watch?v=KG9pYret&Gc -
మిషన్ కాకతీయతో రైతుకు ప్రయోజనం
జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి గండేడ్ : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్ర మం రైతులకు ఎంతో ప్రయోజనకరమని జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి అన్నారు. రెండో విడత మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆమె మండలంలోని దేశాయిపల్లి సప్పరాజ్ చెరువు, కొంరెడ్డిపల్లి బ్రాహ్మణచెరువు, రెడ్డిపల్లి రెడ్డిచెరువు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెరువుల్లో పూడికను తీ యించేందుకు సీఎం కేసీఆర్ చేపట్టిన బృ హత్తర కార్యక్రమమే మిషన్ కాకతీయ అన్నారు. దీనిని ప్రతి ఒక్క రైతూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ చేపట్టిన అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి సహకరించాలని తెలిపారు. గ్రామాల్లో తాగునీటికి తీవ్ర ఎద్దడి నెలకొందని, దీంతో ప్రజలు గ్రామాలను విడిచి వెళుతున్నారని ఎం పీపీ శాంతీబా యి.. చైర్పర్సన్ సునీతారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు స్పందించిన ఆమె గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు కల్గకుండా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు తగిన చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో పరిగి అభివృద్ధిలో ఎంతో వెనుకబడిం దని, నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు సునీతారెడ్డి వివరించారు. అనంతరం గండేడ్లో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన, రుసుంపల్లిలో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభిం చారు. కార్యక్రమంలో గండేడ్ ఎంపీీ ప శాంతీబాయి, జెడ్పీటీసీ లక్ష్మి, వైస్ ఎం పీపీ రాధారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, గ్రామ సర్పంచ్ సరితా లక్ష్మణ్, డిప్యూటీ సర్పంచ్ సలీం, ఎంపీటీసీలు చెన్నమ్మ, మంజుల, ఆశన్న, నాయకులు గోపాల్రెడ్డి, బాలవర్దన్రెడ్డి, ఇరిగేషన్ డీఈ రామార్జున్, ఏఈఈ శివరాం, ఎంపీడీఓ కాళుసింగ్, తహశీల్దార్ శ్రీనివాస్రావు గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు. -
సేవకు ప్రాధాన్యమివ్వండి
♦ మహిళలు టీవీ సీరియళ్లు చూడటం.. పురుషులు కల్తీకల్లు తాగడాన్ని పక్కనపెట్టాలి ♦ ‘గ్రామజ్యోతి’లో పార్టీలకతీతంగా భాగస్వాములు కావాలి ♦ జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి శామీర్పేట్ : గ్రామజ్యోతి కార్యక్రమంలో పార్టీలకతీతంగా భాగస్వాములు కావాలని, అప్పుడే పల్లెసీమలు ప్రగతిపథాన పయనిస్తాయని జెడ్పీచైర్పర్సన్ సునీతారెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు టీవీ సీరియళ్లు చూడటాన్ని, పురుషులు కల్తీకల్లు తాగడాన్ని పక్కనపెట్టి సేవ చేసేందుకు ప్రాధాన్యమివ్వాలని ఆమె సూచించారు. శుక్రవారం మండలంలోని లాల్గడిమలక్పేట్లో సునీతారెడ్డి పర్యటించారు. స్థానిక సర్పంచ్ బీర్కురి వెంకటేశ్ అధ్యక్షతన నిర్వహించిన గ్రామజ్యోతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు జెడ్పీ ఉన్నతపాఠశాలలో కొత్తగా ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతను పరిశీలించారు. గ్రామపంచాయతీ వద్ద బాదం మొక్క నాటారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో సునీతారెడ్డి పసంగించారు. ప్రతి అధికారి, స్వచ్ఛంద సంస్థలు గ్రామాలను దత్తత తీసుకుని సమస్యల పరిష్కారానికి తమవంతు కృషి చేయాలని సూచించారు. మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంతభాగాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించాలని సూచించారు. లాల్గడిమలక్పేట్ను దత్తత తీసుకున్న బాలానగర్ డీసీపీ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాన్ని మరింత అభివృద్ధిపథంలో తీసుకేళ్లేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్, జెడ్పీటీసీ సభ్యుడు బాలేష్, ఎంపీడీఓ శోభారాణి, గ్రామజ్యోతి మండల ఇన్చార్జి నరేందర్రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు సుభాషిణి, ఉప సర్పంచ్ జగదీశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
'సమాజ అభివృద్ధికి కృషి చేయాలి'
నల్లగొండ(యాదగిరిగుట్ట): సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతారెడ్డి అన్నారు. పంచాయతీ రాజ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు ఆరె యాదగిరిగౌడ్ ఆత్మీయ సన్మానోత్సవ సభను శుక్రవారం గుట్టలో నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యంగా ఉద్యోగులు, పదవీవిరమణ పొందిన ఉద్యోగులు సమాజ సేవలో పాల్గొని సేవలందించాలని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలకు అంతా అండగా నిలవాలని అన్నారు. -
దళిత సీఎం హామీ ఏమైంది?
జిన్నారం : తెలంగాణ రాష్ట్రానికి దళిత ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పిన హామీ ఏమైందని, అరచేతిలో స్వర్గం చూపించే కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మవద్దని టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పిలుపునిచ్చారు. మండలంలోని బొల్లారం గ్రామంలో కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి సునీతారెడ్డికి మద్దతుగా శుక్రవారం ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమానికి పొన్నాలతో పాటు మండలి విపక్ష నేత డీ శ్రీనివాస్లు హాజరయ్యారు. గ్రామానికి చెందిన అనిల్రెడ్డితో పాటు గ్రామ యువకులు పొన్నాల సమక్షంలో పార్టీలో చేరారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో పొన్నాల మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మూడేళ్లలో 2 వేల మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తానని కేసీఆర్ తప్పుడు ప్రచారం చే స్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. డీ శ్రీనివాస్ మాట్లాడుతూ పారిశ్రామికంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్దేనన్నారు. కేవలం సోనియా వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్నారు. ప్రజలను మాటల గారడీతో మభ ్యపెడుతున్న కేసీఆర్కు బుద్ధి రావాలంటే ఎంపీ అభ్యర్థి సునీతారెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎంపీ అభ్యర్థి సునితారెడ్డి మాట్లాడుతూ ఓటర్లు తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్గౌడ్, పార్టీ రాష్ర్ట మహిళా అధ్యక్షురాలు లలిత, జెడ్పీటీసీ సభ్యుడు బాల్రెడ్డి, నాయకులు సురభి నాగేందర్గౌడ్, నిర్మల, మద్ది వీరారెడ్డి, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గ్రామీణాభివృద్ధికి కృషి
జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి ధారూరు: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తామని జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి అన్నారు. సోమవారం ధారూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఉమాపార్వతి పాలకవర్గం పదవీబాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅథితిగా పాల్గొన్నారు. ఎంపీపీ చాంబర్లో జరిగిన పూజా కార్యక్రమంలో ఆమె పాల్గొని నూతనంగా ఎన్నికై బాధ్యతలు స్వీకరించిన ఎంపీపీ, వైస్ఎంపీపీ, పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి చెందిందని చెబుతున్నా గ్రామీణప్రాంతాలు ఇంకా అభివృద్ధికి దూరంగానే ఉన్నాయన్నారు. భవిషత్తరాలకు కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉందని, లేకుంటే వారు సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. నిధుల్లో ప్రతి పైసా పేదప్రజలకు చెందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు చేరేలా ఉద్యోగులు సహకరించాలని కోరారు. పార్టీలకతీతంగా అభివృద్ధికి సహకరిస్తే మావంతుగా అన్ని విధాలుగా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అసంపూర్తిగా ఉన్న ధారూరులోని సమావేశపు హాలు నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వికారాబాద్ ఎంఎల్ఏ బి. సంజీవరావు మాట్లాడుతూ జిల్లాలో ధారూరు మండలం పూర్తిగా వెనుకబడి ఉన్నందున అభివృద్ధి పనులకు ఎక్కువ శాతం నిధులు కేటాయించాలని జెడ్పీ చైర్పర్సన్ను కోరారు. గతంలో రూ.5 కోట్లు మీరే మంజూరుచేశారని అయన గుర్తు చేశారు. సమావేశంలో సునీతారెడ్డిని ఎంఎల్ఏసంజీవరావు, జెడ్పీటీసీ పి.రాములు, ఎంపీపీ, వైస్ ఎంపీపీలను శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో ఎంపీపీ ఉమా పార్వతి. ధారూరు పీఏసీఎస్ చైర్మన్ జె.హన్మంత్రెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్రెడ్డి, ధారూరు సర్పంచ్ లక్ష్మి, ఉప సర్పంచ్ యూనూస్, పార్టీ నాయకులు రవీందర్రెడ్డి, సంతోష్కుమార్, రాజేందర్రెడ్డి, రాములు యాదవ్, కుమ్మరి శ్రీనివాస్, మల్లారెడ్డి, నాగార్జునరెడ్డి, వరద మల్లికార్జున్, అవుసుపల్లి అంజయ్య, కావలి అంజయ్య, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. -
చైర్పర్సన్గా పట్నం సునీతారెడ్డి ఎన్నిక
-
జెడ్పీ.. గులాబీ వశం
చైర్పర్సన్గా పట్నం సునీతారెడ్డి ఎన్నిక టీడీపీతో సహా 21 మంది సభ్యుల మద్దతు వైస్ చైర్మన్గా టీడీపీ జెడ్పీటీసీ ప్రభాకర్రెడ్డి ఫలించిన మంత్రి మహేందర్రెడ్డి ‘మంత్రాంగం’ తుదకంటూ కొనసాగిన ఉత్కంఠ సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా పరిషత్ అధ్యక్ష పీఠంపై రెండు నెలల పాటు కొనసాగిన సస్పెన్స్కు తెరపడింది. ఆదివారం జిల్లా పరిషత్లో జరిగిన పరోక్ష ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన యాలాల జడ్పీటీసీ పట్నం సునీతారెడ్డి చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఆమె పేరును తాండూరు జెడ్పీటీసీ సభ్యుడు రవిగౌడ్ ప్రతిపాదించగా, యాచారం జెడ్పీటీసీ రమేష్ బలపర్చారు. టీఆర్ఎస్ సభ్యులు 12మంది, టీడీపీ సభ్యులు ఏడుగురితోపాటు, కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఇద్దరు సునీతారెడ్డికి మద్దతు పలికారు. మొత్తంగా 21 మంది మద్దతు ఆమెకు లభించింది. కుత్భుల్లాపూర్ జెడ్పీటీసీ సభ్యుడు బి.ప్రభాకర్రెడ్డి (టీడీపీ) జడ్పీ వైస్ చైర్మన్గా గెలుపొందారు. ఈయన పేరును ఘట్కేసర్ జెడ్పీటీసీ సంజీవరెడ్డి ప్రతిపాదించగా, ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీ ఐలయ్య బలపర్చారు. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పీఠం సొంత చేసుకునేంత ఆధిక్యం ఏ పార్టీకి లభించలేదు. 14 స్థానాలు కాంగ్రెస్, 12 స్థానాలు టీఆర్ఎస్ గెలుచుకోగా టీడీపీ ఏడు స్థానాలను సంపాదించుకుంది. ఏ పార్టీకి మేజిక్ ఫిగర్ లేకపోవడంతో క్యాంపు రాజకీయాలకు తెరలేచింది. రాజకీయ పరిస్థితులను టీఆర్ఎస్ అనుకూలంగా మలుచుకుని.. ఆదివారం నాటకీయంగా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకుంది. అధ్యక్ష ఎన్నికలో సహకరించిన టీడీపీకి ఉపాధ్యక్ష పీఠాన్ని కట్టబెట్టింది. కాంగ్రెస్ పార్టీ నుంచి జంగారెడ్డికి చైర్మన్ పదవికి పోటీపడగా, 12 మంది మద్దతు తెలిపారు. టెన్షన్.. టెన్షన్ జడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక నేపథ్యంలో ఆదివారం ఉదయం నుంచి జిల్లా పరిషత్లో ఉత్కంఠత నెలకొంది. వాస్తవానికి ఈనెల 6న ఎన్నిక జరగాల్సి ఉం డగా.. కోరం లేకపోవడంతో వారం పాటు ఎన్నికను వా యిదా వేశారు. ఈ సమయంలో అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెట్టాయి. టీడీపీ సభ్యులకు ఉపాధ్యక్ష పదవిని ఎరవేస్తూ టీఆర్ఎస్ నెరిపిన రాజకీయ వ్యూహం ఫలించింది. కాంగ్రెస్కి సహకరించి పదవీ కాలాన్ని పంచుకోవాలని టీడీపీ ఆధినాయకత్వం నిర్ణయించి చర్చలు జరిపినప్పటికీ.. మధ్యలో నెలకొన్న అవాంతరాలతో స్నేహం చిగురించలేదు. అయితే అంతర్గతంలో టీఆర్ఎస్, టీడీపీ మధ్య ఒప్పందం కుదిరినప్పటికీ.. బయటకు పొక్కకుండా ఇరు పార్టీల నేతలు జాగ్రత్త పడ్డారు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన కో-ఆప్షన్ ఎన్నికలో టీఆర్ఎస్కి టీడీపీ పూర్తి సహకారం ఇవ్వడంతో అధ్యక్ష పీఠం కూడా టీఆర్ఎస్కే దక్కనున్నట్లు స్పష్టమైంది. ఏకపక్షంగా ఎన్నిక కో-ఆప్షన్ సభ్యులు ఎన్నికకు ఆరుగురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఇద్దరు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో బరిలో నలుగురు అభ్యర్థులు నిలిచారు. ఖాజామొయినుద్దీన్, నవాజ్ ముంతాజ్, మహ్మద్ రఫీ, మీర్ మహ్మద్ అలీ ఉన్నారు. వీరిలో ఖాజామొయినుద్దీన్, మీర్ మహ్మద్అలీ కోఆప్షన్ సభ్యులుగా 21 మంది మద్దతుతో గెలుపొందారు. రెండోసారి.. పట్నం సునీతారెడ్డి జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. తాండూరు ఎమ్మెల్యే, జిల్లా మంత్రి పి.మహేందర్రెడ్డి సతీమణి అయిన ఈమె 2006 జెడ్పీటీసీ ఎన్నికల్లో రాజకీయాల్లోకి ప్రవేశించి.. తొలిసారి జిల్లా చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. తాజాగా 2014 ఎన్నికల్లో యాలాల మండలం నుంచి టీఆర్ఎస్ తరఫున జెడ్పీటీసీగా పోటీచేసి గెలుపొందారు. భర్త మహేందర్రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో ఆమె రెండోసారి చైర్పర్సన్ పీఠాన్ని అధిరోహించారు. ప్రొఫైల్ పేరు: పట్నం సునీతారెడ్డి పుట్టిన తేదీ: 25-11-1975 విద్యార్హత: బీఎస్సీ మ్యాథ్స్ సొంతూరు: మెదక్ జిల్లా జోగిపేట మండలం దాకూర్ తల్లిదండ్రులు: రాజమణి, గోపాల్రెడ్డి భర్త: మహేందర్రెడ్డి (రవాణశాఖ మంత్రి) సంతానం: కూతురు మనీషారెడ్డి, కుమారుడు రినీష్రెడ్డి చేపట్టిన పదవులు: 2006లో తొలిసారి జెడ్పీ చైర్పర్సన్గా ఎన్నిక, తాజాగా మరోసారి జెడ్పీ చైర్పర్సన్గా ఎన్నిక. -
సునీతకు స్వగ్రామంలో ఎదురు దెబ్బ
నర్సాపూర్, న్యూస్లైన్: నర్సాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్కు అనుకూల పవనాలు వీచగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీచినట్లు ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. నర్సాపూర్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించి ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచి ఓటమి చెందిన మాజీ మంత్రి సునీతారెడ్డికి స్వగ్రామంలో సైతం వ్యతిరేక పవనాలు వీచాయి. గతంలో ఆమె చేతిలో రెండుసార్లు ఓటమి చవిచూసి మూడో సారి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన చిలుముల మదన్రెడ్డి కారు జోరుతో విజయం సాధించారు. అయితే సునీతారెడ్డి స్వగ్రామమైన గోమారంలో మూడు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా ఒకే పోలింగ్ స్టేషన్లో ఆమెకు ఆధిక్యత వచ్చింది. 239 పోలింగ్ స్టేషన్లో ఆమెకు 469 ఓట్లు రాగా టీఆర్ఎస్ అభ్యర్థి చిలుముల మదన్రెడ్డికి 336ఓట్లు వచ్చాయి. 240 పోలింగ్ స్టేషన్లో కాంగ్రెస్కు 135 ఓట్లు మాత్రమే రాగా టీఆర్స్కు 366 ఓట్లు,240(ఎ) పీఎస్లో కాంగ్రెస్కు 284 ఓట్లు, టీఆర్ఎస్కు 311ఓట్లు రావడంతో అక్కడ సైతం టీఆర్ఎస్ హవా కొనసాగిందని స్పష్టమవుతుంది. అలాగు గోమారం పక్క గ్రామాలైన బిజిలీపూర్లో స్వల్ప ఆధిక్యత రాగా నవాబుపేట గ్రామంలో సుమారు నాల్గు వందల ఓట్ల ఆధిక్యత లభించింది. కాగా మండలానికి చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యులైన నారాగౌడ్, ఉమాదేవి, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు శ్రీరాంరెడ్డి స్వగ్రామాల్లో టీఆర్ఎస్కే ఆధిక్యత లభించింది. మదన్రెడ్డి స్వగ్రామమైన కౌడిపల్లిలో మూడు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా మూడింటిలో టీఆర్ఎస్కు 1328ఓట్లు రాగా కాంగ్రెస్కు 560 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సీడీసీ చైర్మన్ చిలుముల దుర్గారెడ్డి కౌడిపల్లికి చెందిన వారే అయినప్పటికీ అక్కడ టీఆర్ఎస్కు భారీగానే ఓట్లు వచ్చాయి. కాగా నర్సాపూర్ మాజీ వ్యవసాయ మార్కెట్ కమీటీ చైర్మన్ నారాయణరెడ్డి స్వగ్రామమైన చిట్కుల్లో, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు మాణిక్యరెడ్డి స్వగ్రామమైన గౌతాపూర్లో, మరో సీనియర్ నాయకుడు విశ్వంబరస్వామి స్వగ్రామమైన సోమక్కపేటలలో సైతం టీఆర్ఎస్కు ఆధిక్యత లభించింది. నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్లో కాంగ్రెస్ సర్పంచ్ ఉన్నప్పటికీ టీఆర్ఎస్కు ఆధిక్యత లభించింది. ఇక్కడ కాంగ్రెస్కు 3558 ఓట్లు రాగా టీఆర్ఎస్కు 4320ఓట్లు లభించాయి. కొన్ని నెలల క్రితం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నర్సాపూర్ పంచాయతీ సర్పంచ్గా రమణారావును గెలిపించుకుని పంచాయతీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆత్మకమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు గౌడ్ స్వగ్రామమైన రెడ్డిపల్లిలో టీఆర్ఎస్కు సుమారు రెండు వందల ఓట్లు అధికంగా వచ్చాయి. మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్గుప్తా స్వగ్రామంలో కాంగ్రెస్కు టీఆర్ఎస్కన్నా 94 ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఇదిలాఉండగా కొల్చారం మండలంలోని కాంగ్రెస్ నాయకులు ఇంద్రసేనారెడ్డి, మల్లారెడ్డి గ్రామాల్లో టీఆర్ఎస్కు స్వల్ప ఆధిక్యత రాగా ఇతర నాయకులు శ్రీనివాస్రెడ్డి, రమేష్, నరేందర్రెడ్డి తదితరులు తమ గ్రామాల్లో కాంగ్రెస్కు ఆధిక్యత సంపాదించిపెట్టారు. అలాగే వెల్దుర్తి మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు అనంతరెడ్డి స్వగ్రామమైన బండపోసాన్పల్లిలో కాంగ్రెస్కు 69ఓట్ల ఆధిక్యత లభించింది. రామాయంపేట ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్రెడ్డి స్వగ్రామమైన రామాంతపూర్లో టీఆర్ఎస్కు కాంగ్రెస్ కన్నా 188ఓట్లు అధికంగా వచ్చాయి. మండల కేంద్రమైన వెల్దుర్తిలో కాంగ్రెస్ నాయకుడు శంకర్గౌడ్ ఊరిలో ఆరు పీఎస్లు ఏర్పాటు చేయగా సుమారు 350ఓట్ల ఆధిక్యత టీఆర్ఎస్కు లభించింది. హత్నూర మండల కేంద్రంలో కాంగ్రెస్కన్నా టీఆర్ఎస్కు ఐదు వందల ఓట్లు అధికంగా వచ్చాయి. గతంలో హత్నూర జెడ్పీటీసీ,ఎంపీపీ అధ్యక్ష పదవులు కాంగ్రెస్ అధీనంలో ఉన్నప్పటికీ టీఆర్ఎస్కు ఆధిక్యత రావడం గమనార్హం. హత్నూర మాజీ జెడ్పీటీసీ ఆంజనేయులు స్వగ్రామమైన బోర్పట్లలో 323 ఓట్లు, మరో నాయకుడు అళ్వారయ్య స్వగ్రామంలో కాసాలలో టీఆర్ఎస్కు 288ఓట్లు అధికంగా వచ్చాయి. అదే మండలంలోని డాక్టర్ గోవర్దన్రావు, నర్సింహారెడ్డి స్వగ్రామాల్లో టీఆర్ఎస్కు స్వల్ప ఆధిక్యత లభించింది. -
కాంగ్రెస్ను గెలిపించి సోనియాకు కానుకగా ఇవ్వాలి
మాజీ మంత్రి సునీతారెడ్డి కౌడిపల్లి, న్యూస్లైన్: పార్లమెంట్ ఉభయ సభల్లో తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను సజావుగా ముందుకు నడిపి, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఎంపీ స్థానాల ను కానుకగా ఇవ్వాలని రాష్ట్ర మాజీ మంత్రి సునీతారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో శనివారం కౌడిపల్లి మండ లం నాగ్సాన్పల్లి ఫాం హౌజ్ వద్ద కాం గ్రెస్ పార్టీ మండలం అధ్యక్షుడు మాణి క్యరెడ్డి అధ్యక్షతన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం, బీజేపీలు తెలంగాణకు ఒప్పుకున్నా చివర్లో అడ్డుతగిలాయని విమర్శించారు. అయినా సోనియాగాంధీ ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణను తెచ్చింది, ఇచ్చి ంది కాంగ్రెస్ పార్టీయేనని తెలిపారు. అందుకు కృతజ్ఞతగా రాష్ట్రంలో మొత్తం ఎంపీలను గెలిపించి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అ య్యేలా చూడాలన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో పార్టీ టికెట్ ఇచ్చిన అభ్యర్థులను గెలిపించుకోవాల్సి ఉందన్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో చేసిన చిన్నచిన్న తప్పులను సరిదిద్దుకుని కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలన్నారు. నియోజకవర్గంలో రూ. 2 వేల కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచిం చారు. ప్రత్యేక రాష్ట్రం, అభివృద్ధి చేసిన మనకు మాత్రమే ఓట్లు అడిగే హక్కు ఉందని తెలిపారు. నర్సాపూర్ నుంచే పోటీ త్వరలో జరగనున్న ఎన్నికల్లో తాను పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని కొందరు కావాల నే ప్రచారం చేస్తున్నారని ఇలాంటి వాటిని ప్రజలు నమ్మ రాదని మాజీ మంత్రి సునీతారెడ్డి కోరారు. నర్సాపూర్ ప్రజలు తనను కూతురిగా భావించి ఎన్నికల్లో గెలిపిస్తున్నారని వారికి రుణపడి ఉంటానన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు యాదాగౌడ్, విశ్వంబర స్వామి, సీడీసీ మాజీ చైర్మన్ దుర్గారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాణిక్య రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కృష్ణగౌడ్, నాయకులు రాంచంద్రారెడ్డి, గోవర్ధన్రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం
జిన్నారం, న్యూస్లైన్: పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఘనత తమ పార్టీదేనని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖామంత్రి సునీతారెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిన్నారం మండలం వావిలాల గ్రామంలో రూ. 30లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి సునీతారెడ్డి, ఎమ్మెల్యే నందీశ్వర్గౌడ్, ఎమ్మెల్సీ భూపాల్రెడ్డితో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగిందన్నారు. గ్రామాల్లో దశల వారీగా సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. లక్ష్మిపతిగూడెంలో రూ. 6.50లక్షలతో అంగన్వాడీ భవనాన్ని నిర్మించేందుకు నిధులను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. సోనియాగాంధీ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం సంతోషకరమన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలను గెలిపించాలన్నారు. ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి మాట్లాడుతూ వావిలాలలో అభివృద్ది పనులు చేపట్టడం సంతోషకరమన్నారు. ఎమ్మెల్యే నందీశ్వర్గౌడ్ మాట్లాడుతూ ఫిబ్రవరి మెదటి వారంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటవుతుందన్నారు. మండలంలో రూ. 10కోట్లతో చేపట్టనున్న మంజీరా నీటి పథకం పనులను పూర్తచేసి, వేసవికాలం వరకు ప్రతి ఇంటికి మంజీరా నీటిని అందిస్తామన్నారు. మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామన్నారు. అనంతరం సర్పంచ్ రవీందర్, ఉపసర్పంచ్ నవనీత్రెడ్డిలు మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి బాల్రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎవరు అడ్డుకున్నా తెలంగాణ ఆగదు
కౌడిపల్లి, న్యూస్లైన్: ఎవరు అడ్డుకున్నా తెలంగాణ ఏర్పాటు ఆగబోదని, రానున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పాసవుతుందని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి సునీతారెడ్డి అన్నారు. శుక్రవారం కౌడిపల్లిలో మల్లికార్జున స్వామి ఆలయంవద్ద జరిగిన ఎల్లమ్మదేవి విగ్రహ ప్రతిష్ట ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, కేంద్రం తెలంగాణను ప్రకటించడంతోపాటు, అసెంబ్లీలో తెలంగాణ బిల్లును సైతం ప్రవేశపెట్టినందున అందరూ సహకరించాలని ఆమె కోరారు. తెలంగాణను అడ్డుకునేందుకు చివరి వరకూ పోరాడతామని సీఎం వ్యాఖ్యానించడం అతని వ్యక్తిగతమన్నారు. తెలంగాణను అడ్డుకుంటామంటున్న సీమాంధ్ర నేతలు వారి ప్రాంత అభివృద్ధి గురించి అసెంబ్లీలో మాట్లాడితే ఫలితం ఉంటుందన్నారు. మంత్రి వచ్చిన విషయం తెలుసుకున్న స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు మల్లికార్జుస్వామి గుడివద్దకు వచ్చి మంత్రికి కళాశాల సమస్యలు విన్నవించారు. సానుకూలంగా స్పందించిన ఆమె సమస్యలన్నీ పరిష్కరిస్తానన్నారు. అనంతరం ఆమె భుజిరంపేటలోగల శ్రీకృష్ణనందాశ్రమానికి వెళ్లి రాంపూర్ పీఠాధిపతి మాదవానంద స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, డీసీసీ ప్రధానకార్యదర్శి యాదాగౌడ్, ఉపాధ్యక్షుడు ఎన్ దుర్గారెడ్డి, మాజీ సీడీసీ దుర్గారెడ్డి, నాయకులు ఎంసీ విఠల్, సాయిరెడ్డి, సంగాగౌడ్, రాజిరెడ్డి, వడ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. సమస్యలపై చర్చిస్తే ప్రయోజనం నర్సాపూర్: తెలంగాణను అడ్డుకుంటామంటున్న సీమాంధ్ర నేతలు తెలంగాణ ఏర్పాటు అనంతరం సీమాంధ్రలో ఉత్పన్నమయ్యే సమస్య గురించి అసెంబ్లీలో చర్చిస్తే ఆ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందని మంత్రి సునీతారెడ్డి అన్నారు. శుక్రవారం నర్సాపూర్లో విలేకరులతో మాట్లాడిన ఆమె, జనవరిలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ బిల్లుపై చర్చించి ఈ బిల్లును రాష్ట్రపతికి తిప్పి పంపేందుకు తమ పార్టీ కృషి చేస్తోందన్నారు. సీఎం పార్టీ పెడతారంటూ వస్తున్న వార్తల గురించి కొందరు విలేకరులు ఆమె వద్ద ప్రస్తావించగా, పార్టీ పెట్టడం ఆయన వ్యక్తిగత విషయమన్నారు. విలేకరుల సమావేశంలో స్థానిక సర్పంచ్ వెంకటరమణారావు, ఇతర కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్గుప్తా, సత్యంగౌడ్, లలిత, అనిల్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నర్సాపూర్కు పీజీ కళాశాల నర్సాపూర్: నర్సాపూర్కు పీజీ కళాశాల మంజూరు అయినట్లు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి సునీతారెడ్డి చెప్పారు. శుక్రవారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు. నర్సాపూర్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి పీజీ కళాశాలలో తరగతులు కొనసాగుతాయని చెప్పారు. ఎమ్మెస్సీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గనిక్ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఎంబీఏ, ఎంసీజే కోర్సులుంటాయన్నారు. పీజీ కళాశాల కోసం ఐదు ప్రొఫెసర్ పోస్టులతో పాటు 10 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 16 అసిస్టెంటు ప్రొఫెసర్ల పోస్టులు కూడా మంజూరు అయినట్లు ఆమె తెలిపారు. అంతేకాకుండా శిథిలావస్థకు చేరిన మెదక్ ఆర్డీఓ కార్యాలయానికి నూతన భవనం నిర్మించేందుకు గానూ రూ.2 కోట్లు మంజూరు చేయించినట్లు ఆమె తెలిపారు. నర్సాపూర్ నియోజక వర్గంలోని ఉన్నత పాఠశాలలకు కొత్త భవనాలను నిర్మించేందుకు రూ. 5 కోట్ల 95 లక్షల 47 వేలు మంజూరయినట్లు మంత్రి సునీతారెడ్డి చెప్పారు. -
తెలంగాణను ఎవరూ అడ్డుకోలేరు
నర్సాపూర్, న్యూస్లైన్: ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైనందున ఇక రాష్ర్ట ఏర్పాటును ఎవరూ అడ్డుకోలేరని మహిళ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సునీతారెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆమె నర్సాపూర్లోని అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడుతూ పార్లమెంటుకు తెలంగాణ బిల్లు రాకుండా అడ్డుకుంటానని సీఎం కిరణ్ కుమార్రెడ్డి ఏపీఎన్జీలకు హామీ ఇచ్చినట్లు వచ్చిన వార్తలపై ఆమె స్పందించారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు తమ అభిప్రాయలు చెప్పిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ సీడబ్యుసీలో తీర్మానం చేసిందన్నారు. తమ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి సమాధి కట్టడం సరికాదని ఆమె పేర్కొన్నారు. నిరసనలు వ్యక్తం చేసేందుకు అనేక మార్గాలు ఉన్నాయని, అలా కాకుండా జీవించి ఉన్న వ్యక్తులకు సమాధి కట్టి నిరసన వ్యక్తం చేయడం విచారకరమన్నారు. నియోజక వర్గంలో పలు అభివృద్ధి పనులకు రూ.46 కోట్ల 46 లక్షల 59 వేలు మంజూరు చేయించినట్లు చెప్పారు. నర్సాపూర్లో పీజీ కళాశాల ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రూ. 31 కోట్లను మంజూరు చేసిందన్నారు. ప్రస్తుతం నర్సాపూర్లో ఉన్న ఆసుపత్రి స్థాయిని 100పడకల స్థాయికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఇందుకు రూ. 11కోట్ల 25లక్షలు మంజూరైనట్లు మంత్రి వివరించారు. కౌడిపల్లి మండలం సదాశివపల్ల గ్రామంలోని రోడ్డు నిర్మాణానికి రూ. 40 లక్షలు , హత్నూర మండలం మధిర గ్రామంలోని రహదారికి రూ.27లక్షల 59 వేలు, శివ్వంపేట మండలం తిమ్మాపూర్ రోడ్డుకు రూ.కోటి ఐదులక్షలు, సికింద్లాపూర్ నుంచి కూచారం రహదారికి రూ. 63లక్షలు, వెల్దుర్తి మండలం ఎదుల్లపల్లి, ఉప్పులింగాపూర్ రహదారికి రూ.75 లక్షలు, కొల్చారం మండలం సీతారాంతండా రొడ్డుకు రూ.70లక్షలు మంజూరైనట్లు మంత్రి వివరించారు. అలాగే నర్సాపూర్లో శిథిలావస్థలో ఉన్న రెండు ప్రభుత్వ క్వార్టర్లను పునర్నించేందుకు రూ. 31లక్షలు, కొల్చారంలో మండల పరిషత్ కార్యాలయ భవన నిర్మాణానికి గాను రూ 80 లక్షలు మంజూరు చేయించినట్లు మంత్రి తెలిపారు. అలాగే నర్సాపూర్లో ఆర్టీసీ బస్ డిపో నిర్మించేందుకు సంబంధిత శాఖా మంత్రితో చర్చించామన్నారు. త్వరలో డిపో నిర్మాణ పనులు ప్రారంభం కాగలవని ఆమె ఆశా భావం వ్యక్తం చేశారు. కాగా వివిధ అభివృద్ధి పనులకు అవసరమైన స్థలాన్ని కేటాయించాలని ఆమె సంబంధిత అధికారులకు సూచించారు. విలేకరుల సమావేశంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
నిరుద్యోగుల కోసమే జాబ్మేళా
నర్సాపూర్, న్యూస్లైన్: నిరుద్యోగులను ఆదుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం జాబ్ మేళాలను నిర్వహిస్తున్నట్లు మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతారెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని ఆనంద్ గార్డెన్లో రాజీవ్ యువ కిరణాలు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన జాబ్మేళాకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఏడాదికి లక్ష ఉద్యోగాలు లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3 లక్షల 52 వేల మందికి ఉద్యోగాలివ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆమె తెలిపారు. జిల్లాలో 14 వేల మందికి లక్ష్యం కాగా ఇప్పటి వరకు 5 వేల మందికి ఉద్యోగాలు ఇప్పించినట్లు మంత్రి వివరించారు. చదువుకున్న వారికి ఆయా రంగాల్లో నైపుణ్యం పెంచేందుకు శిక్షణ సైతం ఇస్తున్నట్లు ఆమె వివరించారు. కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న కలెక్టర్ స్మితాసబర్వాల్ మాట్లాడుతూ నిరుద్యోగులు ఉద్యోగంలో చేరగానే జీతం ఎంత అని చూడొద్దని, సొంతంగా ఉపాధి పొందాలన్న ఉద్దేశంతో ముందుకు సాగాలని హితవు పలికారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగుల కోసం చేపడుతున్న కార్యక్రమాలు వివరించారు. కార్యక్రమంలో గృహ నిర్మాణ సంస్థ పీడీ బాల్రెడ్డి, ఆత్మ చైర్మన్ ఆంజనేయులుగౌడ్, స్థానిక సర్పంచ్ వెంకటరమణారావు, కాంగ్రెస్ నాయకులు సత్యంగౌడ్, కృష్ణారావు, వెంకటేష్గౌడ్, శ్రీనివాస్గుప్తా, అనిల్గౌడ్, శ్రీనివాస్గౌడ్, లలిత, మహిపాల్రెడ్డి, గోమారం చంద్రాగౌడ్ ఐకేపీ ఇన్చార్జ్ ఏపీఓ బాబురావు, ఏపీఎం సత్యనారాయణ, ఇతర సిబ్బంది, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. జాబ్మేళాలో పాల్గొని, ఆయా కంపెనీలు ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూ కౌంటర్లును మంత్రి, కలెక్టర్ పరిశీలించారు. కాగా జాబ్మేళాలో 2,039 మంది నిరుద్యోగులు పాల్గొనగా 1,223 మంది ఎంపికైనట్లు ఐకేపీ అధికారులు తెలిపారు. -
గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత మంత్రి సునీతారెడ్డి
శివ్వంపేట, న్యూస్లైన్: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సునీతారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం శివ్వంపేట, సికింద్లాపూర్, పిల్లుట్ల, లింగోజిగూడ గ్రామాల్లో ఆమె పర్యటించారు. సికింద్లాపూర్, లింగోజిగూడలో సీసీ రోడ్లు, లింగోజిగూడ తండాలో పాఠశాల భవనం, పిల్లుట్లలో ఆరోగ్య ఉపకేంద్రం, శివ్వంపేట శ్రీరాంనగర్ కాలనీలో పాఠశాల భవనం, తూప్రాన్ - నర్సాపూర్ ప్రధాన రహదారి వద్ద రూ.5లక్షలతో ఏర్పాటు చేసిన సోలార్ లైట్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. అంతర్గత రోడ్లు, ప్రభుత్వ భవనాల ఏర్పాటుకు కృషిచేయడంతో ప్రతి కుటుంబానికి సంక్షేమపథకాలు అందిస్తున్నామన్నారు. విద్యుత్ కొరతను అధిగమించేందుకు గాను సోలార్ వీధిలైట్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అందులో భాగంగానే ప్రతి పంచాయతీ పరిధిలో సోలార్ లైట్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేకధికారి బాల్రెడ్డి, తహశీల్దార్ కిష్టారెడ్డి, ఎంపీడీఓ పూజ, సర్పంచ్లు చంద్రాగౌడ్, సులోచన నర్సింహారెడ్డి, స్రవంతి నవీన్కుమార్, పన్సారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరాంరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీకాంతారావు, గోలి వెంకటేశం గుప్తా, చింతల మహేందర్రెడ్డి, యాదాగౌడ్, నాయకులు రాజలింగం, బాసన్పల్లి రాములుగౌడ్, శ్రీనివాస్గౌడ్, నాగభూషణం, మహిపాల్రెడ్డి, చింతస్వామి, తదితరులు పాల్గొన్నారు. 15 ఏళ్ల తర్వాత బస్కెక్కా మంత్రి సునీతారెడ్డి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె పిల్లుట్ల నుంచి నర్సాపూర్కు వెళ్లే ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. అనంతరం మంత్రి బస్సులో పిల్లుట్ల నుంచి లింగోజిగూడ వరకు టిక్కెట్టు తీసుకొని ప్రయాణం చేశారు. 15ఏళ్ల తర్వాత తాను బస్సులో ప్రయాణం చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ సులోచన నర్సింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.