tungabhadra dam
-
తుంగభద్ర డ్యాం గేట్ల మార్పునకు ఓకే
సాక్షి, అమరావతి//సాక్షి, బళ్లారి: తుంగభద్ర డ్యాం గేట్లను మార్చాలన్న తుంగభద్ర బోర్డు ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ అధికారులు అంగీకరించారు. డ్యాం భద్రత దృష్ట్యా గేట్ల ఎత్తును పెంచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. కానీ, గేట్ల ఎత్తు పెంచడంవల్ల డ్యాం నిల్వ సామర్థ్యం పెరగకుండా చూడాలని తెలంగాణ అధికారులు చేసిన ప్రతిపాదనకు బోర్డు అంగీకరించింది. కర్ణాటక హోస్పేటలోని తుంగభద్ర బోర్డు కార్యాలయంలో శుక్రవారం 222వ సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. బోర్డు చైర్మన్ డీఎం రాయ్పురే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వం తరఫున అనంతపురం సీఈ నాగరాజు, కర్ణాటక అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ఈఎన్సీ అనిల్కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఇటీవల వరదలకు తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో డ్యాం భద్రతపై నిపుణుల కమిటీతో బోర్డు తనిఖీ చేయించింది. గేట్ల కాల పరిమితి ముగిసిందని.. వాటి స్థానంలో కొత్త గేట్లు అమర్చాలని నిపుణుల కమిటీ ఇచి్చన నివేదికను బోర్డు సమావేశంలో సభ్య కార్యదర్శి ఓఆర్కే రెడ్డి ప్రవేశపెట్టారు. దీనిని మూడు రాష్ట్రాల అధికారులు ఆమోదించారు. దశల వారీగా గేట్లను మార్చాలని నిర్ణయించారు. ఏకాభిప్రాయంతోనే నమలి రిజర్వాయర్.. ఇక పూడికవల్ల తుంగభద్ర డ్యాం నిల్వ సామర్థ్యం తగ్గిన నేపథ్యంలో.. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన జలాలను పూర్తిస్థాయిలో వాడుకోవడానికి నవలి వద్ద 30 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి అనుమతివ్వాలని కర్ణాటక సర్కారు చేసిన ప్రతిపాదనను ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు వ్యతిరేకించాయి. మూడు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వస్తేనే నవలి రిజర్వాయర్ నిర్మాణంపై చర్చిద్దామని బోర్డు చైర్మన్ రాయ్పురే స్పష్టంచేశారు. పూడికవల్ల డ్యాం నిల్వ సామర్థ్యం తగ్గిన నేపథ్యంలో.. హెచ్చెల్సీకి సమాంతరంగా వరద కాలువ తవ్వి, హెచ్చెల్సీ వాటా జలాలను తీసుకెళ్తామని.. డ్యాంలో నిల్వ ఉన్న నీటిని మిగతా ఆయకట్టుకు సరఫరా చేయడం ద్వారా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన జలాలను వాడుకోవచ్చని ఏపీ అధికారులు చేసిన ప్రతిపాదనను తెలంగాణ ఈఎన్సీ వ్యతిరేకించారు. డ్యాంలో పూడికతీతకు కేంద్రం ఇటీవల ప్రకటించిన జాతీయ విధానాన్ని అమలుచేయాలని సూచించారు. పూడిక తీయడం ద్వారా తుంగభద్ర డ్యాం నిల్వ సామర్థ్యం పెంచుకోవచ్చని ప్రతిపాదించారు. తుంగభద్రలో నీటి లభ్యత లేనప్పుడు కేసీ కెనాల్ ఆయకట్టులో పంటలను రక్షించుకోవడానికి కృష్ణా జలాలను వాడుకోవడానికి అనుమతివ్వాలన్న ఏపీ అధికారుల ప్రతిపాదనపై తెలంగాణ ఈఎన్సీ అభ్యంతరం వ్యక్తంచేశారు. -
తుంగభద్ర గేట్లన్నీ మార్చాల్సిందే
సాక్షి, అమరావతి/సాక్షి, బళ్లారి/హొసపేటె: తుంగభద్ర డ్యామ్ గేట్లన్నీ మార్చాల్సిందేనని సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం) మాజీ చైర్మన్ ఏకే బజాజ్ నేతృత్వంలోని కమిటీ బోర్డుకు స్పష్టం చేసింది. ఏ డ్యాం గేట్లైనా 45 ఏళ్లు మాత్రమే సమర్థంగా పనిచేస్తాయని పేర్కొంది. తుంగభద్ర డ్యామ్ గేట్లు 70 ఏళ్లుగా పనిచేస్తున్నాయని.. తుప్పుపట్టినప్పుడు దాన్ని తొలగించి రంగులు వేస్తుండటం వల్ల వాటి మందం తగ్గిందని, బలహీనంగా మారాయని తెలిపింది. దీనివల్లే ఆగస్టు 10న డ్యాం 19వ గేటు కొట్టుకుపోయిందని తేల్చిచెప్పింది. డ్యామ్ భద్రత దృష్ట్యా 33 గేట్లనూ మార్చి.. వాటి స్థానంలో కొత్త గేట్లు అమర్చాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను బుధవారం నేషనల్ డ్యామ్ సేఫ్టీ కమిటీ, సీడబ్ల్యూసీకి ఏకే బజాజ్ అందించనున్నారు. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు గేట్ల మార్పుపై తుంగభద్ర బోర్డు నిర్ణయం తీసుకోనుంది. కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ గేటు ఏర్పాటుచేయడానికే రూ.5 కోట్లకుపైగా బోర్డు వ్యయం చేసింది. ఈలెక్కన పూర్తి స్థాయిలో ఒక్క గేటు ఏర్పాటుకు రూ.8 కోట్లపైగా వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన 33 గేట్లు ఏర్పాటుచేయాలంటే రూ.264 కోట్లకుపైగా వ్యయం అవుతుందని చెబుతున్నారు. గేట్లు ఎత్తడానికి దించడానికి వీలుగా హైడ్రాలిక్ హాయిస్ట్ వంటి అధునాతన వ్యవస్థను ఏర్పాటుచేయాలంటే అదనంగా మరో రూ.వంద కోట్ల వరకూ వ్యయం అవుతుందని లెక్కలు వేస్తున్నారు. ఈ వ్యయాన్ని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నీటి కేటాయింపులు, ఆయకట్టు ఆధారంగా దామాషా పద్ధతిలో భరించాల్సి ఉంటుంది. బజాజ్ కమిటీ సమగ్ర అధ్యయనంతుంగభద్ర డ్యామ్ 19వ గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో డ్యామ్ గేట్లు, భద్రతపై సమగ్రంగా అధ్యయనం చేయాలని కేంద్రానికి కర్ణాటక ప్రభుత్వం లేఖ రాసింది. దాంతో తుంగభద్ర డ్యామ్ గేట్లపై అధ్యయానికి సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏకే బజాజ్ అధ్యక్షతన గేట్ల నిపుణులు హర్కేశ్ కుమార్, తారాపురం సుధాకర్ సభ్యులుగా కేంద్రం త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ ఆదివారం, సోమవారం డ్యామ్ను సమగ్రంగా పరిశీలించి.. గేట్ల పనితీరుపై అధ్యయనం చేసింది. -
విజయవంతంగా స్టాప్లాగ్ గేటు ఏర్పాటు
సాక్షి, బళ్లారి/ హొసపేటె/హొళగుంద: తుంగభద్ర డ్యాంలో కొట్టుకుపోయిన 19వ క్రస్ట్ గేటు స్థానంలో స్టాప్లాగ్ గేటు ఏర్పాటు పూర్తయింది. శుక్రవారం రాత్రి ఈ గేటు తొలి భాగాన్ని బిగించిన సిబ్బంది.. శనివారం ఉదయం నుంచి సాయంత్రంలోగా మరో నాలుగు భాగాలను బిగించారు. దీంతో గేటు ఏర్పాటు విజయవంతంగా పూర్తయింది. ఓపక్క 71 టీఎంసీల నీరు జలాశయంలో ఉన్నప్పటికీ.. ప్రత్యేక నిపుణుడు కన్నయ్యనాయుడు పర్యవేక్షణలో ఇంజినీర్లు, సిబ్బంది సాహసోపేతంగా ఐదు భాగాలను బిగించారు. దీంతో డ్యాం గేట్లను మూసివేశారు. స్టాప్లాగ్ గేటు నుంచి మాత్రం కొద్దిపాటి నీరు లీకవుతోంది. దానిని కూడా ఆదివారానికి సరిచేస్తామని అధికారులు తెలిపారు. ఈ ఖరీఫ్ పంటలకు ఇబ్బంది లేదని తెలిపారు. ఈ నెల 9వ తేదీన కొట్టుకుపోయిన 19వ గేటు భాగాలు డ్యాంకు దిగువన కొంత దూరంలో శనివారం కనిపించాయి.నీరు వృథా కాకుండా..కొట్టుకుపోయిన గేటు స్థానంలో స్టాప్లాగ్ గేటు ఏర్పాటులో ప్రభుత్వం, అధికారులు చూపిన చొరవ 35 టీఎంసీల జలాలు వృథాగా పోకుండా కాపాడగలిగారు. గేటు కొట్టుకుపోయిన వెంటనే డ్యాం అధికారులు రక్షణ చర్యల్లో భాగంగా 33 గేట్లలో 29 గేట్ల వరకు ఎత్తి దాదాపు లక్షా ఇరవై వేల క్యూసెక్కుల నీటిని వారం పాటు నదిలోకి వదిలాల్సి వచ్చింది. జలాశయంలో ముందుగా 65 టీఎంసీల నీరును ఖాళీ చేస్తే గేట్లు అమర్చవచ్చని అనుకున్నప్పటికీ, అధికారులు కేవలం 30 టీఎంసీలే నీరు నదిలోకి వదిలి గేట్లను పెట్టడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గేట్ల నిపుణుడు 81 ఏళ్ల కన్నయ్యనాయుడు కృషితో 71 టీఎంసీల వద్ద గేట్లు ఏర్పాటు చేశారు. దీంతో 35 టీఎంసీల నీటిని ఆదా చేయగలిగారు. గేటు కొట్టుకుపోవడంతో పంటలు నష్టపోతామని రైతులు ఆందోళన చెందారని, స్టాప్లాగ్ గేటు ఏర్పాటుతో వారంతా ఊపిరి పీల్చుకున్నారని ఏపీ తుంగభద్ర రైతు సంఘం నేత తప్పెట రామిరెడ్డి అన్నారు. -
కొట్టుకుపోయిన గేటు స్థానంలో అత్యవసర గేటు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్, కర్ణాటక జల వనరుల శాఖ అధికారులు, నిపుణులతో చర్చించాక.. కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ 19వ గేటు స్థానంలో అత్యవసర గేటు ఏర్పాటు చేయాలని తుంగభద్ర బోర్డు నిర్ణయించింది. సాధారణంగా ప్రాజెక్టులపై క్రస్ట్ గేటు.. స్టాప్ లాక్ గేటు దించడానికి వీలుగా రెండు గాడి(గ్రూవ్)లు పియర్స్ (సిమెంటు దిమ్మెలు)కు ఏర్పాటు చేస్తారు. కానీ.. తుంగభద్ర డ్యామ్ పాత డిజైన్ కావడంతో క్రస్ట్ గేటు ఏర్పాటుకు ఒకే గాడిని ఏర్పాటు చేశారు. దీని వల్ల స్టాప్ లాక్ గేటు ఏర్పాటు చేయలేని పరిస్థితి. దీనిపై సోమవారం తుంగభద్ర డ్యామ్ వద్ద బోర్డు కార్యదర్శి ఓఆర్కే రెడ్డి.. నిపుణులు, గేట్ల సలహాదారు కన్నయ్య నాయుడు, ఆంధ్రప్రదేశ్ జల వనరుల విభాగం సీఈ (హైడ్రాలజీ) రత్నకుమార్, కర్ణాటక జల వనవరుల శాఖ సలహాదారు మల్లికార్జున గుంబ్లీ తదితరులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో క్రస్ట్ గేటు గాడిలోనే అత్యవసర గేటును అమర్చాలని నిర్ణయించారు. అత్యవసర గేటు తయారీ పనులను హిందూస్థాన్ ఇంజినీరింగ్ వర్క్స్, నారాయణ ఇంజినీరింగ్ వర్క్స్కు అప్పగించారు. ఈ గేటును 20 అడుగుల ఎత్తు, 60 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేయనున్నారు. అత్యవసర గేటును 5 భాగాలు (ఎలిమెంట్లు)గా తయారు చేస్తారు. మొదటి ఎలిమెంట్ను 2 అడుగుల ఎత్తు, రెండో ఎలిమెంట్ను 4 అడుగులు, మూడో ఎలిమెంట్ 6 అడుగుల ఎత్తు.. నాలుగు, ఐదు ఎలిమెంట్లు 4 అడుగుల ఎత్తు, 60 మీటర్ల వెడల్పుతో తయారు చేస్తారు. ఆ ఎలిమెంట్లకు ఇరు వైపులా రోలర్లను అమర్చుతారు. ఆ తర్వాత 19వ గేటు ఉన్న 18, 19 పియర్లకు ఉన్న గాడి(గ్రూవ్)లో మొదటి ఎలిమెంటును దించుతారు. ఆ తర్వాత రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు ఎలిమెంట్లను దించడం ద్వారా అత్యవసర గేటు ఏర్పాటు చేస్తారు. గేటు తయారీ ప్రక్రియకు ఐదారు రోజులు పడుతుందని.. రోలర్లు అందుబాటులో ఉంటే.. డ్యామ్లో ఎప్పుడు నీటి మట్టం 1,613 అడుగులు (కనీస నీటి మట్టం) స్థాయికి తగ్గినప్పుడు అత్యవసర గేటు అమర్చుతామని అధికారులు చెబుతున్నారు.నీటి వృథాకు అడ్డుకట్ట వేసేందుకు.. తుంగభద్ర డ్యామ్ గరిష్ట నీటి మట్టం 1633 అడుగులు. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 105.79 టీఎంసీలు. డ్యామ్ కనీస నీటి మట్టం 1613 అడుగులు. అదే స్థాయి నుంచి 1633 అడుగుల వరకు 20 అడుగుల ఎత్తు, 60 అడుగుల వెడల్పుతో స్పిల్ వేకు 33 గేట్లను బిగించారు. ఇప్పుడు అత్యవసర గేటు ఏర్పాటు చేయాలంటే 1613 అడుగుల స్థాయికి అంటే డ్యామ్లో నీటి నిల్వను 43.83 టీఎంసీలకు తగ్గించాలి. దాంతో శనివారం నుంచే డ్యామ్లో నీటిని ఖాళీ చేస్తున్నారు. సోమవారం నాటికి డ్యామ్లో 97.75 టీఎంసీలు ఉండగా.. డ్యామ్లోకి 25,571 క్యూసెక్కులు చేరుతుండగా.. 99,567 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. డ్యామ్లో నీటి నిల్వను 1613 అడుగులకు తగ్గిస్తే సుమారు 61 టీఎంసీల మేర నీరు వృథా అవుతుంది. నీటి వృథాను అరికట్టడానికి నీటి మట్టం 1613 అడుగుల కంటే ఎగువన ఉన్నప్పటికీ అత్యవసర గేటును దించే ప్రయత్నం చేద్దామని నిపుణులు కన్నయ్యనాయుడు సూచించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.నిపుణుల సలహాల మేరకు గేటును అమర్చేందుకు ప్రయత్నిస్తామని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, వేసవిలో పూర్తి స్థాయి క్రస్ట్ గేటును అమర్చాలని బోర్డు నిర్ణయించింది.సక్రమంగా దించకపోవడం వల్లే.. గేట్ల నిర్వహణలో నిపుణులైన అధికారులు, సిబ్బంది అధిక శాతం పదవీ విరమణ చేశారు. వారి స్థానంలో కాంట్రాక్టు పద్ధతిలో సిబ్బందిని నియమించారు. వారికి గేట్ల నిర్వహణలో అనుభవం లేదు. స్పిల్ వే 19వ గేటును సక్రమంగా దించపోవడం వల్లే.. అంటే ఒక కొస దిగువకు దిగి, మరొక కొస ఎగువన ఉండటం వల్ల (ఎగుడు దిగుడు) వరద ఉధృతికి గేటు కొట్టుకుపోయిందని చైన్ తెగడం వల్ల గేటు కొట్టుకుపోయే అవకాశమే లేదని నిపుణులు తేల్చి చెబుతున్నారు. మిగతా 32 గేట్లపై సీఈసీఆర్ఐతో అధ్యయనం తుంగభద్ర డ్యామ్ నిర్మాణం పూర్తయి దాదాపుగా 71 ఏళ్లు పూర్తయింది. గేట్ల నిర్వహణ ప్రారంభమై 66 ఏళ్లు పూర్తయింది. ఈ 66 ఏళ్లలో 2.5 మిలియన్ సైకిల్ ద్వారా ఎత్తడం, దించడం చేశారు. ఇప్పుడు కొట్టుకుపోయిన గేటు కాకుండా, మిగతా 32 గేట్ల పనితీరు సవ్యంగా ఉన్నట్లు ఏపీ, కర్ణాటక అధికారులు, నిపుణులు కన్నయ్య నాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. వరద ఉధృతితో గేట్లపై ఒత్తిడి పడి, బలహీనపడే అవకాశం ఉంటుంది. అందుకే గేట్ల కాల పరిమితిని 45 ఏళ్లు, కాంక్రీట్ కట్టడాల కాల పరిమితి 100 ఏళ్లుగా సీడబ్ల్యూసీ నిర్దేశించింది. కానీ.. 66 ఏళ్లవుతున్నా గేట్లను ఎందుకు మార్చలేదని కన్నయ్య నాయుడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మిగతా 32 గేట్లు సవ్యంగా పని చేస్తున్నప్పటికీ.. వాటి సామర్థ్యంపై తమిళనాడులో కరైకుడిలోని సెంట్రల్ ఎలక్ట్రో కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఈసీఆర్ఐ)తో అధ్యయనం చేయించాలని బోర్డుకు సూచించారు. సీఈసీఆర్ఐ నివేదిక ఆధారంగా గేట్లకు మరమ్మతులు లేదా కొత్త గేట్ల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. టీబీ డ్యాం సర్కారు నియంత్రణలో లేదు సాక్షి, బళ్లారి: తుంగభద్ర జలాశయాన్ని కర్ణాటక ప్రభుత్వం నిర్వహించడం లేదని, అందుకు ప్రత్యేక బోర్డు ఉందని, అందులో తాము సభ్యులం మాత్రమేనని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో సోమవారం ఆయన తుంగభద్ర డ్యాంను సందర్శించారు. అనంతరం బెంగళూరుకు వెళ్లి నీటి పారుదల నిపుణులతో సమావేశమైన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘డ్యాంను పరిశీలించాను. గేట్ కొట్టుకుపోవడంపై సంబంధిత అధికారులతో, కాంట్రాక్టర్లతో చర్చించాను. నూతన క్రస్ట్ గేట్ను పునరుద్ధరించడానికి ఐదు రోజులు పట్టొచ్చు. ఖరీఫ్ పంటకు ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. మంగళవారం ముఖ్యమంత్రి సిద్దరామయ్య డ్యాంను సందర్శించి నిపుణులతో మాట్లాడతారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని చెప్పారు. కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ -
నేడు రెండోరోజు తుంగభద్ర డ్యామ్ కు ఎక్స్ పర్ట్ టీమ్
-
లక్ష క్యూసెక్కుల నీరు వృథా.. రైతుల ఆశ నిరాశే...
-
తుంగభద్ర డ్యామ్ కు రెడ్ అలర్ట్..
-
తుంగభద్ర డ్యామ్ కు పోటెత్తిన వరద.. కొట్టుకుపోయిన గేటు
-
తుంగభద్రలో అంచనాలకు మించి నీరు
సాక్షి, అమరావతి: ప్రస్తుత నీటి సంవత్సరం ప్రారంభంలో తుంగభద్ర బోర్డు అంచనా వేసిన 173 టీఎంసీల కంటే తుంగభద్ర డ్యామ్లో నీటి లభ్యత అధికంగా ఉండే అవకాశం ఉందని సాగునీటిరంగ నిపుణులు చెబుతుండటంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2019, 2020, 2021, 2022 తరహాలోనే రాష్ట్రానికి దక్కాల్సిన వాటా నీటిని విడుదల చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. గతేడాది డ్యామ్లోకి కేవలం 114.58 టీఎంసీల ప్రవాహమే వచ్చినా.. రాష్ట్రానికి గరిష్ఠ స్థాయిలో నీటిని రాబట్టి ఆయకట్టు రైతుల ప్రయోజనాలను ప్రభుత్వం పరిరక్షించిందని గుర్తుచేస్తున్నారు. జూన్ 1 నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు తుంగభద్ర డ్యామ్లోకి 249.02 టీఎంసీల ప్రవాహం వచ్చి0ది. ఇందులో 104.70 టీఎంసీలను డ్యామ్లో నిల్వచేసి.. కాలువలకు 25 టీఎంసీలు విడుదల చేసి.. మిగిలిన 120 టీఎంసీలను గేట్లు ఎత్తి దిగువకు వదిలేశారు. తుంగభద్ర డ్యామ్లోకి నవంబర్ చివరి వరకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఈలెక్కన డ్యామ్లో నీటి లభ్యత బోర్డు అంచనా వేసిన 173 టీఎంసీల కంటే అధికంగా ఉంటుందని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు. కోటా నీటిని రాబడితేనే రైతులకు ప్రయోజనం తుంగభద్ర డ్యామ్లో 230 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్.. కర్ణాటకకు 151.49, ఏపీకి 72 (హెచ్చెల్సీ 32.50, ఎల్లెల్సీ 29.50, కేసీ 10.00), తెలంగాణకు 6.51 (రాజోలిబండ డైవర్షన్ స్కీం) టీఎంసీల చొప్పున కేటాయించింది. ఏటా పూడిక పేరుకుపోతుండటంతో డ్యామ్ నిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. 2016లో నిర్వహించిన సర్వేలో డ్యామ్ సామర్థ్యం 105.78 టీఎంసీలని తేలింది. తగ్గిన నిల్వ సామర్థ్యం, నీటిలభ్యత ఆధారంగా దామాషా పద్ధతిలో మూడు రాష్ట్రాలకు తుంగభద్ర బోర్డు పంపిణీ చేస్తూ వస్తోంది.2019–20, 2020–21, 2021–22, 2022–23, 2023–24ల్లో తుంగభద్ర బోర్డు చరిత్రలో అత్యధిక స్థాయిలో రాష్ట్ర కోటా కింద హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, కేసీ కెనాల్ వాటాను రాబట్టిన ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను పరిరక్షించింది. నాలుగేళ్లు ఏటా సగటున 69 టీఎంసీలను బోర్డు నుంచి ప్రభుత్వం విడుదల చేయించింది. గతేడాది తుంగభద్ర డ్యామ్లోకి కేవలం 114.58 టీఎంసీల ప్రవాహమే వచ్చినా.. 40 టీఎంసీలు రాష్ట్రానికి దక్కేలా చేసి రైతుల ప్రయోజనాలను పరిరక్షించింది. ఈ ఏడాది నీటి లభ్యత పెరిగిన నేపథ్యంలో 2019–23 మధ్య తరహాలోనే ఇప్పుడూ గరిష్ఠంగా నీటి వాటాను రాబట్టి ప్రయోజనాలను పరిరక్షించాలని రైతులు కోరుతున్నారు. -
రేపు శ్రీశైలం గేట్లు ఎత్తివేత!
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 3.79 లక్షల క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 18 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కులను తరలిస్తున్నారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 61,111 క్యూసెక్కులు విడదుల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 873.4 అడుగుల్లో 156.39 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 59 టీఎంసీలు అవసరం. ప్రస్తుతం ఎగువ నుంచి భారీ వరద రావడంతో పాటు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం ఉదయానికి ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. దీంతో మంగళవారం ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య ప్రాజెక్టు గేట్లు ఎత్తి వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తామని అధికారవర్గాలు వెల్లడించాయి. నాగార్జునసాగర్లోకి 53,774 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 510.2 అడుగుల్లో 132.01 టీఎంసీలకు చేరుకుంది.మహారాష్ట్ర, కర్ణాటకలలో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో కృష్ణా నది ఎగువన వరద ఉధృతి కొనసాగుతోంది. ఆల్మట్టి డ్యామ్లోకి 2.68 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా, దిగువకు 3.25 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్లోకి 3.20 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా, 3.27 లక్షల క్యూసెక్కులను వదిలేస్తున్నారు. జూరాల ప్రాజెక్టులోకి 3.04 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 2.98 లక్షల క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. తగ్గని తుంగభద్ర తుంగభద్ర డ్యామ్లోకి వరద ఉధృతి కొనసాగుతోంది. డ్యామ్లోకి 1.24 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.51 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. దాంతో మంత్రాలయం వద్ద వరద ఉధృతి మరింతగా పెరిగి, ప్రమాదకరస్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో అధికారులు ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. సుంకేశుల బరాజ్లోకి 1.49 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. కేసీ కెనాల్కు 1,540 క్యూసెక్కులను వదులుతూ, 1.46 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నా రు. అటు జూరాల నుంచి కృష్ణా వరద, ఇటు సుంకేశుల నుంచి తుంగభద్ర వరద వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులో చేరుతున్న వరద ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. -
శ్రీశైలంలోకి 96,369 క్యూసెక్కులు
సాక్షి, అమరాతి/శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 96,369 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 822.5 అడుగులకు చేరింది. జలాశయంలో నీరు 42.73 టీఎంసీలకు చేరుకుంది. కట్టలేరు, మున్నేరు పరవళ్లు తొక్కుతుండటంతో ప్రకాశం బ్యారేజ్లోకి 13,634 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఇక్కడ 17 గేట్లు ఒక అడుగుమేర ఎత్తి 12,325 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ఉద్ధృతి మరింత పెరిగింది. తుంగభద్ర డ్యామ్లోకి 1,17,647 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 78.67 టీఎంసీలకు చేరింది. మూడురోజుల్లో తుంగభద్ర డ్యామ్ నిండే అవకాశం ఉంది. అప్పుడు గేట్లు ఎత్తి దిగువకు వరదను విడుదల చేస్తారు. -
శ్రీశైలం ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరవళ్లు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 96, 369 క్యూసెక్కుల నీరు రావడంతో నీటినిల్వ 822.5 అడు గుల్లో 42.73 టీఎంసీలకు చేరుకుంది. నాగార్జునసాగర్ లోకి ఎలాంటి వరద చేరకపోగా.. పులిచింతల ప్రాజెక్టు లోకి కేవలం 640 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. కాగా పులిచింతలకు దిగువన నదిపరీవాహక ప్రాంతం(బేసిన్)లో విస్తారంగా కురిసిన వర్షాలకు కట్టలేరు, మున్నేరు పరవళ్లు తొక్కగా, ఏపీలోని ప్రకాశం బ్యారేజీలోకి 13,634 క్యూసెక్కుల నీరు చేరింది.ఇందులో కృష్ణా డెల్టా కు 1,309 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 12,325 క్యూసెక్కులను 17 గేట్లు ఒక అడుగు మేర ఎత్తి సముద్రంలోకి అధికారులు వదిలేస్తున్నారు. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల కృష్ణా ప్రధానపాయలో ఎగువన వరద ప్రవాహం కొంత పెరిగింది. ఆల్మట్టిలోకి 1.24 లక్షల క్యూసెక్కుల నీరు చేరగా, గేట్లు ఎత్తి 1.50 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలారు.దాని దిగువన నారాయణపూర్ డ్యామ్లోకి 1.25 లక్షల క్యూసెక్కుల నీరు చేరగా, గేట్లు ఎత్తి 1,45,750 క్యూసెక్కుల నీటికి వదలడంతో జూరాల ప్రాజెక్టులోకి చేరుతున్న వరద క్రమేపి పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టులోకి 1,29,000 లక్షల క్యూసెక్కుల నీరు చేరగా.. విద్యుదుత్పత్తి చేస్తూ, గేట్లు ఎత్తి 1,34,161 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. మూడు రోజుల్లో తుంగభద్ర గేట్లు ఎత్తేసే అవకాశంఇక కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ఉధృతి మరింత పెరిగింది. తుంగభద్ర డ్యామ్లోకి 1,17,647 క్యూసెక్కుల నీటిరాకతో నీటినిల్వ 78.67 టీఎంసీలకు చే రుకుంది. నిండుకుండను తలపిస్తున్న తుంగభద్ర డ్యామ్ లో ఆదివారం విద్యుదుత్పత్తిని ప్రారంభించిన అధికారు లు.. 4,754 క్యూసెక్కులను దిగువకు వదిలారు. తుంగభద్రలో మరో మూడు రోజులు ఇదే రీతిలో వరద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో 27 టీఎంసీలు చేరితే తుంగభద్ర డ్యామ్ నిండుతుంది. మూడు రోజుల్లో తుంగభద్ర డ్యామ్ నిండే అవకాశముంది. సాగర్ నీటిమట్టం 504.30 అడుగులునాగార్జునసాగర్/మునగాల: నాగార్జునసాగర్ నీటిమట్టం ప్రస్తుతం 504.30 అడుగులుగా ఉంది. తాగునీటికి అవసరాల కోసం కుడి కాల్వ ద్వారా 5,700 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 3,146 క్యూసెక్కులు, ఏఎమ్మార్పీ ద్వారా 800 క్యూసెక్కులు ఇలా మొత్తం 9,646 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సాగర్కు ఇన్ఫ్లో ఏమాత్రం లేదు.ఎడమకాల్వ లాకుల వద్ద పహారా: సూర్యాపేట జిల్లా మునగాలలోని సాగర్ ఎడమకాల్వ ప్రధాన లాకుల వద్ద రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పహారా కాస్తున్నారు. తాగునీటి అవసరాల కోసం సాగర్ ఎడమకాల్వకు నీటిని విడుదల చేస్తుండగా, రైతులు ఈ నీటిని పంటల సాగుకు మళ్లించకుండా ఉండేందుకు పహారా ఏర్పాటు చేశారు. -
నేడు మల్లన్న చెంతకు కృష్ణమ్మ
సాక్షి, హైదరాబాద్/కాళేశ్వరం/నాగార్జునసాగర్: శ్రీశైలం మల్లన్న చెంతకు కృష్ణమ్మ శనివారం చేరుకోనుంది. కృష్ణా ప్రధాన పాయపై కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యా మ్ల నుంచి విడుదల చేస్తున్న వరద ప్రవాహం శుక్రవారం జూరాల ప్రాజెక్టుకు చేరుకుంది. జూరాలలో విద్యుత్ కేంద్రం, గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శనివారం వర ద ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుంటుంది. పశి్చమ క నుమల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణా ప్రధాన పా యలో శుక్రవారం వరద మరింత తగ్గింది.ఆల్మట్టి డ్యామ్లోకి 43,478 క్యూసెక్కుల నీరు రాగా, గేట్లు ఎత్తి 65,480 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. నారాయణపూర్ డ్యామ్లోకి 65,801 క్యూసెక్కుల నీరు చేరగా, గేట్లు ఎత్తి 70,780 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఎగువ నుంచి వరద వస్తుండటంతో జూరాల ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి చేస్తూ.. గేట్లు ఎత్తి దిగువకు 34,818 క్యూసెక్కులను వదిలేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ కేంద్రంలో తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ 7,063 క్యూసెక్కుల నీటిని దిగువకు తరలిస్తుండటంతో నీటి నిల్వ 33.11 టీఎంసీలకు తగ్గింది. నాగార్జునసాగర్లోకి వరద ప్రవాహం చేరడం లేదు. సాగర్ కుడి కాలువ, ఏఎమ్మార్పీ ద్వారా 8,165 క్యూసెక్కులను విడుదల చేస్తుండటంతో నీటి నిల్వ 123.5 టీఎంసీలకు తగ్గింది. నేడు తుంగభద్ర డ్యామ్లోకి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశంకృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ఉధృతి మరింత పెరిగింది. తుంగభద్ర డ్యామ్లోకి 1,08,270 క్యూసెక్కుల రా కతో నీటి నిల్వ 58.67 టీఎంసీలకు చేరుకుంది. తుంగభద్ర బే సిన్ పరిధిలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శనివారం తుంగభద్ర డ్యామ్లోకి వరద ఉధృతి మరింత పెరుగుతుందని సీడబ్ల్యూసీ ) అంచనా వేసింది. వరద ఇలానే కొనసాగితే నాలుగు రోజుల్లో తుంగభద్ర ప్రాజెక్టు నిండుతుంది. సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదలనాగార్జునసాగర్ జలాశయం నుంచి ఎడమకాల్వ ద్వారా అధికారులు శుక్రవారం 4వేల క్యూసెక్కులకు నీటిని విడుదల చేశారు. సాగర్ కుడి కాల్వ ద్వారా ఏపీలోని వివిధ జిల్లాలకు గత రెండు రోజుల నుంచి నిత్యం 5,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కాళేశ్వరం వద్ద 8.500 మీటర్ల ఎత్తులో నీటిప్రవాహంతెలంగాణలోని గోదావరి, మహారాష్ట్రలో ప్రాణహిత నదికి వరద తాకిడి పెరిగింది. అన్నారం(సరస్వతీ) బరాజ్ వద్ద మానేరు వాగు నుంచి 15 వేల క్యూసెక్కుల వరద రాగా, బరాజ్లోని మొత్తం 66 గేట్లు పూర్తిగా పైకి ఎత్తి నీటిని దిగు వకు వదిలారు. ఆ వరద నీరు దిగువన కాళేశ్వరం వద్ద కలు స్తోంది. గడ్చిరోలి జిల్లా మీదుగా ప్రాణహిత నదికి వరద పోటెత్తింది. ఆ నీరంతా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద కలుస్తుండడంతో పుష్కరఘాట్లను తాకుతూ వరద దిగువకు తరలిపోతోంది. పుష్కర ఘాట్ల వద్ద 8.500 మీటర్లు ఎత్తులో నీటిప్రవాహం కొనసాగుతోంది. అక్కడినుంచి మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్కు వరద తాకిడి పెరుగుతోంది. బరాజ్ వద్ద 3.73 లక్ష ల క్యూసెక్కుల వరద ప్రవాహం చేరుతోంది.బరాజ్లో మొ త్తం 85 గేట్లు పైకి ఎత్తి వచి్చన వరదను వచి్చనట్టు దిగువకు తరలిస్తున్నారు. దిగువన తుపాకులగూడెం బరాజ్లోకి 3,75, 430 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే స్థాయిలో దిగువకు వదిలారు. దుమ్ముగూడెం(సీతమ్మసాగర్)లోకి 3,47,511 క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. దాంతో భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. భద్రాచలం వద్దకు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 3.75 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం(సముద్ర మట్టానికి) 40.2 మీటర్లకు వరద చేరింది. -
తుంగభద్ర ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లు అందేనా?
సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ(ఐఎండీ) అంచనాల నేపథ్యంలో ఈ ఏడాది తుంగభద్ర డ్యామ్లో 170 టీఎంసీల లభ్యత ఉంటుందని తుంగభద్ర బోర్డు, ఏపీ, కర్ణాటక, తెలంగాణ జలవనరుల అధికారులు అంచనా వేస్తున్నారు.ప్రస్తుత నీటి సంవత్సరంలో అంటే ఈనెల 1 నుంచి తుంగభద్ర బేసిన్లో కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల ఇప్పటికి 0.67 టీఎంసీలు తుంగభద్ర డ్యామ్లోకి చేరాయి. ఇక శనివారం డ్యామ్లోకి 1,490 క్యూసెక్కులు చేరాయి. గతేడాది ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు సక్రమంగా కురవలేదు. దాంతో తుంగభద్ర డ్యామ్లోకి కేవలం 114.58 టీఎంసీల ప్రవాహం వచ్చింది. తాగునీటి అవసరాలకుపోను మిగతా నీటితో ఆరుతడి పంటలను ఆయకట్టు రైతులు సాగుచేశారు. ఈ ఏడాదైనా తుంగభద్ర డ్యామ్లో నీటి లభ్యత పుష్కలంగా పెరుగుతుందని.. ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లందాలని రైతులు ఆశిస్తున్నారు. కేటాయింపుల మేరకైనా లభ్యత ఉండేనా.. తుంగభద్ర డ్యామ్లో 230 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్.. కర్ణాటకకు 151.49, ఏపీకి 72 (హెచ్చెల్సీ 32.50, ఎల్లెల్సీ 29.50, కేసీ 10.00), తెలంగాణకు 6.51 (రాజోలిబండ డైవర్షన్ స్కీం) టీఎంసీల చొప్పున కేటాయించింది. ఏటా పూడిక పేరుకుపోతుండటంతో డ్యామ్ నిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. 2016లో నిర్వహించిన సర్వేలో డ్యామ్ సామర్థ్యం 105.78 టీఎంసీలని తేలింది. తగ్గిన నిల్వ సామర్థ్యం.. నీటిలభ్యత ఆధారంగా దామాషా పద్ధతిలో మూడు రాష్ట్రాలకు తుంగభద్ర బోర్డు పంపిణీ చేస్తూ వస్తోంది. గతేడాది తుంగభద్ర డ్యామ్లోకి కేవలం 114.58 టీఎంసీల ప్రవాహమే వచ్చింది. అంటే.. బచావత్ ట్రిబ్యునల్ అంచనా వేసిన దాంట్లో కేవలం 49.81 శాతం మేర మాత్రమే తుంగభద్ర డ్యామ్లో నీటి లభ్యత ఉన్నట్లు స్పష్టమవుతోంది.తుంగభద్ర డ్యామ్లోకి 2016–17లో కేవలం 85.719 టీఎంసీలే చేరాయి. డ్యామ్ చరిత్రలో అదే కనిష్ట వరద ప్రవాహం కావడం గమనార్హం. ఈ ఏడాదైనా బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకైనా నీటి లభ్యత ఉంటుందని రైతులు ఆశిస్తున్నారు. నాలుగేళ్లూ పుష్కలంగా నీటి లభ్యత.. తుంగభద్ర డ్యామ్లోకి 2015 నుంచి 2018 వరకు అరకొరగానే ప్రవాహం వచ్చింది. ఇక 2019–20 నుంచి 2022–23 వరకు నాలుగేళ్లు టీబీ డ్యామ్లో బచావత్ ట్రిబ్యునల్ అంచనా వేసిన దానికంటే అధికంగా లభ్యత నమోదైంది. బేసిన్లో భారీ వర్షాలు కురవడంతో డ్యామ్లోకి వరద ప్రవాహం కొనసాగింది. నీటి లభ్యత పుష్కలంగా ఉండటంతో రాయలసీమ, కర్ణాటక, తెలంగాణలోని ఆయకట్టు రైతులు భారీ ఎత్తున పంటలు సాగుచేయడంతో సస్యశ్యామలమైంది. దిగుబడులు భారీగా రావడం.. గిట్టుబాటు ధర దక్కడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. -
‘తుంగభద్ర’ సామర్థ్యంపై కర్ణాటకాలు
సాక్షి, అమరావతి: తుంగభద్ర డ్యామ్ వేదికగా కర్ణాటక సరికొత్త నాటకానికి తెరలేపింది. డ్యామ్ నీటినిల్వ సామర్థ్యం 100.85 టీఎంసీలు కాదు.. 105.78 టీఎంసీలని తుంగభద్ర బోర్డు 218వ సర్వసభ్య సమావేశంలో అంగీకరించిన కర్ణాటక 219వ సమావేశంలో అడ్డంతిరిగింది. డ్యామ్ నిల్వ సామర్థ్యం 105.78 టీఎంసీలు ఉండదని.. అంతకంటే తక్కువే ఉంటుందని.. మళ్లీ హైడ్రోగ్రాఫిక్ సర్వేచేసి, తేల్చాలని పట్టుబట్టింది. పూడికవల్ల డ్యామ్ నిల్వ సామర్థ్యం తగ్గిందనే సాకుచూపి.. జలవిస్తరణ ప్రాంతంలో చిన్నచిన్న ఎత్తిపోతలు, తాగునీటి పథకాలను చేపట్టి కర్ణాటక యథేచ్ఛగా జలచౌర్యానికి పాల్పడుతుండటంపై బోర్డును ఏపీ ప్రభుత్వం నిలదీసింది. దీనిపై సంయుక్త సర్వేచేసిన బోర్డు.. కర్ణాటక జలచౌర్యానికి పాల్పడుతోందని తేల్చడంతో కర్ణాటకానికి చెక్పడింది. దీంతో డ్యామ్ నీటినిల్వ సామర్థ్యంపై ఆ రాష్ట్రం పాత పల్లవి అందుకుందని బోర్డు వర్గాలు వెల్లడించాయి. పూడికతో 33 టీఎంసీలు తగ్గిన నిల్వ కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ల ఉమ్మడి ప్రాజెక్టు అయిన తుంగభద్ర డ్యామ్ను 1952లో 133 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. అప్పట్లో ఈ డ్యామ్ నిల్వ సామర్థ్యం 132.47 టీఎంసీలని సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) తేల్చింది. దీని నిల్వ సామర్థ్యం, ఏడాదిలో వచ్చే ప్రవాహాల ఆధారంగా అక్కడ 230 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్.. కర్ణాటకకు 151.49, ఏపీకి 72 (హెచ్చెల్సీ 32.50, ఎల్లెల్సీ 29.50, కేసీ 10.00), తెలంగాణకు 6.51 (రాజోలిబండ డైవర్షన్ స్కీం–ఆర్డీఎస్) టీఎంసీల చొప్పున కేటాయించింది. పూడిక కారణంగా నిల్వ సామర్థ్యం 100.85 టీఎంసీలుగా 2008లో నిర్వహించిన సర్వేలో తేలింది. దీంతో.. నీటి లభ్యత ఆధారంగా దామాషా పద్ధతిలో మూడు రాష్ట్రాలకు తుంగభద్ర బోర్డు నీటిని పంపిణీ చేస్తోంది. 133 నుంచి 105.78 టీఎంసీలకు.. తుంగభద్ర డ్యామ్లో నీటినిల్వ సామర్థ్యంపై ఆర్వీ అసోసియేట్స్ అనే సంస్థతో తుంగభద్ర బోర్డు 2016లో టోపోగ్రాఫికల్ సర్వేను చేయించింది. అందులో డ్యామ్ సామర్థ్యం 105.78 టీఎంసీలని తేలింది. ఆ సర్వేను కర్ణాటక అంగీకరించకపోవడంతో ఈ అంశంపై మూడు రాష్ట్రాల అధికారులతో జాయింట్ సర్వేను ఈ ఏడాది బోర్డు చేయించింది. ఇందులో డ్యామ్ నిల్వసామర్థ్యం 105.78 టీఎంసీలుగా తేలింది. ఈ క్రమంలోనే చిన్నచిన్న ఎత్తిపోతలు, తాగునీటి పథకాల ద్వారా కర్ణాటక జలచౌర్యానికి పాల్పడుతుండటం బయటపడింది. ఇదే అంశాన్ని ఏపీ ప్రభుత్వం ఎత్తిచూపడంతో గత బోర్డు సమావేశంలో డ్యామ్ నీటి సామర్థ్యాన్ని 105.78 టీఎంసీలుగా కర్ణాటక అంగీకరించింది. 2022–23లో దాన్నే పరిగణలోకి తీసుకున్న బోర్డు.. ఆ నీటిని మూడు రాష్ట్రాలకు పంపిణీ చేసింది. -
నవలి రిజర్వాయర్ మళ్లీ తెరపైకి..
సాక్షి, అమరావతి: తుంగభద్ర డ్యామ్లో పూడికవల్ల తగ్గిన నీటినిల్వ సామర్థ్యం మేరకు.. డ్యామ్కు ఎగువన నవలి వద్ద రిజర్వాయర్ నిర్మాణానికి అనుమతివ్వాలని తుంగభద్ర బోర్డుకు మరోసారి కర్ణాటక సర్కార్ ప్రతిపాదించింది. నవలి రిజర్వాయర్ను నిర్మిస్తే తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కర్ణాటక ప్రతిపాదనను తోసిపుచ్చాయి. కానీ, కర్ణాటక సర్కార్ మళ్లీ చేసిన ఆ రిజర్వాయర్ ప్రతిపాదనపై హైదరాబాద్లో శుక్రవారం నిర్వహించనున్న 219వ సర్వసభ్య సమావేశంలో చర్చించాలని తుంగభద్ర బోర్డు చైర్మన్ డీఎం రాయ్పురే నిర్ణయించారు. కొత్త నీటి సంవత్సరం (2023–24)లో తుంగభద్ర డ్యామ్లో నీటి పంపిణీ ప్రధాన అజెండాగా తుంగభద్ర బోర్డు సమావేశమవుతోంది. రాయ్పురే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణల ఈఎన్సీలు సి. నారాయణరెడ్డి, మురళీధర్ పాల్గొననున్నారు. దామాషా పద్ధతిలో నీటి పంపిణీ.. అంతర్రాష్ట్ర ప్రాజెక్టు తుంగభద్ర డ్యామ్ను 133 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 1953లో నిర్మించారు. డ్యామ్ వద్ద 75 శాతం నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్.. కర్ణాటకకు 151.49, ఆంధ్రప్రదేశ్కు 72, తెలంగాణకు 6.51 టీఎంసీలను కేటాయించింది. పూడిక పేరుకుపోవడంవల్ల డ్యామ్లో నీటినిల్వ 105.78 టీఎంసీలకు తగ్గింది. దాంతో నీటి లభ్యత కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో డ్యామ్లో నీటి లభ్యత ఆధారంగా మూడు రాష్ట్రాలకు దామాషా పద్ధతిలో జలాలను తుంగభద్ర బోర్డు పంపిణీ చేస్తోంది. వాటా జలాలను వాడుకోవడం పేరుతో.. డ్యామ్లో పూడిక పేరుకుపోవడంవల్ల మూడు రాష్ట్రాలు ఏటా సగటున 167–175 టీఎంసీలకు మించి వాడుకోలేకపోతున్నామని కర్ణాటక సర్కార్ చెబుతోంది. పూడిక తీయడానికి రూ.12,500 కోట్లు వ్యయమవుతుందని లెక్కలువేస్తోంది. దీనికి బదులు తుంగభద్ర డ్యామ్కు ఎగువన నది నుంచి వరద కాలువ తవ్వి నవలి వద్ద కొత్తగా 52 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మిస్తామని చెబుతోంది. దీంతోపాటు విఠల్పుర చెరువు సామర్థ్యాన్ని 4.52 టీఎంసీలకు, శివపుర చెరువు సామర్థ్యాన్ని 1.56 టీఎంసీలకు పెంచి ఎడమ కాలువ కింద ఆయకట్టును స్థిరీకరిస్తామని.. తుంగభద్ర డ్యామ్లో నిల్వఉన్న నీటితో మిగతా వాటా జలాలను వాడుకోవచ్చునని కర్ణాటక ప్రతిపాదిస్తోంది. ఈ రిజర్వాయర్ పనులకు రూ.9,500 కోట్ల వ్యయం అవుతుందని.. దామాషా పద్ధతిలో మూడు రాష్ట్రాలు భరించాలని తుంగభద్ర బోర్డు సమావేశాల్లో కోరుతూ వస్తోంది. వ్యతిరేకిస్తున్న రెండు రాష్ట్రాలు.. నవలి రిజర్వాయర్ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యతిరేకిస్తున్నాయి. అప్పర్ భద్ర, సింగటలూరు ఎత్తిపోతల ద్వారా ఇప్పటికే కేటాయించిన నీటికంటే అధికంగా కర్ణాటక వాడుకుంటోందని.. నవలి వద్ద రిజర్వాయర్ నిర్మిస్తే తమ హక్కులకు విఘాతం కలుగుతుందని స్పష్టంచేస్తున్నాయి. తుంగభద్ర హెచ్చెల్సీ (ఎగువ కాలువ)కు సమాంతరంగా వరద కాలువ తవ్వి.. వరద రోజుల్లో వాటా (32.5 టీఎంసీలు) తరలిస్తామని.. డ్యామ్లో నిల్వ నీటిని మూడు రాష్ట్రాలు పంచుకోవడం ద్వారా పూర్తిస్థాయిలో వాటా జలాలను వాడుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతూ వస్తోంది. -
తుంగభద్ర డ్యామ్కు భారీ వరద
సాక్షి, అమరావతి: కృష్ణా ప్రధాన ఉపనది అయిన తుంగభద్ర గతంలో ఎన్నడూ లేనిరీతిలో ఈ ఏడాది వరద ప్రవాహంతో పరవళ్లు తొక్కుతోంది. తుంగభద్ర వరద ఉద్ధృతికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణల ఉమ్మడి ప్రాజెక్టు అయిన తుంగభద్ర డ్యామ్ జూలై 13 నాటికే నిండిపోవడంతో గేట్లు ఎత్తేసి వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. అప్పటి నుంచి శుక్రవారం వరకు అంటే 66 రోజులుగా గేట్లను దించలేదు. జూన్ 1 నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు డ్యామ్లోకి 487.76 టీఎంసీల ప్రవాహం వచ్చింది. ఇందులో 1,632.74 అడుగుల్లో 104.74 టీఎంసీలను నిల్వచేస్తూ (గత నీటిసంవత్సరం ముగిసేనాటికి అంటే మే 31 నాటికి డ్యామ్లో 37.63 టీఎంసీల నీరు ఉంది).. ఆయకట్టుకు నీళ్లందిస్తూ, దిగువకు 390 టీఎంసీల మేర విడుదల చేశారు. తుంగభద్ర డ్యామ్లోకి సహజసిద్ధ ప్రవాహం డిసెంబర్ వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో డ్యామ్లో ఈ ఏడాది బచావత్ ట్రిబ్యునల్ అంచనా వేసిన మేరకు 230 టీఎంసీల లభ్యత ఉంటుందని, మూడు రాష్ట్రాలకు వాటా మేరకు నీటిని సరఫరా చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని తుంగభద్ర బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. నీటి లభ్యతపై ఆనందోత్సాహాలు తుంగభద్ర డ్యామ్లో 230 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్కు72 (హెచ్చెల్సీ 32.5, ఎల్లెల్సీ 29.5, కేసీ కెనాల్కు అసిస్టెన్స్), తెలంగాణకు 6.51 (ఆర్డీఎస్కు అసిస్టెన్స్), కర్ణాటకకు 151.49 టీఎంసీలను పంపిణీ చేసింది. 1980లో మాత్రమే బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన దానికంటే 1.383 టీఎంసీలు అధికంగా అంటే 231.383 టీఎంసీలను తుంగభద్ర డ్యామ్ ద్వారా మూడు రాష్ట్రాలు వినియోగించుకున్నాయి. డ్యామ్లో పూడిక పేరుకుపోతుండటంవల్ల నిల్వ సామర్థ్యం తగ్గడంతో.. నీటిలభ్యత ఆధారంగా దామాషా పద్ధతిలో మూడు రాష్ట్రాలకు తుంగభద్ర బోర్డు వాటా జలాలను పంపిణీ చేస్తోంది. ఈ ఏడాది 1980 తరహాలోనే నీటిలభ్యత ఉంటుందని తుంగభద్ర బోర్డు వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనిపై మూడు రాష్ట్రాల ఆయకట్టు రైతులు ఆనందోత్సాహాలను వ్యక్తం చేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్పై నేరుగా ఆధారపడి ఆంధ్రప్రదేశ్లో ఎల్లెల్సీ (దిగువ కాలువ) 1,57,062, హెచ్చెల్సీ (ఎగువ కాలువ) 2,84,992.. కర్ణాటకలో 8,96,456.. కలిపి 13,38,510 ఎకరాల ఆయకట్టు ఉంది. డ్యామ్ దిగువన రాయబసవన చానల్స్, విజయనగర చానల్స్ కింద కర్ణాటకలో 30,368, ఆంధ్రప్రదేశ్లో కేసీ కెనాల్ కింద 2,78,000, తెలంగాణలో ఆర్డీఎస్ కింద 87,000.. కలిపి 3,95,368 ఎకరాల ఆయకట్టు ఉంది. అంటే.. డ్యామ్పై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన 17,33,878 ఎకరాల ఆయకట్టు ఈ ఏడాది సస్యశ్యామలం కానుంది. నాలుగో అతిపెద్ద వరద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల ఉమ్మడి ప్రాజెక్టు తుంగభద్ర 1958లో పూర్తయింది. డ్యామ్ చరిత్రలో 1978లో 558.775 టీఎంసీల ప్రవాహమే అతి పెద్ద వరద. ఆ తర్వాత 1980లో వచ్చిన 553.1 టీఎంసీల ప్రవాహం రెండో అతిపెద్ద వరదగా నమోదైంది. 1992లో డ్యామ్లోకి వచ్చిన 519.60 టీఎంసీల ప్రవాహం మూడో అతిపెద్ద వరద. మూడు దశాబ్దాల తర్వాత ఈ ఏడాది తుంగభద్ర డ్యామ్లోకి శుక్రవారం వరకు వచ్చిన 487.76 టీఎంసీల ప్రవాహం నాలుగో అతిపెద్ద వరద. డిసెంబర్ వరకు డ్యామ్లోకి వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో.. 1992 కంటే ఎక్కువ ప్రవాహం వస్తుందని అంచనా వేస్తున్నారు. -
శ్రీశైలం, సాగర్ గేట్లు మళ్లీ ఎత్తివేత
సాక్షి, అమరావతి/విజయపురిసౌత్: ఎగువన విస్తారంగా వర్షాలు కురవడంతో కృష్ణా, తుంగభద్ర నదుల్లో మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. దీంతో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల రేడియల్ క్రస్ట్ గేట్లు మళ్లీ తెరుచుకున్నాయి. జూరాల, సుంకేసుల నుంచి 1,26,428 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయం 3 గేట్లు 10 అడుగులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా సాగర్ జలాశయంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయానికి 99,064 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా.. అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరువలో 589.40 (310.2522టీఎంసీలు) అడుగులకు చేరడంతో బుధవారం సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు 4 రేడియల్ క్రస్ట్గేట్లు, 8 గంటలకు 6 గేట్లు 5 అడుగులు ఎత్తి 48,222 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. క్రస్ట్గేట్లు, విద్యుదుత్పాదనతో కలిసి సాగర్ వద్ద నదిలోకి 84,864 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గరిష్ట స్థాయి నీటిమట్టం 590.00 అడుగులు 312.0450 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీలోకి సాయంత్రం 6 గంటలకు 18,067 క్యూసెక్కులు చేరుతుండగా.. 15,847 క్యూసెక్కులను కృష్ణా డెల్టాకు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 2,220 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. గోదావరిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 4,35,132 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 12,700 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 4,15,664 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
Heavy Rains-Telugu States: ఉగ్ర కృష్ణ.. మహోగ్ర గోదావరి
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: నైరుతి రుతు పవనాలు, బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వల్ల పరీవాహక ప్రాంతాల్లో (బేసిన్లో) విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నది ఉగ్రరూపం దాల్చితే.. గోదావరి మళ్లీ మహోగ్రరూపం దాల్చింది. వంశధారలోనూ వరద ఉధృతి కొనసాగుతోంది. కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్ర, గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో తీర ప్రాంతాల గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, తుంగభద్ర పోటాపోటీగా ప్రవహిస్తున్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యామ్లలోకి వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్ నుంచి 1,81,246 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తుండటంతో బుధవారం మంత్రాలయం వద్ద ప్రమాదకర రీతిలో 312.04 మీటర్లు వద్ద తుంగభద్ర ప్రవహిస్తోంది. కర్నూలు వద్ద 272.76 మీటర్లకు చేరుకుంది. దాంతో మంత్రాలయం, కర్నూలు నగరాలలో ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు పది గేట్లు ఎత్తివేత ఎగువ నుంచి వస్తున్న వరదకు స్థానికంగా కురిసిన వర్షాల వల్ల వాగులు, వంకల ద్వారా చేరుతున్న జలాలు తోడవడంతో శ్రీశైలంలోకి 3,60,436 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రాజెక్టులో గరిష్ట స్థాయిలో నీరు నిల్వ ఉండటంతో పది గేట్లను 12 అడుగుల మేర ఎత్తి 3,17,460 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. విద్యుదుత్పత్తి చేస్తూ కుడి కేంద్రం ద్వారా 29,833, ఎడమ కేంద్రం ద్వారా 31,784 క్యూసెక్కులు వదులుతున్నారు. నేడు సాగర్ గేట్లు ఎత్తివేత శ్రీశైలం నుంచి భారీగా వస్తున్న జలాలతో నాగార్జునసాగర్ నిండుకుండలా మారింది. సాగర్లోకి 3,61,296 క్యూసెక్కులు వస్తున్నాయి. నీటి నిల్వ 583.5 అడుగుల్లో 293.4 టీఎంసీలకు చేరుకుంది. మరో 19 టీఎంసీలు వస్తే ప్రాజెక్టు నిండిపోతుంది. గురువారం ఉదయం 6 గంటలకు సాగర్ ఒక గేటును ఎత్తివేయనున్నారు. ఆ తర్వాత ప్రతి గంటకూ ఒక గేటు చొప్పున ఎత్తుతూ 2 లక్షల నుంచి 2.50 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేయనున్నారు. గత మూడేళ్లుగా ఆగస్టులోనే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిండుతోంది. సాగర్ డ్యాం గేట్ల నిర్వహణ పనులను అధికారులు ఇప్పటికే పూర్తిచేశారు. డ్యాం 26 క్రస్టు గేట్లకు కొత్త ఇనుప రోప్లను బిగించారు. గేట్లకు గ్రీజింగ్, ఇతర మరమ్మతులు పూర్తి చేశారు. వరద నియంత్రణపై అధికారుల దృష్టి ఎగువ నుంచి భారీగా ప్రవాహం వస్తుండటంతో వరద నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జలవనరుల శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ నుంచి 75,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నందన పులిచింతలలో నీటి నిల్వ 40 టీఎంసీల లోపు ఉంచాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దాంతో పులిచింతల ప్రాజెక్టును ఖాళీ చేస్తున్నారు. దీంతో ప్రకాశం బ్యారేజ్లోకి 80,737 క్యూసెక్కులు చేరుతోంది. ఆ నీటినంతా ప్రకాశం బ్యారేజి నుంచి సముద్రంలోకి వదిలేస్తున్నారు. ప్రమాదకరంగా గోదావరి బేసిన్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. బుధవారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్దకు 11 లక్షల క్యూసెక్కులు వస్తోంది. నీటి మట్టం 50.6 అడుగులకు చేరుకుంది. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గురువారం 55 అడుగులకు చేరుతుందని కేంద్ర జల వనరుల శాఖ వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు వద్దకు 10,10,387 క్యూసెక్కులు చేరుతుండటంతో స్పిల్వే ఎగువన 33.37 మీటర్లు, దిగువన 24.76 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టులోకి వచ్చిన వరదను 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. దాంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం వద్ద రాత్రి 10 గంటలకు నీటి మట్టం 13.40 అడుగులకు చేరింది. కాటన్ బ్యారేజ్లోని మొత్తం 175 గేట్లను పూర్తిగా పైకి లేపి 12,43,405 క్యూసెక్కులు సముద్రంలోకి వదులుతున్నారు. గోదావరి డెల్టాకు 6,500 క్యూసెక్కులు వదులుతున్నారు. వంశధారలో వరద ఉద్ధృతి బేసిన్లో కురుస్తున్న వర్షాలతో వంశధార వరద ఉద్ధృతి కొనసాగుతోంది. గొట్టా బ్యారేజ్లోకి 24,124 క్యూసెక్కులు చేరుతుండగా.. ఆయకట్టుకు 2849 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 21,275 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
నాగార్జునసాగర్లోకి 1.56 లక్షల క్యూసెక్కుల వరద
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయవాడ/శ్రీశైలం ప్రాజెక్ట్: నాగార్జునసాగర్లోకి ఎగువ నుంచి వరద ఉద్ధృతి పెరిగింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 1,56,766 క్యూసెక్కులు చేరుతుండగా కుడి, ఎడమ కాలువలు, ఏఎమ్మార్పీలకు 7,048 క్యూసెక్కులు వదులుతున్నారు. విద్యుదుత్పత్తి చేస్తూ నదిలోకి 4,774 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్లో 572.10 అడుగుల్లో 261.84 టీఎంసీల నీరు ఉంది. సాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు. పూర్తి నీటినిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు. సాగర్ నిండాలంటే ఇంకా 50 టీఎంసీలు కావాలి. ఆదివారం పశ్చిమ కనుమల్లో కుద్రేముఖ్ పర్వతశ్రేణుల్లో విస్తారంగా కురిసిన వర్షాలకు తుంగభద్రలో ఎగువన వరద ఉద్ధృతి పెరిగింది. ప్రకాశం బ్యారేజ్లోకి వరద సాగర్లో విద్యుదుత్పత్తి దిగువకు విడుదల చేస్తున్న నీటికి, మూసీ, హాలియా నదుల ప్రవాహం తోడవడంతో పులిచింతల్లోకి 35 వేల క్యూసెక్కులు చేరుతుండగా స్పిల్వే గేట్లు, విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా అంతేస్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. వాటికి పాలేరు, మున్నేరు తదితర వాగులు, వంకల వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజ్లోకి 50,276 క్యూసెక్కుల నీరు చేరుతోంది. కృష్ణాడెల్టాకు 9,741 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మిగిలిన 40,535 క్యూసెక్కులను బ్యారేజ్ 55 గేట్లు ఒక్క అడుగుమేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్ 30 గేట్లు ఎత్తివేత శనివారం రాత్రి, ఆదివారం పశ్చిమ కనుమల్లో తుంగ, భద్ర నదులు పురుడుపోసుకునే కుద్రేముఖ్ పర్వతశ్రేణుల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో తుంగభద్ర డ్యామ్లోకి వరద ఉద్ధృతి పెరిగింది. ఆదివారం రాత్రి 7 గంటలకు తుంగభద్ర డ్యామ్లోకి 98,519 క్యూసెక్కుల నీరు చేరుతోంది. నీటి నిల్వ గరిష్టస్థాయిలో 101.27 టీఎంసీలు ఉండటంతో 30 గేట్లను ఎత్తి 98,561 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 3 లక్షల క్యూసెక్కులు కడలిలోకి పరీవాహక ప్రాంతంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద ప్రవాహం కాస్త పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజ్లోకి ఆదివారం సాయంత్రం 6 గంటలకు 3,10,843 క్యూసెక్కులు చేరుతుండగా గోదావరి డెల్టాకు 9,700 క్యూసెక్కులు వదులుతూ మిగిలిన 3,01,143 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. గొట్టా బ్యారేజ్, నారాయణపురం ఆనకట్టల నుంచి సముద్రంలోకి.. ఒడిశా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వంశధార, నాగావళి పరవళ్లు తొక్కుతున్నాయి. వంశధార నుంచి గొట్టా బ్యారేజ్లోకి 7,470 క్యూసెక్కులు చేరుతుండగా కాలువలకు 1,392 క్యూసెక్కులు వదులుతూ మిగిలిన 6,078 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. నాగావళి వరద ఉద్ధృతితో నారాయణపురం ఆనకట్టలోకి 6,200 క్యూసెక్కులు చేరుతుండగా అంతేస్థాయిలో సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఈ సీజన్లో శ్రీశైలం గేట్లు ఎత్తడం ఇది మూడోసారి శనివారం రాత్రి శ్రీశైలంలోకి వరద ప్రవాహం తగ్గడంతో గేట్లను మూసివేశారు. కానీ.. శనివారం రాత్రి, ఆదివారం నారాయణపూర్ డ్యామ్కు దిగువన కృష్ణా ప్రధాన పాయ, తుంగభద్ర పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల శ్రీశైలంలోకి వరద ఉద్ధృతి పెరిగింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,52,670 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండటంతో మూడుగేట్లను పదడుగుల మేర ఎత్తి 83,673 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమగట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 63,442 క్యూసెక్కులను దిగువకు వదలుతున్నారు. దీంతో 1,47,115 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నట్లయింది. ప్రస్తుతం శ్రీశైలంలో 884.6 అడుగుల్లో 213.40 టీఎంసీల నీరు ఉంది. శ్రీశైలం నుంచి దిగువకు విడుదల చేస్తున్న ప్రవాహం సాగర్ వైపు పరుగులు పెడుతోంది. సోమవారం శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉంది. -
మూడేళ్లుగా.. అదే జోరుగా..
సాక్షి, అమరావతి: నీటి లభ్యతలో కృష్ణాతో ఉప నది తుంగభద్ర పోటీ పడుతోంది. చరిత్రలో లేని విధంగా జూలై మూడో వారానికే తుంగభద్ర డ్యామ్లోకి 172.89 టీఎంసీల ప్రవాహం వచ్చింది. నైరుతి రుతు పవనాల ప్రభావం వల్ల కురిసే వర్షాలతో అక్టోబర్ వరకు డ్యామ్లోకి వరద కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత మూడేళ్లతో పోల్చితే ఈ ఏడాది తుంగభద్రలో నీటి లభ్యత అధికంగా ఉంటుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది తుంగభద్ర డ్యామ్, దిగువన ప్రాజెక్టులపై ఆధారపడ్డ మూడు రాష్ట్రాల్లోని 17,33,878 ఎకరాల ఆయకట్టు రైతులకు మేలు చేస్తుందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల ఉమ్మడి ప్రాజెక్టు తుంగభద్ర 1958లో పూర్తయింది. డ్యామ్లో 230 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్ ఆంధ్రపద్రేశ్కు 72 టీఎంసీలు (హెచ్చెల్సీ 32.5, ఎల్లెల్సీ 29.5, కేసీ కెనాల్కు అసిస్టెన్స్), తెలంగాణకు 6.51 (ఆర్డీఎస్కు అసిస్టెన్స్), కర్ణాటకకు 151.49 టీఎంసీలు పంపిణీ చేసింది. 1980–81లో మాత్రమే ట్రిబ్యునల్ కేటాయించిన దానికంటే 1.383 టీఎంసీలు అధికంగా అంటే 231.383 టీఎంసీలను డ్యామ్ ద్వారా మూడు రాష్ట్రాలు వినియోగించుకొన్నాయి. డ్యామ్లో పూడిక పేరుకుపోతుండటంతో నిల్వ సామర్థ్యం తగ్గింది. దీంతో బోర్డు నీటి లభ్యత ఆధారంగా దామాషా పద్ధతిలో మూడు రాష్ట్రాలకు జలాలను పంపిణీ చేస్తోంది. గత మూడేళ్లుగా తుంగభద్ర డ్యామ్, దాని దిగువన ఉన్న రాయబసవన, విజయనగర చానల్స్, ఆర్డీఎస్(రాజోలిబండ డైవర్షన్ స్కీం), కేసీ కెనాల్కు నీటిని సరఫరా చేసే సుంకేశుల బ్యారేజీ వద్ద నీటి లభ్యత మెరుగ్గా ఉంది. డ్యామ్ చరిత్రలో ఈ ఏడాదే అధికంగా ప్రవాహం వచ్చింది. డ్యామ్లో గరిష్ట స్థాయిలో 104.5 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. కాలువలకు విడుదల చేయగా మిగులుగా ఉన్న సుమారు వంద టీఎంసీలను దిగువకు విడుదల చేశారు. ఈ జలాలు సుంకేశుల బ్యారేజ్ మీదుగా శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతున్నాయి. పంటల సాగులో రైతులు నిమగ్నం తుంగభద్ర డ్యామ్పై నేరుగా ఆధారపడి ఆంధ్రప్రదేశ్లో ఎల్లెల్సీ (దిగువ కాలువ) 1,57,062 ఎకరాలు, హెచ్చెల్సీ (ఎగువ కాలువ) కింద 2,84,992 ఎకరాలు, కర్ణాటకలో 8,96,456 ఎకరాలు.. మొత్తం 13,38,510 ఎకరాల ఆయకట్టు ఉంది. డ్యామ్ దిగువన రాయబసవన, విజయనగర చానల్స్ కింద కర్ణాటకలో 30,368 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్లో కేసీ కెనాల్ కింద 2,78,000 ఎకరాలు, తెలంగాణలో ఆర్డీఎస్ కింద 87,000 ఎకరాలు వెరసి 3,95,368 ఎకరాల ఆయకట్టు ఉంది. అంటే.. డ్యామ్పై ఆధారపడిన మొత్తం ఆయకట్టు 17,33,878 ఎకరాలు. డ్యామ్ ద్వారా నీటిని విడుదల చేస్తుండటంతో ఆయకట్టు రైతులు పంటల సాగులో నిమగ్నమయ్యారు. -
తుంగభద్ర డ్యామ్కు పెరిగిన వరద
హొళగుంద (కర్నూలు): కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రాజెక్ట్ అయిన తుంగభద్ర డ్యామ్లో ఇన్ఫ్లో ఆదివారం మరింత మెరుగు పడింది. శనివారం 72,592 క్యూసెక్కులుగా ఉన్న ప్రవాహ జలాలు ఆదివారం 89,664 క్యూసెక్కులకు పెరిగాయి. తుంగభద్ర రిజర్వాయర్ పూర్తి నీటిమట్టం 1,633 అడుగులు కాగా.. ఆదివారం ఉదయం 8 గంటలకు 1,605.56 అడుగులుగా నమోదైంది. 100.855 టీఎంసీల నీటి సామర్థ్యానికి గాను 27.481 టీఎంసీలుండగా సాయంత్రానికి 32 టీఎంసీలకు పైగా నీరు నిల్వ అయ్యాయి. అందులో 255 క్యూసెక్కులను రాయబసవన కెనాల్కు వదులుతున్నారు. గతేడాది ఇదే సమయానికి 1,585.77 అడుగులతో 7.033 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఉపరితల ద్రోణి, అకాల వర్షాల కారణంగా డ్యామ్ ఎగువ ప్రాంతాలైన శివమొగ్గ, ఆగుంబే, శృంగేరి, చిక్మగళూరు, వరనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇన్ఫ్లో బాగా పెరిగింది. -
ఆర్డీఎస్పై అధ్యయనం
సాక్షి, అమరావతి: రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) లక్ష్యాలు నెరవేరుతున్నాయా? లక్ష్యాలు సాధించలేకపోతే దానికి కారణం నిర్వహణ లోపమా? డిజైన్ లోపమా? అనే అంశాలను తేల్చనున్నారు. ఈ అధ్యయనం బాధ్యతలను పుణెలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్ )కు అప్పగించనున్నారు. ఈమేరకు కృష్ణా బోర్డు సభ్యుడు ఆర్కే పిళ్లై చేసిన ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. అధ్యయనానికి ఆర్నెళ్ల గడువు ఇచ్చారు. వచ్చే రబీ నాటికి ఆ నివేదికను అమలు చేస్తామని ఆర్కే పిళ్లై చెప్పారు. బుధవారం హైదరాబాద్లో కృష్ణా బోర్డు కార్యాలయంలో పిళ్లై అధ్యక్షతన ఆర్డీఎస్పై ప్రత్యేక సమావేశం జరిగింది. తుంగభద్ర బోర్డు సభ్య కార్యదర్శి నాగమోహన్, ఏపీ సీఈ సి.మురళీనాథ్రెడ్డి, తెలంగాణ సీఈ మోహన్కుమార్, కర్ణాటక సీఈ ఈ సమావేశంలో పాల్గొన్నారు. తుంగభద్ర జలాశయం నుంచి ఏపీకి చెందిన కేసీ కెనాల్ కోటా కింద విడుదల చేసిన నీటిని కర్ణాటక, తెలంగాణ మళ్లిస్తున్నట్లుగా జనవరి 28న బోర్డు జాయింట్ కమిటీ నిర్వహిం చిన క్షేత్రస్థాయి తనిఖీల్లో వెల్లడైంది. ఈ అంశాన్ని పిళ్లై ప్రస్తావించారు. దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులను హరించడం సరికాదన్నారు. దీనిపై తెలంగాణ సీఈ స్పందిస్తూ.. ఆర్డీఎస్కు బచావత్ ట్రిబ్యునల్ 17.1 టీఎంసీలను కేటాయించిందని, ఇందులో తుంగభద్ర డ్యామ్ నుంచి 7 టీఎంసీలను విడుదల చేయాలని పేర్కొందని అన్నారు. ఆర్డీఎస్ ఎడమ కాలువ కింద ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 87,500 ఎకరాల ఆయకట్టు ఉందని, ఏపీ జల చౌర్యం కారణంగా నీళ్లందక ఆ రైతులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారని చెప్పారు. దీనిపై ఏపీ సీఈ మురళీనాథ్రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ దశలో పిళ్లై స్పందిస్తూ... కేసీ కెనాల్ కోటా కింద వి డుదల చేసిన నీటినే ఆర్డీఎస్ ఎడమ కాలువ ద్వారా కర్ణాటక, తెలంగాణ మళ్లిస్తున్నాయని తేల్చిచెప్పారు. దీంతో తెలంగాణ సీఈ మిన్నకుండిపోయారు. బచావత్ ట్రిబ్యునల్ తమకు కేటాయించిన జలాలు దక్కడం లేదని తెలంగాణ సీఈ వాదించడంతో దాన్ని తేల్చేందుకు సీడబ్ల్యూపీఆర్ఎస్తో అధ్యయనం చేయిస్తామని కృష్ణా బోర్డు తెలిపింది. తుమ్మిళ్ల ఆపేయాల్సిందే.. తుంగభద్ర డ్యామ్ నుంచి కేసీ కెనాల్కు 10, ఆర్డీ ఎస్కు 7 టీఎంసీల కోటా ఉన్నందున నదిలో సహజప్రవాహం లేనప్పుడు.. తుంగభద్ర నుంచి 10:7 నిష్పత్తిలో నీటిని విడుదల చేసి.. దామాషా పద్ధతి లో ఆర్డీఎస్ వద్ద మూడు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేయాలని ఏపీ సీఈ మురళీనాథ్రెడ్డి చేసిన ప్రతిపాదనను కృష్ణా బోర్డు అంగీకరించింది. ఆర్డీఎస్కు దిగువన సుంకేశుల బ్యారేజీ జల విస్తరణ ప్రాంతంలో తెలంగాణ సర్కారు అక్రమంగా నిర్మించిన తుమ్మిళ్ల ఎత్తిపోతలను నిలిపివేయాలన్న డిమాండ్తోనూ కృష్ణాబోర్డు ఏకీభవించింది. తుమ్మిళ్ల ఎత్తిపోతలను ఆపేయాలని ఆర్కేపిళ్లై ఆదేశించారు. -
నిండుగా తుంగభద్ర.. రికార్డు స్థాయిలో నీటి నిల్వలు
సాక్షి, అమరావతి: తుంగభద్ర డ్యామ్లో డిసెంబరు నాలుగోవారానికి రికార్డు స్థాయిలో నీటి నిల్వలు ఉన్నాయి. డ్యామ్ చరిత్రలో తొలిసారిగా శనివారం 1632.14 అడుగుల్లో 97.55 టీఎంసీల నీరు ఉంది. దీంతో ఆయకట్టు రైతుల్లో నూతనోత్సాహం నెలకొంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఖరీఫ్ పంటల కోతలు దాదాపుగా పూర్తయినా, డ్యామ్లో ఈ స్థాయిలో నీరు ఉండటం లేట్ ఖరీఫ్తో పాటు రబీకీ ఉపయోగకరమని రైతులు, అధికారులు చెబుతున్నారు. తుంగభద్ర డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,633 అడుగులు. పూర్తి నీటి నిల్వ 100.86 టీఎంసీలు. చదవండి: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు గతేడాది ఇదే రోజు (డిసెంబరు 25కి) 1625.26 అడుగుల్లో 73.74 టీఎంసీలు నిల్వ ఉంది. ఈ ఏడాది అంతకంటే ఎక్కువ నీరుంది. గత పదేళ్లలో ఇదే రోజుకి సగటున 55.20 టీఎంసీలు మాత్రమే. అంటే డ్యామ్లో గత పదేళ్ల కంటే ఈ ఏడాది 42.35 టీఎంసీలు అధికంగా నిల్వ ఉంది. దీంతో లేట్ ఖరీఫ్, రబీ పంటలకు సమృద్ధిగా నీటిని సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఒక్క సారే కేటాయించిన మేరకు వినియోగం తుంగభద్ర డ్యామ్లో 230 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్ కర్ణాటకకు 151.49 (ఆవిరి నష్టాలు 12.50), ఆంధ్రప్రదేశ్కు 72 (ఆవిరి నష్టాలు 5.50), తెలంగాణకు 6.51 టీఎంసీలు కేటాయించింది. రాష్ట్రానికి కేటాయించిన నీటిలో హెచ్చెల్సీకి 32.5, ఎల్లెల్సీకి 29.5, కేసీ కెనాల్ ద్వారా 10 టీఎంసీలు సరఫరా చేస్తారు. నీటి లభ్యత సరిగా లేకపోవడంతో 1980–81లో మినహా మిగిలిన ఏ సంవత్సరాల్లోనూ కేటాయించిన మేరకు మూడు రాష్ట్రాలూ నీటిని వాడుకోలేదు. డ్యామ్లో పూడిక పేరుకుపోవడం, వర్షాభావం కారణంగా నీటి లభ్యత తగ్గింది. దీంతో దామాషా పద్ధతిలో మూడు రాష్ట్రాలకు తుంగభద్ర బోర్డు నీటిని కేటాయిస్తోంది. అయితే, ఈ ఏడాది తుంగభద్ర పరివాహక ప్రాంతంలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో డ్యామ్లోకి శనివారం వరకు 382.47 టీఎంసీల నీరు వచ్చింది. దీంతో తుంగభద్ర బోర్డు మూడు రాష్ట్రాలకూ 109 టీఎంసీలు విడుదల చేసింది. ఇందులో హెచ్చెల్సీ, ఎల్లెల్సీ ద్వారా 35 టీఎంసీలను రాష్ట్రం వినియోగించుకుంది. స్పిల్ వే గేట్లు, విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 135 టీఎంసీలను బోర్డు దిగువకు వదిలేసింది. డ్యామ్లో ఇప్పటికీ 97.55 టీఎంసీలు ఉండటంతో అందులో కనీస నీటి మట్టానికి పైన లభ్యతగా ఉన్న నీటిలో రాష్ట్ర వాటా కింద కనీసం 18 టీఎంసీలు వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనివల్ల తుంగభద్ర హెచ్చెల్సీ కింద అనంతపురం జిల్లాలో లేట్ ఖరీఫ్, వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాల్లో రబీ, ఎల్లెల్సీ కింద కర్నూలులో ఆరుతడి పంటలకు సమృద్ధిగా నీళ్లందించవచ్చని అధికారులు చెబుతున్నారు. -
గోదావరిలో వరద తగ్గుముఖం
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/కొవ్వూరు: నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో గోదావరిలో వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 9,09,385 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. గోదావరి డెల్టా కాలువలకు 9,200 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 9,00,185 క్యూసెక్కుల (77.78 టీఎంసీలు)ను సముద్రంలోకి వదిలేస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం వల్ల మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశా, ఉభయగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో ఉప నదులు ఉప్పొంగి గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం భద్రాచలం, ధవళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శనివారం ఉదయం నుంచి గోదావరిలో వరద ప్రవాహం తగ్గింది. దాంతో భద్రాచలం, ధవళేశ్వరం వద్ద ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. పోలవరం వద్దకు చేరుతున్న 9.10 లక్షల క్యూసెక్కులను 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. ఆ జలాలు ధవళేశ్వరం బ్యారేజీలోకి చేరుతున్నాయి. కృష్ణా, ప్రధాన ఉప నది, తుంగభద్రల్లో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 45 వేల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం 880.1 అడుగులకు చేరుకుంది. ఆగని తెలంగాణ విద్యుదుత్పత్తి ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ సర్కార్ నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ 11 వేల క్యూసెక్కులు తరలిస్తోంది. ప్రస్తుతం శ్రీశైలంలో 188.58 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నాగార్జునసాగర్లోకి 14,757 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే స్థాయిలో కాలువలకు, విద్యుదుత్పత్తి ద్వారా విడుదల చేస్తున్నారు. సాగర్లో 305.51 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టులోకి 6 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిల్ వే గేట్లు, విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 25 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజీలోకి 35,150 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టా కాలువలకు 12,755 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 22,260 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. 2,600 కుటుంబాలు తరలింపు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం క్రమం తగ్గుతూ సాయంత్రానికి 11.10 అడుగులకు చేరింది. ఆనకట్టకు దిగువన యలమంచిలి మండలం కనకాయలంక గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టింది. వరద నీరు పెరగడంతో వేలేరుపాడు మండలంలో పెద్ద వాగు, ఎద్దెలవాగు, మేళ్ల వాగులోకి వరదనీరు చేరింది. మండలంలోని 32 ఏజెన్సీ గ్రామాలు, పోలవరం మండలంలోని 19 ఏజెన్సీ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అధికారులు ముందుజాగ్రత్త చర్యగా 2,600 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. -
‘కృష్ణా’లో వరద హోరు
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం.. పి.గన్నవరం: పశ్చిమ కనుమల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా, ఉప నదుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ నుంచి వచ్చిన వరదను వచ్చినట్టుగా ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల నుంచి దిగువకు వదిలేస్తున్నారు. దీంతో సోమవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 3.17 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. నీటి నిల్వ 150 టీఎంసీలకు చేరుకుంది. ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ తెలంగాణ సర్కార్ దిగువకు వదులుతున్న 25,427 క్యూసెక్కులు నాగార్జునసాగర్కు చేరుతున్నాయి. సాగర్కు దిగువన మూసీ ప్రవాహం కృష్ణా నదిలోకి కొనసాగుతుండటంతో పులిచింతల ప్రాజెక్టులోకి 10,600 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. విద్యుదుత్పత్తి చేస్తూ ఆ నీటిని కూడా తెలంగాణ సర్కార్ దిగువకు వదిలేస్తోంది. ఈ ప్రవాహానికి కట్టలేరు, వైరా, మున్నేరుల వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజీలోకి 37,712 క్యూసెక్కులు చేరుతున్నాయి. కాలువలకు 4,322 క్యూసెక్కులు విడుదల చేసి.. మిగులుగా ఉన్న 33,390 క్యూసెక్కులను 45 గేట్లను అడుగు మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నామని ఈఈ స్వరూప్ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటికే 35 టీఎంసీల కృష్ణా జలాలు కడలిపాలయ్యాయి. మరోవైపు వరద ఉధృతితో తుంగభద్ర డ్యామ్ నిండిపోయింది. దీంతో గేట్లు ఎత్తేసి దిగువకు 1.49 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. ఆ జలాలు మంగళవారం సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టుకు చేరనున్నాయి. గోదా‘వడి’ తగ్గింది.. పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో గోదావరిలో వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు 5,76,833 క్యూసెక్కుల వరద చేరింది. స్పిల్ వే వద్ద వరద నీటిమట్టం 31.88 మీటర్లకు తగ్గింది. వచ్చిన వరదను వచ్చినట్టుగా పోలవరం స్పిల్ వే 42 గేట్ల నుంచి దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీలోకి వరద ప్రవాహం 7,93,468 క్యూసెక్కులకు తగ్గడంతో నీటిమట్టం 10.85 మీటర్లకు తగ్గింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. గోదావరి డెల్టా కాలువలకు 10,200 క్యూసెక్కులు వదిలి.. మిగులుగా ఉన్న 7,83,268 క్యూసెక్కులను 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీలోకి వచ్చే వరద మంగళవారం మరింత తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో వరద ఉధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలోని వశిష్ట, వైనతేయ నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిలంక, బూరుగులంక గ్రామాలతోపాటు ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దులో ఉన్న అనగర్లంక, పెదమల్లంక, సిర్రావారిలంక, అయోధ్యలంక, కనకాయలంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. -
తుంగభద్ర జలాల వినియోగంలో రికార్డు
సాక్షి, అమరావతి: తుంగభద్ర జలాల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఈ నీటి సంవత్సరంలో గరిష్ట స్థాయిలో 54.363 టీఎంసీలను తుంగభద్ర జలాశయం ద్వారా.. సుంకేశుల బ్యారేజీ నుంచి కేసీ కెనాల్ ద్వారా 23.806 టీఎంసీలు.. మొత్తం 78.169 టీఎంసీలు వినియోగించుకుంది. రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) కింద తెలంగాణ సర్కార్ 5.93 టీఎంసీలు వాడుకుంది. దాంతో హెచ్చెల్సీ (ఎగువ కాలువ), ఎల్లెల్సీ (దిగువ కాలువ), కర్నూల్–కడప (కేసీ) కెనాల్ కింద ఖరీఫ్, రబీల్లో 5,27,013 ఎకరాలకు సర్కార్ నీళ్లందించగలిగింది. కర్ణాటక పరిధిలో హెచ్చెల్సీ ఆధునికీకరణ.. జలచౌర్యానికి అడ్డుకట్ట వేయడంవల్లే ఈ ఏడాది తుంగభద్ర జలాశయం నుంచి గరిష్ట స్థాయిలో నీటిని రాబట్టగలిగామని అధికార వర్గాలు చెబుతున్నాయి. పూడికతో తగ్గిన డ్యామ్ సామర్థ్యం ► 1953లో తుంగభద్ర డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 132.47 టీఎంసీలు. పూడిక పేరుకుపోవడంతో జలాశయంలో నీటినిల్వ సామర్థ్యం 100.855 టీఎంసీలకు తగ్గింది. దీంతో ఇది నీటి లభ్యతపై ప్రభావం చూపుతుండటం వల్ల దామాషా పద్ధతిలో తుంగభద్ర బోర్డు నీటిని కేటాయిస్తోంది. ► తుంగభద్ర డ్యామ్లో ఏడాదికి 230 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్ కర్ణాటకకు 151.49, ఉమ్మడి రాష్ట్రానికి 78.51 టీఎంసీలు (ఆర్డీఎస్ వాటాగా తెలంగాణకు 6.51 టీఎంసీలు) కేటాయించింది. ఇక ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 72 టీఎంసీల్లో.. హెచ్చెల్సీకి 32.50, ఎల్లెల్సీకి 29.5 కేసీ కెనాల్కు పది టీఎంసీల వాటా ఉంది. తుంగభద్ర బోర్డు చరిత్రలో ఇదే రికార్డు.. ► ఈ నీటి సంవత్సరంలో తుంగభద్ర డ్యామ్కు ఎన్నడూ లేని రీతిలో 415.77 టీఎంసీల ప్రవాహం వచ్చింది. డ్యామ్లో 173.673 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన బోర్డు హెచ్చెల్సీకి 27.39, ఎల్లెల్సీకి 20.215, కేసీ కెనాల్కు ఉన్న వాటాలో 6.758 టీఎంసీలు (ఇందులో 2.802 టీఎంసీలను హెచ్చెల్సీకి మళ్లించారు) విడుదల చేశారు. అంటే తుంగభద్ర డ్యామ్ నుంచి ఈ ఏడాది రాష్ట్రం 54.363 టీఎంసీలు వినియోగించుకుంది. బోర్డు చరిత్రలో ఇంత నీటిని రాష్ట్రం వినియోగించుకోవడం ఇదే తొలిసారి. ► హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, కేసీ కెనాల్ కింద రాయలసీమలో 5.27 లక్షల ఎకరాలకు నీళ్లందించడం ద్వారా ఈ ఏడాది సరికొత్త రికార్డును సర్కార్ నెలకొల్పింది. కర్ణాటక జలచౌర్యానికి అడ్డుకట్ట కర్ణాటక పరిధిలో హెచ్చెల్సీ, ఎల్లెల్సీల నుంచి రైతులు భారీఎత్తున జలచౌర్యం చేసేవారు. దాంతో తుంగభద్ర జలాలు రాయలసీమకు సక్రమంగా చేరేవి కాదు. కానీ, ఈ ఏడాది తుంగభద్ర బోర్డుపై సర్కార్ తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చింది. హెచ్చెల్సీ, ఎల్లెల్సీ కాలువలపై సీఆర్పీఎఫ్ విభాగంతో గస్తీ నిర్వహించడం ద్వారా జలచౌర్యానికి అడ్డుకట్ట వేయగలిగింది. అలాగే, హెచ్చెల్సీ, ఎల్లెల్సీల పనులు పూర్తిచేయడంవల్ల కూడా సరఫరా నష్టాలు తగ్గాయి. దీనివల్లే ఈ ఏడాది అధిక ఆయకట్టుకు సర్కార్ నీళ్లందించడంతో దిగుబడులు బాగా వచ్చాయి. దీంతో వరి, వేరుశనగ, మిర్చి, ఉల్లి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
20 కిలోమీటర్ల పైప్లైన్కు రూ. 1,300 కోట్లు
సాక్షి, బళ్లారి : తుంగభద్ర బోర్డు పరిధిలోని బళ్లారి – కర్నూలు జిల్లాల మధ్య ఎల్ఎల్సీ (లో లెవల్ కెనాల్) ద్వారా 20 కిలోమీటర్ల మేర పైప్లైన్ పనులు చేసేందుకు ఏకంగా రూ.1,300 కోట్లు కేటాయిస్తూ ఎన్నికల ముంగిట జారీ అయిన జీవో వెలుగు చూడటం కలకలం రేపుతోంది. తుంగభద్ర బోర్డు అనుమతి లేకుండా సాధారణ పనికి ఇంతపెద్ద మొత్తంలో నిధుల కైంకర్యానికి గత చంద్రబాబు ప్రభుత్వం వ్యూహం రచించడం పట్ల నీటి పారుదల శాఖ నిపుణులు విస్తుపోతున్నారు. ఇటీవల బెంగళూరులో నిర్వహించిన తుంగభద్ర బోర్డు సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చింది. పలువురు చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుపట్టారని సమాచారం. తుంగభద్ర డ్యాం నుంచి ప్రారంభమయ్యే ఎల్ఎల్సీ 250 కిలోమీటర్ల పొడవు ఉంది. ఈ కాలువ అధ్వానంగా మారడంతో 0 నుంచి 70 కిలోమీటర్ల వరకు ఆధునికీకరణ పనుల కోసం రూ.200 కోట్లు ఖర్చు చేశారు. కాగా, మిగిలిన 180 కిలోమీటర్ల మేర పనులు మొదలవ్వలేదు. ఈ కాలువ మొత్తం లైనింగ్, ఆధునికీకరణ పనులు చేపట్టడానికి మరో రూ.1,200 కోట్ల నిధులు అవసరమవుతాయి. అలాంటిది కేవలం 20 కిలోమీటర్ల పైప్లైన్ కోసం రూ.1,300 కోట్లు వెచ్చించడానికి సిద్ధపడటంలో ఆంతర్యం కమీషన్ల బాగోతమేనని నీటి పారుదల రంగానికి చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు. లాభం కంటే నష్టమే ఎక్కువ ఆధునికీకరణకు నోచుకోని ఎల్ఎల్సీని పట్టించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు వెళ్లాయి. దీనిని పట్టించుకోని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేవలం 20 కిలోమీటర్ల మేర పైప్లైన్ పనులకు మాత్రం రూ.1,300 కోట్లు విడుదల చేయాలని ఈ ఏడాది ఫిబ్రవరి 2న (జీవో ఆర్టీ నంబర్–153) జీవో జారీ చేసింది. చివరన ఉన్న కోడుమూరు ప్రాంతానికి నీటిని నేరుగా తీసుకెళ్లేందుకు పైప్ లైన్ వేస్తున్నామని అప్పట్లో చంద్రబాబు సర్కారు చెప్పినప్పటికీ ఈ పనులు చేపడితే బళ్లారి, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు రైతులకు ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ విషయాన్ని విస్మరించి గత ప్రభుత్వం జీవో జారీ చేయడం వల్ల ప్రస్తుతం లైనింగ్ పనులు చేపట్టేందుకు ఇబ్బందికరంగా మారిందని బోర్డు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఎల్ఎల్సీ ద్వారా ప్రస్తుతం 1,800 క్యూసెక్కులు వెళుతున్నాయి. ఈ పైప్లైన్ వేస్తే 72వ కిలోమీటర్ నుంచి 185వ కిలోమీటర్ వరకు నీటి సరఫరాను 600 క్యూసెక్కులకు తగ్గించి పైప్లైన్కు మళ్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. దీంతో ఇన్ఫ్లో తగ్గి రైతులు నష్టపోతారని, ఇందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఆలోచించాలని అంటున్నారు. పైగా పైప్లైన్ వేయడానికి భూసేకరణకు మరో రూ.200 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని చెబుతున్నారు. కర్ణాటకలోని సిరిగేరి వద్ద 72వ కిలోమీటర్ నుంచి 185వ కిలోమీటర్ కర్నూలు జిల్లా హళగుంద వరకు బోర్డు పరిధిలోకి వస్తుంది. ఈ దృష్ట్యా బోర్డు అనుమతి తీసుకుని జీవోను విడుదల చేయాలి. అయితే అప్పట్లో టీడీపీలో చేరిన కర్నూలు జిల్లాకు చెందిన ఓ సీనియర్ నాయకునికి పనులు కట్టబెట్టేందుకే చంద్రబాబు హడావుడిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తమ ప్రభుత్వం రాగానే ఆ మేరకు నిధులు కేటాయిస్తామని అప్పట్లో చెప్పినట్లు తెలిసింది. -
శాంతిస్తున్న కృష్ణమ్మ
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్: మహోగ్ర రూపం దాల్చిన కృష్ణమ్మ శాంతిస్తోంది. శనివారం రాత్రి ఏడు గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే వరద ప్రవాహం 6.43 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. బ్యారేజీలో నిల్వ సామర్థ్యం కంటే అధికంగా నీరు ఉండటంతో 70 గేట్లు ఎత్తి 7.56 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లో శనివారం వరద ప్రవాహం తగ్గిన నేపథ్యంలో ఆదివారం నుంచి ప్రకాశం బ్యారేజీ వద్ద తగ్గనుంది. పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణా నదిలో ఎగువన వరద ప్రవాహం క్రమేణా తగ్గుతోంది. ఆల్మట్టిలోకి 4.45 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా, 4.20 క్యూసెక్కులను, నారాయణపూర్లోకి 3.80 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. 3.42 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఉజ్జయిని జలాశయంలోకి భీమా నది ద్వారా 12,351 క్యూసెక్కులు చేరుతుండగా.. 8,450 క్యూసెక్కులు, జూరాలలోకి కృష్ణా, భీమా నదుల నుంచి 5.65 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. 5.33 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. తుంగభద్రలో ప్రవాహ ఉద్ధృతి నిలకడగా కొనసాగుతోంది. తుంగభద్ర జలాశయంలోకి 78 వేల క్యూసెక్కులు వస్తుండగా.. అంతే స్థాయిలో దిగువకు వదులుతున్నారు. కృష్ణా, తుంగభద్రల నుంచి శ్రీశైలంలోకి 6.54 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 7.47 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్లోకి 6.08 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే స్థాయిలో దిగువకు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్ట్లోకి 6.48 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. 6.65 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం 12 అడుగుల నీటిమట్టంతో 3.07 టీఎంసీ నీరు నిల్వ ఉంది. -
‘తుంగ’పై అభిప్రాయాలు చెప్పండి
సాక్షి, హైదరాబాద్: తుంగభద్ర డ్యామ్లో పేరుకున్న పూడికతో జరుగుతున్న నష్టాన్ని పూడ్చేందుకు కర్ణాట క కొత్త ప్రయత్నాలకు దిగింది. పూడికతో నష్టపోతున్న నీటిని, అంతే స్థాయిలో ఒడిసిపట్టేలా కొత్త రిజర్వాయర్ నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమైంది. సుమా రు 32 టీఎంసీల సామర్ధ్యంతో తుంగభద్రకు ఎగువ న నవాలి ప్రాంతంలో నిర్మించే కొత్త రిజర్వాయర్కోసం తుంగభద్ర బోర్డు అనుమతి కోరింది. దీనిపై బోర్డు దిగువన ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభిప్రాయాలు కోరింది. దీనిపై ఇరు రాష్ట్రా లు చెప్పే అభిప్రాయాల మేరకు కొత్త రిజర్వాయర్ నిర్మాణం ముందుకు సాగనుంది. గురువారం తుంగభద్ర బోర్డు సమావేశం హైదరాబాద్లో జరిగింది. బోర్డు చైర్మన్ రంగారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి తెలంగాణ ఈఎన్సీ మురళీధర్తో పాటు కర్ణాటక, ఏపీ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తుంగభద్రలో పూడికపై ప్రధాన చర్చ జరిగింది. పూడిక తీసేందుకు రూ.12,500 కోట్ల ఖర్చు ఈ సందర్భంగా తుంగభద్ర పూడికపై కర్ణాటక ఇంజనీర్లు వివరణ ఇచ్చారు. డ్యాంలో రోజురోజుకూ పూడిక పేరుకుపోవడంతో నీటి మట్టం సామర్థ్యం తగ్గిపోతోంది. 1953లో డ్యాం ప్రారంభం సమయం లో 132 టీఎంసీల నీటి సామర్థ్యం ఉండగా, పూడిక పెరిగిపోవడంతో 2015 నాటికి 100 టీఎంసీలకు పడిపోయింది. మొత్తంగా 32 టీఎంసీల మేర నిల్వ సామర్థ్యాన్ని డ్యామ్ కోల్పోయింది. పూడిక పెరగడంతో రాష్ట్రాల వాటా తగ్గిపోయి మూడు రాష్ట్రాలకు నీటి సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో డ్యాంను పరిరక్షించాల్సిన అవసరం కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలపై ఉంది. అలాగే కేంద్రం కూడా మూడు రాష్ట్రాలతో చర్చించి నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలి. లేనిపక్షంలో ఈ మూడు రాష్ట్రాల్లో ఆయ కట్టు భూములకు నీరందక వేలాది ఎకరాలు బీడు భూములుగా మారే పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. పూడికను తొలగించాలంటే టీఎంసీ నీటికి రూ.380 కోట్లు ఖర్చవుతుందని, ఆ లెక్కన 32 టీఎంసీల నీటి నిల్వ ఉండేలా పూడిక తీసేందుకు రూ.12,500 కోట్లు ఖర్చవుతుందని వివరించింది. పూడిక మట్టిని పారవేసేందుకు 65 వేల ఎకరాల భూమి అవసరం ఉం టుందని తెలిపింది. ఇది భారీ వ్యయంతో కూడుకు న్న దృష్ట్యా, పూడిక నష్టాన్ని సరిచేసేందుకు ప్రత్యా మ్నాయాలను వివరించింది. 32 టీఎంసీల నష్టాన్ని పూడ్చేలా 31.15 టీఎంసీల సామర్థ్యంతో నవాలి వద్ద రిజర్వాయర్ నిర్మించాలని, దీనికి రూ.9,500 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని తెలిపింది. తుంగభద్ర కింద ప్రస్తుతం 212 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా గత ట్రిబ్యునళ్లు అనుమతించినా, పూడిక వల్ల ప్రస్తుతం 172 టీఎంసీల నీటినే వినియోగిస్తున్నామని, కొత్త రిజర్వాయర్తో ఆ నష్టాన్ని పూడ్చు కునే అవకాశం ఉంటుందని తెలిపింది. తుంగభద్రకు భారీ వరద ఉన్నప్పుడు ఆ నీటిని తుంగభద్ర నది నుంచి వరద కాల్వ తవ్వి, రోజుకు 17,900 క్యూసెక్కుల నీటిని కొత్త రిజర్వాయర్కు తరలిస్తామని, దీనికి అనుబంధంగానే శివపుర, విఠలపుర చెరువుల సామర్ధ్యాన్ని పెంచుతామని, ఈ మూడు రిజర్వాయ ర్ల కింద కలిపి మొత్తంగా 52 టీఎంసీల నీటిని వినియోగిస్తామని ప్రతిపాదించింది. అయితే దీనిపై తెలంగాణ, ఏపీలు ఎలాంటి అభిప్రాయాలు చెప్పలేదు. ప్రాజెక్టు డీపీఆర్లు సమర్పిస్తే దాన్ని పరిశీలించి అభిప్రాయాలు చెబుతామని ఇరు రాష్ట్రాలు బోర్డుకు చెప్పినట్లుగా తెలిసింది. జూన్ నాటికి ఆర్డీఎస్.. తుంగభద్ర నదీ జలాల్లో రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్)కు ఉన్న వాస్తవ నీటి వాటా వినియోగానికి వీలుగా చేపట్టాల్సిన కాల్వల ఆధునికీకరణ పనుల పురోగతిపై పదేపదే విన్నవిస్తున్నా అటు బోర్డు, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలసత్వం చూపుతోందని భేటీలో తెలంగాణ నిలదీసింది. ఈ కాల్వల ఆధునికీకరణ పనుల్లో జాప్యాన్ని నివారించి త్వరితగతిన పనులు పూర్తి చేసేలా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లకు ఆదేశాలివ్వాలని కోరింది. కర్ణాటక ప్రభుత్వం చర్చలు జరిపి పనుల కొనసాగింపునకు ఏపీని ఒప్పించినా, పనులను అడ్డగించిందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా పనులు కొనసాగించరాదని కర్ణాటకను ఏపీ అధికారులు హెచ్చరించడంతో పనులు నిలిచిపోయాయని బోర్డ్ దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై బోర్డు స్పందిస్తూ, పనులు ఈ జూన్ నాటికి పూర్తయ్యేలా చూ డాలని ఏపీ, కర్ణాటకకు సూచించినట్లు తెలిసింది. ఇదే సమయంలో ఆర్డీఎస్లో ఉన్న వాటాలను వినియోగంలోకి తెచ్చేలా తెలంగాణ తుమ్మిళ్ల ఎత్తిపోతలను చేపట్టి నీటి విడుదల చేసిందని ఏపీ అధికారులు బోర్డు దృష్టికి తెచ్చారు. అయితే ఇది తమ పరిధి కాదని బోర్డు తేల్చినట్లుగా సమాచారం. -
కోటా.. కోత!
టీబీ డ్యాంలో 2.054 టీఎంసీల నిల్వ – ఎల్ఎల్సీ వాటాగా 1.146 టీఎంసీలు – తాగునీటికి 650 క్యుసెక్కులకు ఇండెంట్ పెట్టిన ఇంజినీర్లు – 300 క్యుసెక్కులకు తగ్గిన నీటి ప్రవాహం – దాహంతో అల్లాడుతున్న పశ్చిమ ప్రాంత ప్రజలు – నోరు మెదపని అధికార పార్టీ నేతలు కర్నూలు సిటీ: కరువు కోరలు చాస్తోంది. భూగర్భ జలాల నీటి మట్టం రోజు రోజుకు తగ్గుతోంది. పశ్చిమ ప్రాంత ప్రజల గొంతెండుతోంది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా అధికార పార్టీ నేతలు నోరు మెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది. తుంగభద్ర డ్యాం నుంచి జిల్లాకు ఎల్ఎల్సీ వాటా నుంచి రావాల్సిన నీటిని రాబట్టడంలో నేతలు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో 650 క్యుసెక్కుల నీరు ఏపీ సరిహద్దు వద్ద రావాల్సి ఉండగా.. 300 క్యుసెక్కులు కూడా రాని దుస్థి«తి నెలకొంది. ఈ విషయంపై జిల్లాలోని టీడీపీ నేతలకు జల వనరుల శాఖ ఇంజినీర్లు సమాచారం ఇచ్చినా ఏ మాత్రం పట్టించుకోని పరిస్థితి ఉంది. ఫలితంగా టీబీ డ్యాం అధికారులు నీటి విడుదలను పూర్తి స్థాయిలో తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే డ్యాంలో నిల్వ తక్కువగా ఉందనే కారణంతో బోర్డు అధికారులు నీటి ప్రవాహాన్ని రెండు రోజుల నుంచి రోజురోజుకూ తగ్గిస్తున్నారు. అయినా నేతలు నోరు మెదపకపోవడంతో బోర్డు అధికారులు ఏకంగా నీటి విడుదలను నిలిపేసేందుకు తెగబడినట్లు తెలుస్తోంది. నీటి ప్రవాహం తగ్గడంపై కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక బోర్డు అధికారులకు ఫోన్ చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పెంచినట్టే పెంచి తగ్గించారు. ఈ కారణంగా జిల్లాలోని పశ్చిమ ప్రాంత ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. దాహం తీర్చేదెట్టా...! జిల్లాకు తుంగభద్ర జలాలే ప్రధానం. కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు టీబీ డ్యాం ఉమ్మడి జలాశయం. ఈ డ్యాంలో ప్రతి ఏటా వాటా నీటికి గండి పడుతున్నా నేతలు పట్టించుకోవడం లేదు. ప్రతి వేసవిలో పశ్చిమ పల్లె దాహం తీర్చేందుకు కనీసం 3 టీఎంసీల నీరు నిల్వ చేసే వారు. అయితే ఈ ఏడాది అశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో వాటా నీరు తగ్గింది. కానీ బోర్డు అధికారులు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాల వల్ల కొంత నీరు పక్క జిల్లాకు తరలిపోయింది. దీంతో డ్యాం డెడ్ స్టోరేజీకి చేరింది. ప్రస్తుతం 2.054 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వాటా ప్రకారం జిల్లాకు 1.146 టీఎంసీల నీరు రావాల్సి ఉంది. ఇందులో నుంచి తాగునీటి కోసం 650 క్యుసెక్కుల నీరు ఇవ్వాలని ఇంజినీర్లు ఇండెంట్ పెట్టారు. మొదట్లో ఆ ప్రకారం నీటిని విడుదల చేశారు. ఆ తర్వాత డ్యాంలో నీరు లేదనే సాకుతో నీటి ప్రవాహాన్ని తగ్గించారు. ఈ నీటిపైనే జిల్లాలోని 9 మండలాల్లో 17 సమగ్ర రక్షిత తాగు నీటి పథకాలు, 164 గ్రామాలకు చెందిన 4,19,836 మంది జనాభా దాహం ఆధారపడి ఉంది. వస్తున్న నీటిలో 0.2 టీఎంసీల నీరు కూడా జిల్లాకు చేరని పరిస్థితి. ఈ నేపథ్యంలో మరో రెండు నెలలు ప్రజల దాహాం ఏలా తీరుస్తారో నాయకులు, అధికారులకే తెలియాలి. కోర్టు అక్షింతలు వేసినా మారని తీరు మూడు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు తుంగభద్ర జలాశయం నీటి విడుదలలో బోర్డు అధికారులు ఎగువ రాష్ట్రామైన కర్ణాటక ఒత్తిళ్లకు తలొగ్గి దిగువ రాష్ట్రాల హక్కులకు భంగం కల్గించారు. దీంతో కొంత మంది ఎల్ఎల్సీ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు స్పందించి బోర్డు అధికారులపై తీవ్రంగా అగ్రహించింది. చివరికి బోర్డు అధికారులు ఇకపై తప్పులు జరుగకుండా చూస్తామని కోర్టుకు ఆఫిడవిట్ సమర్పించారు. కొద్ది రోజులకే గుట్టు చప్పుడు కాకుండా టీబీ డ్యాంలో 0.9 టీఎంసీల నీటిని పక్క జిల్లాకు మళ్లించినట్లు రికార్డులను బట్టి తెలుస్తోంది. దీంతో పాటు ఎల్ఎల్సీ వాటా నుంచి సైతం కొద్దిమేర నీటిని మళ్లించారు. ఈ విషయం జిల్లాలోని అధికార పార్టీ నేతలకు తెలిసినా నోరు మెదపకపోవడం గమనార్హం. ముందుగానే మేల్కొని ఉంటే కనీసం 1.3 టీఎంసీల తుంగభద్ర జలాలు జిల్లాకు వచ్చేవనే చర్చ జరుగుతోంది. దీనికి తోడు ఎల్ఎల్సీ ఇంజినీర్లు పర్యవేక్షణ లేకుండా నీటిని కాల్వకు వదులుతుండడంతో నీరు వృథా అవుతోంది. గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం, జల వనరుల శాఖ అధికారుల మధ్య సమన్వయం కొరవడింది. ఈ కారణంతోనే వచ్చిన నీరు సైతం సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. టీబీ డ్యాంలో నీటి నిల్వ తగ్గడంతో ఈ డ్యాంకు ఎగువన ఉన్న భద్ర ప్రాజెక్టు నుంచి 2 టీఎంసీల నీటిని విడుదల చేయాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈ నీటితో ఏపీకి ఎలాంటి సంబంధం లేదన్నట్లు బోర్డు అధికారులు చెబుతుండటం గమనార్హం. నీటి ప్రవాహం తగ్గింది. తుంగభద్ర జలాశయం నుంచి దిగువ కాలువకు వస్తున్న నీటి ప్రవాహం తగ్గిన మాట వాస్తవమే. ఈ విషయం కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుపోయాం. ఇప్పటి వరకు 0.23 టీఎంసీల నీరు వచ్చి ఉండొచ్చు. డ్యాంలో నీటి నిల్వ తగ్గడంతోనే నీటి విడుదలను తగ్గించినట్లు బోర్డు అధికారులు చెబుతున్నారు. – చంద్రశేఖర్ రావు, పర్యవేక్షక ఇంజినీర్, జల వనరుల శాఖ -
తుంగభద్ర జలాశయం ఖాళీ
బళ్లారి: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాలకు తాగు, సాగునీరందించే తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. ప్రస్తుతం డ్యాంలో కేవలం 1.5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. డ్యాంలోకి ఈ ఏడాది 80 టీఎంసీలకు మించి నీరు చేరలేదు. ప్రతి ఏటా డ్యాం ఆయకట్టు పరిధిలో ఖరీఫ్తో పాటు రబీలోనూ పంటలు పండించే వారు. కానీ ఈ ఏడాది ఒకే పంట పండించాల్సి వచ్చింది. -
సాగునీరు అసాధ్యం
- వచ్చేది 11 టీఎంసీలు మాత్రమే - అధిక ప్రాధాన్యతగా తాగునీటికి 8.5 టీఎంసీలు - వరిని రైతులెవ్వరూ సాగు చేయకూడదు - అక్రమ ఆయకట్టుదారులపై కఠినంగా వ్యవహరించాలి - ఐఏబీ సమావేశంలో తీర్మానం అనంతపురం అర్బన్/ ఇరిగేషన్ : ‘తుంగభద్ర డ్యాం నుంచి హెచ్ఎల్సీకి 22.689 టీఎంసీల నీటిని విడుదల చేస్తామని చెప్పారు. నెల రోజుల్లో పరిస్థితి మారిపోయింది. ఎగువ నుంచి నీరు రాకపోవడంతో 11 టీఎంసీలు మాత్రమే ఇస్తామని టీబీ డ్యాం అధికారులు చెబుతున్నారు. ఇందులో అధిక ప్రాధాన్యతగా తాగునీటికి 8.5 టీంఎసీలు ఇవ్వాలి. మిగిలిన నీటిని ఏమి చేయాలనేది తరువాత నిర్ణయిద్దాం. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలో వరి ఏ ఒక్క రైతూ సాగు చేయకుండా చూడాలి. అలాగే అక్రమ ఆయకట్టుదారుల పట్ల కఠినంగా వ్యవహరించాల’ని నీటి పారుదల సలహా మండలి(ఐఏబీ) సమావేశంలో తీర్మానించారు. శుక్రవారం కమిటీ చైర్మన్, కలెక్టర్ కోన శశిధర్ అధ్యక్షతన కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సమావేశం నిర్వహించారు. జిల్లా మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ్రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ కుమార్రెడ్డి, చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, విప్ యామినిబాల, జెడ్పీ చైర్మన్ చమన్, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి, కడప ఎంపీ వైఎస్ ఆవినాశ్రెడ్డి, ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, అత్తార్ చాంద్బాషా, జేసీ ప్రభాకర్రెడ్డి, వరదాపురం సూరి, హనుమంతరాయచౌదరి, ప్రభాకర్చౌదరి, ఈరన్న, జితేంద్రగౌడ్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే జయరామప్ప, ఎమ్మెల్సీలు నారాయణరెడ్డి, పయ్యావుల కే శవ్, శమంతకమణి హాజరయ్యారు. నీటి విడుదలకు సంబంధించి వాస్తవ పరిస్థితిని సభ్యులకు కలెక్టర్ వివరించారు. వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సమస్య తీవ్రంగా మారిందన్నారు. గత ఏడాది ఇదే సమయంలో టీబీ డ్యాంలో ఇన్ఫ్లో 1.22 లక్షల క్యూసెక్కులు ఉండగా, ఇప్పుడు ఏడు వేల క్యూసెక్కులు మాత్రమే ఉందన్నారు. గత ఏడాది ఈ సమయానికి డ్యాంలోకి 113 టీఎంసీల నీరొస్తే, ఇప్పుడు 12 టీఎంసీలు మాత్రమే వచ్చిందన్నారు. అటు శ్రీశైలం డ్యాంలోనూ నీటిమట్టం డెడ్ స్టోరేజీకి పడిపోయిందన్నారు. హెచ్చెల్సీ ద్వారా అనంతపురం జిల్లాలో 1.47 లక్షల ఎకరాలు, కర్నూలు, వైఎస్సార్ జిల్లాలు కలిపి 69 వేల ఎకరాలకు నీరందించాల్సి ఉందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయకట్టుకు నీరివ్వడం సాధ్యం కాదన్నారు. హామీ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. ఈ నేపథ్యంలో సలహా మండలి సమావేశం వద్దనుకున్నామని, అయితే వాస్తవాలను సభ్యుల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశామని వివరిం చారు. దీంతో సభ్యులు తొలి ప్రాధాన్యత తాగునీటికి ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. -
వరికి ఉరి
- సాగునీరివ్వలేం.. రైతులెవ్వరూ వరి సాగు చేయకూడదు - టీబీ డ్యాం నుంచి వచ్చేది 11 టీఎంసీలు మాత్రమే - అధిక ప్రాధాన్యతగా తాగునీటికి 8.5 టీఎంసీలు - అక్రమ ఆయకట్టుదారులపై కఠినంగా వ్యవహరించాలి - ఐఏబీ సమావేశంలో తీర్మానం అనంతపురం అర్బన్/ ఇరిగేషన్ : ‘తుంగభద్ర డ్యాం నుంచి హెచ్ఎల్సీకి 22.689 టీఎంసీల నీటిని విడుదల చేస్తామని చెప్పారు. నెల రోజుల్లో పరిస్థితి మారిపోయింది. ఎగువ నుంచి నీరు రాకపోవడంతో 11 టీఎంసీలు మాత్రమే ఇస్తామని టీబీ డ్యాం అధికారులు వరికి ఉరి చెబుతున్నారు. ఇందులో అధిక ప్రాధాన్యతగా తాగునీటికి 8.5 టీంఎసీలు ఇవ్వాలి. మిగిలిన నీటిని ఏమి చేయాలనేది తరువాత నిర్ణయిద్దాం. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలో ఏ ఒక్క రైతూ వరి సాగు చేయకుండా చూడాలి. అక్రమ ఆయకట్టుదారుల పట్ల కఠినంగా వ్యవహరించాల’ని నీటి పారుదల సలహా మండలి(ఐఏబీ) సమావేశంలో తీర్మానించారు. శుక్రవారం కమిటీ చైర్మన్, అనంతపురం జిల్లా కలెక్టర్ కోన శశిధర్ అధ్యక్షతన కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సమావేశం నిర్వహించారు. జిల్లా మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ్రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ కుమార్రెడ్డి, చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, విప్ యామినిబాల, జెడ్పీ చైర్మన్ చమన్, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి, కడప ఎంపీ వైఎస్ ఆవినాశ్రెడ్డి, ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, అత్తార్ చాంద్బాషా, జేసీ ప్రభాకర్రెడ్డి, వరదాపురం సూరి, హనుమంతరాయచౌదరి, ప్రభాకర్ చౌదరి, ఈరన్న, జితేంద్రగౌడ్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే జయరామప్ప, ఎమ్మెల్సీలు నారాయణరెడ్డి, పయ్యావుల కే శవ్, శమంతకమణి హాజరయ్యారు. నీటి విడుదలకు సంబంధించి వాస్తవ పరిస్థితిని సభ్యులకు కలెక్టర్ వివరించారు. వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సమస్య తీవ్రంగా మారిందన్నారు. గత ఏడాది ఇదే సమయంలో టీబీ డ్యాంలో ఇన్ఫ్లో 1.22 లక్షల క్యూసెక్కులు ఉండగా, ఇప్పుడు ఏడు వేల క్యూసెక్కులు మాత్రమే ఉందన్నారు. గత ఏడాది ఈ సమయానికి డ్యాంలోకి 113 టీఎంసీల నీరొస్తే, ఇప్పుడు 12 టీఎంసీలు మాత్రమే వచ్చిందన్నారు. అటు శ్రీశైలం డ్యాంలోనూ నీటిమట్టం డెడ్ స్టోరేజీకి పడిపోయిందన్నారు. హెచ్చెల్సీ ద్వారా అనంతపురం జిల్లాలో 1.47 లక్షల ఎకరాలు, కర్నూలు, వైఎస్సార్ జిల్లాలు కలిపి 69 వేల ఎకరాలకు నీరందించాల్సి ఉందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయకట్టుకు నీరివ్వడం సాధ్యం కాదన్నారు. హామీ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. ఈ నేపథ్యంలో సలహా మండలి సమావేశం వద్దనుకున్నామని, అయితే వాస్తవాలను సభ్యుల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశామని వివరించారు. దీంతో సభ్యులు తొలి ప్రాధాన్యత తాగునీటికి ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. భవిష్యత్లో డ్యాంలలో నీటిమట్టం పెరిగితే సాగునీటి అవసరాల కోసం చర్చించడానికి ఆగస్టు చివరి వారంలో మరోసారి సమావేశం నిర్వహించాలని తీర్మానించారు. మైలవరం, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను మొదటి నుంచి నిర్లక్ష్యం చేస్తున్నారని వైఎస్సార్ జిల్లా ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. వృథా అరికట్టాలి : సతీష్రెడ్డి, ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ స్పీకర్ చిత్రావ తి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు కేటాయించిన నీళ్లు ఎప్పుడూ చేరలేదు. చాలా వరకు వృథా అవుతున్నాయి. దీనిని అరికట్టకపోతే తాగునీటికి కూడా చాలా ఇబ్బంది పడాల్సివస్తుంది. కేటాయించిన నీరు సీబీఆర్కు చేరాలంటే ఎక్కువ నీటిని విడుదల చేస్తేనే సాధ్యం. మూడేళ్లుగా మైలవరానికి నీళ్లు లేవు : ఆదినారాయణరెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే మూడేళ్లుగా మైలవరం ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు జరుగుతున్నా, ఏ ఏడాదీ ఒక చుక్క రావడం లేదు. మా ప్రాంతంలో 1500 నుంచి 2000 అడుగుల లోతుకు బోర్లు వేసినా నీళ్లు పడటం లేదు. పరిస్థితి భయానకంగా ఉంది. ఈ ఏడాది కేటాయించిన నీటిని విడుదల చేస్తేకానీ మా ప్రాంత ప్రజల పరిస్థితి మెరుగుపడదు. మా గురించి ఆలోచించే తీరిక లేదా? : వైఎస్ అవినాష్రెడ్డి, కడప ఎంపీ గత ఐఏబీ సమావేశంలో కూడా మా ప్రాంతానికి నీళ్లు రావడం లేదని వివరించా. అయినప్పటికీ గత ఏడాది మాకు తీవ్ర అన్యాయం జరిగింది. సీబీఆర్కు రెండు టీఎంసీలు కేటాయించినా, రిజర్వాయర్లోకి ఒక్క టీఎంసీ నీరు కూడా రావడం లేదు. తుంపెర వద్ద నీటి ప్రవాహం సూచించే గేజ్ ఏటవాలుగా ఉంది. దానితో రిజర్వాయర్లోకి ఎక్కువ నీరు వచ్చినట్లు అధికారులు ఊహించుకుంటున్నారు. తక్షణమే హెచ్చెల్సీ ఆధునికీకరణ పూర్తి చేసి సీబీఆర్కు నాలుగు టీఎంసీలివ్వాలి. -
సాగు ‘నిల్లే’!
♦ నీళ్లు లేక వెలవెలబోతున్న రిజర్వాయర్లు ♦ నేడు సాగునీటి సలహా మండలి సమావేశం ♦ తాగునీటిపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ♦ హాజరుకానున్న హెచ్చెల్సీ పరిధిలోని ప్రజాప్రతినిధులు అనంతపురం ఇరిగేషన్ : జిల్లాకు ప్రధాన నీటి వనరు అయిన తుంగభద్ర జలాశయంతో పాటు శ్రీశైలం డ్యాంలోకి ఆశించిన మేర నీరు చేరడం లేదు. ఎక్కడా వర్షాల్లేకపోవడంతో డ్యాంలలో నీటి లభ్యతపై సందిగ్ధత కొనసాగుతోంది. సాగునీరు కాదు కదా..కనీసం తాగునీటి అవసరాలైనా పూర్తిగా తీరతాయో, లేదోనన్న ఆందోళన అధికారుల్లో కన్పిస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే శుక్రవారం సాగునీటి సలహామండలి (ఐఏబీ) సమావేశం నిర్వహించనున్నారు. అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) పరిధిలోని ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు హాజరుకానున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈ సమావేశం కూడా వాడీవేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. తమ నియోజకవర్గాల పరిధిలోని ఆయకట్టుకు,చెరువులకు నీటిని విడుదల చేయాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేసే అవకాశముంది. తమ జిల్లాకు కేటాయించిన నీటిని ఎప్పుడూ విడుదల చేయలేదని, ఈసారైనా న్యాయం చేయాలని వైఎస్సార్ జిల్లా ప్రజాప్రతినిధులు పట్టుబట్టే సూచనలూ కనిపిస్తున్నాయి. ఎవరి డిమాండ్లు ఎలా ఉన్నా.. ప్రాజెక్టులలో ఆశించినంత నీటిమట్టం లేనందున ఈ ఏడాది తాగునీటికే ప్రథమ ప్రాధాన్యతిస్తూ చర్చ జరిగే అవకాశముంది. ఆయోమయంలో అధికారులు జిల్లాకు ప్రధాన సాగు, తాగునీటి వనరు తుంగభద్ర డ్యాం ఒక్కటే. హంద్రీ-నీవా ఉన్నప్పటికీ శ్రీశైలం డ్యాంలో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి పడిపోవడంతో కాలువకు నీటి విడుదల అనుమానమే. దీంతో ఎక్కువగా హెచ్చెల్సీ నీటిపైనే దృష్టి కేంద్రీకరించవలసి వస్తోంది. తుంగభద్ర డ్యాంలో కూడా ఆశించిన స్థాయిలో నీటిమట్టం లేకపోవడంతో కేటాయించిన నీటిని విడుదల చేయడంపై సందేహం నెలకొంది. ప్రస్తుతం డ్యాంలో 64.430 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్ఫ్లో 7,254 క్యూసెక్కులు, ఔట్ఫ్లో 5,159 క్యూసెక్కులు. గత ఏడాది ఇదే సమయానికి 92 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. 1,42,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 1,66,000 క్యూసెక్కుల ఔట్ఫ్లో ఉండేది. ఈ ఏడాది తుంగభద్ర నుంచి 22.689 టీఎంసీల నీటిని మన వాటా కింద నిర్ణయించారు. అయితే ఆ స్థాయిలో విడుదల చేయడంలేదు. జిల్లా సరిహద్దు వద్ద హెచ్చెల్సీలో వెయ్యి క్యూసెక్కుల ప్రవాహంతో మాత్రమే నీరు వస్తోంది. ఈ ప్రవాహంతో 10 టీఎంసీల నీళ్లు మాత్రమే వచ్చే అవకాశముంది. గత నెల 24న నీటిని విడుదల చేశారు. ఇప్పటివరకు 0.92 టీఎంసీలు మాత్రమే జిల్లాకు వచ్చాయి. పీఏబీఆర్లో గత ఏడాది ఇదే సమయానికి 2.26 టీఎంసీల నీరు ఉండేది. ఈ ఏడాది నీటి ప్రవాహం తక్కువగా ఉండడంతో 1.46 టీఎంసీలు మాత్రమే ఉంది. తుంగభద్ర నీరు చేరే సమయానికి పీఏబీఆర్లో ఒక టీఎంసీ నిల్వవుండగా.. అదనంగా 0.46 టీఎంసీ మాత్రమే వచ్చి చేరింది. మిడ్పెన్నార్ రిజర్వాయర్లో గత ఏడాది ఇదే సమయానికి 0.60 టీఎంసీ నీరు ఉండగా.. ప్రస్తుతం 0.32 టీఎంసీ మాత్రమే ఉంది. దీంతో ఈసారి ప్రధానంగా తాగునీటి అవసరాలకే వినియోగించుకొనే అవకాశం కనిపిస్తోంది. నీటి ఆవిరి, సరఫరా నష్టాలు పోతే ఏస్థాయిలో నీళ్లు మనకు లభిస్తాయన్నది అధికారులను కూడా ఆందోళనకు, ఆయోమయానికి గురిచేస్తోంది. 2015-16 సంవత్సరానికి వివిధ ఉపకాలువల కింద పట్టణాలు, గ్రామాలకు ప్రతిపాదించిన తాగునీటి నికర కేటాయింపులు ఇలా ఉన్నాయి. మొత్తం 5.716 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు కేటాయించారు. ఇందులో రాయదుర్గం మునిసిపాలిటీ, గొడిసెలపల్లి, ఇతర గ్రామాలకు 0.406 టీఎంసీలు, గుంతకల్లు బ్రాంచికెనాల్(జీబీసీ) ద్వారా గుంతకల్లు పట్టణం, గడేకల్లు, కొనకొండ్లతో పాటు 13 ఇతర గ్రామాలకు 0.857 టీఎంసీలు, మధ్య పెన్నార్ దక్షిణ కాలువ ద్వారా శ్రీ సత్యసాయి తాగునీటి పథకం కింద బుక్కరాయసముద్రంతో పాటు 19 గ్రామాలు, బి.పప్పూరుతో పాటు 26 గ్రామాలకు 0.504 టీఎంసీలు, శ్రీరామరెడ్డి, శ్రీ సత్యసాయి నీటి పథకాల కింద హిందూపురం పట్టణం,అనంతపురం నగరంతో పాటు 700 గ్రామాలకు 1.732 టీఎంసీలు, మైలవరం కాలువ ద్వారా పొద్దుటూరు పట్టణానికి 0.200 టీఎంసీలు, పులివెందుల బ్రాంచి కెనాల్ ద్వారా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి కదిరి, ఇతర 79 గ్రామాలకు, పుట్టపర్తి,ఇతర 92 గ్రామాలకు, పులివెందుల పట్టణానికి 2.017 టీఎంసీల నీటిని తాగునీటి కోసం కేటాయించారు. సాగు ఎలా? తాగునీటికే కటకటలాడాల్సిన పరిస్థితుల్లో సాగునీటిని ఎలా విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ ఖరీఫ్ సీజన్కు నీళ్లు వదలడం కష్టమేనని, కొద్ది రోజుల తరువాత డ్యాంలలో నీటిమట్టం ఎంత ఉంటుందన్న దానిపై ఓ అంచనాకు వస్తామని అంటున్నారు. దీంతో ఆయకట్టు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. హంద్రీనీవాపై వాడీవేడి చర్చ? సమావేశంలో ప్రధానంగా హంద్రీ-నీవాపై వాడీవేడి చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. హంద్రీనీవా నీటిని తన సొంత నియోజకవర్గం కుప్పంకు తరలించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఇప్పటికే వైఎస్సార్సీపీ ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. ఈ అంశంతో పాటు హంద్రీనీవా పనుల్లో జాప్యం, అవినీతిపై కూడా అధికార పార్టీ ప్రజాప్రతినిధులను గట్టిగా నిలదీసే అవకాశముంది. -
రైతు నోట్లో ‘మట్టి’
- తుంగభద్ర డ్యాంలో పెరిగిపోతున్న పూడిక - భారీ స్థాయిలో తగ్గిన నీటి నిల్వ - పూడిక తీయాలంటే భారీ వ్యయం అనంతపురం ఇరిగేషన్ : మట్టిని నమ్ముకుని బతికేవాడు రైతు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే అదే మట్టి రైతుకు మరో రూపంలో కీడు కూడా చేస్తోంది. అనంతపురం జిల్లాలో 80 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తున్న తుంగభద్ర డ్యాంలో ఏడాదికేడాదికి పూడిక భారీ స్థాయిలో పెరుగతూ వస్తోంది. పూడిక ఎక్కువగా పేరుకుపోవడంతో డ్యాంలో నీటి నిల్వ సామర్థ్యం భారీ స్థాయిలో తగ్గిపోతోంది. ప్రారంభంలో 220 టీఎంసీల సామర్థ్యం ఉన్న డ్యాం ప్రస్తుతం 100 టీఎంసీలు మాత్రమే నిల్వ చేసుకోగలుగుతోంది. ఈ ఉదాహరణ చాలు ఏ స్థాయిలో పూడిక చేరుకుంటుందో అర్థం చేసుకోవడానికి. తుంగభద్ర డ్యాంలో ఆంధ్రప్రదేశ వాటా 32.5 టీఎంసీల ఉండగా.. పూడిక పేరుకుపోవడంతో గత ఏడేళ్లుగా సగటున 22 టీఎంసీలు మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. ఒక్క టీఎంసీతో ఎనిమిది వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించవచ్చు. ఈ సగటున మన రాష్ట్రం 80 వేల ఎకరాలకు సరిపడా నీటిని కోల్పోతోంది. మరీ ముఖ్యంగా తుంగభద్ర జలాలపైనే ఆధారపడిన అనంతపురం జిల్లా పరిస్థితి మరీ దయనీయంగా మారింది. పూడిక పేరుకుపోవడంతో అనంతపురం జిల్లాలో 60 వేల ఎకరాలకు నీరు అందించలేకపోతున్నట్లు ఇంజనీరింగ్ అధికారుల అంచనా. భారీ వ్యయం: డ్యాంలలో పూడిక తీయాలంటే భారీ వ్యయం అవుతుందని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. మన దేశంలో పూడిక తీయడానికి ఆధునిక యంత్రాలు ఉన్నప్పటికీ, కాలువల్లో (కెనాల్స్) మాత్రమే తీయడానికి సాధ్యమవుతోంది. కాలువల్లో అయితే తీసిన పూడికను గట్టులపై వేయవచ్చు. అదే డ్యాంలో అయితే వెడల్పు ఎక్కువగా ఉండటంతో పూడిక ఎక్కడ వేయాలో అర్థం కాని పరిస్థితి. మన రాష్ర్టంలో గుంటూరు జిల్లా రేపల్లెలో ప్రధాన కాలువలో పూడిక తీయడం జరిగింది. అయితే అక్కడ కాలువకు ఇరువైపులా అటవీ భూమి ఉండటంతో పూడిక అక్కడ వేశారు. అదే తరహాలో డ్యాంలో కూడా ఇరుపైపుల పూడిక తీయడానికి వీలు ఉన్నప్పటికీ, డ్యాం మధ్య భాగంలోని పూడికను తొలగించడం అసాధ్యంగా మారింది. మధ్య భాగంలోని పూడికను తొలగించాలంటే భారీ స్థాయిలో డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది. అదే డబ్బుతో మధ్య స్థాయి ప్రాజెక్టునే నిర్మించవచ్చునన్నది అధికారులు అభిప్రాయం. కొన్ని దేశాల్లో డ్యాం నిర్మించేటప్పుడు డ్యాంలోకి నీరు చేరే పది, పదిహేను కిలోమీటర్ల ముందే చెక్డ్యాం తరహాలో గోడను నిర్మిస్తారు. దీనితో పూడిక అక్కడే నిల్వ అవుతుంది. డ్యాంలోకి నీరు మాత్రమే చేరుతుంది. మనదేశంలో ఎక్కడా అలా జరగనందున డ్యాంలోకి పూడిక ఎక్కువగా చేరుకుంటోంది. ఏమీ చేయలేని పరిస్థితి : ప్రతి ఏడాది తుంగభద్ర బోర్డు సమావేశంలో ఈ అంశంపై చర్చ జరుగుతున్నప్పటికీ ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. డ్యాంలో 120 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోలేక పోతున్నాం. పూడిక తీయాలంటే భారీ వ్యయం ఒక కారణం అయితే, తీసిన పూడికను ఎక్కడికి తరలించాలన్నది మరో సమస్య. దీంతో పూడిక తీయడం దాదాపు అసాధ్యం అని చెప్పవచ్చు. - శేషగిరిరావు, హెచ్చెల్సీ ఎస్ఈ -
తుంగభద్ర డ్యాంలో పెరుగుతున్న నీటిమట్టం
60 టీఎంసీలకు చేరిన నీటినిల్వ బళ్లారి : తుంగభద్ర డ్యాంలో నీటిమట్టం రోజు రోజుకు పెరుగుతోంది. శుక్రవారం డ్యాంలో నీటి నిల్వ 60 టీఎంసీలకు చేరుకుంది. తుంగభద్ర డ్యాంకు ఎగువన నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల డ్యాంకు నది ద్వారా 23,603 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. గురువారంతో పోల్చితే డ్యాంలోకి వస్తున ్న ఇన్ఫ్లో తగ్గినప్పటికీ డ్యాంలో ఆయకట్టు కాలువలకు నీరు వదిలేందుకు తగినంత నీటి నిల్వ పెరుగుతుండటంతో రెండు రాష్ట్రాలకు చెందిన రైతులు ఖరీఫ్ సాగుకు సన్నద్దం అవుతున్నారు. హెచ్ఎల్సీ కాలువకు కూడా శుక్రవారం నీరు విడుదల చేయడంతో బళ్లారి, అనంతపురం జిల్లాలకు చెందిన ఆయకట్టు రైతులతో పాటు పలు గ్రామాలు, పట్టణాల ప్రజలకు తాగునీటి కష్టాలు కూడా తీరనున్నాయని చెప్పవచ్చు. డ్యాంలో ప్రస్తుతం 60 టీఎంసీల మేర నీరు నిల్వ చేరడంతో మరో 40 టీఎంసీల నీరు చేరితే డ్యాం పూర్తి స్థాయిలో నిండుతుంది. డ్యాం నీటి నిల్వ సామర్ధ్యం 100 టీఎంసీలు కావడంతో తుంగభద్రకు మళ్లీ ఇన్ఫ్లో పెరిగితే త్వరలో డ్యాం నిండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా ప్రస్తుతం డ్యాంలో 1620.47 అడుగుల నీటిమట్టం ఉండగా, 59.507 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గత ఏడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యాంలో 1607.34 అడుగుల నీటిమట్టం ఉండగా, 51.331 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, 51818 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 2333 క్యూసెక్కుల ఔట్ఫ్లో ఉండేదని బోర్డు అధికారులు పేర్కొన్నారు. -
తుంగభద్ర ఖాళీ..!
-
తుంగభద్ర డ్యాం ఖాళీ..!
బళ్లారి: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు తాగు, సాగునీరందించే తుంగభద్ర డ్యాంలో నీరు పూర్తిగా ఖాళీ అయింది. తుంగభద్ర డ్యాం పరిధిలోని హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ, ఎల్బీఎంసీ కాలువలకు నీరు నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే. డ్యాంలో నీరు పూర్తిగా అడుగంటి పోవడంతో డ్యాంలో పలుచోట్ల బీటలు కనిపిస్తున్నాయి. 104 టీఎంసీలు నిల్వ ఉండే తుంగభద్ర డ్యాంలో నీరు ప్రస్తుతం కనిష్ట స్థాయికి పడిపోయింది. దీంతో ఇక ఎట్టి పరిస్థితుల్లోను కాలువలకు నీరు వదిలే అవకాశమే లేకుండా పోయింది. భగభగ మండే ఎండలకు తోడు డ్యాంలో నీరు ఖాళీకావడంతో నీటి కోసం ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు జాగ్రత్తలు తీస్కోవాల్సిన అవసరం ఉంది. తాగునీటి కోసం నిల్వ ఉంచుకున్న రిజర్వాయర్లలో నీరు వృథా చేయకుండా పద్థతి ప్రకారం వదిలితే వేసవిని గట్టెక్కించే అవకాశాలు ఉన్నాయి. నిత్యం పర్యాటకుల సందడితో కనిపించే తుంగభద్ర డ్యాం వద్ద జన సందడి తగ్గిపోయింది. రెండు రాష్ట్రాలకు వరదాయినిగా ఉన్న తుంగభద్ర ఎండిపోవడంతో ఇక వరణుడు కరుణించే వరకు డ్యాంలోకి నీరు వచ్చే పరిస్థితి లేదు. -
విద్యుదుత్పత్తిలో టీబీ డ్యాం పవర్ హౌస్ ప్రముఖ పాత్ర
హొస్పేట : కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాలకు విద్యుత్ ఉత్పాదన కేంద్రంగా ఉన్న టీబీడ్యాం పవర్ హౌస్ విద్యుత్ ఉత్పత్తిలో తనదైన ముద్ర వేసుకుంది. తుంగభద్ర డ్యాం నిర్మాణం అనంతరం అప్పటి మద్రాసు ప్రభుత్వం ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించింది. మొత్తం నాలుగు యూనిట్లతో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. వీటిలో 2 ప్లాంట్లు జపాన్కు సంబంధించిన తోషిబా కంపెనీకి సంబంధించినవి కాగా మరో రెండు ప్లాంట్లు స్విట్జర్లాండ్కు చెందినవి. ఈ విద్యుత్ ఉత్పాదన కేంద్రాన్ని తుంగభద్ర మండలి పర్యవేక్షిస్తోంది. విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు రోజుకు సుమారు 5600 క్యూసెక్కులు నీరు కావాల్సి ఉంది. ప్రస్తుతం 3 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. మరో యూనిట్ను స్పేర్గా ఉంచారు. అంటే మిగిలిన మూడింటిలో ఏదైనా మరమ్మతుకు గురైతే అప్పుడు ఈ యూనిట్ ద్వారా ఉత్పత్తి చేస్తారు. ఒక్కో ప్లాంట్ రోజుకు 2 లక్షల 16 వేల యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. మూడు యూనిట్ల ద్వారా రోజుకు 6 లక్షల 48 వేల విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. దీనిని యూనిట్ రూ.1 ప్రకారం విక్రయిస్తారు. తద్వారా రోజుకు రూ.6,48,000 ఆదాయం వస్తోంది. ఇక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్ను ఆంధ్రప్రదేశ్కు 80 శాతం, కర్ణాటకకు 20 శాతం చొప్పున సరఫరా చేస్తారు. ప్రస్తుతం ఇక్కడ సిబ్బంది కొరత ఉంది. అయినా ఉన్న సిబ్బందితోనే విద్యుత్ ఉత్పాదన చేస్తూ బండి లాగుతున్నారు. ఇటీవల ప్లాంట్లో మరమ్మతులు ఏర్పడడంతో సుమారు 15 రోజుల వరకు విద్యుత్ ఉత్పాదన ఆగిపోయింది. దీంతో కోటిన్నరకు పైగా నష్టం వాటిల్లింది. సిబ్బంది కొరతతో ఇబ్బందులు : దాదాపు 200 మంది సిబ్బంది పనిచేయాల్సి ఉండగా కేవలం 49 మంది మాత్రమే ఉన్నారు. వారిలో ఐదుగురు ఏడీఈలు, తొమ్మిది మంది ఏఈలు, 35 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. సిబ్బం దిని 80 శాతం ఆంధ్ర ప్రభుత్వం, 20 శాతం కర్ణాటక ప్రభుత్వం నియమి స్తుంది. అయితే ఇక్కడ కర్ణాటక వాటా సి బ్బంది మాత్రం పనిచేస్తున్నారు. మిగి లిన ఆంధ్ర వాటా సిబ్బందిని నియమిం చకపోవడంతో సిబ్బంది కొరతతో నానా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. -
హంపిలో కట్టడాలకు ముప్పు?
మూడు రోజులుగా నీటిలోనే స్మారకాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పర్యాటకుల వినతి సాక్షి, బళ్లారి : ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న హంపిలోని ఆలయాల ఆవరణంలోకి గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా నీరు చేరడంతో కట్టడాల భద్రతకు ముప్పు వాటిల్లుతోందని ఆ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజుల నుంచి హంపి చుట్టుపక్కల కురుస్తున్న భారీ వర్షాలకు తోడు సమీపంలోనే తుంగభద్ర డ్యాం నిండుగా తొణికిసలాడుతున్న సంగతి తెలిసిందే. హంపిలో కురుస్తున్న భారీ వర్షాలకు హంపి పూర్తిగా జలమయమైంది. తుంగభద్ర డ్యాం 35 గేట్లు పూర్తిగా ఎత్తివేసినప్పుడు కూడా హంపిలోకి నీరు ప్రవహించలేదు. అయితే మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు హంపి జలదిగ్బంధమైంది. ఈ నేపథ్యంలో పురాతన కట్టడాలైన విరుపాక్షేశ్వర ఆలయం, విజయవిఠల ఆలయం, లోటస్ మహల్ తదితర పురాతన కట్టడాలు నీటిలోనే ఉండటంతో కట్టడాలకు హాని కలిగే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. దాదాపు 600 సంవత్సరాల క్రితం హంపిలోని స్మారకాల నిర్మాణాలు చేపట్టారు. దీంతో పునాదులు, ఇతరత్రా కట్టడాల భద్రతకు ముప్పువాటిల్లే ప్రమాదం లేకపోలేదని నిపుణులు భావిస్తున్నారు. సంబంధిత శాఖాధికారులు వెంటనే హంపిని సందర్శించి భద్రతపై సమగ్రంగా తనిఖీలు చేయాల్సిన అవసరం ఉందని పర్యాటకులు భావిస్తున్నారు. హంపిలోని పర్యాటక ప్రాంతాలు జలమయమవడంతో పర్యాటకుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
తుంగభద్ర డ్యామ్కు పెరుగుతున్న వరద ఉద్ధృతి
కర్నూలు: తుంగభద్ర జలాశయానికి వరద పోటేత్తింది. ప్రస్తుతం జలాశయంలో నీటి నిల్వ 97 టీఎంసీలు ఉందని అధికారులు వెల్లడించారు. దాదాతో 33 గేట్ల ద్వారా 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు చెప్పారు. నదీపరివాహాక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు. మరికొన్ని రోజుల పాటు వరద ఉద్ధృతి కోనసాగుతుందని చెప్పారు. తుంగభద్ర జలాశయంలో పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలు అన్న విషయం తెలిసిందే. -
కృష్ణానదికి పెరిగిన వరద ఉధృతి
శ్రీశైలానికి భారీగా వరద నీరు తుంగభద్ర డ్యాంలో పది క్రస్టుగేట్ల ఎత్తివేత బెంగళూరు/ధరూరు/శ్రీశైలం/విజయపురిసౌత్/హోస్పేట: మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు కృష్ణానదికి వరద ఉధృతి పెరిగింది. దీంతో కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు దాదాపుగా నిండిపోవడంతో దిగువకు నీటిని వదులుతున్నారు. ఫలితంగా జూరాలకు, అక్కడినుంచి శ్రీశైలానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శుక్రవారం ఆల్మట్టిలోకి ఇన్ఫ్లో లక్షా మూడు వేల 406 క్యూసెక్కులుండగా.. లక్షా 20 వేల 849 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అదే సమయంలో నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 20 క్రస్టుగేట్లను ఎత్తి లక్షా 20 వేల 849 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద తాకిడి మరింత పెరిగింది. ప్రాజెక్టుకు లక్షా 20 వేల 329 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, 22 క్రస్టుగేట్లు ఎత్తి లక్షా 24 వేల 759 క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. ఇక్కడి జలవిద్యుత్ కేంద్రంలోని ఆరు యూనిట్లలో పూర్తిస్థాయిలో 234 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతున్నట్లు జెన్కో అధికారులు తెలిపారు. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం జలాశయంలో 59.5145 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయ నీటిమట్టం 838.40 అడుగులకు చేరుకుంది. నీటిమట్టం శనివారం ఉదయానికి 845 అడుగులకు చేరే అవకాశముంది. వరదనీటి రాక ఇదేరీతిలో కొనసాగితే మరో నాలుగు రోజుల్లో శ్రీశైలం నీటిమట్టం పూర్తిస్థాయిలో 890 అడుగుల గరిష్ట స్థాయికి చేరుకోవచ్చు. అనంతరం ఇక్కడినుంచీ సాగర్ జలాశయానికి నీటిని విడుదల చేసే అవకాశముంది. ప్రస్తుతం శ్రీశైలంలో విద్యుదుత్పాదన అనంతరం 14,194 క్యూసెక్కుల నీటిని సాగర్ జలాశయానికి విడుదల చేస్తున్నారు. తుంగభద్ర గేట్ల ఎత్తివేత: మరోవైపు తుంగభద్ర డ్యాం నిండడంతో శుక్రవారం పూజలు నిర్వహిం చిన అధికారులు పది గేట్లు పైకి ఎత్తి దిగువకు 22 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. -
ఇలాగైతే ఎలా?
‘తుంగభద్ర’కు పెరగని ఇన్ఫ్లో.. ఆందోళనలో మూడు రాష్ట్రాల ప్రజలు గత ఏడాదితో పోలిస్తే 46 టీఎంసీల నీరు తక్కువ గత ఏడాది ఇదే సమయానికి డ్యాంలో 60 టీఎంసీల నీరు సాక్షి, బళ్లారి : మూడు రాష్ట్రాల వరప్రసాదినిగా ఉన్న తుంగభద్ర జలాశయంలో రోజురోజుకూ నీరు అడుగంటుతోంది. తాగు, సాగునీటి అవరసరాలను తీరుస్తున్న ఈ జలాశయానికి ఇన్ఫ్లో పెరకపోవడంతో కర్ణాటకలోని బళ్లారి, కొప్పళ, రాయచూరు, తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఆయకట్టు రైతులు నారుమళ్లు కూడా పోయలేని దుస్థితి నెలకొంది. గత ఏడాది ఇదే సమయానికి డ్యాంలో 60 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం కేవలం 14 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. 46 టీఎంసీల మేర నీరు తక్కువగా ఉండడంతో వ్యవసాయ అవసరాలకు నీటిని ఎలా విడుదల చేయాలో అర్థం కాక బోర్డు అధికారులు తలలు పట్టుకున్నారు. తాగునీటికి కటకటే.. గత ఏడాది జులై 20 నాటికి తుంగభద్ర డ్యాం నిండు కుండలా తొణికిసలాడింది. ప్రస్తుతం ఆ ఛాయలు కనిపించడం లేదు. దీంతో తాగునీటి కష్టాలు తీరడం కూడా ప్రశ్నార్థకమవుతోంది. ఇప్పటికే తుంగభద్ర జలాశయంపై ఆధారపడిన నగరాలు, పట్టణాలు, గ్రామాల ప్రజలు తాగునీటి కోసం హాహాకారాలు చేస్తున్నారు. బళ్లారిలో 15 రోజులకు ఒకసారి కూడా నీరు విడుదల చేయడం లేదంటూ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాలువలకు నీరు వదిలే వరకు బళ్లారి వాసులకు ఈ దుస్థితి తప్పదని అధికారులు తేల్చి చెబుతున్నారు. నీటి విడుదలపై అనుమానాలు గత ఏడాది జులై 7వ తేదీస హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీకు నీరు విడుదల చేశారు. ప్రస్తుతం డ్యాంకు ఇన్ఫ్లో లేకపోవడంతో నీటి విడుదలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై అధికారులు కూడా స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. కాలువలకు నీరు వదలకపోవడంతో ఖరీఫ్ పంట సాగు అనుమానమేనని రైతులు పేర్కొంటున్నారు. మరో పది రోజుల్లో జలాశయంలోకి నీరు చేరకపోతే సాగునీటికే కాదు తాగునీటికి కూడా జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని నిపుణులు పేర్కొంటున్నారు. -
చేతకాకపోతే ప్రత్యామ్నాయం చూపండి
తుంగభద్ర డ్యాంలో పూడికతీతపై సర్కార్ కొత్త నాటకం కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు చామరస మాలిపాటిల్ సాక్షి, బళ్లారి : తుంగభద్ర డ్యాం(టీబీ డ్యాం)లో పూడిక తీత చేతకాకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతు సంఘం అధ్యక్షుడు చామరస మాలిపాటిల్ డిమాండ్ చేశారు. స్థానిక పత్రికా భవన్లో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. టీబీ డ్యాంలో పూడికతీతపై కాంగ్రెస్ ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని మండిపడ్డారు. అధికారం లేనప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు మరో మాట మాట్లాడుతూ సమస్యను కాంగ్రెస్, బీజేపీలు పక్కదారి పట్టిస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాలకు తాగు, సాగు నీరందించే తుంగభద్ర జలాశయంలో పూడిక పేరుకుపోవడం వల్ల 33 టీఎంసీ నీటి నిల్వ సామార్థ్యం తగ్గిపోయిందని వివరించారు. డ్యాంలో పూడిక తీస్తామంటూ అధికారంలో ఉన్నప్పుడు బీజీపీ హడావుడి చేసిందని గుర్తు చేశారు. పూడిక తీత సాధ్యం కాదని, ఇందుకు ప్రత్యేక టెక్నాలజీ అవసరమని అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త నాటకానికి తెరలేపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూడిక తీత ప్రభుత్వానికి చేతకాకపోతే రైతు సంఘం ఆధ్వర్యంలో పది వేల ట్రాక్టర్లను ఉపయోగించి డ్యాంలోని మట్టిని తరలిస్తామని అన్నారు. అంతేకాక పూడిక తీతపై కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఒక అవగాహనకు రావాల్సిన అవసరం ఉందని, లేని పక్షంలో పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. ఆనయకట్టు దారులపై చర్యలు తీసుకోండి డ్యాం పరిధిలో 1.50 లక్షల ఎకరాల ఆనయకట్టు పెరిగిందని, అక్రమంగా నీటిని వినియోగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్బంగా చామరస మాలిపాటిల్ డిమాండ్ చేశారు. డ్యాంలో నీటి లభ్యత తక్కువగా ఉన్నందువల్ల రైతులు పంటలు పండించలేకపోతున్న తరుణంలో ఫ్యాక్టరీలకు నీటి సరఫరా నిలిపివేసి నీటి చౌర్యాన్ని అరికట్టాలన్నారు. ఉత్తర కర్ణాటకలో చెరుకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, టన్ను చెరుకుకు రూ.2650ల ధర నిర్ణయించాలని డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యల పరిష్కారంలో భాగంగా ఈనెల 21న హొస్పేట సమీపంలోని హిట్నాల్ క్రాస్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకోలు చేపడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు దరూరు పురుషోత్తం గౌడ, జిల్లా రైతు సంఘం నాయకులు సాగర్గౌడ, పంపాపతి, సంతోష్కుమార్, ఉమేష్గౌడ, మల్లారెడ్డి పాల్గొన్నారు. -
ఈసారి తక్కువే!
ఈ ఏడాది తుంగభద్రలోకి 144 టీఎంసీలు చేరే అవకాశం కర్ణాటకకు 94.5 టీఎంసీలు = ఆంధ్రప్రదేశ్కు 49.5 టీఎంసీలు గత ఏడాది కంటే డ్యాంలోకి నీరు తక్కువ వస్తుందని అంచనా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో తుంగభద్ర డ్యాంలోకి 144 టీఎంసీల నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ప్రతి ఏటా మాదిరిగానే ఖరీఫ్ సీజన్కు ముందు తుంగభద్ర డ్యాంలోకి నీరు ఎంత చేరుతుందనే విషయంపై అధికారులు ముందస్తు సమావేశం నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా సోమవారం రాత్రి తుంగభద్ర డ్యాం ప్రధాన కార్యాలయంలో టీబీ డ్యాం ఎస్ఈ శ్రీనివాసరావు అధ్యక్షతన వాటర్ రివ్యూ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ ఖరీఫ్ సీజన్లో తుంగభద్ర డ్యాంలోకి ఎన్ని టీఎంసీల నీరు వస్తుంది.. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఏమేరకు నీరు కేటాయించవచ్చు అనే విషయంపై ఓ నిర్ణయానికి వచ్చారు. తుంగభద్ర బోర్డు ఎస్ఈ శ్రీనివాసరావు, అనంతపురం ఎస్ఈ మురళీనాథ్రెడ్డి, కర్నూలు ఎస్ఈ నాగేశ్వరరావు, మునిరాబాద్ ఎస్ఈ భోజ్యానాయక్, ఈఈలు ఇంగళిగి, నారాయణ నాయక్, ఎస్డీఓ రమేష్ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో తుంగభద్ర డ్యాంలోకి ఎంత నీరు వస్తుందనే దానిపై ఒక అవగాహ నకు వచ్చారు. డ్యాం ప్రారంభించినప్పటి నుంచి అంటే 60 సంవత్సరాలుగా ఖరీఫ్ సీజన్కు ముందుగా ఎస్ఈ నేతృత్వంలో సమీక్ష సమావేశం నిర్వహించి డ్యాంలోకి నీరు ఎంత చేరుతుందనే దానిపై అంచనాకు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కాస్త వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని, డ్యాంలోకి కూడా గత ఏడాది కంటే నీరు తక్కువ వచ్చే అవకాశం ఉందని అధికారులు సమీక్షించినట్లు తెలుస్తోంది. గత ఏడాది 150 టీఎంసీల నీరు వస్తుందని ముందుగా అంచనాలు వేశారు. చివరకు 135 టీఎంసీలు నీరు చేరినట్లు నిర్ధారించి ఆ మేరకు ఇరు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేయడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు నీరు తక్కువ చేరిందనే విమర్శలు వచ్చాయి. ఈ ఏడాది కూడా 144 టీఎంసీల నీరు వస్తుందని అంచనాలు వేసినప్పటికీ, డ్యాంలోకి వచ్చే నీటిని బట్టి మళ్లీ నీటిని కేటాయిస్తారు. ప్రస్తుతం ఈ ఏడాది అధికారులు సమీక్షా సమావేశంలో తీర్మానించిన మేరకు 144 టీఎంసీలలో కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి, రాయచూరు, కొప్పళ జిల్లాలకు ఖరీఫ్, రబీ సీజన్లకు గాను 94.5 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాలకు 49.5 టీఎంసీల నీటిని అందించేందుకు అవకాశం ఉన్నట్లు తీర్మానించారు. ఆయా రాష్ట్రాలకు అందించిన నీటి కేటాయింపుల ప్రకారం జిల్లాల వారీగా మళ్లీ కేటాయిస్తారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ ఏడాది డ్యాంలోకి గత ఏడాది కంటే నీరు తక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున ఖరీఫ్ సీజన్లో పంటలను త్వరగా వేసుకోవాలని రైతాంగానికి తుంగభద్ర బోర్డు ఎస్ఈ శ్రీనివాసరావు సూచించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన అధికారులు జూలై మొదటి వారం నుంచి నీరు విడుదల చేయాలని ఇండెంట్ ఇచ్చారని, అయితే కర్ణాటక అధికారులు జూలై ఆఖరు కల్లా కాలువలకు నీరు విడుదల చేయాలని కోరారని చర్చించారు. రెండు రాష్ట్రాలకు చెందిన రైతాంగానికి ఒకే కాలువ గుండా నీరు విడుదల చేస్తే పంటలకు నీరు సక్రమంగా అందుతుందని, ఈ ఏడాది నీరు తక్కువగా వచ్చే సూచనలు ఉన్నందున త్వరగా పంటలు వేసుకుంటే నీటిని ఆదా చేసుకుని ఖరీఫ్, రబీలకు నీరు అందించేందుకు ఇబ్బందులు ఉండవని, ఆమేరకు రైతులకు దిశానిర్దేశం చేయాలని ఎస్ఈ సూచించారు. మొత్తం మీద డ్యాంలోకి గత ఏడాది కంటే నీరు తక్కువగా వస్తుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఖరీఫ్కు త్వరగా ఏర్పాట్లు చేసుకోవాలని బోర్డు ఉన్నతాధికారులు రైతులకు సూచించారు. -
మృత్యు ఒడిలోకి
సరదా..! విషాదం మిగిల్చింది. శుభకార్యం జరిగిన ఇంట్లో అశుభం తాండవించింది. స్నానానికి వెళ్లిన ఇద్దరు బాలికలను,వారిని రక్షించేందుకు యత్నించిన ఓ మహిళను తుంగభద్ర మింగేసింది. తమ పిల్లలు గంగలో మునిగిపోవడంతో తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. తల్లి చనిపోవడంతో ఆమె పిల్లలు దిక్కులేనివారయ్యారు. చూస్తుండగానే క్షణాల్లో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో బంధువులు శోకసంద్రంలో మునిగారు. అలంపూర్, న్యూస్లైన్ : ఆ దంపతులకు ఉన్నది ఇద్దరు కుమార్తెలే.. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ జీవిస్తున్నారు.. బాగా చదివించాలనుకున్నా వారి ఆశలు మధ్యలోనే కల్లలయ్యాయి.. అసలే వేసవి సెలవులు..పైగా బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో తమ కూతుళ్లు సరదగా గడుపుతారని తల్లిదండ్రులు పంపించారు.. తుంగభద్ర నది రూపంలో మృత్యువు కబళించడంతో వారి రోదనలు అక్కడివారిని కలిచివేసింది.. వివరాలు.. కర్నూలు నగరంలోని ఎన్టీఆర్బిల్డింగ్ కాలనీలో నివాసముంటున్న అమీన్, ఖాజబీ దంపతులకు కుమార్తెలు షేకున్బీ (11), రజియా (10) ఉన్నారు. వీరు అక్కడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరు, ఐదో తరగతి చదువుతున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ప్రస్తుతం వేసవి సెలవులు ఉండటంతో శుభకార్యం నిమిత్తం మూడు రోజులక్రితం తమ కూతుళ్లను అలంపూర్ పట్టణంలోని కుమ్మరివీధికి చెందిన శాలిమియా ఇంటికి పంపించారు. అలా వచ్చిన వారు ఆదివారం ఉదయం తుంగభద్ర నదిలో స్నానానికి వెళ్లి మృత్యువాత పడటంతో తల్లడిల్లిపోయారు. ఇదే సంఘటనలో వరసకు చిన్నమ్మ అయిన అలంపూర్మండలం తక్కశీలకు చెందిన మహబూబ్బీ (27) మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈమెది రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి. దీంతో భర్త ఫకృద్దీన్కు తోడుగా కూలిపని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేది. కుమారులు హనీఫ్, మహిబూబ్ ఉన్నారు. తల్లి చనిపోవడంతో వారి రోదనలు మిన్నంటాయి. ఇలా రెండు కుంటుంబాల్లో నది ప్రమాదం తీరని విషాదాన్ని నింపింది. శుభకార్యంతో రెండు రోజులపాటు ఆనందంతో గడిపిన బంధుమిత్రులూ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. -
దాహం.. దాహం
నడిగడ్డ ప్రాంతంలో వేసవికి ముందే నీటిఎద్దడి తీవ్రరూపం దాల్చింది. చెంతనే రెండుజీవనదులు ఉన్నా తాగడానికి గుక్కెడునీళ్లు దొరకడం లేదు. సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు తాగునీటి పథకాలు నిర్మించినా దాహార్తిని తీర్చలేకపోతున్నాయి. కోట్లు ఖర్చుచేసినా ఫలితం లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో బిందెనీటి కోసం ప్రజలకు మైళ్ల దూరం నడక తప్పడంలేదు. తుంగభద్ర, కృష్ణా రెండు జీవనదుల మధ్య ఉన్న అలంపూర్ ప్రజలను నిత్యం నీటికష్టాలు వెంటాడుతున్నాయి. నియోజకవర్గంలోని 145 గ్రామాల్లో సుమారు 50 గ్రామాలకు నాలుగు పథకాల ద్వారా అరకొరగా నీటిని సరఫరా చేస్తున్నారు. కాగా, నీటిఎద్దడి తీవ్రరూపం దాల్చుతుండటంతో సుమారు రూ.39 కోట్ల వ్యయంతో నాలుగు నీటిపథకాలను నిర్మిస్తున్నారు. అయితే వీటిలో కొన్ని నిర్మాణాలు పూర్తిచేసుకున్నా నీటిసరఫరా జరగడం లేదు. ఫలితంగా ఏటా వేసవిలో గత మూడేళ్లుగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. - న్యూస్లైన్, అలంపూర్ లీకేజీలతో నీటి వృథా.... మానవపాడు మండలం బొంకూరు, చిన్నపోతులపాడు, పెద్దపోతులపాడు, చెన్నుపాడు, అలంపూర్ చౌరస్తా, పుల్లూరు గ్రామాలకు నీటిని అందించాల్సి ఉంది. కానీ నిత్యం పైప్లైన్ల లీకేజీ వంటి సమస్యలతో ఇప్పటికే ఈ పథకం నుంచి రెండు గ్రామాలకు నీటి సర ఫరా నిలిచిపోయింది.అలంపూర్ చౌరస్తాలో ఇటీవల రూ.6.50 లక్షల వ్యయంతో అదనపు పైప్లైన్ వేశారు. కానీ ఇప్పటికీ కనెక్షన్ ఇవ్వకపోవడంతో నీటి సమస్యకు పరిష్కారం లభించడం లేదు. అలాగే మానవపాడు, వడ్డేపల్లి మండలంలోని ఐదు గ్రామాలకు నీటిని అందించేందుకు మద్దూరు వద్ద ఈ పథకాన్ని నిర్మించారు. కానీ పథకం ఉందన్న మాటే కానీ నీటి సరఫరా మాత్రం కొండెక్కింది. 5 గ్రామాలకే నీళ్లు... బీచుపల్లి తాగునీటి పథకం ద్వారా 33 గ్రామాలకు నీటి సరఫరా జరగాల్సి ఉంది. మొదటి విడతలో రూ.నాలుగుకోట్ల వ్యయంతో పనులకు శ్రీకారం చుట్టారు. రెండోవిడతలో మంజూరైన రూ.ఐదుకోట్లతో 10 గ్రామాలకు మాత్రమే పైప్లైన్ పనులు జరుగుతున్నాయి. అయిదేళ్లుగా నిర్మిస్తున్న ఈ పథకం ద్వారా కేవలం ఐదు గ్రామాలకు మాత్రమే నీళ్లను అందిస్తున్నారు. -
‘తుంగభద్ర’పై అన్ని రకాలుగా సహకరిస్తాం
= సీఎం కిరణ్ కాంగ్రెస్లోనే ఉంటారనే నమ్మకముంది = సమైక్యాంధ్ర కోసం అఫిడవిట్లు సమర్పిస్తాం = అనంతపురం జిల్లా నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తా = ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి సాక్షి, బళ్లారి : కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు తాగు, సాగు నీరందించే ప్రధాన జలాశయమైన తుంగభద్ర డ్యామ్లో పేరుకుపోయిన పూడిక తొలగింపు, హెచ్ఎల్సీకి సమాంతర కాలువ నిర్మాణం, హెచ్ఎల్సీని వెడల్పు చేసే విషయం రెండు ప్రభుత్వాల దృష్టిలో ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.ర ఘువీరారెడ్డి అన్నారు. ఆయన ఆదివారం నగరంలోని అల్లం భవన్లో సింధూరి ఆగ్రోస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. సమాంతర కాలువ ఏర్పాటు చేయాలని గత 25 సంవత్సరాలుగా చర్చ జరుగుతూనే ఉందన్నారు. ఇటీవల రెండు నెలల క్రితం బెంగళూరులో సమాంతర కాలువ, పూడికతీత తదితర అంశాలపై రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు ప్రత్యేకంగా చర్చించిన విషయాన్ని గుర్తు చేశారు. బెంగళూరు సమావేశం ముగిసినందున ఆంధ్రప్రదేశ్లోని హైదరాబాద్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, కర్ణాటకకు చెందిన మంత్రులు ఎప్పుడు వచ్చినా తాము సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. తుంగభద్ర పూడిక తొలగింపు, సమాంతర కాలువ నిర్మాణంపై తాము అన్ని రకాలుగా సహకరిస్తామన్నారు. బళ్లారి, అనంతపురం జిల్లాలు అత్యంత కరువు జిల్లాలని, ఈ రెండు జిల్లాలకు మరింత సాగు నీరు పెంచాలంటే తుంగభద్ర డ్యాంలో పూడిక తొలగింపు లేదా వృథాగా పోతున్న నీటిని సమాంతర కాలువ ద్వారా వినియోగించుకోవాలన్నారు. దీనికి కూడా తాము ప్లాన్ చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లరనే నమ్మకం ఉందన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ వీడి ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేస్తున్నారనే వదంతులపై విలేకరులు అడిగిన ప్రశ్నకు పైవిధంగా సమాధానం ఇచ్చారు. కిరణ్, ఆయన తండ్రి కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవలు చేశారని, అలాంటి వ్యక్తి పార్టీని వీడతారనే నమ్మకం లేదన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ పార్టీ నుంచి భారీగా వలసలు ఉంటాయనే విషయాన్ని మంత్రి అంగీకరించారు. సమైక్య రాష్ట్రం కోసం తాము అఫిడవిట్లు ఇస్తూ సంతకాలు చేసి పోరాటం చేస్తున్నామన్నారు. చివరి వరకు సమైక్య రాష్ట్రం కోసం పోరాటం చేస్తామన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తాను కర్ణాటక నుంచి పోటీ చేస్తానని ప్రచారం జరుగుతోందని, అయితే ఇందులో ఎలాంటి నిజం లేదన్నారు. తనకు ఇతర రాష్ట్రాల్లోకి వచ్చి పోటీ చేసి గెలిచే సత్తా లేదన్నారు. హైకమాండ్ ఆదేశిస్తే పోటీ చేస్తారా? అన్న ప్రశ్నకు ఆయన ఆంధ్రప్రదేశ్లోని అన ంతపురం జిల్లా నుంచి మాత్రమే అసెంబ్లీకి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అయితే అనంతపురం జిల్లాలోని ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్నది మాత్రం చెప్పలేదు. -
కేసీకి సాగునీరు విడుదల
కర్నూలు(రూరల్), న్యూస్లైన్: సుంకేసుల జలాశయం నుంచి కర్నూలు-కడప కాలువకు సాగునీరు విడుదల చేసినట్లు కేసీ కెనాల్ ఈఈ పుల్లారావు ఆదివారం ‘న్యూస్లైన్’కి తెలిపారు. కేసీ కింద రబీ ఆయకట్టు పంటలను ఆదుకునేందుకు శనివారం రాత్రి నుంచి రోజుకు 1500 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేస్తున్నామన్నారు. మొదటి రెండు రోజులు 1500 క్యూసెక్కులు, ఆ తర్వాత రెండు రోజులు 1200 క్యూసెక్కులు, 1000 క్యూసెక్కులు చొప్పున మరో రెండు రోజుల పాటు నీరందిస్తామన్నారు. తుంగభద్ర డ్యాం నుంచి వదిలిన నీరు రెండు రోజుల్లో ఆర్డీఎస్ చేరుకుంటుందని.. ఈ నీరు సుంకేసులకు చేరుకునేందుకు మరో మూడు రోజుల సమయం పడుతుందన్నారు. ఉన్నతాధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధుల ఆదేశాలతో సుంకేసులలో 0.6 టీఎంసీ నీటిని నిల్వ చేసి కర్నూలు నగర ప్రజల తాగునీటి అవసరాలకు అందిస్తామన్నారు. 0 కి.మీ నుంచి 150 కి.మీ వరకు రబీలో దాదాపు 25,600 ఎకరాల్లో ప్రస్తుతం మిరప, వేరుశెనగ, మొక్కజొన్న పంటలు సాగయ్యాయన్నారు. ఈ పంటలకు మాత్రమే నీటిని వినియోగించుకోవాలన్నారు. రైతులు సర్దుబాటుతో వ్యవహరించాలని ఆయన కోరారు. -
నీరు బంద్
మహబూబ్నగర్, సాక్షి ప్రతినిధి: తుంగభద్ర డ్యాం నుంచి ఆర్డీఎస్ (రాజోలిబండ మళ్లింపు పథకం)కు సాగు నీరు విడుదలను బంద్ చేశారు. దీంతో ఈ ప్రాజెక్టు కింద దాదాపు 30 వేల ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఏప్రిల్ 15వ తేదీ వరకు సాగు నీరు ఇవ్వాలని ఈ నెల 7వ తేదీన నిర్వహించిన సాగునీటి పారుదల సలహా సంఘం (ఐఏబీ) సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయం తీసుకున్న 15 రోజుల్లోపే నీరు బంద్ కావడం విశేషం. సమావేశంలో మార్చి 15వ తేదీ వరకు మాత్రమే నీళ్లు ఇవ్వనున్నట్లు ఇరిగేషన్ శాఖ అధికారులు ముందుగా ప్రకటించారు. అరుుతే పంటలు చేతికందడం కష్టమని ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్రెడ్డి తదితరులు ప్రశ్నించడంతో మంత్రి డీకే అరుణ జోక్యం చేసుకున్నారు. ఏప్రిల్ 15వ తేదీని పొడిగిస్తూ హామీనిచ్చారు. అయితే ఇప్పటి వరకు తుంగభద్ర నదిలో వస్తున్న నీటిని మాత్రమే వాడుకుంటున్నారు. తుంగభద్ర డ్యాం నుంచి ఆర్డీఎస్కు రావాల్సిన 4.5 టీఎంసీల వాటా విడుదలలో అధికారులు ఇండెంట్ పెట్టలేకపోయూరు. ఈ కారణాలతో తుంగభద్ర డ్యాం అధికారులు నీటి సరఫరాను బంద్ చేశారనే వాదన విన్పిస్తోంది. ఆర్డీఎస్ కాలువలు వెలవెలబోతుండంతో రైతులు ఈ విషయాన్ని జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా అనంతపురం జిల్లాలోని హెచ్ఎల్సీ (తుంగభద్ర ఎగువ కాలువ)కి తుంగభద్ర డ్యాం నుంచి అదనంగా 10 టీఎంసీల నీటిని తీసుకెళ్లేందుకు ఆ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి సఫలీకృతులు అయ్యూరు. అలాగే ఆర్డీఎస్కు విడుదల చేయాల్సిన నీటి కేటాయింపులో 2 టీఎంసీల మేర కోత విధించి కర్నూలు నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఇవ్వాలని కర్నూలు జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇదే జరిగితే అలంపూర్ నియోజకవర్గంలో సాగు చేసిన 30 వేల ఎకరాల పంట దెబ్బతినడంతో పాటు ఆ నియోజకవర్గంలోని దాదాపు 30 గ్రామాల్లో తాగునీటి కొరత తీవ్రంగా ఏర్పడే ప్రమాదం ఉంది. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పెద్దగా పట్టించుకోక పోవడంతోనే ఈ సమస్య ఉత్పన్నం అవుతోందనే ఆరోపణలు కూడా విన్పిస్తున్నాయి. ముఖ్యంగా అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం స్పందించాల్సి ఉన్నా.. ఆయన పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నారుు. ఇటీవల నిర్వహించిన ఐఏబీ సమావేశానికి కూడా ఆయన డుమ్మా కొట్టారు. అరుుతే కర్నూలు జిల్లాలో ఉన్న కేసీ కెనాల్కు, జిల్లాలోని ఆర్డీఎస్కు నీటి విడుదలకు సంబంధించి కర్నూలు జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులే ఇండెంట్ పెట్టకపోవడంతోనే ఈ సమస్య తలెత్తింది. -
ఈ సారైనా ‘సాగు’తుందా!
కర్నూలు రూరల్/ఆదోని, న్యూస్లైన్ : కాలువల కింద పంటలు సాగు చేసే జిల్లా రైతాంగానికి ప్రతి ఏడాదీ నిరాశే మిగులుతోంది. జలాశయాల పరిధిలో కేటాయించిన మేరకు కాలువలకు ఏనాడూ సాగునీరు సరఫరా కావడం లేదు. అదీ చాలదన్నట్టు వచ్చే కొద్దిపాటి నీటినీ ఇతర రాష్ట్రాల రైతులు దౌర్జన్యంగా తరలించుకుపోతున్నారు. కాలువలకు గండ్లు, ఆవిరి రూపంలో పోతున్న నీరు మొత్తం జిల్లా వాటాలోనే లెక్కిస్తుండడంతో నష్టం వాటిల్లుతోంది. ప్రజల దాహార్తిని తీర్చేందుకు సైతం ఈ నీటిని వినియోగించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తడంతో ఆయకట్టుసాగు ప్రశ్నార్థకంగా మా రుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ భవనంలో నిర్వహించనున్న సాగునీటి సలహా మండలి(ఐఏబీ) సమావేశంపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. కనీసం ఈ ఏడాది రబీలోనైనా సక్రమంగా నీటిని విడుదల చేయించి ఆదుకోవాలని ఆయకట్టు రైతులు వేడుకుంటున్నారు. ఎల్లెల్సీ వాటాలో కర్ణాటక దౌర్జన్యం తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ) కర్ణాటకతోపాటు జిల్లాలో విస్తరించి ఉంది. మొత్తం కాలువ నిడివిలో 250 కిలోమీటర్ల వరకు తుంగభద్ర బోర్డు నిర్వహణలో ఉంది. పరిమితి మేరకు నీటిని సరఫరా చేస్తే రాష్ట్ర సరిహద్దు చింతకుంట(153 కి.మీ.) వద్ద రాష్ర్ట వాటా కింద 725 క్యూసెక్కులు, బోర్డు సరిహద్దు హనువాళు (250 కి.మీ.) వద్ద 650 క్యూసెక్కులు నీటి ప్రవాహం ఉండాలి. అయితే కర్ణాటక రైతుల అక్రమాలు ఏడాదికేడాదికీ అధికమవుతున్నాయి. మోటార్లు, నీటికి అడ్డుకట్టలు వేసి జలచౌర్యానికి పాల్పడుతున్నారు. దానికితోడు కాలువలు దెబ్బతినడం.. ఆవిరైన నీటిని మొత్తం జిల్లా వాటాలోనే చూపుతున్నారు. దీంతో ఎప్పుడూ ప్రవాహం 450 క్యూసెక్కులు మించలేదు. కర్ణాటకలో నీటి అవసరం ఎక్కువగా ఉన్న సమయంతో ప్రవాహం 200 క్యూసెక్కులకు పడిపోయిన సందర్భాలూ ఉన్నాయి. జిల్లాలోని 16 మండలాల్లో 192 గ్రామాలు ఎల్లెల్సీ నీటిపై ఆధారపడ్డాయి. దీని కింద ఖరీఫ్ సీజన్లో 43,519 వేల ఎకరాలు, రబీలో 1,07,615 ఎకరాలు సాగు కావాల్సి ఉంది. బచావత్ ట్రిబునల్ ప్రకారం 24 టీఎంసీల నీటిని జిల్లాకు ఇవ్వాల్సి ఉంది. పూడిక చేరడంతో ఏటేటా వాటా నీరు తగ్గుతూ వస్తోంది. ఈ ఏడాది 16.32 టీఎంసీల నీరు కేటాయిస్తే ఖరీఫ్లో సాగు చేసిన పంటలకు ఇప్పటికి 8.34 టీఎంసీలు వినియోగించారు. వాటాలో మిగిలిన 7.98 టీఎంసీల నీటిని రబీలో సాగుకు విడుదల చేయాల్సి ఉంది. కనీసం ఈ ఏడాదైనా నీటి సక్రమంగా జిల్లాకు చేరేలా చూడాలని రైతులు అధికారులు, నాయకులను కోరుతున్నారు. అందులో సగం తాగునీటి అవసరాలకు పోయినా, మిగిలిన వాటాతో దాదాపు 50 వేల ఎకరాలు సాగు చేసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఆ‘కేసీ’ చూడడమే లేదు సుంకేసుల జలాశయంపై ఆధారపడి ఉన్న కర్నూలు-కడప కాలువ పరిస్థితి ఏటేటా దారుణంగా తయారవుతోంది. సెప్టెంబర్, అక్టోబరు నెలలో కురిసిన భారీ వర్షాలకు 90 కి.మీ, 156, 171, 189 కి.మీల దగ్గర కాలువలకు గండ్లు పడ్డాయి. వాటి శాశ్వత మరమ్మతులకు ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం నిధులు మంజురు చేయడం లేదు. కర్నూలు, కడప జిల్లాల్లో 2,65,628 ఎకరాలకు సాగు నీరు అందించేది. సాగు నీటి కొరత వల్ల 1.70 వేల ఎకరాలకే నీరిచ్చే స్థితికి చేరుకుంది. ఈ కాలువకి టీబీ డ్యాంలో కేటాయించిన 10 టీఎంసీల వాటాకుగాను 7 టీఎంసీలు మాత్రమే ఈ ఏడాది మంజూరు చేశారు. అందులో నుంచి కూడా 2 టీఎంసీల నీరు కర్నూలు నగర ప్రజల తాగునీటికి వినియోగిస్తున్నారు. 2.5 టీఎంసీ అనంతపురానికి తరలిస్తారు. మిగిలిన 2.5 నీటిని కేసీ ఆయకట్టుకు నీటిని అందించడం సాధ్యం కాదు. అందుకే 10 ఏళ్లుగా ఈ కాలువ కింద రెండో పంటకు నీరు అందనే లేదు. నీటి వాటాను పెంచేందుకు కృషి చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. తెలుగు గంగా.. తీరని బెంగ శ్రీశైలం డ్యాంలో 854 అడుగుల నీరు ఉన్నప్పుడు మాత్రమే నీటిని వినియోగించుకోవాలనే నిబంధన ఉంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి బానకచర్ల కాంప్లెక్సు ద్వారా తెలుగు గంగా, శ్రీశైలం కుడి కాలువ, కె.సి కెనాల్ ఎస్కేప్ చానల్ ద్వారా వినియోగించే నీటితో సుమారు 3.50 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. ఈ కాలువ కింద సాగు చేసే ఏ ఆయకట్టుని ఇంత వరకు స్థిరీకరించలేదు. దీంతో తెలుగు గంగాతో పాటు మిగతా కాలువల కింద ఏ మేరకు పంటలు సాగు అవుతున్నాయే కూడా అధికారులు ఖచ్చితమైన లెక్కలు చెప్పలేకపోతున్నారు. ఏబీసీ కింద ఏళ్లుగా బీడే తుంగభద్ర ఎగువ కాలువ పరిధిలో 28వ కి.మీ. వద్ద ఉన్న ఆలూరు బ్రాంచ్ కాలువ కింద 14,255 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ కాలువకి పదేళ్లుగా సాగు నీరు అందడం లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా నగరడోణ రిజర్వాయర్ నిర్మాణానికి పూనుకున్నా భూ సేకరణ సమస్యలు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పనులు ముందుకు సాగడం లేదు. జిల్లాలో నీటి వనరులు సంవృద్ధిగా ఉన్నా వినియోగించుకునేందకు అవకాశం లేక, అందుబాటులో ఉన్న వనరులకు ప్రత్యామ్నాయ చర్యలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజా ప్రతినిధులు స్పందించాలి ఐఏబీ సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రితో పాటు జిల్లాకు చెందిన రాష్ట్ర, కేంద్ర మంత్రులు, కలెక్టర్, సాగు నీటి శాఖ ఎస్ఈ, ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉన్నారు. అయితే కర్ణాటకలో ఎల్లెల్సీ నీటి దోపిడీని అరికట్టేందుకు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. మంగళవారం నిర్వహించే సమావేశంలో అయినా దోపిడీపై సమీక్షించి నివారణ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
సమాంతర కాలువకు ‘సుదర్శన ’ చక్రం అడ్డు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఎన్నో అవాంతరాల తర్వాత తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ(హెచ్చెల్సీ)కు సమాంతర కాలువ ప్రతిపాదనపై కర్ణాటక సర్కారు సానుకూలంగా స్పందిస్తుంటే.. మన రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి పి.సుదర్శనరెడ్డి మాత్రం మోకాలడ్డే యత్నం చేస్తున్నారు. సమావేశానికి మంత్రి గైర్హాజరు కావాలని నిర్ణయించిన నేపథ్యంలో బెంగళూరులో శుక్రవారం నిర్వహించనున్న సమావేశ లక్ష్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. తుంగభద్ర నదిపై కర్ణాటక-ఆంధప్రదేశ్ రాష్ట్రాలు సంయుక్తంగా హొస్పేట వద్ద 133 టీఎంసీల సామర్థ్యంతో తుంగభద్ర డ్యామ్ను నిర్మించారు. దీని నుంచి వృథాగా పోతున్న నీటిని సద్వినియోగం చేసుకోవాలంటే.. హెచ్చెల్సీకి సమాంతర కాలువ తవ్వి, టీబీ డ్యామ్కు వరద వచ్చే సమయంలో వైఎస్సార్ జిల్లాలోని పీఏబీఆర్, ఎంపీఆర్, సీబీఆర్, మైలవరం రిజర్వాయర్లను నింపుకుని, ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని అందించవచ్చునని నీటి పారుదల రంగ నిపుణులు దశాబ్దాలుగా చెబుతూ వస్తున్నారు. కానీ ఈ ప్రతిపాదనను కర్ణాటక, ప్రధానంగా బళ్లారి జిల్లా రైతులు ససేమిరా అంటూ వచ్చారు. కానీ.. ఇటీవల బళ్లారి రైతుల్లో మార్పు వచ్చింది. సమాంతర కాలువ వల్ల తమకు కూడా ప్రయోజనం ఉంటుందని గుర్తించారు. గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే సమాంతర కాలువపై పలుమార్లు కర్ణాటకు విజ్ఞప్తి చేశారు. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. సర్వే చేయించి సమాంతర కాలువ వల్ల ఇరు ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుతుందని తేల్చారు. ఈ క్రమంలోనే రెండు రాష్ట్రాల ప్రతినిధి బృందంతో శుక్రవారం(తొలుత గురువారం అనుకుని.. వాయిదా వేశారు) బెంగళూరులో సంయుక్త సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి ప్రతినిధి బృందాన్ని పంపాలని కర్ణాటక సర్కారు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. తెలంగాణకు నీటిని తెచ్చే ఆర్డీఎస్కు అన్యాయం జరుగుతుందనే సాకు చూపి బెంగళూరు సమావేశంలో పాల్గొనడానికి తెలంగాణ ప్రాంతానికి చెందిన భారీ నీటి పారుదల శాఖ మంత్రి పి.సుదర్శనరెడ్డి ఆసక్తి చూపడం లేదని తెలిసింది. దీంతో రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి, కలెక్టర్ లోకేష్కుమార్ తదితరులు సమావేశానికి హాజరుకానున్నారు. అయితే.. సమాంతర కాలువ తవ్వకం వల్ల ఆర్డీఎస్కు ఎలాంటి అన్యాయం జరగదని నీటి పారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్త్తున్నారు. -
విభజనతో నీటి సమస్యలు తీవ్రతరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం కలసి ఉన్నప్పుడే రాయలసీమకు సరిగ్గా నీళ్లు రావడం లేదని, విడిపోతే సమస్య మరింత సంక్లిష్టమవుతుందని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోతే నీటి ఇబ్బందులు ఏర్పడతాయని గ్రహించే తాను సమైక్యవాదం వినిపిస్తున్నానని అన్నారు. సీపీఐ నేతృత్వంలో వందలాది మంది రైతులు సోమవారం ముఖ్యమంత్రిని క్యాంప్ కార్యాలయంలో కలిశారు. తుంగభద్ర డ్యాం నుంచి పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)కు కేటాయించిన పది టీఎంసీల నీటిని విడుదల చేసి, కుడి కాలువ కింద ఉన్న 49 చెరువులు నింపాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడారు. శ్రీశైలం ప్రాజెక్టులో 871 అడుగుల నీటి స్థాయి ఉంటేనే రాయలసీమ ప్రాంతానికి నీరు ఇవ్వడం సాధ్యపడుతుందన్నారు. వాస్తవం ఇలా ఉంటే రామకృష్ణ వంటి సీపీఐ నేతలు విభజన జరగాలంటున్నారని అన్నారు. రైతు సమస్యల్ని గుర్తించయినా సమైక్యవాదాన్ని వినిపించాలని సూచించారు. కాగా, హంద్రీ-నీవా కాలువ ద్వారా పూర్తి స్థాయిలో నీటిని పంపింగ్ చేసి కృష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి రిజర్వాయర్ వరకు చెరువుల్ని నింపాలని సీపీఐ అనుబంధ రైతు సంఘం ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా కోరింది. అనంతపురం జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని, పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి పది వేలు, పంట వేయని రైతులకు ఎకరానికి ఐదు వేల చొప్పున నష్టపరిహారం అందించాలని కోరింది. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ అధికారులతో చర్చించి ఆయకట్టుకు నీటి విడుదలపై ఆదేశిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిని కలసిన వారిలో రైతు సంఘం నేతలు కె.రామకృష్ణ, ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖర్, రావుల వెంకయ్య, పశ్య పద్మ, జగదీష్ తదితరులు ఉన్నారు. -
రాష్ట్ర విభజన ప్రకటనను నిరసిస్తూ
సాక్షి, తిరుపతి: తెలంగాణ విడిపోతే రాయలసీమకు తాగునీరు లభించే అవకాశాలు ఉండవని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన ప్రకటనను నిరసిస్తూ తిరుపతిలో శనివారం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ధర్నా చేశారు. ఆయన మాట్లాడు తూ తెలంగాణ ఏర్పడితే కష్ణానదిపై వారు ఆనకట్ట కట్టుకుని, దిగువ ప్రాంతానికి నీళ్లు వదలరని, జిల్లా ప్రజలు దాహంతో అలమటించి పోవాల్సి ఉంటుందని చె ప్పారు. కష్ణా జలాలు కండలేరుకు వచ్చి, అక్కడ నుంచి తిరుపతికి తెలుగు గంగ కాలువ ద్వారా రావాల్సి ఉందని తెలిపారు. చిత్తూరు జిల్లా దొంగలు కిరణ్కుమార్రెడ్డి, చంద్రబాబునాయుడు కలిసి సొంత జిల్లాకు ఇంత అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. నదీ జలాల ద్వారా కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి కలలు ఫలించవని గుర్తు చేశారు. కష్ణ, తుంగభద్ర డ్యామ్లను మ్యూజియంల్లా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆం దోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని నిలువునా చీ ల్చుతారనే విషయాన్ని ముందుగానే గ్రహిం చిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు పదవులను కూడా లెక్కచేయకుండా రాజీనామాలు సమర్పించారని తెలిపారు. అయితే చిత్తూరు జిల్లా ద్రోహులైన కిరణ్, చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి గుమ్మడికాయల్లా తలలు ఊపి వచ్చేశారని ఎ ద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజల గుండెలను చీల్చడానికి కూడా కుమ్మక్కు రాజకీయాలు నడిపారని భూమన విమర్శించారు. పార్టీ నాయకుడు ఎస్కె.బాబు మాట్లాడుతూవిభజనను ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించబోమని అన్నారు. మైనారిటీల విభాగం కన్వీనర్ షఫీ అహ్మద్ ఖాద్రీ మాట్లాడుతూ తెలంగాణపై నిర్ణయం తీసుకున్నాక, ముఖ్యమంత్రి తొమ్మిది రోజులు దొం గలా దాక్కున్నారని విమర్శించారు. న్యాయవాదుల విభాగం నాయకుడు చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రానికి అహర్నిశలు కషి చేస్తామన్నారు. పార్టీ నాయకుడు దుద్దేల బాబు మాట్లాడుతూ తిరుపతి మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ సమైక్య రాష్ట్ర ఉద్యమాన్ని తుం గలో తొక్కి, సొంత వ్యాపారాలు చూసుకుంటున్నారని ఆరోపించారు. ఎంవీఎస్.మణి వందన సమర్పణ చేయగా, వైఎస్సార్ సీపీ నగర కన్వీనర్ పాలగిరి ప్రతాప్రెడ్డి, మహిళా కన్వీనర్ కుసుమ, ఎస్సీ సెల్ కన్వీనర్ రాజేంద్ర, రైతు నాయకుడు ఆదికేశవరెడ్డి, కేతం రామారావు, ముద్రనారాయణ, పార్టీ 25, 26, 28 వార్డుల నాయకులు పాల్గొన్నారు.