Union Bank
-
ఆర్బీఐని సంప్రదించండి: అనిల్ అంబానీకి కోర్టు ఆదేశం
బ్యాంకులు ఖాతాలను 'ఎగవేత' లేదా 'మోసం'గా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసే "కట్, కాపీ, పేస్ట్ పద్ధతి"పై శుక్రవారం బాంబే హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తన రుణ ఖాతాను 'మోసం'గా ప్రకటిస్తూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆర్బీఐని సంప్రదించాలని పారిశ్రామికవేత్త 'అనిల్ అంబానీ' (Anil Ambani)ని కోరింది.యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024 అక్టోబర్ 10న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ.. అనిల్ అంబానీ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తులు రేవతి మోహితే డెరె, నీలా గోఖలేలతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. ఆదేశాలు జారీ చేయడానికి ముందు తనకు ఎటువంటి విచారణకు అనుమతి ఇవ్వలేదని, బ్యాంక్ జారీ చేసిన రెండు షో-కాజ్ నోటీసులను సవాలు చేస్తూ ఆయన పిటిషన్ వేశారు. ఈ ఆదేశాలను జారీ చేసేందుకు ఏ పత్రాలపై ఆధారపడ్డారో, వాటి నకళ్లు అడిగినా ఇవ్వలేదని తన పిటిషన్లో అనిల్ పేర్కొన్నారు.విచారణ సందర్భంగా.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించకుండా, బ్యాంకులు ఖాతాలను 'మోసం' లేదా 'ఉద్దేశపూర్వక ఎగవేత'గా ప్రకటించే కేసులు పదే పదే వస్తున్నాయని కోర్టు తెలిపింది. ఇలాంటి కట్, కాపీ, పేస్ట్ ఆర్డర్లు ఉండకూడదు. ఇది ప్రజాధనం. మనం అలాంటి ఆర్డర్లను అంత యాదృచ్ఛికంగా ఆమోదించకూడదు. దీనికోసం కొత్త వ్యవస్థను తీసుకురావాలని ధర్మాసనం పేర్కొంది.ఇదీ చదవండి: 12 మంది.. రూ. 60వేల పెట్టుబడి: పార్లే-జీ ప్రస్థానం గురించి తెలుసా?ఆర్బీఐ 'మాస్టర్ సర్క్యులర్'లలో ప్రచురించిన మార్గదర్శకాలు అమలులో ఉన్నాయనే వాస్తవాన్ని బ్యాంకులు తప్పకుండా గుర్తుంచుకోవాలని హైకోర్టు పేర్కొంది. బ్యాంకు అధికారులపై 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' చర్య తీసుకోకపోతే ఇటువంటి ఆదేశాలు జారీ చేస్తూనే ఉంటాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని.. ఆర్బీఐ కొత్త యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం మంచిది అని కోర్టు తెలిపింది. -
దివాళా అంచున విత్తనాభివృద్ధి సంస్థ
సాక్షి, హైదరాబాద్: దేశానికి అవసరమైన విత్తనాల్లో 70 శాతం తామే అందిస్తున్నామని, విత్తన భాండాగారంగా వెలుగొందుతున్నామని చెప్పుకుంటున్న రాష్ట్రంలో ప్రభుత్వ విత్తనాభివృద్ధి సంస్థ దివాళా అంచున నిలబడింది. ప్రైవేటు విత్తన సంస్థలు ఏటా రూ.కోట్లు ఆర్జిస్తుంటే, విత్తనాభివృద్ధి సంస్థ మాత్రం ఏటికేడు నష్టాల్లో కూరుకుపోతోంది. సంస్థ 2016లో యూనియన్ బ్యాంకు నుంచి ఓవర్ డ్రాఫ్ట్ (ఓడీ) కింద రూ.100 కో ట్లు తీసుకుంది. ఆ మొత్తాన్ని సకాలంలో తిరిగి చెల్లించకపోవడం, ఏటా మరింత మొత్తం తీసుకోవటంతో ప్రస్తుతం అది రూ.400 కోట్లకు చేరింది.దీనికి ప్రతినెలా రూ.3 కోట్ల చొప్పున వడ్డీని సంస్థ చెల్లిస్తోంది. అప్పుల భారం పెరగడంతో ఉద్యోగుల జీతాలకు కూడా ఇబ్బందిపడే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం సంస్థ బ్యాంకు ఖాతాలో రూ.3.66 కోట్ల మేర నిల్వ లు ఉండగా, ఫిబ్రవరి ఒకటో తేదీ తరువాత అందులో నుంచి రూ.3 కోట్లు వడ్డీ కింద బ్యాంకు జమ చేసుకుంటుంది. మిగిలే రూ.66 లక్షలను ఉద్యోగులకు వేతనాల కింద సర్దుబాటు చే యాల్సి ఉంటుంది. పోనీ మళ్లీ ఓడీ తీసుకుందామంటే.. సంస్థకు ఇప్పుడున్న క్రెడిట్ అవకాశం రూ.2 వేల వరకు మాత్రమే. స్వయంకృతం విత్తనాల కోసం అభివృద్ధి చేసిన వరి, ఇతర పప్పు ధాన్యాలను సకాలంలో రైతులకు విక్రయించకపోవడం సంస్థకు ఏటా రివాజుగా మారింది. దాంతో సీజన్ దాటగానే సీడ్ (విత్తనాలు)ను నాన్ సీడ్గా మార్చి తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. 2023లో 50 వేల క్వింటాళ్ల వరి విత్తనాలను నాన్సీడ్గా మార్చి విక్రయించటంతో రూ.94 కోట్ల నష్టం వచ్చింది. 2015–16 నుంచి విత్తన సంస్థలకు చెల్లించాల్సిన బకాయిల్లో ఇంకా రూ.80 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. కొన్నేళ్లుగా ప్రభుత్వం విత్తనాలకు సబ్సిడీని విడుదల చేయడం లేదు. ఈ సబ్సిడీ మొత్తం రూ.450 కోట్లవరకు రావాల్సి ఉందని ఓ అధికారి తెలిపారు. 9 ప్రాసెస్ యూనిట్లు, ఆగ్రోస్ విక్రయ కేంద్రాలు, సొసైటీల ద్వారా విత్తనాలను విక్రయించే సంస్థ సరైన ప్రణాళిక లేక దివాళా దశకు చేరిందని వ్యవసాయ రంగ నిపుణులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బోర్డు ఆమోదం లేకుండానే టెండర్లు వచ్చే 2025–26లో వానాకాలం, యాసంగి సీజన్లలో రైతులకు అందించేందుకు 2.73 లక్షల క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాల కోసం సంస్థ టెండర్లు పిలిచింది. అందుకు కార్పొరేషన్ బోర్డు ఆమోదం తీసుకోనేలేదు. 1.78 లక్షల క్వింటాళ్ల 8 రకాల వరి విత్తనాలు, 50 వేల క్వింటాళ్ల సోయాబీన్.. పెసర, కంది, శనగ, వేరుశనగ, జొన్న మొదలైన 2,73,500 క్వింటాళ్ల విత్తనాల కోసం సంస్థ తరఫున ఇన్చార్జి ప్రొడక్షన్ మేనేజర్ నోటిఫికేషన్ ఇచ్చారు. జనవరి 27వ తేదీ టెండర్ల దాఖలుకు చివరి తేదీ కాగా, ఒక్క విత్తన సంస్థ కూడా టెండర్ వేయకపోవటంతో గడువు తేదీని ఫిబ్రవరి 11 వరకు పొడిగించారు. గత సర్కారు నిర్ణయాల వల్లే ఈ పరిస్థితిబీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయాలే విత్తనాభివృద్ధి సంస్థ నష్టాలకు కారణం. సంస్థకు రావాల్సిన సబ్సిడీని విడుదల చేయలేదు. సీడ్ను నాన్ సీడ్గా మార్చి విక్రయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రాసెస్ చేసిన విత్తనాలను పూర్తిస్థాయిలో విక్రయించే ఏర్పాట్లు చేశాం. 2024లో ఆ ఫలితాలు కనిపించాయి. కొత్త టెండర్లకు బోర్డు ఆమోదం అవసరం లేదు. ఇది రెగ్యులర్గా జరిగే ప్రక్రియ. – అన్వేశ్రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ -
ప్రభుత్వ బ్యాంక్ ప్రత్యేక క్రెడిట్కార్డు.. భారీ రాయితీలు
మహిళల అభివృద్ధి కోసం వివిధ ప్రభుత్వరంగ సంస్థలు ప్రత్యేకమైన సేవలు అందిస్తున్నాయి. అందులో భాగంగా తాజాగా ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన యూనియన్ బ్యాంక్ మహిళల కోసం ప్రత్యేకమైన బెనిఫిట్స్తో ఓ క్రెడిట్ కార్డును ప్రారంభించింది. అందుకు సంబంధించిన వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పిల్లల నుంచి మహిళలు, సీనియర్ సిటిజన్స్ వరకు అన్ని వర్గాల్లోని వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు కొన్ని సర్వీసులను తీసుకొస్తాయి. అలా మహిళా వినియోగదారుల కోసం యూనియన్ బ్యాంక్ ఇటీవల ‘దివా’ పేరుతో ఓ ప్రత్యేక క్రెడిట్ కార్డును ప్రారంభించింది. ఈ కార్డు ద్వారా ఎలాంటి ప్రయోజనాలు కలుగనున్నాయో బ్యాంక్ వర్గాలు తెలిపాయి. దివా క్రెడిట్ కార్డ్ 18 నుంచి 70 ఏళ్ల వయసులోని మహిళలకు కేటాయిస్తారు. వారి కనీస సంవత్సర ఆదాయం రూ.2.5 లక్షలుగా ఉండాలి. ఆదాయ రుజువు లేనిపక్షంలో ఫిక్స్డ్ డిపాజిట్ భద్రతపై కూడా ఈ దివా కార్డును జారీ చేస్తారు. దీని నుంచి యాడ్ఆన్ కార్డులను కూడా మహిళలకే అందిస్తారు. దరఖాస్తు సమయంలో శాలరీ స్లిప్, ఫామ్ 16, ఐటీ రిటర్నులతో పాటు పాన్, ఆధార్ వంటి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ కార్డు ద్వారా ఏడాదికి 8 కాంప్లిమెంటరీ డొమెస్టిక్, 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్లను పొందవచ్చు. వార్షిక రక్త పరీక్షలతో కూడిన హెల్త్ ప్యాకేజీని పొందే వీలుంది. ఈ కార్డును రూపే నెట్వర్క్లో జారీ చేయడంతో వివిధ వ్యాపార ఆఫర్లు, క్యాష్బ్యాక్లు, యూపీఐ బెనిఫిట్స్ వర్తిస్తాయి. రూ.100 గరిష్ఠ మొత్తంతో 1 శాతం ఇంధన సర్ఛార్జ్ రీయింబర్స్మెంట్ లభిస్తుంది. 24/7 ట్రావెల్, హోటల్ రిజర్వేషన్లు, కన్సల్టెన్సీ సేవలపై రాయితీలు పొందవచ్చు. లాక్మీ సెలూన్, నైకా, ఇక్సిగో, మింత్రా, ఫ్లిప్కార్డ్, బిగ్ బాస్కెట్, బుక్ మై షో, అర్బన్ క్లాప్ వంటి సైట్లలో స్పెషల్ డిస్కౌంట్ కూడా లభించనున్నట్లు బ్యాంక్ వర్గాలు తెలిపాయి. వీటితో పాటు ప్రతి రూ.100 ఖర్చుకు రూ.2కు సమానమైన రివార్డ్ పాయింట్స్ వస్తాయి. కార్డు వార్షిక రుసుము రూ.499 కాగా.. ఓ ఏడాదిలో 30 వేలు ఖర్చు చేస్తే అది కూడా మినహాయిస్తారు. ఇదీ చదవండి: మొబైల్ యూజర్లకు చేదువార్త.. త్వరలో రీఛార్జ్ ప్లాన్ల పెంపు..? ఎంతంటే.. -
తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్కు చెందిన డబ్బు మాయం
హైదరాబాద్: సొంత ఇంటికి యజమానులే కన్నం వేశారు. బ్యాంకు అధికారులతో కలసి ‘తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్’ ఎఫ్డీ అకౌంట్స్లో ఉన్న కోట్లాది రూపాయలు గుట్టుచప్పుడు కాకుండా కొట్టేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కొందరు సభ్యులు ఆ ఇంటి దొంగల్ని ప్రశ్నించగా వారిపై ఎదురుదాడికి దిగారు. దీంతో పక్కా ఆధారాలతో యూనియన్లోని సభ్యులు రాందాస్ ధన్రాజ్, వెంకటేశ్వరరావులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు యూనియన్ అధ్యక్షుడు సత్యనారాయణ దొర, ప్రధాన కార్యదర్శి కాట్రగడ్డ సుధాకర్, ట్రెజరర్ రాజేష్లపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు 420 రెడ్ విత్ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జూబ్లీహిల్స్లోని ‘తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్’ ఎన్నో సంవత్సరాలుగా ఉంది. దీనిలో అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, ట్రెజరర్, ఉపాధ్యక్షులతో కలపి దాదాపు 700 మంది సభ్యులు ఉన్నారు. వీరికి జూబ్లీహిల్స్లో ‘యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’లో ఖాతా ఉంది. దీనిలో ఎఫ్డీ, ఇతర లావాదేవీలు కలిపి మొత్తం రూ. 7 కోట్లు ఉన్నాయి. యూనియన్ బైలా ప్రకారం యూనియన్లో ఉన్న వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ప్రతిపాదన ఎంతో కాలం నుంచి ఉంది. అయితే ఈ ఏడాది మే నెలలో ప్రెసిడెంట్ సత్యనారాయణ దొర, ప్రధాన కార్యదర్శి కాట్రగడ్డ సుధాకర్, ట్రెజరర్ రాజేష్లు ఇళ్ల స్థలాల కోసం ల్యాండ్ చూశామంటూ రాంపూర్ వద్దకు సభ్యులు రాందాస్ ధన్రాజ్, వెంకటేశ్వరరావు తదితరులను తీసుకెళ్లారు. శ్రీనివాస్ అనే వ్యక్తిని పరిచయం చేసి ఓనర్ నుంచి ఇతను అగ్రిమెంట్ చేసుకున్నట్లు చెప్పారు. అడ్వాన్స్ కూడా నాలుగు రోజుల ముందే ఇచ్చినట్లు చెప్పడంతో రాందాస్ ధనరాజ్, వెంకటేశ్వరరావులు అలా ఏకపక్షంగా ఎలా ఇస్తారని ప్రెసిడెంట్, జీఎస్, ట్రెజరర్లను నిలదీశారు. దీంతో వీరు పొంతన లేని సమాధానాలు చెప్పండతో మరిన్ని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలోనే యూనియన్లో ఉన్న 60 మంది అనుకూలమైన వ్యక్తులకు ప్రెసిడెంట్, ట్రెజరర్, జీఎస్లు కొత్త అకౌంట్లు ఓపెన్ చేయించారు. ఆ అకౌంట్లలో యూనియన్కు చెందిన ఎఫ్డీలోని రూ.7 కోట్లలో ఒక్కోక్కరికీ రూ.9 లక్షల చొప్పున బదిలీ చేశారు. ఈ 60 మందికి వచ్చిన దాదాపు రూ.5 కోట్ల 40 లక్షలు క్యాష్ రూపంలో డ్రా చేయించి ముగ్గురూ తీసుకున్నారు. మరికొంత కూడా వివిధ కారణాలు చెప్పి డ్రా చేశారు. ఇలా పలు దఫాలుగా రూ. 6 కోట్ల 50 లక్షలు యూనియన్ అనుమతి లేకుండా అనధికారికంగా బ్యాంకు అధికారుల ప్రమేయంతో కాజేశారు. దీనిపై పక్కా ఆధారాలతో రాందాస్ ధనరాజ్, వెంకటేశ్వరరావు, మరికొందరు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ చింతపల్లి మల్లికార్జున చౌదరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
యూనియన్ బ్యాంక్ రికార్డు డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ రికార్డు స్థాయి లో రూ. 1,712 కోట్ల డివిడెండ్ను ప్రభుత్వానికి అందజేసింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ మేరకు ఒక డివిడెండ్ చెక్కును కేంద్రానికి సమరి్పంచినట్లు బ్యాంక్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ స్థాయిలో డివిడెండ్ను యూనియన్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరాల్లో ఎన్నడూ సమరి్పంచలేదని కూడా ప్రకటన వివరించింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఎ మణిమేఖలై డివిడెండ్ చెక్కును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు అందజేశారు. జాయింట్ సెక్రటరీ (బ్యాంకింగ్) సమీర్ శుక్లా తదితర అధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. -
రూ. 3,000 కోట్ల మొండి పద్దుల విక్రయానికి యూనియన్ బ్యాంక్
న్యూఢిల్లీ: బ్యాడ్ బ్యాంక్ ఎన్ఏఆర్సీఎల్కు విక్రయించేందుకు రూ. 3,000 కోట్ల విలువ చేసే 8 మొండి పద్దులను (ఎన్పీఏ) గుర్తించినట్లు యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 900 కోట్ల విలువ చేసే మూడు ఖాతాలను విక్రయించినట్లు తెలిపింది. తాజాగా దాదాపు రూ. 10,000 కోట్ల బాకీలు ఉన్న మొత్తం 42 సమస్యాత్మక ఖాతాలను గుర్తించినట్లు బ్యాంకు సీఈవో ఎ మణిమేఖలై తెలిపారు. వీటిలో కనీసం ఎనిమిది ఖాతాలను ఈ ఆర్థిక సంవత్సరం విక్రయించగలమని ఆశిస్తున్నట్లు వివరించారు. -
ఒంగోలు: బ్యాంకులో కాల్పుల కలకలం.. సెక్యూరిటీ గార్డ్ ఆత్మహత్య
సాక్షి ప్రకాశం: ఒంగోలులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కోర్టు సెంటర్లోని యూనియన్ బ్యాంక్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్ ఎం. వెంకటేశ్వర్లు(35) తుపాకీతో తనను తానే కాల్చుకుని మృతిచెందాడు. దీంతో, ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. యూనియన్ బ్యాంక్లో వెంకటేశ్వర్లు సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. అయితే, సోమవారం విధుల్లో ఉండగా.. బ్యాంక్లోని రూమ్లోకి వెళ్లి గన్తో తనను తానే కాల్చుకున్నాడు. ఈ క్రమంలో పెద్ద శబ్ధం రావడంతో బ్యాంకు సిబ్బంది వెంటనే వెళ్లి చూడగా వెంకటేశ్వర్లు రక్తపు మడుగులో పడిఉన్నాడు. దీంతో, బ్యాంకు సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఇక, చీమకుర్తికి చెందిన వెంకటేశ్వర్లు కొంతకాలంగా యూనియన్ బ్యాంకులో సెక్యూరిటీగా గార్డుగా పనిచేస్తున్నాడు. వెంకటేశ్వర్లు కుటుంబం ఒంగోలు రామ్నగర్లోని 8వ లైన్లో నివాసం ఉంటోంది. ఏడేళ్ల క్రితం ఉమామహేశ్వరితో వెంకటేశ్వర్లకు వివాహం జరిగింది. వీరికి సంతానం లేనట్టు తెలుస్తోంది. కాగా, వెంకటేశ్వర్ల ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇది కూడా చదవండి: విషాదం: ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు చిన్నారులు మృతి.. కారణం ఇదే.. -
యూనియన్ బ్యాంక్కు కొత్త అధికారి
న్యూఢిల్లీ: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పార్ట్ టైమ్ నాన్ అఫీషియల్ డైరెక్టర్, నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా శ్రీనివాసన్ వరదరాజన్ నియమితులయ్యారు. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. వరదరాజన్కు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసుల్లో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. యాక్సిస్ బ్యాంక్ డిప్యూటీ ఎండీగా సేవలు అందించారు. -
బ్యాంక్ ఖాతాదారులకు షాక్..!
సాక్షి, వీరఘట్టం (మన్యం పార్వతీపురం): మండల కేంద్రంలో ఉన్న యూనియన్ బ్యాంకులో ఖాతాలు కలిగిన స్థానికులైన భోగి ప్రదీప్ ఖాతా నుంచి రూ.7,500, భోగి ప్రదీప్కుమార్ ఖాతా నుంచి రూ.6,400, కస్పా ఉమాశంకర్ప్రసాద్ ఖాతానుంచి రూ.9,999లు గత నెల ఆగస్టు 13వ తేదీన విత్ డ్రా అయ్యాయి. డబ్బులు విత్ డ్రా అయినట్లు అదే రోజు మధ్యాహ్నం 3.21 గంటలకు వారి ఫోన్లకు మెసేజ్లు వచ్చాయి. దీంతో విస్తుపోయిన వారు తమకు తెలియకుండా డబ్బులు ఎలా విత్ డ్రా అయ్యాయి? ఎవరు విత్ డ్రా చేశారోనని తలలు పట్టుకున్నారు. ఆగస్టు 13 రెండవ శనివారం కావడంతో సాయంత్రం 4 గంటలకే బ్యాంకు మూసేశారు. మరుసటి రోజు ఆగస్టు 14న ఆదివారం, సోమవారం ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో బ్యాంకుకు వరుస సెలవులు ఇచ్చారు. దీంతో వారు ఆగస్టు 16న బ్యాంకుకు వెళ్లి మేనేజర్ జయరామ్ దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లారు. ఆయన వారి బ్యాంకు ఖాతాలు పరిశీలించి ఆధార్కార్డు నంబర్ ఆధారంగా 2230250000–222515304293 నంబర్ గల కస్టమర్ సర్వీస్ సెంటర్ ద్వారా డబ్బులు విత్ డ్రా అయినట్లు గుర్తించారు. అయితే కస్టమర్ సర్వీసు సెంటర్ ఏ ప్రాంతానికి చెందినదో గుర్తించలేమని తెలిపారు. వెంటనే ఈ విషయాన్ని ముంబైలోని యూనియన్ బ్యాంకు ప్రధాన కార్యాలయానికి మెయిల్ చేసినట్లు బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు. బాధితుడు ప్రదీప్ కుమార్ మూడు వారాలు గడుస్తోంది యూనియన్ బ్యాంకు ఖాతాల నుంచి తమ డబ్బులను సైబర్ నేరగాళ్లు కాజేసినా ఇంత వరకు బ్యాంకు సిబ్బంది పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. బాధితుల్లో ఒకరైన భోగి శ్రీధర్ శుక్రవారం యూనియన్ బ్యాంకుకు వెళ్లి ఇంత వరకు ఏ చర్యలు చేపట్టారో చెప్పండని బ్యాంకు సిబ్బందిని ప్రశించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బ్యాంకు మేనేజరు సెలవులో ఉన్నారని, రెండు రోజుల తర్వాత రావాలని బ్యాంకు సిబ్బంది తెలిపారు. ఇదిలా ఉండగా యూనియన్ బ్యాంకు ఖాతా నుంచి వీరి ముగ్గురి డబ్బులే విత్ డ్రా అయ్యాయా? లేక ఇంకవరివైనా విత్ డ్రా అయ్యాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే ఈ సైబర్ క్రైమ్ను ఛేదించి ఖాతాదారులకు భరోసా కల్పించాలని బ్యాంక్ సిబ్బందిని పలువురు కోరుతున్నారు. -
యూనియన్ బ్యాంక్ ఆశలు.. రూ.15,000 కోట్లు!
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొండి బకాయిల (ఎన్పీఏలు) వసూలుపై బలమైన అంచనాలతో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)లో రూ.15,000 కోట్లు వసూలు అవుతాయని భావిస్తోంది. ఇందులో రూ.10,000 కోట్ల వరకు ఎన్సీఎల్టీ పరిధిలో దివాలా పరిష్కారం కోసం చూస్తున్న రుణ ఖాతాల నుంచి వస్తాయని అంచనా వేస్తున్నట్టు విశ్లేషకులతో నిర్వహించిన సమావేశంలో బ్యాంక్ ఎండీ, సీఈవో ఎ.మణిమేఖలై స్పష్టత ఇచ్చారు. కొత్తగా ఏర్పాటు చేసిన నేషనల్ అస్సెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్ఏఆర్సీఎల్)కి కొన్ని రుణ ఖాతాలను బదిలీ చేయనున్నట్టు చెప్పారు. రూ.4,842 కోట్ల విలువ చేసే రుణ పరిష్కార దరఖాస్తులను ఎన్సీఎల్టీ ఇప్పటికే ఆమోదించినట్టు.. మరో 55 ఖాతాలకు సంబంధించి రూ.5,168 కోట్ల ఎక్స్పోజర్కు ఆమోదం లభించాల్సి ఉన్నట్టు తెలిపారు. జూన్ త్రైమాసికంలో ఎన్సీఎల్టీ పరిష్కారాల రూపంలో యూనియన్ బ్యాంకుకు రూ.122 కోట్ల మొండి రుణాలు వసూలయ్యాయి. చదవండి: Sahara Group: సహారాలో భారీగా ఇరుక్కున్న ఇన్వెస్టర్లు.. మొత్తం లక్ష కోట్లు పైనే! -
బంజారాహిల్స్: చిమ్మచీకట్లో.. లాకర్ గదిలో.. 18 గంటలు
సాక్షి, బంజారాహిల్స్: అసలే 85 ఏళ్ల వృద్ధాప్యం.. ఆపై మధుమేహం, రక్తపోటు. సమయానికి మందులు వేసుకోకపోతే ఆరోగ్యం పాడయ్యే పరిస్థితి. గాలి సరిగా లేదు.. మంచి నీళ్లు లేవు. చిమ్మ చీకట్లో ఒంటరిగా ఓ వ్యక్తి 18 గంటల పాటు నరకం అనుభవించాడు. ఒంటరిగా స్ట్రాంగ్రూమ్లో చిక్కుకున్నా.. గుండెదిటవు చేసుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రోడ్ నెం.67లోని ప్లాట్ నంబర్1338లో నివసించే వి.కృష్ణారెడ్డి (85)కి జూబ్లీహిల్స్ చౌరస్తాలోని యూనియన్ బ్యాంకు (ఆంధ్రా బ్యాంకు)లో లాకర్ ఖాతా ఉంది. కొంత నగదు తీసుకోవడానికి సోమవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ఆయన బ్యాంకుకు వచ్చారు. లాకర్ తెరిచి డబ్బులు లెక్క పెట్టుకుంటున్నారు. బ్యాంకు వేళలు ముగియడంతో లాకర్ గదిలో ఖాతాదారు ఉన్న విషయాన్ని మరిచిన సిబ్బంది సాయంత్రం 5.30 గంటలకు లాకర్ గదికి, బ్యాంకుకు తాళాలు వేసి వెళ్లిపోయారు. తలుపులు వేసిన శబ్దం కూడా వినిపించకపోవడంతో ఇంకా బ్యాంకు సేవలు కొనసాగుతున్నాయని కృష్ణారెడ్డి భావించారు. కొద్దిసేపటి తర్వాత విషయాన్ని గుర్తించి అరిచినా ఫలితం లేకుండాపోయింది. ఇంటి వద్దే ఫోన్ మరిచిరావడంతో ఫోన్ చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. మిస్సింగ్ కేసుగా నమోదు.. రాత్రి అవుతున్నా తండ్రి ఇంటికి రాకపోయేసరికి కృష్ణారెడ్డి కుమారుడు సందీప్ రెడ్డి అన్ని ప్రాంతాలు గాలించి చివరికి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఇంటి నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టులోని పెట్రోల్బంక్ వరకు కృష్ణారెడ్డి నడుచుకుంటూ వెళ్లిన ఫుటేజీ కనిపించింది. ఆ తర్వాత సీసీ కెమెరాలు పనిచేయలేదు. దీంతో పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా, సీసీ టీవీ ఫుటేజీలను జల్లెడ పట్టినా ఫలితం లేకపోయింది. చివరకు ఎస్ఐ చంద్రశేఖర్ మంగళవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో బ్యాంకు వద్ద సీసీ కెమెరాలను పరిశీలించగా.. కృష్ణారెడ్డి బ్యాంకు లోపలికి వచ్చి, లాకర్గదిలోకి వెళ్లిన దృశ్యాలు కనిపించాయి. బయటికి వచ్చిన ఆనవాళ్లు కనిపించలేదు. అనుమానం వచ్చిన పోలీసులు బ్యాంకు సిబ్బందిని అప్రమత్తం చేసి 10.40 గంటలకు లాకర్ గది తెరిచి చూడగా కృష్ణారెడ్డి వణికిపోతూ, చెమటలతో కుప్పకూలి కనిపించారు. పోలీసులు, బ్యాంకు సిబ్బంది వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో బ్యాంకు సిబ్బందిపై ఐపీసీ సెక్షన్ 336, 342ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం.. ప్రతిరోజూ సాయంత్రం బ్యాంకు వేళలు ముగిసిన తర్వాత లాకర్గదితో పాటు ప్రాంగణం మొత్తం పరిశీలించాకే తాళాలు వేయాల్సి ఉంటుంది. ఇంటికి వెళ్లాలనే తొందరలో సిబ్బంది సోమవారం తనిఖీలు చేపట్టలేదు. ఈ ఘటనలో తమ నిర్లక్ష్యం ఉందని బ్యాంకు మేనేజర్ మురళీ మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. లాకర్ గది తాళాలు మేనేజర్ వేయాల్సి ఉంటుంది. ఆ సమయానికి ఆయన లేకపోవడంతో అసిస్టెంట్ మేనేజర్ రాధ తాళాలు వేశారు. -
Hyderabad: కస్టమర్ను బ్యాంకులోనే ఉంచి తాళం.. ఏం జరిగిందంటే..!
హైదరాబాద్: బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ వృద్ధుడు రాత్రంతా బ్యాంకులో ఉండిపోవడమే కాదు.. అపస్మారక స్థితిలో వెళ్లిపోయాడు. సదరు కస్టమర్ 85 ఏళ్ల వృద్ధుడు కావడంతో చేసేదేమీ లేకుండా పోయింది. ఉదయం వరకూ అందులోనే ఉండిపోయి నానా ఇబ్బంది పడ్డాడు. చివరకు అన్న పానీయాలు లేక అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. ఉదయం సిబ్బంది వచ్చి బ్యాంకు తెరిచే వరకూ కూడా ఆ కస్టమర్ను తాళం వేసి వెళ్లిపోయామన్న సంగతి వారికి గుర్తుకురాలేదు. కానీ ఆ వృద్ధుడు బాగా నీరసించి అక్కడే పడిపోయి ఉండటంతో ఆయన్ను.. పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. లాకర్ కోసమని 85 ఏళ్ల వృద్ధుడు జూబ్లిహిల్స్లోని యూనియన్ బ్యాంక్కు వచ్చాడు. లాకర్ చెక్ చేసుకునే క్రమంలో బ్యాంకు టై మగిసింది. ఆ వృద్ధుడు అక్కడే ఉండిపోయిన విషయాన్ని బ్యాంకు సిబ్బంది గమనించలేదు. తలుపులు వేసుకుని, బయట లాక్ చేసుకుని వెళ్లిపోయారు. ఫలితంగా ఆ వృద్ధుడు బ్యాంకులో ఉండిపోవడం, తెల్లారి వచ్చేసరికి అపస్మారక స్థితిలో వెళ్లిపోవడం జరిగింది. నిన్న(సోమవారం) బ్యాంకు పని మీద ఏ టైమ్కు వచ్చాడో కానీ బాగా నీరసించి పోయాడు. ఈ ఘటనపై సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అసలు లోపం ఎక్కడ జరిగింది అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
ఔను.. నేనే ఇచ్చా!.. నేరం అంగీకరించిన మస్తాన్వలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు చెందిన రూ.3.98 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు(ఎఫ్డీ) కాజేసేందుకు జరిగిన కుట్రలో తానూ పాత్రధారినే అని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ మేనేజర్ మస్తాన్వలీ నేరం అంగీకరించాడు. ‘తెలుగు అకాడమీ’కేసులో జైల్లో ఉన్న అతడిని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) పోలీసులు శుక్రవారం కస్టడీలోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణ నేపథ్యంలోనే తన నేరం అంగీకరించడంతోపాటు వెంకటరమణ పేరు బయటపెట్టాడు. ఎఫ్డీ స్కాముల్లో కీలక సూత్రధారిగా ఉన్న సాయికుమార్కు ప్రధాన అనుచరుడైన వెంకటరమణే గిడ్డంగుల సంస్థకు, కార్వాన్ యూనియన్ బ్యాంక్ శాఖకు మధ్య దళారిగా వ్యవహరించాడు. ఆ సంస్థ నుంచి రూ.3.98 కోట్ల చెక్కులు తీసుకెళ్లి మస్తాన్ వలీకి ఇచ్చాడు. అతడిచ్చిన అసలు బాండ్లను తీసుకెళ్లిన రమణ, వాటి స్థానంలో నకిలీవాటిని గిడ్డంగుల సంస్థకు అప్పగించాడు. తెలుగు అకాడమీసహా ఇతర స్కాముల మాదిరిగా సాయికుమార్ నేతృత్వంలోనే ఈ స్కామ్ జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీన్ని అధికారికంగా నిర్ధారించడానికి వెంకటరమణను కస్టడీలోకి తీసుకుని విచారించాలని నిర్ణయించారు. ఈ కేసులోనూ చెన్నైకి చెందిన పద్మనాభన్ ఈ నకిలీ బాండ్లు సృష్టించినట్లు అనుమానిస్తున్నారు. తెలుగు అకాడమీ కేసులో బెయిల్ మంజూరైనప్పటికీ ష్యూరిటీల తంతు పూర్తికాకపోవడంతో వెంకటరమణ ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఇతడిని తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ శనివారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని దర్యాప్తు అధికారి, ఏసీపీ మనోజ్కుమార్ నిర్ణయించారు. మస్తాన్ వలీని విచారిస్తే ఈ కుట్రలో సాయి సహా ఇతరుల పాత్ర బయటకు వస్తుందని భావిస్తున్నారు. -
మస్తాన్ వలీని కస్టడీకి ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు చెందిన రూ.3.98 కోట్ల ఫిక్సిడ్ డిపాజిట్లు (ఎఫ్డీ) కాజేసేందుకు జరిగిన కుట్ర కేసులో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ మేనేజర్ మస్తాన్ వలీ పాత్రపై హైదరాబాద్ సెంట్రల్ క్రెమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ఆయ న పాత్రను పక్కాగా నిర్ధారించడంతో పాటు సూత్రధారులను గుర్తించేందుకు అతడిని విచారించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే తెలుగు అకాడమీకి చెందిన రూ.64.5 కోట్ల కుంభకోణం కేసులో జైల్లో ఉన్న మస్తాన్ వలీని తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మస్తాన్ వలీ విచారణ తర్వాతే ‘తెలుగు అకాడమీ’ సూత్రధారులు సాయి తదితరులకు ఈ కేసుతో ఉన్న సంబంధాలపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. -
యువతిపై ప్రేమోన్మాది దాడి ఘటన.. స్పందించిన డాక్టర్లు..
సాక్షి, హస్తినాపురం(హైదరాబాద్): ప్రేమోన్మాది బస్వరాజు దాడిలో గాయపడిన యువతి పూర్తిగా కోలుకోవడంతో హస్తినాపురంలోని నవీన ఆసుపత్రి వైద్యులు గురువారం డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రి చైర్మన్ సుభాన్రెడ్డి, ఎండీ రాజవర్ధన్రెడ్డి, రఘుపతిరెడ్డి వైద్యులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆసుపత్రిలో చేరినప్పుడు యువతి పొట్ట భాగంలో 18 కత్తిపోట్లు ఉన్నాయని చెప్పారు. రెండు రోజుల పాటు తీవ్ర రక్తస్రావం కావడంతో యువతి ఆరోగ్య పరిస్థితి విషమించిందన్నారు. అయితే, తమ ఆసుపత్రి వైద్య బృందం రణధీర్రెడ్డి, రవితేజ, మంజునాథ్, శ్రీను నాయక్లు గాయపడ్డ యువతిని ఐసీయూలో ఉంచి మెరుగైన వైద్య చికిత్స అందించారన్నారు. యువతి శరీరంపై 18 కత్తి పోట్లు ఉన్నా కూడా ఎలాంటి శస్త్రచికిత్స చేయకుండానే బాధితురాలు పూర్తి స్థాయిలో కోలుకునే విధంగా వైద్యం అందించామని వారు తెలిపారు. -
టూవీలర్ కొనుగోళ్లపై తక్కువ వడ్డీరేట్లను అందిస్తున్న బ్యాంకులు ఇవే..!
మనలో చాలా మందికి సొంత బైక్ను కొనాలనే ఆశ అందరికీ ఉంటుంది. డబ్బులు ఉన్నవారు వెంటనే ఆయా బైక్ కొనుగోలు చేస్తారు. డబ్బులు పూర్తిగా వెచ్చించి బైక్ను కొనుగోలు చేసే వీలు లేని వారి కోసం పలు బ్యాంకులు నిర్ణీత వడ్డీరేటుతో అప్పును ఇస్తాయి. మీ సిబిల్ స్కోర్ 750కు మించి ఉంటే బ్యాంకులు మీకు అప్పును అందిస్తాయి. సులభ వాయిదాల చొప్పున అప్పును చెల్లిసే మీరు కొనుగోలు చేసిన బైక్ మీ సొంతం అవుతుంది. పలు బ్యాంకులు టూవీలర్ కొనుగోళ్లపై గరిష్టంగా రూ. 10 లక్షల వరకు అప్పును ఖాతాదారులకు అందిస్తున్నాయి. ఫలానా బ్యాంకుల నుంచి అప్పులను తీసుకోవడంలో వడ్డీరేట్లు ఎలా ఉంటాయో అనే సందేహం చాలా మందికి ఎదురై ఉంటుంది. టూవీలర్ కొనుగోళ్లపై అతి తక్కువ వడ్డీరేట్లను అందిస్తోన్న బ్యాంకుల వివరాలను మీ ముందుకు తెచ్చాం. రుణాలను పొందడానికి కావాల్సిన అర్హతలు: రుణగ్రహీతలు 21 నుంచి 58 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. రుణగ్రహీత నెలకు కనీసం 10,000 రూపాయల ఆదాయం కలిగి ఉండాలి. గత 3 నెలల బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్ను రుణగ్రహీతలు తప్పనిసరిగా ఉంచుకోవాలి. టూవీలర్పై తక్కు వ వడ్డీరేట్లను అందిస్తున్న బ్యాంకులు క్రమ సంఖ్య. బ్యాంకులు అందిస్తోన్న వడ్డీరేట్లు లోన్ అమౌంట్ 1. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.25% నుంచి 7.70% రూ. 10 లక్షలు (గరిష్టంగా) 2. బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.35% నుంచి 8.55% రూ. 50 లక్షలు (గరిష్టంగా) 3. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 8.70% నుంచి 10.05% రూ. 10 లక్షలు (గరిష్టంగా) 4. జమ్మూ & కాశ్మీర్ బ్యాంక్ 8.70% నుంచి మొదలు రూ 2.5 లక్షలు (గరిష్టంగా) 5 పంజాబ్ & సింధ్ బ్యాంక్ 9.00% నుంచి మొదలు రూ. 10 లక్షలు (గరిష్టంగా) 6. కెనరా బ్యాంక్ 9.00% నుంచి మొదలు రూ. 10 లక్షలు (గరిష్టంగా) 7. ఐసీఐసీఐ బ్యాంక్ 9.50% నుంచి 26.00% రూ. 3 లక్షలు (గరిష్టంగా) 8. ఐడీబీఐ బ్యాంక్ 9.80% నుంచి 9.90% రూ. 1.20 లక్షలు నుంచి మొదలు 9. యూనియన్ బ్యాంక్ 9.90% నుంచి 10.00% రూ. 10 లక్షలు (గరిష్టంగా) 10. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ 9.99 % అంతకంటే ఎక్కువ రూ. 3 లక్షల కంటే ఎక్కువ గమనిక: పై వడ్డీరేట్లు ఆయా బ్యాంకుల వెబ్సైట్లనుంచి గ్రహించినవి. -
48 గంటల్లోనే రుణాలు
సాక్షి, అమరావతి: డాక్యుమెంట్లన్నీ సక్రమంగా ఉంటే ఏ రుణమైన 48 గంటల్లోనే ఇస్తామని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) కన్వీనర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని యూబీఐ బ్రాంచ్ మేనేజర్లతో విజయవాడలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని యూబీఐ వివిధ రకాల రుణ సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చిందని చెప్పారు. గృహ, వాహన, విద్యా, వ్యక్తిగత, తనఖాపై రుణాలను అందిస్తున్నామని చెప్పారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ఎంఎస్ఎంఈ రుణాలు అందిస్తామన్నారు. బ్యాంక్ రీజినల్ మేనేజర్ వేగే రమేష్, డిప్యూటీ జోనల్ హెడ్ శ్రీనివాసులురెడ్డి, డిప్యూటీ రీజనల్ హెడ్ సుందర్, ఏజీఎం సుబ్రహ్మణ్యం, లోన్ పాయింట్ హెడ్ జేఎస్ఆర్ మూర్తి పాల్గొన్నారు. -
లీగ్ మ్యాచ్లు ఆపండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ఆధ్వర్యంలో ఎటువంటి లీగ్ మ్యాచ్లు నిర్వహించరాదని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. లీగ్ మ్యాచ్లలో ప్రతిభ కనబర్చిన వారికి స్పోర్ట్స్ కోటాలో తమ బ్యాంక్లో ఉద్యోగాలు ఇస్తామని, అయితే లీగ్ మ్యాచ్లలో తమను ఆడనివ్వడం లేదంటూ యూనియన్ బ్యాంక్ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తి విచారించారు. సామాజిక బాధ్యతలో భాగంగా ప్రతిభావంతులను గుర్తించడానికి తాము లీగ్ మ్యాచ్లలో పాల్గొంటామని, ఈ మేరకు గతంలో హైకోర్టు ఆదేశించినా తమను లీగ్ మ్యాచ్లు ఆడనివ్వడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది డాక్టర్ లక్ష్మీనరసింహం వాదనలు వినిపించారు.(చదవండి: ఓపెనర్గానే రోహిత్ శర్మ! ) ఈ విషయంపై స్పందించిన న్యాయమూర్తి... హెచ్సీఏ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఎటువంటి లీగ్ మ్యాచ్లు నిర్వహించరాదని ఆదేశించారు. కౌంటర్ దాఖలు చేయాలని హెచ్సీఏను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. ఇటీవలే యూనియన్ బ్యాంక్లో ఆంధ్రా బ్యాంక్ విలీనం కావడంతో సమస్య ఉత్పన్నమైంది. ఇప్పటికే హెచ్సీఏ లీగ్లో ఆంధ్రా బ్యాంక్ పేరుతో ప్రత్యేక జట్టు ఉంది. అయితే యూనియన్ బ్యాంక్లో ఆంధ్రా బ్యాంక్ విలీనం కావడంతో ఇప్పుడు యూనియన్ బ్యాంక్ కూడా తమను ప్రత్యేక జట్టుగా గుర్తించి మ్యాచ్ల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని హెచ్సీఏను కోరింది. -
బ్యాంకు ఉద్యోగులకు బదిలీ శిక్ష!
త్వరలో రిటైరయ్యే వారిపై నిబంధనలకు విరుద్ధంగా కోవిడ్ సమయంలో బదిలీ వేటు! మహిళలని కూడా చూడకుండా ఉన్నఫళాన పొరుగు రాష్ట్రాలకు ‘పని ష్మెంట్ బదిలీ’..! ఇంతకీ వారు చేసిన నేరం.. దర్యాప్తు సంస్థ చట్టబద్ధంగా కోరిన వివరాలను అందచేయడమే! సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కుమార్తె బ్యాంకు లావాదేవీల వివరాలను దర్యాప్తు సంస్థ ఏసీబీకి అందచేసినందుకు యూనియన్ బ్యాంక్ తమ ఉద్యోగులను ‘పనిష్మెంట్ ట్రాన్స్ఫర్స్’ చేయడం సిబ్బందిలో చర్చనీయాంశంగా మారింది. అమరావతి భూ కుంభకోణంలో జస్టిస్ ఎన్వీ రమణ కుమార్తెలు భువన, తనూజలపై దర్యాప్తు సంస్థ ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం విదితమే. వారి లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ ఆ వివరాలు ఇవ్వాలని కోరుతూ ఖాతాలున్న బ్యాంకులకు లేఖలు రాసింది. జస్టిస్ ఎన్వీ రమణ ఇద్దరి కుమార్తెల్లో ఒకరి ఖాతా ఆంధ్రాబ్యాంకు (ఇప్పుడు యూనియన్ బ్యాంకులో విలీనమైంది)లో ఉంది. ఆమె ఖాతా తాలూకు లావాదేవీలు, కేవైసీ వివరాలు ఇవ్వాలని ఏసీబీ ఆ బ్యాంకును కోరింది. ఏసీబీ విజ్ఞప్తిపై స్పందించిన బ్యాంకు సిబ్బంది లీగల్ విభాగం అభిప్రాయాన్ని తీసుకున్నారు. పోలీసులు అడిగిన వివరాలు ఇవ్వడం చట్టబద్ధమేనని లీగల్ విభాగం తెలిపింది. పోలీసులు అడిగిన ఖాతాలు హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్ శాఖలో ఉన్నాయని గుర్తించారు. దీంతో ఆన్లైన్లో లెడ్జర్ తెరిచి లావాదేవీల వివరాలు పోలీసులకు అందచేశారు. అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుమార్తెల బ్యాంకు లావాదేవీలను ఏసీబీ అధికారులకు ఇచ్చిన తర్వాత బ్యాంకు ఉన్నతాధికారులపై ఉన్నత స్థాయి నుంచి తీవ్ర ఒత్తిళ్లు వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ వివరాలను వెల్లడించడం చట్ట విరుద్ధం కాదని అభిప్రాయాన్ని చెప్పిన బ్యాంక్ లీగల్ విభాగం అధికారుల మీద ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘అమరావతి భూ కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న వారి బ్యాంకు లావాదేవీల వివరాలు ఇవ్వడం చట్ట విరుద్ధం కాదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుమార్తెలకు దేశంలో చట్టం వేరుగా ఉండదు. వివరాలు పోలీసులకు ఇవ్వడం తప్పేమీ కాదు’ అని లీగల్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులకు బదులిచ్చిన్నట్లు తెలిసింది. ఒక్క బ్యాంకుతో ఆగదని.. అనుమానాస్పద లావాదేవీల వివరాలను వెల్లడించడం ప్రారంభమైతే అది ఒక్క బ్యాంకుతో ఆగదని, మిగతా బ్యాంకుల్లోని ఖాతాల వివరాలను కూడా పోలీసులు సేకరిస్తారని నిందితులు అనుమానించారు. తమ ఖాతా లావాదేవీల వివరాలను వెల్లడించిన యూనియన్ బ్యాంకు అధికారుల మీద చర్యలు తీసుకుంటే మిగతా బ్యాంకులు వివరాలు ఇచ్చేందుకు జంకుతాయని భావించారు. ఈ నేపథ్యంలో సమాచారం ఇచ్చిన అధికారులకు ‘పనిష్మెంట్’ ఇవ్వాలని యూనియన్ బ్యాంకు ఉన్నతాధికారుల మీద తీవ్ర ఒత్తిడి తెచ్చారు. దీనికి తలొగ్గిన అధికారులు విజయవాడ రీజనల్ కార్యాలయంలో పని చేస్తున్న ఐదుగురు అధికారుల మీద చర్యలు తీసుకున్నారు. అయితే తామేమీ చట్టవిరుద్ధమైన పని చేయలేదని వారు గట్టిగా తేల్చి చెప్పడంతో ఈ అంశాన్ని ప్రస్తావించకుండా ఆ ఐదుగురిని హఠాత్తుగా బదిలీ చేసినట్లు పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి పేర్కొన్నారు. ఇద్దరు మహిళా అధికారులే.. బదిలీ వేటు విధించిన ఐదుగురిలో ఒకరు లీగల్ విభాగం మహిళా అధికారి కాగా మరొకరు ‘పీ అండ్ డీ’ విభాగానికి చెందిన మహిళా అధికారి. లెడ్జర్ తెరిచి చూసిన మరో ముగ్గురు అధికారుల మీద కూడా బదిలీ వేటు వేశారు. మొత్తం ఐదుగురిలో ముగ్గురిని చెన్నైకి మరో ఇద్దరిని ముంబైకి బదిలీ చేశారు. ముంబైకి బదిలీ అయిన ఓ అధికారి మరో ఏడాదిలో పదవీ విరమణ చేయనున్నారు. రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్న అధికారిని బదిలీ చేయకూడదనే నిబంధనను కూడా బ్యాంకు పాటించకపోవడం గమనార్హం. ఏం తప్పు చేశారని...? ‘కోవిడ్ నేపథ్యంలో 2021 మార్చి వరకు బదిలీలు లేవని నెల క్రితం సర్క్యులర్ ఇచ్చారు. కానీ ఇప్పుడు హఠాత్తుగా బదిలీ ఉత్తర్వులు వెలువరించారు. కోవిడ్ భయం వెంటాడుతున్న సమయంలో 59 ఏళ్ల వయసున్న అధికారిని ముంబైకి బదిలీ చేశారు. ఇలా చేస్తే ఉద్యోగుల ఆత్మవిశ్వాసం దెబ్బతినదా? వాళ్లు ఏం తప్పు చేశారు? చట్టబద్ధంగానే నడుచుకున్నారు’ అని అధికారులు పేర్కొంటున్నారు. బదిలీ షెడ్యూల్ పాటించకుండా.. బ్యాంకు ఉద్యోగులను ఎప్పుడుపడితే అప్పుడు బదిలీలు చేయరు. నిర్దిష్ట షెడ్యూల్లో మాత్రమే బదిలీలు జరుగుతాయి. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుమార్తె ఖాతా లావాదేవీల వివరాలు ఇచ్చినందుకు వారికి పనిష్మెంట్ శిక్ష విధించడం గమనార్హం. ఉద్యోగులకు అన్యాయం జరిగినప్పుడు యూనియన్లు గట్టిగా ప్రశ్నించడం సాధారణం. ఈ వ్యవహారంలో సుప్రీంను బూచిగా చూపిస్తూ యూనియన్ నేతల నోరు మూయించినట్లు బ్యాంకు ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. -
రుణ రేట్లను తగ్గించిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు
ముంబై: ఇటీవలి కాలంలో ఆర్బీఐ రేపో రేటును గణనీయంగా తగ్గించడం ఫలితంగా బ్యాంకులు రుణాలపై రేట్లను తగ్గిస్తున్నాయి. ఇప్పటికే దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐతోపాటు పీఎన్బీ రుణ రేట్లను తగ్గించగా.. తాజాగా బ్యాంకు ఆఫ్ బరోడా(బీవోబీ), యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంకు సైతం రేట్లను తగ్గిస్తూ ప్రకటనలు చేశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు నిధుల వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అంటే 0.05 శాతం. సవరణ తర్వాత ఓవర్నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 7.30 శాతానికి, ఒక నెల ఎంసీఎల్ఆర్ రేటు 7.35 శాతానికి, ఏడాది కాల ఎంసీఎల్ఆర్ (రిటైల్ రుణాలకు ఎక్కువగా అమలయ్యేది) 7.65 శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 7.85 శాతానికి దిగొచ్చినట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంకు ప్రకటించింది. సవరించిన రేట్లు ఈ నెల 8 నుంచి అమల్లోకి వచ్చినట్టుగా పేర్కొంది. బీవోబీ సైతం ఎంసీఎల్ఆర్ను 15 బేసిస్ పాయింట్లు (0.15 శాతం) తగ్గించింది. ఏడాది ఎంసీఎల్ఆర్ 7.80 శాతం నుంచి 7.65 శాతానికి, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 7.65 శాతం నుంచి 7.50 శాతానికి దిగొచ్చాయి. ఈ రేట్లు ఈ నెల 12 నుంచి అమల్లోకి వస్తాయని బీవోబీ ప్రకటించింది. యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా కూడా రుణ రేట్లను 10 బేసిస్ పాయింట్లు (0.10 శాతం) తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఏడాది ఎంసీఎల్ఆర్ 7.60 శాతానికి, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 7.45 శాతం, మూడు నెలల ఎంసీఎల్ఆర్ 7.30 శాతం, ఒక నెల ఎంసీఎల్ఆర్ 7.15 శాతానికి తగ్గాయి. -
ఎస్బీఐ బాటలో బీఓబీ, యూబీఐ
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం బ్యాంకులకు తానిచ్చే రుణ రేటు– రెపోను 0.75 బేసిస్ పాయింట్లు (రెపో ప్రస్తుతం 4.4 శాతం) తగ్గించిన నేపథ్యంలో ఈ ప్రయోజనం మొత్తాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)లు కస్టమర్లకు బదలాయించాయి. రెపో ఆధారిత రుణ రేటు తగ్గింపు మార్చి 28వ తేదీ నుంచీ అమల్లోకి తెస్తున్నట్లు బీఓబీ ఒక ప్రకటనలో తెలిపింది. దీనితో రెపోకు అనుసంధానమయ్యే వ్యక్తిగత రిటైల్, కార్పొరేట్, చిన్నతరహా పరిశ్రమల రుణ రేట్లు 0.75 శాతం మేర తగ్గనున్నాయి. ఇక తమ తగ్గింపు రేట్లు బుధవారం నుంచీ అమల్లోకి వస్తాయని యూబీఐ పేర్కొంది. యూనియన్ బ్యాంక్లో విలీనమవుతున్న ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్లకూ తగ్గించిన వడ్డీరేట్లు అమలవుతాయని తెలిపింది. పీఎన్బీ కొత్త లోగో: పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) కొత్త లోగోను ఆవిష్కరించింది. పీఎన్బీలో ఏప్రిల్ 1 నుంచి యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ విలీనం అవుతున్న సంగతి తెలిసిందే. సుజ్లాన్ రుణ పరిష్కార ప్రణాళికకు ఎస్బీఐ ఓకే టర్బైన్ల తయారీ సంస్థ సుజ్లాన్ ఎనర్జీ రుణ పరిష్కార ప్రణాళికకు ఎస్బీఐ సమ్మతి తెలిపింది. 18 బ్యాంకుల కన్సార్షియంకు ఎస్బీఐ లీడ్ బ్యాంకర్గా వ్యవహరిస్తోంది. సుజ్లాన్లో 10% వాటాను భాగస్వామ్య బ్యాంకులు తీసుకోనున్నాయి. బ్యాంకులకు సుజ్లాన్ రూ.12,785 కోట్లు బాకీ పడింది. -
నేడు ఆంధ్రా బ్యాంక్ చివరి వ్యవస్థాపక దినోత్సవం
సాక్షి, అమరావతి: ఆంధ్రా బ్యాంకుకి నవంబర్ 28 గురువారం జరిగే వ్యవస్థాపక దినోత్సవమే చివరిది కానుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంలో భాగంగా వచ్చే ఏప్రిల్లోగా ఆంధ్రా బ్యాంక్ను.. కార్పొరేషన్ బ్యాంకుతో కలిపి యూనియన్ బ్యాంక్లో విలీనం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య కృష్ణా జిల్లా మచిలీపట్నం కేంద్రంగా ఆంధ్రా బ్యాంకును 1923, నవంబర్ 20న నమోదు చేయించారు. అదే సంవత్సరం నవంబర్ 28న బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభించింది. దీంతో గురువారం జరిగే ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవమే చివరిది కానుందని బ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఈ నేపథ్యంలో బుధవారం మచిలీపట్నంలో పట్టాభి సీతారామయ్య విగ్రహానికి ఆంధ్రా బ్యాంక్ ఎండీ, సీఈవో జె.పకీర్సామితోపాటు, ఈడీలు, ఇతర ఉన్నతాధికారులు ఘనంగా నివాళి అర్పించారు. -
యూనియన్ బ్యాంక్లో విలీనానికి ఆంధ్రా బ్యాంక్ ఓకే
హైదరాబాద్: యూనియన్ బ్యాంక్లో విలీనానికి ఆంధ్రా బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని ఆంధ్రా బ్యాంక్ వెల్లడించింది. యూనియన్ బ్యాంక్లో ఆంధ్రా బ్యాంక్తో పాటు కార్పొరేషన్ బ్యాంక్ కూడా విలీనమవుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ రెండు బ్యాంక్లను విలీనం చేసుకోవడానికి ఇటీవలనే యూనియన్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్ కూడా ఆమోదం తెలిపింది. -
ఆంధ్రాబ్యాంక్ విలీనానికి ఓకే
న్యూఢిల్లీ: ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్లను విలీనం చేసుకోవడానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.17,200 కోట్ల నిధుల సమీకరణ ప్రతిపాదనను కూడా డైరెక్టర్ల బోర్డ్ ఆమోదించిందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. సోమవారం జరిగిన బోర్డ్ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించిందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్ కేటాయింపుల ద్వారా ఈక్విటీ షేర్లు జారీ చేసి రూ.13,000 కోట్లు సమీకరిస్తామని తెలిపింది. అలాగే అదనపు టైర్ వన్/టూ బాండ్ల జారీ ద్వారా రూ.4,200 కోట్లు సమీకరిస్తామని వెల్లడించింది. బ్యాంక్ల విలీనానికి డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలపడం, రూ.17,200 కోట్ల మేర నిధులు సమీకరించనుండటం వంటి సానుకూలాంశాల నేపథ్యంలో బీఎస్ఈలో యూనియన్ బ్యాంక్ షేర్ 2.2% లాభంతో రూ.56.25 వద్ద ముగిసింది. 12కు తగ్గనున్న ప్రభుత్వ బ్యాంక్లు... గత నెల 30న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారీ బ్యాంక్ల విలీన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. పది బ్యాంక్లు విలీనమై నాలుగు బ్యాంక్లుగా అవతరించనున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఓరియంటల్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్లు విలీనమవుతున్నాయి. అలాగే కెనరా బ్యాంక్లో సిండికేట్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్లో అలహాబాద్ బ్యాంక్ విలీనం కానున్నాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ సింధ్ బ్యాంక్లు కొనసాగుతాయి. మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంక్ల సంఖ్య 12కు తగ్గనున్నది. -
9న యూనియన్ బ్యాంక్ బోర్డు సమావేశం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులను విలీనం చేసుకునే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసే క్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు సెప్టెంబర్ 9న సమావేశం కానుంది. రూ. 11,700 కోట్ల మూలధన సమీకరణ అంశంపై కూడా ఇందులో చర్చించనున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు బ్యాంకు తెలియజేసింది. మరోవైపు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో విలీన ప్రతిపాదనను ఆమోదించేందుకు సెప్టెంబర్ 6న బోర్డు సమావేశం కానున్నట్లు యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేస్తూ కేంద్రం ఆగస్టు 30న సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. -
ఆంధ్రాబ్యాంక్ మటుమాయం!
ఆంధ్రా బ్యాంక్ జాతీయ ఉద్యమంలో ఆవిర్భం చిన ఒక ముఖ్య ఘట్టం సహకార ఉద్యమం. 1904లో లార్డ్ కర్జన్ వైస్రాయ్గా ఉన్నప్పుడు మొదటి కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ అమలులోకి వచ్చింది. భారత జాతీయ కాంగ్రెస్ సహకార ఉద్యమానికి, వ్యవస్థకి ప్రోత్సాహం ఇచ్చింది. ఆ ఉద్యమంలో ఒక అంశం ప్రతి గ్రామంలో ఒక బ్యాంక్ని నెలకొల్పడం. బందరులో డాక్టర్ పట్టాభి సీతారామయ్య, కోపల్లె హనుమంతరావు, ముట్నూరి కృష్ణారావు అనేక సంస్థలని, సంస్కరణలను చేపట్టారు. 1915లో పట్టాభి సీతారామయ్య రూ. 50 వేలతో కృష్ణా జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ను స్థాపించారు. ఆ బ్యాంక్ కోపరేటివ్ సెంట్రల్ బ్యాంక్గా ఎదిగింది. పట్టాభిగారు 1919–1921లో ఆంధ్ర ప్రొవిన్షియల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్కి అధ్యక్షులుగా పనిచేశారు. ఆయన పొదుపు ఎలా చేయాలో, ప్రజలకు ధనసహాయం ఎలా చేయాలో నేర్పారు. మహాత్మా గాంధీ ఆంధ్రప్రదేశ్కు వచ్చినప్పుడు పట్టాభిగారిని ఉద్దేశించి ‘ధనం సద్వినియోగం చేయడంలో, పొదుపు చేయడంలో పట్టాభి ఒక మంచి కాంగ్రెస్ కార్యకర్త’ అన్నారు. 1923లో పట్టాభిగారు ఆంధ్రాబ్యాంక్ను స్థాపిం చారు. సామాన్య మానవునికి, రైతుకీ, చిన్న వ్యాపారికీ ధనం అందుబాటులో ఉంచడానికి వీలుగా ఈ వ్యవస్థని పెట్టి రెండు సంవత్సరాలలో 12 శాతం డివిడెండ్ ప్రకటించారు. ఆంధ్రా బ్యాంక్ను స్థాపించడం కూడా జాతీయ ఉద్యమంలో ఒక భాగం అన్నారు. బ్యాంక్ను స్థాపించడానికి లక్ష రూపాయలు సేకరించినప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం సులభం కాలేదు. ఇంపీరియల్ బ్యాంక్ బందరు మేనేజర్ గార్డన్ అడ్డుపెట్టగా, పట్టాభి గారు మద్రాస్ వెళ్లి ప్రాంతీయ మేనేజర్ ల్యాంబ్ను కలిసి పోరాటంలో విజయం సాధించారు. ఆంధ్రా బ్యాంక్ స్వాతంత్య్ర ఉద్యమంలో కట్టుబానిసత్వం నుంచి ఆర్థిక స్వాతంత్య్రానికి అద్దంపట్టిందన్నారు. ఆంధ్రా బ్యాంక్ జాతీయ ఖ్యాతి గడించడం ఒక ముఖ్య విషయం అని ఆయన గర్వపడ్డారు. 1969లో ప్రధాని ఇందిరా గాంధీ బ్యాంకులను జాతీయం చేసి, అందుకు కారణం పేద రైతుకి, శ్రామికుడికీ, కార్మికుడికీ ధనం అందుబాటులో ఉంచడమే అన్నారు. అప్పటి ఆంధ్రా బ్యాంక్ చైర్మన్ కె. గోపాల రావు దీటుగా 50 ఏళ్ల క్రితం మా ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకులు ముందుచూపుతో, ఆ లక్ష్యాలతోనే ఆంధ్రాబ్యాంక్ను స్థాపించార’ని అన్నారు. ఆంధ్రా బ్యాంక్ చరిత్ర జాతీయ ఉద్యమంలో భాగం. ఆంధ్రుల ఆత్మగౌరవానికి సేవాభావానికి చిహ్నం. పవిత్రమైన ఆశయాలతో స్థాపితమై క్రమంగా జాతీయ స్థాయికి ఎదిగిన ఆంధ్రా బ్యాంక్ పేరుని మార్చడం ఆంధ్రులకు అవమానం. వ్యాసకర్త: ప్రొ‘‘ అయ్యగారి ప్రసన్నకుమార్, విశాఖపట్నం -
‘గిన్నిస్’కే అలుపొచ్చేలా..!
ఫొటోలో ఉన్న పెద్దాయన పేరు ఆశ్రిత ఫర్మాన్. ఆయనచేతిలో ఉన్నవేంటో తెలుసా గిన్నిస్ రికార్డులు. అవన్నీ గిన్నిస్ రికార్డులా.. లేదా ఒక్క దాన్నే జిరాక్స్ తీసుకున్నాడా ఏంటి అనుకుంటున్నారా? కాదండీ ఆ రికార్డులన్నీ ఆయనవే. అమ్మో అన్ని గిన్నిస్ రికార్డులా..! జీవితంలో ఒక్క రికార్డుకే నానా తంటాలు పడతారు.. అలాంటిది అన్ని రికార్డులు సాధించాడా.. గ్రేట్ కదా.. అమెరికాకు చెందిన ఈయన పేరు మీద ప్రస్తుతానికి 226 గిన్నిస్ రికార్డులు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ఒక్క గిన్నిస్ రికార్డు అయినా సాధించాలని అనుకునే వాడట. అయితే శారీరకంగా అంతగా దృఢంగా ఉండకపోవడంతో అది సాధ్యం కాదని భావించేవాడట. అయితే 1978లో ఓ స్వామి ఇచ్చిన ధైర్యంతో తొలిసారిగా అమెరికాలోని న్యూయార్క్లో జరిగిన 24 గంటల సైకిల్ రేసులో పాల్గొన్నాడు. కానీ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. కానీ మరుసటి ఏడాదే 27 వేల జంపింగ్ జాక్స్ చేసి తొలి గిన్నిస్ రికార్డును తన పేరు మీద రాసుకున్నాడు. అప్పటినుంచి వెనక్కి చూసుకోలేదు. ఎప్పుడూ వినూత్నమైన ఫీట్లు చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి అలా దాదాపు 600 గిన్నిస్ రికార్డులను సాధించారు. ప్రస్తుతం ఆయన దగ్గర 226 గిన్నిస్ రికార్డులు ఉన్నాయి. అంటే వాటిని ఎవరూ ఇంకా అధిగమించలేదన్న మాట. తాజాగా ఒక్క నిమిషంలో 26 పుచ్చకాయలను తన ఉదరంపై పెట్టుకుని పగులగొట్టుకున్నాడు. ఇది కూడా రికార్డులోకెక్కింది. కంగారూ బంతిపై గెంతుకుంటూ ఎక్కువ దూరం వెళ్లడం.. పెద్ద బంతిపై ఎక్కువ సేపు నిలబడటం.. నీటిలో చిన్న బంతులను ఎగరేసి పట్టుకోవడం.. నీటిలోపల ఎక్సర్సైజ్ చేయడం.. నీటిలోపల సైకిల్ తొక్కడం ఇలా తనకు ఏది అనిపిస్తే దాన్ని కొద్ది రోజుల్లోనే నేర్చుకోవడం గిన్నిస్ రికార్డుల్లో తన పేరు రాసుకోవడం.. తన జీవితం మొత్తం ఇలా రికార్డులు సాధిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చాడు. -
మరో భారీ ప్రభుత్వ బ్యాంకు!!
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులను మరింత పెద్దవిగా, బలమైనవిగా తీర్చిదిద్దాలన్న ఆశయం కొనసాగుతోంది. ఎస్బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం, బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంకు, దేనా బ్యాంకుల విలీనం అనంతరం... మరో భారీ విలీనానికి కసరత్తు మొదలైనట్టు తెలియవచ్చింది. తదుపరి విలీనం పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) నుంచే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. తదుపరి దశ విలీనంలో భాగంగా ఈ మూడు బ్యాంకులకు ప్రభుత్వం నుంచి త్వరలో ఆహ్వానాలు అందనున్నట్టు ఆర్థిక శాఖ అధికారి వెల్లడించారు. ‘‘ఎక్కువ సమయం వేచి చూడాలనుకోవడం లేదు. బ్యాంకులు ఆప్షన్లను పేర్కొనలేకపోతే, ప్రత్యామ్నాయ యంత్రాంగమే తగిన సూచనలు చేస్తుంది’’ అని ఆ అధికారి పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు లేదా మూడో త్రైమాసికంలో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఓ విలీనం ఉంటుందన్న సంకేతాన్ని ఇచ్చారు. అయితే, ఈ విలీనం మూడు పార్టీలతో కలసి ఉండకపోవచ్చన్నారు. ఎన్నో కలయికలను పరిశీలిస్తున్నామని, మొదటి రెండు త్రైమాసికాల్లో ఈ పెద్ద బ్యాంకుల బ్యాలన్స్ షీట్లు మరింత స్థిరపడతాయని భావిస్తున్నట్టు చెప్పారు. విజయా, దేనా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా విలీన ప్రక్రియ గతేడాది అక్టోబర్లో ఆరంభమైన విషయం గమనార్హం. విలీన ప్రక్రియ ముగిసి గత నెల 1 నుంచి ఒకే బ్యాంకుగా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. దేశంలో ఇది మూడో అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది. సరైన సమయం కాదు... అయితే, ప్రభుత్వరంగ బ్యాంకింగ్లో మరో విలీనానికి ఇది సమయం కాదని కొందరు ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే ఆర్బీఐ దిద్దుబాటు కార్యాచరణ పరిధి (పీసీఏ) నుంచి బయటకు వచ్చిందని, పీఎన్బీ, యూబీఐ రికవరీ దశలో ఉన్నాయని పేర్కొంటున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సైతం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్బీఐ పీసీఏ నుంచి బయపడ్డాయి. బ్యాంకింగ్ రంగంలో ప్రతీ సమస్యకు విలీనం పరిష్కారం కాదని, మరింత పెద్దవి, విఫల నిర్మాణాలను సృష్టించడానికంటే ముందు ప్రత్యామ్నాయాలను పరిశీలించాలన్న అభిప్రాయాన్ని ఓ ప్రభుత్వరంగ బ్యాంకు సీనియర్ ఎగ్జిక్యూటివ్ వ్యక్తంచేశారు. -
యూనియన్ బ్యాంక్ ఓపెన్ ఆఫర్కు మినహాయింపు
న్యూఢిల్లీ: యూనియన్ బ్యాంక్ విషయంలో ఓపెన్ ఆఫర్ ఇవ్వకుండా ప్రభుత్వానికి మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ మినహాయింపునిచ్చింది. యూనియన్ బ్యాంక్లో ప్రభుత్వం రూ.4,112 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నది. ఈ పెట్టుబడులకు ప్రతిగా యూనియన్ బ్యాంక్ ప్రిఫరెన్షియల్ షేర్లను ప్రభుత్వానికి జారీ చేస్తుంది. దీంతో యూనియన్ బ్యాంక్లో ప్రస్తుతం 67.43 శాతంగా ఉన్న ప్రభుత్వం వాటా 6.55 శాతం పెరిగి 73.98 శాతానికి చేరుతుంది. ఫలితంగా టేకోవర్ నిబంధనలు వర్తించి ప్రభుత్వం ఓపెన్ ఆఫర్ ప్రకటించాల్సి వస్తుంది. అయితే ప్రభుత్వ పెట్టుబడుల కారణంగా ప్రజల వద్ద ఉండే ఈక్విటీ షేర్ల సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండనందున ప్రభుత్వం ఓపెన్ ఆఫర్ ప్రకటించాల్సిన అవసరం లేదని సెబీ స్పష్టతనిచ్చింది. ఓపెన్ ఆఫర్ విషయంలో మినహాయింపును ఇచ్చింది. -
రుణ రేట్లను తగ్గించిన యూనియన్ బ్యాంక్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని యూనియన్ బ్యాంక్.. మార్జినల్ కాస్ట్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను స్వల్పంగా తగ్గించింది. వివిధ కాలపరిమితి గల రుణాలపై వడ్డీరేటును 0.10 శాతం తగ్గించింది. సవరించిన రేట్లు మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీరేటు 8.70 శాతం నుంచి 8.60 శాతానికి తగ్గింది. ఆరునెలల ఎంసీఎల్ఆర్ను 8.50 శాతానికి కుదించింది. మరోవైపు బేస్రేటును 0.10 శాతం తగ్గించింది. 9.10 శాతం నుంచి 9 శాతానికి బేస్రేటును కుదించినట్లు బ్యాంక్ తెలిపింది. -
275వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, విజయనగరం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 275వ రోజు షెడ్యూల్ ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. సోమవారం ఉదయం జననేత విజయనగరం నియోజకర్గంలోని జొన్నవలస క్రాస్ నైట్ క్యాంప్ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి వై జంక్షన్, మయూరి జంక్షన్, రైల్వే స్టేషన్ మీదుగా వెంకటలక్ష్మీ జంక్షన్ వరకు జననేత పాదయాత్ర సాగుతుంది. అక్కడ వైఎస్ జగన్ భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మూడు లాంతర్ల సెంటర్ మీదుగా కొత్తపేట వరకు వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ మేరకు వైఎస్సార్సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. ముగిసిన పాదయాత్ర: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 274వ రోజు ముగిసింది. ఆదివారం బలరాంపురం, కుమరాన్, కోరుకోండ, చిన్నపురం జంక్షన్, కొరాడపేట, చాకలిపేట మీదుగా జొన్నవలస క్రాస్ వరకు జననేత పాదయాత్ర కొనసాగింది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్న జననేతకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. వైఎస్ జగన్ నేడు 9.8 కిలో మీటర్లు నడిచారు. ఇప్పటివరకు జననేత 3055.8 కిలోమీటర్లు నడిచారు. -
సిటీ యూనియన్ బ్యాంక్ లాభం రూ.152 కోట్లు
న్యూఢిల్లీ: సిటీ యూనియన్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్లో రూ.152 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2016–17) క్యూ4లో సాధించిన నికర లాభం రూ.129 కోట్లతో పోలిస్తే 18 శాతం వృద్ధి సాధించామని బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.926 కోట్ల నుంచి రూ.990 కోట్లకు పెరిగింది. ఒక్కో ఈక్విటీ షేర్కు 30 పైసలు డివిడెండ్ను ఇవ్వనున్నామని బ్యాంక్ తెలిపింది. ప్రతి పది ఈక్విటీ షేర్లకు ఒక ఈక్విటీ షేర్ను బోనస్గా ఇవ్వనున్నట్లు కూడా (1:10) సంస్థ ప్రకటించింది. -
యూనియన్ బ్యాంకుకు రూ.314 కోట్ల కుచ్చుటోపీ!
సాక్షి, హైదరాబాద్: పలు బ్యాంకుల నుంచి కంపెనీ కోసం రుణాలు తీసుకుని ఇతర పనులకు నిధులు మళ్లించిన తొట్టెం ఇన్ఫ్రా కంపెనీపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. శుక్రవారం హైదరాబాద్లోని సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టు 14వ అదనపు చీఫ్ మెట్రోపాలిట్ మేజి స్ట్రేట్ కోర్టులో చార్జిషీటు దాఖలైంది. పలు అంతర్జాతీయ ఇన్ఫ్రా కంపెనీలకు తొట్టెం ఇన్ఫ్రా కంపెనీ సబ్కాంట్రాక్టర్గా పనులు చేస్తోంది. 8 బ్యాంకులతో కూడిన కన్సార్టియం నుంచి రూ.1,394 కోట్లను రుణంగా తీసుకుని చెల్లించలేకపోయింది. రూ.314 కోట్ల రుణాన్ని 2012లో నిరర్ధక ఆస్తిగా ప్రకటించిన యూనియన్ బ్యాంకు.. సీబీఐకి ఫిర్యాదు చేసింది. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ.. నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో తొట్టెం కంపెనీ రుణాలు పొందినట్లు గుర్తించింది. దీంతో ఆ కంపెనీ డైరెక్టర్లు తొట్టెంపూడి సలలిత్, తొట్టెంపూడి కవితలను అరెస్ట్ చేసింది. ఇన్ఫ్రా పనుల కోసం తీసుకున్న రుణాలను ఇతర పనులు, వ్యక్తిగత అవసరాల కోసం వాటిని మళ్లించిందని చార్జిషీటులో సీబీఐ పేర్కొంది. కుట్ర పూరితంగా బ్యాంకుకు కుచ్చుటోపీ పెట్టేందుకు కొంతమంది అధికారులతో కలసి ఆ కంపెనీ యాజమాన్యం యత్నించినట్టు ఆరోపించింది. -
యూనియన్ బ్యాంకు నష్టం 2,583 కోట్లు
న్యూఢిల్లీ: మార్చి త్రైమాసికంలో యూనియన్బ్యాంకు నష్టాలు మరింత పెరిగి రూ. 2,583 కోట్లకు చేరాయి. పెట్టుబడులు ఆవిరైపోవడం, మొండిపద్దులకు కేటాయింపులు ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో నష్టాలు మరింత పెరిగాయని బ్యాంకు తెలిపింది. గతేడాది ఇదే కాలంలో బ్యాంకు రూ. 108 కోట్ల నష్టం నమోదు చేసింది. 2017–18 మార్చి త్రైమాసికంలో తమ పెట్టుబడుల్లో దాదాపు 1,120 కోట్ల రూపాయలు తరిగిపోయాయని బ్యాంకు తెలిపింది. దీంతో పాటు కేటాయింపులు 2,444 కోట్లరూపాయల నుంచి రూ. 5,668కోట్లకు పెరిగిపోయాయి. ఇదే కాలంలో స్లిపేజ్లు 10,043 కోట్లకు చేరాయి. బ్యాంకు ఆదాయం రూ. 9771 నుంచి 9,597 కోట్ల రూపాయలకు పడిపోయింది. స్థూల ఎన్పీఏలు 11.17 శాతం నుంచి 15.73 శాతానికి, నికర ఎన్పీఏలు 6.57 శాతం నుంచి 8.42 శాతానికి ఎగబాకాయి. డిపాజిట్లలో 8 శాతం వృద్ధి నమోదయింది. అంతర్జాతీయ అడ్వాన్సులు 4 శాతం పెరిగాయి. దేశీయ అడ్వాన్సుల్లో 5.9 శాతం పెరుగుదల కనిపించింది. మొత్తం 2017–18 ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు రూ. 5,247 కోట్ల నష్టాన్ని మూటకట్టుకొంది. అయితే ఆదాయం మాత్రం స్వల్పంగా పెరిగి 37,738 కోట్లకు చేరింది. -
బ్యాంకుల విలీనమే.. మందు!!
♦ అసెట్ క్వాలిటీ కష్టాలకు చెక్ ♦ ప్రభుత్వ రంగంలో పటిష్టమైన బ్యాంకుల ఆవిర్భావం ♦ ప్రతికూలతల కన్నా ప్రయోజనాలే అధికం ♦ అనువుగా పీఎన్బీ, కెనరా తదితర బ్యాంకులు సాక్షి, బిజినెస్ విభాగం : ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) విలీన ప్రక్రియలను వేగవంతం చేస్తూ కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు బ్యాంకింగ్ రంగంలో చర్చనీయమవుతున్నాయి. ఓ వైపు సంస్కరణలను వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు సమ్మెలతో తమ నిరసన తెలియజేస్తున్నప్పటికీ... మరోవైపు కేంద్రం మాత్రం విలీనాల దిశగా చర్యలు తీసుకుంటూనే ఉంది. ఇందుకోసం ప్రత్యామ్నాయ యంత్రాంగం (ఏఎం) ఏర్పాటుకు కేంద్రం ఆమోదముద్ర కూడా వేసింది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివరణిస్తూ... విలీనానికి వాణిజ్యపరమైన ప్రయోజనాలే ప్రాతిపదికగా ఉంటాయని, ఆయా బ్యాంకుల బోర్డులే మెర్జర్ల ప్రతిపాదనలను ముందుకు తేవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. బ్యాంకు ఉద్యోగుల సంఘాలు పీఎస్బీల విలీనాలను వ్యతిరేకిస్తున్నప్పటికీ.. చిన్న స్థాయిలోనే మిగిలిపోతున్న పలు పీఎస్బీలకు విలీనాలు ప్రయోజనకరమే అంటున్నారు విశ్లేషకులు. నిధుల సమీకరణ వ్యయాలు తక్కువ స్థాయిలో ఉంచుకుంటూ.. లాభదాయకంగా ఉంటే భారీ, పటిష్ట బ్యాంకుల ఏర్పాటే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోందని వారు చెబుతున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో అసెట్ క్వాలిటీ సమస్యల గురించి అందరికీ తెలిసినవే కాబట్టి... ప్రత్యామ్నాయ యంత్రాంగం (ఏఎం) ఏర్పాటు ప్రకటన సమయం గురించి పెద్దగా సందేహించాల్సిన అవసరం లేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రాతిపదికలు ఇవే కావొచ్చు.. అనలిస్టుల అభిప్రాయం ప్రకారం ప్రాంతీయంగా ఆయా పీఎస్బీలకి ఉన్న పట్టు.. క్యాపిటల్ అడెక్వసీ నిష్పత్తి, ఆదాయాల వృద్ధి తదితర అంశాలే విలీనాలకు ప్రాతిపదిక కావచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ మొదలైనవి విలీనాలకు శ్రీకారం పలికే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ బ్యాంకులకు తమ తమ ప్రాంతాల్లో గట్టి పట్టు ఉండటం.. విలీన ప్రతిపాదనకు ఊతమిస్తోంది. గడిచిన ఆరు నెలలు, ఏడాది కాలంలో ఏదో ఒక సందర్భంలో విలీనాలకు తాము అనుకూలమేనని ప్రకటించడమే కాక రైట్స్ ఇష్యూ తదితర మార్గాల్లో సొంతంగా వనరులు సమకూర్చుకునే సామర్థ్యాన్ని కూడా ఇవి చాటుకున్నాయి. విలీన ప్రక్రియపై కొంత మేర అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ.. బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) కూడా బరిలో ఉండగలదని అంచనా. ప్రస్తుతానికి ఇవన్నీ కూడా మెర్జర్కి అనువైన బ్యాంకులుగానే కనిపిస్తున్నప్పటికీ.. విలీనాలకు సంబంధించి పంజాబ్ నేషనల్ బ్యాంక్కు మరింత మూలధనం అవసరం అవుతుందని ఓ బ్రోకరేజి సంస్థకు చెందిన ఈక్విటీస్ విభాగం హెడ్ చెప్పారు. ఇక ఇండియన్ బ్యాంక్ మెరుగ్గానే ఉన్నప్పటికీ.. విలీనాల బరిలో దూకేంత పెద్ద బ్యాంకు కాదని పేర్కొన్నారు. ప్రధాన కారణాలు ఏంటంటే... విలీనాలకు ప్రధానంగా రెండు కారణాలు చూపుతున్నారు. కరెంటు అకౌంటు, సేవింగ్ అకౌంటు (కాసా) నిష్పత్తి తక్కువగా ఉండటం ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రధానమైన బలం. కాసా డిపాజిట్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు 34% వాటా ఉంటే.. ప్రైవేట్ బ్యాంకులకు 30% ఉంది. ఇక బ్యాంకుల్లో జరిగే డిపాజిట్లలో సుమారు 70% వాటా పీఎస్బీలదే. ఇప్పుడిప్పుడే ప్రైవేట్ బ్యాంకులు పుంజుకుంటున్నప్పటికీ.. పీఎస్బీల్లోకి వచ్చి పడే డిపాజిట్ల పరిమాణం భారీగానే ఉంటోంది. గతేడాది పెద్ద నోట్ల రద్దు సమయంలో ఇది మరోసారి సుస్పష్టంగా కనిపించింది. పొదుపు ఖాతాలపై వడ్డీ రేటు కోతతో.. డిపాజిట్లు తరలిపోకుండా తమ దగ్గరే అట్టే పెట్టుకోవడానికి కూడా పీఎస్బీలకు విలీనాలు తప్పనిసరిగా మారుతోంది. రుణాలకు డిమాండ్ పుంజుకున్న పక్షంలో తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి కూడా ఇది చాలా కీలకం. చాలా బ్యాంకులకు ఎస్బీఐ, పీఎన్బీ వంటి అగ్రశ్రేణి బ్యాంకుల స్థాయి లేకపోవడంతో భారీ కార్పొరేట్ రుణాలు వంటి వాటి విషయంలో అవి చిన్నా, చితకా బ్యాంకులుగానే కొనసాగాల్సి వస్తోంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్నా విలీనాలే ఉత్తమ మార్గంగా పరిశీలకులు చెబుతున్నారు. -
తీరని నోట్ల తిప్పలు
అల్లీపూర్లో క్యూలో వ్యక్తులకు బదులు చెప్పులు మల్యాల: మల్యాల మండల కేంద్రంలో నగదు కష్టాలు కొనసాగుతున్నాయి. యూనియన్ బ్యాంకు ఎదుట తెల్లవారు నుంచే క్యూకడుతున్నారు. బీడీ కార్మికుల వేతనాలుసైతం బ్యాంకు ఖాతాల్లో వేస్తుండడంతో రోజురోజుకు ఖాతాదారుల క్యూ పెరుగుతోంది. దీనికితోడు ఏటీఎం సైతం పనిచేయకపోవడంతో ఇటు పింఛన్దారులు, బీడీ కార్మికులు, రైతులు డబ్బుల కోసం బ్యాంకు వద్ద గంటల తరబడి క్యూ కడుతున్నారు. రాయికల్: రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎదుట శనివారం ఉదయం 9 గంటలకు ఖాతాదారులు చెçప్పులతో నిరసన వ్యక్తం చేశారు. వివిధ గ్రామల నుంచి వచ్చిన ఖాతాదారులు క్యూలైన్ లో నిలబడే ఓపిక క లేవడంతో ఇలా చెప్పులు పెట్టారు. -
ప్రపంచంలో మొదటి కేంద్ర బ్యాంక్?
బియ్యాన్ని అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం? – పశ్చిమ బెంగాల్ దేశంలో పంటలకు మద్దతు ధరలను రూపొందించేది? – వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ను మంజూరు చేసేది? – ఐఎంఎఫ్ (M) భారత్లో మొదటి రైలు ప్రయాణం ప్రారంభమైన ప్రాంతం? – ముంబై నుంచి థానే వరకు ఏ రేటు వద్ద ఎగుమతులకు బదులు దిగుమతులు ప్రత్యామ్నాయమవుతాయో వాటిని ఏమంటారు? – వర్తక నిబంధనలు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్)లో అధిక కోటా గల దేశం? – అమెరికా అభిలషణీయ జనాభా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది? – ఎడ్విన్ కానన్ జనాభా స్థిరీకరణను ఏ సంవత్సరం నాటికి సాధించాలని జనాభా విధానం–2000 లక్ష్యంగా పేర్కొంది? – 2045 భారత్లోని నిరుద్యోగాన్ని ఏమని వర్ణించొచ్చు? – నిర్మాణాత్మక నిరుద్యోగం కర్జన్ బహుళార్థక సాధక నీటి ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? – గుజరాత్ ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? – జెనీవా భారతీయ యాజమాన్యంలో 1881లో ఆగ్రాలో స్థాపించిన బ్యాంక్? – ఔ«ద్ కమర్షియల్ బ్యాంక్ ప్రపంచం మొదటి కేంద్ర బ్యాంక్?– రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్ హరిత విప్లవం ఏ రాష్ట్రాల్లో ప్రధానంగా చోటు చేసుకుంది? – పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఎంత శాతం కుటుంబాలకు మరుగుదొడ్ల సౌకర్యం ఉంది? – 30.7 శాతం 2011 సెన్సెస్కు సంబంధించి సెన్సెస్ కమిషనర్? సి. చంద్రమౌళి మానవాభివృద్ధి సూచీని జిల్లాల వారీగా రూపొందించిన మొదటి రాష్ట్రం? – మధ్యప్రదేశ్ బ్రిటిష్ పాలనలో భారత్లో జాతీయాదాయ వృద్ధి రేటు? – 1.2 శాతం 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎంత శాతం కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం ఉంది? – 55.3 శాతం అల్ప ఉద్యోగిత అంటే? – తన సామర్థ్యం కంటే తక్కువ స్థాయి పని చేస్తుండటం ఖాయిలా పడిన పరిశ్రమల చట్టాన్ని ఏ కమిటీ సూచన మేరకు రూపొందించారు? – తివారి కమిటీ పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్ను ఏర్పాటు చేసిన సంవత్సరం? – 1996 ఆగస్టు చిన్నతరహా పరిశ్రమలకు సంబంధించి రిజర్వేషన్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని సిఫార్సు చేసిన కమిటీ? – అబిద్ హుస్సేన్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించిన తేది? – 2005, సెప్టెంబర్ 5 భారత ఆర్థిక రాజ్యాంగంగా పిలిచే పారిశ్రామిక తీర్మానం? – 1956 పారిశ్రామిక తీర్మానం జిల్లా పారిశ్రామిక కేంద్రాలను ఏ పారిశ్రామిక తీర్మానం ద్వారా ఏర్పాటు చేశారు? – 1977 దేశంలో పరపతిని సృష్టించేవి? – వాణిజ్య బ్యాంకులు ప్రపంచంలో మొదటగా హరిత విప్లవం ఏ దేశంలో వచ్చింది? – మెక్సికో ఆక్ట్రాయ్ పన్నును విధించేది? – స్థానిక సంస్థలు పన్నుల సంస్కరణలపై 2002లో ఏర్పాటైన టాస్క్ఫోర్స్ అధ్యక్షుడు? – విజయ్ కేల్కర్ భూతలింగం కమిటీ దేనికి సంబంధించింది? – పన్నుల ఎగవేత జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ను ఎప్పట్నుంచి ప్రారంభించారు? – 2005, ఏప్రిల్ 12 షెడ్యూల్డ్ బ్యాంక్ అంటే? – 1934 ఆర్బీఐ చట్టంలోని షెడ్యూల్–2లో నమోదైన బ్యాంకులు వ్యవసాయ ఆదాయంపై పన్నును సిఫార్సు చేసిన కమిటీ? – కె.ఎన్. రాజ్ ఉఇఈ దేశాల ప్రధాన కేంద్రం? – పారిస్ జీడీపీ, జీఎన్పీ భావనలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన ఆర్థిక శాస్త్రవేత్త? – సైమన్ కుజ్నిట్స్ గినీ సూచీ ద్వారా దేన్ని అంచనా వేయొచ్చు? – సాపేక్ష పేదరికం ప్రభుత్వ వ్యయ సంస్కరణలకు సంబంధించి ఏర్పాటైన కమిటీ? – గీతాకృష్ణన్ భారత్లో ఒక రూపాయి.. ప్రామాణిక ద్రవ్యంగా ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? – 1835 భారత్లోని నిరుద్యోగ స్వభావం? – దీర్ఘకాలికం మన దేశంలో పేదరికాన్ని అంచనా వేయడంలో విశేష కృషి చేసినవారు? – దండేకర్, రథ్ దేశంలో సిమెంట్ ఉత్పత్తి మొదటగా ఎక్కడ ప్రారంభమైంది? – మద్రాస్తమ్మా కోటిరెడ్డి ప్రొఫెసర్, ఐబీఎస్, హైదరాబాద్ -
యూనియన్ బ్యాంక్ నికర లాభాలు డౌన్
ముంబై:యూనియన్ బ్యాంక్ నిరాశాజనక ఫలితాలను నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్ నికరలాభాలు 68 శాతం క్షీణించాయి. జూన్ 30 తో ముగిసిన త్రైమాసికంలో రూ 166.32 కోట్ల నికర లాభాలను ఆర్జించినట్టు శనివారం ప్రకటించింది. ప్రభుత్వరంగ రుణదాత యూనియన్ బ్యాంక్ గత ఏడాది ఇదే కాలంలో 518.78 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. గ్లోబల్ బిజినెస్ మాత్రం కొంత మెరుగ్గా ఉంది. గత ఏడాది రూ.5,82,817కోట్లతో పోలిస్తే.. ప్రస్తుత క్వార్టర్ లో రూ.6,07,280 కోట్లను ఆర్జించింది. నెట్ ఎన్ పీఏ నిష్పత్తి గత ఏడాది జూన్ 30 నాటికి 3.08 శాతం ఉండగా జూన్ 30, 2016 నాటికి 6.16 శాతంగా ఉంది. అయితే జనవరి మార్చి క్వార్టర్ తో పోలిస్తే 72.2 శాతం లాభాలు ఎగిసాయి. దేశీయ నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎమ్) ఏడాది ఇదే కాలంలో 2.46 శాతం పోలిస్తే ఏప్రిల్-జూన్ 2016 శాతం 2.36 శాతంగా నమోదైందని బ్యాంకు వెల్లడించింది. ఏప్రిల్-జూన్ కాలానికి నికర వడ్డీ ఆదాయం, గత ఏడాది మాదిరిగా స్థిరంగా ఉండి.. రూ 2,130 కోట్ల రూపాయల వద్ద ఉంది. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ద్వారా తెరిచిన 58 లక్షలకు పైగా ఖాతాలతో రూ 892 కోట్ల నిల్వలు ఉన్నట్టు ప్రకటించింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం రూ 721 కోట్ల క్యాపిటల్ ఇన్ ఫ్యూజన్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. -
షార్ట్సర్క్యూట్తో బ్యాంకులో మంటలు
గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో యూనియన్ బ్యాంకులో బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ప్రధాన రహదారిపై ఉన్న ఈ బ్యాంకు శాఖ లాకర్ రూంలో మొదట షార్ట్సర్య్కూట్ కారణంగా మంటలు లేచాయి. దీంతో సిబ్బంది భయంతో పరుగులు తీశారు. మంటలు ఆఫీసులోని కంప్యూటర్లను ఆవరించాయి. సిబ్బంది సమాచారంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటన స్థలికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. -
విశాఖలో ఘరానా మోసం.. రూ.2 కోట్లు కుచ్చుటోపి!
విశాఖపట్నం: విశాఖలో ఘరానా మోసం చోటుచేసుకుంది. మోసానికి పాల్పడ్డ ఇద్దరు నిందితులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ ధ్రువపత్రాలతో కొందరు నిందితులు యూనియన్ బ్యాంక్కు రూ.2 కోట్లు టోకరా వేశారు. బ్యాంక్ నుంచి నగదు తీసుకుని మోసాలకు పాల్పడ్డ నిందితులు కనకారావు, రవికుమార్ లను అరెస్టు చేసినట్లు ఆరిలోవ పోలీసులు తెలిపారు. విచారణ చేపట్టి నిందితుల నుంచి నగదు రికవరీ చేస్తామని వివరించారు. -
బ్యాంకులకు మొండి బకాయిల బండ
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకులకు మొండి బకాయిలు ఇంకా ఇంకా గుదిబండగా మారుతున్నాయి. మంగళవారం ఫలితాలు ప్రకటించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్లకు ఫలితాలపై మొండి బకాయిలు తీవ్రమైన ప్రభావాన్నే చూపించాయి. ఆ వివరాలివీ... పీఎన్బీ లాభం సగం... న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ను మొండి బకాయిల కేటాయింపులు దెబ్బతీశాయి. ఈ కేటాయింపుల కారణంగా బ్యాంక్ నికర లాభం సగానికి పైగా తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ క్వార్టర్కు రూ.721 కోట్ల నికర లాభం ఆర్జించామని పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం(రూ.1,405 కోట్లు)తో పోల్చితే 49 శాతం క్షీణించిందని వివరించింది. గత క్యూ1లో రూ.19,603 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో రూ.25,397 కోట్లకు పెరిగాయని పేర్కొంది. శాతాల్లో చెపితే ఇది 5.48 శాతం నుంచి 6.47 శాతానికి పెరిగిందని వివరించింది. కేటాయింపులు రూ.928 కోట్ల నుంచి రూ.1,811 కోట్లకు పెరిగాయని పేర్కొంది.ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఈ బ్యాంక్ షేర్లు 5 శాతం వృద్ధితో రూ.142 వద్ద ముగిశాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర లాభం 84% డౌన్ జూన్ క్వార్టర్కు బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.130 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్కు సాధించిన నికర లాభంతో (రూ.806 కోట్లు) పోలిస్తే ఏకంగా 84 శాతం క్షీణత నమోదైంది. గతేడాది క్యూ1లో రూ.893 కోట్లుగా ఉన్న కేటాయింపులు ఈ క్యూ1లో రూ.1,515 కోట్లకు పెరిగాయని, లాభం తగ్గడానికి ఇదే ప్రధాన కారణమని తెలియజేసింది. స్థూల నిరర్థక ఆస్తులు 3.2 శాతం (రూ.12,532 కోట్లు) నుంచి 6.8 శాతానికి (రూ.26,889 కోట్లు) ఎగబాకాయి. యూనియన్ బ్యాంక్ కేటాయింపులు రెట్టింపు యూనియన్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలానికి రూ.519 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం నికర లాభం (రూ.664 కోట్లు)తో పోల్చితే 22 శాతం క్షీణత నమోదైంది. మొత్తం ఆదాయం రూ.8,548 కోట్ల నుంచి రూ.9,043 కోట్లకు పెరిగింది. మొండి బకాయిలకు కేటాయింపులు దాదాపు రెట్టింపయ్యాయని, రూ.393 కోట్ల నుంచి రూ.642 కోట్లకు పెరిగాయని తెలియజేసింది. స్థూల మొండి బకాయిలు 4.27 శాతం (రూ.10,232కోట్లు) నుంచి 5.53 శాతానికి (రూ.14,144 కోట్లకు), నికర మొండి బకాయిలు 2.71 శాతం నుంచి 3.08 శాతానికి ఎగిశాయని తెలిపింది. నికర వడ్డీ ఆదాయం రూ.2,117 కోట్ల నుంచి రూ.2,130 కోట్లకు, వడ్డీయేతర ఆదాయం 13 శాతం వృద్ధితో రూ.783 కోట్లకు పెరిగాయని వివరించింది. అయితే మొండి బకాయిలను నియంత్రిస్తామని బ్యాంక్ సీఎండీ అరుణ్ తివారీ ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ బ్యాంక్ షేర్ బీఎస్ఈలో 2 శాతం వృద్ధితో రూ.157 వద్ద ముగిసింది. సిండికేట్ బ్యాంక్ లాభం రూ.302 కోట్లు సిండికేట్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ క్వార్టర్కు రూ.302 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం(రూ.485 కోట్లు)తో పోల్చితే 38 శాతం క్షీణత నమోదైంది. మొత్తం ఆదాయం రూ.5,523 కోట్ల నుంచి రూ.6,323 కోట్లకు పెరిగిందని బ్యాంకు పేర్కొంది. స్థూల మొండి బకాయిలు 2.97 శాతం నుంచి 3.72 శాతానికి, వడ్డీ ఆదాయం రూ.5,067 కోట్ల నుంచి రూ.5,823 కోట్లకు పెరిగిందని వివరించింది. ఫలితాల నేపధ్యంలో బీఎస్ఈలో ఈ బ్యాంక్ షేర్ 9 శాతం క్షీణించి రూ.90 వద్ద ముగిసింది. -
రూ.2,500 కోట్ల నిధుల సమీకరణ దిశగా యూనియన్ బ్యాంక్
ముంబై : ప్రభుత్వ రంగానికి చెందిన యూనియన్ బ్యాంక్ వచ్చే నెలలో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్విప్) పద్ధతిలో రూ.2,500 కోట్లను సమీకరించనుంది. ఈ విషయాన్ని బ్యాంక్ చైర్మన్, ఎండీ అరుణ్ తివారీ ధ్రువీకరించారు. యూనియన్ బ్యాంక్ ఇటీవలే పబ్లిక్ ఇష్యూ, రైట్ ఇష్యూ, ప్రైవేట్ ప్లేస్మెంట్, ప్రభుత్వ పెట్టుబడులు వంటి తదితర మార్గాల ద్వారా దాదాపు రూ.3,700 కోట్ల నిధుల సమీకరణకు స్టాక్హోల్డర్ల నుంచి అనుమతి పొందింది. -
యూనియన్ బ్యాంక్లో అగ్నిప్రమాదం
ఎస్సార్నగర్ (హైదరాబాద్): నగరంలోని ఎస్సార్నగర్లో ఉన్న యూనియన్ బ్యాంక్లో అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం బ్యాంక్లో అగ్నిప్రమాదం సంభవించి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో బ్యాంక్ సిబ్బంది అగ్నిమాపకశాఖ వారికి సమాచారం అందించారు. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. -
బ్యాంక్ స్ట్రీట్.. మిశ్రమ ఫలితాలు...
యూనియన్ బ్యాంక్... మొండి బకాయిల భారం న్యూఢిల్లీ: యూనియన్ బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసిక కాలంలో 23 శాతం తగ్గింది. మొండి బకాయిలకు భారీ కేటాయింపుల కారణంగా నికర లాభం తగ్గిందని బ్యాంక్ పేర్కొంది. 2013-14 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.579 కోట్లుగా ఉన్న నికర లాభం 2014-15 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.444 కోట్లకు తగ్గిందని వివరించింది. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.920 కోట్ల నుంచి రూ.1,009 కోట్లకు పెరిగాయని పేర్కొంది. యూకో బ్యాంక్... లాభం 27 శాతం డౌన్ న్యూఢిల్లీ: యూకో బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 27 శాతం తగ్గింది. 2013-14 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.285 కోట్లుగా ఉన్న నికర లాభం 2014-15 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.209 కోట్లకు తగ్గిందని తెలిపింది. మొత్తం ఆదాయం రూ.5,309 కోట్ల నుంచి రూ.5,263 కోట్లకు తగ్గిందని పేర్కొంది. స్థూల మొండి బకాయిలు 4.32 శాతం నుంచి 6.76 శాతానికి, నికర మొండి బకాయిలు 2.38 శాతం నుంచి 4.3 శాతానికి పెరిగాయని తెలిపింది. సెంట్రల్ బ్యాంక్... మొండి బకాయిలు తగ్గాయ్ న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యాంక్ నికర లాభం నాలుగో త్రైమాసిక కాలానికి 7 శాతం పెరిగింది. 2013-14 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.162 కోట్లుగా ఉన్న నికర లాభం 2014-15 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.174 కోట్లకు పెరిగిందని తెలిపింది. మొత్తం ఆదాయం రూ.6,962 కోట్ల నుంచి రూ.7,322 కోట్లకు పెరిగిందని పేర్కొంది. స్థూల మొండి బకాయిలు 6.27 శాతం నుంచి 6.09 శాతానికి తగ్గాయి. నికర మొండి బకాయిలు 3.75 శాతం నుంచి 3.61 శాతానికి తగ్గాయి. విజయ బ్యాంక్... వేతనాలకు అధిక కేటాయింపులు చెన్నై: విజయ బ్యాంక్ నికర లాభం క్యూ4లో 29% తగ్గింది. 2013-14 క్యూ4లో రూ.136 కోట్లుగా ఉన్న నికర లాభం 2014-15 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.97 కోట్లకు తగ్గిందని విజయ బ్యాంక్ ఎండీ, సీఈఓ కిశోర్ కుమార్ శాన్సి వివరించారు. వేతన పెంపు నిమిత్తం రూ.208 కోట్ల ఏక మొత్తం కేటాయింపుల కారణంగా నికర లాభం తగ్గిందని తెలిపారు. మొత్తం ఆదాయం రూ.3,029 కోట్ల నుంచి రూ.3,406 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. షేర్కు రూ.1.50 డివిడెండ్ను ఇవ్వనున్నామన్నారు. -
ఆశచూపి... అప్పుల్లో ముంచాడు !
పార్వతీపురం:బయోడీజిల్ మొక్కలు పెంచితే వాటి ద్వారా అధికాదాయం పొం దొచ్చని గిరిజనులకు మాయమాటలు చెప్పిన ఓ ప్రబుద్ధుడు, వారిని నిండా ముంచాడు. మెట్ట, పోడు భూముల్లో బయో డీజిల్ మొక్కలు వేస్తే మొక్కలతోపాటు వాటిని కాపాడేందుకు కూలి డబ్బులు కూడా ఇస్తానని చెప్పి నమ్మబలికిన ఆ ఘనుడు పార్వతీపురం యూనియన్ బ్యాంకు నుంచి ఒక్కొక్కరికీ రూ.2 వేల నుంచి 4వేల వరకూ ఇప్పించా డు. అయితే పంట చేతికొచ్చే సమయానికి కంపెనీ ఎత్తేశారని, పంట కొనలేమని చెప్పి తప్పుకున్నాడు. దీంతో చేసేది లేక బయో డీజిల్ పంట ను ఏమి చేసుకోవాలో తెలియక ఆయా గిరిజనులు ఆ మొక్కలను తీసిపారేశారు. అక్కడవరకు బాగానే ఉంది. అయితే ఇటీవల సంబంధిత బ్యాంకు నుంచి రూ.50 వేల బకాయి చెల్లించాలంటూ నోటీసులొచ్చాయి. దీంతో తమకు తెలియకుండానే బ్యాంకులో అప్పులెలా ఉన్నాయంటూ పార్వతీపురం మండలంలోని గంజిగెడ్డ, కొయిమెట్టవలస, డెప్పివలస, మునక్కాయ వలస తదితర గ్రామాలకు చెందిన పలువురు గిరిజనులు లబోదిబోమంటున్నారు. దీనికి సంబంధించి ఆయా గ్రామాలకు చెందిన గిరిజనులు అందించిన వివరాలిలా ఉన్నాయి...2008లో ఒడిశాకు చెందిన చందు అనే ఒక వ్యక్తి గంజిగెడ్డ, కొయిమెట్టవలస, డెప్పివలస, మునక్కాయవలస తదితర గ్రామాలకు వెళ్లి బయోడీజిల్ మొక్కలు పెంచమని కోరాడు. ఆయా గ్రామాలవారు మొదట అంగీకరించలేదు. అయితే ఈ మొక్కలు పెంచడంవల్ల అధిక లాభాలు వస్తాయని, కాసిన పిక్కలను తామే అధికరేటుకు కొం టామని, మొక్కలతో పాటు పెంపకానికి తామే డబ్బులిస్తామని చెప్పి అప్పట్లో ఒక్కొక్కరికీ రూ. 2 నుంచి రూ. 4వేలు వరకు ఇచ్చాడు. అయితే 2012లో కాపుకొచ్చాక వాటికొనుగోలుకు మధు ముందుకు రాలేదని గిరిజనులు తెలిపారు. ఈ విషయమై నిలదీస్తే కంపె నీ ఎత్తేశారని, తాము కొనలేమని తప్పించుకున్నాడన్నారు. చేసేదిలేక తాము ఆ పంటను తొలగించామన్నారు. అయితే ఒక్కొక్కరూ రూ. 50 వేల చొప్పున బకాయి ఉన్నారని, ఆ సొమ్మును వెంటనే చెల్లించాలని పార్వతీపురం యూనియన్ బాం్యక్ నుంచి ఇటీవల నోటీసులు వచ్చాయని వారు వాపోయారు. కూలి ప నులు చేసుకుంటూ బతుకుతున్న తాము వేల కొలది అప్పులెలా తీరుస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల హుద్హుద్ తుపానుకు నష్టపోయిన పంటకు వచ్చిన పరిహారాన్ని కూడా యూనియన్ బ్యాంకు అప్పుందంటూ జమచేసుకుందని గిరిజనులు తెలిపా రు. క్రిమినల్ కేసులు పెట్టండి... ఐటీడీఏ పీఓ ఈ విషయమై సోమవారం ఐటీడీఏ పీఓ శ్రీకేశ్ బి. ల ఠ్కర్వద్ద ఆయా గ్రామాలకు చెందిన గిరిజనులు మొ రపెట్టుకున్నారు. దీనికి స్పందించి పీఓ శ్రీకేశ్ దీనిపై విచారణ చేయాలని ఐకేపీ ఏపీడీ మురళీధర్ను విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కేసులు పెట్టాలని సూచించారు. రూ. 4వేలు ఇచ్చారు.. మొక్కల పెంపకానికి అంటూ అప్పట్లో యూనియన్ బ్యాంకు వద్ద ఏవేవో సంతకాలు తీసుకొని రూ. 4వేలు ఇచ్చారు. ఇప్పుడు అదే బ్యాంకునుంచి రూ. 50వేలు అప్పు తీర్చాలంటూ నోటీసులు వచ్చాయి. -మండంగి కుమార్, కొయ్యిమెట్టవలస రూ. 50వేలు ఎలా తీర్చాలి.. రోజూ కూలి చేసుకొనే మేము రూ. 50వేల అప్పు ఎ లా తీర్చాలి. ఇటు బయోడీజిల్ పంటవేసి నష్టపోగా, ఇప్పుడు అప్పుల పాలయ్యాము. బ్యాంకు నుంచి నోటీసులు వచ్చేసరికి అంతా భయపడిపోయాము. - మండంగి మాకిరి, కొయ్యిమెట్టవలస హుద్హుద్ నష్టపరిహారాన్ని జమచేసుకున్నారు. హుద్హుద్ తుపానుకు జొన్నపంట నష్టపోగా రూ. 4,900లు పరిహారం వచ్చింది. నేను బ్యాంకుకు బాకీ ఉన్నానని ఆ మొత్తాన్ని బ్యాంకు సిబ్బంది జమచేసుకున్నారు. నా గతమేంకాను - మెల్లిక సరుగు, కొయ్యిమెట్టవలస -
ఏటీఎంలు ఇక హిందీమే బోల్తా హై!
ఉత్తరాది రాష్ట్రాల బ్యాంక్ ఏ టీ ఎంలు ఇక హిందీ లోనూ రసీదులు ఇవ్వబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం హిందీ భాష మాట్లాడే రాష్ట్రాల్లో వినియోగదారులు కోరుకుంటే హిందీలో రసీదులు ఇచ్చేలా ఏర్పాటుచేయమని బ్యాంకులను కోరింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్, ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్, ఆర్ధిక వ్యవహారాల శాఖలకు కేంద్ర ప్రభుత్వం లేఖలు రాసింది. ఇప్పటి వరకూ మీరు హిందీ లేదా స్థానీయ భాషనువాడినా ఏటీఎం మాత్రం ఇంగ్లీషు రసీదులనే ఇస్తోంది. ఒక్క యూనియన్ బ్యాంక్ మాత్రమే ఇంగ్లీషు, హిందీ సహా మరో ఏడు భాషల్లో రసీదులు ఇస్తోంది. ఇప్పటి నుంచీ కొనుగోలు చేసే ఏ టీఎంలు హిందీ, స్థానిక భాషల్లో కూడా రసీదులు ఇచ్చేలా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఏ టీ ఎం సేవలు విస్తరించే ప్రక్రియలో ఇంగ్లీషు అవసరం లేకుండా రసీదులు ఇచ్చే వీలుండాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. ప్రస్తుతం ఎన్ సీ ఆర్, విన్ కోర్, డైబోల్డ్ అనే మూడు సంస్థలు మన దేశంలో ఏటీఎంలను సరఫరా చేస్తున్నాయి. వీటిలో ఒక్క డైబోల్డ్ మాత్రమే ఇతర భాషల్లో రసీదులు ఇవ్వగలిగే టెక్నాలజీని కలిగి ఉంది. -
యూనియన్ బ్యాంక్ లాభం 27% డౌన్
క్యూ4లో రూ. 579 కోట్లు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ యూనియన్ బ్యాంక్ జనవరి-మార్చి(క్యూ4)లో రూ. 579 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 789 కోట్లతో పోలిస్తే ఇది 27% క్షీణత. మొండిబకాయిలకు ప్రొవిజన్లు పెరగడం, వడ్డీయేతర ఆదాయం తగ్గడం లాభాలను దెబ్బతీసినట్లు బ్యాంకు చైర్మన్ అరుణ్ తివారీ పేర్కొన్నారు. బకాయిలకు కేటాయింపులు రూ. 655 కోట్ల నుంచి రూ. 920 కోట్లకు పెరిగాయి. వడ్డీయేతర ఆదాయం రూ. 875 కోట్ల నుంచి రూ. 775 కోట్లకు తగ్గింది. నికర మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.61% నుంచి 2.33%కు పెరిగాయి. ఈ కాలంలో రూ. 320 కోట్లమేర మొండి రుణాలను విక్రయించింది. వడ్డీ ఆదాయం 3.6% అప్ క్యూ4లో బ్యాంకు నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 3.6% పుంజుకుని రూ. 2,052 కోట్లను తాకగా, నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 2.62%గా నమోదయ్యాయి. ఇదే కాలానికి బ్యాంకు మొత్తం ఆదాయం కూడా రూ. 7,501 కోట్ల నుంచి రూ. 8,445 కోట్లకు ఎగసింది. ఇక పూర్తి ఏడాదికి(2013-14) బ్యాంకు నికర లాభం 21%పైగా క్షీణించి రూ. 1,696 కోట్లకు పరిమితమైంది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బ్యాంకు షేరు దాదాపు 9% పతనమై రూ. 135 వద్ద ముగిసింది. -
బ్యాంక్ ఖాతాదారుడికి బురిడీకొట్టించిన అపరిచీతుడు
-
పదో వేతన సవరణ చేపట్టాలి
కరీంనగర్ అర్బన్,న్యూస్లైన్ : ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులందరికీ పదో వేతన సవరణ చేపట్టి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నగరంలోని పలు బ్యాంకుల సిబ్బంది బుధవారం ఆందోళన చేపట్టారు. ఆంధ్రాబ్యాంకు, ఎస్బీహెచ్, ఎస్బీఐ, యూనియన్ బ్యాంకు కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా బ్యాంకులకు చెందిన యూని యన్ల నాయకులు మాట్లాడారు. ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగుల వేతన సవరణను వెంటనే చేపట్టాలని, అలాగే ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాంభద్రయ్య, వెంకటేశం, సత్యనారాయణ, వీరభద్రయ్య, శంకర్, బాపు, సురేంద్ర, శశికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎస్బీహెచ్ కార్యాలయాల ఎదుట చేపట్టిన ఆందోళనల్లో జిల్లా ఆఫీసర్స్ ఆవార్డు ఎంప్లాయీస్ యూని యన్ నాయకులు ఏఎల్ఎన్ శాస్త్రీ, జీవన్కుమార్, నారాయణ, బాషుమియా తదితరులు పాల్గొన్నారు. యూనియన్ బ్యాంకు ఎదుట చేపట్టిన కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పి. శ్రీనివాస్ మాట్లాడుతూ నూతన వేతన ఒప్పందాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సభ్యులు సంపత్, రమాదేవి, విజయ, రియాజ్, శంకర్, నవీన్, రాజు, సాయికృష్ణ, సరిత, శ్రీవాణి, ఫిరోజ్, తిరుపతి, రాజేందర్, రాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎస్బీఐ ఎదుట చేపట్టిన ఆందోళనల్లో స్టాఫ్ యూనియన్ కార్యదర్శి నంద కిశోర్, శ్రీనివాస్, కృష్ణ, వెంకటేశ్వర్లు, సలీంపాషా, శ్రీకాంత్, యశోధ, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంక్ స్ట్రీట్...
10 శాతం క్షీణించిన బీవోబీ నికరలాభం ముంబై : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ బరోడా నికరలాభం 10 శాతం క్షీణించి రూ.1,168 కోట్లుగా నమోదయ్యింది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలానికి నికరలాభం రూ.1,301 కోట్లుగా ఉంది. మొండి బకాయిల ప్రొవిజనింగ్ కేటాయింపులకు అధిక మొత్తం కేటాయించడంతో లాభాలు తగ్గినట్లు బ్యాంకు పేర్కొంది. గడిచిన ఏడాది ప్రొవిజనింగ్ కింద రూ.646 కోట్లు కేటాయిస్తే అది ఈ ఏడాది రూ.861 కోట్లకు పెరిగాయి. సమీక్షా కాలంలో ఆదాయం రూ.9,551 కోట్ల నుంచి రూ.10,447 కోట్లకు పెరిగింది. అలాగే స్థూల నిరర్థక ఆస్తులు 1.98% నుంచి 3.15%, నికర నిరర్థక ఆస్తులు 0.82% నుంచి 1.86% పెరిగాయి. బీవోఐ లాభం రెండు రెట్లు అప్.. ముంబై: ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) సెప్టెంబర్తో ముగిసిన ద్వితీయ త్రైమాసిక నికర లాభం రెండు రెట్లు పెరిగింది. గత సంవత్సరం ఇదే కాలంలో రూ.302 కోట్లుగా ఉన్న నికరలాభం ఈ ఏడాది రూ.622 కోట్లకు పెరిగింది. నిరర్థక ఆస్తులు భారీగా తగ్గడంతో ఆ మేరకు లాభాలు పెరిగినట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. సమీక్షా కాలంలో ఆదాయం రూ.8,899 కోట్ల నుంచి రూ.10,339 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో స్థూల నిరర్థక ఆస్తులు 3.42% నుంచి 2.93%, నికర నిరర్థక ఆస్తులు 2.04% నుంచి 1.85% తగ్గాయి. ఫలితాలు బాగుండటంతో గురువారం ఎన్ఎస్ఈలో ఈ షేరు ఏకంగా 21% పెరిగి రూ.210 వద్ద ముగిసింది. భారీగా తగ్గిన యూనియన్ బ్యాంక్ లాభం ముంబై: సెప్టెంబర్తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో ప్రభుత్వరంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నికరలాభం 62% క్షీణించింది. గత సంవత్సరం ఇదే కాలంలో రూ.554 కోట్లుగా ఉన్న నికరలాభం ఈ ఏడాది రూ.208 కోట్లకు పడిపోయింది. ప్రొవిజనింగ్ కోసం గతేడాది రూ.487 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది రూ.937 కోట్లు కేటాయించాల్సి రావడంతో నికరలాభం భారీగా తగ్గినట్లు బ్యాంకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇదే సమయంలో ఆదాయం రూ.6,656 కోట్ల నుంచి రూ.7,882 కోట్లకు పెరిగింది. నికర నిరర్థక ఆస్తులు 2.06 శాతం నుంచి 2.15 శాతానికి పెరిగాయి. అలహాబాద్ బ్యాంక్ నికరలాభం18% వృద్ధి న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం(2013-14, క్యూ2)లో ప్రభుత్వరంగ అలహాబాద్ బ్యాంక్ నికరలాభం 18 శాతం వృద్ధి చెందింది. రూ. 234 కోట్ల నుంచి రూ.276 కోట్లకు చేరింది. ఆదాయం రూ.4,583 కోట్ల నుంచి రూ.5,303 కోట్లకు పెరిగింది. ఈ సమీక్షా కాలంలో స్థూల నిరర్థక ఆస్తులు 2.95 శాతం నుంచి రూ.4.94 శాతానికి, నికర నిరర్థక ఆస్తులు 2.10 శాతం నుంచి 3.83 శాతానికి పెరిగాయి.