thoothukudi
-
చదువుకున్న సముద్రపు చేప
బావుల్లో ఉండిపోతారు కొందరు. తెలిసిన కుంటల్లోనే మునకలేస్తారు కొందరు.మహా అయితే చెరువు గురించి ఆలోచిస్తారు కొందరు.కాని అతి కొందరు మాత్రమేసముద్రాన్ని జయించాలనుకుంటారు. వృత్తిరీత్యా బెస్త కుటుంబంలో పుట్టిన సుభిక్ష ఇంగ్లిష్ లిటరేచర్ చదివి నగరంలో ఉద్యోగం చేసినాఎందుకు తన వృత్తిలోనే రాణించకూడదు అని ఆలోచించింది. అంతే... తానే చేపల వేటలో దిగి ‘సీఫుడ్ అంట్రప్రెన్యూర్’గా దేశాన్ని ఆకర్షిస్తోంది.సముద్రానికి కెరటాలతో అదిలించడం తెలుసు. వలల కొద్ధి చేపల్ని నింపి సిరులను అందించడం కూడా తెలుసు. ‘సముద్రం తల్లిలాంటిదే. మమకారం, కోపం రెండూ ఉంటాయి. భయభక్తులతో ఉంటే ఏది అడిగినా కాదనకుండా ఇస్తుంది’ అంటుంది సుభిక్ష. ఈ 23 ఏళ్ల అమ్మాయి తమిళనాడులోని తూత్తుకూడి సమీపంలో ఉన్న పెరియతలై అనే బెస్తపల్లె నుంచి ఇవాళ దేశాన్ని ఆకర్షిస్తోంది. మగవాళ్లకే పరిమితమైన చేపలు పట్టే విద్యలో ఆ అమ్మాయి రాణించడమే కాదు తన చదువును ఆ విద్యకు జత చేసి ఆదాయ మార్గాలను నిర్మిస్తోంది.ఒడ్డు నుంచి సముద్రానికి...మగవాళ్లు చేపలు పడతారు. వాటిని స్త్రీలు గట్టున కూచుని అమ్ముతారు. ఇదే ఆనవాయితీ. తరాలుగా ఇదే సాగుతోంది. సుభిక్ష తండ్రి కుమార్, అన్న లియాండర్ కూడా వాళ్లింట్లో సముద్రం మీద వేటకు వెళ్లి చేపలు తెస్తారు. తల్లి వాటి అమ్మకంలో సాయం చేస్తుంది. ‘నేనెందుకు చేపలు పట్టడానికి మీతో రాకూడదు?’ అని అడిగింది సుభిక్ష ఒకరోజు తండ్రిని. తండ్రి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే సుభిక్ష ఇంగ్లిష్ లిటరేచర్ చదివింది. ప్రయివేట్ బ్యాంకులో ఉద్యోగం కూడా చేస్తోంది. ఆడపిల్ల సౌకర్యంగా బతకాలంటే ఆమెలాంటి మార్గమే అందరూ సూచిస్తారు. ‘సముద్రంలో ఎంతో ఉంది. టెన్ టు ఫైవ్ జాబ్లో ఏముంది? నన్నొక ప్రయత్నం చేయనివ్వు నాన్నా’ అంది సుభిక్ష. అప్పటికే ఆ అమ్మాయికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉంది. మత్స్యకారుల జీవనాన్ని సరదాగా వీడియోల్లో చూపేది సుభిక్ష. ఇప్పుడు ఆ అమ్మాయి సిసలైన బెస్త జీవనంలోకి దిగింది.సముద్రంతో చెలగాటం...‘కోరమాండల్ తీరంలో సముద్రంతో దిగడం అంటేప్రాణాలతో చెలగాటమే’ అన్నాడు సుభిక్ష తండ్రి చివరకు ఒప్పుకుంటూ. మొదటిసారి తండ్రి, అన్నతో కలిసి ఫైబర్ బోట్లో చేపల వేటకు సుభిక్ష వెళ్లిన అనుభవం గగుర్పాటుకు గురి చేసేదే. ‘ఆకాశంలో చుక్కలు తప్ప వేరే ఏమీ కనిపించని చీకటి. పడవను కుదురుగా ఉంచకుండా ఎత్తెత్తి వేసే సముద్రం. మేము దాదాపు 20 కిలోమీటర్ల లోపలికి వెళ్లాం. అక్కడ ఏమైనా జరగొచ్చు. కాని ఆ సమయంలో చేపల వేటకు వెళ్లి వల విసరడం గొప్ప అనుభవం’ అంది సుభిక్ష. ఆ రోజు నుంచి నేటి వరకు అనేకసార్లు రాత్రి 1 గంటకు వేటకు వెళ్లి ఉదయం 10 గంటలకు తిరిగి రావడం సుభిక్షకు అలవాటుగా మారింది. ‘చేపలు పట్టడానికి ఏయే వలలు వాడాలి... ఏ వల వేస్తే ఏ రకం చేపలు పడతాయనేది తెలుసుకున్నాను. ఇంకా పల్లెపల్లెకు తిరిగి చేపల వేటలో మా పూర్వికుల అనుభవం తెలుసుకుంటున్నాను’ అంటుంది సుభిక్ష. ఆమె తన వేటను మొదలెట్టాక అదంతా వీడియోలు చేసేసరికి ప్రపంచానికి తెలిసిపోయింది.పెరిగిన వ్యాపారంచేపలు పడితే టోకున ఎక్స్పోర్టర్లకు అమ్మడం లేదా లోకల్గా అమ్మడం లేదా ఎండబెట్టి అమ్మడం తెలిసిన సంప్రదాయ పద్ధతికి భిన్నంగా సుభిక్ష తమ చేపలను ఊరగాయలుగా, పచ్చళ్లు, ఎండు చేపలుగా మార్చి వాటిని తన లేబుల్ కింద అమ్మకానికి పెట్టింది. సోషల్ మీడియా వల్ల వాటిని దేశ విదేశాల్లో కొంటున్నారు. అలా మెల్లగా సుభిక్ష ‘సీఫుడ్ అంట్రప్రెన్యుర్’గా మారింది. తండ్రి, అన్న ఈ పరిణామాలను స్వాగతిస్తున్నారు. ఊళ్లో అందరూ సుభిక్షను మెచ్చుకోలుతో చూస్తున్నారు. ‘చేపలంటేప్రొటీన్తో నిండిన రిచ్ఫుడ్. ప్రజలకు ఆ ఫుడ్ను అందించడానికి బెస్తలు ఎంత కష్టం చేస్తారో... ప్రమాదంలోకి వెళతారో లోకానికి చూపడమే నా లక్ష్యం. అలాగే మత్స్యకార స్త్రీలను మరింత ముందుకు తీసుకు వెళ్లడం కూడా’ అంటోంది సుభిక్ష. ఒకవైపు ఈ పని చేస్తూనే మరోవైపు మోడల్గా కూడా పని చేస్తోంది. సంప్రదాయ విద్యలని గౌరవిస్తూ ఆధునిక ధోరణులను పుణికి పుచ్చుకుంటూ ముందుకు సాగితే విజయం తథ్యం అని నిరూపించింది సుభిక్ష. -
Kanimozhi Karunanidhi: రాజకీయ కవయిత్రి
కనిమొళి కరుణానిధి.. బహుముఖ ప్రతిభావంతురాలైన రాజకీయవేత్త, కవి, పాత్రికేయురా లు, ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) సభ్యురాలు. తూత్తుక్కుడి నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. చురుకైన విద్యార్థి... కనిమొళి చిన్నప్పటి నుంచే చురుకైన విద్యార్థి. బాల్యంలో తండ్రితో పెద్దగా గడపలేకపోయినా.. ఆయనకు మాత్రం ప్రియమైన కూతురే. కనిమొళి పుట్టిన తరువాతే ముఖ్యమంత్రి పదవి దక్కడంతో అది ఆమె తెచి్చన అదృష్టమేనని కరుణానిధి భావించేవారు. తండ్రి తన దగ్గరలేని బాధను కనిమొళి కవిత్వంగా మలిచారు. అది చదివి ఆయన కదిలిపోయారు. అలా తండ్రీకూతుళ్లను సాహిత్యం మరింత దగ్గర చేసింది. కనిమొళి క్రియాశీల రాజకీయాలకు దూరంగా పెరిగారు. 2001లో జయలలిత హయాంలో కరుణానిధిని అరెస్టు చేసినప్పుడు తండ్రి పక్కన నిలబడి తొలిసారి ప్రముఖంగా బయటకు కనిపించారు. నాటినుంచీ ఆయన గళంగా మారిపోయారు. తండ్రి బహుముఖ ప్రజ్ఞకు కనిమొళి అప్రకటిత వారసురాలు. దానికి తోడు ఇంగ్లిష్ బాగా మాట్లాడతారు. దాంతో కరుణానిధి ఢిల్లీలో పెద్దలెవరినీ కలిసినా వెంట కనిమొళి ఉండేవారు. కనిమొళి ఢిల్లీ రాజకీయాల్లో, స్టాలిన్ రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉండేలా కరుణానిధి ముందుచూపుతో వ్యవహరించారు. 1982లో జయలలిత క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించిన వేదికపైనే 2008 జూన్లో కనిమొళితో డీఎంకే తొలి మహిళా సమ్మేళనం నిర్వహించారు. అలా ఆమెను అగ్రనాయకురాలిగా నిలబెట్టే ప్రయత్నాలు చేశారు. కనిమొళిని జయలలితకు కౌంటర్గా కరుణానిధి చూశారు. వారిద్దరికీ సారూప్యమూ ఉంది. ఇద్దరూ ఒకే పాఠశాలలో చదువుకున్నారు. జర్నలిస్టులుగా పనిచేశారు. రాజ్యసభ సభ్యులుగానే రాజకీయ జీవితం ప్రారంభించారు. రాజకీయాల్లో... కనిమొళి 2007లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. çఆరోగ్యం, కుటుంబ సంక్షేమ, విదేశీ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి కమిటీ, హోమ్ వ్యవహారాల వంటి పలు కమిటీల్లో చురుగ్గా పనిచేసి ఆకట్టుకున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ జనరల్ అసెంబ్లీ సభ్యురాలిగా చేశారు. 2013లో రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2018లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్నారు. 2019లో తొలిసారి లోక్సభలో అడుగుపెట్టారు. తూత్తుక్కుడి నుంచి బీజేపీ అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్పై ఏకంగా 3,47,209 ఓట్ల మెజారిటీతో గెలిచారు. సక్సెస్ఫుల్ జర్నలిస్టు.. కనిమొళి సక్సెస్ఫుల్ జర్నలిస్టు కూడా. ప్ర ముఖ ఆంగ్ల దినపత్రికలో సబ్ ఎడిటర్గా చేశా రు. తమిళ వారపత్రిక ‘కుంగుమం’ సంపాదకురాలిగా వ్యవహరించారు. సింగపూర్కు చెందిన ‘తమిళ మురసు’ వార్తాపత్రికకూ ఫీచర్స్ ఎడిటర్గా సేవలందించారు. తమిళంలో కవిత్వం రాశారు. తమిళ కవిత్వాన్ని ఇంగ్లి‹Ùలోకి అనువదించారు. ఆమె రచనలు ఇంగ్లి‹Ù, మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లోకి అనువాదమయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తూత్తుకుడి ప్లాంట్ విక్రయించం
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ తమిళనాడులోని తూత్తుకుడిలోగల కాపర్ ప్లాంటును విక్రయించబోమని తాజాగా స్పష్టం చేసింది. స్టెరిలైట్ కాపర్ ప్లాంటును విక్రయిస్తున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను తప్పుపట్టింది. ఇవి ఆధారరహిత, తప్పుడు వార్తలని పేర్కొంది. వీటికి ఎలాంటి ప్రాతిపదికలేదంటూ తోసిపుచి్చంది. స్టెరిలైట్ కాపర్ జాతీయ ఆస్తిఅని, దేశీయంగా మొత్తం కాపర్ ఉత్పత్తిలో 40 శాతం వాటాను ఆక్రమిస్తున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఇచి్చన సమాచారంలో తెలియజేసింది. మీడియాలోని కొన్ని వర్గాలు తూత్తుకుడిలోని స్టెరిలైట్ కాపర్ ప్లాంటును వేదాంతా విక్రయిస్తున్నట్లు తప్పుడు వార్తలు సృష్టించినట్లు పేర్కొంది. వీటిని ఖండిస్తున్నట్లు తెలియజేసింది. దేశం నికరంగా కాపర్ను దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో మెటల్కు డిమాండ్ పెరుగుతూనే ఉన్నదని, కార్యకలాపాలు తిరిగి ప్రారంభించవలసిన ఆవశ్యకత ఉన్నట్లు వివరించింది. -
సుప్రీం కోర్టులో కనిమొళికి భారీ ఊరట
ఢిల్లీ: డీఎంకే నేత కనిమొళి కరుణానిధికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ఎంపీగా ఆమె ఎన్నికను సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషన్ను .. సుప్రీం కోర్టు కొట్టేసింది. ఆమె ఎన్నిక సమర్థనీయమేనని తీర్పు ఇచ్చింది. 2019 ఎన్నికల సమయంలో తూతుక్కుడి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు కనిమొళి. అయితే ఆమె ఎన్నికను సవాల్ చేస్తూ సనాతన కుమార్ అనే ఓటర్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. నామినేషన్ సమయంలో.. ఎలక్షన్ అఫిడవిట్లో కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను సరిగా పొందుపర్చలేదని, మరీ ముఖ్యంగా భర్త పాన్ నెంబర్ను జత చేయలేదని అభ్యంతరం వ్యక్తం చేశాడతను. అయితే.. తన భర్త సింగపూర్ పౌరుడని, ఆయనకు పాన్ నెంబర్ ఉండదని ఆమె కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను కొట్టేయాలని ఆమె అభ్యర్థించారు. కానీ, మద్రాస్ హైకోర్టు అందుకు నిరాకరించింది. ఈ తరుణంలో ఆమె సుప్రీంను ఆశ్రయించారు. అయితే మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం 2020, జనవరిలో స్టే విధించింది. ఇవాళ(గురువారం) ఆ పిటిషన్ విచారణకు రాగా.. ఎలక్షన్కు సంబంధించిన పిటిషన్ను కొట్టేస్తూ.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలను పరిశీలించాలన్న కనిమొళి అభ్యర్థనను స్వీకరిస్తున్నట్లు జస్టిస్ అజయ్ రాస్తోగి, జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది. ఇదీ చదవండి: ఇలాంటివి చూసేందుకే అంత కష్టపడ్డామా? -
ఏడాది నుంచి ప్రేమ, సినిమాకు వెళ్లి వస్తుండగా ప్రేమజంట దుర్మరణం
సాక్షి, చెన్నై: సినిమాకు వెళ్లి ఓ ప్రేమజంట ద్విచక్రవాహనంలో తిరిగి వస్తుండగా లారీ రూపంలో తిరిగిరానిలోకాలకు తీసుకెళ్లింది. తూత్తుకుడి జిల్లాకు చెందిన బాబిలోన (23) సాఫ్ట్వేర్ ఇంజినీర్. చెన్నై జాఫర్ఖాన్ పేటలో ఉంటూ గిండిలోని ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తుంది. ఈమె బంధువు ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రశాంత్ (33) చెన్నై జాఫర్ఖాన్ పేటలోనే ఉంటూ కుంన్రత్తూరులో ఉన్న ప్రైవేటు సంస్థలో డిజైనింగ్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ ఏడాది నుంచి ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసి ఇరువైపు పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించి నిశ్చితార్థం చేశారు. ఈక్రమంలో అన్నానగర్ లోని ఓ థియేటర్లో సినిమా చూడడానికి బాబిలోన, ప్రశాంత్ ఇద్దరు బైక్పై వెళ్లారు. సినిమా చూసుకుని తిరిగి అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో తిరిగి బయలుదేరారు. అరుంబాక్కం మెట్రో రైల్వేస్టేషన్ వద్ద వెళుతుండగా వెనుక నుంచి ఇనుపలోడుతో వస్తున్న లారీ బైకును ఢీకొంది. ఈ ఘటనలో బైకు నుంచి కిందపడిన బాబిలోన, ప్రశాంత్లపై లారీ దూసుకెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. లారీ డ్రైవర్ పారిపోవడానికి ప్రయత్నించగా స్థానికులు అతన్ని పట్టుకుని తర్వాత అన్నానగర్ పోలీసులకు అప్పగించారు. మృతదేహాలను కీల్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కూతురి కోసం స్త్రీ జన్మను వీడి మగ బతుకులో
స్టేజ్ మీద నాటకం కోసం కాసేపు స్త్రీ పురుషుడిగా... పురుషుడు స్త్రీగా మారాలంటేనే కొంచెం కష్టం. కాని– తమిళనాడులో ఒక తల్లి 30 ఏళ్లుగా పురుష అవతారం ఎత్తి జీవిస్తోంది. భర్త చనిపోయాక కూతురిని పెంచుకోవడం కోసం ఆమె పురుషుడిగా మారింది. ‘ముత్తు మాస్టర్’గా టీ స్టాల్లో పని చేసే ఆమె స్త్రీ అని ఎవరికీ తెలియదు. పురుషాధిపత్య సమాజం ఎంత భయపెడితే ఆమె ఈ నిర్ణయానికి వచ్చి ఉంటుంది? రాజ్యాలను కాపాడుకోవడానికి ఆడపిల్ల పుడితే మగపిల్లాడిగా పెంచిన ఉదంతాలు చరిత్రలో ఉన్నాయి. ఒంటరి స్త్రీలు ఈ మగ ప్రపంచంలో బతకాలంటే అవసరార్థం మగ అవతారం ఎత్తక తప్పదని రాజ్ కపూర్ ‘మేరా నామ్ జోకర్’లో పద్మిని పాత్ర ద్వారా చూపిస్తాడు. ఆమె ఆ సినిమాలో మగవాడి వేషం కట్టి బతుకు ఈడుస్తుంటుంది. అమోల్ పాలేకర్ తీసిన ‘దాయ్రా’ అనే సినిమాలో ఒక గ్రామీణ యువతి గ్రామస్తుల దాష్టికాలు భరించలేక, స్త్రీగా తనకు కలుగుతున్న అభద్రత నుంచి తప్పించుకోవడానికి పూర్తిగా మగ ఐడెంటిటీలోకి మారిపోతుంది. ఇవన్నీ ఒకెత్తు అయితే ఒక నిస్సహాయురాలైన వితంతువు తన కూతురిని పెంచుకోవాలంటే మగవాడి అవతారం ఎత్తక తప్పదని భావించి గత ముప్పై ఏళ్లుగా అలాగే బతుకుతున్నదని తెలిస్తే ఆశ్చర్యమూ బాధా కలుగుతాయి. ఆ స్త్రీ పేరు పెచ్చియమ్మాళ్. ఊరు తమిళనాడులోని తూతుకూడి జిల్లాలోని కతునాయకన్పట్టి. 20 ఏళ్ల వయసులో పెచ్చియమ్మాళ్ది తూతుకూడి జిల్లా. ఆమెకు వివాహం అయ్యాక గర్భంలో ఉండగా భర్త మరణించాడు. ఆ తర్వాత ఆమెకు కూతురు పుట్టింది. అప్పుడు ఆమె వయసు 20 ఏళ్లు. ఒంటరి స్త్రీగా కుమార్తెను కాపాడుకోవడానికి అదే జిల్లాలోని రెండు మూడు ఊళ్లలో ప్రయత్నించింది పెచ్చియమ్మాళ్. ఒంటరి స్త్రీ. పైగా వయసులో ఉంది. నిస్సహాయురాలు. అలాంటి స్త్రీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనాలో అన్నీ ఎదుర్కొంది ఆమె. తన ప్రాణం, తన ఉనికి కంటే తన కుమార్తె ఉనికి ముఖ్యం అనుకుందామె. నా కూతురిని ఎలాగైనా బతికించుకోవాలి... తను కూడా రేపు పెద్దది అవుతుంది... దానికి కూడా ఒక మగ అండ ఉందనే భ్రాంతి కలిగించాలి అనే ఆలోచన ఆమెకు కలిగింది. మగ అవతారం ఎత్తడమే అందుకు విరుగుడు అనుకుంది. అంతే! జుట్టు కత్తిరించుకుని, లుంగీ చొక్కా ధరించి, పూర్తిగా పురుషుడిలా కనిపిస్తూ ప్రస్తుతం నివసిస్తున్న కతునాయకన్పట్టికి చేరుకుంది. అన్ని మగవాళ్ల పనులే ఆ పల్లెలో ఆమెను అందరూ మగవాడనే అనుకున్నారు. ఆమె తన పేరును ముత్తు అని చెప్పుకుంది. పైగా చేసేవన్నీ మగవాళ్ల పనులే. కూలి పనులు, పెయింటింగ్ పని, కొబ్బరి బోండాలు కొట్టే పని, ఎక్కువ కాలం ఆమె హోటల్లో పరోటా మాస్టర్గా, టీ మాస్టర్గా పని చేసింది. అందువల్ల ఆమెను ఆ ఊళ్లో అందరూ ‘ముత్తు మాస్టర్’ అని పిలుస్తారు. ముత్తు మాస్టర్ ఈ పనులన్నీ చేసుకుంటూనే కూతురిని పెంచి పెద్ద చేసుకుంది. ఆమెకు జీవితం ఇచ్చింది. ఊళ్లో అందరూ తండ్రీ కూతుళ్లు జీవిస్తున్నారని భావించేవారు. కూతురికి ‘తండ్రి అండ’ ఉండటం వల్ల ప్రత్యేకంగా సమస్యలు రాలేదు. ఇలా ఒకరోజు కాదు రెండు రోజులు కాదు దాదాపు 30 ఏళ్లుగా మగవాడిగా బతుకుతున్నది పెచ్చియమ్మాళ్. ఇప్పుడు ఆమె వయసు 57 సంవత్సరాలు. పెన్షన్ కోసం అసలు రూపం పెచ్చియమ్మాళ్కు వయసు మీద పడింది. మునుపటిలా కష్టపడలేకున్నది. తన బతుకు, కూతురి బతుకు కూడా అంతంత మాత్రమే. అందుకని ‘వితంతువు పెన్షన్’ కోసం ఇక అసలు అవతారాన్ని బయటపెట్టింది. తాను స్త్రీనని చెప్తే ఊరంతా ఆశ్చర్య పోయింది. నమ్మకమైన ఇద్దరు ముగ్గురు స్త్రీలకు తప్ప ఇప్పటి వరకూ ఆ సంగతి ఆ ఊళ్లో ఎవరికీ తెలియదు. పెచ్చియమ్మాళ్ ఆధార్ కార్డు ‘ముత్తు’ పేరుతోనే ఉంది. ఆమె దగ్గర భర్త డెత్ సర్టిఫికెట్ లేదు. అందువల్ల ఆమెకు వితంతు పెన్షన్ ఇవ్వడం సమస్యగా మారింది. ఈ విషయం అందరికీ తెలిసి తనకు సహాయం అందడం కోసం ఈ విషయాన్ని మీడియాకు బయటపెట్టింది. అయితే తాను ఇలా ఇక మీదట కూడా పురుషుడిగానే ఉంటానని. తాను చనిపోయాక ముత్తుగానే అందరూ గుర్తు చేసుకోవాలని ఆమె కోరింది. -
భర్తతో విడిపోయిన మీనా.. రెండో వివాహం చేసుకున్న తర్వాత..
తిరువొత్తియూరు: తూత్తుకుడి జిల్లాలో రెండో వివాహం చేసుకున్న మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటనపై ఆమె తల్లి, అన్నతో సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న తండ్రి కోసం గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. తూత్తుకుడి జిల్లా, సెయ్యంగనల్లూర్ సమీపంలోని కరుంగుళం, తాత్తాన్కుళంకు చెందిన సిడలై ముత్తు కుమార్తె మీనా (21). ఈమెకు ఐదేళ్ల క్రితం తాత్తాన్కుళం సమీపంలోని కాల్వాయ్ గ్రామానికి చెందిన ఇసక్కి పాండియన్తో వివాహమైంది. వీరికి కుమారుడు నిశాంత్ (04) ఉన్నాడు. ఈ క్రమంలో భర్త నుంచి విడిపోయిన మీనా నెల్లై జిల్లా పడపిల్లై పుదూర్కు చెందిన మరో వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. అతనితో 10 నెలలుగా కాపురం చేస్తున్నట్లు సమాచారం. నిశాంత్ తండ్రి వద్ద ఉన్నాడు. కాగా, కుమార్తె రెండవ వివాహం చేసుకోవడం అవమానంగా భావించిన సుడలైముత్తు కుటుంబం మీనాపై తీవ్ర కోపంతో ఉన్నారు. ఈ స్థితిలో శుక్రవారం తాత్తాన్కుళంలో జరిగిన ఆలయ ఉత్సవాలకు మీనా తన పిన్ని పార్వతి ఇంటికి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న సడలై ముత్తు, అతని భార్య ముప్పిదాతి, కుమారుడు మాయండి, సడలై ముత్తు అన్న తలవాయ్, అతని భార్య వీరమ్మాళ్, వీరి కుమారుడు మురుగన్ మీనాతో గొడవపడ్డారు. ఆ సమయంలో ఆగ్రహం చెందిన సడలై ముత్తు తన వద్ద ఉన్న కత్తితో మీనా పైదాడి చేశాడు. దీంతో మీనా ఘట నా స్థలంలోనే దుర్మరణం చెందింది. సెంగనల్లూర్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసు కుని శవ పరీక్ష కోసం నెల్లై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసుల విచారణలో మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండా మరో వ్యక్తిని వివాహం చేసుకోవడంతో కుమార్తెను హత్య చేసినట్లు తెలిసింది. -
వాట్సప్ చూస్తోందని చెల్లిని చంపిన అన్న
చెన్నై: తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా వాసవంపురంలో దారుణం చోటు చేసుకుంది. వాట్సాప్ వీడియోలు చూస్తోందని మలైరాజా అనే వ్యక్తి తన చెల్లిని కత్తితో పొడిచి చంపాడు. వివరాల్లోకి వెళితే.. మలైరాజా అనే వ్యక్తి తన చెల్లి కవితకు అన్లైన్ క్లాసుల కోసం సెల్ఫోన్ కొనిచ్చాడు. అయితే కవిత క్లాసులు వినకుండా.. సెల్పోన్లో వీడియోలు చూస్తోంది. ఈ విషయం మలైరాజా పలుమార్లు చెల్లిని హెచ్చరించాడు. దీనిపై వారిద్దరి మధ్య వాగ్వాదం కూడా జరిగింది. అయితే ఎంత చెప్పినా వినకుండా వీడియోలు చూస్తోందని.. కవితను అన్న మలైరాజా వెనుక నుంచి కత్తితో పొడిచి చంపాడు. దీంతో తీవ్రగాయాపాలైన కవిత మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పంచాయితీకి రాలేదని కుల, గ్రామ బహిష్కరణ -
13 వాహనాలు ధ్వంసం: ఎస్ఐ కుమారుడు సహా ఇద్దరి అరెస్టు
టీ.నగర్: తూత్తుకుడిలో 13 వాహనాలను ధ్వంసం చేసిన ఎస్ఐ కుమారుడు సహా ఇద్దరిని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. తూత్తుకుడి సిప్కాట్ పోలీసు స్టేషన్ పరిధిలోని రాజగోపాల్నగర్, అన్నై థెరిసానగర్, రాజీవ్నగర్, బర్మాకాలనీ, భారతీనగర్, తంతితపాలా కాలనీ, బాలపాండినగర్ ప్రాంతాల్లో ఇళ్ల ముందు ఉంచిన కార్లు, వ్యాన్లు, ఆటో ఇతర వాహనాలను మత్తుమందు ముఠా శనివారం రాత్రి ధ్వంసం చేసింది. ఈ క్రమంలో అన్నానగర్లో వాహనాలను ధ్వంసం చేస్తుండగా చూసిన ఎడ్వర్డ్ (24) అనే యువకుడిపై ముఠా తీవ్రంగా దాడి చేసింది. ప్రస్తుతం అతను తూత్తుకుడి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై సిప్కాట్ పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా విచారణ జరిపారు. అన్నానగర్కు చెందిన భరత్కుమార్ (25), అజీత్కుమార్ (23), విఘ్నేష్పాండి (24)లను అరెస్టు చేశారు. భరత్కుమార్ తూత్తుకుడి ఎస్ఐ కుమారుడిగా తెలిసింది. చదవండి: శివశంకర్ బాబా కోసం సీబీసీఐడీ వేట -
ప్రేమించినోడితో కూతురి పెళ్లి చేసిందని భార్యను..
సాక్షి, చెన్నై : ప్రేమించినోడితో కుమార్తెకు పెళ్లి చేసిందన్న ఆగ్రహంతో భార్యను భర్త అతి దారుణంగా హతమార్చి దహనం చేశాడు. తూత్తుకుడిలో సోమవారం ఈ ఘటన వెలుగుచూసింది. తేరువాయిపురం పోలీసుల కథనం మేరకు తూత్తుకుడి జిల్లా నటరాజపురానికి చెందిన మునుస్వామి, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమార్తెకు సోమవారం వివాహం జరగాల్సి ఉంది. ఇందుకు తగ్గ అన్ని ఏర్పాట్లు జరిగాయి. అయితే, రెండు రోజుల క్రితం పెద్ద కుమార్తె సమీప గ్రామానికి చెందిన యువకుడిని వివాహం చేసుకుంది. ఇది మునుస్వామికి పెద్ద షాక్గా మారింది. మరో యువకుడితో ప్రేమ అంటూ పెళ్లి చేసుకొచ్చిన కుమార్తె మీద ఆగ్రహాన్ని ప్రదర్శించి ఆమెను బయటకు గెంటేశాడు. అయితే, వీరి వివాహం తన భార్య లక్ష్మి సమక్షంలో జరిగినట్టుగా మునుస్వామి గ్రహించాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. సోమవారం వేకువజామున తూత్తుకుడి జిల్లా కొళత్తూరు సమీపంలోని దురైస్వామి పురం ఆలయ దర్శనానికి అంటూ భార్యను వెంటబెట్టుకెళ్లాడు. అక్కడ అటవీ ప్రాంతంలో ఆమెను హతమార్చి, ఎవరూ గుర్తుపట్టని రీతిలో దహనం చేసి ఉడాయించాడు. ఎస్పీ జయకుమార్, విలాతి కులం డీఎస్పీ ప్రకాశ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: చెల్లి ప్రేమ వ్యవహరం: అన్న దారుణ హత్య -
తూత్తుకుడి బాధితులకు ఉద్యోగాలిస్తాం
సాక్షి, చెన్నై: తూత్తుకుడిలో స్టెరిలైట్ పరిశ్రమకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిని తుపాకీతో కాల్చి చంపిన ఈ పాలకులకు ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వస్తే కాల్పుల్లో మరణించిన వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. తూత్తుకుడి జిల్లా పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా స్టాలిన్ సోమవారం సుడిగాలి పర్యటన చేశారు. రోడ్ షో, సభలతో ప్రచారం సాగింది. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ.. తూత్తుకుడిలో సాగిన తుపాకీ కాల్పులు, సాత్తాన్ కులం పోలీసుల నిర్వాకం, జుడీషియల్ కస్టడిలో తండ్రికుమారుల మరణం తదితర విషయాలను గుర్తు చేస్తూ ప్రసంగాన్ని అందుకున్నారు. స్టెరిలైట్కు వ్యతిరేకంగా శాంతియుత ర్యాలీగా కలెక్టర్ను కలిసేందుకు వెళ్లిన వారిని పిట్టలు కాల్చినట్టు కాల్చిచంపిన ఘటన నేటికి కళ్ల ముందు కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు ఈ రాష్ట్రం ఏటు పోతున్నదో అన్న ఆందోళన కలుగుతోందన్నారు. ప్రజలపై తుటాల్ని ఎక్కుబెట్టి 13 మంది మరణానికి కారణమైన ఈ పాలకులకు ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. కరోనా కారణంగా జీవనం కోల్పోయిన వారికి రూ. 4 వేల సాయం చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి రాగానే కరుణానిధి జయంతి రోజున ఈ పంపిణికి శ్రీకారం చుడతామని ప్రకటించారు. చదవండి: అర కోటి ఉద్యోగాలు.. ఫ్రీగా ట్యాబ్లెట్లు.. లైసెన్స్ -
ప్రజాస్వామం చచ్చిపోయింది.. చైనాకు తాకట్టు
తూత్తుకూడి: దేశ ప్రయోజనాలను చైనాకు తాకట్టు పెట్టడంతో దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చైనాకు సాగిలపడ్డాడని ఆరోపించారు. భారతదేశాన్ని చైనాకు అప్పగించారని మండిపడ్డారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం తూత్తుకూడిలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. సుదీర్ఘ రాజ్యాంగం ఉన్న భారతదేశంలో ప్రజాస్వామ్యం బతికిలేదు.. ఆరేళ్లుగా ఒక ప్రణాళికపరంగా ప్రభుత్వ సంస్థలన్నింటిని ప్రభుత్వం వదిలేసుకుంటుందని రాహుల్ చెప్పారు. దేశంలో పార్లమెంట్, న్యాయ వ్యవస్థ, జర్నలిజం బలహీన పడుతుండడంతో దేశంలో ప్రజాస్వామ్యం ఇంకెక్కడిది అని ప్రశ్నించారు. విధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వ్యవస్థలను సమానంగా ఆరెస్సెస్ వాదులు నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థల నిర్వీర్యంతో రాష్ట్రాల పాత్రను కూడా తగ్గించేస్తున్నారని.. అదే మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్నామని రాహుల్ తెలిపారు. డబ్బు, అంగబలం ఎమ్మెల్యేలను నడిపిస్తోందని.. వాటితో ఎమ్మెల్యేలను బీజేపీ వేటాడుతోందని రాహుల్ పుదుచ్చేరి పరిణామాలను పరోక్షంగా ప్రస్తావించారు. -
కస్టడీ డెత్: మరో కీలక మలుపు
చెన్నై: తమిళనాట సంచలనం సృష్టించిన తండ్రీకొడుకుల కస్టడీ డెత్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు బెనిక్స్- జయరాజ్ కస్టోడియల్ కేసును సీబీఐకి అప్పగించాలన్న తమిళనాడు ప్రభుత్వ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించినట్లు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా ఈ కేసును ప్రస్తుతం సీబీ- సీఐడీ విచారిస్తున్న విషయం తెలిసిందే. మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనం ఆదేశాల మేరకు తిరునల్వేలి డీఐజీ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది.(రాత్రంతా కొట్టారు.. లాఠీలకు రక్తపు మరకలు) ఐదుగురి అరెస్టు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని సాత్తాన్కులానికి చెందిన తండ్రీకొడుకులు జయరాజ్(59), బెనిక్స్(31)లను అరెస్టు చేసిన పోలీసులు.. వారిని చిత్ర హింసలు పెట్టగా వారు మృతి చెందారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన మద్రాస్ హైకోర్టు.. జ్యుడిషియల్ విచారణకు ఆదేశించగా.. మెజిస్ట్రేట్ ఇటీవలే నాలుగు పేజీల నివేదిక అందజేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో తండ్రీ కొడుకులను తీవ్రంగా గాయపరిచి వారి మృతికి కారణమైన ప్రధాన నిందితుడు, సబ్ ఇన్స్పెక్టర్ రఘు గణేశ్తో పాటు మరో ఎస్సై బాలకృష్ణన్ సహా ఐదుగురు పోలీసులు అరెస్టయ్యారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం హత్యానేరం కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.(కస్టడీ డెత్: పోలీసుల అరెస్టు.. స్థానికుల సంబరాలు) -
కస్టడీ డెత్: మరో కీలక పరిణామం
చెన్నై: తమిళనాడుకు చెందిన జయరాజ్, బెనిక్స్ కస్టడీ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తండ్రీకొడుకులను తీవ్రంగా గాయపరిచి వారి మృతికి కారణమైన ప్రధాన నిందితుడు, సబ్ ఇన్స్పెక్టర్ రఘు గణేశ్తో పాటు మరో ఎస్సై బాలకృష్ణన్ సహా ఐదుగురు పోలీసులు అరెస్టయ్యారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం హత్యానేరం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీబీ-సీఐడీ వర్గాలు వెల్లడించాయి. జయరాజ్, బెనిక్స్ల కస్టడీ డెత్తో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఇతర పోలీసులను కూడా విచారిస్తున్నట్లు తెలిపాయి. ఇందుకోసం 12 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. కాగా జయరాజ్, బెనిక్స్ల దారుణ మృతికి కారణమైన వారికి కఠిన శిక్షలు తప్పవంటూ తమిళనాడు న్యాయశాఖా మంత్రి సీ వీ షణ్ముగం ప్రకటించిన కొన్ని గంటల్లోనే నిందితులు అరెస్టు కావడం గమనార్హం. (రాత్రంతా కొట్టారు.. లాఠీలకు రక్తపు మరకలు) ఇదిలా ఉండగా.. కస్టడీ డెత్ నిందితులను పోలీసులు అరెస్టు చేయడంపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలిసిన వెంటనే తూత్తుకుడిలో సంబరాలు మొదలయ్యాయి. టపాసులు పేలుస్తూ స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు.. సత్తాన్కుళం పోలీసు స్టేషన్లో పనిచేసే పోలీసులంతా ఈ కేసులో అరెస్టు అవుతున్న నేపథ్యంలో.. ప్రస్తుతం ఆ స్టేషన్ రెవెన్యూ విభాగం నియంత్రణలోకి వెళ్లింది. కాగా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని సాత్తాన్కులానికి చెందిన తండ్రీకొడుకులు జయరాజ్(59), బెనిక్స్(31)లను అరెస్టు చేసిన పోలీసులు వారిని చిత్ర హింసలు పెట్టి కొట్టి చంపిన విషయం విదితమే. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. పోలీసుల దాష్టీకానికి బలైన జయరాజ్, బెనిక్స్లకు న్యాయం జరగాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్లు వెల్లువెత్తాయి. ఇక ఈ హేయమైన ఘటనపై తీవ్రంగా స్పందించిన మద్రాస్ హైకోర్టు.. జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది. ఇందుకు సంబంధించిన నివేదికలో పోలీసుల కర్కశత్వం, సత్తాన్కులం పోలీస్ స్టేషన్ అధికారులకు చట్టం పట్ల ఉన్న గౌరవ మర్యాదలు ఏపాటివో తెలియజేస్తూ మెజిస్ట్రేట్ నాలుగు పేజీల నివేదిక అందజేశారు.(కస్టడీ డెత్: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు) -
అనూహ్య మృతి; 70 లక్షల పరిహారం
చెన్నై: తమిళనాడులో పోలీసు కస్టడీలో మరణించిన మృతుల కుటుంబానికి అధికార అన్నాడీఎంకే పార్టీ 25 లక్షల రూపాయల సహాయాన్ని శనివారం ప్రకటించింది. తూత్తుకుడి జిల్లా కోవిల్పట్టి సమీపంలోని సాత్తాన్కులం పోలీస్ స్టేషన్ కస్టడీలో మృతి చెందిన జయరాజ్(59), బెనిక్స్(31) కుటుంబానికి ఈ మొత్తాన్ని అందించనున్నట్టు అన్నాడీఎంకే తెలిపింది. అన్నాడీఎంకే నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అందించిన రూ. 20 లక్షల ఆర్థిక సహాయానికి ఇది అదనమని పేర్కొంది. ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించిన ఎక్స్గ్రేషియాను తూత్తుకుడి జిల్లా కలెక్టర్ సందీప్ నందూరితో కలిసి సమాచార శాఖ మంత్రి సి. రాజు శుక్రవారం మృతుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రతిపక్ష డీఎంకే పార్టీ కూడా బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించింది. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తరపున ఎంపీ కనిమొళి శుక్రవారం మృతుల కుటుంబ సభ్యులకు చెక్ అందజేశారు. దీంతో బాధిత కుటుంబానికి మొత్తం రూ. 70 లక్షల పరిహారం ప్రకటించినట్టు అయింది. (‘జార్జ్ ఫ్లాయిడ్స్ ఆఫ్ ఇండియా’) కాగా, ఈ దారుణ ఘటనపై తూత్తుకుడి ఎస్పీ శుక్రవారం మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్కు నివేదిక సమర్పించారు. వీడియో కాన్ఫరెన్స్లో ఆయన కోర్టుకు వివరాలు తెలిపారు. పోస్ట్మార్టం ప్రక్రియ పూర్తయిందని, అక్కడ కర్ఫ్యూ కొనసాగుతున్నందున నివేదిక ఇంకా రాలేదని వెల్లడించారు. మరోవైపు జయరాజ్, బెనిక్స్ మరణానికి కారకులైన పోలీసులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని తమిళనాడులో ఆందోళనలు కొనసాగుతున్నాయి. (తీవ్ర గాయాలు.. గంటల వ్యవధిలోనే మృతి) -
అయ్యో.. భగవంతుడా!
సాక్షి, చెన్నై: సంక్రాంతి సంబరాలు, ఆలయాల సందర్శనలోని ఆనందం ఆ రెండు కుటుంబాల్లో ఎంతోసేపు నిలవలేదు. విహారయాత్రగా ఆలయాల సందర్శనకని బయలుదేరిన ఆ కుటుంబసభ్యులపై విధివైపరీత్యం కంటైనర్ లారీ రూపంలో విరుచుకుపడింది. ఇద్దరు యువతులు, ఒక బాలుడు సహా నలుగురు ప్రాణాలను హరించివేసింది. చెన్నై అడయారులోని శాస్త్రినగర్కు చెందిన పారిశ్రామికవేత్త సుభాష్ చంద్రబోస్ (73) సంక్రాంతి పండుగ రోజుల్లో కుటుంబసభ్యులతో కలిసి ఆలయాలు సందర్శించాలని తలంచారు. భార్య లక్ష్మిప్రియ, కుమార్తె కవిత, అల్లుడు ఆనంద్, మనుమరాలు రమ్య (20), మనుమడు వీరేంద్రన్ (15), రమ్య స్నేహితురాలైన చెన్నై నంగనల్లూరుకు చెందిన భార్గవి (23)లతో ఈనెల 16వ తేదీన రెండు కార్లలో బయలుదేరారు. సుభాష్ చంద్రబోస్, లక్ష్మిప్రియ, కవిత, ఆనంద్ ఒకకారులో ఎక్కగా చెన్నైకి చెందిన చంద్రన్ డ్రైవర్ ఈ కారును నడిపాడు. అలాగే మరో కారులో వెనుక సీటులో రమ్య, భార్గవి, ముందు సీటులో వీరేంద్రన్ ఎక్కగా తిరుచ్చిరాపల్లికి చెందిన జోస్వ (30)అనే వ్యక్తి కారును నడిపాడు. చెన్నై నుంచి విరుదనగర్, మదురైజిల్లాల్లోని ఆలయాలను సందర్శించుకుని శుక్రవారం రాత్రి 7 గంటలకు మదురై నుంచి తిరుచెందూరుకు ప్రయాణమయ్యారు. అదేరోజు రాత్రి 11 గంటల సమయంలో రమ్య, భార్గవి ప్రయాణిస్తున్న కారును తూత్తుకూడి స్టెర్లైట్ కంపెనీకి సమీపంలోని ఫ్లైఓవర్పై వెళుతుండగా మదురై వైపు వెళుతున్న కంటైనర్ లారీ అతివేగంగా ఎదురుగా వచ్చి ఢీకొంది. దీంతో కారు ముందుభాగం సగభాగానికి పైగా లారీ కిందకు దూసుకెళ్లడంతో రమ్య, భార్గవి, వీరేంద్రన్, డ్రైవర్ జోస్వ శరీరాలు ఛిద్రమై సంఘటన స్థలంలోనే మృతిచెందారు. బాలుడు వీరేంద్రన్ మృతదేహం లారీ ముందుభాగంలో ఇరుక్కుపోవడంతో జేసీబీని రప్పించి సుమారు నాలుగు గంటలు శ్రమించి బయటకు తీశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను తూత్తుకూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్లారీ డ్రైవర్ చంద్రశేఖర్ను సిప్కాట్ పోలీసులు అరెస్ట్ చేశారు. కోట్లు కుమ్మరిస్తా ప్రాణాలు కాపాడండి.. ప్రమాదానికి గురైన కారు ఎంతకూ రాకపోవడంతో తమ కారును వెనక్కి మళ్లించిన సుభాష్చంద్రబోస్ ప్రమాదస్థలిని చేరుకుని హతాశులైనారు. నెత్తుటి మడుగులో విగతజీవులై పడి ఉన్న రమ్య, వీరేంద్రన్, భార్గవిల మృతదేహాలను చూసి విలవిలలాడిపోయారు. నడిరోడ్డుపై గుండెలవిసేలా రోదించించడం సహాయక చర్యల్లో ఉన్న వారందరినీ కంటతడిపెట్టించింది. పోస్టుమార్టం జరుగుతున్న ఆసుపత్రికి చేరుకున్న సుభాష్చంద్రబోస్ ‘నాకు ఐదువేల కోట్లరూపాయల ఆస్తి ఉంది, ఒక్కో డాక్టర్కు రూ.5 కోట్లు ఇస్తాను, బిడ్డలను కాపాడండి’ అంటూ వైద్యుల చేతులు పట్టుకుని బ్రతిమాలడం అందరి గుండెలను బరువెక్కించింది. నలుగురూ సంఘటన స్థలంలోనే మృతి చెందారని వైద్యులు ఆయనకు నచ్చజెప్పారు. -
పాముతో వీరోచితంగా పోరాడి..
సాక్షి ప్రతినిధి, చెన్నై: శునక జాతిలోని విశ్వాసం గురించి ఎంత చెప్పినా తక్కువే. కన్నబిడ్డలతో సమానంగా చూసుకుంటున్న కుటుంబసభ్యుల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు పెంపుడు శునకాలు సిద్ధంగా ఉంటాయని చాటే సంఘటన తమిళనాడులో జరిగింది. తూత్తుకుడికి చెందిన బాబు విదేశాల్లో పనిచేస్తుండగా అతని భార్య పొన్సెల్వి ప్లస్టూ చదువుతున్న కవల కుమార్తెలతో కలిసి నగరంలోని నాసరత్ జూబ్లీ వీధిలో నివసిస్తున్నారు. డేజన్ జాతికి చెందిన రెండు శునకాలను ఆమె పెంచుతున్నారు. మగ శునకానికి అప్పు, ఆడ శునకానికి నిమ్మి అనే పేర్లు పెట్టి ఎంతో గారాబంగా చూసుకుంటున్నారు. ఈనెల 3న రాత్రి పొన్సెల్వి తన కుమార్తెలతో కలిసి ఇంట్లో నిద్రిస్తుండగా, కుక్కలు రెండూ బయట ఉన్నాయి. అర్ధరాత్రివేళ ఐదు అడుగుల పొడవైన తాచుపాము వారింటివైపు రావడంతో రెండు కుక్కలు పెద్దగా మొరగడం ప్రారంభించాయి. మగ కుక్క అప్పు ఒక్క ఉదుటున పాముపై లంఘించి కరవడం ప్రారంభించింది. అలాగే పాము సైతం అప్పును అనేకసార్లు కాటువేసింది. అయినా అప్పు ఆ పామును వదలకుండా నోటకరుచుకుని కొరుకుతూనే బయటి మెట్లగుండా మిద్దెపైకి తీసుకుని వెళ్లి చంపేసింది. పాముకాటు విషం వల్ల కుక్క సైతం ప్రాణాలు విడిచింది. గురువారం తెల్లారిన తరువాత ఇంటి బయటకు వచ్చిన పొన్సెల్వికి ఆడ శునకం మాత్రమే కనపడడంతో అప్పుకోసం అంతటా గాలించింది. మిద్దెపైకి వెళ్లి చూడగా పాము, కుక్క చనిపోయి పడి ఉన్నాయి. పాము కాటు నుంచి తమ ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణాలనే అర్పించిందని ఆమె కన్నీరుమున్నీరైంది. రెండింటినీ దూరంగా తీసుకెళ్లి గొయ్యితవ్వి పాతిపెట్టింది. -
స్టెరిలైట్ ఫ్యాక్టరీపై సుప్రీం కీలక తీర్పు
న్యూఢిల్లీ: తమిళనాడులోని వివాదాస్పద తూత్తుకుడి స్టెరిలైట్ ఫ్యాక్టరీ పున: ప్రారంభంపై సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఆ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. తమిళనాడు ప్రభుత్వం ఆదేశాల ప్రకారం స్టెరిలైట్ ఫ్యాక్టరీ మూసివేత అలాగే కొనసాగుతుందని సోమవారం తీర్పు వెలువరించింది. స్టెరిలైట్ కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును అమలు పరిచేలా తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని వేదాంత గ్రూపు సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. ఎన్జీటీకి ఈ కేసుపై విచారణ చేపట్టే అధికార పరిధి లేదని పేర్కొంది. అంతేకాకుండా తమిళనాడు ప్రభుత్వ ఆదేశాలపై మద్రాసు హైకోర్టును ఆశ్రయించాలని వేదాంత గ్రూపుకు సూచించింది. ‘స్టెరిలైట్’ రాగి ప్లాంట్ను శాశ్వతంగా మూసేయాలని ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామి ఆదేశాలు జారీ చేయగా.. వేదాంత గ్రూప్ ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన ఎన్జీటీ తమిళనాడు ప్రభుత్వ ఆదేశాలను తప్పుబట్టింది. మళ్లీ స్టెరిలైట్ కర్మాగారాన్ని తెరువాలంటూ గత డిసెంబర్ 15 ఆదేశాలు ఇచ్చింది. తీవ్ర కాలుష్యానికి కారణమవుతున్న ఈ కంపెనీని మూసివేయాలంటూ గతేడాది నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేయగా.. పోలీసులు కాల్పులు జరపడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. -
తూత్తుకూడి కాల్పుల్లో నిబంధనల ఉల్లంఘన
తూత్తుకూడి: తమిళనాడులోని తూత్తుకూడిలో వేదాంత స్టెర్లైట్ కాపర్ పరిశ్రమను మూసేయాలంటూ ఈ ఏడాది మే నెలలో నిరసన తెలుపుతున్న ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపి 13 మంది అమాయకులను పొట్టనబెట్టుకోవడం తెలిసిందే. చనిపోయిన 13 మందిలో 12 మందికి బుల్లెట్లు ఛాతీ లేదా అంతకన్నా పై భాగంలోనే తగిలాయనీ, సగం మంది శరీరాల్లోకి బుల్లెట్లు వెనుకవైపు నుంచి దూసుకెళ్లాయని పోస్ట్మార్టమ్ నివేదికలు తాజాగా స్పష్టం చేస్తున్నాయి. దీనిని బట్టి అక్కడి పోలీసులు నిబంధనలను ఎంత తీవ్రంగా ఉల్లంఘించారో తెలుస్తోంది. భారత్లో అమలులో ఉన్న నిబంధనల ప్రకారం నిరసనల్లో పరిస్థితి పూర్తిగా చేయిదాటినప్పుడు మాత్రమే భద్రతా దళాలు కాల్పులు జరిపేందుకు అనుమతి ఉంది. కాల్పులు జరిపినా వాటి లక్ష్యం ఆందోళనలను అణచివేయడమే తప్ప మనుషులను చంపడం అయ్యుండకూడదు. తల, ఛాతీ, గుండె భాగంలో బుల్లెట్ తగలకుండా శరీరంలో వీలైనంత కింద భాగంలో, గరిష్టంగా నడుము వరకు ఉన్న భాగంలో మాత్రమే కాల్చాలి. కానీ ఈ నిబంధనలను ఉల్లంఘించి, ఆందోళనకారుల ప్రాణాలు తీయడానికి అన్నట్లు ఈ ఏడాది మే నెలలో పోలీసులు కాల్పులు జరిపారు. చనిపోయిన వారిలో అత్యంత చిన్న వయస్కురాలు 17 ఏళ్ల బాలిక కాగా, బుల్లెట్ ఆమె తల వెనుక భాగంలో తగిలి నోటి నుంచి బటయకొచ్చిందని పోస్ట్మార్టంలో తేలింది. -
స్టెరిలైట్ ఫ్యాక్టరీని మళ్లీ తెరవాల్సిందే!
సాక్షి, చెన్నై : తమిళనాడులోని వివాదాస్పద స్టెరిలైట్ కర్మాగారాన్ని మళ్లీ తెరవాలంటూ జాతీయ గ్రీన్ ట్రిబునల్ శనివారం ఆదేశాలు ఇచ్చింది. తుత్తుకుడిలోని వేదాంత కంపెనీకి చెందిన స్టెరిలైట్ కాపర్ కర్మాగారానికి వ్యతిరేకంగా స్థానికులు పెద్ద ఎత్తున పోరాటం చేసిన సంగతి తెలిసిందే. తీవ్ర కాలుష్యానికి కారణమవుతున్న ఈ కంపెనీని మూసివేయాలంటూ నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేయగా.. పోలీసులు కాల్పులు జరపడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో స్టెరిలైట్ ప్యాక్టరీని మూసివేస్తూ తమిళనాడు ప్రభుత్వం జీవో జారీచేసింది. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన జాతీయ గ్రీన్ ట్రిబునల్ తమిళనాడు ప్రభుత్వ ఆదేశాలను తప్పుబట్టింది. మళ్లీ స్టెరిలైట్ కర్మాగారాన్ని తెరువాలంటూ ఆదేశాలు ఇచ్చింది. కంపెనీ లైసెన్స్ను పునరుద్ధరించాలని, మూడు వారాల్లో కర్మాగారాన్ని పునఃప్రారంభించేందుకు వీలుగా అనుమతులన్నీ జారీచేయాలని తమిళనాడు కాలుష్య నియంత్రణ సంస్థకు గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీచేసింది. ట్రిబ్యునల్ ఆదేశాలపై పర్యావరణ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
విహారంలో విషాదం..!
ఊటీ అందాలను తిలకించేందుకు వెళ్లిన మిత్ర బృందం అదృశ్యం అయ్యింది. రెండు రోజులుగా రిసార్ట్కు ఆ బృందం తిరిగి రాకపోవడంతో అనుమానాలు బయలుదేరాయి. బుధవారం పోలీసులకు సమాచారం అందించారు. గాలింపు ముమ్మరం చేయడంతో ఓ లోయలో ఆ బృందం వెళ్లిన కారును గుర్తించారు. రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఐదుగురు మరణించగా, కొన ఊపిరితో ఉన్న ఇద్దర్ని రెస్క్యూ టీం రక్షించింది. సాక్షి, చెన్నై : చెన్నైకి చెందిన మిత్ర బృందం రామరాజేష్, రవివర్మ, ఇబ్రహీం, జయకుమార్, అరుణ్, అమర్నాథ్, జూడో గత నెల 30న చెన్నై నుంచి ఓ కారులో ఊటీకి వెళ్లారు. అక్కడి ఓ రిసార్ట్ను అద్దెకు తీసుకున్నారు. తొలిరోజు ఊటీలో ఉన్న ఈ మిత్రులు, ఒకటో తేదీన ముదుమలై శరణాలయం సందర్శనకు బయలుదేరి వెళ్లారు. వెళ్లిన వాళ్లు ఎంతకు తిరిగి రాలేదు. రెండు రోజలైనా ఆ ఏడుగురు తిరిగిరాక పోవడం, రిసార్ట్ సిబ్బందిలో అనుమానాలు నెలకొన్నాయి. వెళ్లిన వారు అదృశ్యం కావడంతో, వారు ఇచ్చిన ఫోన్ నంబర్లకు ఫోన్చేశారు. అవన్నీ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో ఆందోళన బయలుదేరింది. బుధవారం మధ్యాహ్నం ఊటీ పోలీసులకు విషయాన్ని అందించారు. లోయలో కారు రిసార్ట్ నుంచి వచ్చిన ఫిర్యాదుతో ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. ఊటీ నుంచి ముదుమలై వైపు మార్గంలో పరిశీలన చేపట్టారు. కళ్లట్టిమలుపు 35వ క్రాస్ వద్ద ఆగిన ఆ ప్రత్యేక బృందం అక్కడి లోయ మీద దృష్టి పెట్టింది. లోయలో చెట్ల మధ్యలో కారు పడి ఉండడాన్ని గుర్తించారు. దీంతో ఆందోళన బయలుదేరింది. ఆ పరిసరాలు పొదళ్లతో నిండి ఉండడంతో లోయలో దిగడానికి తీవ్ర ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. అతి కష్టం మీద ఒకరిద్దరు లోయలోకి దిగారు. అయినా, కారును సమీపించలేని పరిస్థితి. దీంతో రెస్క్యూ టీంను రంగంలోకి దించారు. ఈ బృందం అతి కష్టం మీద కారును సమీపించింది. ఐదుగురు బలి ఐదుగురు విగత జీవులయ్యారు. ఇద్దరు కొన ఊపిరితో ఉన్నట్టు గుర్తించారు. ఓ వైపు చీకటి పడడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఆగమేఘాలపై లైటింగ్ ఏర్పాట్లు చేసి లోయలో ఉన్న కారులో కొన ఊపిరితో ఉన్న ఇద్దరినీ రక్షించారు. అతి కష్టం మీద వారిని పైకి తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ఐదుగురు మరణించారు. ప్రమాదం జరిగి రెండు రోజులు అవుతుండడంతో గాయాలతో ఉన్న ఆ ఇద్దరు ఏ మేరకు నరకాన్ని అనుభవించి ఉంటారో వర్ణణాతీతం. పొదలతో కూడిన లోయ కావడంతో ఎవరూ ఈ ప్రమాదాన్ని గుర్తించలేని పరిస్థితి. ఈ సమాచారం చెన్నైలోని ఆ ఏడుగురి కుటుంబాల్ని ఆందోళనలో పడేసింది. ఊటీకి పరుగులు తీశారు. కాగా, ముదుమలై శరణాలయానికి వెళ్లే మార్గంలో వాహనం అదుపు తప్పి లోయలో పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే, లోయలోకి కారు దూసుకెళ్లిన సమయంలో పిట్ట గోడల వద్ద ఎలాంటి ఆనవాళ్లు కనిపించకపోవడంతో అనుమానాలు బయలుదేరాయి. దీంతో పోలీసులు ఆదిశగా దర్యాప్తును వేగవంతం చేశారు. మృతి చెందిన ఐదుగురిలో రవి వర్మ, అమరనాథ్, జూడో, జయకుమార్, ఇబ్రహీం ఉన్నారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న రామరాజేష్, అరుణ్లకు తీవ్ర చికిత్స అందిస్తున్నారు. ఈ ఇద్దరు స్పృహలోకి వస్తేనే ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగిందో తేలనుంది. విహార యాత్రలో పాల్గొన్న వారి ఫోటో (మూలం: సోషల్ మీడియా) -
కరుణానిధి అంత్యక్రియలను అడ్డుకోవాలనే...
సాక్షి, చెన్నై : దివంగత నేత, కలైంజ్ఞర్ కరుణానిధి అంత్యక్రియల విషయంలో పళనిసామి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆయన కుమార్తె, డీఎంకే ఎంపీ కనిమొళి మండిపడ్డారు. కరుణానిధి అంత్యక్రియలు అడ్డుకోవడంలో శ్రద్ధ చూపిన ప్రభుత్వం.. తూత్తుకుడి స్టెరిలైట్ పరిశ్రమ తెరవకుండా వేదాంత గ్రూపును మాత్రం అడ్డుకోలేకపోయిందని విమర్శించారు. పర్యావరణ నిబంధనలు, కోర్టులో పిటిషన్లను సాకుగా చూపుతూ అధికార అన్నాడీఎంకే ప్రభుత్వం మెరినా బీచ్లో కరుణానిధి అంత్యక్రియలకు అడ్డుపుల్ల వేసిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. కాగా తూత్తుకుడిలోని స్టెరిలైట్ పరిశ్రమ తెరిచేందుకు జాతీయ హరిత ట్రిబ్యునల్.. వేదాంత గ్రూపునకు గురువారం షరతులతో కూడిన అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో కనిమొళి ప్రభుత్వ తీరును విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారా..? ‘స్టెరిలైట్ పరిశ్రమను శాశ్వతంగా మూసివేయాలంటూ తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీసుకుంది. కానీ పరిశ్రమను తెరిచేందుకు వేదాంత గ్రూపునకు ఎన్జీటీ షరతులతో కూడిన అనుమతినిచ్చింది. కలైంగర్ అంత్యక్రియలను మెరీనా బీచ్లో జరగకుండా అడ్డుకునేందుకు సీఎస్ వైద్యనాథన్(ప్రభుత్వ న్యాయవాది) తీవ్రంగా శ్రమించారు. కానీ ప్రజల ప్రాణాలు బలిగొన్న పరిశ్రమను తెరవకుండా సరైన వాదనలు వినిపించలేకపోయారు. తమిళనాడును అన్ని విధాలుగా దిగజార్చేందుకే సీఎం ఉద్దేశపూర్వకంగానే ఈ విధంగా వ్యవహరిస్తున్నారేమో అనే సందేహం కలుగుతుందంటూ’ కనిమొళి ట్వీట్ చేశారు. Vedanta approached the NGT against this order & Senior Counsel CS.Vaidhyanathan represented TN govt. Counsel for TN govt should have prepared adequately to defend the TN govt order of closure. But, the briefing & discussion on yesterday's hearing was done only at 10am yesterday. — Kanimozhi (கனிமொழி) (@KanimozhiDMK) August 10, 2018 The briefing and discussion on the hearing should have been done by Counsel CS.Vaidhyanathan at least a day before. But, CS.Vaidhyanathan was busy justifying the denial of space to our leader Kalaignar at Marina in Madras HC yesterday. 3/4 — Kanimozhi (கனிமொழி) (@KanimozhiDMK) August 10, 2018 Or was this done deliberately by the government for Edappadi Palaniswami is taking TN to its lowest point in governance. 4/4 — Kanimozhi (கனிமொழி) (@KanimozhiDMK) August 10, 2018 -
గురి పెట్టి కాల్చి చంపారు!
ప్రజల్ని గురిపెట్టి తూపాకులతో కాల్చి మరీ చంపేశారని పోలీసులపై మక్కల్ విచారణ ఇయక్కం ఆరోపించింది. తమ విచారణలో వెలుగుచూసిన అంశాలతో కూడిననివేదికను సోమవారం ఆ ఇయక్కం విడుదల చేసింది. కాగా, స్టెరిలైట్ పరిశ్రమకు పడ్డ తాళాన్ని తొలగించేందుకు తగ్గ ప్రయత్నాల్ని ఆ యాజమాన్యం వేగవంతం చేసింది. ఇందుకు అద్దం పట్టే రీతిలో సిబ్బంది అందరూ విధులకు హాజరుకావాలని ఆదేశాలు జారీచేసింది. సాక్షి, చెన్నై : తూత్తుకుడిలోని స్టెరిలైట్ పరిశ్రమకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం కాల్పులకు దారితీసిన విషయం తెలిసిందే. మే 22వ తేదీ సాగిన ర్యాలీ అల్లర్లకు దారితీసింది. దీంతో పోలీసులు పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు కాల్పులు జరిపారు. ఇందులో 13 మంది విగత జీవులయ్యారు. ఈ ఘటనపై పలు కోణాల్లో విచారణ సాగుతూ వస్తోంది. ఓ వైపు జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర కమిషన్ వేర్వేరుగా, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలోని కమిషన్, సీబీసీఐడీ నేతృత్వంలో... ఇలా అన్ని వైపులా విచారణసాగుతూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈ ఘటనపై మక్కల్ విచారణ ఇయక్కం సైతం విచారణజరిపింది. కొన్ని రోజుల పాటు తూత్తుకుడిలో తిష్టవేసి పలు వర్గాల నుంచి సేకరించిన సమాచారాలు, సంఘటన స్థలంలో లభించిన ఆధారాలు, వివరాల మేరకు ఈ ఇయక్కం నివేదికను సిద్ధం చేసింది. నివేదికలో తేటతెల్లం కాల్పుల ఘటనపై ఇప్పటికే పోలీసులు, తూత్తుకుడి జిల్లా యంత్రాంగం మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. వీటికి బలం చేకూర్చే రీతిలో తాజా నివేదికలోని అంశాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఈ నివేదికను సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్భూషణ్ విడుదల చేయగా, వర్తక సంఘం నేత వెల్లయ్యన్ అందుకున్నారు. అందులోని వివరాల మేరకు.. ర్యాలీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో చడీచప్పుడు కాకుండా పోలీసులు రాత్రికి రాత్రే 144 సెక్షన్ను అమల్లోకి తీసుకొచ్చారని వివరించారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయలేదని స్పష్టంచేశారు. ర్యాలీలో తమ కుటుంబాలతో కలిసి ప్రజలు పాల్గొన్నాయని, శాంతియుతంగా సాగుతున్న ర్యాలీలో ఒక్కసారిగా పోలీసుల లాఠీ చార్జ్, తూటాలు ప్రజల్లో భయాందోళన సృష్టించాయని వివరించారు. లాఠీచార్జ్ తదుపరి యూనిఫాంలో లేని (మఫ్టీలో ఉన్న) వాళ్లు వాహనాల మీద ఎక్కి నేరుగా ప్రజల్ని గురిపెట్టి మరి తుపాకులతో కాల్చి పడేశారని ఆందోళన వ్యక్తంచేశారు. తుపాకీ కాల్పుల సమయంలో పాటించా ల్సిన ఏ ఒక్క నిబంధనల్ని పోలీసులు అనుసరించలేదని, నేరుగా ప్రజల మీద గురిపెట్టి మట్టు బెట్టే రీతిలో కాల్పులు సాగించారని స్పష్టంచేశారు. ఇందులో విద్యార్ధిని నాన్సీ మరణం కూడా ఉందని పేర్కొన్నారు. ఇలా మరెన్నో వివరాలను అందులో పొందుపరిచారు. ఉన్నతాధికారుల్ని విచారించాలి తూత్తుకూడి కాల్పుల ఘటనపై పూర్తిగా విఫలమైన ఆ జిల్లా యంత్రాంగం, విచ్చలవిడిగా కాల్పులు జరిపిన పోలీసులు, దీని వెనుక ఉన్న పోలీసు ఉన్నతాధికారుల్ని విచారించాల్సిన అవసరం ఉందని మక్కల్ విచారణ ఇయక్కం సూచించింది. తూత్తుకుడిలో ప్రస్తుతం వాతావరణం ప్రశాంతంగా ఉన్నా, పోలీసులు మాత్రం హడావుడి సృష్టిస్తూనే ఉన్నారని, అరెస్టులు, బలవంతపు నిర్భందాలు సాగుతూనే ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ ఇయక్కం ప్రతినిధులు హరి భరదన్, తిలక్ సెల్వరాజ్, షా విశ్వనాథన్, కృష్ణ దాసు గాంధీ, కవిత, గీత, రోశయ్య, రాందాసు తదితరులు పాల్గొన్నారు. తాళం తెరిచేనా? మూతపడ్డ పరిశ్రమను తెరిచేందుకు స్టెరిలైట్ యాజమాన్యం తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఆ పరిశ్రమలోని రసాయనాలను ప్రస్తుతం ఆ జిల్లా యంత్రాంగం పర్యవేక్షణలో తొలగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని విధులకు హాజరవ్వాలని యాజమాన్యం ఆదేశాలివ్వడం చర్చకు దారితీసింది. ఈ పరిశ్రమలో రెండు వేల మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. వారిలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు స్వస్థలాలకు వెళ్లిపోయారు. స్థానికంగా ఉన్న సిబ్బంది తూత్తుకుడిలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అందరూ విధులకు హాజరు కావాలని ఆ యాజమాన్యం ఆదివారం ఆదేశాలు నుంచి వెళ్లడం, సోమవారం ఉదయాన్నే పరిశ్రమ వద్ద సిబ్బంది గుమిగూడడం చోటు చేసుకున్నాయి. పరిశ్రమకు అనుబంధంగా ఉన్న స్టాఫ్ క్వార్టర్స్ వద్ద సిబ్బంది అందరూ ఏకం అయ్యారు. అందరూ రిజిస్టర్లో సంతకాలు చేశారు. విధులకు హాజరు అవుతున్నట్టుగా సంతకాల తదుపరి, అక్కడే సిబ్బందితోపాటు ఆ పరిశ్రమ అధికారులు సమావేశం కావడం గమనార్హం. -
నటి నీలాణికి బెయిల్ మంజూరు
పెరంబూరు: నటి నీలాణికి సైదాపేట కోర్టు నిబంధనలతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. ఇటీవల తూత్తుక్కుడి కాల్పుల సంఘటనపై నటి నీలాణి పోలీసు దుస్తులు ధరించి వీడియోలో చిత్రీకరించిన విషయం, పోలీసులు ఆందోళన కారులపై కాల్పులు జరిపిన దృశ్యాలతో కూడిన ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలై సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై వడపళనికి చెందిన రిషీ అనే వ్యక్తి గత మే నెల 22న వడపళని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి ఆ వీడియో తీసింది ఎవరని దర్యాప్తు చేయగా స్థానిక సాలిగ్రామం, అష్టలక్ష్మీనగర్కు చెందిన నటి నిలాణి అని తెలిసింది. దీంతో ఆమెను ఈ నెల 19వ తేదీన అరెస్ట్ చేసి సైదాపేట కోర్టులో హాజరు పరిచారు. ఆ తరువాత కోర్టు ఆదేశాల మేరకు పుళల్ జైలుకు తరలించారు. కాగా నటి నిలాణి బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేసుకుంది. ఆ పిటిషన్ను గురువారం విచారించిన కోర్టు నటి నీలానికి ‘పోలీసులకు సహకరించాలి, నగరం దాటి వెళ్లకూడదు’ లాంటి నిబంధనలతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. -
తలైవాపై కేసా?
ఉద్యమకారుల్ని సంఘ విద్రోహ శక్తులతో పోల్చుతూ తలైవా రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు కేసు నమోదుకు దారితీసేనా అన్న ప్రశ్న బయలుదేరింది. ఈ విషయంగా కింది కోర్టును ఆశ్రయించాలని పిటిషనర్కు బుధవారం మద్రాసు హైకోర్టు సూచించడం గమనార్హం. కాగా, కాల్పుల ఘటనపై సీబీసీఐడీ విచారణ తూత్తుకుడిలో మొదలైంది. సాక్షి, చెన్నై : తూత్తుకూడిలో రజనీ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదయ్యే పరిస్థితి కనిపిస్తోంది. స్టెరిలైట్ ఉద్యమం పయనంలో భాగంగా గత నెల సాగిన ర్యాలీ కాల్పులకు దారితీసిన విషయం తెలిసిందే. ఇందులో 13 మంది బలయ్యారు. సంచలనం రేపిన ఈ ఘటనలో బాధితుల్ని అన్ని పార్టీ ల నేతలు పరామర్శిస్తూ వచ్చారు. అలాగే, దక్షిణ భారత చలనచిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం బాధితుల్ని పరామర్శించారు. మీడియాతో మాట్లాడే క్రమంలో ఆయన నోరు జారారు. ఉద్యమ కారుల్ని సంఘ విద్రోహశక్తులుగా పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. పోలీసుల మీద దాడి జరగడంతోనే కాల్పులకు పరిస్థితులు దారితీసినట్టు, సంఘ విద్రోహశక్తులు ఉన్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యల్ని అస్త్రంగా చేసుకుని హొసూరు శిలంబరసన్ పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేయాలని కోరారు. పోలీసులు ఖాతరు చేయకపోవడంతో మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ను విచారించిన న్యాయమూర్తి ప్రకాశ్ ‘కింది కోర్టును ఎందుకు ఆశ్రయించ లేదు’ అని పిటిషనర్ను ప్రశ్నించారు. రజనీకాంత్పై కేసు నమోదు విషయంగా కింది కోర్టును ఆశ్రయించాలని పిటిషనర్కు న్యాయమూర్తి సూచించారు. దీంతో కింది కోర్టును ఆశ్రయించేందుకు తగ్గ ప్రయత్నాల మీద శిలంబరసన్ దృష్టి పెట్టారు. కింది కోర్టు ఏదేని ఆదేశాలు ఇచ్చిన పక్షంలో తలైవా మీద కేసు నమోదు అయ్యేనా అన్న ప్రశ్న బయలుదేరింది. సీబీసీఐడీ విచారణ తూత్తుకుడి కాల్పుల ఘటనపై సీబీసీఐడీ విచారణకు శ్రీకారం చుట్టింది. ఆ విభాగం ఎస్పీ ప్రవీణ్ కుమార్ అభినవ్ నేతృత్వంలోని బృందం బుధవారం తూత్తుకుడికి చేరుకుంది. అక్కడి సీబీసీఐడీ కార్యాలయంలో సిబ్బందితో భేటీ తదుపరి సంఘటన జరిగిన ప్రాంతాల్లో అభినవ్ పర్యటించారు. కాల్పుల ఘటన, అల్లర్లకు దారితీసిన పరిస్థితులను అధ్యయనం చేశారు. అలాగే, జిల్లా ఎస్పీ మురళీ రంభతో భేటీ అయ్యారు. స్థానికపోలీసులు నమోదుచేసిన ఐదు రకాల సెక్షన్లతో కూడిన కేసుల వివరాల్ని తెలుసుకున్నారు. తమదైన శైలిలో విచారణను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సీబీసీఐడీ ఎస్సీ అభినవ్ నేతృత్వంలోని బృందం ముందుకు సాగుతోంది. -
తూత్తుకుడి బాధితులకు విజయ్ ఆర్థిక సాయం
-
బైకుపై వెళ్లి సాయం చేసిన స్టార్ హీరో
సాక్షి, చెన్నై: తమిళనాట ప్రకంపనలు సృష్టించిన తూత్తుకుడి స్టెరిలైట్ ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట బాధితులకు సినీ ప్రముఖుల నుంచి మద్ధతు లభిస్తోంది. ఇప్పటికే కమల్ హాసన్, రజనీకాంత్ బాధితులను పరామర్శించి వారికి మద్ధతుగా నిలిచారు. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఆర్థిక సాయం ప్రకటించారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కూడా మృతుల కుటుంబాలను కలిసి వారికి తనవంతు ఆర్థిక సాయం అందిచారు. మంగళవారం (జూన్ 5) రాత్రి రహస్యంగా బైకుపై తూత్తుకుడి చేరుకున్న విజయ్ బాధిత కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్థిక సాయం చేశారు. మళ్లీ అభిమానుల హడావుడి లేకుండా తూత్తుకుడి నుండి వెళ్లిపోయారు. ఇదంతా మీడియాకు తెలిసే లోపే విజయ్ చెన్నైలో ఉండటం ఇప్పడు తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. అంతా పబ్లిసిటీ కోసం పాకులాడుతున్న ఈ పరిస్థితులలో యువ హీరో దాతృత్వం ఇప్పుడు ఆయన సినీ హీరోకాదు నిజజీవిత హీరో అంటూ మన్ననలు పొందుతున్నారు. తూత్తుకుడిలో విజయ్ బైక్పై ప్రయాణించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
నేనూ సంఘ విద్రోహినే
సాక్షి, చెన్నై: తమిళనాట రాజకీయాలు వేడెక్కాయి. సినీ దిగ్గజాలు కమలహాసన్, రజనీకాంత్ రంగంలోకి దిగడంతో రాజకీయాలు రసకందాయకంగా మారాయి. 25 ఏళ్లుగా రాజకీయాల్లోకి వస్తానంటూ అభిమానులను ఊరిస్తూ వచ్చిన రజనీ ఇనాళ్లకు రాజకీయ రంగస్థలంలోకి దూకడానికి సిద్ధం అవుతున్నారు. ఆయన సమకాలీన నటుడు కమలహాసన్ అనూహ్యంగా రాజకీయ రంగ ప్రవేశంతో పాటు పార్టీ పేరు, జెండానూ కూడా ప్రకటించేసి జనాల్లోకి చొచ్చుకుపోతున్నారు. కమల్,రజనీలిద్దరూ రాజకీయాల్లోనూ భిన్న రాజకీయాలతో ముందుకు సాగుతున్నారని చెప్పవచ్చు. ఈ నట ఘటికులిద్దరూ తమ అభిమాన సంఘాలను ప్రజా సంఘాలుగా మార్చి, అభిమానుల ద్వారా తమిళనాడులో అధికారాన్ని చేపట్టాలనే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యమంత్రి కుర్చీ లక్ష్యంగా రాజకీయ అడుగులు వేస్తున్న కమలహాసన్, రజనీకాంత్ల అభిప్రాయాలు మాత్రం భిన్నంగా ఉండడం గమనార్హం. రజనీకాంత్ ఆధ్యాత్మిక రాజకీయాలంటూ, విద్యార్థులు రాజకీయాలకు దూరంగా చదువుపై దృష్టి సారించాలి అని పేర్కొంటే.. కమల్ అందుకు భిన్నంగా విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలంటూ పిలుపునిచ్చారు. ఇలా పలు విషయాల్లో కమల్, రజనీ విరుద్ధ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. స్టెరిలైట్ పోరాటంపైనా.. తమిళనాడును కుదిపేసిన తూత్తుకుడిలోని స్టెరిలైట్ పరిశ్రమకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా పోరాటం వ్యవహారంలో రజనీకాంత్, కమలహాసన్ భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అక్కడి బాధితులను పరామర్శించడానికి వెళ్లిన రజనీకాంత్ పోరాటంలో సంఘవిద్రోహులు చొరబడి దాడికి పాల్పడడమే సమస్యకు కారణం అనీ, ఈ సంఘటనలో పోలీసులపై దాడి ఖండించదగ్గదని పేర్కొన్నారు. ప్రతి విషయానికి పోరాటాలు చేసుకుంటూ పోతే తమిళనాడు శ్మశానంగా మారుతుందని రజనీ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ఆయనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేనూ సంఘ విద్రోహినే తూత్తుకుడి ఘటనపై రజనీకాంత్ వ్యాఖ్యలను కమలహాసన్ ఖండించారు. ఆయనపై వ్యతిరేక గళం ఎత్తారు. పోరాటం చేసేవారు సంఘ విద్రోహులైతే తానూ సంఘ విద్రోహుడినేనని కమల్ పేర్కొన్నారు. పోరాటాలు ఆగకూడదని అన్న కమల్ తూత్తుకుడి పోరాటం మంచి మార్గం అని, తుపాకీలు గురిపెట్టినా వాటిని ఎదిరించే పరిపక్వతను చూశామని అన్నారు. పోరాటాలతో తమిళనాడు శ్మశానంగా మారుతుందని రజనీ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అన్నారు. తాను మహాత్మా గాంధీ శిష్యుడినని అన్నారు. కత్తులు, తుపాకులతో చేసేది పోరాటం కాదని, అహింసా విధానంలో పోరాటాలు చేయాలన్నారు. -
తూత్తుకుడి ఘటనపై ఎన్హెచ్ఆర్సీ విచారణ
సాక్షి, చెన్నై: తమిళనాడు తూత్తుకుడి స్టెరిలైట్ పరిశ్రమ వివాదంతో చెలరేగిన హింసలో 13 మంది మృతి చెందటంపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) విచారణ చేపట్టింది. ఢిల్లీ నుంచి వచ్చిన కమిషన్ సభ్యులు మృతుల కుటుంబాలను కలుసుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. విచారణలో భాగంగా తూత్తుకుడి జిల్లా కలెక్టర్తో సమావేశమయ్యారు. హింసకు దారితీసిన పరిస్థితులు, కాల్పులు జరపమని ఆదేశించిన అధికారులెవరు? హింస చెలరేగడంలో నిరసనకారుల, పర్యావరణ కార్యకర్తల పాత్ర ఏమిటనే కోణంలో కలెక్టర్ సందీప్ నండూరిని అడిగి వివరాలు సేకరించారు. పుపుల్ దత్త ప్రసాద్ నేతృత్వంలో కొనసాగిన ఈ విచారణలో కమిషన్ సభ్యులు రాజీవర్ సింగ్, నితిన్ కుమార్, అరుణ్ త్యాగి, లాల్ బకర్ పాల్గొన్నారు. రెండ్రోజుల విచారణ అనంతరం ప్రత్యేక నివేదిక రూపొందిస్తామని అధికారులు తెలిపారు. -
రజనీపై మండిపడ్డ సీఆర్ సరస్వతి
సాక్షి, చెన్నై: తూత్తుకుడి ఘటనలో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతూనే ఉంది. తాజాగా నటి, శశికళ వర్గానికి చెందిన సీనియర్ నేత సీఆర్ సరస్వతి... రజనీకాంత్పై మండిపడ్డారు. శశికళ వర్గానికి చెందిన టీటీవీ దినకరన్ కొత్త పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఆదివారం చెన్నైలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో ఉన్న సీఆర్ సరస్వతి మాట్లాడుతూ ...రజనీకాంత్ కు రాజకీయ పరిపక్వత లేదని మండిపడ్డారు. తూత్తుకుడి ఘటనలో సంఘ విద్రోహక శక్తులు చనిపోలేదని, సామాన్యులు మృతి చెందారని, నిజంగానే వారు హింసకు పాల్పడితే ఒక్క సంఘ విద్రోహక శక్తి ఎందుకు చనిపోలేదని ప్రశ్నించారు. తమిళుల పోరాటాలను రజనీకాంత్ కించపరిచేలా వ్యాఖ్యలు చేయటం ఆయన మానసిక పరిపక్వతకు నిదర్శనమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పాలనలో పూర్తగా విఫలమైందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై గొంతు విప్పేందుకు ఎమ్మెల్యే టీటీవీ దినకరన్కు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం కక్షపూరితంగా అడ్డుకుంటుందని మండిపడ్డారు. ఇటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేరోజు త్వరలో ఉందని వ్యాఖ్యానించారు. ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే సభను బహిష్కరించటం మంచిదికాదని సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ఉండగా ప్రభుత్వ వైఖరి నచ్చక ఈ సెషన్స్ మొత్తం బహిష్కరించటం ద్వారా సామాన్యుల సమస్యలు మరుగున పడిపోతాయని సరస్వతి వాపోయారు. -
రజనీకాంత్..! ఎవరు నువ్వు?
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడులోని తూత్తుకుడిలో జరిగిన అమానుష పోలీసు కాల్పులపై రాజకీయ నాయకుడిగా మారిన సినీ నటుడు రజనీకాంత్ మాట మార్చి ప్రజల ముందు, ముఖ్యంగా సోషల్ మీడియాలో అభాసు పాలయ్యారు. పోలీసుల కాల్పుల సంఘటన జరిగిన మే 22వ తేదీన వారి అమానుషత్వాన్ని విమర్శిస్తూ రజనీకాంత్ ఓ చిన్న వీడియాను విడుదల చేశారు. పోలీసు కాల్పుల్లో గాయపడి తూత్తుకుడి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించడానికి ఆయన బుధవారం అక్కడికి వెళ్లినప్పుడు ఓ బాధితుడి నుంచి ఆయనకు ఊహించని ప్రశ్న ఎదురయింది. ‘ఎవరు నువ్వు?’ అన్నదే ఆ ప్రశ్న. దీంతో కంగుతిన్న రజనీకాంత్, అక్కడ తన పేరు చెప్పుకొని త్వరత్వరగా పరామర్శ కార్యక్రమాన్ని ముగించుకొని ఆస్పత్రి బయటకు వచ్చారు. ‘సంఘ వ్యతిరేక శక్తులు, సంఘ విద్రోహ శక్తులు నిరసనలో పాల్గొన్నారు. వారు పోలీసులపై రాళ్లు రువ్వడం వల్ల పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది’ అని రజనీకాంత్ తన అంతుకుముందటి వైఖరి మార్చుకొని మీడియా ముందు వ్యాఖ్యానించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత తన పాలనలో ఇలాంటి శక్తులు తలెత్తకుండా చేశారని, ఆమె తరహాలో ప్రస్తుత ఏఐఏడిఎంకే ప్రభుత్వం సంఘ విద్రోహ శక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. నిరసన ప్రదర్శనలో సంఘ విద్రోహ శక్తులు ఉన్నారన్న విషయం తమకు ఎలా తెలుసు, ఎలా ధ్రువీకరించుకున్నారంటూ మీడియా అడిగిన ప్రశ్నకు తడబడిన ఆయన ‘ఆ...నాకు తెలుసు’ అంటూ అక్కడి నుంచి నిష్క్రమించారు. ఇలా మాట మార్చడంపై సోషల్ మీడియాలో రజనీకాంత్కు వ్యతిరేకంగా విమర్శలు వెల్లువెత్తాయి. ‘పక్కా బీజేపీ తొత్తువి’, ‘ఏలియన్ హిందూత్వ’ అంటూ ట్వీట్లు పేలాయి. వేదాంత గ్రూప్నకు చెందిన తూత్తుకుడి స్టెరిలైట్ కాపర్ కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో టెర్రరిస్టులు, నక్సలైట్లు పాల్గొన్నారని బీజేపీ నాయకులు విమర్శించడం తెల్సిందే. మోదీకి, బీజేపీకి వేదాంత గ్రూప్ ఇష్టమైన సంస్థ అవడమే వారి విమర్శలకు కారణం ఏమో! అయినా మాట మార్చడం రజనీకాంత్కు కొత్త కాదు. జయలలిత తుదిశ్వాస వరకు ఆమెను నిజమైన ‘అమ్మ’ అంటూ ప్రశంసించిన ఆయన 1996లో జయలలితకు ఓటు వేయరాదంటూ తమిళనాడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆమె గనుక గెలిస్తే తమిళనాడు రాష్ట్రాన్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేరంటూ విమర్శించారు. రీల్ హీరోగా, రియల్ హీరోగా వేరు చాలా మందిలాగానే సినిమాలో హీరోగా కనిపించే రజనీకాంత్ వేరు. నిజ జీవితంలో రజనీ వేరు. జూన్ ఏడవ తేదీన విడుదలవుతున్న ‘కాలా’ చిత్రంలో రజనీ ప్రజల నిరసన ప్రదర్శనలను ప్రోత్సహిస్తారు. పేద వారి శరీరాలే ఆయుధాలంటారు. తూత్తుకుడిలో ప్రదర్శన జరిపిన ప్రజలనేమో సంఘ విద్రోహశక్తులన్నారు. ‘ఎవరు నువ్వు’ అంటూ ఓ బాధితుడు అన్నందుకు కోపం వచ్చి రజనీకాంత్ మాటమార్చారని అనుకోరాదు. ఒకవేళ అదే కారణం అయితే ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వస్తున్న ఆయన ఇక రాణించలేరు. అరాచకవాదులు, తీవ్రవాదులు, సంఘ విద్రోహశక్తులు తూత్తుకుడి ప్రదర్శనలో ఉన్నారని రజనీకాంత్ అత్యంత సన్నిహితుడు, ఆరెస్సెస్ సభ్యుడు, తుగ్లక్ మాగజైన్ ఎడిటర్ ఎస్. గురుమూర్తి ఆరోపించారు. రజనీ కూడా సంఘ విద్రోహ శక్తులంటూ మాట మార్చడంతో ఆయన ట్వీట్ల మీద ట్వీట్లతో రజనీకాంత్ను ప్రశంసించారు. ‘ఎవరు నువ్వు?’ అంటూ బాధితుడు వేసిన ప్రశ్న రజనీకాంత్కు సరిగ్గా అర్థం కానట్లు ఉంది. తనదీ ఆద్యాత్మిక రాజకీయమంటూ చెప్పుకుంటున్న రజనీకాంత్ ఎవరి పక్షమని, ఏ పార్టీ పక్షం అన్నదే ప్రశ్న. ఆధ్యాత్మికమంటే హిందూత్వమనేదే అర్థమని, రజనీకాంత్ బీజేపీ పక్షమంటూ విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ విషయాన్ని ఆయన బహిరంగంగా ఒప్పుకోవాలన్నదే బాధితుడి ప్రశ్న. -
‘నేను రజనీకాంత్ను’; వీడియో వైరల్
చెన్నై : సూపరస్టార్ రజనీకాంత్కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ప్రాంతాలకతీతంగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న ఈ ‘బాషా’ పాపులారిటీ గురించి 1989లో వచ్చిన ‘రాజా చిన్న రోజ’ సినిమాలో ఒక పాట ఉంది. ఆ పాటలో ‘సూపర్స్టార్ ఎవరని చిన్న పిల్లలను అడిగిన సమాధానం చెప్తారు’ అనే చరణం అప్పట్లో బాగా పాపులర్. అయితే తూత్తుకుడికు చెందిన సంతోష్ కుమార్(21) ఆ సినిమా విడుదల నాటికి ఇంకా పుట్టలేదేమో అందుకే ఏకంగా సూపర్స్టార్ను పట్టుకుని ‘ఎవరు నువ్వు...?’ అంటూ ప్రశ్నించాడు. అందుకు సూపర్ స్టార్ ‘నేను రజనీకాంత్ను...’ అంటూ పరిచయం చేసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ సంభాషణకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తూత్తుకుడి బాధితులను పరామర్శించడానికి వెళ్లిన రజనీని ఓ యువకుడు ‘ఎవరు మీరు..?’ అని ప్రశ్నించాడు. అందుకు ఈ సూపర్స్టార్ చిరునవ్వుతో ‘నేను రజనీకాంత్’ను అంటూ పరిచయం చేసుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో గతంలో ఎప్పుడు లేనంతగా నెటిజన్లు రజనీని ట్రోల్ చేస్తున్నారు. ‘నాన్థాన్పా రజనీకాంత్’(నేను రజనీకాంత్ను), ‘యాంటీతమిళ్ రజనీకాంత్’ హ్యాష్ టాగ్స్ క్రియేట్ చేసి ఓ ఆట ఆడేసుకుంటున్నారు. తూత్తుకూడికి చెందిన సంతోష్ బీకామ్ చదువుతున్నాడు. స్టెరిలైట్ కర్మాగారాన్ని మూసివేయాలని కృషి చేసిన వారిలో ఇతనొకడు. ఇటీవల స్టెరిలైట్ బాధితులను పరామర్శించడానికి ఓ మంత్రి ఆస్పత్రికి వచ్చినప్పుడు కూడా సంతోష్ ఆయన్ని ఇలాంటి వింత ప్రశ్నలే అడిగాడట. ఇప్పుడు ఏకంగా తలైవానే ‘ఎవరు నువ్వు..?’ అని అడిగాడు. తూత్తుకుడిలో మే 22న జరిగిన విధ్వంసానికి సంఘ విద్రోహశక్తులే కారణమని రజనీకాంత్ అన్న విషయం తెలిసిందే. -
తూత్తుకుడిలో విద్రోహ శక్తులు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తూత్తుకుడిలో మే 22న జరిగిన విధ్వంసానికి సంఘ విద్రోహశక్తులే కారణమని తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ అన్నారు. చెన్నై నుంచి బుధవారం ఉదయం తూత్తుకుడికి చేరుకున్న రజనీ అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారి కుటుంబసభ్యులకు రూ.2 లక్షలు, గాయపడిన 48 మందికి రూ.10వేలు చొప్పున సాయం అందజేశారు. తర్వాత ఆయన∙మీడియాతో మాట్లాడారు. ‘జిల్లా కలెక్టర్ కార్యాలయంపై దాడి, అగ్ని ప్రమాదానికి కారణం సంఘ విద్రోహశక్తులే.ఉద్యమంలోకి సంఘ వ్యతిరేక శక్తులు ప్రవేశించాయనే విషయం ముందుగా తెలుసుకోవటంలో పోలీసునిఘా విఫలమైంది. సీఎంగా జయలలిత అరాచక శక్తులను ఉక్కుపాదంతో అణచివేశారు. ప్రస్తుత ప్రభుత్వం సైతం ఆమె బాటలో సాగాలి’ అని అన్నారు. తూత్తుకుడి ఘటనపై ప్రధాని మోదీ ఇప్పటి వరకు స్పందించకపోవటంపై.. ‘మీడియా చాలా శక్తివంతమైంది. ఈ విషయం ఆయన్నే అడగండి’ అని రజనీ అన్నారు. -
‘తూత్తుకుడి బాధ్యులు డీఎంకే-కాంగ్రెస్’
సాక్షి, చెన్నై: తూత్తుకుడి ఘటనకు డీఎంకే-కాంగ్రెస్ పార్టీలే బాధ్యత వహించాలని తమిళనాడు ముఖ్యముంత్రి కె. పళనిస్వామి ఆరోపించారు. తూత్తుకుడి ఘటనపై ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ పళని ప్రభుత్వంపై అసెంబ్లీలో తీవ్ర స్థాయిలో విమర్శించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన సీఎం బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. స్టెరిలైట్కు డీఎంకే, కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలోనే అనుమతులన్ని వచ్చాయని, ఈ ఘటనకు డీఎంకే- కాంగ్రెస్ బాధ్యత వహించాలని పేర్కొన్నారు. డీఎంకే భాగస్వామిగా ఉన్న యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఫ్యాక్టరీకి కావాల్సిన భూములకు అనుమతినిచ్చిందన్నారు. 2009లో స్టాలిన్ పరిశ్రమలశాఖ మంత్రిగా ఉన్న సమయంలో స్టెరిలైట్ రెండో దశ విస్తరణకు 230 ఎకరాల భూమిని కేటాయించారని తెలిపారు. ఘటనలో 13మంది మరణించగా, 58 మంది ఆందోళనకారులు, 72 మంది పోలీసు సిబ్బందికి తీవ్ర గాయలైనట్లు సీఎం అసెంబ్లీలో ప్రకటించారు. ఘటనపై ముఖ్యమంత్రి శ్వేత పత్రం విడుదల చేయాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. స్టెరిలైట్కు నిరసనగా తాము అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు స్టాలిన్ తెలిపారు. -
తూత్తుక్కుడి బాధితులను పరామర్శించిన రజనీకాంత్
-
రజనీ రాజకీయం మొదలైంది!
సాక్షి, చెన్నై: తూత్తుక్కుడి(ట్యూటీకోరిన్)లో స్టెరిలైట్ బాధితులను పరామర్శించాలని సూపర్స్టార్ రజనీకాంత్ నిర్ణయించుకున్నారు. అందుకోసం తన లేటెస్ట్ మూవీ ‘కాలా’ ప్రచారానికి తాత్కాలికంగా విరామం ఇచ్చారు రజనీ. తూత్తుక్కుడిలో స్టెరిలైట్ పరిశ్రమకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో 13 మంది అమాయకులు పోలీసుల తూటాలకు బలైన విషయం తెలిసిందే. అయితే బాధితులను పరామర్శించేందుకు తాను తూత్తుక్కుడి వెళ్తున్నానని బుధవారం ఉదయం రజనీ వెల్లడించారు. అమాయకుల రక్తాన్ని చిందించే పోరాటాలు భవిష్యత్లో జరగకూడదన్నారు. బాధితుల పక్షాన నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రజనీ పేర్కొన్నారు. కానీ, బాధితులు కొందరు రజనీకాంత్ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తూత్తుకుడిలో పోలీసు కాల్పులపై మంగళవారం అసెంబ్లీలో ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో ఆ స్టెరిలైట్ కంపెనీని శాశ్వతంగా మూసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కాలా మూవీ ప్రమోషన్లలో భాగంగా షెడ్యూల్ చేసుకున్న హైదరాబాద్, ముంబై పర్యటనల్ని రద్దు చేసుకుని మరీ రజనీ తూత్తుక్కుడిలో పర్యటించనుండటం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాశంమైంది. -
అసెంబ్లీలో తూత్తుకుడి అలజడి
సాక్షి ప్రతినిధి, చెన్నై: తూత్తుకుడి కాల్పుల ఘటన తమిళనాడు అసెంబ్లీని కుదిపేసింది. మంగళవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష సభ్యులు తూత్తుకుడి ఘటనపై తీవ్ర వాగ్వాదానికి దిగారు. స్టెరిలైట్ కర్మాగారాన్ని మూసివేయాలంటూ కేబినెట్ తీర్మానం చేసేదాకా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రతిపక్ష డీఎంకే ప్రకటించింది. దీంతో ప్రభుత్వం కాస్తంత దిగివచ్చింది. తూత్తుకుడి ఘటనకు నిరసనగా మంగళవారం డీఎంకే సభ్యులు నలుపు రంగు దుస్తులు ధరించి సభకు హాజరయ్యారు. సభ ప్రారంభం కాగానే తూత్తుకుడిలో పోలీసు కాల్పుల అనంతరం తీసుకున్న నష్ట నివారణ చర్యలు, స్టెరిలైట్ కంపెనీని శాశ్వతంగా మూసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై అధికార అన్నాడీఎంకే సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. అయితే, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే మాత్రం వాటిని కంటితుడుపు చర్యలుగా పేర్కొంది. కాల్పుల ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం పళనిస్వామి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. వెంటనే కేబినెట్ను సమావేశపరిచి స్టెరిలైట్ కర్మాగారాన్ని మూసివేస్తూ తీర్మానం చేయాలని పేర్కొంది. ఆ తీర్మానం చేసేదాకా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోమంటూ డీఎంకే నేత స్టాలిన్ సహా ఆ పార్టీ సభ్యులంతా వాకౌట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం..ప్రజల ప్రయోజనాలను పరిరక్షించేందుకు వేదాంత గ్రూప్ స్టెరిలైట్ ప్లాంట్ విస్తరణ రెండోదశకు ఇచ్చిన 342.22 ఎకరాల భూ కేటాయింపును రద్దు చేస్తున్నట్లు తెలిపింది. దీంతోపాటు 13 మంది మరణానికి కారణమైన పోలీసు కాల్పులపై సీబీ–సీఐడీ విచారణకు ఆదేశించింది. తూత్తుకుడిలోని వేదాంత గ్రూప్నకు చెందిన స్టెరిలైట్ కర్మాగారం కాలుష్యాన్ని వెదజల్లుతోందంటూ ప్రజలు ఆందోళన చేయడం తెల్సిందే. -
ఇది మూసిన తలుపులకు తాళం వేయడమే!
సాక్షి, న్యూఢిల్లీ : తూత్తుకుడిలోని స్టెరిలైట్ కాపర్ కంపెనీ (వేదాంత గ్రూప్)ని శాశ్వతంగా మూసివేస్తు తమిళనాడు ప్రభుత్వం సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేయడం చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం లాంటిదే. నీరు, గాలిని కలుషితం చేస్తున్న ఈ కంపెనీని మూసివేయాలంటూ మే 22వ తేదీన తూత్తుకుడి పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం, తమిళనాడు పోలీసులు నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరపడం, 13 మంది అమాయకులు మరణించడం తదితర పరిణాలు తెల్సినవే. ఈ సందర్భంగా పెల్లుబికిన ప్రజల ఆగ్రహంపై చన్నీళ్లు చల్లేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. భోపాల్లో యూనియన్ కార్బైడ్, కొడైకెనాల్లో యూని లివర్ కంపెనీలను మూసివేసినంత సులభంగా తూత్తుకుడి స్టెరిలైట్ కాపర్ కంపెనీకి తమిళనాడు ప్రభుత్వం తాళం వేసింది. రేపు ఇంతే సులభంగా కాపర్ కంపెనీ కోర్టు తలుపులు తట్టవచ్చు. స్టే ఉత్తర్వులను తెచ్చుకోనూ వచ్చు. ఆ ఉత్తర్వులను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా? ఏదేమైనా కంపెనీ తలుపులు మళ్లీ తెరచుకోకుండా అడ్డుకోగలదా? అందుకు అవసరమైన సమస్త సమాచారాన్ని సేకరించిందా? ఇప్పుడు సిద్ధంగా లేకపోయినా అప్పీళ్ల క్రమంలోనైనా ప్రభుత్వం కళ్లు తెరచి పటిష్ట వాదనతో కేసు గెలవచ్చు. భయంకరంగా కలుషితమైన కంపెనీ ఆవరణ, పరిసరాలను ఎవరు శుద్ధి చేస్తారు ? కంపెనీ కాలుష్యం కారణంగా తరతరాలు జబ్బు పడిన ప్రజలకు నష్ట పరిహారం ఎవరు చెల్లిస్తారు ? తమ పాపం ఏమీ లేకున్నా ఉన్నఫలంగా ఉద్యోగం ఊడిపోయిన దాదాపు 32 వేల మంది కార్మికులకు జీవనోపాధి ఎవరు కల్పిస్తారు? ఈ ప్రశ్నలన్నింటికి సరైన సమాధానం ప్రభుత్వం చూపినప్పుడే కంపెనీని శాశ్వతంగా మూసివేయడాన్ని ఎవరైనా సమర్థిస్తారు. అందుకు సార్థకత ఉంటుంది. కాపర్ కంపెనీ కోర్టుకెళితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కాలుష్య నియంత్రణా బోర్డు సలహాలను, సూచనలను మాత్రం తీసుకోవద్దు సుమా! ఇటు రాష్ట్ర కాలుష్య నియంత్రణా బోర్డు, అటు కేంద్ర పర్యావరణ శాఖలు స్టెరిలైట్ కాపర్ కంపెనీకి ఇంతకాలం ఊడిగం చేశాయి. ప్రభుత్వ పారిశ్రామిక నిబంధనల ప్రకారం స్టెరిలైట్ కంపెనీలను ‘రెడ్ క్యాటగిరీ’ జోన్లో మాత్రమే ఏర్పాటు చేయాలి. ‘స్పెషల్ ఇండస్ట్రీస్ అండ్ హజార్డస్ యూజ్ జోన్’ను రెడ్ క్యాటగిరీ జోన్గా వ్యవహరిస్తారు. అయితే తమిళనాడులోని తూత్తుకుడిలో మాత్రం ‘జనరల్ ఆర్ లైట్ ఇండస్ట్రీస్’ జోన్లో పాక్షికంగా ‘అగ్రికల్చర్ జోన్’లో పాక్షికంగా స్టెరిలైట్ కంపెనీని ఏర్పాటు చేశారు. పైగా అవసరమైన గ్రీన్కారిడర్ను కంపెనీ మెయింటెన్ చేయలేదు. 2007లో కంపెనీ తన స్మెల్టర్ (ముడిసరకును మండించి ద్రావకంగా మార్చేది)ను విస్తరించింది. తమ కంపెనీకి 172 హెక్టార్ల భూమి ఉందని, స్మెల్టర్ విస్తరణ వల్ల వచ్చే అధిక కాలుష్యాన్ని నివారించే చర్యలకు ఈ భూమి సరిపోతుందన్న వాదనతో స్మెల్టర్ను విస్తరించింది. స్మెల్టర్ విస్తరణలో కూడా ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలను కంపెనీ పాటించలేదు. 172 హెక్టార్ల భూమి ఉన్నట్లు 2007లో కంపెనీ ప్రకటించినప్పటికీ నేటికి కూడా 102.5 హెక్టార్లకు మించి భూమి లేదు. నిబంధనల ప్రకారం 123 మీటర్ల చిమ్నీని ఏర్పాటు చేయాలి. కంపెనీలో 60 మీటర్ల చిమ్నీ మాత్రమే ఉంది. అంటే స్థాపించిన దగ్గరి నుంచి విస్తరణ వరకు కంపెనీలో అన్నీ ఉల్లంఘనలే. కాలుష్యానికి కారణమవుతున్న ఈ కంపెనీ అందుకు నష్టపరిహార చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయలను జరిమానాగా చెల్లించాలని 2013లో సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వంద కోట్లను ప్రభుత్వం వసూలు చేసిందా? చేస్తే వాటిని ప్రభుత్వం ఎలా ఖర్చు పెట్టింది? అన్న ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి నేటికి సమాధానం లేదు. కంపెనీకి వ్యతిరేకంగా ప్రజల ఆందోళన తీవ్రమైన నేపథ్యంలో తనను తాను కాపాడు కోవడంలో భాగంగా తమిళనాడు కాలుష్య నిరోధక బోర్డు ఇటీవల కంపెనీకి విద్యుత్, నీటి సరఫరాలను నిలిపివేసింది. దీంతో కంపెనీ ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే కేబినెట్ నిర్ణయమంటూ రాష్ట్ర ప్రభుత్వం అప్పటికే మూతపడిన తలుపులకు తాళం వేసింది. -
స్టెరిలైట్ ప్లాంట్ మూసివేత
సాక్షి ప్రతినిధి, చెన్నై/తూత్తుకుడి: తమిళనాడులోని తూత్తుకుడిలో ఉన్న ‘స్టెరిలైట్’రాగి ప్లాంట్ను శాశ్వతంగా మూసేయాలని ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామి ఆదేశాలు జారీ చేశారు. కాలుష్యం వెదజల్లుతున్న ‘స్టెరిలైట్’రాగి కర్మాగారాన్ని మూసేయాలని వంద రోజులుగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకమవడం, పోలీసు కాల్పుల్లో 13 మంది చనిపోవడం తెల్సిందే. ఈ ఘటనపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో జిల్లా కలెక్టర్, ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. కాగా, సోమవారం కేబినెట్ భేటీ అనంతరం ఈ ప్లాంట్ను మూసేయాల్సిందిగా సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ జీవో విడుదలైన వెంటనే ట్యుటికోరిన్ జిల్లా అధికారులు స్టెరిలైట్ కాపర్ ప్లాంట్కు సీల్ వేశారు. 22 ఏళ్లుగా ఆందోళన వేదాంత లిమిటెడ్కు చెందిన ‘స్టెరిలైట్’కంపెనీ తమిళనాడులోని తూత్తుకుడిలో నాలుగు లక్షల టన్నుల వార్షిక సామర్థ్యంతో 1996లో ప్లాంటు స్థాపించి రాగిని ఉత్పత్తి చేస్తోంది. ఇక్కడ మైనింగ్తో భూగర్భ జలాలు తగ్గుతాయని, ఉద్గారాలు పర్యావరణాన్ని కలుషితం చేస్తాయని, కేన్సర్ వంటి రోగాలు ప్రబలుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్లాంట్ మూసివేతకు అప్పటి సీఎం జయలలిత ఆదేశించారు. ప్లాంటు కాలుష్యంపై తీసుకున్న చర్యలు తెలపాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ను వెంటనే విచారించలేమని సుప్రీం కోర్టు సోమవారం స్పష్టం చేసింది. -
ప్రజల నిరసనలతో దిగొచ్చిన ప్రభుత్వం
చెన్నై : స్టెరిలైట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా తూత్తుకుడిలో సాగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారిన అనంతరం ఆ రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. వేదంత లిమిటెడ్కు చెందిన స్టెరిలైట్ కాపర్ ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్సెల్వం చెప్పారు. స్టెరిలైట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల్లో, పోలీసుల కాల్పులకు గాయపడ్డ వారిని పన్నీర్సెల్వం పరామర్శించారు. ఈ నిరసనల్లో ఇప్పటికీ 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి నష్టపరిహారం చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇప్పుడిప్పుడే ఆ ప్రాంతంలో పరిస్థితులు సద్దుమణుగుతున్నాయి. కస్టమర్ల కోసం దుకాణాలు తెరుచుకుంటున్నాయి. మే 23 నుంచి రద్దు చేసిన ఇంటర్నెట్ సేవలు కూడా, అక్కడ ఆదివారం అర్థరాత్రి నుంచి పునరుద్ధరించారు. ‘దుకాణాలు తెరుచుకున్నాయి. పరిస్థితి సద్దుమణిగింది. కానీ ఫ్యాక్టరీని మూసివేసే వరకు నగరంలో పూర్తి ప్రశాంతత ఏర్పడదు’ అని తూత్తుకుడి ట్రేడర్స్ అసోసియేషన్ ఎస్ రాజ చెప్పారు. అదేవిధంగా నిరసనకారులపై కాల్పులు జరిపిన పోలీసు అధికారులపై నేర కేసు నమోదు చేయాలని రాజ అన్నారు. 13 మృతదేహాల్లో ఏడుగురికి పోస్టుమార్టం పూర్తి అయిందని రాజ చెప్పారు. మరోవైపు స్టెరిలైట్ కాపర్ యూనిట్ విస్తరణ పనులను నిలిపేయాలని మద్రాస్ హైకోర్టు సైతం ఆదేశించింది. ఆందోళనల్లో 13 మంది మృతిచెందడంపై తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు పంపింది. రెండు వారాల్లో నివేదికలు సమర్పించాలని కోరింది. ఈ ఘటనలపై వేదంత రిసోర్సస్ చైర్మన్ అనిల్ అగర్వాల్ తొలిసారి స్పందించారు. ప్రపంచంలో కేవలం 2 శాతం కాపర్ను మాత్రమే భారత్ ఉత్పత్తి చేస్తుందని, మిగతా అంతా కెనడా, మధ్యప్రాచ్య, యూరప్ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్టు తెలిపారు. ఇలాంటివన్నీ భారత్లోనే జరుగుతాయని, ప్రతీసారి, ప్రజాస్వామ్యాన్ని ప్రజలు చేతుల్లోకి తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మనం జీవితాంతం దిగుమతి చేసుకునే బతుకుదామా? అని ఆయన ప్రశ్నించారు. -
‘మోదీ వేరే దేశ ప్రధాని.. మౌనం సిగ్గుచేటు’
తూత్తుకుడి : తమిళనాడులోని తూత్తుకుడిలో జరిగిన ఘటనలపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పందించకపోవడంపై డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. ప్రధాని మౌనం సిగ్గుచేటని అన్నారు. మోదీ భారతదేశ ప్రధాన మంత్రా.. లేక వేరే దేశానికి ప్రధాన మంత్రా అని ప్రశ్నించారు. సోమవారం పార్టీ కార్యకర్తలతో ఆందోళన నిర్వహించిన స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడు కూడా ఇండియాలో భాగమే అని, దేశ ప్రధానిగా ఆయనకు కనీసం స్పందించే బాధ్యత కూడా లేదా అని అన్నారు. తూత్తుకుడిలో జరిగిన ఘటనల్లో 13 మంది పోలీసు తూటాలకు బలైనా ప్రధాని కనీసం నోరు మెదపకపోవడం ఏంటని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే తూత్తుకుడిని సందర్శించాలని లేక కేంద్ర మంత్రి నన్న పంపి పరిస్థితులను చక్కదిద్దాలని డిమాండ్ చేశారు. తూత్తుకుడి ఘటనపై అత్యవసర క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా డీఎంకే గతంలో తమిళనాడు ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. కాగా తూత్తుకుడిలోని కాపర్ యూనిట్ను మూసివేయాలని అక్కడి ప్రజలు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
జయలలిత ఆడియో క్లిప్పుల విడుదల
సాక్షి, చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మాట్లాడిన ఆడియో క్లిప్పులు వెలుగులోకి వచ్చాయి. జయ మృతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ వీటిని శనివారం విడుదల చేసింది. దాదాపు 1.07 నిమిషాల నిడివి ఉన్న తొలి ఆడియో క్లిప్లో ‘మీకు రక్తపోటు(బీపీ) ఎక్కువగా ఉంది. సిస్టోలిక్ పీడనం 140గా ఉంది’ అని జయకు డ్యూటీ డాక్టర్ చెప్పారు. ఆమె వెంటనే ‘డయాస్టోలిక్ పీడనం ఎంతుంది?’ అని అడిగారు. దీనికి 140/80 అని డాక్టర్ జవాబిచ్చారు. దీంతో ‘అయితే అది నాకు మామూలే’ అని జయలలిత సంతృప్తి వ్యక్తం చేశారు. శ్వాస తీసుకోవడంలో తనకు ఎదురవుతున్న ఇబ్బందిని కేఎస్ శివకుమార్ అనే వైద్యుడికి వివరిస్తూ.. ‘శ్వాస తీసుకున్నప్పడు వస్తున్న గురకలాంటి శబ్దం నాకు స్పష్టంగా విన్పిస్తోంది. అది సినిమా థియేటర్లో అభిమానులు వేసే విజిల్స్లా ఉంది’ అని జయలలిత చమత్కరించారు. కమిషన్ విడుదల చేసిన మరో 33 సెకన్ల ఆడియో క్లిప్లో డా.శివకుమార్ జయతో మాట్లాడుతూ.. గతంతో పోల్చుకుంటే శ్వాస తీసుకుంటున్నప్పుడు వస్తున్న శబ్దం తీవ్రత తగ్గిందని జయలలితకు చెప్పారు. దీంతో ఆమె వెంటనే స్పందిస్తూ.. ‘గురకలాంటి శబ్దం ఎక్కువగా ఉండగానే రికార్డు చేసేందుకు మొబైల్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేయమని మీకు చెప్పాను. మీరేమో కుదరదన్నారు’ అని వ్యాఖ్యానించారు. దీంతో కుమార్ ‘మీరు చెప్పిన వెంటనే మొబైల్లో డౌన్లోడ్ చేశాను’ అని సమాధానమిచ్చారు. అలాగే ఆస్పత్రిలో భోజనానికి సంబంధించి జయలలిత రాసుకున్న లిస్ట్ను కమిషన్ బహిర్గతం చేసింది. కాగా, తూత్తుకుడి కాల్పుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రభుత్వం ఈ ఆడియో క్లిప్పులను విడుదల చేయించిందని ప్రతిపక్ష నేత స్టాలిన్ ఆరోపించారు. 2016, సెప్టెంబర్ 22న అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత 75 రోజుల చికిత్స అనంతరం డిసెంబర్ 5న చనిపోయారు. చికిత్స సమయంలో జయను ఎవ్వరికీ చూపకపోవడంతో ఆమె మరణంపై అనుమానాలు తలెత్తాయి. వీటిని నివృత్తి చేసేందుకు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ విచారణలో భాగంగా జయకు చికిత్స అందించిన వైద్యులు, అపోలో ఆస్పత్రి చీఫ్ ప్రతాప్.సి. రెడ్డి, జయ నెచ్చెలి శశికళ సహా పలువురి వాంగ్మూలాలను నమోదు చేశారు. -
తూత్తుకుడి: పోలీస్స్టేషన్పై పెట్రోబాంబ్ దాడి
తూత్తుకుడి : స్టెరిలైట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా కొన్ని రోజులుగా నిరసనలతో అట్టుడుకుతున్న తూత్తుకుడి ఇంకా రగులుతునే ఉంది. పోలీసులను లక్ష్యంగా చేసుకుని శనివారం దుండగులు పెట్రోల్ బాంబు దాడి చేశారు. తూత్తుకుడిలోని పోలీసుస్టేషన్పై పెట్రోల్ బాంబు విసిరారు. పోలీసులపై రాళ్లతో దాడి చేస్తూ.. తరుముతున్న ఆందోళనకారులు. నాలుగు రోజుల క్రితం పోలీసుల కాల్పుల్లో 13 మంది ఆందోళనకారులు మరణించిన విషయం తెలిసిందే. అయినా నిరసనకారులు వెనక్కి తగ్గట్లేదు. ఇది చదవండి: రణరంగంగా తూత్తుకుడి -
‘13 మంది రక్తం తాగిన పళనిస్వామి ప్రభుత్వం’
సాక్షి, చెన్నై: పళనిస్వామి ప్రభుత్వం రక్తం రుచి మరిగిందని డీఎంకే నాయకురాలు కనిమొళి మండిపడ్డారు. తూత్తుకుడి (ట్యూటికోరిన్)లో వేదాంత గ్రూపునకు చెందిన స్టెరిలైట్ పరిశ్రమ విస్తరణను అడ్డుకోవడానికి స్థానికులు, పర్యావరణ కార్యకర్తలు మంగళవారం నిరసన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళన కారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది మృతి చెందారు. వారికి సంతాపం ప్రకటిస్తూ కనిమొళి ఆధ్వర్యంలో శుక్రవారం తూత్తుకుడిలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. డీఎంకేతో పాటు కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ తీరుపై నిరసన తెలుపుతున్న కనిమొళితో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కి తరలించారు. స్టెరిలైట్ పరిశ్రమ వల్ల తమ బతుకులు బుగ్గిపాలవుతున్నాయని ఎదురు తిరిగిన అమాయకులను ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 13 మందిని పొలీసుల తూటాలు బలితీసుకుంటే ఆత్మరక్షణ కోసం జరిగిన కాల్పుల్లో వారు మృతి చెందారని ముఖ్యమంత్రి ప్రకటించడం సిగ్గుచేటని కనిమొళి మండిపడ్డారు. ఈ హత్యా ఘటనకు ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు. పరిస్థితి అదుపులోనే ఉంది.. తూత్తుకుడిలో ప్రజా ఆందోళనలు తగ్గుముఖం పట్టాయని జిల్లా ఎస్పీ మురళీ రాంబ తెలిపారు. పరిస్థితిలో అదుపులోనే ఉందనీ.. శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు పట్టణంలో సరిపడా బలగాలను మోహరించామని అన్నారు. కాగా, ప్రజల ఆందోళనల నేపథ్యంలో పర్యావరణ హితం కోరి స్టెరిలైట్ పరిశ్రమ విస్తరణను నిలిపి వేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అధికారులు పరిశ్రమకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ‘ప్రభుత్వం స్టెరిలైట్ పరిశ్రమపై తీసుకునే చర్యలపై ఒక స్పష్టత వచ్చింది. పరిశ్రమను అడ్డుకునేందుకు ప్రభుత్వం సిధ్దంగా ఉంది’అని తూత్తుకుడి జిల్లా కలెక్టర్ సందీప్ నండూరి తెలిపారు. టీఎన్పీసీబీ అనుమతులను రెన్యువల్ చేయకుండానే పరిశ్రమను నడపాలని చూస్తున్నారని కాలుష్య నియంత్రణ బోర్డు ఆరోపించింది. -
తూత్తుకుడి: సీబీఐతో విచారణ జరిపించాలి
సాక్షి, చెన్నై: తూత్తుకుడిలో స్టెరిలైట్ కర్మాగారం విస్తరణను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 11 మంది మరణించిన విషయం తెలిసిందే. కాల్పులకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు నేడు తమిళనాడు వ్యాప్తంగా బంద్కి పిలుపునిచ్చాయి. బంద్లో ప్రధాన ప్రతిపక్షం డీఎంకేతో సహా కాంగ్రెస్, వామపక్షలు, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. బంద్లో పాల్గొన్న డీఎంకే నేత కనిమొళితో సహా, ఇతర ప్రధాన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా తుత్తుకుడి ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని న్యాయవాది జీఎస్ మణి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ వచ్చే వారం విచారణకు అవకాశం ఉంది. కాగా పిటిషన్లో పూర్తి వివరాలను పొందుపరిచి సోమవారం మరో పిటిషన్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు న్యాయవాదిని ఆదేశించింది. -
కాల్పుల వెనుక కన్నీటి గాథలు
తమిళనాడులోని దక్షిణాది జిల్లాలో తరచూ చోటుచేసుకుంటున్న పోలీసు కాల్పుల వెనుక హృదయాంతరాలను తడిచేసే కన్నీటిగాథలు దాగి ఉన్నాయి. సమస్యల పరిష్కారంపై సాగుతున్న ఆందోళనల్లో అమాయకులే అధికశాతం అశువులు బాస్తున్నారు. దక్షిణాది జిల్లాలో చోటుచేసుకున్న పెద్ద సంఘటనల్లో మూడోదిగా చరిత్రకెక్కిన తూత్తుకూడిలో పోలీసు కాల్పులు ఇందుకు మినహాయింపు కాదు. సాక్షి ప్రతినిధి, చెన్నై: కరువు కాటకాలు, నిరుద్యోగం, కుల, మత, జాతి విధ్వేషాలు వంటి కారణాలతో ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ ఆందోళనలను అణిచివేసే క్రమంలో పోలీసులు అనుసరిస్తున్న విధానం విధ్వంసాలకు దారితీస్తోంది. విధ్వంసాలు వికటించి ఆమాయకులు అర్ధాయుష్షులుగా మరణిస్తున్నారు. వేతనాలు పెంచాలని కోరుతూ తిరునెల్వేలిలోని తేయాకు తోటల కార్మికులు 1999 జూలై 23వ తేదీన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు చేసిన లాఠీచార్జి నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నంలో కొందరు తామిరభరణి నదిలోకి దూకారు. ఒకటిన్నర ఏడాది వయసు చిన్నారి విఘ్నేష్తోపాటు మొత్తం 16 మంది నదీ ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ అధికారులు, మీడియా ప్రతినిధులు కలుపుకుని సుమారు 500 మంది గాయపడ్డారు. తిరువారూరు జిల్లా పరమకుడిలో 2011 సెప్టెంబరు 11వ తేదీ జరిగిన ఇమ్మానువేల్ గురుపూజ ప్రజల మధ్య ఘర్షణలకు దారితీసింది. ఈ సమయంలో ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మరణించారు. అలాగే ఇటీవల తూత్తుకూడిలో స్టెరిలైట్ ఆందోళనలు 13 మందిని పొట్టనపెట్టుకున్నాయి. తాజా కాల్పుల్లోనూ కన్నీటి వెతలు తూత్తుకూడిలో ఆందోళనకారుల్లో విధ్వంసాలు సృష్టించేవారే లక్ష్యంగా గురిపెట్టిన తుపాకులు అమాయకుల ప్రాణాలను బలిగొన్న కన్నీటి గాథలు వెలుగులోకి వస్తున్నాయి. తూత్తుకూడి అన్నైవేళాంగణి నగర్లో నివసించే సెల్వరాజ్ (46) జిల్లాకలెక్టర్ కార్యాలయం సమీపంలోని ఒక ప్రయివేటు సంస్థలో పనిచేస్తున్నాడు. అతని కుమార్తె జెన్నిఫర్ ఇటీవలే పుష్పవతి కావడంతో బంధుమిత్రుల మధ్య వేడుక జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈనెల 22వ తేదీన సెల్వరాజ్ ఆఫీసుకు వెళుతూ.. ‘సాయంత్రం ముందుగా వస్తాను, ఇద్దరం కలిసి బంధువులకు ఆహ్వానపత్రికలు పంచుతాం’ అని భార్యతో చెప్పి బయలుదేరాడు. సాయంత్రం విధులు ముగించుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయం మీదుగా ఇంటికి వస్తుండగా పోలీసు తూటా సెల్వరాజ్ గుండెను చీల్చేసి ప్రాణాలను హరించింది. పదోతరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వెనిస్టా (17) అనే బాలిక కూడా ప్రాణాలు కోల్పోయింది. అలాగే గ్రేస్పురానికి చెందిన ప్రభు (36) అనే మత్స్యకారుడు పొరపాటున నిరసనకారుల మధ్య చిక్కుకున్నాడు. లాఠీదెబ్బలు, తూటా గాయాలతో రక్తం ఓడుతూ ఇంటికి చేరిన అతడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. రబ్బర్ తూటాల మాటేమిటి ఇటీవల కాలంలో ప్రపంచ దేశాలు మానవహక్కులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ చట్టాలను కఠినంగా మార్చడంతోపాటు ఖచ్చితంగా అమలు చేస్తున్నాయి. శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడినపుడు తప్పనిసరై కాల్పులు జరపాల్సివచ్చినా ముందుగా రబ్బర్ తూటాలను ప్రయోగిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు వ్యతిరేకంగా అందోళనలు జరిగినపుడు, రష్యా తదితర దేశాల్లో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాలు చోటుచేసుకున్నపుడు రబ్బర్ తూటాలనే వినియోగించారు. రబ్బర్ తూటాలు శరీరంలోకి ప్రవేశించినా గాయాలు తగులుతాయేగానీ ప్రాణాపాయం ఏర్పడదు. పైగా రబ్బర్ తుటాలను ఎన్ని రౌండ్లయినా ప్రయోగించవచ్చు, బుల్లెట్లకు పరిమితి ఉంటుంది. ఇటీవలి కాలంలో భారత్లో రబ్బర్ తూటాలను వాడుతున్నారు. ముఖ్యంగా ఘర్షణలకు నెలవైనా జమ్మూ కాశ్మీర్లో పోలీసులు, ఇతర భద్రతా దళాలు సరిహద్దు ఆందోళన కారులపై రబ్బర్ తుటాలనే ప్రయోగిస్తున్నారు. మరి ఇలాంటి వెసులుబాటు ఉండగా తూత్తుకూడి ఆందోళనల్లో రబ్బర్ తూటాలను ఎందుకు వినియోగించలేదనే ప్రశ్న తలెత్తింది. పైగా కిలోమీటరు దూరం వరకు బుల్లెట్ దూసుకుపోగల ఏకే 47, తదితర అత్యాధునిక తుపాకులను తూత్తుకూడి కాల్పులకు వినియోగించినట్లు సమాచారం. కాల్పులు జరిగి మూడురోజులైనా తూత్తుకూడిలో సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. వాహనాలు తిరగడం లేదు. అంగళ్లు తెరుచుకోలేదు. ప్రజలు స్వేచ్ఛగా బయటతిరిగే పరిస్థితి లేదు. పైగా స్టెరిలైట్, తుపాకీ కాల్పులపై నిరసనలు రాష్ట్రం నలుమూలకు పాకాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి కేంద్ర బలగాలు వస్తాయనే ప్రచారం జరుగుతోంది. మరోసారి కాల్పులు చోటుచేసుకుంటే అమాయకుల ప్రాణాల మాటేమిటనే భయాందోళనలు నెలకొన్నాయి. సుమోటా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ తూత్తుకూడి కాల్పుల ఘటన దేశం మొత్తాన్ని కదిలించివేయగా జాతీయ మానవహక్కుల కమిషన్ ఈ కాల్పుల ఘటనను సుమోటాగా స్వీకరించి ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ర్యాలీగా వెళుతున్న వారిపై తుపాకీ కాల్పులకు ఆదేశించింది ఎవరు, కాల్పులకు ముందు హెచ్చరికలు జారీచేశారా, తుపాకీ కాల్పుల్లో నిబంధనలను పాటించారా అనే మూడు ప్రధాన ప్రశ్నలను కమిషన్ సంధించింది. తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించిందంటే కాల్పుల సమయంలో నిబంధన ఉల్లంఘనను ఊహించుకోవచ్చు. -
చిన్నపిల్లలు సార్.. వదిలేయండి
సాక్షి, చెన్నై: తూత్తుకుడి హింసపై నేడు(శుక్రవారం) తమిళనాడు బంద్కు ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి. స్టెరిలైట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా స్థానికులు చేపట్టిన ఆందోళన పోలీసుల కాల్పులతో హింసాత్మకంగా మారింది. మొత్తం 13 మంది మరణించినట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. పైగా ముఖ్యమంత్రి పళనిస్వామి, ఆందోళనకారులపై పోలీసుల దమనకాండను సమర్థిస్తూ ప్రకటన చేయటం ప్రతిపక్షాల్లో ఆగ్రహన్ని తెప్పించింది. మరోవైపు లాఠీఛార్జీ సమయంలో కొందరు రిపోర్టర్లు చేసిన లైవ్ రిపోర్టింగ్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చిన్న పిల్లలను అని కూడా చితకబాదటంతో ఓ రిపోర్టర్ అడ్డుకున్నారు. లైవ్ కవరేజ్ చేస్తున్న ఆ రిపోర్టర్కు, పోలీసులకు మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది. రిపోర్టర్: నిరసనకారులను పోలీసులు అణచివేస్తున్నారు. చిన్న పిల్లలనీ కూడా చూడకుండా ఇష్టమొచ్చినట్లు బాదుతున్నారు. ఇంతలో ఓ కానిస్టేబుల్ జోక్యం చేసుకుంటూ... : అదే నిరసనకారులంతా కలిసి ఓ పోలీస్ అధికారిని చితకబాదినప్పుడు మీ మీడియా ఎక్కడికి పోయింది? ఎందుకు కవరేజ్ చెయ్యలేదు? ఇప్పుడు మాపై ఎందుకు నిందలేస్తున్నారు? రిపోర్టర్: కానీ, మీరు 11 మందిని కాల్చి చంపారుగా... పోలీసులు: మేం కాల్చలేదు. ఎవరు చంపారో వారినే అడగండి. రిపోర్టర్: చిన్నపిల్లలు సార్.. దయచేసి వారిని వదిలేయండి పోలీసులు: ఇంతకీ ఎవరు నువ్వు? ఏ ఛానెల్? రిపోర్టర్: వికటన్ ఈ-మాగ్జైన్ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘బుల్లెట్ తగిలి తీవ్ర రక్తస్రావమైన ఓ యువకుడిని సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లకపోగా, నటించింది ఇక చాలూ ఇక్కడి నుంచి వెళ్లు... అంటూ పోలీసులు కసురుసుకోవటం, ఆ యువకుడు అక్కడికక్కడే చనిపోవటం...’ ఆ వీడియో కూడా నిన్నంతా చక్కర్లు కొట్టింది. పోలీసుల లాఠీఛార్జీలో 2, కాల్పుల్లో 11 మంది మొత్తం 13 మంది నిరసనకారులు ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో ఇప్పటివరకు ప్రాణాలు విడిచారు. ఇక నిషేధాజ్ఞలను ధిక్కరించి తూత్తుకుడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన స్టాలిన్, వైగో, కమల్ హాసన్ తదితర నాయకులపై కేసులు నమోదయ్యాయి. -
చిన్నపిల్లలు సార్.. వదిలేయండి
-
నేడు తమిళనాడు బంద్కు విపక్షాల పిలుపు
-
నేడు తమిళనాడు బంద్
సాక్షి ప్రతినిధి, చెన్నై: తూత్తుకుడి హింసాకాండకు వ్యతిరేకంగా శుక్రవారం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటించాలని ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి. కాల్పులపై డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్తో చర్చించేందుకు సీఎం పళనిస్వామి నిరాకరించడంతో డీఎంకే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సచివాలయం ఎదుట రాస్తారోకో నిర్వహించారు. స్టెరిలైట్ యూనిట్కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగాయి. మదురై, కన్యాకుమారి, తిరునల్వేలి జిల్లాల్లో నిరసనకారులు బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాల మేరకు స్టెరిలైట్ కర్మాగారానికి విద్యుత్ సరఫరాను నిలిపేశారు. నిషేధాజ్ఞలను ధిక్కరించి తూత్తుకుడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన స్టాలిన్, వైగో, కమల్ హాసన్ తదితర నాయకులపై కేసులు నమోదయ్యాయి. -
‘కనీసం ఒక్కరైనా చావాల్సిందే’
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడులోని తూత్తుకుడిలో ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయాసపడుతోంది. వేదాంత స్టెరిలైట్ కంపెనీ విస్తరణను వ్యతిరేకిస్తూ మంగళవారం ప్రజలు జరిపిన నిరసన ప్రదర్శన హింసాకాండకు దారితీయడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆ రోజు 11 మంది మరణించడం కొన్ని వందల మంది గాయపడడం తెల్సిందే. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు కాల్పులు జరపక తప్పలేదని రాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకుంటోందిగానీ, పోలీసుల అనుచిత చర్యను సామాజిక కార్యకర్తలు, మానవ హక్కుల సంఘాలతోపాటు సోషల్ మీడియా తీవ్రంగా ఖండిస్తోంది. పోలీసుల రాక్షసత్వాన్ని ఎండగడుతూ పలు మీడియాలో కార్టూన్లు దర్శనమిస్తున్నాయి. పోలీసులు జరిపిన కాల్పులకు సంబంధించిన వీడియో దృశ్యాలను చూస్తూంటే వారి అనాగరిక చర్య, అనుచిత ప్రవర్తన స్పష్టంగా కనిపిస్తోంది. ఓ పోలీసు వ్యాన్పై పడుకొని ఓ పోలీసు జవాను ప్రదర్శకులపైకి తుపాకీ ఎక్కుపెట్టడం, ‘కనీసం ఒక్కరైనా చావాల్సిందే’నంటూ మరో పోలీసు వ్యాఖ్యానించడం వీడియో దృశ్యాల్లో స్పష్టంగా వినిపించింది. మరోచోట తీవ్ర గాయాలపాలై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ యువకుడి చుట్టూ పోలీసులు ఉన్నా అతన్ని ఆస్పత్రికి తరలించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా ‘నటించకు, లే’ అంటూ హేళన చేశారు. కలియప్పన్ అనే ఆ 22 ఏళ్ల యువకుడిని ఆ తర్వాత ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలోనే మరణించారు. కాల్పుల్లో మరణించిన వారి ముఖాలపై, మొండాలపైనే ఎక్కువగా బుల్లెట్ గాయాలున్నాయంటూ సామాజిక కార్యకర్తలు చూపిన ఫొటోలు ‘పరిస్థితిని అదుపుచేసేందుకు పాటించాల్సిన జాగ్రత్తలు’ ఏవీ పోలీసులు పాటించలేదనే విషయాన్ని సూచిస్తున్నాయి. విధ్వంసానికి దిగిన గుంపును చెదరగొట్టేందుకు ముందుగా పోలీసులు లాఠీఛార్జి చేయాలి. పరిస్థితి అదుపులోకి రాకపోతే భాష్పవాయువు గోళాలను ప్రయోగించాలి. అయినా ఫలితం లేకపోతే గాలిలోకి కాల్పులు జరపాలి. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోతే ఆందోళనాకారుల పాదాలు, కాళ్లకు తగిలేలా మాత్రమే కాల్పులు జరపాలి. లాఠీచార్జి చేసినా ఫలితం లేనప్పుడు భాష్ప వాయువు గోళాలను, వాటర్ క్యానన్లు ఉపయోగించాలని, అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోతే రబ్బర్ బుల్లెట్లు కాల్చాలని, అవసరమైతే పెల్లెట్ గనులు ఉపయోగించాలని, పెల్లెట్ గున్నుల వల్ల మనుషులు గాయపడతారు తప్ప చనిపోరని తమిళనాడు మాజీ డీజీపీ ఆర్. నటరాజ్ వివరించారు. తూత్తుకుడిలో ముందుగా ప్రజలు రెచ్చిపోయి హింసాకాండకు దిగలేదని, తొలుత దారిని అడ్డుకున్న పోలీసులపైకి రాళ్లు మాత్రమే రువ్వారని, పోలీసులు ఎకాఎకి కాల్పులు జరపడంతోనే ప్రజలు రెచ్చిపోయారని స్థానికులు చెబుతున్నారు. తమిళనాడు కాల్పుల సంఘటనను జాతీయ మానవ హక్కుల సంఘటనను తనంతట తానే తీవ్రమైన అంశంగా పరిగణించి తమిళనాడు ప్రభుత్వానికి, పోలీసు శాఖకు నోటీసులు జారీ చేస్తోంది. -
తూత్తుకుడి
తూత్తుకుడి : గత కొద్ది రోజులుగా తూత్తుకుడిలోని స్టెరిలైట్ కాపర్(రాగి) కంపెనీని మూసివేయాలని జరుగుతున్న ఉద్యమం కారణంగా 32వేల ఉద్యోగాలకు గండి పడనుంది. ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో 32వేల ఉద్యోగాలకు కోత విధించాలని యాజమాన్యం భావిస్తోంది. స్టెరిలైట్ కాపర్ కంపెనీపై ఆధారపడి ప్రస్తుతం ప్రత్యక్షంగా 3,500, పరోక్షంగా దాదాపు 30వేల మంది ఉపాది పొందుతున్నారు. కేవలం 1000 మందిని మాత్రమే పనిలో ఉంచుకోవాలని మిగిలిన వారిని తొలగించాలని యాజమాన్యం భావిస్తోంది. ఉద్యమం కొనసాగినంత కాలం పరోక్షంగా కంపెనీలో పని చేస్తున్న వారిని తొలగించాలని చూస్తోంది. కొన్ని మరమ్మత్తుల కారణంగా కంపెనీ మార్చి27 నుంచి మూసివేశామని మళ్లీ జూన్ మొదటి వారంలో తిరిగి తెరుస్తామని యాజమాన్యం తెలిపింది. కంపెనీ వ్యర్థాల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో వాతావరణం దెబ్బతింటోందని, భూగర్భ జలాలు కలుషితం అవ్వడంతో పాటు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ గత 100రోజులుగా స్థానికులు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది చనిపోగా పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. -
రక్తమోడుతున్న కనికరించలేదు: వీడియో వైరల్
తూత్తుకూడి : దక్షిణ తమిళనాడులోని తూత్తుకుడి పట్టణంలో వేదాంత కంపెనీకి చెందిన స్టెరిలైట్ కాపర్(రాగి) యూనిట్ విస్తరణ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా బుధవారం అన్నానగర్ ప్రాంతంలో బంద్ నిర్వహిస్తున్న ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో 22 ఏళ్ల కలియప్పన్ అనే వ్యక్తి బుల్లెట్ తగిలి మరణించాడు. అయితే అతని మరణానికి ప్రధాన కారణం పోలీసుల నిర్లక్ష్య వైఖరే. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతని చూట్టూ పోలీసులు మూగారు. అతని పరిస్థితేంటో కూడా తెలుసుకోకుండా ఓ పోలీసు లాఠీతో బెదిరిస్తూ...‘నటించింది చాలు ఇక వెళ్లు’ అని కసురుకున్నాడు . బుల్లెట్ తగిలి తీవ్ర రక్తస్రావమైన అతడిని సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. గాయాలతో రక్తమోడుతున్న వ్యక్తి పట్ల కనీసం కనికరం కూడా చూపకుండా కర్కశంగా ప్రవర్తించిన పోలీసుల వైఖరిని అందరూ తప్పుపడుతున్నారు. తూత్తుకుడిలోని స్టెరిలైట్ రాగి కర్మాగారాన్ని మూసివేయాలని ఆందోళన చేస్తున్న ప్రజలపై పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో 22 ఏళ్ల కలియప్పన్ అనే వ్యక్తికి బుల్లెట్ తగిలింది. దాంతో బాధ భరించలేక అతను అక్కడే కుప్పకూలిపోయాడు. అది చూసిన ఓ పోలీసు అధికారి కనీసం ఆస్పత్రికి కూడా తరలించకుండా ‘నటించింది చాలు ఇక వెళ్లు’ అని అనడం అక్కడే ఉన్న ఓ రిపోర్టర్ వీడియో తీశాడు. దాంతో ఈ వీడియో కాస్తా సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దారుణ ఘటనలో ఇప్పటివరకు కలియప్పన్తో కలిపి 13 మంది మరణించారు. ముందస్తు హెచ్చరికలు లేకుండా ప్రజలపై కాల్పులు జరిపినందుకు గానూ తూత్తుకుడి జిల్లా కలెక్టర్, పోలీసు అధికారిని బుధవారం బదిలీ చేశారు. కానీ పోలీసులు మాత్రం ఆందోళనకారులు తమపై రాళ్లు రువ్వడం వల్లే తాము కాల్పులు జరపాల్సి వచ్చిందని తెలిపారు. ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. కాల్పులు జరుపుతున్న సమయంలో ఓ పోలీసు అధికారి బస్సు పైకి ఎక్కి ‘కనీసం ఒక్కరైనా చావాలి’ అని అంటున్న వీడియో వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. -
తూత్తుకుడి ఎఫెక్ట్: 32వేల ఉద్యోగాలకు గండి
తూత్తుకుడి : గత కొద్ది రోజులుగా తూత్తుకుడిలోని స్టెరిలైట్ కాపర్(రాగి) కంపెనీని మూసివేయాలని జరుగుతున్న ఉద్యమం కారణంగా 32వేల ఉద్యోగాలకు గండి పడనుంది. ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో 32వేల ఉద్యోగాలకు కోత విధించాలని యాజమాన్యం భావిస్తోంది. స్టెరిలైట్ కాపర్ కంపెనీపై ఆధారపడి ప్రస్తుతం ప్రత్యక్షంగా 3,500, పరోక్షంగా దాదాపు 30వేల మంది ఉపాది పొందుతున్నారు. కేవలం 1000 మందిని మాత్రమే పనిలో ఉంచుకోవాలని మిగిలిన వారిని తొలగించాలని యాజమాన్యం భావిస్తోంది. ఉద్యమం కొనసాగినంత కాలం పరోక్షంగా కంపెనీలో పని చేస్తున్న వారిని తొలగించాలని చూస్తోంది. కొన్ని మరమ్మత్తుల కారణంగా కంపెనీ మార్చి27 నుంచి మూసివేశామని మళ్లీ జూన్ మొదటి వారంలో తిరిగి తెరుస్తామని యాజమాన్యం తెలిపింది. కంపెనీ వ్యర్థాల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో వాతావరణం దెబ్బతింటోందని, భూగర్భ జలాలు కలుషితం అవ్వడంతో పాటు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ గత 100రోజులుగా స్థానికులు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది చనిపోగా పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. -
రణరంగంగా తూత్తుకుడి
సాక్షి ప్రతినిధి, చెన్నై: వేదాంత కంపెనీ స్టెరిలైట్ కాపర్ యూనిట్కు వ్యతిరేకంగా తూత్తుకుడిలో వరుసగా రెండో రోజు ఆందోళనలు కొనసాగాయి. బుధవారం పోలీసులు జరిపిన కాల్పులకు 22 ఏళ్ల యువకుడు బలయ్యాడు. మంగళవారం నాటి కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి కూడా మృతిచెందాడు. దీంతో రెండ్రోజుల వ్యవధిలో ఇక్కడ మృతిచెందిన వారి సంఖ్య 13కు పెరిగింది. ఆందోళనకారులు అన్నానగర్లో బుధవారం కూడా పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. పోలీసులపైకి రాళ్లు, ఇటుకలు రువ్వడంతో వారు కాల్పులు జరిపారు. తూత్తుకుడి హింసాత్మక ఘటనలపై విచారణ జరిపేందుకు తమిళనాడు ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో కమిటీని నియమించింది. మరోవైపు, స్టెరిలైట్ కాపర్ యూనిట్ విస్తరణ పనులను నిలిపేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఆందోళనల్లో 13 మంది మృతిచెందడంపై తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు పంపింది. రెం డు వారాల్లో నివేదికలు సమర్పించాలని కోరింది. -
స్టెరిలైట్ వ్యతిరేక ఉద్యమం; తూత్తుకుడిలో కాల్పులు
తూత్తుకుడి: దక్షిణ తమిళనాడులోని తీరపట్టణం తూత్తుకుడిలో మళ్లీ హింస చెలరేగింది. పట్టణంలోని అన్నానగర్ ప్రాంతంలో బుధవారం బంద్ నిర్వహిస్తున్న ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరుపగా ఒకరు చనిపోయారు. మరో ముగ్గురికి బుల్లెట్ గాయాలయ్యాయి. తోటి ఆందోళనకారులు వెంటనే స్పందించి వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. 24 గంటల్లోపే మరోసారి కాల్పులు చోటుచేసుకోవడంతో నిరసనకారులు తీవ్రఆగ్రహంతో రగిలిపోతున్నారు. తూత్తుకుడి పట్టణంలో వేదాంత కంపెనీకి చెందిన స్టెరిలైట్ కాపర్(రాగి) యూనిట్ విస్తరణ ప్రతిపాదనల్ని వ్యతిరేకిస్తోన్న స్థానికులు గడిచిన 100 రోజులుగా నిరసనలు చేస్తున్నారు. అయితే నిరసనోద్యమం మంగళవారంనాడు ఒక్కసారిగా హింసాయుతమలుపు తిరిగింది. పెద్ద సంఖ్యలో జనం రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు. వారిని అడ్డుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరుపగా 11 మంది ఆందోళనకారులు చనిపోయారు. ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ అఖిలపక్షం బుధవారం తుత్తూకుడి బంద్కు పిలుపిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అలజడిరేపిన ఈ ఘటనపై మద్రాస్ హైకోర్టు సైతం కలుగజేసుకుంది. కాపర్ ప్లాంట్ విస్తరణను నిలిపేయాలంటూ ఆదేశాలు జారీచేసింది. వ్యతిరేకత ఎందుకు? మానవాభివృద్ధి సూచిలో చెన్నైనగరం తర్వాత రెండో స్థానంలో ఉన్న తూత్తుకుడి పట్టణంలో పర్యావరణ కాలుష్యంతో పాటు భూగర్భ జలాల నిల్వలకు పెనుముప్పుగా మారిన వేదాంత కాపర్ యూనిట్ని మూసేయాలని స్థానికులు చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు కంపెనీ విస్తరణా ప్రణాళికలు రచించటం వారిలో ఆగ్రహాన్ని మరింత పెంచింది. తూత్తుకుడిలో స్టెరిలైట్ కంపెనీ గత 20 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దాని నుంచి వస్తున్న రసాయనాల వల్ల కళ్లు మండుతున్నాయని, ఇతర అలర్జీలు వస్తున్నాయని ప్రజలు ఫిర్యాదుచేయడంతో 2013లో అప్పటి సీఎం జయలలిత ఆ కంపెనీని మూసివేయాలని ఆదేశించారు. అయితే ప్రభుత్వ ఉత్తర్వులను జాతీయ హరిత ట్రిబ్యునల్ తిరస్కరించడంతో కంపెనీ తిరిగి తెరుచుకుంది. రాగిని కరిగించే ప్రక్రియ వల్ల ఆ ప్రాంతంలో సీసం, ఆర్సెనిక్, సెలీనియం, అల్యూమినియం, రాగితో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. -
ఎందుకు తూత్తుకూడి రక్తసిక్తం?
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడులోని తూత్తుకూడిలో కాలుష్యానికి కారణమవుతున్న వేదాంత స్టెరిలైట్ కాపర్ కంపెనీని 1996లో ఏర్పాటు చేశారు. రోజుకు 1200 టన్నుల అనోడ్స్ (విద్యుత్ గ్రాహక రాగి రాడ్లు)ను ఈ ఫ్యాక్టరీ ఉత్పత్తి చేస్తోంది. ప్రస్తుతమున్న ఈ సామర్థ్యాన్ని కంపెనీ రెండింతలు చేయాలనుకుంటోంది. దీని వల్ల అధిక సాంద్రత గల అక్కడి జనాభాపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది. కంపెనీకి పది కిలోమీటర్ల వ్యాసార్ధం పరిధిలో ఎనిమిది పట్టణాలు, 27 గ్రామాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 4.6 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. కంపెనీ నుంచి వెలువడే సల్ఫర్ డైఆక్సైడ్, రేణువులు కాలుష్యానికి కారణం అవుతున్నాయని ప్రాజెక్ట్ పర్యావరణ ప్రభావం అంచనా నివేదిక 2015 సంవత్సరంలోనే వెల్లడించింది. కంపెనీ కారణంగా నీరు, వాయు కాలుష్యం ఏర్పడుతోందని గత రెండు దశాబ్దాలుగా స్థానిక ప్రజలు ఆందోళన చేస్తున్నారు. కొన్నేళ్ల వరకు కంపెనీ నుంచి కాలుష్యం ప్రభావాన్ని తాము అంచనా వేయలేకపోయామని, కొన్నేళ్ల క్రితం నుంచే ఆ ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నామని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాలుష్యం కారణంగా ప్రతి ఇంటిలో కనీసం ఇద్దరు అస్వస్థులవుతున్నారని, ముఖ్యంగా పిల్లలపై కాలుష్యం ప్రభావం ప్రాణాంతకంగా ఉంటోందని వారు చెబుతున్నారు. కంపెనీని మరింత విస్తరిస్తున్నట్లు సమీపంలోని కుమారెడ్యార్పురం గ్రామస్థులకు ముందుగా తెల్సింది. మొదట చిన్న స్థాయిలో ప్రజల నిరసన ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత అవి ఊపందుకున్నాయి. మంగళవారం నాడు తూత్తుకూడిలో వేలాది మంది ప్రజలు నిరసన ప్రదర్శన జరిపారు. అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు కలెక్టర్ కార్యాలయాన్ని చుట్టుముట్టాలని నెల రోజుల క్రితమే నిర్ణయించామని, ఈ విషయం కలెక్టర్కు తెలిసి ఆయన ఆదివారం నాడు తమతో శాంతి చర్చలు జరిపారని సెల్వరాజ్ అనే స్థానికుడు తెలిపారు. తమకు కావాల్సింది శాంతి కాదని, కంపెనీ విస్తరణను అడ్డుకోవడమే ముఖ్యమంటూ తాము కలెక్టర్కు కూడా స్పష్టం చేశామని సుందరరామమూర్తి అనే మరో గ్రామస్థుడు తెలిపారు. ఆదివారం నాడు కలెక్టర్ శాంతి సమావేశాన్ని నిర్వహించిన తర్వాత కూడా మంగళవారం నాడు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి నిరసన తెలియజేయాలని గ్రామస్థులు నిర్ణయించారని వారు తెలిపారు. అందుకు కలెక్టర్ కార్యాలయంలో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సమావేశం అయ్యేందుకు కూడా ముందుగా కలెక్టర్ కార్యాలయం అనుమతి ఇచ్చిందని వారు తెలిపారు. ఆ తర్వాత అనూహ్యంగా సోమవారం నాడు కలెక్టర్ కార్యాలయంలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారని వారు తెలిపారు. శాంతియుతంగానే తాము కలెక్టర్ కార్యాలయానికి ప్రదర్శనగా వెళ్లాలని అనుకున్నామని, హింసాకాండకు దిగాలన్న ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని వారు చెప్పారు. కలెక్టర్ కార్యాలయానికి పది కిలోమీటర్ల దూరంలోనే పిల్లాపాపలతో సహా వేలాది మంది ప్రజలు గుమిగూడారని, అక్కడి నుంచే పోలీసు బారికేడ్లు ప్రారంభమయ్యాయని చెప్పారు. ప్రజలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంతోనే ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిందని, అది చివరకు పోలీసు కాల్పులదాకా వెళ్లిందని గ్రామస్థులు వివరించారు. వారు కాల్పుల్లో మరణించిన వారి ఫొటోలను మీడియాకు చూపించారు. వారిలో ఎక్కువ మందికి కడుపులో, పొత్తి కడుపులో బుల్లెట్లు దిగిన గాయాలున్నాయి. ప్రస్తుతం అక్కడ వాడవాడలా పోలీసు బందోబస్తు కనిపిస్తోంది. కలెక్టర్గానీ, పోలీసు ఉన్నతాధికారులుగానీ మీడియాకు అందుబాటులో లేరు. -
స్టెరిలైట్ ప్లాంట్ విస్తరణకు హైకోర్టు బ్రేక్
సాక్షి, చెన్నై: తమిళనాడులో తూత్తుకుడిలో స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ నిర్మాణంపై మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా గత 100 రోజులుగా జరుగుతున్న నిరసన, ఆందోళన హింసాత్మకంగా మారడంపై కోర్టు గురువారం స్పందించింది. నిర్మాణ విస్తరణ పనులను నిలిపివేయాల్సిందిగా మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. వివాదాస్పద పారిశ్రామిక యూనిట్ ప్రతిపాదిత విస్తరణ పనులను నిలిపివేయాలని మద్రాస్ హైకోర్టు లోని మదురై బెంచ్ ఆదేశించింది. ప్లాంట్ నిర్మాణానికి ప్రజల అనుమతి పొందాలని తెలిపింది. ప్రాజెక్టుకు అనుమతినిచ్చేముందు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని కేంద్రానికి సూచించింది. ఈ మేరకు తాజా పిటిషన్ దాఖలు చేయాల్సింది వేదాంత కంపెనీనీ ఆదేశించింది. దీంతోపాటు పోలీస్ కాల్పుల ఘటనపై నివేదికను సమర్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హోం మంత్రిత్వ శాఖను కోరింది. మరోవైపు తూత్తుకూడిలో పోలీసుల కాల్పుల ఘటనపై విచారణకు రిటైర్డ్ జడ్జి అరుణ జగదీశన్ను నియమిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఆందోళనకారులపై పోలీసుల కాల్పుల ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి న్యాయ విచారణకు ఆదేశించారు. మృతులు ఒక్కొక్కరికీ 10లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. అటు కేంద్రం కూడా ఈ వ్యవహారంపై ఒక సమగ్ర నివేదికను సమర్పించాల్సిందిగా రాష్ట్రాన్ని కోరింది. కాగా వేదాంత కంపెనీకి చెందిన స్టెరిలైట్ కాపర్ యూనిట్ విస్తరణ ప్రతిపాదనల్ని వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళన పోలీసు కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో 11 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు, ఇతర నాయకులు పోలీసుల దమనకాండపై మండిపడుతున్న సంగతి తెలిసిందే. -
దర్శకుడు శంకర్పై తమిళులు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ తమిళ సినీ దర్శకుడు శంకర్పై తమిళులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూత్తుకుడిలో వేదాంత కంపెనీకి చెందిన స్టెరిలైట్ కాపర్ యూనిట్ విస్తరణ ప్రతిపాదనల్ని వ్యతిరేకిస్తూ గత 100 రోజులుగా జరుగుతున్న ఆందోళనలు మంగళవారం హింసాత్మకంగా మారిన విషయం విదితమే. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసి ఆందోళనకారులు బీభత్సం సృష్టించారు. కలెక్టరేట్ వద్ద నిరసనకారులను నిలువరించే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 11 మంది మరణించారు. కాగా, మంగళవారం రాత్రి జరిగిన ఐపీఎల్ క్వాలిఫైయర్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీనిపై శంకర్ ‘వాట్ ఏ మ్యాచ్’ అంటూ ట్విటర్ ప్రశంసలు కురిపించారు. దీంతో శంకర్పై నెటిజన్లు భగ్గుమన్నారు. తూత్తుకుడి ఘటనలో 11 మంది తమిళుల మరణంపై బాధను వ్యక్తం చేయకుండా క్రికెట్ను ఆస్వాదిస్తున్నావా? అంటూ నిలదీశారు. ఈ పరిస్థితితుల్లో నీకు క్రికెట్ ముఖ్యమా..? నువ్వు మనిషివేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్లో నెటిజన్ల ఆగ్రహం నేపథ్యంలో శంకర్ సదరు పోస్టును తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో నష్టనివారణలో భాగంగా శంకర్ బుధవారం తూత్తుకుడిలో మరణించిన వారికి నివాళులు అర్పించారు. ఈ మేరకు బుధవారం ట్వీట్ చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.తూత్తుకుడి ఘటనపై నటి, దర్శకురాలు రాధిక శరత్కుమార్ స్పందించారు. 11 మంది మరణించాడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. నివాళి తెలిపితే అది ఒట్టి మాటే అవుతుందని అభిప్రాయపడ్డారు. మరణించిన వారి కుటుంబాల గురించే తన గుండె కొట్టుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. Shocked #ThoothukudiShooting , unacceptable to the mind. Condolences will become mere words, heart&spirit goes out to the people and their loved ones — Radikaa Sarathkumar (@realradikaa) May 23, 2018 It is shocking and painful.. my deepest heart felt condolences to the families of the people who died in tuticorin — Shankar Shanmugham (@shankarshanmugh) May 23, 2018 -
ప్రధాని మౌనం వీడాలి
తమిళ సినిమా: ప్రధానమంత్రి మౌనం వీడాల్సిన సమయం ఆసన్నమైందని నటుడు, నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ పేర్కొన్నారు. తూత్తుక్కుడి సంఘటనపై ఈయన స్పందిస్తూ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తూత్తుక్కుడి స్టెర్లైట్ పోరాటంలో ప్రజలు దారుణంగా హత్య చేయబడడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఈ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నానన్నారు. ఈ పోరాటం సమాజం కోసం జరుగుతోందని, ఇది వ్యక్తిగత పోరాటం కాదని అన్నారు. 50వేల మంది కలిసి చేస్తున్న పోరాటం కచ్చితంగా సామాన్య ప్రజల కోసమేనన్నారు. ఇప్పటికైనా ప్రధానమంత్రి మౌనం వీడాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. పోరాటం ప్రజాస్వామ్యంలో హక్కు అని, అందులో ప్రజలెందుకు పాల్గొనకూడదని ప్రశ్నించారు. ప్రభుత్వం అన్నది ప్రజల కోసమేనని, మరో దేనికోసం కాదని అన్నారు. ప్రజలు 2019 ఎన్నికల గురించి ఆలోచించాలని ఈ సందర్భంగా విశాల్ వ్యాఖ్యానించారు. ఇదే విధంగా నటుడు, మక్కల్నీది మయ్యం పార్టీ నేత కమలహాసన్ కూడా తూత్తుక్కుడి సంఘటనను తీవ్రంగా ఖండించారు. దక్షిణ భారత నటీనటుల సంఘం కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. -
అట్టుడికిన తూత్తుకుడి
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని తూత్తుకుడి పట్టణం రక్తసిక్తమైంది. వేదాంత కంపెనీకి చెందిన స్టెరిలైట్ కాపర్ యూనిట్ విస్తరణ ప్రతిపాదనల్ని వ్యతిరేకిస్తూ గత 100 రోజులుగా జరుగుతున్న ఆందోళనలు మంగళవారం హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసి ఆందోళనకారులు బీభత్సం సృష్టించారు. కలెక్టరేట్ వద్ద నిరసనకారులను నిలువరించే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 11 మంది మరణించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ బాలిక ఉన్నారు. పోలీసులు సహా 60 మంది గాయపడ్డారు. వాణిజ్య సముదాయాలు, వాహనాలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు నిప్పంటించిన ఆందోళనకారులు కలెక్టర్ కార్యాలయంలోకి ప్రవేశించి వీరంగం సృష్టించారు. దీంతో ఆ పరిసర ప్రాంతాలు రణ రంగాన్ని తలపించాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పొరుగు జిల్లాలు మదురై, విరుధ్నగర్ నుంచి పోలీసులను హుటాహుటిన తూత్తుకుడికి రప్పించారు. ప్రజలంతా సంయమనం పాటించాలని తమిళనాడు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. వారి అభిప్రాయాలు, ఆకాంక్షలను గౌరవించి సమస్యను చట్టపరంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. మంత్రులు, డీజీపీతో అత్యవసరంగా సమావేశమైన ముఖ్యమంత్రి పళనిస్వామి వేదాంత కంపెనీపై చర్యలు తప్పవని హెచ్చరించారు. హింసాత్మక ఘటనపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించారు. లాఠీచార్జి ప్రయోగం ఫలించకనే... వేదాంత వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం 6 గంటల నుంచి తూత్తుకుడిలో 144వ సెక్షన్ విధించారు. ఉదయం ఓ చర్చి వద్ద సమావేశమైన ఆందోళనకారులు తొలుత స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ వరకు ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో కలెక్టరేట్ వరకు మార్చ్ నిర్వహించారు. వందలాది మంది మహిళలు కూడా తమ చంటిబిడ్డలను చంకనవేసుకుని ఆందోళనలో పాల్గొన్నారు.ఇంతలో తోపులాటలతో మొదలైన ఘర్షణలు క్షణాల్లోనే ఉధృతమయ్యాయి. కలెక్టరేట్పై ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పరిస్థితి క్రమంగా చేయి దాటిపోయింది. కొందరు నిరసనకారులు లోనికి ప్రవేశించి ఫర్నిచర్, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. బయట ఉన్న ఆందోళనకారులు ప్రభుత్వ వాహనాల విండ్స్క్రీన్లను బద్దలుకొట్టి, బ్యాంకు కార్యాలయాలపై దాడికి పాల్పడ్డారు. లాఠీచార్జి, బాష్ప వాయువు ప్రయోగంతో పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. తాము శాంతియుతంగా నిరసన చేస్తూ, ఎలాంటి కవ్వింపునకు పాల్పడకపోయినా పోలీసులు కాల్పులు జరిపారని ఆందోళనకారులు ఆరోపించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సుమారు 3 వేల మంది పోలీసులను మోహరించారు. 20 వేల మంది ఈ నిరసనలో పాల్గొన్నట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే పోలీసులు కాల్పులు జరిపారని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి డి. జయకుమార్ అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.3 లక్షలు, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.1 లక్ష చొప్పున తమిళనాడు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబీకుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని చెప్పింది. ఇది ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం 11 మంది కాల్పుల్లో మరణించడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన ప్రభుత్వ అధీనంలోని ఉగ్రవాదంతో సమానమన్నారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న నిరసనకారులపై కాల్పులు జరపడం గర్హనీయమని అన్నారు. ప్రాణనష్టానికి ప్రభుత్వానిదే బాధ్యత అని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. వ్యతిరేకత ఎందుకు? పర్యావరణ కాలుష్యంతో పాటు భూగర్భ జలాల నిల్వలకు పెనుముప్పుగా మారిన వేదాంత కాపర్ యూనిట్ని మూసేయాలని స్థానికులు చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు కంపెనీ విస్తరణా ప్రణాళికలు రచించటం వారిలో ఆగ్రహాన్ని మరింత పెంచింది. తూత్తుకుడిలో స్టెరిలైట్ కంపెనీ గత 20 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దాని నుంచి వస్తున్న రసాయనాల వల్ల కళ్లు మండుతున్నాయని, ఇతర అలర్జీలు వస్తున్నాయని ప్రజలు ఫిర్యాదుచేయడంతో 2013లో అప్పటి సీఎం జయలలిత ఆ కంపెనీని మూసివేయాలని ఆదేశించారు. అయితే ప్రభుత్వ ఉత్తర్వులను జాతీయ హరిత ట్రిబ్యునల్ తిరస్కరించడంతో కంపెనీ తిరిగి తెరుచుకుంది. రాగిని కరిగించే ప్రక్రియ వల్ల ఆ ప్రాంతంలో సీసం, ఆర్సెనిక్, సెలీనియం, అల్యూమినియం, రాగితో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. -
కుమార్తె స్నేహితురాలిపై అకృత్యం
చెన్నై: టీవీ చూసేందుకు తన ఇంటికి వచ్చిన బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు అతని కుమార్తె క్లాస్మేట్ కావటం, ఇందుకు అతని భార్య తోడ్పాటు అందించటం గమనార్హం. అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు రాగా పిల్లలతోపాటు భార్య, భర్త పరారయ్యారు. చెన్నైలోని తూత్తుకుడిలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన తవసిపెరుమాల్(45), చిత్ర దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరి ఇంటికి సమీపంలోనే ఉండే బాలిక(13) 8వ తరగతి చదువుతోంది. ఈమె తవసి పెరుమాల్ కుమార్తెకు దగ్గరి స్నేహితురాలు. ఈ బాలిక బుధవారం రాత్రి టీవీ చూసేందుకు వెళ్లింది. తవసిపెరుమాల్ కుమార్తెలు ఆడుకుంటూ బయటకు వెళ్లగా చిత్ర వంటింట్లో ఉంది. ఇదే అదనుగా భావించిన తవసిపెరుమాల్ బాలికను అరవకుండా నోరుమూసి, కాళ్లు చేతులు కట్టేసి అత్యాచారం చేశాడు. ఎవరికీ ఈ విషయం చెప్పవద్దని బెదిరించాడు. అదే సమయంలో లోపలికి వచ్చిన చిత్రకు బాధితురాలు ఏడ్చుకుంటూ విషయం చెప్పింది. అది విన్న చిత్ర.. భర్తకు మద్దతుగా మాట్లాడింది. ఇక్కడ జరిగిన సంఘటనను బయట ఎవరికీ చెప్పవద్దని బెదిరించి ఆమెను పంపించి వేసింది. ఇంటికి వెళ్లిన బాలిక వ్యాకులతతో ఉండటంతో ఆమె తల్లి ఆరా తీసింది. దీంతో ఆమె అసలు విషయం తెలిపింది. దీంతో బాధితురాలి తల్లి తూత్తుకుడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తూత్తుకుడిలో ఉన్న మహిళ పోలీసులు కేసు నమోదు చేసి తవసిపెరుమాల్, చిత్ర కోసం వెళ్లగా గమనించిన నిందితులు తమ పిల్లలతో పాటు అక్కడి నుంచి పరారయ్యారు. వారి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. -
ప్రేమోన్మాదానికి యువతి బలి
సాక్షి, చెన్నై: ఓ యువకుడు వన్ సైడ్ లవ్తో ప్రేమోన్మాదిగా మారాడు. చర్చిలో ప్రార్థనలో నిమగ్నమై ఉన్న యువతిని నరికి చంపాడు. తమిళనాడులోని తూత్తుకుడి జార్జ్ రోడ్డులో ఇందిరానగర్కు చెందిన ఫ్రాన్సీనా(24) ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. బుధవారం ఉదయం చర్చిలో ప్రార్థన చేస్తుండగా కీనన్ అనే వ్యక్తి ఆమెపై కత్తితో దాడి చేసి హత మార్చాడు. అతని ప్రేమను తిరస్కరించడంతో పాటు మరో వ్యక్తితో పెళ్లికి ఫ్రాన్సీనా సిద్ధపడటాన్ని జీర్ణించుకోలేకే కీనన్ ఈ దారుణానికి ఒడిగట్టాడని భావిస్తున్నారు. -
శశికళపై కేసు
తూత్తుకుడి: అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప, ఆమె కుటుంబ సభ్యులు తమను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ వారి ఇంట్లో పనిచేసే 22 ఏళ్ల యువతి కేసు పెట్టింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శశికళ భర్త టి. లింగేశ్వర్ తిలకన్, ఆమె కుమారుడు ఎల్. ప్రదీప్ రాజా.. తనతో పాటు తన సోదరిపై కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను ఇంట్లో నిర్బంధించి చిత్రహింసలు పెట్టారని తెలిపింది. తిరునల్వేలి జిల్లాలోని అనైకుడి ప్రాంతానికి చెందిన బాధితురాళ్లు చెన్నైలోని శశికళ నివాసం నుంచి 2015లో పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో తమపై కోపం పెంచుకుని తమను వేధించేవారని ఫిర్యాదులో బాధితురాళ్లు పేర్కొన్నారు. శశికళ, ఆమె భర్త, ఆమె తల్లి తమను పలుమార్లు కొట్టారని వెల్లడించారు. తెల్లకాగితాలపై తమతో సంతకాలు పెట్టించుకున్నారని, దీని గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారని తెలిపారు. ఢిల్లీ విమానాశ్రయంలో డీఎంకే ఎంపీని చెంపదెబ్బ కొట్టినందుకు శశికళను అన్నాడీఎంకే పార్టీ పదవుల నుంచి అధినేత్రి జయలలిత సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. -
ఆంధ్రాబ్యాంకుపై బాంబు విసిరిన దుండగులు
చెన్నై: తిరుపతి శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్పై తమిళనాడులో మూడోరోజు కూడా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తుత్తుకుడిలో ఆంధ్రాబ్యాంకుపై గురువారం ఉదయం దుండగులు బాంబు విసిరారు. అయితే ఆ సమయంలో బ్యాంకు ఇంకా తెరవకపోవటంతో ప్రమాదం తప్పింది. ఆంధ్రా బస్సులపై గుర్తు తెలియని వ్యక్తులు నిన్న దాడి చేసిన విషయం తెలిసిందే. దాంతో తమిళనాడు నుంచి ఏపీ వైపు వెళ్లే బస్సు సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు. -
దత్తతకు గ్రామం
ఒక ఎంపీ ఒక గ్రామం నినాదంతో ఓ గ్రామాన్ని దత్తతకు స్వీకరించేందుకు డీఎంకే ఎంపీ కనిమొళి నిర్ణయించారు. తూత్తుకుడి జిల్లా ఆళ్వార్ తిరునగర్ పరిసరాల్లో పర్యటించిన ఆమె శ్రీ వెంకటేశ్వర పురాన్ని దత్తతకు తీసుకున్నారు. * ఎంపీ కనిమొళి నిర్ణయం * తూత్తుకుడిలో పర్యటన సాక్షి, చెన్నై: ఒక ఎంపీ ఒక గ్రామం నినాదంతో గ్రామాల దత్తతకు పీఎం నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ పిలుపునకు రాష్ట్రంలో స్పందించిన తొలి ఎంపీగా రాజ్యసభ సభ్యురాలు కనిమొళి ఖ్యాతి గడించారు. ఇటీవల పీఎం నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసి చివరకు కనిమొళి భంగపడ్డ విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో తాజాగా మోదీ ఇచ్చిన పిలుపునకు ఆ పార్టీ ఎంపీ ఇంత వరకు స్పందించ లేదు. ఇతర పార్టీలు సైతం ఇంకా మేల్కొన లేదు. అయితే, తాను ఎల్లప్పుడూ ప్రజా సేవలో ముందుంటానని చాటుకునే విధంగా, పరోక్షంగా మోదీ దృష్టిలో పడే రీతిలో ఓ గ్రామాన్ని దత్తతకు స్వీకరించేందుకు నిర్ణయించారు. దత్తతకు స్వీకారం : తూత్తుకుడి జిల్లా ఆళ్వార్ తిరునగర్ యూనియన్ పరిసరాల్లో బుధవారం కనిమొళి పర్యటించారు. అక్కడి శ్రీవెంకటేశ్వర పురం గ్రామాన్ని దత్తతకు స్వీకరించారు. అక్కడి ప్రజలతో ముచ్చటించారు. ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నిర్ణయించారు. మీడియాతో కనిమొళి మాట్లాడుతూ, నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు తమ గ్రామాన్ని దత్తతకు స్వీకరించాలని, ఇక్కడి ప్రజలు తనకు విజ్ఞప్తి చేసినట్టు పేర్కొన్నారు. అందుకే ఈ గ్రామంలో పర్యటించి, ఇక్కడి వసతులు, ఇక్కడ ప్రజలు పడుతున్న కష్టాల్ని స్వయంగా తెలుసుకున్నట్లు చెప్పారు. ఇక్కడ భూగర్భ జలాల్ని పీల్చే చెట్లు అనేకం ఉన్నాయని, వాటిని తొలగించి, ప్రజోపయోగకరంగా ఉండే చెట్ల పెంపకం మీద దృష్టి పెట్టనున్నట్టు తెలిపారు. తాగునీటి వసతుల కల్పన, రోడ్లు, కనీస సదుపాయూల కల్పన మీద దృష్టి సారిస్తామన్నారు. ఇక్కడి ప్రజలు విద్యా పరంగా, వైద్య, ఆరోగ్య పరంగా సేవల్ని అంది పుచ్చుకునే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు. ఇక్కడి ప్రజలతో కలసి తాను స్వయంగా అభివృద్ధిలో పాలు పంచుకోబోతున్నట్టు పేర్కొన్నారు. -
విద్యుత్ గండం
సాక్షి, చెన్నై: తూత్తుకుడిలో ఐదు యూనిట్లతో కూడిన థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉంది. ఇక్కడ రోజుకు ఒక్కో యూనిట్లో 210 మెగావాట్లు చొప్పున 1050 మెగావాట్లు ఉత్పత్తి అవుతోంది. ఈ విద్యుత్ రాష్ట్ర అవసరాలకు వినియోగిస్తున్నారు. 1979-1991 మధ్య కాలంలో ఇక్కడ ఐదు యూనిట్లు ఏర్పాటు చేశారు. ఆనాటి సాంకేతిక పరిజ్ఞానంతోనే విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఈ యూనిట్లు నెలకొల్పి ఏళ్లు గడుస్తున్నందు వల్లనో లేక ఇతర సాంకేతిక లోపాల కారణంగానో తరచూ విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని చూడలేని పరిస్థితి నెలకొంది. పాడైన యూనిట్ను సరిచేసే లోపలే మరొకటి పనిచేయకుండా పోతోంది. ఇటీవలే అన్ని యూనిట్లలోని పరికరాల్ని ఇంజినీర్లు క్షుణ్ణంగా పరిశీలించి వెళ్లారు. ఆయా యూనిట్లలో ఉత్పత్తి తీరును పర్యవేక్షించారు. మరమ్మతులు అన్ని యూనిట్లూ సక్రమంగా పనిచేస్తున్నాయన్న ధీమాతో ఉన్న అధికారులకు ఆదివారం షాక్ తగిలింది. తొలి యూనిట్లో శనివారం రాత్రి సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో సిబ్బంది మరమ్మతులు ప్రారంభించారు. అయితే ఈ ఫలితం మరో సమస్య తెచ్చి పెట్టింది. మూడు, నాలుగు యూనిట్లలోని పైపుల్లో బ్లాక్ ఏర్పడడంతో మూడు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని నిలుపుదల చేశారు. దీంతో 630 మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. ఒకే రోజు ఇన్ని మెగావాట్ల ఉత్పత్తి ఆగిన పక్షంలో ఆ భారం రాష్ట్రం మీద పడే పరిస్థితి ఏర్పడింది. ఇన్నాళ్లూ విద్యుత్ అవసరాలకు భిన్నంగా ఉత్పత్తి జరుగుతోంది. ఇప్పుడిప్పుడే ప్రజా అవసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తి చేరువవుతోంది. ఈ సమయంలో తూత్తుకుడిలో మూడు యూనిట్లు పనిచేయకపోవడంతో విద్యుత్ గండం ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీపావళి సెలవుల్లో వెళ్లిన ఇంజినీర్లు, ఇతర సాంకేతిక నిపుణులు హుటాహుటిన తూత్తుకుడి చేరుకుని మరమ్మతు పనుల్లో నిమగ్నమయ్యూరు. సోమవారం లేదా మంగళవారం రాత్రిలోపు అన్ని యూనిట్లలో మరమ్మతులు పూర్తి చేయనున్నారు. -
ఆయుధాలతో పట్టుబడిన చైనా నౌక: దర్యాప్తు ముమ్మరం
-
ఆయుధాలతో పట్టుబడిన చైనా నౌక: దర్యాప్తు ముమ్మరం
చెన్నై: అక్రమంగా భారీ ఆయుధాలతో తరలి వస్తున్న చైనా నౌకను తమిళనాడు మెరైన్ పోలీసులు పట్టుకున్నారు. తుత్తుకుడి పోర్టుకు 3 కిలో మీటర్ల దూరంలో అధికారులు దీనిని నిలిపివేసి తనిఖీ చేశారు. ఈ నౌకలో పది మంది సిబ్బందితోపాటు 25 మంది సాయుధులు ఉన్నారు. ఈ నౌకలో భారీగా ఆయుధాలు, బాంబులు కూడా ఉన్నాయి. ఈ నౌకను సోమాలియా బంధిపోట్లు ఉపయోగించినట్లుగా అనుమానిస్తున్నారు. గతంలొ ముంబయిలో దాడులకు పాల్పడేందుకు కసబ్ తదితర ఉగ్రవాదులు సీమెన్గార్డు అనే చైనా నౌక ద్వారా నగరంలోకి ప్రవేశించినట్లు అప్పట్లో విచారణలో తేలింది. దీంతో చైనా నౌకల పట్ల అప్రమత్తంగా ఉండాలని భారత్లోని హార్బర్లకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. సీమెన్గార్డు చైనా నౌక మూడు నెలల క్రితం భారత్ చేరుకుంది. దీనిని దేశ సరిహద్దుల్లోనే అధికారులు తనిఖీ చేయగా అప్పట్లో అనుమానాస్పద వస్తువులు ఏమీ లభించలేదు. అయినా చైనా నౌకలను హార్బర్ అధికారులు అనుమానిస్తూనే ఉన్నారు. మూడు నెలల క్రితం మన అధికారులు తనిఖీ చేసిన ఇదే చైనా నౌక శుక్రవారం అర్ధరాత్రి సమయంలో తూత్తుకూడి హార్బర్ను సమీపించినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో నౌకను తూత్తుకూడి అధికారులు సముద్రంలోనే నిలిపివేశారు. అప్రమత్తమైన అధికారులు ‘నాయకిదేవీ’ అనే యుద్ధనౌకలో వేగంగా ఎదురెళ్లి సీమెన్గార్డు నౌకలో తనిఖీలు చేశారు. నౌకలో అనేక ఆయుధాలు దాచి ఉంచడాన్ని అధికారులు గుర్తించారు. కేంద్రం ఆదేశాల మేరకు తూత్తుకూడి హార్బర్కు 10 మైళ్ల దూరంలో నౌకను నిలిపేశారు. నౌక చుట్టూ గస్తీ నౌకలు, మరబోట్లు ఉంచారు. అమెరికా నుంచి రాక! చైనాలో రిజిస్టరైన ఈ నౌక ప్రస్తుతం అమెరికా నుంచి తూత్తుకూడి చేరుకున్నట్లు అధికారులు తెలుసుకున్నారు. సముద్రపు దొంగల బారి నుంచి కాపాడుకునేందుకే ఆయుధాలు సమకూర్చుకున్నట్లు చైనా నౌకలోని సిబ్బంది సమర్థించుకున్నారు. ప్రపంచంలోని అన్ని హార్బర్లకూ తిరిగే విధంగా అనుమతి పొందామని వివరించారు. అయితే చైనా నౌక వ్యవహారం రాష్ట్రంలో కలకలం రేపింది. చెన్నై తదితర జిల్లాలలో విధ్వంసాలకు పాల్పడేందుకు చైనా నుంచి ఉగ్రవాదులు మరోసారి ప్రవేశించే ప్రయత్నం చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముంబయి దాడుల నేపథ్యంలో ఏ అంశాన్నీ సులభంగా తీసుకోరాదని భావి స్తున్నారు. క్షుణ్ణంగా విచారణ జరిపి ఒక నిర్ధారణకు రానిదే సీమెన్గార్డు నౌకను విడిచిపెట్టరాదని కేంద్రహోంశాఖ వర్గాలు భావిస్తున్నాయి. కేం ద్రం ఆదేశించే వరకు సీమెన్గార్డు చుట్టూ బందోబస్తు కొనసాగిస్తామని తూత్తుకూడి హార్బర్ అధికారులు స్పష్టం చేశారు. దర్యాప్తును ముమ్మరం చేశారు.