usha
-
పాపం ఉష.. ఇష్టం లేకున్నా నవ్వాల్సిందే!
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన భార్య ఉషా చిలుకూరిని ఉద్దేశించి చేసిన సరదా వ్యాఖ్యలు కాస్తా గురి తప్పి బెడిసికొట్టాయి. మిషిగాన్లో ఒక కార్యక్రమానికి ఆయన భార్యాసమేతంగా హాజరయ్యారు. తన భార్య అమెరికా సెకండ్ లేడీగా గొప్పగా బాధ్యతలు నిర్వర్తిస్తోందంటూ పొగడ్తలు కురిపించారు. పనిలో పనిగా..‘అయితే ఒక్కటి మాత్రం నిజం. నేనెంత అర్థంపర్థం లేని మాటలు మాట్లాడినా ఆమె నవ్వాల్సిందే పాపం! ఎందుకంటే చుట్టూ కెమెరాలుంటాయి! నవ్వుతూ నాతో శ్రుతి కలపాలి. మరో దారి లేదు’ అంటూ చెణుకులు విసిరారు.అయితే, ఆయన కామెంట్లు విమర్శలకు దారితీశాయి. తనకు సెన్సాఫ్ హ్యూమర్ అస్సలు లేదని వాన్స్ మరోసారి నిరూపించుకున్నారంటూ నెటిజన్లు తప్పుబడుతున్నారు. చౌకబారు వ్యాఖ్యలతో భార్యను చీర్లీడర్గా చిత్రించారంటూ తూర్పారబడుతున్నారు. హాస్యం అనుకుని వాన్స్ చేసే కామెంట్లు ఎప్పుడూ ఇలాగే గురి తప్పుతూ ఉంటాయంటూ ఎద్దేవా చేశారు.Vance: Here's the thing. The cameras are all on; anything I say, no matter how crazy, she has to smile, laugh, and celebrate it. pic.twitter.com/KO36G1D7ju— Acyn (@Acyn) March 14, 2025ఇక, వాన్స్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు కూడా ఉష ఎప్పట్లాగే ఆయన వెనకాల నుంచుని నవ్వుతూ చూస్తుండిపోవడం విశేషం! గత ఉపాధ్యక్షునిగా వాన్స్ ప్రమాణస్వీకారం సందర్భంగా ఆయనకేసి ఉష ఆప్యాయంగా, గర్వంగా, చిరునవ్వుతో చూస్తున్న ఫొటోలు, వీడియోలు వైరల్ కావడం తెలిసిందే. తెలుగు మూలాలున్న ఉష 2014లో వాన్స్ను పెళ్లాడారు. వారికి ముగ్గురు పిల్లలు. వాన్స్ దంపతులు ఈ నెలాఖర్లో భారత్ రానున్నారు. సెకండ్ లేడీ హోదాలో ఉషకు ఇది తొలి భారత పర్యటన. Usha's gaze of pure admiration for her husband - her smile hasn't faded, and she's absolutely glowing! 💖 pic.twitter.com/kOW3xtyyte— 𝕍𝕚𝕠𝕝𝕒 𝕃𝕖𝕚𝕘𝕙 𝔹𝕝𝕦𝕖𝕤 (@ViolaLeighBlues) January 20, 2025 -
అమ్మా.. నేనేం పాపం చేశా!
మహాబూబాబాద్, సాక్షి: కన్నతల్లే ఆ పిల్లల పాలిట మృత్యు దేవతగా మారింది. తన భర్త మరణించాక మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. అయితే తన సుఖానికి పిల్లలే అడ్డొస్తున్నారని భావించి వాళ్లను లేకుండా చేయాలనుకుంది. ఈ ప్రయత్నంలో ఆ చిట్టితల్లిని విషమిచ్చి ఆ కన్నతల్లి చేజేతులారా చంపేసుకుంది. డోర్నకల్ మండలంలోని జోగ్య తండ గ్రామ పంచాయతీ పరిధిలోని మంగళ్ తండాకు చెందిన వాంకుడోత్ వెంకటేష్(30) నాలుగు నెలల కిందట అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో ఆయన భార్య ఉష, ఇద్దరు పిల్లలు నిత్యశ్రీ (05) అబ్బాయి వరుణ్ తేజ (07)ల అత్తింట్లోనే ఉంటోంది. ఈ నెల 5వ తేదీన ఇంటి వద్ద ఆడుకుంటూ పిల్లలిద్దరూ కిందపడి పోయారు. వాంతులు, విరోచనాలు కావడంతో కంగారు పడిపోయిన వెంకటేష్ తల్లి.. పిల్లలను ఏం జరిగిందని వాకబు చేసింది. అమ్మ కూల్డ్రింక్ తాగించిందని అమాయకంగా చెప్పారు ఆ ఇద్దరూ. ఆ తర్వాత బాబాయ్ రాంబాబు సహాయంతో పిల్లలను ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ రెండు రోజుల చికిత్స అనంతరం పిల్లల శరీరంలో గడ్డిమందు అవశేషాలు ఉన్నాయని వైద్యులు తెలపడంతో బంధువులు ఉషను నిలదీశారు. పిల్లలకు కూల్డ్రింక్లో గడ్డిమందు కలిపి తాగించినట్లు ఒప్పుకుందామె. ఈలోపు పిల్లల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. పిల్లలకు ఏమైనా జరిగితే తనను చంపేస్తారన్న భయంతో.. ఉష ఎలుకల మందు తాగింది. దీంతో ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు పిల్లల బాబాయ్ ఫిర్యాదు చేయడంతో.. డోర్నకల్ పోలీసులు ఈ నెల 10న హత్యాయత్నం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సుమారు రెండువారాల తర్వాత వరుణ్తేజ్ కోలుకోగా.. పరిస్థితి విషమించి నిత్యశ్రీ ఆదివారం మృతి చెందింది. దీంతో కేసును హత్య కేసుగా మార్చిన పోలీసులు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఆమెను అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. ఆ అధికారితో ఉష సంబంధం!నిత్యశ్రీ పోస్టుమార్టంను పర్యవేక్షించిన డోర్నకల్ సీఐ బీ రాజేశ్.. దగ్గరుండి ఆ చిన్నారి మృతదేహాన్ని హైదరాబాద్కు తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులకు అప్పగించే క్రమంలో జోగ్యతండాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉషను తీసుకు రావాలంటూ ఆగ్రహంతో స్థానికులు ఊగిపోయారు. ఆంబులెన్స్కు అడ్డుపడి ధర్నా చేపట్టారు. స్థానికంగా ఉన్న ఓ పోలీస్ అధికారితో ఉష సంబంధం ఉందని, ఆ అధికారి చెప్పడంతోనే ఆమె ఈ ఘోరానికి పాల్పడిందని ఆరోపించారు. చిన్నారి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలా.. 12 గంటలు ధర్నా కొనసాగించారు. ఈ తరుణంలో గ్రామ పెద్దలతో పోలీసులు చర్చలు జరిపారు. నిత్యశ్రీ మృతికి కారణమైన పోలీస్ అధికారిపై విచారణ జరిపించి.. ఈ విషయంలో అయన పాత్ర ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు ధర్నా విరమించగా.. నిత్యశ్రీ మృతదేహాన్ని బంధవులకు అప్పగించారు. -
Republic Day 2025: సర్వ ఆహార సమ్మేళనం..!
‘‘సన్నగా ఉండాలని కడుపు మాడ్చుకుంటే అనారోగ్యమే. చక్కగా తినాలి... చక్కగా ఎక్సర్సైజ్లు చేయాలి. ఆరోగ్యమే మహాభాగ్యం’’ అని ఉష మూల్పూరి(Usha Mulpuri)అన్నారు. నిర్మాతగా తన తనయుడు నాగశౌర్యతో ‘ఛలో, నర్తనశాల, కృష్ణా వ్రింద విహారి’ తదితర చిత్రాలను నిర్మించారు. తొలి చిత్రం ‘ఛలో’ తోనే నిర్మాతగా సక్సెస్ని టేస్ట్ చేసిన ఉష ఇప్పుడు తన రెస్టారెంట్ ‘ఉష మూల్పూరి’స్ కిచెన్(Usha Mulpuri's Kitchen)’ ద్వారా రుచికరమైన వంటకాలు అందిస్తున్నారు. ఇక గణతంత్ర దినోత్సవం(Republic Day) సందర్భంగా ‘సాక్షి’ కోసం ప్రత్యేకంగా కొన్ని వంటకాలు(Recipes) తయారు చేశారు. ఆ వంటకాలు తెలుసుకుందాం. ‘‘దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్... ఆ మనుషుల ఆరోగ్యం మా బాధ్యత... అందుకే రిపబ్లిక్ డే సందర్భంగా చేసిన వంటకాల్లోనూ పోషక విలువలు ఉండేలా చూసుకున్నాను’’ అంటూ దేశభక్తిని చాటుతూ, జెండా రంగులకు తగ్గట్టుగా తాను కూడా రెడీ అయి, కిచెన్లోకి ఎంటరయ్యారు ఉష. ముందుగా నాన్ వెజ్ స్టార్టర్ చేశారు.. ‘పండుమిర్చి కోడి వేపుడు, క్రీమ్ చికెన్, కరివేపాకు కోడి వేపుడు’ చేసి, ఆ కాంబోని అందంగా ప్రెజెంట్ చేశారు. ‘‘పండు మిర్చిలో విటమిన్ ఎ, బి, సి వంటివి పుష్కలంగా ఉంటాయి. అలాగే కేన్సర్తో పోరాడే ఔషద గుణాలు ఉంటాయి. కరివేపాకులో విటమిన్ ఎ, బి, సి, ఇ వంటివి ఉంటాయి. కంటికి, జుట్టుకి మంచిది. ఎముకల ఆరోగ్యానికి కూడా కరివేపాకు బెస్ట్. అందుకే ఆహారం ఆరంభమే ఆరోగ్యంగా ఆరంభించాలని ఈ స్టార్టర్స్ చేశాను’’ అని వివరించారు ఉష. రైస్ ఐటమ్స్లో పుదీనా మాంసం పులావ్, చికెన్ ఫ్రైడ్ రైస్, పండుమిర్చి కోడి పులావ్ చేశారు. ‘‘పుదీనాకి మంచి వాసన ఉంటుంది. దాంతోపాటు రుచి కూడా బాగుంటుంది. అలాగే ఆహారం జీర్ణం కావడానికి పుదీనా మంచిది. ఐరన్ పుష్కలంగా ఉన్న పుదీనాని మీరు రోజూ తీసుకోవచ్చు. మనలో చాలామందికి రోజూ టీ తాగే అలవాటు ఉంటుంది. ఆ టీలో కొన్ని పుదీనా ఆకులు వేసుకుని, తాగి చూడండి. మీకే తేడా తెలుస్తుంది. ఇక నాన్వెజ్ తినేవారికి చికెన్లో ఎన్ని పోషక పదార్థాలు ఉన్నాయో తెలిసిందే’’ అని పేర్కొన్నారామె. మాంసాహారం మాత్రమే కాదు... శాకాహారం కూడా చేశారు ఉష. వెజ్లో కరివేపాకు వెజ్ పులావ్, పండుమిర్చి పనీర్ పలావ్, కర్డ్ రైస్ చేశారు.‘‘కరివేపాకు, పండుమిర్చి ఎంత మంచిదో ముందే చెప్పాను. పనీర్ మంచి ప్రోటీన్ ఫుడ్. నాన్వెజ్ తినేవారికి మాంసం రూపంలో ప్రోటీన్లు అందుతాయి. వెజిటేరియన్స్కి పనీర్ బెస్ట్. పనీర్లో తక్కువ కార్బోహైడ్రేట్స్... ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ఇక మన ఇండియన్స్లో చాలామందికి ఫైనల్గా పెరుగన్నం తింటేనే సంతృప్తిగా ఉంటుంది. పెరుగులో కావాల్సినంత కాల్షియం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పొట్ట చల్లగా ఉండటానికి పెరుగన్నం కూడా చేశాను’’ అని తెలిపారు ఉష మూల్పూరి. ఎనిమిది పదుల వయసులవాళ్లకూ... ‘‘మనం ఆహారం తీసుకున్నాక పొట్ట బరువుగా ఉండకూడదు. తేలికగా అనిపించాలి. ఫుడ్ బిజినెస్ ఆరంభించాలనుకున్నప్పుడు నా మెయిన్ టార్గెట్ ఇదే. మా రెస్టారెంట్కి ఎనభై ఏళ్ల వయసు, ఆ పైన ఉన్నవాళ్లు కూడా వస్తారు. ‘పొట్ట చాలా తేలికగా ఉందమ్మా’ అని వారు చెప్పినప్పుడు హ్యాపీగా ఉంటుంది’’ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు.సెలబ్రిటీలకూ... ‘‘మా కిచెన్ వంటకాలను ఎన్టీఆర్, రామ్చరణ్, ఉపాసన, కృష్ణారెడ్డి, హరీష్ శంకర్, బాబీ, బుచ్చిబాబు, కోటి, మెగా కృష్ణారెడ్డి, నందినీ రెడ్డిగార్లు వంటివారు ఇష్టపడతారు. మా దగ్గర బ్రొకోలీ కాషూనట్ చిల్లీ గార్లిక్ ఫేమస్. ఇవి ఎక్కువగా తెప్పించుకుంటారు’’ అని చెప్పారు ఉష. అవగాహన పెంచుకోవాలి ‘‘నేను రెస్టారెంట్ పెట్టాలనుకున్నప్పుడు నాకు పెద్దగా ఏమీ తెలియదు. జీతాలిచ్చి మనుషులను పెట్టుకుని, వాళ్లతో చేయించేయొచ్చు. కానీ అందులో పరిపూర్ణత ఉండదు. వంటకు కావల్సినవి కొనడం నుంచి వాటిని సరిగ్గా శుభ్రం చేసి వండటం వరకూ అన్నింటినీ దగ్గరుండి చేయించేదాన్ని. ‘సర్వ మత సమ్మేళనం’ అంటారు... ‘సర్వ ఆహారం సమ్మేళనం’ అంటాను. రెస్టారెంట్ అంటే రకరకాల వాళ్లు వస్తారు. వాళ్లకి తగ్గట్టుగా ఉండాలి కదా. నా కుటుంబ సభ్యులకు వండుతున్నట్లుగా భావించి వంట చేయిస్తాను. వీలున్నప్పుడల్లా అన్ని టేబుల్స్ దగ్గరికి వెళ్లి, అందర్నీ పలకరిస్తుంటాను. ‘మాకు ఇంటికి వచ్చినట్లుగా ఉంది’ అని అంటుంటారు. అందరికీ ‘సాక్షి’ ద్వారా థ్యాంక్స్ చెబుతున్నాను’’ అంటూ ముగించారు ఉష.– డి.జి. భవాని (చదవండి: నీ రీప్లేస్మెంట్ రోబో: సు'నీ'శితంగా శస్త్రచికిత్స) -
ట్రంప్, జేడీ వాన్స్ ప్రమాణం.. ప్రత్యేక ఆకర్షణగా ఉషా చిలుకూరి
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలు దేశాధినేతలు, ప్రముఖులు పాల్గొన్నారు. ఇక, జేడీ వాన్స్ ప్రమాణం సందర్భంగా ఆయన పక్కనే తన భార్య ఉషా వాన్స్(Usha Vance) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఉషా చిలుకూరి ఆనందంతో ఉప్పొంగిపోయారు. సాధారణంగా అధ్యక్షుడి కంటే ముందు ఉపాధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ క్రమంలోనే తొలుత అమెరికా నూతన ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ చేత సుప్రీంకోర్టు న్యాయమూర్తి బ్రెట్ కవనాగ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా భార్య ఉషా చిలుకూరి, పిల్లలు ఆయన పక్కనే నిల్చుని ఉన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం జేడీ వాన్స్.. తన సతీమణి ఉషా చిలుకూరి ప్రేమగా ముద్దిచ్చారు.ఇక, ప్రమాణం సందర్బంగా జేడీ వాన్స్..‘విదేశీ, దేశీయ శత్రువులందరికీ వ్యతిరేకంగా.. నేను యునైటెడ్ స్టేట్స్ రాజ్యాంగానికి మద్దతు ఇస్తానని, దానిని రక్షించుకుంటానని నేను గంభీరంగా ప్రమాణం చేస్తున్నాను. నేను అమెరికా రాజ్యాంగానికి నిజమైన విశ్వాసం, విధేయతను కలిగి ఉంటాను. ఎటువంటి మెంటల్ రిజర్వేషన్ లేదా ఎగవేత ఉద్దేశ్యం లేకుండా.. నేను ఈ బాధ్యతను స్వేచ్ఛగా తీసుకుంటాను. నేను ప్రవేశించబోయే పదవి విధులను నేను చక్కగా, నమ్మకంగా నిర్వర్తిస్తాను అని అన్నారు.Having a woman who looks into your eyes with the trust and faith that J.D. Vance's wife, Usha, does is truly beautiful. It's a wonderful day for such a lovely family. pic.twitter.com/QviCXTK9PO— Kish (@kish_nola) January 20, 2025ఇదిలా ఉండగా.. జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి వాన్స్ భారత సంతతికి చెందినవారు. ఆమెకు తెలుగు మూలాలు కూడా ఉన్నాయి. ఆమె తల్లిదండ్రుల స్వస్థలం ఆంధ్రప్రదేశ్. వారు సుదీర్ఘ కాలం కిందటే ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. దీంతో ఉషా చిలుకూరి అక్కడే జన్మించారు. 1986లో కాలిఫోర్నియాలో జన్మించిన ఉషా చిలుకూరి.. శాన్ డియాగో శివారులో పెరిగారు. ఆమె రాంచో పెనాస్క్విటోస్లోని మౌంట్ కార్మెల్ హైస్కూల్లో విద్యను అభ్యసించారు. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం.. ఆమె యేల్ విశ్వవిద్యాలయం నుంచి హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీని పొందారు.జేడీ వాన్స్తో పరిచయం..2013లో జేడీ వాన్స్ను ఉషా చిలుకూరి కలిశారు. వారు కలిసి సోషల్ డిక్లైన్ ఇన్ వైట్ అమెరికాపై చర్చా సమూహాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య ప్రేమ బంధం ఏర్పడింది. ఆ తర్వాత వారు 2014లో వివాహం చేసుకున్నారు. ఒక హిందూ పూజారి సమక్షంలో నిర్వహించిన వేడుకలో ఇద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. జేమ్స్ డేవిడ్ వాన్స్-ఉషా చిలుకూరి వాన్స్ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు ఇవాన్, వివేక్, మిరాబెల్.Vice President JD Vance and Second Lady Usha joined President Trump and First Lady Melania for an inaugural ball dance. I’m crying 🥹❤️🇺🇸pic.twitter.com/vqLtMpB2sy— Jane Carrot (@JanecheersJazz) January 21, 2025 -
అద్భుతమైన జంట.. జేడీ వాన్స్, ఉషా వాన్స్కు అభినందనలు: ట్రంప్
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్, వైఎస్ ప్రెసిడెంట్గా జేడీ వాన్స్ విజయం దాదాపు ఖాయమైపోయింది. ఈ క్రమంలో ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కౌంటీ కన్వెన్షన్ సెంటర్లో రిపబ్లిక్ పార్టీ మద్దతుదారుల సభలో డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. అమెరికా తమకు అపూర్వమైన, శక్తివంతమైన ఆదేశాన్ని ఇచ్చిందని అన్నారు. తన సహచరుడు జేడీ వాన్స్, భారతీయ అమెరికన్ అయిన జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి వాన్స్పై ప్రశంసలు కురిపించారు.‘‘మొదటగా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జేడీ వాన్స్, ఆయన అద్భుతమైన, అందమైన భార్య ఉషా వాన్స్ను అభినందిస్తున్నా. ఇక నుంచి మిమ్మల్ని ఉపాధ్యక్షుడు అని గర్వంగా పిలువచ్చు. ఈ ఎన్నికల్లో మనం చరిత్ర సృష్టించాం. ఎవరూ సాధ్యం కాదనుకున్న అడ్డంకులను అధిగమించాం. అమెరికా దేశం ఎన్నడూ చూడని రాజకీయ విజయం. నాకు మద్దతు ఇచ్చిన టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలోన్ మస్క్కి కృతజ్ఞతలు’’ అని అన్నారు.ఇక.. ట్రంప్ రన్నింగ్మేట్గా గెలుపు ఖరారు చేసుకున్న జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్.. ఆంధ్రప్రదేశ్లోని వడ్లూరు గ్రామంలో జన్మించిన ఇండో అమెరికన్. జేడీ వాన్స్ గెలుపుతో ఆమె అమెరికాకు రెండవ మహిళ(Second Lady) హోదా దక్కించుకోకున్నారు. ఆమె యేల్ లా స్కూల్లో జేడీ వాన్స్ను మొదటగా కలుసుకున్నారు. ఈ జంట 2014లో వివాహం చేసుకున్నారు. కాగా.. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఉష పేరెంట్స్ రాధాకృష్ణ, లక్ష్మి దంపతులు 1970వ దశకంలో అమెరికాకు వలస వెళ్లారు. శాన్ డియాగోలో ఇంజనీరింగ్, మాలిక్యులర్ బయాలజీ ప్రొఫెసర్లుగా పని చేశారు. గత ఎన్నికల్లో భారతీయ మూలాలున్న కమలా హారిస్ ఉపాధ్యక్షురాలు కాగా.. ఈసారి తెలుగుమూలాలున్న వ్యక్తి భర్త(జేడీ వాన్స్) ఆ పదవిని చేపట్టబోతున్నారు.'Now I Can Say Vice President': Trump hails JD Vance, His wife after 'Political Victory'Watch: https://t.co/Fj7vonSlLl | #USElection2024 #Trump2024 #JDVance #VicePresident #IndianAmerican #UshaVance pic.twitter.com/9DiDFHh1J9— Business Today (@business_today) November 6, 2024Video Credits: Business Todayచదవండి: US Election 2024 నాన్సీ పెలోసీ వరుసగా 20వ సారి గెలుపు, ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ -
ప్రముఖ నటుడు లిఫ్ట్లో నాతో అసభ్యంగా ప్రవర్తించాడు: నటి
మలయాళ సినిమా ఇండస్ట్రీలో మహిళలను దారుణంగా వేధిస్తున్నారని జస్టిస్ హేమ కమిటీ ఓ నివేదికను బయటపెట్టడం సంచలనంగా మారింది. లేడీ ఆర్టిస్టులను అడ్జస్ట్మెంట్ అడుగుతున్నారని పేర్కొంది. ఈ క్రమంలో మలయాళ నటి ఉష తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టింది. 1992లో మోహన్లాల్తో కలిసి సినిమా చేస్తున్న రోజులవి.. టీమ్ అంతా కలిసి బహ్రెయిన్ వెళ్లాం. అక్కడ ఓ షో పూర్తవగానే అందరం తిరుగుప్రయాణానికి రెడీ అయ్యాం. లిఫ్ట్లో నాతో అసభ్యంగా..మోహన్లాల్ మా సామాన్లు తెచ్చేసుకోమని చెప్పాడు. నేను గదిలోని నా సామాను సర్దేసుకుని లిఫ్ట్ ఎక్కాను. అప్పటికే అందులో ఓ సీనియర్ నటుడు ఉన్నాడు. లిఫ్ట్ తలుపులు మూసుకోగానే నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే కోపంతో చెంప చెళ్లుమనిపించాను. మలయాళ చిత్రపరిశ్రమలో అందరూ ఎంతగానో అభిమానించే ఆ నటుడు ఇలా చీప్గా ప్రవర్తిస్తాడని అస్సలు ఊహించలేదు. ఈ మాట మోహన్లాల్కు చెప్తే మంచి పని చేశావన్నాడు.ఛాన్సులు తగ్గిపోయాయి..కానీ అందరూ నాకు పొగరు అని ముద్ర వేశారు. ఈ సంఘటన తర్వాత అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఇప్పుడా పెద్ద మనిషి బతికి లేడు కాబట్టి తన పేరు చెప్పదల్చుకోలేదు. మరి ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నారంటారేమో.. ఈ విషయం నేను గతంలో చెప్పాను. అందుకు సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతుండటంతో మరోసారి చెప్తున్నాను అని ఉష పేర్కొంది.చదవండి: ఎవరికీ తలవంచాల్సిన అవసరం లేదు.. పెదవి విప్పండి: ఖుష్బూ -
ఉషా చిలుకూరి..ఏయూ ప్రొఫెసర్ శాంతమ్మ మనవరాలే..!
అమెరికా ఉపాధ్యక్ష పదవికి రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా జేడీ వాన్స్ పేరు నామినేట్ అవ్వడంతో ఒక్కసారిగా ఆయన భార్య ఉషా చిలుకూరి పేరు మారుమోగిపోయింది. ఆయన భార్య మన తెలుగింటి అమ్మాయి కావడంతో వాన్స్ తెలుగింటి అల్లుడంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. ఒక్కసారిగా భారత మూలాలు ఉన్న ఉషా చిలుకూరి పేరు ప్రాధ్యాన్యత సంతరించుకుంది. పైగా ఆమె భర్త విజయ కోసం భారత్లో ఒక్కసారిగా ఆమె కుటుంబ బలం పెరిగిపోయింది.ఎందుకంటే తెలుగు రాష్టంలో మన అమ్మాయి భర్త పలాన వాళ్లు అంటూ ఆరాలు మొదయ్యిపోయాయి. ఇక ఉషా చిలుకూరికి విశాఖపట్నంలో బంధువులున్నారు. తొమ్మిది పదుల వయసులోనూ ప్రొఫెసర్గా పాఠాలు చెబుతూ ఉత్సాహంగా ఉండే శాంతమ్మ మనవరాలే ఈ ఉష. శాంతమ్మ భర్త చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి. తెలుగు ప్రొఫెసర్గా పనిచేసిన ఆయన కొన్నేళ్ల క్రితం మరణించారు. సుబ్రహ్మణ్యశాస్త్రి సోదరుడు రామశాస్త్రి. ఈయన కుమారుడు రాధాకృష్ణ సంతానమే ఈ ఉష. ఉష భర్త జేడీ వాన్స్ను అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేయడంపై శాంతమ్మ సంతోషం వ్యక్తం చేశారు. ఉష తల్లిదండ్రులు ఎప్పుడో అమెరికాలో స్థిరపడ్డారని, ఆమె అక్కడే పుట్టి పెరగడంతో పరిచయం తక్కువేనన్నారు. వాన్స్ అభ్యర్థిత్వం, మా బంధుత్వం గురించి తెలిశాక పలువురు ఫోన్లో అభినందనలు తెలిపారని చెప్పారు. చెన్నైలో వైద్యురాలిగా ఉన్న ఉష మేనత్త శారద.. వాన్స్, ఉషల వివాహానికి హాజరైనట్లు గుర్తు చేసుకున్నారు. ‘మా బంధువులు అమెరికాలో వివిధ సంస్థల్లో ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నారు. ఉష దంపతులు ఈ స్థాయికి వెళ్లారని తెలియగానే సంతోషంగా, గర్వంగా అనిపించింది. అమెరికా ఉపాధ్యక్షుడి భార్య అయితే ఎక్కువ, లేకపోతే తక్కువ అని కాకుండా నా ఆశీస్సులు వారికి ఎప్పుడూ ఉంటాయి’ అని శాంతమ్మ వివరించారు.ఇక శాతమ్మ ఇంత వయసులోనూ ఓ ప్రైవేటు యూనివర్సిటీలో ఫిజిక్స్ అధ్యాపకురాలిగా పనిచేస్తునే ఉండటం విశేషం. అంతేగాదు ఆమె ఇంటిని కూడా వివేకానంద మెడికల్ ట్రస్ట్కు విరాళంగా ఇచ్చింది. అది ప్రస్తుతం క్లినిక్గా పనిచేస్తుంది. త్వరలో దాన్ని కూడా ఆస్పత్రిగా మార్చనున్నారు. ఆమె 1945లో మహారాజా విక్రమ్ దేవ్ వర్మ నుంచి భౌతికశాస్త్రంలో గోల్డ్ మెడల్ను గెలుచుకుంది. ఆమె అప్పుడు మద్రాసు రాష్ట్రంలోని ఏవీఎన్ కళాశాలలో ఇంటర్మీడియట్ విధ్యార్థిని. ఇక ఆమె బాల్యం దగ్గర కొచ్చేటప్పటికీ..1929 మార్చి 8న మచిలీపట్నంలో జన్మించారు. ఐదు నెలల వయసులోనే తండ్రిని కోల్పోయింది. ఆమె తండ్రి తరఫు మేనమామ వద్ద పెరిగారు. భౌతిక శాస్త్రం ఆమె ఇష్టమైన సబ్జెక్ట్. ఆమె ఏడు దశాబ్దాలుగా ఫిజిక్స్ బోధిస్తూ యువతకు స్ఫూర్తినిస్తుంది. ఆమె 1989లో 60 ఏళ్ల వయసులో పదవీవిరమణ చేశారు. ఆ తర్వాత పరిశోధన వైపు దృష్టిసారించి మళ్లీ ఆంధ్రాయూనివర్సిటీలో గౌరవ అధ్యాపకురాలిగా చేరి ఆరేళ్లు పనిచేశారు. అలా ఆమె తనకు తొమ్మిదపదుల వయసు వచ్చిన బోధనా వృత్తిని మాత్రం వదలలేదు. అంతేగాదు తన తల్లి జాకమ్మ 104 ఏళ్ల వరకు జీవించారని చెబుతారు శాంతమ్మ. "ఆరోగ్యం మన మనస్సులో సంపద మన హృదయంలో" ఉంటుందని చెబుతుంటారామె. తాను తన చివరి శ్వాస వరకు బోధిస్తూనే ఉంటానని ఆత్మవిశ్వాసంగా చెబుతున్నారు శాంతమ్మ. (చదవండి: సాహో... ప్రొఫెసర్ శాంతమ్మ!)(చదవండి: యూకే తొలి మహిళా ఆర్థిక మంత్రిగా రాచెల్ రీవ్స్ ..బడ్జెట్ బాధ్యత ఆమెదే..!) -
ట్రంప్ ఉపాధ్యక్ష అభ్యర్థి ఉషా‘పతి’
ఉషా చిలుకూరి వాన్స్.. తెలుగు పేరులా ఉంది కదా! అవును.. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ కొత్తగా చర్చనీయాంశమైన పేరు. రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేమ్స్ డేవిడ్ వాన్స్ భార్య. కాలిఫోర్ని యాలో పుట్టి పెరిగిన ఆ తెలుగు ఆడబిడ్డ గురించి కొన్ని ముచ్చట్లు.. వాషింగ్టన్: సోమవారం మిల్వాకీలో జరిగిన పార్టీ జాతీయ సదస్సుకు ట్రంప్ హాజరయ్యారు. రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఓహియో సెనేటర్గా ఉన్న జేమ్స్ డేవిడ్ వా న్స్ (జేడీ వాన్స్)ను ప్రకటించారు. ఒకప్పుడు ట్రంప్ విమర్శకుడిగా ఉన్న జేడీ వాన్స్ తరువాత ఆయనకు అనుచరుడిగా మారిపో యారు. ట్రంప్పై హత్యాయ త్నం జరిగిన వెంటనే.. దీని వెనుక అధ్యక్షుడు జో బైడెన్ పాత్ర ఉండొచ్చని మొట్టమొదటగా ట్వీట్ చే సింది కూడా జేడీనే. సోమవారం జరిగిన కన్వెన్షన్లో అభర్థిత్వం ప్రకటించిన త రువా త ప్రసంగించిన ఆయన.. తన ప్రస్థానం వె నుక భార్య ఉషా చిలుకూరి వాన్స్ సహ కా రం ఎంతో ఉందన్నారు. చరిత్ర విద్యార్థిగా.. ఉషా తల్లిదండ్రులు చాలా ఏళ్ల కిందట ఏపీ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. ఆమె 1986 జనవరి 6న కాలిఫోర్నియాలోని శాండియాగోలో జన్మించారు. వృత్తిరీత్యా అడ్వకేట్ అయిన ఉషా.. యేల్ యూనివర్సిటీ నుంచి హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీ చదివారు. ఉష అక్కడి లా జర్నల్కు ఎగ్జిక్యూటివ్ డెవ లప్మెంట్ ఎడిటర్గా, యేల్ జర్నల్ ఆఫ్ లా అండ్ టెక్నాలజీకి మేనేజింగ్ ఎడిటర్గా పనిచేశారు. కేంబ్రిడ్జిలో ఆమె లెఫ్ట్–వింగ్, లి బరల్ గ్రూప్స్తో కలిసి పనిచేశారు. 2014లో వామపక్ష డెమొక్రటిక్ పార్టీలో చేరిన ఉషా.. 2018లో రిపబ్లికన్ పార్టీ సభ్యత్వం తీసుకు న్నారు. 2015–2017 వరకు శాన్ఫ్రాన్సిస్కో వాషింగ్టన్ డీసీలోని వివిధ సంస్థల్లో పని చేశారు. యేల్ వర్సిటీలో చదువుతుండగానే ఉషకు జేడీ వాన్స్ పరిచయం. ఇద్దరూ కలిసి పలు ప్రాజెక్టుల్లో పనిచేశారు. ఈ అనుబంధం ప్రేమగా మారి.. వారిద్దరూ 2014లో కెంటకీలో పెళ్లి చేసుకున్నారు. ఓ పక్క న్యాయ వాదిగా తన విధులు నిర్వహిస్తూనే భర్త రాజకీయ ప్రయాణంలో అండగా ఉన్నారు. జేడీ వాన్స్, ఉష దంపతులకు ఇద్దరు కొడుకులు వివాన్, వివేక్, కూతురు మిరాబెల్ ఉన్నారు. వారిని హిందూ, క్రిస్టియన్ రెండు మత విశ్వాసాలతో పిల్లలను పెంచుతున్నారు. -
అమెరికా రిపబ్లికన్ ఉపాధ్యక్షుడిగా ఆంధ్రా అల్లుడు వెన్స్..
-
రోబోటిక్స్ విజేత
‘‘రోబోటిక్స్ రంగంలో బాలురు మాత్రమే రాణిస్తారని ఒకప్పుడు అనుకున్నాను. అది కేవలం అపోహ మాత్రమే. బాలికలు కూడా రాణించగలుగుతారని, బాలురకంటే మెరుగైన ఫలితాలను సాధించగలరని నిరూపించాను’’ అన్నది ఉషా కుమావత్. పదిహేనేళ్ల ఉషా కుమావత్.గోవా, పంజిమ్ పట్టణంలో పదవ తరగతి చదువుతున్న ఉష గత మార్చి నెలలో దుబాయ్లో జరిగిన ఇంటర్నేషనల్ కోవెడర్ 5.0 ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ రోబో సిటీ చాలెంజ్లో విజేతగా నిలిచింది. యునైటెడ్ నేషన్స్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ కాన్సెప్ట్లో భాగంగా నిర్వహించిన పోటీల్లో అరవై దేశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో స్టెల్లార్ కంట్రోల్ స్కిల్స్లో ఉష ప్రతిభ కనబరిచింది. తన విజయాన్ని తన టీచర్ మాయా కామత్కి అంకితమిచ్చింది ఉషా కుమావత్. వీడియోగేమ్ కూడా తెలియదు ‘‘మా సొంతూరు రాజస్థాన్లోని గుహాలా గ్రామం. నేను పుట్టింది పెరిగింది గోవాలోనే. నాన్న భవన నిర్మాణరంగంలో టైల్స్ అమర్చే పని చేస్తాడు. అమ్మ గృహిణి. కంప్యూటర్ను దూరం నుంచి చూడడమే కానీ కనీసం తాకిన సందర్భం కూడా లేదు. అలాంటి నన్ను మా టీచర్ మాయా కామత్ ఒక రోబోటిక్స్ వర్క్ షాప్కి తీసుకెళ్లారు. నాకు చాలా ఆసక్తి కలిగింది. ఎన్నో సందేహాలు కలిగాయి. అవన్నీ టీచర్ని అడుగుతూ ఉంటే ఆమె కూడా చాలా ఇష్టంగా వివరించేవారు.కోడింగ్ కూడా నేర్పించారు. నాకు వీడియో గేమ్ ఆడిన అనుభవం కూడా లేదు. అలాంటిది రోబోటిక్స్లో నైపుణ్యం సాధించగలిగానంటే అంతా మా టీచర్ప్రోత్సాహమే. దుబాయ్లో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి ముందు గురుగ్రామ్లో జాతీయస్థాయి పోటీలకు తీసుకెళ్లారు. పోటీల వేదిక మీద రోబోను ఆపరేట్ చేయడం కొంత బెరుగ్గా అనిపించినప్పటికీ నా ప్రతిభను ప్రదర్శించగలిగాను. ఆ పోటీల్లోనే అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యాను.ఆ పోటీల్లో రాణించాలంటే ఇంకా చాలా బాగా సాధన చేయాలని నాకే అర్థమైంది. ఎక్కువ రోజుల్లేవు. నా రోబో పేరు క్వార్కీ. దాంతో ఐదు నిమిషాల సమయంలో మ్యాచింగ్ కలర్స్, జడ్జింగ్ డైరెక్షన్స్, నావిగేటింగ్, సెగ్రెగేటింగ్ వంటి పదకొండు పనులు చేయించి నిరూపించాలి నేను. రోజూ టైమ్ పెట్టుకుని సాధన చేస్తూ ఒక రోజుకంటే మరో రోజు ఇంకా తక్కువ సమయంలో పూర్తి చేస్తూ మొత్తానికి లక్ష్యాన్ని సాధించగలిగాను’’ అని వివరించింది ఉషా కుమావత్. పేరు మారింది ఇదిలా ఉండగా... ఉషకు రోబోటిక్స్లో శిక్షణ ఇవ్వడం కంటే దుబాయ్ వెళ్లడానికి పాస్పోర్టు కోసం పడిన కష్టాలే పెద్దవన్నారు ఉష టీచర్ మాయా కామత్. ‘‘పాస్పోర్టు కోసం దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలను చూస్తే ఒకదానితో మరొకటి సరిపోలడం లేదు. స్కూల్ రికార్డ్స్లో ఉషా కుమావత్ అని ఉంది, బర్త్ సర్టిఫికేట్లో ఉషా కుమారి అని ఉంది. బర్త్ సర్టిఫికేట్ను సరిచేయమని కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేయాల్సి వచ్చింది. ఉష తల్లిదండ్రుల మ్యారేజ్ సర్టిఫికేట్ లేదు. వారి పెళ్లి రాజస్థాన్లోని వాళ్ల సొంతూరులో జరిగింది. ఆ సర్టిఫికేట్ కుదరదని పాన్ కార్డు కోసం అప్లయ్ చేశాం.పాన్ కార్డు రావాలంటే ముందు ఆధార్ కార్డులో పేరు సరి చేసుకోవాల్సి వచ్చింది. ఇన్ని ప్రయాసల తర్వాత పాస్పోర్టు జారీ అయింది. కానీ ప్రయాణఖర్చులు ప్రశ్నార్థకమయ్యాయి. గోవాలోని పెద్ద వ్యాపార కంపెనీలను అభ్యర్థించి మొత్తానికి అవసరానికి తగిన డబ్బు సమకూర్చగలిగాను. దుబాయ్ వరకు తీసుకెళ్లిన తర్వాత అక్కడ చక్కటి ప్రతిభ ప్రదర్శించి మనదేశానికి గౌరవం తెచ్చింది. ఉష లాగా నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులు ఉంటే నేర్పించి వారిని విజేతలుగా తీర్చిదిద్దడానికి మాలాంటి టీచర్లు సిద్ధంగా ఉంటారు. మా విజయం మా విద్యార్థులే’’ అన్నారు మాయా కామత్. -
ఎన్నికల ఫలితాలపై ఉష శ్రీ చరణ్ కీలక వ్యాఖ్యలు
-
ఈ పేదింటి బంగారం.. ఓ అద్భుతం!
అరవై దేశాల విద్యార్థులుపాల్గొనే అంతర్జాతీయ పోటీ అది. గోవా దాటని ఉష తొలిసారిగా దుబాయ్కు వెళ్లడానికి రెడీ అవుతోంది. వెళ్లడానికి ముందు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా రకరకాల అడ్డంకులు ఎదురయ్యాయి. ‘సాధించాలని బలంగా అనుకుంటే కచ్చితంగా సాధిస్తాం’ అనే మాటను తారకమంత్రంలా జపించిన పదిహేను సంవత్సరాల ఉష దుబాయ్లో జరిగిన ‘కోడేవర్ 5.వో ఏఐ రోబో సిటీ చాలెంజ్’లో కప్పు గెలుచుకుంది.కొన్ని రోజుల క్రితం..పనాజీ(గోవా)లోని ప్రోగ్రెస్ హైస్కూల్లో రోబో సందడి నెలకొంది. ఒక్క మాటలో చెప్పాలంటే స్కూలు పిల్లలు తమ ప్రపంచం వదిలి రోబో ప్రపంచంలోకి వెళ్లారు. రోబోటిక్స్ పోటీ అయిన ‘కోడేవర్ 5.వో ఏఐ రోబో సిటీ చాలెంజ్’ తాలూకు సందడి అది. ఆ స్కూల్ స్టూడెంట్ ఉషను ఇంటర్నేషనల్ రౌండ్కు చేర్చడానికి టీచర్ మాయా కామత్ బాగా శ్రమించింది.దుబాయ్లో జరగబోయే అంతర్జాతీయ పోటీని సవాలుగా తీసుకుంది మాయా కామత్. ‘ఎన్నో దేశాలుపాల్గొనే ఈ పోటీలో మనం ఎక్కడ! అక్కడి దాకా వెళితే అదే పదివేలు’ ఇలాంటి మాటలను ఆమె పట్టించుకోలేదు. ఎలాగైనా బంగారు కప్పు గెలుచుకోవాలనే పట్టుదలతో పనిచేసింది.గోవాలో జరిగిన రీజనల్ రౌండ్ కోసం ముగ్గురు స్టూడెంట్స్ను ఎంపిక చేసింది మాయ. అందులో ఉషతోపాటు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. అయితే మొదట్లో కనిపించిన ఉత్సాహం ఉషలో ఆ తరువాత కనిపించలేదు. ఆత్మవిశ్వాసం తగ్గింది. ఇలాంటి సమయంలోనే మాయ ఉషలో ధైర్యం నింపి ముందుకు నడిపించింది. ఆ ధైర్యమంత్రం ఫలించి గురుగ్రామ్లో జరిగిన నేషనల్ రౌండ్లో ఉష అద్భుత పనితీరు ప్రదర్శించింది. రోబోను బాగా హ్యాండిల్ చేసింది. ఆ తరువాత దుబాయ్లో జరగబోయే ఇంటర్నేషనల్ రౌండ్కు ఎంపికైంది.నేషనల్ రౌండ్లో సాధించిన విజయం ఉషకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చింది. భయాలను ఎదుర్కొనేలా చేసింది. ఎట్టకేలకు మాయ కామత్ కలను ఉష సాకారం చేసింది. ప్రతిష్ఠాత్మకమైన ఈ అంతర్జాతీయ పోటీలో ఉష కప్పును గెలుచుకుంది. ఉష తల్లిదండ్రులు పెద్దగా చదువుకోలేదు. రోబో సిటీ చాలెంజ్ రూపంలో తన ప్రతిభను ప్రదర్శించే అరుదైన అవకాశం ఉషకు లభించింది. ఉష సాధించిన విజయం తల్లిదండ్రులను ఆనందంలో ముంచెత్తింది. ‘సాధించాలని గట్టిగా అనుకున్నాను. సాధించాను’ నవ్వుతూ అంటుంది ఉష.ఛాంపియన్స్ చేంజ్మేకర్..‘క్వార్కీ’ అనే రోబోట్ను స్టూడెంట్స్తో కలిసి తయారు చేసింది మాయా కామత్. నిర్ణీత సమయంలో రకరకాల పనులు చేసేలా ఈ ‘క్వార్కీ’ని రూపొందించారు. పోటీలో ‘క్వార్కీ’ అయిదు నిమిషాల్లో 11 టాస్క్లను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతిరోజు రెండు గంటలు ప్రాక్టిస్ చేసేది ఉష. రంగులను సరిపోల్చడం, దిశలను అంచనా వేయడం, అడ్డంకులను అధిగమించడం, వస్తువులను వేరు చేయడంలాంటి ‘క్వార్కీ’ నైపుణ్యాలను ఉష అద్భుతంగా ఆపరేట్ చేసింది.‘నేను చెప్పే సలహాలను శ్రద్ధగా విని అందుకు అనుగుణంగా ఉష ప్రాక్టిస్ చేసేది. నేర్చుకోవాలనే తపన ఆమె విజయానికి కారణం. విజయం సాధిస్తామనే గట్టి నమ్మకం ఉన్నప్పటికీ మాకు ఎదురైన అతి పెద్ద సవాలు దుబాయ్ పర్యటనకు నిధులు సమకూర్చుకోవడం. విజయం సంగతి ఎలా ఉన్నా అసలు దుబాయ్కు వెళ్లగలమా అనే సందేహాం వచ్చింది.ఈ పరిస్థితులలో ప్రోగ్రామింగ్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చే సయేష్ గాంధీ అనే టీచర్ క్రౌడ్ఫండింగ్కు సంబంధించి సలహా ఇచ్చారు. ఉష కుటుంబ నేపథ్యం, రోబోటిక్స్ పట్ల ఆమెకు ఉన్న ఆసక్తి, అంతర్జాతీయ పోటీలోపాల్గొనాలనే ఆమె కల, ఆర్థిక ఇబ్బందులు...మొదలైన వాటి గురించి వీడియో చేయాల్సిందిగా సలహా ఇచ్చారు. ఈ వీడియోకు మంచి స్పందన వచ్చింది’ అంటుంది మాయా కామత్. ఉష విజయం ఒక సంతోషం అయితే ఆమె గురువు మాయా కామత్ ‘చాంపియన్స్ చేంజ్మేకర్’ అవార్డ్ అందుకోవడం మరో సంతోషం.ఇవి చదవండి: పారిశ్రామికవేత్తలుగా.. యువకెరటాలు! -
Inedible Ink: తొమ్మిదేళ్లయినా చెరగని సిరా గుర్తు!
ఓటేసినప్పుడు వేలిపై పెట్టే ఇంకు గుర్తు ఎన్ని రోజులుంటుంది? వారం. నెల. మహా అయితే రెండు మూడు నెలలు. కానీ కేరళకు చెందిన ఉష అనే ఓటరును మాత్రం తొమ్మిదేళ్లయినా సిరా గుర్తు వదలడం లేదు. ఆమెకు ఇదో పెద్ద తలనొప్పిగా కూడా మారింది! షోరన్పూర్లోని గురువాయూరప్పన్ నగర్లో ఉండే 62 ఏళ్ల ఉష 2016లో ఓటేసింది. ఆ సందర్భంగా వేలిపై వేసిన ఇంకు గుర్తు 9 ఏళ్లయినా మాసిపోలేదు. అనేక రకాల సబ్బులు, ద్రావణాలతో కడిగినా లాభం లేకపోయింది. ఆ తర్వాతి స్థానిక ఎన్నికల్లో ఓటేయడానికి వెళ్తే వేలిపై గుర్తు చూసి ‘నువ్విప్పటికే ఓటేశావు పొ’మ్మన్నారట ఎన్నికల అధికారులు! పోలింగ్ బూత్లోని ఏజెంట్లు అసలు విషయం చెప్పడంతో చివరికి ఓటేయడానికి అనుమతించారు. పోలింగ్ బూత్ల్లో ఎందుకీ గోల అని 2019 లోక్సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఉష ఓటే వేయలేదు! ఈసారీ అదే సమస్య ఎదురవుతుందేమోనని భయపడుతున్నారు.ప్రచారానికి వచ్చిన ఓ నాయకునికి విషయం చెప్పడంతో ఆయన ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను పరిష్కరిస్తామని వాళ్లు హామీ ఇచ్చారట. ఎన్నికల సిరా గుర్తు ఇంతకాలం పాటు చెరగకుండా ఉన్న ఘటనలు ఎక్కడా లేవని వారు విస్తుపోతున్నారు! అయితే ఇలా జరిగేందుకు అవకాశం ఉందని చర్మవ్యాధి నిపుణులు అంటున్నారు. ‘‘సిరా చుక్క గోళ్ల కింద చేరితే మచ్చ అలాగే ఉండే చాన్సుంది. సమగ్ర వైద్య పరీక్షలు చేస్తే కారణం తెలుస్తుంది’’ అని చెబుతున్నారు. -
Usha Mehta: వెండి తెర మీద రహస్య రేడియో
సినిమాలు పాత కథలను తవ్వి పోస్తున్నాయి. చరిత్ర గతిని వెండి తెర మీద పునఃసృష్టిస్తున్నాయి. స్వాతంత్య్ర పోరాటంలో ఎన్నో ఘట్టాలు. ఎందరో త్యాగమూర్తులు. కాని పురుషుల బయోపిక్లు వచ్చినట్టుగా స్త్రీలవి రాలేదు. తాజాగా విడుదలైన ‘అయ్ వతన్ మేరే వతన్’ సినిమా నాటి వీర వనిత ఉషా మెహతా జీవితాన్ని చూపింది. బ్రిటిష్కు వ్యతిరేకంగా సీక్రెట్ రేడియో నడిపిన ఉషా మెహతా ఎవరు? ‘దిసీజ్ కాంగ్రెస్ రేడియో కాలింగ్ ఆన్ 42.34 మీటర్స్ సమ్వేర్ ఇన్ ఇండియా’... ఈ అనౌన్స్మెంట్ బ్రిటిష్ వారిని గడగడలాడించింది. మునికాళ్ల మీద పరిగెత్తిచ్చింది. ఒక బుల్లి రహస్య రేడియో స్టేషన్ని, దాని నిర్వాహకులను అరెస్ట్ చేయడానికి పిచ్చెక్కినట్టు తిరిగేలా చేసింది. మూడు నెలల పాటు బ్రిటిష్వారిని ముప్పుతిప్పలు పెట్టిన ఆ రేడియో నిర్వాహకురాలి పేరు ఉషా మెహతా. గాంధీ పిలుపు విని... ఉషా మెహతా గుజరాత్లోని సూరత్ సమీపంలో ఉన్న సారస్ అనే ఊళ్లో 1920లో జన్మించింది. ఐదేళ్ల వయసులో గాంధీజీని అహ్మదాబాద్లో చూసింది. 8 ఏళ్ల వయసులో వాళ్ల ఊరి దగ్గర గాంధీజీ చరఖా కార్యక్రమం నిర్వహిస్తే ఉషా పాల్గొని కొద్దిసేపు చరఖా తిప్పింది. బాల్యంలోనే గాంధీజీ మీద గొప్ప భక్తి పెంచుకున్న ఉషా 12 ఏళ్ల వయసులో తండ్రి వృత్తిరీత్యా బొంబాయికి మారడంతో తన దేశభక్తిని చాటుకునే అవకాశం పొందింది. డూ ఆర్ డై 1942 ఆగస్టు 8న బొంబాయిలో గాంధీజీ క్విట్ ఇండియా పిలుపునిచ్చారు. ‘డూ ఆర్ డై’ లేదా ‘కరో యా మరో’ నినాదాలు మిన్నంటాయి. ‘ఇక భారత ప్రజలు నాయకుల కోసం ఎదురు చూడొద్దు. ప్రజలే నాయకులు’ అని గాంధీజీ పిలుపునిచ్చారు. 22 ఏళ్ల ఉషా మెహతా తన స్నేహితులైన విఠల్ దాస్ ఖాకడ్, చంద్రకాంత్ ఝావేరీ, బాబూభాయ్ ఠక్కర్లతో కలిసి ఆ మీటింగ్కు వెళ్లింది. ఉత్తేజితురాలైంది. అప్పటికే స్వతంత్రోద్యమ వార్తల మీద బ్రిటిష్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఉద్యమం ఉధృతం కావాలంటే రేడియో మాధ్యమం ద్వారా వార్తలు అందించాల్సిన అవసరం ఉందని ఉషా మెహతా తన స్నేహితులతో చెప్పింది. దేశం కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడాలని పిలుపునిచ్చింది. రహస్య కాంగ్రెస్ రేడియో బ్రిటిష్ ప్రభుత్వంలో జడ్జిగా పని చేస్తున్న తండ్రి నివారించినా వినకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిన ఉషా బొంబాయిలో షికాగో రేడియో ట్రాన్స్మిషన్ను చూస్తున్న మరో మిత్రుడు మోత్వాని సహాయంతో సొంత ట్రాన్స్మిటర్ను సంపాదించింది. మిత్రులతో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకుని రేడియో స్టేషన్గా మలిచింది. ఆగస్టు 27, 1942న మొదటి చరిత్రాత్మక ప్రసారాన్ని సొంత గొంతుతో చేసింది. ‘దిసీజ్ కాంగ్రెస్ రేడియో 42.34 మీటర్స్ సమ్వేర్ ఇన్ ఇండియా’... అంటూ స్వాతంత్రోద్యమ వార్తలు వినిపించింది. ఆ క్షణం నుంచి ఆ రహస్య రేడియో కోసం బ్రిటిష్ అధికారులు, పోలీసులు కంటి మీద కునుకు లేకుండా వెతకసాగారు. ప్రసారాలు బొంబాయి నుంచే నిర్వహిస్తున్నా దేశంలో ఎక్కడి నుంచి అవుతున్నాయో తెలియక గింజుకున్నారు. మూడు నెలలు రహస్య రేడియో ప్రసారాలు మూడు నెలలు సాగాయి. కాని పరికరాలు సమకూర్చిన మోత్వాని లొంగిపోయి రేడియో స్టేషన్ చిరునామా చెప్పేశాడు. నవంబర్ 12, 1942న పోలీసులు దాడి చేసి ఉషా మెహతాను అరెస్ట్ చేశారు. ఆరు నెలల పాటు ఆమెను ఇంటరాగేట్ చేశారు. 4 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఉషా ఏ మాత్రం జంకలేదు. 1946 నాటి మధ్యంతర ప్రభుత్వ హయాంలో మురార్జీ దేశాయ్ హోమ్ మినస్టర్గా ఉండగా ఆమె విడుదల జరిగింది. కాని జైలు జీవితం ఆమె ఆరోగ్యాన్ని బాగా దెబ్బ తీసింది. బయటకు వచ్చాక ఆమె చదువు కొనసాగించి ముంబై యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసి 1980లో రిటైర్ అయ్యింది. గాంధీజీ భావజాలాన్ని ప్రచారం చేస్తూ 2000 సంవత్సరంలో తుది శ్వాస విడిచింది. ఉషా మెహతా జీవితం ఆధారంగా నిర్మించిన బయోపిక్ ‘అయ్ వతన్ మేరే వతన్’ అమేజాన్లో మార్చి 21న విడుదలైంది. -
Maddali Usha Gayathri: నృత్య తపస్వి
ఆమె ప్రయాణం నాట్యం. ఆమె ప్రయత్నం నాట్యకళకు జీవం పోయడం. నాలుగేళ్ల వయసు నుంచి కూచిపూడిని జీవనాడిగా చేసుకుని., 69 ఏళ్ల వయసులోనూ కళను వీడలేదు హైదరాబాద్ వాసి మద్దాలి ఉషాగాయత్రి. సుదీర్ఘ నృత్య ప్రయాణంలో భారత్తోపాటు దేశ విదేశాల్లో ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. వందల మంది ఔత్సాహికులు కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇవ్వడమే కాకుండా 200కు పైగా నృత్యాంశాలకు సోలోగా కొరియోగ్రఫీ చేశారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలికి బ్యాలే చేసి, కేంద్ర ప్రభుత్వ అవార్డులు పొందారు. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రతిష్టాత్మక కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్న డా. ఉషా గాయత్రి నృత్య ప్రయాణం తెలుసుకుంటే ఈ కళాసేవ ఒక తపస్సులా అనిపించకమానదు. ‘‘కూచిపూడి నృత్యానికి సంబంధించిన సాహిత్యం, రచనలు చాలా తక్కువగా ఉన్నాయి. దీనికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పుస్తకాలుగా తీసుకురావాలనేది నా చిరకాల స్వప్నం. దానిని నిజం చేయాలనే ప్రయత్నంలో ఉన్నాను’’ అని తనను తాను పరిచయం చేసుకున్న తపస్వి ఉషాగాయత్రి తన నృత్య జీవన గమ్యాన్ని ఇలా మనముందుంచారు. ‘‘నాలుగేళ్ల వయసులో ఉదయ్ శంకర్ శిష్యుడైన దయాల్ శరణ్ వద్ద నాట్యాభ్యాసం మొదలుపెట్టాను. ఇక్కడే కథక్, ఒడిస్సీ, సంగీతం కూడా నేర్చుకున్నాను. ఆ తర్వాత ప్రఖ్యాత గురువు వేదాంతం జగన్నాథ శర్మ వద్ద కూచిపూడి, పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ, పద్మభూషణ్ డా.వెంపటి చినసత్యం, వేదాంతం ప్రహ్లాద శర్మ వద్ద యక్షగానాలు, ప్రఖ్యాత కళాక్షేత్ర గురువు కమలారాణి వద్ద నట్టువాంగం, పద్మశ్రీ డా.నటరాజ రామకృష్ణ వద్ద పదములు నేర్చుకున్నాను. 1988లో హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో ఎం.ఏ. పూర్తయ్యింది. అంతేకాకుండా ‘తెలుగు సాహిత్యంలో సత్యభామ పాత్ర వృద్ధి, వికాసం, నాట్యంలో అవతరణ‘ అనే అంశం మీద పరిశోధన చేసి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ పొందాను. రాజీవ్గాంధీ విశ్వవిద్యాలయంలోని నృత్య విభాగంలోనూ పనిచేశాను. ఆ తర్వాత దాదాపు పాతిక సంవత్సరాలు పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉద్యోగం చేశాను. నాట్యానికే అంకితం అవ్వాలనే తపనతో ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. ‘నృత్యకిన్నెర‘ పేరుతో ఏర్పాటు చేసిన సంస్థ ఆధ్వర్యంలో వందల మందికి శిక్షణనిస్తూ వచ్చాను. ఇందులో 50 మంది శిష్యులు నృత్యంలో డిప్లొమా సర్టిఫికెట్లు పొందారు. 10 మంది చిన్నారులు భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీసీఆర్టీ స్కాలర్షిప్ పొందారు. నా శిష్యులు దేశవిదేశాల్లో స్థిరపడటమే కాకుండా నృత్యంలో పీహెచ్డీ, ఎం.ఏ. పట్టాలు పొంది గురువులు, నర్తకులుగా అభివృద్ధి చెందారని చెప్పుకోవడం ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. పాదం కదపని వేదిక లేదు సంగీత నాటక అకాడమీ, సౌత్ జోన్ కల్చరల్ సెంటర్, టీటీడీ, రాష్ట్ర సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో ఎన్నో వందల ప్రదర్శనలు. దేశంలోని న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లోనే కాకుండా విదేశాల్లోనూ ప్రదర్శనలు ఇచ్చాను. భారత స్వాతంత్య్ర దినోత్సవ నేపథ్యంలో 1997లో మారిషస్లో ఇచ్చిన ప్రదర్శనకుగాను ఆనాటి ప్రెసిడెంట్ సత్కరించడం ఒక గొప్ప జ్ఞాపకం. ప్రదర్శనల కోసం శిష్యులతోపాటు యూకే, యూరోప్లలో పర్యటించాను. యూకేటీఏ, జయతే కూచిపూడి, అంతర్జాతీయ కూచిపూడి ఫెస్టివల్లో భాగంగా ప్రదర్శనలు ఇవ్వడం మరో గొప్ప అనుభూతి. ప్రధానంగా దాదాపు 200 లకు పైగా సోలో నృత్యాంశాలకు కొరియోగ్రఫి చేయడంతో పాటు ప్రతిష్టాత్మకమైన 16 బ్యాలేలు చేశాను. ఇందులో భాగంగా రచయిత ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ చారిత్రక నవల శివభక్త మార్కండేయ, మా తెలుగుతల్లికి మల్లెపూదండ, స్వర్ణోత్సవ భారతి, వందేమాతరం, సంక్రాంతి లక్ష్మి, రుక్మిణీ సత్య, అలిమేలుమంగ చరిత్ర, యశోదకృష్ణ వంటి బ్యాలేలు ప్రదర్శించాను. రవీంద్రుని గీతాంజలి మాట నిజమైన వేళ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గీతాంజలికి బ్యాలే చేయడం నా అదృష్టంగా భావిస్తాను. కలకత్తా వేదికగా ఈ ప్రదర్శన చేసిన సమయంలో ఒక విషయం నన్ను అమితమైన ఆనందానికి లోను చేసింది. ‘ఏదో ఒకనాడు, ఎవరో ఒకరు నా సాహిత్యానికి నృత్య రూపాన్ని తీసుకువస్తారు’ అని ఆనాడే రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన మాటలను అక్కడి వారు ప్రస్తావించడం మాటల్లో చెప్పలేనంత సంతోషాన్ని, సంతృప్తినిచ్చింది. కావ్యాలకు, కథనాలకు, నృత్యానికి ఎంతటి అనుబంధం ఉంటుందో ఆ సంఘటన రుజువు చేసింది. 12 గంటలు 12 మంది శిష్యులు నృత్యం దర్శయామిలో భాగంగా 72 సోలో నృత్యాంశాలైన శబ్దాలు, తరంగములు, దరువులు, తిల్లానాలు, అష్టపదులు, కీర్తనలు.. తదితర అంశాలతో 12 మంది శిష్యురాళ్లతో కలిసి 12గంటల పాటు అవిరామంగా నృత్యప్రదర్శన చేశాం. 12గంటల పాటు నిరంతరాయంగా నట్టువాంగం నిర్వహించి దానిని గురువు వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రికి అంకితం చేశాం. చేసిన సోలో ప్రదర్శనలు, బ్యాలేలు న్యూ ఢిల్లీ దూరదర్శన్ తో పాటు విదేశీ ఛానళ్లలోనూ ప్రసారమయ్యాయి. ఎంతో ప్రోత్సాహం.. ఈ నృత్య ప్రయాణంలో నా జీవిత భాగస్వామి మద్దాళి రఘురామ్ ప్రోత్సాహం ఎనలేనిది. ఎన్నో పురస్కారాలు, సత్కారాలు అందుకున్నాను. వాటిలో .. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో 2001లో అత్యంత ప్రతిష్టాత్మకమైన రాష్ట్రీయ అవార్డు ‘హంస పురస్కారాన్ని’, 2004లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ప్రతిభా పురస్కారం, యూరప్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ నర్తకిగా, న్యూయార్క్లో ఉత్తమ నాట్యగురువుగా, సిలికాన్ ఆంధ్ర అంతర్జాతీయ కూచిపూడి కన్వెన్షన్ లో ఆనాటి ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు, మారిషస్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా అవార్డులను అందుకున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నృత్యరత్న బిరుదుతోపాటు, ఉత్తమ నర్తకి–నాట్యగురు అవార్డులను పొందాను. 1984లో ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (న్యూ ఢిల్లీ) ఆధ్వర్యంలో ఉత్తమ కళాకారిణిగానూ, భారత్తో పాటు విదేశాల్లో నిర్వహించిన పలు అంతర్జాతీయ కూచిపూడి నృత్యోత్సవాలకు న్యాయనిర్ణేతగా సేవలందించాను. గత డిసెంబర్లో స్ట్రోక్ వచ్చి వీల్చెయిర్లో ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. అయినా నా కళా తపన ఆగలేదు. వీల్ చెయిర్ నుంచే విద్యార్థులకు కూచిపూడి నృత్యంలో శిక్షణను అందిస్తున్నాను. ఈ నెల 6న రాష్ట్రపతి చేతుల మీదుగా కేంద్ర సంగీత నాటక పురస్కారాన్ని వీల్చెయిర్లో ఉండే అందుకున్నాను. నా శ్వాస ఉన్నంతవరకు కళాసేవలో తరించాలని, కళలో ఔత్సాహికులను నిష్ణాతులను చేయాలన్నదే నా తపన’ అంటూ ఉషాగాయత్రి తన సుదీర్ఘ నృత్య ప్రయాణాన్ని ఎంతో ఆనందంగా మన ముందు ఆవిష్కరించారు. – హనుమాద్రి శ్రీకాంత్, సాక్షి సిటీ, హైదరాబాద్ -
సాగుబడి: ఆంధ్రా వర్సిటీలో ఆర్గానిక్ పంటలు!
'నగరవాసులకు ఆరోగ్యదాయకమైన సేంద్రియ ఇంటిపంటలను, ప్రకృతి వ్యవసాయ పాఠాలు నేర్పించడానికి విశాఖ నగరంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. రైతు ఉత్పత్తిదారుల సంస్థతో కలిసి యూనివర్సిటీ ఆవరణలో అర్బన్ గార్డెనింగ్ హబ్ను ఏర్పాటు చేసింది. అనేక రకాల ఆకుకూరలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో నగరంలోనే పండించి తాజాగా నగరవాసులకు అందిస్తోంది. నగరంలో పుట్టి పెరిగే విద్యార్థులకు మట్టి వాసనను పరిచయం చేయటం.. సేంద్రియ ఇంటిపంటల సాగు పనులను చేస్తూ నేర్చుకునే వినూత్న అవకాశాన్ని నగరవాసులకు కల్పించటం ప్రశంసనీయం. ఈ సామాజిక కార్యక్రమంలో కీలకపాత్ర పోషిస్తున్న ‘ఎయు– అవని ఆర్గానిక్స్ అర్బన్ గార్డెనింగ్ హబ్’ నిర్వాహకులు ఉషా రాజు, హిమబిందు కృషిపై అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా ప్రత్యేక కథనం'. పదిహేనేళ్లుగా సేంద్రియ టెర్రస్ కిచెన్ గార్డెనింగ్, ప్రకృతి వ్యవసాయంలో అనుభవం ఉన్న పౌష్టికాహార నిపుణురాలు ఉషా రాజు, హిమబిందు ఆంధ్రా యూనివర్సిటీతో కలసి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. మన మన్యం రైతు ఉత్పత్తిదారుల సంస్థ నిర్వాహకులు కూడా అయిన వీరు విశాఖపట్నం నగరం మధ్యలోని ఆంధ్రా యూనివర్సిటీ ఆవరణలోనే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ప్రజలకు ప్రకృతితో కలసి జీవించడం నేర్పుతున్నారు. వాలంటీర్లు పాల్గొనేందుకు అవకాశం ఇస్తూ అర్బన్ కమ్యూనిటీ ఫార్మింగ్ని ఆచరించి చూపుతున్నారు. నగర వాసులు తమ ఇంటిపైన కూడా ఆరోగ్యదాయకమైన సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారు. గత ఏడాది నవంబర్లో ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డిని కలిసి వర్సిటీలో అర్బన్ గార్డెనింగ్ హబ్కు అనువైన స్థలం కేటాయించాలని ఉషా రాజు, హిమబిందు కోరారు. ప్రజలకు ఆరోగ్యదాయకమైన ఆకుకూరలు అందుబాటులోకి రావటంతో పాటు ప్రకృతి సేద్యంపై అవగాహన కలుగుతుందన్న ఆశయంతో ఆయన అందుకు అంగీకరించారు. వృక్షశాస్త్రం, ఫుట్ టెక్నాలజీ, ఫార్మసీ విద్యార్థులను ఈ అర్బన్ సాగులో భాగస్వాముల్ని చేయాలని వీసీ సూచించారు. ఆకుకూరలను నగరంలోనే పండిస్తున్నాం..! మా ‘మన మన్యం ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్’ రైతు ఉత్పత్తిదారుల కంపెనీలో 4 జిల్లాలకు చెందిన 120 మంది రైతులు సభ్యులు. ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యం, పప్పులు తదితర ఉత్పత్తులను ‘అవని ఆర్గానిక్స్’ పేరుతో విశాఖ నగరంలోని 4 రైతుబజార్లలోని మాకు కేటాయించిన స్టోర్ల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాం. అయితే, ఆకుకూరలను నగరానికి దూరంగా పొలాల్లో పండించి ఇక్కడికి తెచ్చి వినియోగదారులకు అందించేటప్పటికి కనీసం 25% పోషకాలు నష్టం జరుగుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి తాజా ఆకుకూరలను నగరంలోనే ప్రకృతి వ్యవసాయంలో పండించి వినియోగదారులకు అందించాలని తలచాం. మా ఆలోచననుప్రోత్సహించిన ఆంధ్రా యూనివర్సిటీ సహకారంతో 80 సెంట్ల ఖాళీ స్థలంలో అనేక రకాల సాధారణ ఆకుకూరలతో పాటు కలే, లెట్యూస్, బాక్చాయ్ వంటి విదేశీ ఆకుకూరలను, కనుమరుగైన కొన్ని రకాల పాతకాలపు ఆకుకూరలను సైతం పండించి, ప్రజలకు తాజాగా విక్రయిస్తున్నాం. స్థలంతోపాటు నీటిని యూనివర్సిటీ ఇచ్చింది. వైర్ ఫెన్సింగ్, డ్రిప్లు, సిబ్బంది జీతాలను మా ఎఫ్.పి.ఓ. సమకూర్చుతోంది. నగరంలో పుట్టి పెరిగే పాఠశాల విద్యార్థులకు, నగరవాసులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఇంటిపంటల సాగును నేర్పించాలన్నది మా లక్ష్యం. వాలంటీర్లు ఎవరైనా ప్రతి రోజూ ఉదయం 7–9 గంటల మధ్యలో నగరం మధ్యలో ఉన్న ఆంధ్రా యూనివర్సిటీకి వచ్చి గార్డెనింగ్ పనులను చేస్తూ నేర్చుకోవచ్చు. నచ్చిన ఆకుకూరలు తామే కోసుకొని కొనుక్కెళ్ల వచ్చు. స్కూలు విద్యార్థులకు ఇంటిపంటలు, ప్రకృతి వ్యవసాయ పనులను పరిచయం చేయడానికి ఇదొక మంచి అవకాశమని మేం భావిస్తున్నాం. యూనవర్సిటీలో ఈ పంటలను 2 ఎకరాలకు విస్తరించే ఆలోచన ఉంది. – ఉషా రాజు, ఎయు–అవని ఆర్గానిక్స్ అర్బన్ గార్డెనింగ్ హబ్, ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం 80 సెంట్లలో బహుళ పంటల సాగు.. ఆ విధంగా 2023 నవంబర్ చివరి నాటికి ఏయూ ఫార్మ్ టెస్టింగ్ లాబరేటరీ (ఎలిమెంట్) ఎదురుగా ఉన్న సుమారు 80 సెంట్ల ఖాళీ స్థలంలో ఏర్పాటైన అర్బన్ గార్డెనింగ్ హబ్లో ప్రకృతి సేద్యం ్రపారంభమైంది. కలుపు మొక్కలను తొలగించి నేలను సాగుకు అనుకూలంగా మార్చటానికి దాదాపు మూడు వారాల సమయం పట్టింది. తొలుత ఆకుకూరల సాగును ్రపారంభించారు. పాలకూర, తోటకూర, మెంతికూర, చుక్కకూర, బచ్చలి, గోంగూర, పొన్నగంటి, గలిజేరు, ఎర్రతోటకూర, పుదీనా వంటి పది రకాల ఆకుకూరలను చిన్నమడులుగా చేసుకొని సాగు చేస్తున్నారు. సలాడ్లలో వినియోగించే అరుదైన బాక్చాయ్ వంటి మొక్కలతో పాటు గోధుమ గడ్డి, ఆవ ఆకులు, చేమదుంపలు, కేరట్, బీట్రూట్, చిలగడదుంప వంటి దుంప పంటలనూ ఇక్కడ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రాడ బీర, వంగ, బొప్పాయి కాత దశకు వస్తున్నాయి. త్వరలో దొండ పాదులు సైతం నాటబోతున్నారు. ప్రతీ మూడు నెలలకు నాలుగైదు రకాల కూరగాయలు పెంచే విధంగా వీరు ప్రణాళిక చేసుకుని పనిచేస్తున్నారు. ఆకర్షితులవుతున్న ప్రజలు.. పశువుల పేడ తదితరాలతో తయారు చేసిన ద్రవ జీవామృతం, ఘనజీవామృతంతో ఇక్కడ పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండిస్తున్నారు. డ్రిప్, స్ప్రిక్లర్లు ఏర్పాటు చేసుకుని పొదుపుగా నీటిని వాడుతున్నారు. అనేక రకాల పంటలను కలిపి పండించటం వల్ల ఆకుకూరలు, కూరగాయ మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. పెద్దగా పురుగు పట్టడం లేదు. తమ కళ్ల ముందే ఆరోగ్యదాయకంగా సాగవుతున్న పంటలు వర్సిటీ ఆవరణలో నిత్యం వాకింగ్కు వచ్చే వందలాది మందిని ఆకర్షిస్తున్నాయి. కొద్దిసేపు ఈ ్రపాంగణంలో గడుపుతూ.. ఆకుకూరలు, కూరగాయలను ఎలా పెంచుతున్నారో అడిగి తెలుసుకుంటూ.. కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. కమ్యూనిటీ ఫార్మింగ్.. ప్రతీ ఆదివారం కమ్యూనిటీ ఫార్మింగ్నిప్రోత్సహిస్తున్నారు. నగరవాసులు స్వచ్ఛందంగా ఇక్కడకు వచ్చి కొద్దిసేపు వ్యవసాయం నేర్చుకోవడం కోసం భాగస్వాములయ్యేందుకు అవకాశం కల్పించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు ఇక్కడకు వచ్చి కాసేపు పంట మొక్కల మధ్య సరదాగా గడుపుతున్నారు. దీనితో వారికి ఒత్తిడి నుంచి ఉపశమనం, మానసిక ప్రశాంతత లభిస్తోందని చెబుతున్నారు. వలంటీర్లకు అవకాశం.. అర్బన్ కిచెన్ గార్డెనింగ్, ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి ఉన్న నగరవాసులకు ఇక్కడ వలంటీర్లుగా పని చేసే అవకాశం కల్పిస్తున్నారు. వీలైనంత ఎక్కువ మందికి ప్రకృతి వ్యవసాయం అలవాటు చేయడం, ప్రతీ ఇంటిలో టెర్రస్ గార్డెన్లు అభివృద్ధి చేసుకునే విధంగాప్రోత్సహించడం లక్ష్యంగా పనిచేస్తున్నామని నిర్వాహకులు ఉమా రాజు, హిమ బిందు చెబుతున్నారు. ప్రస్తుతం ఏయూలో చదువుకుంటున్న కొంత మంది విద్యార్థులు ఇక్కడ పనిచేస్తున్నారు. మొక్కలపై తమకున్న ఆసక్తితో స్వచ్ఛందంగా ఉదయపు వేళల్లో రెండు గంటల సమయం వెచ్చిస్తున్నారు. విద్యార్థులనుప్రోత్సహిస్తూ వారికి అవని ఆర్గానిక్స్ ప్రత్యేకంగా స్టైఫండ్ను అందిస్తోంది. కూరగాయల మొక్కలు, ఇండోర్ ΄్లాంట్స్ను విశాఖవాసులకు అందుబాటులో ఉంచే విధంగా నర్సరీని ్రపారంభించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రకృతి వ్యవసాయం, ప్రజల ఆరోగ్యంపై ఏయూ ఉన్నతాధికారులతో పాటు అవని ఆర్గానిక్స్ నిర్వాహకులకు శ్రద్ధ ఉండటం, సామాజిక బాధ్యతగా అర్బన్ గార్డెనింగ్ హబ్ను ్రపారంభించటం ఆదర్శ్రపాయం మాత్రమే కాదు, ఇతరులకు అనుసరణీయం కూడా! – వేదుల నరసింహం, సాక్షి, విశాఖపట్నం ఫోటోలు: పి.ఎల్ మోహన్ రావు, సాక్షి, విశాఖపట్నం తిరుపతిలో 9 నుంచి ఆర్గానిక్ మేళా.. తిరుపతి గవర్నమెంట్ యూత్ హాస్టల్ గ్రౌండ్స్ (పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ వెనుక)లో మార్చి 9,10,11 తేదీల్లో ఉ.6.30– రాత్రి 8 గం. వరకు ‘కనెక్ట్ 2ఫార్మర్’ సంస్థ ఆధ్వర్యంలో ఆర్గానిక్ మేళా జరగనుంది. రైతులు తమ సేంద్రియ/ప్రకృతి వ్యవసాయోత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు సహకరించటం.. దిగువ, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్గానిక్ ఆహారోత్పత్తులను అందుబాటులోకి తేవటం తమ ముఖ్య ఉద్దేశమని కనెక్ట్ 2ఫార్మర్ ప్రతినిధి శిల్ప తెలి΄ారు. ప్రతి నెలా రెండో శని, ఆదివారాల్లో తిరుపతిలో ఆర్గానిక్ మేళా నిర్వహిస్తున్నామని, ఈ నెల ప్రత్యేకంగా 3 రోజుల మేళా నిర్వహిస్తున్నామన్నారు. 9న మొక్కల గ్రాఫ్టింగ్, 5 అంచెల పంట విధానంపై శిక్షణ ఇస్తారు. ఆసక్తి గల రైతులు, ఇంటిపంటల సాగుదారులు 63036 06326 నెంబర్కు వివరాలు వాట్సాప్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. 11న గృహిణులకు సిరిధాన్యాల వంటల పోటీ ఉంది. 83091 45655 నెంబర్కు వివరాలు వాట్సాప్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆంధ్ర, తెలంగాణ నుండి 12 చేనేత సంఘాలు చేనేత వస్త్రాలను అందుబాటులోకి తెస్తున్నారు. పిల్లల కోసం భారతీయ సాంప్రదాయ యుద్ధ కళ అయిన కలరీ, వంటింటి వ్యర్థాలతో కంపోస్ట్, పెన్ కలంకారీ పై వర్క్షాప్లు జరుగనున్నాయి. ఇతర వివరాలకు.. 91330 77050. 7న మిద్దెతోట రైతులకు పురస్కారాలు.. ఈ నెల 7న ఉ. 11 గం.కు హైదరాబాద్ రెడ్హిల్స్లోని ఫ్యాప్సీ భవన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో పట్టణ ప్రాంతాల్లో మిద్దెతోటలు, ఇంటిపంటలు సాగు చేసుకునే 24 మంది అర్బన్ రైతులకు ‘తుమ్మేటి రఘోత్తమరెడ్డి రైతునేస్తం మిద్దెతోట పురస్కారాల’ ప్రదానోత్సవం జరగనుందని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వెంకటేశ్వరరావు తెలి΄ారు. తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తెలంగాణ సమాచార కమిషనర్ ఎం. హనుమంతరావు, మిద్దెతోటల నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి అతిథులుగా పాల్గొంటారు. అందరూ ఆహ్వానితులే. ఇవి చదవండి: షేర్ ఎట్ డోర్ స్టెప్: దానానికి దగ్గరి దారి -
కన్నకూతురిని కత్తులతో నరికి..
వైరా రూరల్: ఆస్తి కోసం కనీస విచక్షణ, మానవత్వం..చివరికి కన్నప్రేమను కూడా మరిచి మృగంలా మారిన ఓ తండ్రి కన్నకూతురును.. పైగా ఐదు నెలల గర్భవతి అని కూడా చూడ కుండా వేటకొడవళ్లు, గొడ్డలితో దాడి చేసి చంపేశాడు. ఈ ఘటనలో కుమార్తె అక్కడికక్కడే మృతిచెందగా అల్లుడు చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్నాడు. ఖమ్మం జిల్లా వైరా మండలం తాటిపూడి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన వివరాలిలా ఉన్నాయి. తాటిపూడి గ్రామానికి చెందిన పిట్టల రాములు, మంగమ్మ దంపతులకు ముగ్గురు కుమారులతోపాటు కుమార్తె ఉషశ్రీ(35) ఉన్నారు. వీరిలో ఇద్దరు కుమారులు నరేశ్, వెంకటేష్ స్థానికంగానే ఉంటుండగా, మరొకరు దూరంగా నివసిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన రాములు మామ (మంగమ్మ తండ్రి) మన్నెం వెంకయ్య చిన్నతనం నుంచే ఉషశ్రీని పెంచి పెద్దచేసి పదేళ్ల కిందట కొణిజర్ల మండలం గోపారానికి చెందిన పర్శబోయిన రామకృష్ణకు ఇచ్చి వివాహం జరిపించారు. ఈ సమయంలో వెంకయ్య తన రెండు ఎకరాల వ్యవసాయ భూమి, 10కుంటల ఇంటి స్థలాన్ని ఉషశ్రీ పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో రామకృష్ణ ఇల్లరికంపై తాటిపూడికి రాగా, అక్కడే భార్యాభర్తలు టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పదేళ్ల క్రితం పెళ్లి కాగా, ఇన్నేళ్లకు ఉషశ్రీ గర్భం దాల్చింది. కాగా, తన మామ వెంకయ్య ఆస్తిని ఉషశ్రీకి రాయడాన్ని జీర్ణించుకోలేని ఆమె తండ్రి రాములు, సోదరులు నరేశ్, వెంకటేష్ తరచూ ఘర్షణ పడేవారు. ఈ విషయమై కేసు కూడా కోర్టులో పెండింగ్లో ఉంది. కూతురినీ నరికేశాడు.. శుక్రవారం ఉదయం ఉషశ్రీకి చెందిన ఇంటి స్థలంలో ఉన్న సుబాబుల్ చెట్లను నరికేందుకు పిట్టల రాములు, ఆయన కుమారులు నరేష్, వెంకటేశ్ వేటకొడవళ్లు, గొడ్డలి, గడ్డపలుగులతో వచ్చారు. ఇది చూసి రామకృష్ణ, ఉషశ్రీ అడ్డుకున్నారు. దీంతో వారు గడ్డపలుగు, వేటకొడవళ్లతో వెంటపడ్డారు. ఈ క్రమంలో రామకృష్ణపై దాడి చేస్తుండగా, ఉషశ్రీ తప్పించుకునే ప్రయత్నంలో ఇంకొకరి ఇంట్లోకి వెళ్లడంతో వెంబడించి మరీ నరికారు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రగాయాలపాలైన రామకృష్ణను స్థానికులు 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆత్మరక్షణ కోసం ఉషశ్రీ, రామకృష్ణ ప్రతిదాడి చేయడంతో రాములు, వెంకటేశ్, నరేశ్కు కూడా గాయాలవడంతో ఆస్పత్రిలో చేరారు. వైరా ఏసీపీ ఎం.ఎ రెహమాన్, సీఐ నునావత్ సాగర్, ఎస్సై మేడా ప్రసాద్ ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
సింగర్ ఉష కూతురు గొంతు ఎంత బాగుందో వినండి
-
ఈ బుట్ట బొమ్మ ఎంత బాగా పాడిందో బుట్ట బొమ్మ పాట
-
ఎంత బాగా పాడారో తల్లి కూతుర్లు
-
పెళ్లయిన తర్వాత యూఎస్ కి వెళ్లాను కానీ..! సింగర్ ఉష
-
కెమెరా పట్టిన్నడే సీమ దసర సిన్నోడు.. రాత్రికి రాత్రే స్టార్ సింగర్
మహబూబ్నగర్: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని పెద్దజట్రం గ్రామానికి చెందిన మాడపోళ్ల ఆశప్ప, మాణిక్యమ్మ దంపతులకు ఉష, మంజుల ఇద్దరు కూతుళ్లు. ఉష గ్రామంలోని పాఠశాలలో 3వ తరగతి వరకు చదివి మానేసింది. చిన్నప్పటి నుంచే పొలం పనులకు వెళ్లేది. అయితే వీరి తల్లిదండ్రులు అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో బంధువులు చేరదీసి వరుసకు మామ అయిన వ్యక్తితో పెళ్లి చేశారు. బాబు, పాప పుట్టి అనారోగ్యంతో నెలలు నిండకుండానే మృతిచెందారు. భర్తకు సైతం మతిస్థిమితం లేకపోవడంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో గ్రామంలో జీవనోపాధి కష్టంగా మారడంతో హైదరాబాద్కు వలస వెళ్లింది. అక్కడే భవన నిర్మాణ రంగంలో కూలీ పనులు చేస్తూ ఒంటరి మహిళగా జీవనం సాగిస్తుంది. పొట్ట చేతపట్టుకొని పట్నం వెళ్లిన ఓ ఒంటరి మహిళ జీవితాన్ని ఒక్కపాట సెన్సేషన్గా మార్చేసింది. చిన్నప్పటి నుంచి జానపద పాటలంటే ఉన్న విపరీతమై ఇష్టమే అదృష్టం వెతుక్కుంటూ వచ్చేలా చేసింది. ‘కెమెరా పట్టిన్నడే సీమ దసర సిన్నోడు’ అనే పాటతో రాత్రికి రాత్రి స్టార్ సింగర్గా మారింది. పాట రాసి, స్వరం కలిపి ప్రాణం పోసి అచ్చం తెలంగాణ యాస, భాషతో పల్లె జానపదాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన ఆ కళాకారిణి నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని పెద్దజట్రం గ్రామానికి చెందిన మాడపోళ్ల ఉష. ఈమె ఈ ఏడాది జూన్ 29న పాట పాడగా ఇప్పటి వరకు యూట్యూబ్లో 26 మిలియన్ల వ్యూస్ అంటే 2.60 కోట్ల మంది చూశారంటే పాట క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. పదేళ్ల క్రితం హైదరాబాద్కు.. తాను వ్యవసాయ పనులకు వెళ్లే సమయంలో ఆడవాళ్లు పాడుకునే జానపద పాటలను శ్రద్ధగా గమనించి పాడుతూ ఉండేది. గత పదేళ్ల క్రితం జీవనోపాధి కోసం హైదరాబాద్కు వెళ్లింది. అక్కడే కూలీ పనులు చేసుకుంటూ తీరిక సమయంలో జానపద పాటలు పాడుతూ ఉండేది. యూట్యూబ్లో జానపద పాటలకు ఆదరణ పెరగడం చూసి తాను సైతం పాటలు పాడాలనే కోరికతో కొన్ని పాటలు రాసి వీడియోలు చేసింది. సరైన ఆదరణ రాకపోయినా.. పట్టువిడవకుండా పాటలు రాస్తూ.. ట్యూన్లు కలుపుతూ అవకాశాల కోసం ఎదురుచూసింది. గతంలో జగిత్యాల జోగుల వెంకటేశ్తో రెండు పాటలు, గొల్లపల్లి శివన్న సిరిసిల్లతో ఒక పాట పాడింది. ఓ రోజు జానపద పాటల కవర్పై హరీశ్ పాటేల్ ఫోన్ నంబర్ తీసుకొని ఫోన్ చేసి.. తాను జానపద పాటలు రాసి, పాడతానని అవకాశం ఇవ్వాలని కోరింది. ఆయన దగ్గరకు వెళ్లి మూడు పాటలు పాడి వినిపించింది. ఈ క్రమంలోనే కెమెరా పట్టిన్నడే సీమ దదర సిన్నోడు అనే పాట నచ్చడంతో గజ్వేల్లో అమూల్య స్టూడియోలో ఆమె దగ్గర పాడించి జూన్ 29న రిలీజ్ చేశారు. యూట్యూబ్లో వస్తున్న సెన్షేషన్ చూసి ఉష రాత్రికి రాత్రి జానపద స్టార్ సింగర్గా మారిపోయింది. చిన్నపిల్లలతో మొదలుకొని పెద్దల వరకు యూట్యూబ్లో పాట వింటూ మురిసిపోతున్నారు. చేయూత ఇవ్వండి..గ్రామంలో రేకుల షెడ్డు ఇల్లు మాత్రమే ఉంది. ప్రభుత్వం నా పరిస్థితిని గుర్తించి గృహలక్ష్మి ఇల్లుతోపాటు జీవనోపాధి కోసం దళితబంధు పథకాన్ని మంజూరు చేయాలి. నాకు జానపద పాటలంటే ఎంతో ఇష్టం. భవిష్యత్లో అవకాశం వస్తే సినిమా పాటలు పాడతా. పదేళ్లుగా కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నా. కళాభిమానులు నా జానపద పాటలను ఆదరించి చేయూతనివ్వండి. – ఉష, జానపద కళాకారిణి, పెద్దజట్రం -
కేజిన్నర బంగారం దోపిడీ
గుడిపాల (చిత్తూరు జిల్లా): జనం చూస్తుండగానే ఓ మహిళపై దాడిచేసి.. బ్యాగ్లో ఉన్న కేజిన్నర బంగారాన్ని దుండగులు దోచుకెళ్లిన ఘటన చిత్తూరు జిల్లా గుడిపాల మండలం వసంతాపురంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. వసంతాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు, ఉష దంపతులు గుడిపాలలో జ్యూవెలరీ దుకాణం నడుపుతున్నారు. వీరు ప్రతిరోజూ ఇంటి నుంచి బంగారాన్ని తీసుకుని దుకాణానికి తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. మిగిలిన ఆభరణాలను రాత్రివేళ ఇంటికి తీసుకొచ్చి జాగ్రత్త చేస్తుంటారు. బుధవారం రాత్రి 7:30 గంటలకు దుకాణం నుంచి కారులో బంగారు ఆభరణాలు తీసుకుని ఇంటికి వచ్చారు. ఇంటివద్ద వెనుక వైపున భర్త కారు పార్కింగ్ చేస్తుండగా.. ఉష బంగారు ఆభరణాలున్న బ్యాగ్ పట్టుకుని నిలబడింది. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఉషపై దాడి చేశారు. ఆమె చేతిలో ఉన్న బంగారం బ్యాగ్ను గుంజుకుని పారిపోయారు. దీనిని గమనించిన భర్త, స్థానికులు ఆమె వద్దకు చేరుకోగా.. అప్పటికే దుండగులు పరారయ్యారు. నిందితులు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్తో గల ద్విచక్ర వాహనంపై వచ్చారని స్ధానికులు తెలిపారు. సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీనివాసమూర్తి, సీఐ శ్రీనివాసులురెడ్డి, ఎస్ఐ రాజశేఖర్ ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుల్ని వీలైనంత త్వరగా పట్టుకుంటామని డీఎస్పీ శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. సీసీ కెమెరాల సాయంతో నిందితుల జాడను గుర్తించేందుకు చర్యలు చేపట్టామని, తమిళనాడు సరిహద్దులో వాహన తనిఖీ చేపట్టామని చెప్పారు. -
కన్సాస్ సెనేటర్గా ఉషా రెడ్డి
హూస్టన్: అమెరికాలోని కన్సాస్ రాష్ట్ర సెనేటర్గా భారతీయ అమెరికన్, విద్యావేత్త ఉషా రెడ్డి (57)బాధ్యతలు చేపట్టారు. డెమోక్రాటిక్ పార్టీ తరఫున బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందంటూ ట్వీట్ చేశారు. ఆమె 2013 నుంచి మన్çహాటన్ సిటీ కమిషన్గా కొనసాగుతున్నారు. మేయర్గా రెండుసార్లు ఎన్నికయ్యారు. నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ చాప్టర్ ప్రెసిడెంట్గానూ ఉన్నారు. ఉషారెడ్డి 8 ఏళ్లప్పుడు ఆమె కుటుంబం ఏపీలోని రాజమహేంద్రవరం నుంచి అమెరికా వెళ్లింది. -
ప్రేయసి కాదు.. ఆమె రాక్షసి!!
ప్రేమ మత్తులో మునిగిన యువకుడు.. అందులోంచి బయట పడలేకపోయాడు. ఆమె కోసం పరితపించిపోయి పిచ్చి ప్రేమను ప్రదర్శించాడు. చివరికి.. ప్రేమ పేరిట ఆమె ఆడిన నాటకంలో ఆ భగ్న ప్రేమికుడు కాస్త.. బలి పశువు అయ్యాడు. ప్రాణాల కోసం ఆస్పత్రిలో రోజుల తరబడి పోరాడి.. చివరకు కన్నుమూశాడు. కేరళ తిరువనంతపురంలో ఓ యువకుడి మరణం కేసు.. మిస్టరీగా మారింది. అతనెలా మరణించాడన్నది ఎటూ తేల్చలేకపోతున్నారు పోలీసులు. అయితే బాధిత కుటుంబం మాత్రం మూఢనమ్మకంతో.. ప్రియురాలే తమ బిడ్డ ప్రాణం తీసిందని అంటోంది. పరసాలాకు చెందిన షరోన్ రాజ్(23) గత కొంతకాలంగా ఉష అనే ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. వృత్తి రిత్యా వేరే ఊర్లో ఉంటున్న షరోన్కి.. ఈమధ్య ఆమెకు మరో వ్యక్తితో ఎంగేజ్ మెంట్ అయ్యిందని విషయం తెలిసి షాకయ్యాడు. ఈలోపే ఉష అతనికి కాల్ చేసింది. తనకు ఇష్టం లేకుండా ఇంట్లో వాళ్ల బలవంతం మేరకు ఎంగేజ్మెంట్ జరిగిపోయిందని చెప్పింది. దీంతో అప్పటి నుంచి అతను ఆమెకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అయితే.. ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు షరోన్ దగ్గర ఉన్నాయి. వాటి వల్ల ఎప్పటికైనా ప్రమాదం అనుకుందో ఏమో.. అతనితో వాట్సాప్ ఛాటింగ్ ద్వారా దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో.. అక్టోబర్ 10న షరోన్ పరసాలాకు వచ్చాడు. అక్టోబర్ 14న ఉదయం షరోన్కు ఉష ఫోన్ చేసింది. కలవాలని ఉందని.. బయటకు వెళ్దామని చెప్పింది. అయితే బైక్ సర్వీసింగ్కు ఇచ్చానని చెప్పడంతో ఫోన్ పెట్టేసింది. కాసేపు ఆగి మళ్లీ ఫోన్ చేసి ఇంట్లో ఎవరూ లేరు.. రమ్మని ఆహ్వానించింది. స్నేహితుడితో కలిసి రామవర్మంచిరై(కన్యాకుమారి, తమిళనాడు)లో ఉష ఇంటికి వెళ్లాడు షరోన్. స్నేహితుడు బయట ఎదురుచూస్తుండగా.. ఒక్కడే ఇంట్లోకి వెళ్లాడు. అయితే.. పావు గంటకు పొట్టచేత పట్టుకుని వాంతులు చేసుకుంటూ బయటకు వచ్చాడు షరోన్. ఆ తర్వాత కూడా ఇద్దరూ చాట్ చేసుకున్నారు. కషాయం, జ్యూస్ల్లో ఏం కలిపావని షరోన్ ఉషను నిలదీశాడు. అయితే తానేం కలపలేదని.. బహుశా పండ్ల రసం వికటించిందేమో అని సమాధానం ఇచ్చింది ఆమె. అక్కడితో వాళ్లిద్దరి ఛాటింగ్ ఆగిపోయింది. దారి పొడవునా నీలి రంగులో వాంతులు కావడంతో.. షరోన్ను పరసాలా ప్రభుత్వాసుపత్రిలో చేర్చాడు ఆ స్నేహితుడు. ఆపై తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే.. అక్కడ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు నార్మల్ రావడంతో.. ఇంటికి పంపించేశారు. ఆ తర్వాత రెండు రోజులకు షరోన్ పరిస్థితి విషమించడంతో.. తిరిగి తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ ఆస్పత్రికి తరలించారు అతని పేరెంట్స్. 11 రోజుల పాటు చికిత్స పొందిన షరోన్కు లంగ్స్, కిడ్నీ ఒక్కొక్కటిగా దెబ్బ తింటూ వచ్చాయి. ఈలోపు షరోన్ నుంచి మెజిస్ట్రేట్ సమక్షంలో వాంగ్మూలం సేకరించారు పోలీసులు. మరోవైపు వైద్యులు.. అతను తాగిన డ్రింక్లో యాసిడ్లాంటిది కలిసిందని నిర్ధారించారు. అయితే ఏం కలిపారనే దానిపై మాత్రం స్పష్టత రాలేదింకా. ఇక ఈ కేసులో పోలీసుల తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల దర్యాప్తు పూర్తిగా నిందితుల కుటుంబానికి అనుకూలంగా ఉందని ఆరోపిస్తోంది బాధిత కుటుంబం. అంతేకాదు.. పరారీలో ఉన్న ఉష కుటుంబాన్ని పోలీసులు ఇంతదాకా ట్రేస్ చేయలేకపోయారు. ఆ గండం గట్టెక్కేందుకే.. ఉష కుటుంబానికి షరోన్ రాజ్ నచ్చలేదు. అందుకే మరో వ్యక్తితో ఉషకు పెళ్లి ఫిక్స్ చేసి.. ఎంగేజ్మెంట్ కూడా కానిచ్చేశారు. పెళ్లి సెప్టెంబర్లోనే జరగాల్సి ఉండగా.. ఆఖరి నిమిషంలో ఎందుకనో ఫిబ్రవరికి వాయిదా వేశారు. దీంతో.. తమ బిడ్డ మరణం వెనుక మూఢనమ్మక కోణం కూడా ఉందని షరోన్ కుటుంబం ఆరోపిస్తోంది. ఉషకు పెళ్లైన వెంటనే భర్త మరణించే గండం ఉందని, ఆ దోషం పొగొట్టేందుకు తమ బిడ్డతో బలవంతంగా ఆమె నుదుట కుంకుమ పెట్టించారని షరోన్ కుటుంబం అంటోంది. ఉష ఇంటి నుంచి బయటకు వచ్చిన షరోన్ నుదుటిపై కూడా కుంకుమ ఉందని, ఆ విషయాన్ని కూడాఉన్న స్నేహితుడు సైతం నిర్ధారించాడని అంటోంది. ఇంటికి పిలిపించి మరీ పక్కా ప్లాన్తో ఉషతో బలవంతపు వివాహం జరిపించి.. ఆపై ఏదో తాగించి షరోన్ మరణానికి కారణమయ్యారని ఆరోపిస్తోంది. ఇలాంటిదే మరో ఘటన.. షరోన్ రాజ్తో పాటు మరో చిన్నారి మృతి కేసు కూడా కేరళలో మిస్టరీగా మారింది. సెప్టెంబర్ 24వ తేదీన అథెన్కోడ్కు చెందిన ఓ స్కూల్ విద్యార్థి.. మరో విద్యార్థి ఇచ్చిన డ్రింక్ తాగి ఆస్పత్రి పాలయ్యాడు. ఆ డ్రింకులోనూ యాసిడ్ తరహా ఆనవాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మూడు వారాలపాటు చికిత్స పొందిన 11 ఏళ్ల ఆ బాలుడు.. చివరికి ఆర్గాన్ ఫెయిల్యూర్తోనే కన్నుమూశాడు. సుచింద్రమ్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేపట్టగా.. షరోన్ రాజ్ మృతి కూడా అదే తరహాలో చోటు చేసుకోవడం గమనార్హం. -
పచ్చళ్లు, పొడులు, స్వీట్లు, జంతికలు.. మొత్తం 80 రకాలు! ఇంట్లోనే పిండివంటలు చేస్తూ..
‘‘అక్కా! ఈ జంతికలు సరిగ్గా కాలాయో లేదో ఓ సారి చూస్తావా!’’.. ‘‘ఉషా! తోటకూర వేపుడు పొడి చేయిస్తున్నావా? కమ్మటి వాసన వస్తోంది!!’’ ... ‘‘పెద్దమ్మాయి పిల్లలకు మునగాకు పొడి కావాలట. ప్యాక్ చేయించక్కా!’’.. ‘‘పాలు వచ్చాయి... కోవా బాణలి స్టవ్ మీద పెట్టమ్మాయ్. నేను వస్తున్నా... అడుగంటకుండా కాగాలి పాలు. గులాబ్ జామూన్ మృదువుగా ఉండాలి’’ సికింద్రాబాద్, న్యూ బోయిన్ పల్లి, ‘బాణలి’లో ఇద్దరు అక్కాచెల్లెళ్ల సంభాషణ ఇది. ఇద్దరూ అరవయ్యేళ్లు దాటిన వాళ్లే. వాళ్లకు అధిక బరువు సమస్య ఎలా ఉంటుందో తెలియదు. జుట్టుకు డై వేయాల్సిన అవసరమూ రాలేదు. ‘ఆరోగ్యంగా తింటే అనారోగ్యం ఎందుకు వస్తుంది’ అంటారు. ఆరోగ్యంగా తినడం అంటే... మన సంప్రదాయ వంటకాలేనంటారు వాళ్లు. ‘‘మేము రోజూ ఆవకాయతో మొదలు పెట్టి గడ్డపెరుగుతో పూర్తి చేస్తాం. ఏ అనారోగ్యమూ లేదు. రోజూ ఒక ముద్ద వేడి అన్నంలో నెయ్యి, మునగాకు పొడి కలిపి తినండి. రోజూ సున్నుండ, నువ్వులుండ తినండి. మెత్తగా జారిపోయే కేకుల బదులు వేరుశనగ పట్టీని పటపటా కొరికి బాగా నమిలి తినండి. మా ఇంట్లో అలాగే తింటాం. ఆరోగ్యంగా ఉన్నాం. అనారోగ్యం పాలవుతున్న కొత్తతరానికి ఆరోగ్యపు బాట వేయడానికే ఈ పని మొదలు పెట్టాం’’ అంటూ ‘బాణలి’ పేరుతో హోమ్ఫుడ్ సెంటర్ ప్రారంభించడానికి కారణాన్ని వివరించారు ఈ అక్కాచెల్లెళ్లు దాట్ల రాజేశ్వరి, పెన్మెత్స ఉష. వంటలన్నీ ఇంట్లోనే ‘‘మా పుట్టిల్లు ఆంధ్రప్రదేశ్, పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురం, దర్భరేవు గ్రామం. పదహారేళ్లకే మాకు పిండివంటలు చేయడం నేర్పించింది మా అమ్మ. మా నాన్న కలిదిండి సత్యనారాయణ రాజు. ఆయన రాజకీయాల్లో చురుగ్గా ఉండడంతో రోజూ అతిథులుండేవారు. రకరకాలు వండడం వడ్డించడంలో మా అమ్మకు రోజు సరిపోయేది కాదు. పెళ్లయి అత్తగారింటికి వెళ్తే అక్కడ మామగారు మునసబు. గ్రామానికి ఏ ఉద్యోగి వచ్చినా భోజనం మా ఇంట్లోనే. ఏ ఫంక్షన్ అయినా అన్నీ ఇంట్లోనే వండేవాళ్లం. పెళ్లి, పేరంటాలకు పాతిక కావిళ్లు సారె పంపించడం... ఇలా ఎప్పుడూ వండడమే. ఒక్కమాటలో చెప్పాలంటే వండడం తప్ప మరొకటి తెలియదు, వంటల్లో మాకు తెలియనిది లేదు’’ అన్నారు రాజేశ్వరి. వంద రుచులు వచ్చు! ‘‘పచ్చళ్లు, పొడులు, స్వీట్లు, చెగోడీ–జంతికల వంటివి మొత్తం ఎనభై రకాలు వండుతాం. ఇతర వంటకాలన్నీ కలిపి వంద రకాలు వచ్చు. మాకు వంటల పుస్తకాలు తెలియదు. దినుసులన్నీ ఉజ్జాయింపుగా వేయడమే. వంటల పుస్తకాలు రాయమని చెప్తున్నారు. కానీ దేనికీ కొలతలు పాటించం, కొలతలతో వండడం మాకు తెలియదు. కొలతలతో చెప్పడమూ తెలియదు. మా అమ్మ వండుతుంటే చూసి నేర్చుకున్నాం. మా దగ్గర పని చేసే వాళ్లకూ అలాగే నేర్పించాం’’ అన్నారు ఉష. పలాస జీడిపప్పు... నర్సాపురం బెల్లం ‘‘వండడం వస్తే సరిపోదు, దినుసుల్లో నాణ్యత కూడా ముఖ్యమే. బెల్లం నర్సాపురం నుంచి, కారం బోధన్ నుంచి, జీడిపప్పు పలాస నుంచి, మంచి ఆవునెయ్యి కర్ణాటక నుంచి తెప్పించుకుంటాం. ఇంట్లో దినుసులు ఎలాగ మంచివి తెచ్చుకుంటామో అలాగే ఇదీనూ. మా అమ్మాయి హైదరాబాద్లో ఉండడంతో తరచూ అమ్మాయి ఇంట్లో పది– ఇరవై రోజులుండేవాళ్లం. మనుమడు ప్యాకెట్లలో దొరికే చిరుతిళ్లు తింటుంటే... ఇదేం తిండి అనిపించేది. ఒంటికి బలం రాని తిండితో పిల్లలు ఊబదేలుతారు, ఎముక పుష్టితో పెరగరు. అందుకే ఇంట్లో రకరకాల పిండివంటలు చేసేదాన్ని. అమ్మాయి స్నేహితులు, వాళ్ల పిల్లలు ఎంతో మెచ్చుకుంటూ ఉంటే సంతోషంగా అనిపించేది. ‘మీ చేతిలో ఉన్న విద్య విలువ మీకు తెలియడం లేదు. చాలామందికి మన గోదారి జిల్లాల వంటల పేర్లు తప్ప రుచి కూడా తెలియదు. అందరికీ పరిచయం చేయవచ్చు కదా! నేర్చుకునే ఆసక్తి ఉన్న వాళ్లకు నేర్పించనూ వచ్చు. అన్నింటికంటే ముందు మన పిల్లలతోపాటు అందరి పిల్లలూ ఆరోగ్యంగా పెరుగుతారు. మీకు నాలుగు డబ్బులు కూడా వస్తాయి’ అని మా వియ్యంకులు చెబితే... ఎందుకో చాలా బిడియం వేసింది. మాకు చక్కగా వండి పెట్టడమే తెలుసు, వంటను అమ్మడం చిన్నతనంగా అనిపించింది. కానీ వాళ్ల మాటలు కాదనలేక మొదలుపెట్టాం. గత ఏడాది ఉగాది రోజు మొదలైంది. ఇప్పుడు మా వంటల్ని కొన్నవాళ్లు నాలుగువేల మంది. ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్గారు ఈ సెంటర్ను చూసి మమ్మల్ని అభినందించారు. ‘ఈ వంటలు మీ తరంతో అంతరించి పోకూడదమ్మా. కొత్త తరానికి అందించండి’ అని చెప్పారాయన. అంతపెద్ద ఆఫీసర్గారు ప్రశంసిస్తుంటే మేము చేస్తున్న పని మంచిదే అని మాకు ధైర్యం వచ్చింది’’ అన్నారు ఉష. అక్కడ ఇడ్లీ ప్రియం! ‘ఈ స్టోర్ చూసిన వాళ్లు మీ ఇద్దరే ఇన్ని చేస్తున్నారా! అని ఆశ్చర్యపడుతుంటారు. ఈ వయసులో చక్కటి ఆరోగ్యం మీది’ అని మెచ్చుకుంటారు. దేహానికి మంచి ఆహారం, తగినంత శ్రమ ఉంటే అనారోగ్యాలెందుకు వస్తాయి? అంటారు రాజేశ్వరి. ‘చపాతీలు చేయాలంటే గోధుమలు రోట్లో దంచాం, పిండి తిరగలితో విసిరాం. గారెలకు పిండి రోట్లో రుబ్బాం. ఈ చేతులకు ఈ పని పెద్ద పనేమీ కాదు’’ అని స్టోర్లో ఉన్న రకరకాల పిండివంటలను చూపించారీ సీనియర్ సిస్టర్స్. ఇంకా... ‘‘మన సంప్రదాయ వంటల్లో ఆరోగ్యం ఉంది. ముందు తరాలకు అందివ్వాలి. వీటిని మన తరంతో అంతరించిపోనివ్వకండి. ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు వాళ్ల పిల్లలకు వీటిని వండడం నేర్పించండి. మనం కేకులు, పిజ్జాలు, బర్గర్లు తినడం ఫ్యాషన్ అనుకుంటున్నాం. పాశ్చాత్యదేశాల వాళ్లు మన ఇడ్లీ, దోశెలను లొట్టలేసుకుంటూ తింటున్నారు. మన రుచిని మర్చిపోవద్దు. మన పోపుల పెట్టె ఔషధాల గని. తరతరాలకు అందించండి’’ అని సాటి మహిళలకు ఓ మంచిమాట చెప్పారు. మరొక్క చిన్నమాట... ‘మేము స్వీట్లు చేస్తాం. కానీ తినం. రోజూ ప్రతి స్వీట్నీ తయారైనప్పుడు తప్పకుండా రుచి చూస్తాం. ఎక్కువ మోతాదులో తింటే రుచిని గుర్తించడం కష్టం’ అన్నారు. బహుశా! వీళ్ల విజయ రహస్యం, ఆరోగ్య రహస్యం ఇదే కావచ్చు. – వాకా మంజులారెడ్డి ఫొటోలు: మోర్ల అనిల్ కుమార్ చదవండి: Kavitha Naga Vlogs: ఆమె మనసుకు రుచి తెలుసు -
టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం.. ప్రయోజకురాలవుతుందనుకుంటే..
జీవితం ఓ ప్రయాణం.. ఆటుపోట్లు.. కష్ట సుఖాలు కేనీడ వంటివి. ఒక్కక్షణం ఆలోచిస్తే సమస్యకు చక్కని పరిష్కారం దొరుకుతుందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నా... ఈ ప్రపంచంలో పరిష్కారంకాని సమస్య ఏదీ లేదని తత్వవేత్తలు బోధిస్తున్నా.. చాలామంది క్షణికావేశానికి లోనవుతున్నారు. బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అందమైన జీవితాలను అగ్నికి ఆహుతిచేస్తున్నారు. అయినవారికి ఆవేదన మిగుల్చుతున్నారు. జిల్లాలో మూడేళ్లలో సుమారు 654 మంది ఆత్మహత్యలకు పాల్పడడం అందరినీ ఆలోచింపజేస్తున్న అంశంగా మారింది. విద్యార్థిని ఆత్మహత్య గజపతినగరం: గజపతినగరం మండలం పిడిశీల గ్రామానికి చెందిన ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థిని ఉరివేసుకుని సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొండపల్లి మండలం శ్యామలవలస గ్రామానికి చెందిన తాడ్డి ఉష (18) తాతగారి గ్రామం అయిన పిడిశీలలో ఊంటూ చదువుతోంది. ఉష తల్లిదండ్రులు పార్వతి, రమణమూర్తిలు విజయనగరం మయూర జంక్షన్ సమీపంలో టిఫిన్ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఉషను గజపతినగరంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో చదివిస్తున్నారు. చక్కగా చదువుకుని ప్రయోజకురాలు అవుతుందని ఊహించారు. బైపీసీ గ్రూపును చదవలేక రెండురోజులుగా ఉష కళాశాలకు వెళ్లడం లేదు. మరి చదవలేనన్న బెంగతో మనస్థాపానికి గురై సోమవారం సాయంత్రం అమ్మమ్మ అప్పయ్యమ్మ పొలంపనికి వెళ్లే సమయంలో ఇంటి దూలానికి సున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పార్వతి, రమణమూర్తిలకు ఇద్దరు ఆడపిల్లలు. అందులో పెద్దమ్మాయి పావనికి వివాహం కాగా, ఉష ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉషను ప్రయోజకురాలిని చేయాలనే ఊరిని విడిచిపెట్టి కష్టపడుతున్నామని, ఇంతలో అఘాయిత్యానికి పాల్పడిందంటూ తల్లి బోరున విలపిస్తోంది. మృతురాలి అమ్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ రమేష్, ఎస్ఐ గంగరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. చదవండి: (భర్త లింగమార్పిడి.. మరొకరితో సహజీవనం.. అంతలోనే..) సాక్షి, విజయనగరం: ప్రేమ విఫలమైందని కొందరు.. భర్త, అత్తమామలు వేధించారని.. ఆరోగ్యం మరి కుదుటపడదని.. చదువుకోమని తల్లిదండ్రులు మందలించారని.. ఇలా.. చిన్నచిన్న కారణాలకే చాలామంది క్షణికావేశానికి గురవుతున్నారు. ప్రాణాలు తీసుకుంటున్నారు. పరిష్కరించుకోగలిగే చిన్నపాటి సమస్యలే అయినా ఆలోచించకుండా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఏటా వందలాది మంది ఆత్మహత్యలకు పాల్పడతుండం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న అంశం. పెద్దవారిలో పురుషులు ఎక్కువుగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పిల్లల్లో బాలికలు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు వైద్య గణాంకాలు చెబుతున్నాయి. మారిన వ్యవహారశైలి.. జీవన వ్యవహార శైలిలో చాలా మార్పులు వచ్చాయి. సాంకేతికత పెరుగుతున్నప్పటకీ మానవ సంబంధాలు, కుటుంబ విలువల గురించి నేటితరం పెద్దగా పట్టించుకోవడం లేదు. పూర్వ కాలంలో విలువలు పాటించేవారు. తగాదాలు అనేవి చాలా తక్కువుగా వచ్చేవి. ఆత్మహత్యలు కూడా అరుదు. ఉమ్మడి కుటుంబాలకు ప్రాధాన్యమిచ్చేవారు. 10 నుంచి 20 మంది వరకు ఒకే కుటుంబంగా కలిసి జీవించేవారు. కొంతమంది అయితే 30 నుంచి 40 మంది వరకు కలిసి ఉండేవారు. కుటుంబంలో ఏ చిన్న సమస్య వచ్చినా ఇంట్లోనే కూర్చొని పరిష్కరించుకునేవారు. చిన్నచిన్న గొడవలు వచ్చినా పోలీస్ స్టేషన్ గడప కూడా తొక్కేవారు కాదు. ప్రస్తుతం ఒంటరి జీవితాలకు అలవాటు పడుతున్నారు. భర్త, భార్య, పిల్లలు మాత్రమే ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో వారికి ఏది మంచి, ఏది చెడు అనేది చెప్పేవారు ఉండడం లేదు. భార్యాభర్తల మధ్య చిన్నపాటి వివాదం వచ్చినా గొడవ పెద్దది చేసుకోవడం, ఆత్మహత్యలకు పాల్పడడం చేస్తున్నారు. అధికశాతం మంది ఆత్మహత్యలకు కుటుంబ కలహాలే కారణంగా కనిపిస్తోంది. మనోధైర్యం లేని యువత బలవన్మరణాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. జీవితం తృణప్రాయంగా.. 2019 నుంచి 2021 అక్టోబర్ నెలఖారు నాటికి 654 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో పెద్దవారు 621 మంది కాగా, 16 ఏళ్లలోపు వారు 33 మంది. పెద్దవారిలో మగవారు 458 మంది కాగా మహిళలు 163 మంది ఉన్నారు. 16 ఏళ్లు లోపు వారిలో బాలురు 10 మంది, బాలికలు 23 మంది ఉన్నారు. కౌన్సెలింగ్ ఇప్పించాలి పిల్లలతో తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా ఉండాలి. మనోధైర్యం కోల్పోయిన వారికి సకాలంలో ఫ్యామిలీ సపోర్టు కావాలి. పిల్లలతో ఎక్కువసేపు గడపాలి. పిల్లలతో ప్రస్తుతం ఎక్కువుగా తల్లిదండ్రులు గడపడం లేదు. దీనివల్ల వారు స్నేహితులతో గడుపుతున్నారు. మంచి స్నేహం అయితే ఫర్వాలేదు. చెడు అలవాట్లు ఉన్నవారితో స్నేహం కుదిరితే చెడుమార్గంలో వెళ్తున్నారు. వివాహేతర సంబంధాలు, కుటుంబ తగాదాల వల్ల ఎక్కువుగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కౌన్సెలింగ్ సెంటర్ల ఆవశ్యకత ప్రస్తుతం ఎంతైనా ఉంది. మద్యం సేవించడం తగ్గించుకోవాలి. సకాలంలో కౌన్సెలింగ్ ఇచ్చి, మందులు వాడిస్తే ఆత్మహత్యల బారినుంచి కాపాడవచ్చు. – డాక్టర్ జాగరపు రమేష్, మానసిక వైద్యుడు, విజయనగరం సమస్యను ఎదుర్కొనే శక్తి లేకనే.. ఏదైనా సమస్య వస్తే దానిని ఎదుర్కోగలిగే శక్తి లేక మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అనారోగ్య సమస్యలున్న వారు వాటిని మంచి వైద్యుని దగ్గర చూపించుకుని వైద్యం చేయించుకుంటే సరిపోతుంది. ప్రస్తుతం అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. మానవజన్మ దేవుడిచ్చిన వరం. క్షణికావేశానికి లోనై ఆత్మహత్యలకు పాల్పడకూడదు. సమస్య వచ్చినప్పడు స్నేహితులకు, బంధువులకు చెప్పి పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి. మనసుకు బాధ కల్గినప్పుడు మనోధైర్యాన్ని కోల్పోరాదు. మానవ సంబంధాల గురించి నేటివారికి తెలియజేయాలి. – డాక్టర్ ఎస్వీ రమణకుమారి, డీఎంహెచ్ఓ ►విజయనగరానికి చెందిన కాకర్లపూడి అనిత అనే మహిళ ఎంవీజీఆర్ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. భర్త మందలించారన్న కారణంతో గతనెల 20న గంట్యాడ మండలం తాటిపూడి జలాశయంలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ►పార్వతీపురం పట్టణానికి చెందిన పిచ్చిక ప్రదీప్కుమార్ అనే యువకుడు మానసిక స్థితి బాగులేక ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ►జామి ఎస్సీ కాలనీకి చెందిన లక్ష్మి అనే మహిళ నెలరోజుల కిందట కడుపునొప్పి తాళలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ►మధ్యప్రదేశ్కు చెందిన సాహు అనే వ్యక్తి గంట్యాడ మండలంలోని కరకవలసగ్రామం సమీపంలో ఉన్న తోటలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ►పార్వతీపురం మండలానికి చెందిన సురేష్ అనే యువకుడు ప్రేమ విఫలమైందన్న మనస్థాపంతో పురుగుమందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. -
అష్టలక్ష్మి స్తోత్రాన్ని ఆవిష్కరించిన ఉపాసన
సాక్షి, జూబ్లీహిల్స్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రముఖ గాయని ఉష ఆలపించిన అష్టలక్ష్మి స్తోత్రంతో ఆడియో తీసుకురావడం అభినందనీయమని అపోలో లైఫ్ అధినేత్రి ఉపాసన కొణిదెల అన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్లో నిర్వహించిన కార్యక్రమంలో ఉష రూపొందించిన ‘సుమనస వందిత’ పాటలను ఆమె ఆవిష్కరించారు. -
ప్రియుడితో కలిసి కొడుకును కడతేర్చింది..
-
ఆంధ్రాలో చంపి.. తెలంగాణలో పాతి పెట్టారు
సాక్షి, జగ్గయ్యపేట: అనైతిక బంధం మోజులో పడిన ఆ తల్లి విచక్షణ మరిచిపోయింది. రక్తం పంచుకుపట్టిన బిడ్డనే ప్రియుడితో కలిసి కడతేర్చిందో మహిళ. ఈ దారుణ సంఘటన కృష్ణాజిల్లాలో చోటుచేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కన్న కొడుకును హతమార్చి, మృతదేహాన్ని మరో ప్రాంతంలో పూడ్చి పెట్టింది. వివరాల్లోకి వెళితే.. జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లికి చెందిన ఉష రెండు నెలల క్రితం భర్తతో విడిపోయి ప్రియుడితో కలిసి ఉంటోంది. ఉష ఇద్దరి కుమారులు కూడా వారితోనే ఉంటున్నాడు. అయితే కొడుకు తమకు అడ్డంకిగా మారడంతో ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని అనుకున్నారు. దీంతో ప్రియుడు శ్రీనుతో కలిసి చిన్న కొడుకును హతమార్చింది. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని తెలంగాణలోని కోదాడ వద్ద పూడ్చి పెట్టారు. అయితే వీరి వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఉషతో పాటు శ్రీనును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా నేరం చేసినట్లు అంగీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. -
స్వీట్ మెమోరీస్ విత్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
విజయంలో ఆయన పాట ఉంది.. అపజయంలోనూ ఆయన పాట ఉంది. ప్రేమలో ఆయన పాట ఉంది.. విరహంలోనూ ఆయన పాట ఉంది.. ఆనందంలో ఆయన పాట ఉంది.. విషాదంలోనూ ఆయన పాట ఉంది.. మనిషి తాలూకు ప్రతి భావోద్వేగంలో బాలు పాట ఉంది. అందుకే బాలు ఎప్పటికీ ఉంటారు... ఆయన పాట ద్వారా గుర్తుండిపోతారు. బాలూ ఎంతోమంది సీనియర్ గాయనీమణులతో పాడారు. బాలూతో పాడే అవకాశం దక్కించుకున్న యువ గాయనీమణులు ఉష, కౌసల్య ఏమంటున్నారో తెలుసుకుందాం. అలాగే బాలు గురించి ప్రముఖులు చెప్పిన విశేషాలు నేనేమన్నా రాక్షసుడినా అన్నారు – కౌసల్య ‘‘నా కెరీర్లో బాలూగారితో 15 పాటలు పాడే అదృష్టం నాకు దక్కింది’’ అన్నారు గాయని కౌసల్య. బాలూతో తన అనుబంధం గురించి కౌసల్య మాట్లాడుతూ – ‘‘పాడుతా తీయగా’ సెలక్షన్స్కి వెళ్లాను. ఫస్ట్ ఎపిసోడ్లోనే నన్ను పాడమన్నారు. బాలూగారి ముందు పాడటానికి కొంచెం భయపడ్డాను. అప్పుడు స్టేజీ మీద ఉన్న బాలూగారు షూటింగ్ ఆపేశారు. నా దగ్గరకి వచ్చి ‘ఒక్కసారి నా వైపు చూడు, నేనేమన్నా రాక్షసుడిలా ఉన్నానా’ అని ఆయన స్టైల్లో జోకులు వేస్తే షూటింగ్లో ఉన్న వాళ్లందరూ నవ్వేశారు. అప్పుడు ఆయన నాతో ‘మనందరం ఒక సంగీత కుటుంబం అమ్మా. నువ్వు పాడే పాటను ఎన్నో లక్షలమంది ప్రేక్షకులు వింటారు. నీకు అద్భుతమైన కెరీర్ వస్తుంది. అందుకని భయపడకుండా పాడు’ అని ధైర్యమిచ్చారు. ఆయన మాట్లాడిన తర్వాత నేను రిలాక్స్ అయి, బాగా పాడగలిగాను. నేను ఆయన గురించి ఎప్పుడు ఆలోచించినా ఆయన ఆ రోజు అలా చెప్పబట్టే కదా, ఈ రోజు నా కెరీర్ ఇంత గొప్పగా ఉంది అనుకుంటాను. ఆ తర్వాత బాలూగారు అనేక ప్రాంతాలకు షూటింగ్లకని, షోలకని తీసుకెళ్లారు. అప్పుడాయన మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు. ఒక్కోసారి వైజాగ్ లాంటి ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆక్కడి వాతావరణానికి నోరు ఎండిపోతుండేది. ఆయన మా సింగర్స్ అందరి దగ్గరికి వచ్చి ‘ఈ వాతావరణానికి ఎక్కువ నీళ్లు తాగాలి, అలాగే చక్కెరకేళి తినండి.. తొందరగా ఎనర్జీ వస్తుంది’ అని చెప్పేవారు. చిన్న సింగర్.. పెద్ద సింగర్ అనే తేడా లేకుండా అందరితో చక్కగా కలిసిపోయేవారు. మొదట్లో నాకు సినిమా పాటలకు తక్కువగా అవకాశాలు వస్తుండేవి. ఆ టైమ్లో పెద్ద వంశీ గారు ‘ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాకి దర్శకత్వం వహించారు. మేల్ సింగర్గా బాలూగారు, ఫిమేల్ సింగర్ ఎవరు? అని సంగీత దర్శకుడు చక్రిగారిని వంశీగారు అడిగారట. అప్పుడు చక్రిగారు కౌసల్య అని కొత్తమ్మాయి నా సినిమాలకు పాడుతుందని చెప్పారట. ‘బాలూగారంటే నాకు ఎంతో ఇష్టం.. నువ్వు కొత్తమ్మాయితో అంటే ఎలా పాడుతుందో’ అని కంగారు పడ్డారట వంశీగారు. నేను పాడుతుంటే ఓసారి రికార్డింగ్ స్టూడియోకి వచ్చి చూసుకుని ‘ఈ అమ్మాయి బాగా పాడుతుంది’ అని అప్పుడు బాలూగారితో పాడే అవకాశం ఇచ్చారు వంశీగారు. ఆ పాట (రారమ్మని.. రారా రమ్మని...) పెద్ద హిట్ అయింది. తర్వాత కూడా బాలూగారితో 15 పాటలు దాకా పాడే అదృష్టం దక్కింది. బాలూగారు తెలుగు మ్యుజీషియన్ అసోసియేషన్కి ఎన్నో సలహాలు ఇచ్చి ఎంతో సాయం చేశారు. ‘చెన్నై యూనియన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సింగర్స్కి కష్టమొచ్చినప్పుడు వారికి సాయం చేయటానికి నిధులు లేకపోతే ఎలా చేస్తారు? మీరందరూ కలిసి ఓ ఫండ్‡రైజింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయండి. ఆ కార్యక్రమానికి నేను వచ్చి ఫ్రీగా పాడతాను. నేను వస్తే నాతో పాటు అందరూ వస్తారు’ అన్నారు. దానివల్ల చక్కని నిధి ఏర్పడింది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ పరికరాలు రావటం వల్ల చాలామంది ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాద్యకారులకు పనిలేకుండా పోయింది. వారికేమన్నా ఇబ్బంది కలిగి ఆసుపత్రులకు వెళితే ఆ ఖర్చులను మా యూనియన్ భరిస్తోంది. బాలూగారి దయవల్లే చేయగలుగుతున్నాం’’ అన్నారు. మా కోసం వంట చేశాడు – కేజే ఏసుదాస్ ‘‘నాతో పని చేసినవాళ్లలో బాలు నాకు సోదరుడితో సమానం. బాలు నన్నెంత ప్రేమించాడో నాకే తెలియదు. బహుశా మేమిద్దరం గత జన్మలో అన్నదమ్ములం అయ్యుంటాం’’ అన్నారు ప్రముఖ గాయకుడు కె.జె. ఏసుదాస్. బాలు గురించి ఇంకా మాట్లాడుతూ – ‘‘శాస్త్రీయంగా సంగీతం నేర్చుకోకపోయినా బాలూకి సంగీతం మీద ఉన్న జ్ఞానం అపారమైనది. అద్భుతంగా పాడటమే కాదు, కంపోజ్ కూడా చేసేవాడు. ‘శంకరాభరణం’ చిత్రంలో బాలు పాడిన తీరు అచ్చు సంగీతాన్ని ఔపోసన పట్టినవాడు పాడినట్టే ఉంటుంది. బాలు ఎప్పుడూ ఎవర్నీ నొప్పించలేదు. ఆప్యాయంగా, ప్రేమతోనే మాట్లాడేవాడు. ప్యారిస్లో కన్సర్ట్కి వెళ్తే మాకు వంట చేశాడు ఓసారి. కరోనా వల్ల అమెరికా నుంచి ఇండియా రాలేకపోతున్నాను. బాలూని చివరిసారిగా చూడలేకపోయినందుకు బాధగా ఉంది’’ అన్నారు ఏసుదాస్. పెద్ద లోయలో పడినట్లనిపించింది – పి. సుశీల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో తనకున్న అనుబంధం గురించి ప్రముఖ గాయని పి. సుశీల మాట్లాడుతూ – ‘‘కరోనా ఇంత అలజడి రేపుతుందని అనుకోలేదు. మనందరికీ కావాల్సిన బాలూను వెంటాడి వెంటాడి తీసుకెళ్లిపోయింది. ఎంత బాగా ఉండేవాడు. ఆయన వచ్చిన తర్వాత సినిమా, టీవీ.. ఇలా రెండు రంగాల్లోనూ అందరూ బిజీగా ఉండేవారు. వీళ్లకు తీపి ఎక్కువైంది అని కన్ను కుట్టినట్టుంది ఆ మహమ్మారికి.. మనందర్నీ దుఃఖసముద్రంలో ముంచేయాలని ఆయన్ను తీసుకెళ్లిపోయింది. ఇక మీద పాటలు వస్తాయి. కానీ బాలూ లేడు. ఈ వార్త వినగానే ఒళ్లు గగుర్పొడిచింది. దేశ విదేశాల్లో ఆయన అభిమానులున్నారు. ఆయనతో మొట్టమొదటిసారి అమెరికా షోకి వెళ్లాను. ఇప్పటికీ అదే అభిమానంతో ఆదరణ లభిస్తోంది. ఆయన మరణవార్త వినగానే ఒకేసారి ఓ పెద్ద లోయలో పడినట్టు అయిపోయింది. అందరూ గుండె ధైర్యం చేసుకోని ఉండాలి. ఘంటసాలగారిని మెప్పించాడు. మరిపించాడు. ఆయన్ను మర్చిపోవాలంటే చాలా కష్టం. నాతో ఫస్ట్సారి పాడినప్పుడు కొంచెం భయపడి, మెల్లిగా తేలికపడి పాడాడు. ఇప్పుడు అందర్నీ మెప్పించేశాడు. అలాంటి బాలు ఇక లేడా? తీసుకోలేకపోతున్నాను. దేవుడే మనకు బలం ఇవ్వాలి. ఘంటసాలగారు వెళ్లిపోయారు. రాజేశ్వరరావు గారు వెళ్లిపోయారు. ఇంకా ఎందరో మహానుభావులు వెళ్లిపోయారు. కానీ బాలు నిష్క్రమణాన్ని మాత్రం తట్టుకోలేకపోతున్నాం. ధైర్యంగా ఉందాం’’ అన్నారు. ఆయన నాకు తండ్రిలాంటివారు – ఉష ‘‘బాలసుబ్రహ్మణ్యం గారి వల్లే నేను సినిమా పరిశ్రమలో ఉన్నాను. ఆయన నాకు తండ్రి లాంటివారు. ‘పాడుతా తీయగా’ లాంటి పెద్ద ప్లాట్ఫాం మీద నన్ను అభినందించి, ప్రోత్సహించి ఇక్కడవరకు తీసుకొచ్చింది ఆయనే’’ అన్నారు గాయని ఉష. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి ఇంకా మాట్లాడుతూ – ‘‘నాకే కాదు ఎంతోమందికి బాలూగారు ఇటాంటి వేదిక మీద అవకాశాలు ఇచ్చారు. ఎప్పుడూ సరదాగా ఉంటూ అందరినీ ఆహ్లాదపరుస్తూ చిన్నపిల్లలను ట్రీట్ చేసినట్లు నన్ను ట్రీట్ చేసేవారు. ఆయన ఆయాచితంగా ఎవరినీ పొగడరు. ఆయనతో మెప్పు పొందటమంటే సామాన్యమైన విషయం కాదు. నేను ఆయనతో కలిసి చాలా స్టేజ్ షోలు చేశాను. శైలజగారు ఆ ప్రోగ్రామ్లో లేకపోతే ‘వేదం అనువణువున నాదం...’ పాటను నాతో పాడించేవారాయన. బాలూగారు అమెరికా వచ్చినప్పుడు ‘మావారితో ఇండియా వచ్చేయండయ్యా’ అని ఎంతో ప్రేమగా మాట్లాడేవారు. ఆయనతో కలిసి స్టేజ్ షేర్ చేసుకోవటం, అనేక సినిమాల్లో ఆయనతో ఓ 15 పాటలదాకా పాడటం అంతా నా అదృష్టంగా భావిస్తున్నా. మొదట ఆరోగ్యం నుండి కోలుకోవటానికి ఆయన ఎంతో పోరాడారు. ఫిజియోథెరపీ కూడా చేయించుకుని, ఎప్పుడెప్పుడు బయటికి రావాలా అనుకున్నారు. రెండోసారి సమస్య వచ్చినప్పుడు ఆయన గివ్అప్ చేసేశారు. ఆయన లేకపోవటం వ్యక్తిగతంగా నాకు ఎంతో నష్టం’’ అన్నారు ఉష. ఆయన దగ్గర నేను నేర్చుకున్న పాఠం అదే – ఏఆర్ రెహమాన్ ‘‘బాలూగారి దగ్గర నుంచి నేను నేర్చుకున్న పాఠం దేనికీ ‘నో’ చెప్పకపోవడం. ఎలాంటి ప్రయోగానికైనా నిత్యం సిద్ధంగా ఉంటారాయన. పాడటానికైనా, యాక్టింగ్కి అయినా, మ్యూజిక్ డైరెక్షన్కి అయినా దేనికైనా సిద్ధమే’’ అన్నారు రెహమాన్. యస్పీ బాలుతో తనకున్న అనుబంధాన్ని వీడియో రూపంలో తెలిపారు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఆ వీడియోలో ఈ విధంగా మాట్లాడారు. ‘‘ఓసారి యస్పీబీగారి పుట్టిన రోజు వేడుకలో పెర్ఫార్మ్ చేశాను. అదే నా తొలి పెర్ఫార్మెన్స్. 1982లో మేము మ్యూజిక్ అకాడమీలో ఉన్నప్పుడు ఆ వేడుక జరిగింది. అది నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం. నన్ను ఆయనకు పరిచయం చేసింది సుహాసినీగారే. నేను వేరే సంగీత దర్శకుల వద్ద కీబోర్డ్ ప్లేయర్గా పని చేసే సమయంలో యస్పీబీగారు 15 నిమిషాల్లో పాటను నేర్చుకొని, 10 నిమిషాల్లో పాడేసి మరో పాటను రికార్డ్ చేయడం కోసం వెళ్లిపోయేవారు. అలాంటి గాయకుడిని నేనెక్కడా చూడలేదు. అంత ప్రొఫెషనల్, అంత వేగం, అంత మంచితనం. నా తొలి చిత్రం ‘రోజా’లో ‘నా చెలి రోజావే..’ పాట రికార్డ్ చేయడానికి స్టూడియోకి వచ్చారు. ‘ఇలాంటి స్టూడియోలో సినిమాటిక్ సౌండ్ని సృష్టించగలమా?’ అని సందేహం వ్యక్తం చేశారు. నేను నవ్వాను. సినిమా విడుదలైన తర్వాత ‘సినిమాటిక్ సౌండ్ ఎక్కడైనా సృష్టించొచ్చు అని నిరూపించావు’ అని అభినందించారు. జీవితాన్ని పూర్తిగా జీవించారు ఆయన. అందర్నీ ప్రేమించారు. అందరిచే ప్రేమించబడ్డారు. మన విజయాల్లో, విషాదాల్లో, వినోదాల్లో, ప్రేమలో, భక్తిలో ఆయన గాత్రం ఎప్పటికీ ఉంటుంది. ఆయనంత విభిన్నమైన సింగర్ మళ్లీ ఉంటారో ఉండరో కూడా నాకు తెలియదు. ఆయన సంగీతాన్ని, జీవన విధానాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని మనందరం సెలబ్రేట్ చేసుకోవాలి. సౌతిండియా అందరిలో ఓ భాగం యస్పీబీ’’ అన్నారు రెహమాన్. -
కూతురితో కలిసి స్టెప్పులేసిన టాప్ సింగర్
ఆమె గాత్రానికి పరవశించని హృదయం లేదు. తన గీతాలతో అభిమానులను ఓలలాడించం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. పాడుతా తీయగాతో కెరీర్ ప్రారంభమై, వచ్చిన అవకాశాలను విజయపు మెట్లుగా మలుచుకుంటూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని రూపొందించుకున్నారు గాయని ఉష. అయితే ఆమె పాటలు పాడటమే కాదు, డ్యాన్సులు కూడా చేయగలనంటున్నారు. ఈ మేరకు కూతురుతో కలిసి "బరేలీ కీ బర్ఫీ" సినిమాలోని బరేలీవాలె ఝుంఖే పె జియా లాల్చే... పాటకు చిందులేసి అందరినీ ఆశ్చర్యపర్చారు. "కరోనా కాలంలో వీకెండ్ ఫన్" అంటూ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అద్భుతంగా డ్యాన్స్ చేశారంటూ ఆమెపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. (ఏదీ మీ వెనుక రాదు) కాగా ఆమె శ్రీకాంత్ దేవరకొండ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ను పెళ్లి చేసుకుంది. వారికి బాబు అగస్త్యసాయి, కూతురు సహస్రసిద్ధి అని ఇద్దరు పిల్లలున్నారు. ఇదిలా వుండగా ఉష ఇంద్ర, పాండురంగడు, నీ స్నేహం, నువ్వు లేక నేను లేను, దిల్, చిరుత, వర్షం, మన్మథుడు, మననసంతా నువ్వే వంటి పలు సినిమాల్లో పాటలు పాడారు. అంతేకాక తెలుగుతోపాటు కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లోనూ పాటలు పాడారు. రెండుసార్లు ఉత్తమ నేపథ్య గాయనిగా నంది అవార్డులు అందుకున్నారు. (సల్మాన్ఖాన్తో సాన్నిహిత్యం పెరిగింది) -
వీర వనిత.. ప్రశంసల వెల్లువ
దిండుగల్ సమీపంలోఓ మహిళ ప్రభుత్వ రవాణాశాఖ అధికారుల్లో కదలికవచ్చే వరకూ పోరాడింది. తన కుమారుడిలా ఎవరూ బాధ పడకూడదని, సమస్యనుపరిష్కరించే వరకూ కదిలేదని లేదని పట్టుపట్టి కూర్చుంది.ఎట్టకేలకు స్పందించిన అధికారులు సమస్యనుపరిష్కరించారు.. సాక్షి, చెన్నై: దిండుగల్ నందవనపట్టికి చెందిన ఉషా శనివారం తన మూడేళ్ల కుమారుడు పాండితో వత్సలగుండు వెళ్లేందుకు తేని వెళ్లే బస్సులో ఎక్కింది. ఇరువురూ డ్రైవర్ వెనుక సీట్లో కూర్చున్నారు. దిండుగల్ సమీపంలో బస్సు వెళ్తుండగా కుమారుడు పాండి కుడి కాలు సీటు కింద ఉన్న రంధ్రంలో చిక్కుకుంది. దీంతో అప్రమత్తమైన ఆమె కుమారుడు పడిపోకుండా గట్టిగా పట్టుకుంది. కాలుకు గాయం ఏర్పడకుండా మెల్లిగా పైకితీసింది. తర్వాత కండక్టర్ ఇరువురిని వేరొక సీట్లో కూర్చోబెట్టారు. దీని గురించి ఉషా తన సెల్ఫోన్లో దిండుగల్ రవాణా సంస్థ మేనేజర్ పుహలేందికి ఫిర్యాదు చేసింది. రంధ్రాన్ని వెంటనే పూడ్చివేయాలని కోరింది. అయితే అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు. దీంతో బస్సు వత్సలగుండు చేరుకోగానే బస్సు నుంచి దిగనంటూ బిడ్డతో పాటు బైఠాయించింది. బస్సును అక్కడి నుంచి బయలుదేరనీయకుండా డిపోకు తీసుకువెళ్లాలని పట్టుపట్టింది. దీంతో దిక్కుతోచని కండక్టర్, డ్రైవర్ బస్సులో ఉన్న ప్రయాణీకులందరిని దింపివేసి వేరొక బస్సులో పంపారు. బస్సును వత్సలగుండు డిపోకు తీసుకువెళ్లారు. అదే బస్సులో ఉషా కూడా వెళ్లింది. అక్కడ డిపో మేనేజర్ నాగపాండియన్ ఉషాకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. వారి సమాధానంతో తృప్తి చెందని ఆమె తన పోరాటాన్ని కొనసాగించింది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో దిండుగల్ నుంచి రవాణా సంస్థ మేనేజర్ పుహలేందన్ వత్సలగుండు చేరుకున్నారు. బస్సులో ఉన్న రంధ్రాన్ని పూడ్చివేయాలని సిబ్బందికి ఉత్తర్వులిచ్చారు. ఉషా సమక్షంలో రంధ్రాన్ని సిబ్బంది పూడ్చివేశారు. బస్సులో మిగతా లోపాలను సరిచేశారు. ఆ తర్వాత ఉషా అక్కడి నుంచి బయలుదేరి వెళ్లింది. ఉషకు ప్రజల ప్రశంసలు అధికారులతో ఒంటరిగా పోరాడి పని సాధించుకున్న ఉషాకు ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలోను ఆమె చర్యను పలువురు అభినందిస్తున్నారు. దీని గురించి ఉషా మాట్లాడుతూ ప్రభుత్వ బస్సు రంధ్రాలలో పడి ప్రాణాపాయం ఏర్పడుతున్న సంఘటనలు జరుగుతున్నాయని, అయినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అదృష్టవశాత్తు తన కుమారుడిని కాపాడుకోగలిగానన్నారు. వేరెవరికీ ఇటువంటి ప్రమాదం జరగకూడదని తాను పోరాడినట్లు పేర్కొన్నారు. బస్సులకు మరమ్మతులు నిర్వహించాలని ఆమె అధికారులను కోరారు. (నటుడి తమ్ముడి ఆత్మహత్య.. కేసులో కొత్త కోణం) -
మా శౌర్య చిన్నప్పట్నుంచి మాస్
‘నర్తనశాల’ (2018) సినిమా తీసి తల్లిదండ్రులను బాధ పెట్టానని శౌర్య ఫీలయ్యాడు. మా బ్యానర్ నుంచి అలాంటి సినిమా వచ్చినందుకు నిర్మాతగా నేను బాధపడ్డాను. శౌర్య కెరీర్లో అది బిగ్గెస్ట్ డిజాస్టర్. ఆ బాధను తీసేసేలా ‘అశ్వథ్థామ’ మంచి సంతోషాన్ని ఇచ్చింది’’ అన్నారు నిర్మాత ఉషా మూల్పూరి (నాగశౌర్య తల్లి). రమణతేజ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా శంకర్ప్రసాద్ సమర్పణలో ఉషా మూల్పూరి నిర్మించిన చిత్రం ‘అశ్వథ్థామ’. నాగశౌర్య ఈ సినిమాకు కథ అందించారు. జనవరి 31న ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో నిర్మాత ఉషా మూల్పూరి మాట్లాడుతూ – ‘‘మా చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కె. రాఘవేంద్రరావుగారు, నందినిరెడ్డిగారు ఫోన్ చేసి అభినందించారు. శౌర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వస్తున్నాయి. చిత్రం చాలా బాగుందని, ఇంకా మూడు నుంచి నాలుగు వారాలు థియేటర్స్లో బాగా ఆడుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెబుతుండటం సంతోషాన్నిచ్చింది. యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాను ఆదరిస్తున్నారు. మనకు ఒక నిర్భయ, దిశ కేసులు తెలుసు. కానీ ‘అశ్వథ్థామ’లో చూపించిన విధంగా కూడా జరుగుతుందని మనలో చాలామందికి తెలియదు. కథ పరంగా శౌర్యకు మంచి స్పందన వస్తోంది. శౌర్య ఇలాంటి కథ రాసినందుకు ఒక నిర్మాతగా కంటే కూడా ఒక తల్లిగా బాగా సంతోషపడుతున్నాను. కథ చెప్పినప్పుడు శౌర్య సామాజిక బాధ్యతతో ఆలోచిస్తున్నాడని మేం ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాం. ‘అశ్వథ్థామ’ చిత్రంతో శౌర్యలోని మాస్ యాంగిల్ని ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. కమర్షియల్ హీరోతో సినిమా చేయాలనుకునేవారికి శౌర్య కూడా ఒక మంచి ఆలోచన. నిజానికి చిన్నప్పటి నుంచి కూడా శౌర్య ఫుల్ మాస్. సాఫ్ట్ క్యారెక్టర్ కాదు. కానీ ఇండస్ట్రీలో క్యూట్ అండ్ లవర్బాయ్ అనే పేరు వచ్చింది. శౌర్య అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చాడు. హీరో అయ్యాడు. ఇప్పుడు రైటర్ అయ్యాడు. భవిష్యత్లో దర్శకుడు అవుతాడేమో ఇప్పుడే తెలియదు. ఇండస్ట్రీకి మేం చాలా ప్యాషనేట్గా వచ్చాం. మా బ్యానర్లో తర్వాతి చిత్రం వేరే హీరోతో ఉండొచ్చు. మా బ్యానర్లో అందరి హీరోలతో సినిమాలు చేయాలనుకుంటున్నాం. మా అబ్బాయి ఒక్కరే హీరో కాదు కదా! రాఘ వేంద్రరావుగారితో శౌర్య సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు. -
బాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్: షాకింగ్ సీక్రెట్స్
ముంబై: ప్రస్తుతం టాలీవుడ్ను కుదిపేస్తున్న క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారాన్ని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేయడం ద్వారా సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ బాలీవుడ్లో కొత్త వివాదానికి తెరలేపారు. ఇండస్ట్రీ మహిళను రేప్ చేసి, రోడ్డున పడేయదని, అందుకు బదులు ఆమెకు జీవనోపాధిని అందిస్తుందని ఆమె పేర్కొన్నారు. సరోజ్ ఖాన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పలువురు సినీ ప్రముఖులు ఆమె వ్యాఖ్యలను తప్పుబట్టారు. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్లో నెలకొన్న క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై బీబీసీ ఒక సంచలన డాంక్యుమెంటరీని ప్రసారం చేయబోతోంది. రాధికా ఆప్తే, ఉషా జాధవ్ వంటి ప్రముఖులతో సహా పలువురు వర్థమాన నటీనటులు తమ అనుభవాలను ఈ డాక్యుమెంటరీలో వెల్లడించారు. ‘బాలీవుడ్ డార్క్ సీక్రెట్’ పేరిట ఈ డాక్యుమెంటరీని బీబీసీ ప్రసారం చేయనుంది. ‘హాలీవుడ్ తరహాలో బాలీవుడ్లో మీటూ ఉద్యమం లేదు. కానీ హిందీ చిత్ర పరిశ్రమ కూడా లైంగిక వేధింపులు, దూషణలకు అతీతం కాదని పలువురు నటీనటుల అనుభవాన్ని రజనీ వైద్యనాథన్ మన ముందుకు తెస్తున్నారు’ అంటూ దీనిని ప్రసారం చేయనుంది. ఈ డాంక్యుమెంటరీలో రాధికా ఆప్తే మాట్లాడుతూ.. ‘కొందరు తమను తాము దేవుళ్లుగా భావిస్తారు. వాళ్లు శక్తివంతుల. మేం మాట్లాడినా ఎవరూ పట్టించుకోరులే అనే భావనలో ఉంటారు. ఒకవేళ ఎవరైనా మాట్లాడితే వారి కెరీర్ నాశనమైనట్టేనని భావిస్తారు. మహిళలు, పురుషులు కలిసికట్టుగా ముందుకొచ్చి ఇది జరగకూడదని నిర్ణయిస్తే ఇది ఆగిపోతోంది. అలాంటిది ఇక్కడ రావాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు. సినిమాల్లో అవకాశం దొరకాలంటే నిర్మాతతో, దర్శకుడితో పడుకోవాలని తనకు చెప్పారని నటి ఉషా జాధవ్ తన అనుభవాలను వివరించారు. ఈ డాక్యుమెంటరీలో ఓ వర్ధమాన నటి షాకింగ్ విషయాలు వెల్లడించారు. తనను ఒక వ్యక్తి నిత్యం లైంగికంగా వేధించాడని ఆమె తెలిపారు. ‘ఇండస్ట్రీలో పని దొరకాలంటే.. ఎప్పుడు వీలైతే అప్పుడు శృంగారంలో పాల్గొనడం ఆనందంగా భావించు. నీ సెక్సువాలిటీని ఒప్పుకో’ అని అతను సూచించాడని చెప్పారు. ‘ అతను కావాలనుకున్నప్పుడల్లా నన్ను తాకేవాడు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ముద్దు పెట్టుకునేవాడు. అతని ప్రవర్తన నన్ను షాక్కు గురిచేసింది’ అని ఆమె తెలిపారు. గతంలోనూ పలువురు బాలీవుడ్ నటీమణులు క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. రిచా చద్దా, స్వర భాస్కర్ వంటి వారు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని వెల్లడించారు. అయితే, తమను లైంగికంగా వేధించిన వారి పేర్లను వారు వెల్లడించలేదు. -
మట్టినిల్లు
పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్లిన అమ్మాయికి మిగిలింది మట్టే! జీవితాన్నంతా పిండి ఆ మట్టిలో పోసినా.. ఆ పంట ఎప్పటికీ మెట్టినింటిదే. మట్టిని నమ్ముకున్న మహిళకు.. మెట్టినిల్లు ఏమౌతుంది? మట్టినిల్లే! సరిగ్గా గుర్తులేదు కానీ, పెళ్లయ్యేనాటికి పదమూడో పధ్నాలుగో రాజేశ్వరికి! ఇంకా చెప్పాలంటే గవర్నమెంటు స్కూల్లో ఎయిత్ క్లాస్ బోర్డు మీదకు ఆమె పేరు ఎక్కినప్పుడు! అప్పుడు తనతో పాటు మరో ముప్ఫయ్ మంది అమ్మాయిలు కూడా అదే ఊర్లో బడిమానేసినట్లు రాజేశ్వరికి గుర్తు. టెన్త్ క్లాస్ కష్టపడి చదివి పాసైతే పక్కనే ఉన్న సిద్ధిపేట కాలేజీలో చేరొచ్చని తనూ తన ఫ్రెండ్సంతా ఎన్ని కలలుగన్నారు?! ఎలాగోలా టెన్త్లో మంచి మార్కులు తెచ్చుకుంటే ఇక ఇంట్లో కూడా.. చదువు మాన్పించమని నాన్న అడగరు. ఆ తరువాత నర్స్ ట్రైనింగ్కి వెళితే హైదరాబాద్లో ఏ ఆసుపత్రిలో నైనా జాబ్ చేయొచ్చు. తనకోసం, తన చెల్లెళ్లిద్దరికోసం ఎండనకా వాననకా అమ్మపడే కష్టం చూడలేకపోతోంది. పుస్తకాలకీ, పెన్నులకీ ఏ అవసరానికైనా అమ్మేగా డబ్బులివ్వాల్సింది. ఆమె కూలికెళ్లి దాచిన డబ్బుతో కష్టపడి చదువుకుంది కనుకనే అమ్మ కష్టం తీర్చాలనుకుంది. అసలు అమ్మ పోరు పడలేకే కదా నాన్న రాజేశ్వరిని బళ్లో చేర్చింది. ఆయనకైతే ఎప్పుడూ తనకు పెళ్లి చేసి పంపించేయాలన్న తొందరే ఉండేది. అయితే తను మాత్రం అంత త్వరగా బడి మానేయాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు రాజేశ్వరి. ఆ రోజు ఆ సంఘటన జరగకపోతే ఆమె కచ్చితంగా ఆ గొడ్డుచాకిరీ నుంచి తప్పించుకోగలిగి ఉండేది. చదువుకు అదే చివరి రోజు! అప్పటికే గుసగుసగా అంతా చెప్పుకుంటున్నారు. రాజేశ్వరిని హెడ్మాస్టర్ పిలిచారని. క్లాస్లోకి వెళ్లకుండానే మధ్యలోనే క్లాస్ టీచర్ ఎదురయ్యి చెప్పారు చాలా కోపంగా.. హెడ్మాస్టర్ రమ్మంటున్నారని. భయం భయంగానే హెడ్మాస్టర్ సుధాకర్ సార్ దగ్గరికి వెళ్లింది రాజేశ్వరి. ఏం జరిగిందో చెప్పకుండా చెడామడా తిట్టారాయన. ‘‘ఎందుకొస్తారు బడికి? ఏ ఇంట్లోనో నాలుగు అంట్లు తోముకోకుండా? ఇలా మగపిల్లల్ని చెడగొట్టడానికా? కనీసం పుస్తకాలు కొనుక్కోడానికి డబ్బులుండవు కానీ ప్రేమాదోమా అంటూ ఊరేగుతున్నారు? ఇంకెప్పుడైనా ఇలా జరిగితే ఊర్కునేది లేదు. నీ ప్రమేయం లేకుండా వాడెవడో అలా ఎందుకు రాస్తాడు? మానేస్తే బడిమానేసెయ్! రేపు మీ నాన్నని తీసుకొని బడికిరా’’ కఠినంగా ఉంది హెడ్మాస్టర్ గొంతు! రాజేశ్వరికేం అర్థం కాలేదు. దుఃఖం పొంగుకొస్తోంటే పరుగుపరుగున క్లాసులోకి అడుగుపెట్టింది. ఇంకా సార్ రాలేదు. తన ప్లేస్లో కూర్చోగానే ఫ్రెండ్సంతా చుట్టుముట్టారు. ఏమైందంటూ. అనుకోకుండా బోర్డువైపు చూసాక కానీ అర్థం కాలేదు. ఏం జరిగిందో. చక్కగా చెక్కినట్టు ఉన్నాయి అక్షరాలు ‘ఐలవ్ రాజేశ్వరి’ అని! అదే ఆమె చదువుకు ఆఖరు. రాజేశ్వరిని చదువు మాన్పించి పెళ్లి చేసేసారు మేనమామకిచ్చి. ఆ తరువాత తెలిసింది.. ఆ భయంతో.. అదే స్కూల్లో చదువుతోన్న మరో ముప్ఫయ్ మంది అమ్మాయిలు వరుసగా మానేసారని! ‘‘ఏ లోకంలో ఉన్నవమ్మా? ఎన్ని రోజులేడుస్తవ్? ఎన్ని రోజులేడిసినా పోయినోడు తిరిగొస్తడా.. సక్కనైన కొడుకునిచ్చిండు. అత్తమామ ఉండనే ఉన్నరు. ఒళ్లు దాసుకోకుండా కష్టం జేసి ఇంటికి సరిపోయే నాలుగు గింజలు పండిస్తున్నవ్. ఆడున్నా గానీ బాయికాడ కష్టమంత నీదే గదనే పోరి. పో.. పో..’’ పక్కింటి శాంతక్క మాటలకు ఉలిక్కిపడి ఈలోకంలోకొచ్చింది రాజేశ్వరి. వ్యవసాయాన్ని ఇష్టంగా చేసినోడు తన భర్త. తిన్నడా తినలేదా? ఎవరికిదెలుసు? పొద్దున లేస్తే పొలంలనే ఉండెటోడు. పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేక, ధర బల్కక ఉన్న పొలంలనే ఉరిబెట్టుకుండు. భర్త పోయాక చేనే తోడయ్యింది ఒక్కసారి శాంతక్క అన్న మాటలు గుర్తొచ్చాయి. వెంటనే భర్త, తండ్రి, మామ మాటలు కూడా గుర్తొచ్చాయి రాజేశ్వరికి. ‘‘ఆడున్న గానీ బాయికాడి కష్టమంత నీదేగదనే’’ అన్నది శాంతక్క. అరుగుమీద కూర్చున్న మామకి చురకెయ్యాలని అన్నదో, లేక తన కష్టాన్ని చూసింది కనుకనో మాటైతే అన్నది. ఒక్కసారి తనని తేరిపార చూసుకుంది రాజేశ్వరి. మట్టిముద్దలా ఉంది. బళ్లో తనెలా ఉండేది? సీన్మాయాక్టర్లెందుకు పనికొస్తరే నీదగ్గర అనేటోళ్లు ఫ్రెండ్సంతా. 30 ఏళ్లు కూడా నిండలేదు.. ముగ్గురు బిడ్డలతో భర్తను పోగొట్టుకొని ఏకాకిగా మిగిలింది. చేలో చేసిన చాకిరికి చిక్కి శల్యమైంది. ఈ మట్టిలోనే కదా తన పధ్నాలుగో ఏటినుంచి పనిచేసింది. భర్తన్నా ఏదో ఒక రోజు ఇంట్లో ఉండేవాడు. పొలంలోకి అడుగుపెట్టకుండా ఏ రోజూ గడవలేదు. మట్టివాసన చూడని రోజు తనకి ముద్ద దిగదు గదా! భార్యాభర్తలిద్దరూ ఎప్పుడూ అనుకునేవారు.. ఛస్తే ఈ మట్టిలోనే చావాలి. అంతేగానీ వ్యవసాయం మాత్రం మానొద్దని. కానీ అలాంటిది రాత్రి ఎంత మాటన్నాడు మామ. తాను, తన భర్త ఎంతో ప్రేమించిన ఈ భూమి తన భర్త తరువాత తనకి రాదట. ఆడదాని పేరుమీ§ð ట్ల బెడతరు పొలం అన్నడు. ఆడదాని కష్టమైతే తింటరుగానీ పొలం మాత్రం ఉండదట. అప్పుడు చదువు.. ఇప్పుడు భూమి ఆలోచిస్తోంటే అర్థమౌతోంది రాజేశ్వరికి. అమ్మ పేరు మీద భూమి లేదు. అత్త పేరునా లేదు. ఇప్పుడు తన పేరున కూడా ఉండదు. పొద్దున లేస్తే పొలంలో కాయకష్టం జేసే తనకి భూమిని రాసివ్వనని కరాఖండీగా చెప్పిన మామ తన మూడేళ్ల కొడుక్కిస్తానన్నాడు. అదికూడా వాడికి పద్ధెనిమిదేళ్లొచ్చాక! అంటే ఇంతకాలం ఒక పశువులా పొలంలో పనిచేసిన తన కష్టం ఏమయ్యింది? ఇప్పడు తనకి కాకుండా ఎప్పుడో పదిహేనేళ్ల తరువాత తనకొడుక్కి పొలం రాయడం ఏమిటి? ఆడవాళ్లకు భూములుండొద్దా? రేపు తన కొడుకు తనకి అన్నం పెట్టకపోతే... ఆ భూమి అమ్ముకుని తాగేస్తే... అప్పుడు చదువు, ఇప్పుడు భూమి ఏదీ తనకు సంబంధం లేకుండానే తనకు దూరమవుతాయి. అవి తనకెంత ప్రియమైనవైనా! ఆలోచిస్తూనే నడుస్తోంది. రాజేశ్వరికి తనకు తెలియకుండానే పొలంవైపు అడుగులు పడుతున్నాయి. బడి మాన్పించారు. పెళ్లి చేసేశారు. పొలంలోనే భర్త ఉరివేసుకున్నాడు. ముగ్గురు పిల్లలతో ఏకాకి అయింది. తన భూమికే తను కూలీగా మిగిలింది. మళ్లీ స్త్రీల చేతికి రావాలి ఎక్కడైనా చూడండి స్త్రీల పేరున భూమి ఉండదు. ఉండనివ్వదు ఈ పురుషాధిపత్య సమాజం. ఎవరికైనా ఉంటే అది హింసకి కారణమౌతుంది. మరీ ముఖ్యంగా ఒంటరి స్త్రీల పేరున భూమి ఉన్నచోట స్త్రీలపై దాడులు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే దానికి ఆస్తి అనే కారణం పైకి కనిపించదు. చేతబడులు చేస్తోందనో, లేకపోతే ఆమెకు మంత్రాలూ, తంత్రాలూ వచ్చనో, అదీ కాకపోతే ఇంకేదో కారణం చూపుతారు తప్ప ఆస్తి కారణంగా దాడి జరిగిన గుర్తులు బయటకు పొక్కనివ్వరు. అందుకే సంపదపై పురుషుడి పెత్తనం మాత్రమే ఉండాలి అనే ఆధిపత్య భావజాలాన్ని అంతమొందించాలి. ఉత్పత్తి సాధనాలపై పురుషులు ఆధిపత్యం సంపాదించిన నాటినుంచే స్త్రీలు ద్వితీయ శ్రేణి పౌరులుగా తయారయ్యారు. అవి మళ్లీ తిరిగి స్త్రీల చేతికి వస్తేనే స్త్రీలపై జరిగే అన్ని రకాల హింసల నుంచీ వారికి విముక్తి లభిస్తుంది. ఆ మార్పు రావాలి. అది ప్రభుత్వాల నుంచే మొదలు కావాలి. – ఉషా సీతాలక్ష్మి, సామాజిక కార్యకర్త, రచయిత -
మోదీని ఇన్సల్ట్ చేసినందుకే.. అలా చేశాడు!
ముంబై: ఎయిరిండియా విమానంలో శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ దుష్ర్పవర్తన యావత్ దేశాన్నే కాదు.. ఆయన కుటుంబసభ్యులను కూడా విస్మయపరిచింది. తన భర్తలోని అంత దురుసు కోణాన్ని చూడటం ఇదే తొలిసారి అని గైర్వాడ్ భార్య ఉషా 'ముంబై మిర్రర్'కు తెలిపారు. 'నా భర్త ఎవనైనా అలా కొట్టగలరని నేనెప్పుడూ అనుకోలేదు. ఢిల్లీలో తొలిసారి ఆయనలోని హింసాత్మక కోణాన్ని చూశాను. ఎయిరిండియా సిబ్బంది దురుసు ప్రవర్తన వల్లే ఆయన అలా ప్రతిస్పందించారు' అని ఆమె అన్నారు. తన భర్తకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని, ఆయన ఇలాంటి చర్యకు పాల్పడుతారని వ్యక్తిగతంగా ఆయన గురించి తెలిసినవారు ఎవరూ భావించరని చెప్పుకొచ్చారు. కొన్నేళ్ల కిందట ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్లో రంజాన్ సందర్భంగా ఓ ముస్లిం వ్యక్తికి బలవంతంగా తినిపించేందుకు ప్రయత్నించి.. గైక్వాడ్ వివాదం రేపిన సంగతి తెలిసిందే. తన భర్తకు అంత కోపం రావడం తానెప్పుడూ చూడలేదని, ఎయిరిండియా సిబ్బంది మొరటుగా ప్రవర్తించడం వల్లే ఆయన సహనం కోల్పోయారని ఆమె చెప్పారు. విమానంలో ఎయిరిండియా సిబ్బందిని చెప్పుతో కొట్టి.. వారిపై దౌర్జన్యపూరితంగా గైక్వాడ్ ప్రవర్తించడం సబబేనా అని ప్రశ్నించగా.. 'ఎయిరిండియా నాసిరకం సేవలు గురించి మా ఆయన ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా పట్టించుకోలేదు. ఫిర్యాదు తీసుకోవడానికి బదులు వారు వాగ్వాదానికి దిగారు. చివరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేరును అగౌరవపరుస్తూ అవమానకరంగా మాట్లాడారు. అందువల్లే ఆయన సహనం కోల్పోయారు' అని ఆమె అన్నారు. -
సైనా షేర్ చేసిన వీడియోలో ఏముంది?
-
సైనా షేర్ చేసిన వీడియోలో ఏముంది?
న్యూఢిల్లీ: ఆటల్లో రాణించేందుకు క్రీడాకారులు ఎంతో శ్రమిస్తుంటారు. ముఖ్యంగా ఫిట్ నెస్ కాపాడుకునేందుకు కఠినమైన కసరత్తులు చేస్తుంటారు. తమ పిల్లలను క్రీడాకారులుగా తీర్చిదిద్దే క్రమంలో వారి తల్లిదండ్రులు కూడా ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. పిల్లల కోసం అవసరమైతే ఆటలు నేర్చుకునే తల్లిదండ్రులు ఉన్నారు. ఈ కోవలోకే చెందుతారు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తల్లి ఉష. కూతురు కోసం ఆమె కఠినమైన కసరత్తులు చేస్తున్నారు. ఇటీవల మోకాలి గాయానికి శస్త్రచికిత్స చేయించుకుని కోలుకున్న తర్వాత సైనా నెహ్వాల్.. మలేషియా మాస్టర్స్ గ్రాండ్ ప్రి గోల్డ్ టైటిల్ గెలిచి సత్తా చాటింది. తాను వేగంగా కోలుకుని మళ్లీ ఆడడం వెనుక తన తల్లి ఉష ప్రోత్సాహం ఎంతో ఉందని చెప్పేందుకు సైనా తన ట్విటర్ పేజీలో షేర్ చేసిన వీడియో నిదర్శనంగా నిలుస్తోంది. తన తల్లి జిమ్ లో కఠిన కసరత్తులు చేస్తుండగా తీసిన వీడియోను సైనా పోస్ట్ చేసింది. ఈ వీడియాఓ చూసిన వారంతా సైనాను ప్రోత్సహించేందుకు ఆమె తల్లి పడుతున్న కష్టాన్ని మెచ్చుకుంటున్నారు. -
చాక్లెట్లు తెచ్చా.. లే అమ్మా!
పొద్దునే లేచి నన్ను రెడీ చేస్తివే.. చాక్లెట్లు తెస్తవా అంటివే.. నీ కోసం చాక్లెట్లు తెచ్చానమ్మా.. లే అమ్మా..ఒక్కసారి నన్ను చూడమ్మా.. నాతో మాట్లాడమ్మా.. అంటూ ఆ చిన్నారి తన తల్లి చెంపలు నిమురుతూ, గుండెలపై పడి ఒక్కో మాట అడుగుతుంటే అక్కడుకున్న ప్రతి ఒక్కరి హృదయం ద్రవించింది. గణతంత్ర దినోత్సవానికి అందంగా తయారైన తన ముద్దుల తనయ తిరిగి ఇంటికొచ్చే సరికే ఆ తల్లి నిర్జీవంగా మారడంతో ఆ పసి హృదయం విలవిల్లాడిపోయింది. - గుత్తి --------------------------------------------- గుత్తి సీపీఐ కాలనీలో నివాసముండే బేల్దారి మల్లికార్జున భార్య ఉరుకుందమ్మ గురువారం ఆత్మహత్య చేసుకుంది. భర్త వ్యసనాలకు బానిస కావడం.. తాగేందుకు చేసిన అప్పులు తడిసిమోపెడవడం.. అప్పుల వారి ఒత్తిళ్లు ఎక్కువ కావడం.. మరోవైపు కుటుంబ ఆర్థిక పరిస్థితి, పిల్లల భవిష్యత్తు ఆ ఇల్లాలిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. భర్తలో మార్పు తీసుకువద్దామని ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఇక జీవితంపై విరక్తి పెంచుకుంది. చివరకు ఉరుకుందమ్మ ఆత్మహత్య చేసుకుంది. పాపను ముస్తాబు చేసి.. పాఠశాలలో జరిగే గణతంత్ర దినోత్సవానికి కుమార్తె ఉషా(ఏడో తరగతి)ను రెడీ చేయాలని ఐదు గంటలకే ఉరుకుందమ్మ నిద్ర లేచింది. పాపను తలంటుస్నానం చేయించి, కొత్త బట్టలు వేసింది. టాటా చెపుతూ.. వచ్చేటప్పుడే తనకు చాక్లెట్లు తీసుకురావాలని కోరింది. సరేనమ్మానంటూ ఆ చిన్నారి తల్లికి టాటా చెప్పి బయలుదేరింది. చాక్లెట్లు తల్లికి ఇద్దామని తొందరగా ఇంటికొచ్చినా... బడిలో ఇచ్చిన చాక్లెట్లను తన తల్లికి ఇద్దామని ఆత్రంగా ఇంటికొచ్చిన ఆ చిట్టి తల్లికి ఇంటి ముందు జనాలు గుంపుగా ఉండడం చూసి ఏం జరిగిందో అర్థం కాలేదు. లోపలికి వెళ్లి చూడగా విగతజీవిగా మారిన తల్లిని చూసి కన్నీరుమున్నీరైంది. చాక్లెట్లు కావాలంటివే అమ్మా.. నీకోసమే తెచ్చాను తిను తల్లీ.. నువ్వే తినకపోతే ఇక ఈ చాక్లెట్లు ఎవరికి ఇవ్వాలమ్మా..అంటూ ఆ చిన్నది అడగడం అక్కడున్న వారి హృదయాలను బరువెక్కించింది. తల్లి గుండెలపై పడి రోదించిన చిన్నారిని చూసి ప్రతి ఒక్కరూ కన్నీరుకార్చారు. ఆ చిట్టి తల్లిని ఓదార్చడం ఎవరికీ సాధ్యం కాలేదు. ఆలస్యంగా ఇంటికి చేరుకున్న కుమారుడు విశ్వనాథ్ సైతం అమ్మ మృతదేహంపై పడి హృదయ విదారకంగా విలపించాడు. -
వరంగల్ అమ్మాయి పామిడిలో ప్రత్యక్షం
పామిడి : అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని అంబేడ్కర్ కాలనీ బైపాస్లో రెండు రోజులుగా తిరుగుతున్న అమ్మాయి(16)ని శుక్రవారం స్థానికులు గుర్తించారు. ఆ కాలనీవాసి, అబ్దుల్ కలామ్ స్వచ్ఛంద సంస్థ సభ్యుడు పీటర్ విజయ్ ఆ అమ్మాయిని పలకరించారు. తనది తెలంగాణలోని వరంగల్ అని, పేరు ఉష, తండ్రి పేరు మల్లయ్య అని తెలిపింది. తననెవరో ఇక్కడికి తెచ్చి వదిలారని చెప్పింది. ఈ సమాచారాన్ని చైల్డ్లైన్ 1098 సంస్థ సభ్యురాలు మల్లీశ్వరికి స్థానికులు అందజేశారు. దీంతో ఆమె ఈ అమ్మాయిని పామిడి పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. -
ఆటో డ్రైవర్ కుటుంబంపై ఖాకీ క్రౌర్యం
చెన్నై: ఓ ఆటో డ్రైవర్ కుటుంబంపై ముగ్గురు ఖాకీలు తమ ప్రతాపం చూపించిన వైనం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తిరువణ్ణామలై జిల్లా చెంగం లో సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పంచాయితీ శానిటరీ కార్మికురాలు ఉష, ఆటో డ్రైవర్ రాజా భార్యాభర్తలు. వీరికి సూర్య (17) కొడుకు కూడా ఉన్నాడు. రాజా,ఉష మధ్య స్వల్ప తగాదా రావడంతో భార్యను చెంపమీద కొట్టాడు రాజా. అనవసరంగా బంగారం కొనుగోలు చేసిందన్నది రాజా ఆరోపణ. వారిద్దరి మధ్య వివాదం నడుస్తుండగా అక్కడే ఉన్న ముగ్గురు పోలీస్ కానిస్టేబుళ్లు కల్పించుకున్నారు. అనంతరం రాజాపై చేయి చేసుకున్నారు. విషయాన్ని రాజా వివరించే లోపే మురుగనందం, విజయ కుమార్, నమ్మాజ్వార్ అనే కాని స్టేబుళ్లు రాజాపై విరుచుకుపడి వీరంగం సృష్టించారు .పట్టపగలు నడివీధిలో తమ ఖాకీ క్రౌర్యాన్ని ప్రదర్శించారు. అడ్డొచ్చిన సూర్యపైనా లాఠీ ఝళిపించారు. తన భర్తను, కొడుకుని విడిచిపెట్టమని ఉష వేడుకున్నా వినకుండా ప్రతాపాన్ని చూపించారు. అంతేకాదు ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నించిన అక్కడ గుమిగూడిన వారిని కూడా లాఠీలతో చితక బాదారు. చివరికి బాధితులను అలాగే వదిలేసి వెళ్లిపోయారు. స్థానికులు వారిని సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో ప్రమాదాన్ని పసిగట్టిన మిగతాపోలీసులు హాస్పిటల్ కు వచ్చి బాధితులతో బేర సారాలకు దిగారు. కానీ అప్పటికే ఆ దృశ్యాలన్నీ మీడియాలో హల్ చల్ చేశాయి. దీంతో వివాదం ముదిరి ..పోలీస్ ఉన్నతాధికారుల వద్దకు చేరింది. మరోవైపు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధితులు, తొక్కవాది గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. తమపై విరుచుకుపడిన ముగ్గురు పోలీసులపైనా కేసులు నమోదు చేయాలని కోరారు. దీనిపై జిల్లా ఎస్పీ ఆర్. పొన్ని ని వివరణ కోరగా విచారణ జరుగుతోందని, చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముగ్గురు నిందితులను వెల్లూరు బదిలీ చేశామని.. ఈ ఘటనపై చెంగం డీఎస్పీ పూర్తి విచారణ తరువాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని ఆమె చెప్పారు. దీనిపై స్థానిక ప్రజాసంఘాలు, వామపక్షపార్టీలు విమర్శలు గుప్పించాయి. -
ప్రేమా? స్నేహమా?
‘‘మీకు సునీత అనే అమ్మాయి తెలుసా?’’.. కిరణ్ ఆఫీసునుంచి రాగానే అడిగింది ఉష. ‘‘హా.. తెలుసు. ఏం?’’ సమాధానం చెప్తూ అడిగాడు కిరణ్. ‘‘ఎవరావిడ?’’ ‘‘ఫ్రెండ్.’’ ‘‘ఫ్రెండా? గాళ్ ఫ్రెండా?’’ ‘‘మ్మ్మ్... ఫ్రెండ్, హూ ఈజ్ ఎ గాళ్. అడగాలనుకున్నదేదో సూటిగా అడుగు. డొంక తిరుగుడొద్దు.’’ ‘‘సూటిగానే అడుగుతున్నా.. ఆవిడ మీకెంత క్లోజ్? ‘‘అన్ని విషయాలూ మాట్లాడుకునేంత క్లోజ్. చాలా?’’ ‘‘మాటలేనా... లేక?’’ ‘‘వాట్ డూ యూ మీన్?’’ ‘‘అంటే.. మాటలతోనే ఆగారా... లేక ఇంకా ముందుకు పోయారా? అని.’’ ‘‘సీ ఉషా! నాకు కుమార్ ఎలాగో సునీత కూడా అంతే. కుమార్తో డిస్కస్ చేసినట్లే తనతోనూ డిస్కస్ చేస్తుంటా.’’ ‘‘కుమార్ అన్న విషయం వేరు. ఆవిడతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది?’’ ‘‘ఒకచోట పనిచేస్తున్నప్పుడు మాట్లాడుకోక తప్పదు.’’ ‘‘అంటే.. మీరు మీ ఆఫీసులో ఆడాళ్లందరితో అలాగే క్లోజుగా మాట్లాడతారా?’’ ‘‘అందరితో కాదు.. సునీతతో మాత్రమే.’’ ‘‘ఆవిడతోనే ఎందుకు అంత క్లోజుగా మాట్లాడటం?’’ ‘‘నాకు యండమూరి నవలలంటే ఇష్టం, ఇళయరాజా సంగీతమంటే పిచ్చి. తనకు కూడా అంతే. అలా కామన్ ఇంట్రస్ట్ల గురించి మాట్లాడుకుంటాం.’’ ‘‘ఓహో.. అన్ని అభిరుచులూ అంతగా కలిశాయన్నమాట.’’ ‘‘అలాగనేం లేదు. నాకు రామ్గోపాల్ వర్మ సినిమాలంటే పిచ్చి, ఆవిడకు ఆర్జీవీ పేరెత్తితేనే మంట. సో, వాటి గురించి మాట్లాడుకోం. నువ్వు ఏదేదో ఊహించుకుని పిచ్చిపిచ్చిగా మాట్లాడకు. షి ఈజ్ మై ఫ్రెండ్... అంతే!’’ ‘‘ఆహా.. ఫ్రెండ్ని కన్నా, బుజ్జీ అని కూడా పిలుస్తారా?’’ ‘‘ఓహ్.. అదా నీ ప్రాబ్లమ్. తన ముద్దుపేరు బుజ్జి, అందుకే అప్పుడప్పుడూ అలా పిలుస్తాను. అంతే!’’ అలాఅలా ఆ సంభాషణ చిలికి చిలికి గాలివానగా మారింది. ఉష, కిరణ్ ఇద్దరూ హద్దులు దాటి మాటలు అనేసుకున్నారు. దాంతో ఉష కోపంగా ఇల్లు విడిచి వెళ్లిపోయింది. కిరణ్ ఆపే ప్రయత్నం చేయలేదు. ‘‘ఏమైందిరా?’’ చెల్లిల్ని అనునయంగా అడిగింది రేఖ. ‘‘కిరణ్ సునీత అనే ఆవిడతో రెగ్యులర్గా మాట్లాడుతున్నాడు, చాట్ చేస్తున్నాడు.’’ ‘‘నువ్వు చూశావా?’’ ‘‘హా.. మొన్న తను మొబైల్ మర్చిపోయి ఆఫీసుకు వెళ్లినప్పుడు చెక్ చేశా. ఇద్దరూ గంటలకు గంటలు చాట్ చేసుకుంటున్నారు.’’ ‘‘అవునా... దేని గురించి మాట్లాడుకుంటున్నారు?’’ ‘‘ఏవో.. ఆఫీసు విషయాలు. మేనేజ్మెంట్ సబ్జెక్ట్ గురించి.’’ ‘‘ఇంకా?’’ ‘‘సినిమాలు, మ్యూజిక్, లిటరేచర్ గురించి.’’ ‘‘ఇంకా?’’ ‘‘ఫ్యామిలీస్ గురించి.’’ ‘‘అంతేగా... అంత మాత్రానికే బాధపడతావేం?’’ ‘‘నువ్వు అలాగే అంటావ్. బావగారు వేరే ఎవరితోనైనా మాట్లాడితే తెలుస్తుంది ఆ బాధేంటో. ఆవిడతో కిరణ్కు రిలేషన్ షిప్ ఉందేమోనని డౌట్గా ఉందక్కా. ఆవిడను బుజ్జీ, గజ్జీ అని పిలుస్తున్నాడు.’’ ‘‘వాళ్ల చాటింగ్లో రొమాంటిక్ విషయాలున్నాయా?’’ ‘‘వూహూ... అలాంటివేం లేవు.’’ ఉష సమస్యేమిటో రేఖకు అర్థమైంది. ‘‘సరేరా.. నీ ఫీలింగ్ నాకు అర్థమౌతుంది. అయితే ఈ విషయాన్ని మనం సైంటిఫిక్గా విశ్లేషించుకుంటే మంచిది. రాబర్ట్ స్టెర్న్బర్గ్ అనే సైకాలజిస్ట్ ప్రేమ గురించి ఓ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దాని గురించి మాట్లాడుకుందాం.’’ ‘‘సరే.. చెప్పు’’ అయిష్టంగానే అంది ఉష. ‘‘స్టెర్న్బర్గ్ సిద్ధాంతం ప్రకారం ప్రేమలో అభిరుచి (ప్యాషన్), సాన్నిహిత్యం (ఇంటిమసీ), నిబద్ధత (కమిట్మెంట్) ఈ మూడూ ఉంటేనే అది పరిపూర్ణమైన ప్రేమ. ఇద్దరు వ్యక్తుల మధ్య కేవలం సాన్నిహిత్యం మాత్రమే ఉంటే అది నిజమైన స్నేహం. నిబద్ధత మాత్రమే ఉంటే శూన్యమైన ప్రేమ, కేవలం ప్యాషన్ మాత్రమే ఉంటే అది ఆకర్షణ. ప్యాషన్, ఇంటిమసీ రెండూ ఉంటే అది రొమాంటిక్ లవ్. సాన్నిహిత్యంతో పాటు నిబద్ధత ఉంటే అది సహచర ప్రేమ. ప్యాషన్, కమిట్మెంట్ మాత్రమే ఉంటే అది ఫాచువస్ లవ్. ఇలా ప్రేమలో ఆరు రకాలుంటాయి. ఇప్పుడు చెప్పు... సునీతకూ, కిరణ్కు మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటో?’’ ‘‘వాళ్లిద్దరి అభిరుచులు కలిశాయనే చెప్పాడు కిరణ్.’’ ‘‘కదా.. మరి నువ్వెందుకు వేరేలా అనుకున్నావ్?’’ ‘‘అంటే అక్కా... ఆవిడ్ని బుజ్జీ అని పిలిచేసరికి...’’ ‘‘అది ఆవిడ పెట్నేమ్ కూడా అయ్యుండొచ్చుగా?!’’ ‘‘అవును... ఆవిడ్ని ఇంట్లో అలానే పిలుస్తారని చెప్పాడు కిరణ్.’’ ‘‘కదా? అందుకే అతనూ అలా పిలిచి ఉంటాడు. అయినా ఓసారి అతనితో మాట్లాడుతాలే. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా ఉండు.’’ అని చెప్పింది రేఖ. ‘‘సరే అక్కా’’ అంటూ నవ్వింది అనుమానాలు వీడిన ఉష. - డా॥విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
వివాహిత ఆత్మహత్య
వైఎస్సార్ జిల్లా బద్వేలు మండలం బయనపల్లి గ్రామంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. రైల్వే కోడూరు పట్టణానికి చెందిన భూపాల ఉష (40) బయనపల్లిలోని బంధువుల ఇంటికి వచ్చింది. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలతో ఆమె మృతి చెందింది. మృతికి గల కారణాలు తెలియరాలేదు. -
అగ్ని ప్రమాదంలో గృహిణి మృతి
వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై మంటలు అంటుకోవడంతో ఓ గృహిణి మృతిచెందింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉష(40) అనే గృహిణి ఇంట్లో వంట చే స్తున్న సమయంలో ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై మంటలు ఎగిసిపడటంతో అందులో చిక్కుకొని ఆమె మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కాఫీనా? క్యారెట్టా?
‘‘అక్కా...’’ ఫోన్లో ఏడుస్తోంది ఉష. ‘‘ఏంట్రా.. ఏమైంది?’’ అడిగింది రేఖ. ‘‘కిరణ్ ఏమీ మారలేదు.’’ ‘‘మొన్ననే కదా నేనొచ్చి మాట్లాడా. మారతాడ్లే. కాస్త ఓపిక పట్టు.’’ ‘‘నావల్లకాదు. పొద్దున లేచిన దగ్గర్నుంచీ మొబైల్తో కాపురం చేసేవాడికి నేనెందుకూ?’’ ‘‘అరె.. అతనేదో మొబైల్లో బుక్స్ చదువుకుంటున్నా అనుమానిస్తావేం?’’ ‘‘ఏమో ఏం చేస్తున్నాడో ఎవరికి తెలుసు?’’ ‘‘నువ్వు ఇప్పటికే ఒకటికి రెండుసార్లు చెక్ చేశావుగా.. ఏం చేస్తున్నాడోనని.’’ ‘‘ఏమో... ఇంట్లో ఏమీ తెలియలేదు. ఆఫీసులో ఏం చేస్తున్నాడో ఏమో!’’ ‘‘ఏయ్ మొద్దూ... కిరణ్ అలాంటి వాడేం కాదులే. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు పాడుచేసుకోకు.’’ ‘‘నీకేం.. బావగారు పువ్వుల్లో పెట్టు కుని చూసుకుంటారు కాబట్టి ఎన్ని మాట లైనా చెప్తావ్. పడే వాళ్లకు తెలుస్తుంది ఆ బాధేంటో...‘‘ నిష్టూరమాడింది ఉష. ఇప్పుడేం చెప్పినా వినే మూడ్లో లేదని అర్థమైంది రేఖకు. ‘‘సరే... ఇక్కడకు రా. నాల్రోజులు ఉండి వెళ్దువుగాని’’ అని చెప్పింది. సరేనని ఫోన్ పెట్టేసింది ఉష. మర్నాడు ఉదయానికంతా ఉష అక్క ఇంటికి వచ్చేసింది. ‘‘హేయ్ ఉషా... ఏంటీ సర్ప్రైజ్ విజిట్?’’ అని పలకరించాడు బావ ఆనంద్. ‘‘అక్కనూ పిల్లల్నీ చూడాలనిపించి వచ్చాను బావా’’ అంది. ‘‘ఓకే.. ఓకే.. ఎంజాయ్. లోపలున్నారు చూడు.’’ ఉష లోపలకు వెళ్లి అక్కను పలక రించి, పిల్లలతో కాస్సేపు మాట్లాడింది. ఆనంద్, పిల్లలు స్కూల్కి వెళ్లాక అక్కా చెల్లెళ్లు కూర్చున్నారు తాపీగా. భార్యా భర్తల మధ్య అభిప్రాయభేదాలు, చిన్న చిన్న గొడవలూ సాధరణమేనని నచ్చ జెప్పేందుకు రేఖ ఎంత ప్రయత్నించినా వినడం లేదు ఉష. మాటలతో చెప్తే తనకు అర్థం కాదని అర్థమైంది రేఖకు. అందుకే వంటింట్లోకి తీసుకెళ్లింది. రెండు గిన్నెల్లో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టింది. నీళ్లు బాగా మరిగాక ఒక గిన్నెలో గుడ్లు, క్యారట్లు... మరో గిన్నెల్లో కాఫీ గింజలు వేసింది. ‘‘గుడ్లు, క్యారెట్లు కలిపి వండుతావా ఏంటక్కా?’’.. ఆశ్చర్యంగా అడిగింది ఉష. అవునని తలూపింది రేఖ. ‘‘అవునా? కోడిగుడ్లు, క్యారెట్లు కలిపి వండుతారని నాకు ఇప్పటివరకూ తెలియదు.’’ ‘‘ఇప్పుడు తెలిసిందిగా. ఎలా చేస్తానో చూడు.’’ ఆసక్తిగా చూస్తోంది ఉష. బాగా ఉడికాక స్టవ్ ఆపేసి, ఓ ప్లేటులో క్యార ట్, కోడిగుడ్డు పెట్టి... ‘‘ఆ క్యారెట్ ఎలా ఉందో చూడవే’’ అంది. ‘‘మెత్తగా ఉందక్కా.’’ ‘‘మరి గుడ్డు?’’ ‘‘గట్టిగా ఉంది.’’ ‘‘సరే... ఈ కాఫీ ఎలా ఉందో చెప్పు’’ అంటూ మరగబెట్టిన డికాషన్తో కాఫీ కలిపి ఇచ్చింది. ‘‘సూపర్గా ఉందక్కా.’’ ‘‘నువ్వు క్యారట్లా ఉంటావా? కోడి గుడ్డులా ఉంటావా? లేదంటే కాఫీలా ఉండాలనుకుంటున్నావా?’’ అడిగింది చెల్లెలి ముఖంలోకి చూస్తూ. అర్థం కాలేదు ఉషకి. అయోమయంగా ఫేస్ పెట్టింది. ‘‘నీకు అర్థం కాలేదు కదా. సరే... మామూలుగా క్యారెట్, గుడ్డు, కాఫీ గింజలు ఎలా ఉంటాయ్?’’ ‘‘క్యారట్, కాఫీ గింజలు గట్టిగా ఉంటాయి. గుడ్లు డెలికేట్గా ఉంటాయి.’’ ‘‘కదా... మరిగే నీళ్లలో వేసి ఉడకబెట్టాక?’’ ‘‘క్యారెట్ మెత్తగా అవుతుంది. గుడ్లు గట్టిగా మారతాయి. కాఫీగింజలు కూడా కాస్త మెత్తబడతాయి.’’ ‘‘కరెక్ట్. చూడూ... మరిగే నీళ్లు మన లైఫ్లో వచ్చే సమస్యల్లాంటివి. అందరికీ ఎప్పుడో ఒకసారి సమస్యలు వస్తూనే ఉంటాయి. వాటికి ఒక్కొక్కరూ ఒక్కోలా రియాక్ట్ అవుతారు’’ అని చెల్లెలి వైపు చూసింది. ఆమె శ్రద్ధగా వింటోంది. దాంతో హుషారుగా చెప్పసాగింది. ‘‘కొందరు మొదట్లో క్యారట్లా గట్టిగా ధైర్యంగా ఉంటారు. కానీ సమస్యలు తట్టుకోలేక మెత్తబడతారు. కొందరు గుడ్డులా సున్నితమైన మనసుతో ఉంటారు. కానీ సమస్యలతో మనసును రాయిలా మార్చుకుంటారు. మరికొందరు కాఫీ గింజల్లా తెలివిగా ఉంటారు. తమ సమయస్ఫూర్తితో చుట్టూ ఉన్న సమస్యలను కూడా సువాసనాభరితంగా, అంటే తమకు నచ్చేలా, సంతోషాన్ని ఇచ్చేలా మార్చేస్తారు. అర్థమైందా?’’ ‘‘హా... అర్థమైందక్కా.’’ ‘‘ఇప్పుడు చెప్పు... నువ్వెలా ఉన్నావ్? ఎలా ఉండాలను కుంటున్నావ్?’’ ‘‘ఇప్పుడు నేను ఎగ్లా ఉన్నాను. కానీ భవిష్యత్తులో కాఫీ గింజల మాదిరిగా ఉండాలనుకుంటున్నాను .’’ ‘‘దట్స్ గుడ్. ఆల్ ద బెస్ట్’’ అంటూ ప్రేమగా చెల్లెల్ని హగ్ చేసుకుంది రేఖ. - డాక్టర్ విశేష్ కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
మాటల మేకులు కొట్టొద్దు!
ఆత్మబంధువు ‘‘ఉషా... ఉషా... ఎన్నిసార్లు పిలవాలి?’’ ‘‘ఏం కావాలి కిరణ్?’’ ‘‘నా సాక్స్ కనిపించ ట్లేదు. ఎక్కడ పెట్టావ్?’’ ‘‘ఆ మాత్రం వెతుక్కోలేవా?’’ ‘‘నేను సాక్స్ వెతుక్కుంటూ కూర్చుంటే ఆఫీసుకు లేట్ అవుతుంది.’’ ‘‘సాక్స్ వెతికిస్తూ కూర్చుంటే నాకూ లేట్ అవుతుంది ఆఫీసుకు.’’ ‘‘ఏంటీ.. మాటకు మాట సమాధానం చెప్తున్నావ్?’’ ‘‘చెప్పకపోతే లెక్క లేదా అంటావ్. చెప్తే మాటకు మాట అంటావ్. ఎలా నీతో?’’ ‘‘అంటే నేను గొడవ పడుతున్నానంటావా?’’ ‘‘బాబూ... నేనేం అన్లేదు. నువ్వు ఆఫీసుకు బయల్దేరు. నేనూ బయల్దేరాలి... బై.’’ మమ్మీ... మమ్మీ.. అరుస్తున్నాడు గౌతమ్. ఉషా, కిరణ్ల ముద్దుబిడ్డ. ‘‘ఏంటి నాన్నా ఏమైంది?’’ ‘‘నా షూ పాలిష్ చేయలేదు.’’ ‘‘చేసుకో నాన్నా.’’ ‘‘నేనెందుకు చేసుకోవాలి? నువ్వే చెయ్.’’ ‘‘నేను పన్లో ఉన్నారా. ఈ రోజుకు నువ్వు చేసుకో.’’ ‘‘నో.. నేను చేసుకోను. నువ్వు చేస్తావా? లేదా?’’ ‘‘నాకిప్పుడు కుదరదు నాన్నా.’’ బ్యాడ్ మమ్మీ అనుకుంటూ స్కూల్కు వెళ్లిపోయాడు గౌతమ్. వాడన్న మాటకు ఉష మనసు చివుక్కుమంది. ‘ఏంటిది, నేనిన్ని చేస్తున్నా వీడిలా అనేశాడు’ అనుకుంది. కోపంలో అచ్చం తండ్రి పోలికే. చిన్న చిన్న విషయాలకు కూడా అరిచేస్తూ ఉంటాడు. వీడినిలా వదిలేస్తే కష్టం అనుకుంటూ ఆఫీసుకు బయల్దేరింది, మమ్మీ... మమ్మీ... అరుస్తు న్నాడు గౌతమ్. ‘‘మళ్లీ ఏమైందిరా?’’ అడిగింది ఉష. ‘‘నేను స్కూల్కు వెళ్లను.’’ ‘‘ఏం? ఏమైందీ?’’ ‘‘నాకు మా టీచర్ నచ్చ లేదు. ఇవ్వాళ నాకు పనిష్మెంట్ ఇచ్చింది.’’ ‘‘నువ్వేం చేశావ్?’’ ‘‘గోపాల్ నా పెన్సిల్ తీసుకున్నాడని కొట్టాను. అందుకని పనిష్మెంట్ ఇచ్చింది.’’ ‘‘పెన్సిల్ తీసుకుంటే కొట్టేస్తావా? తప్పుకదా?’’ ‘‘కొడతాను’’... గట్టిగా చెప్పాడు గౌతమ్. వాడి కోపానికి బ్రేక్లు వేయకపోతే భవిష్యత్తులో కష్టమనుకుంది ఉష. ఇంట్లోకి వెళ్లి కొన్ని మేకులు, ఒక సుత్తి తెచ్చింది. ‘‘నాన్నా.. నేనో పని చెప్తా చేస్తావా?’’ అడిగింది గౌతమ్ని. ఏంటో చెప్పమన్నాడు. ‘‘ఇదిగో.. ఈ మేకులు, సుత్తి తీసుకో. నీకు ఎప్పుడు కోపమొస్తే అప్పుడు కోపం తగ్గేంతవరకూ ఈ మేకులు ఆ చెక్కకు కొట్టెయ్’’ అంటూ ఎదురుగా హృదయాకారంలో ఉన్న ఎర్రటి చెక్కను చూపించింది. ‘‘అంతే కదా. ఐయామ్ రెడీ’’ అంటూ మేకులు, సుత్తి అందుకున్నాడు గౌతమ్. టీచర్ మీదున్న కోపంతో 25 మేకులు కొట్టేశాడు. ‘‘ఉషా.. ఈ చెక్క, మేకులు, సుత్తి గొడవేంటీ? వాడికేమైనా దెబ్బ తగిలితే’’ అరిచాడు కిరణ్. ‘‘ఏం కాదులే కిరణ్. నువ్వు గమ్మునే ఉండు. లెట్ హిమ్ డూ దట్’’ అంది ఉష. ‘‘మమ్మీ... ఈ మేకులిలా ఎన్ని రోజులు కొట్టాలి?’’... మర్నాడు అడిగాడు గౌతమ్. ‘‘నీకు కోపం ఉన్నన్ని రోజులూ కొట్టు’’... చెప్పింది ఉష. ‘‘మరి చెక్క నిండిపోతే?’’ ‘‘నువ్వు కోప్పడిన మనిషికి నువ్వు సారీ చెప్పినప్పుడు ఓ మేకు తీసెయ్. అప్పుడు గ్యాప్ వస్తుంది.’’ ‘‘నేనెందుకు చెప్పాలి సారీ?’’ అంటూ మరో నాలుగు మేకులు కొట్టేశాడు గౌతమ్. నెల రోజులు గడిచాయి. అప్పుడ ప్పుడూ చెప్పిన సారీలకు కొన్ని మేకులు తీసేయగా చెక్క దాదాపు నిండిపోయింది. ‘‘మమ్మీ... ఈ చెక్క నిండిపోయింది. ఇప్పుడేం చేయమంటావ్?’’ అడిగాడు గౌతమ్. ‘‘ఒక్కో మేకుకూ ఒక్కో సారీ చెప్తూ బయటకు తియ్’’... చెప్పింది ఉష. గౌతమ్ ఇష్టం లేకుండానే సారీ చెప్తూ, కష్టపడి ఒక్కో మేకూ బయటకు లాగుతూ చెక్క ఖాళీ చేసేశాడు. ‘‘ఇప్పుడు చూడు.. చెక్క ఎలా ఉందో’’... అంది ఉష. ‘‘ఏం బాగుంది? అన్నీ బొక్కలే... అన్నాడు గౌతమ్. ‘‘ఇప్పుడు వాటిని పూడ్చేసి చెక్కను మామూలుగా మార్చు.’’ ‘‘అదెలా? చెక్కకు పడ్డ రంధ్రాలు పూడ్చడం ఎలా కుదురుతుంది?’’ ‘‘కదా... మరి అవి ఎలా వచ్చాయ్? మేకులు కొడితే వచ్చాయ్. నువ్వు మేకులు ఎప్పుడు కొట్టావ్? కోపం వచ్చినప్పుడు. నీకు కోపం వచ్చినప్పుడు ఇంకా ఏం చేస్తావ్?’’ ‘‘గట్టిగా అరిచేస్తాను.’’ ‘‘కదా... ఆ మేకులు నీ అరుపులన్నమాట. నువ్వు కోపంతో ఉన్నప్పుడు మాటలు నీకు తెలియ కుండానే వచ్చేస్తాయి. అవి ఎదుటివాళ్లకు కష్టం కలిగిస్తాయి. నువ్వు ఎలాగైతే రంధ్రాలు పూడ్చలేనన్నావో.. అలాగే నువ్వెన్ని సారీలు చెప్పినా వాళ్లకు కలిగిన బాధ పూర్తిగా తొలగిపోదు.’’గౌతమ్కు విషయం అర్థమైంది. తను చేస్తున్న తప్పేంటో తెలిసొచ్చింది. ‘‘సారీ మమ్మీ’’ అంటూ ఉషను హగ్ చేసు కున్నాడు. ‘‘సారీ ఉషా’’ అంటూ కిరణ్ కూడా హగ్ చేసుకున్నాడా రాత్రి! -
ఫ్యాషన్ ‘ఉష’స్సు
ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్, ప్రథమ మహిళా పైలట్ ఉషా రఘునాథన్.. మరోమారు నగరానికి వచ్చారు. ఆమె తాజాగా డిజైన్ చేసిన దుస్తుల కలెక్షన్స్ను బంజారాహిల్స్ రోడ్నెం.1లోని సింఘానియాస్ బొటిక్లో గురువారం లాంచ్ చేశారు. ఇదే తన చివరి కలెక్షన్ అని ఆమె ఈ సందర్భంగా ప్రకటించారు. అయితే, జీవితానికి ఏదీ చివరిదంటూ ఉండదని, తాను తొలుత పైలట్గా కెరీర్ ప్రారంభించి డిజైనర్ దాకా ఎన్నో రకాల ప్రొఫెషన్స్ను ఎంజాయ్ చేశానని చెప్పారు. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా పర్యటించడమే తన లక్ష్యమన్నారు. రేఖ, హేమమాలిని, జయాబచ్చన్, షబానా అజ్మీ... వంటి ప్రముఖులు ఇష్టపడే సంప్రదాయ వస్త్రశైలులు అందించిన ఉషా రఘనాథన్ తమ బొటిక్లో కలెక్షన్ లాంచ్ చేయడం ఆనందదాయకమని, బ్లౌజ్లు, పట్టు చీరలు, సిల్క్-కాటన్ మిక్స్ చీరలు.. ఉష కలెక్షన్లో ఉన్నాయని షోరూమ్ నిర్వాహకులు తెలిపారు. - సాక్షి, లైఫ్స్టైల్ప్రతినిధి. -
కొత్త ప్రేమకథ
అందమైన ప్రేమకథకు కొన్ని ఆసక్తికరమైన సంఘటనలను జోడించి రూపొందిస్తున్న చిత్రం ‘కొన్ని రోజుల్లోనే ఇలా’. షారిఫ్, రాజేశ్, ఉష, లావణ్య ముఖ్యతారలుగా శ్రీరామ ఫిలిం పతాకంపై బుజ్జి హరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బుజ్జి గోపి దర్శకుడు. ‘‘ఓ విభిన్నమైన కథాంశంతో అందరినీ ఆక ట్టుకునేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరిస్తున్నాం. తదుపరి పాటల చిత్రీకరణకు గోవా వెళ్లనున్నాం’’ అని దర్శక, నిర్మాతలు తెలిపారు. -
ఉషని కాదు... కిరణ్ని...
రెండు కాళ్లూ చచ్చుబడిపోయినా, ఆత్మబలంతో అంగవైకల్యాన్ని జయించడమే కాకుండా, సమాజంలోని అభాగ్యులెందరికో అండగా నిలిచి పొరుగు రాష్ట్రాల్లో సైతం అంగవికలుర హక్కుల కోసం పోరాడుతున్నారు కిరణ్ అలియాస్ ఉష. కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న ఓ సామాజిక కార్యక్రమానికి రాష్ట్ర కోఆర్డినేటర్గా నియమితులై దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న ఉష... ఇటీవలే తన స్వస్థలమైన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేట గ్రామ శివారులోని హనుమాన్తండాకు వచ్చివెళ్లారు. ఆ సందర్భంగా సాక్షితో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె (అతడి) మాటల్లోనే... అబ్బు వెంకట్రెడ్డి, సాక్షి, నర్సంపేట మా అమ్మనాన్నలది కూలి పని చేస్తేగానీ పూటగడవని పరిస్థితి. నాకు ఒక అక్క, తము్మడు, చెల్లి. ఊహ తెలియక ముందే నా రెండు కాళ్లూ పోలియో వచ్చి చచ్చుబడిపోయూయి.బడికి పోవాలనే కోరిక బలంగా ఉండేది. కానీ ఎవరో ఒకరు ఎత్తుకుని తీసుకెళ్లనిదే బయటికి కదల్లేను కదా. తొలిసారి నా ఎనిమిదవ యేట బడికి వెళ్లాను. అది కూడా నేను బడికి పోతానని ఏడిస్తే కానీ అమ్మానాన్నలు ఒప్పుకోలేదు. మా తండా పక్క గ్రామంలో ఉన్న పాఠశాలకు నా స్నేహితుల సహకారంతో కష్టపడుతూ వెళ్లి పాఠాలు నేర్చుకున్నా. అమ్మ కన్నీళ్లే... నా పోరాటానికి ప్రేరణ అప్పుడు నాకు తొమ్మిదేళ్లు. వికలాంగుల సర్టిఫికెట్ ఉంటే ప్రభుత్వం నుంచి లబ్ది చేకూరుతుందని అందరూ అంటే అమ్మ నన్ను ఎత్తుకుని, నియోజకవర్గ కేంద్రమైన నర్సంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ పొద్దంతా ఉన్నా సర్టిఫికెట్ ఇవ్వలేదు. జిల్లా కేంద్రంలోని ఎంజీఎంలో తీసుకోండని చెప్పడంతో తిరిగి ఇంటికి వెళ్లకుండా సాయుంత్రం నర్సంపేట నుండి వరంగల్కు నన్ను అవ్ము తీసుకెళ్లింది. అక్కడ అప్పటికే సమయుం అయిపోయిందని, ఇప్పట్లో ఇవ్వలేమని అధికారులు చెప్పడంతో అక్కడి నుండి ఇంటికి వెళ్లి మరోరోజు వచ్చేందుకు బస్సు చార్జీలు లేక అమ్మ నన్ను తన ఒడిలో ఉంచుకుని ఆస్పత్రి ముందు ఉన్న ఫుట్పాత్పై రాత్రంతా చలిలో ఒణుక్కుంటూ, తనకు దోమలు కుడుతున్నా తన కొంగును నాపై కప్పి నిద్రపోకుండా మేల్కొనే ఉంది. తెల్లవారిన తర్వాత అమ్మ మళ్లీ ఆస్పత్రిలోకి వెళ్లి ఎవరెవరినో బతిమిలాడినా వికలాంగ సర్టిఫికెట్ రాలేదు. ఇక సాధ్యం కాదని నన్ను ఎత్తుకుని, ఏడ్చుకుంటూ ఇంటిబాట పట్టింది. అప్పుడే అమ్మను అడిగాను... ‘‘ఎందుకవ్మూ సర్టిఫికెట్? మనకెందుకు ఇస్తారవ్మూ? అని. ‘గవర్నమెంటోళ్లు మనకు ఇవ్వాలని రూల్ ఉన్నా ఇత్తలేరు బిడ్డా’ అని అమ్మ చెప్పిన మాటలు నాకింకా గుర్తే. అప్పుడే ఎలాగైనా సర్టిఫికెట్ పొందాలని నాలో సంకల్పం కలిగింది. వారం రోజుల తర్వాత నర్సంపేటలో క్యాంపు పెట్టినప్పుడు నేను వెళ్లాను. అక్కడ కొన్ని సాకులతో అధికారులు తప్పించుకునేందుకు చూస్తే, ఎదిరించి ఎందుకు ఇవ్వరంటూ వాళ్ల ముందు కూర్చోని గట్టిగా అరిచాను. నా అరుపులకు విలేకరులు, విద్యార్థులు, మరికొంత మంది నా దగ్గరికొచ్చి ఏమైందని ప్రశ్నించారు. నాకు సర్టిఫికెట్ ఇవ్వడంలేదని, చెప్పి ఇప్పించాలని వేడుకున్నా. సాయుంత్రం లోగా వికలాంగ సర్టిఫికెట్ నా చేతిలోకి వచ్చింది! అప్పుడే అనుకున్నా... పోరాడితే న్యాయుం జరుగుతుందని. నాటి నుండీ... నేను నడవలేని స్థితిలో ఉన్నా... నలుగురికి సహాయుం చేయూలనే లక్ష్యంతో వరంగల్ జిల్లాలో ప్రజ్వల వికలాంగుల పోరాట సంక్షేమ సంఘాన్ని ఏర్పరచి 2000 మందికి వారి హక్కుల సాధన కోసం సహాయుకురాలిగా ఉద్యమాలు నిర్వహించాను. అదే స్పూర్తి నేటికీ నన్ను ముందుకు నడిపిస్తోంది. అమ్మాయినే పెళ్లి చేసుకున్నా ఊళ్లో ప్రాథమిక విద్య అయ్యాక, ఇంటర్, డిగ్రీ నర్సంపేటలో పూర్తి చేసాను. ఆ సమయుంలో తోపుడు బండిపై ఎక్కడకు వెళ్లాలన్నా నా స్నేహితురాలి వల్లనే సాధ్యం అయింది. నేను ఆడపిల్లను అయినా, మగవారిలా కంఫర్ట్గా ఉండాలని నా వేషధారణ మార్చుకున్నాను. నన్ను అన్ని రకాలుగా అర్థం చేసుకుని, స్నేహితురాలిగా ఉన్న సాటి అమ్మాయిని వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను. నా ఆలోచనను నా స్నేహితురాలికి చెప్పాను. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అంగీకారం తెలిపింది. 2008 మార్చి 9న తిరుపతికి వెళ్లి వివాహం చేసుకున్నాం. ఈ విషయుం అందరికీ తెలిసి ఇదేం పని అని ప్రశ్నించారు. చివరకు మా తల్లిదండ్రులు కూడా అంగీకరించలేదు. దాంతో కర్ణాటక వెళ్లిపోయాం. కలిసి జీవిస్తున్నాం. నేను పేరు మార్చుకున్నాను. ఉష అని కాకుండా, కిరణ్గా పిలిపించుకోవడమే నాకు ఇష్టం. పోరు బాట... పరభాషను నేర్పింది ప్రస్తుతం చిక్బళ్లాపూర్లో ఉంటున్నాం. తోటి వికలాంగుల సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో 2009లో కర్ణాటక వికలాంగుల పోరాట సమితిని ప్రారంభించాను. తెలుగు భాష తప్ప ఇతర ఏ భాషా తెలియని నేను ఎలాగైనా కన్నడం నేర్చుకోవాలనుకున్నా. భాష రానిదే పోరుబాటలో నడవలేనని తెలుసుకుని కొద్ది కాలంలోనే కన్నడం నేర్చుకున్నాను. ఇప్పటి వరకు మా సమితిలో 25 వేల మంది వికలాంగులు సభ్యులుగా చేరారు. వారికి ఎలాంటి సమస్య ఉన్నా ముందుకు నడిచి ఆందోళనలు చేపట్టాను. దీంతో అక్కడి ప్రభుత్వాలు కూడా మా పోరాట బలాన్ని చూసి మాకు గుర్తింపునిచ్చాయి. ప్రస్తుతం హిజ్రాల తరపున జరుగుతున్న పోరాటానికి నాయకత్వం వహిస్తూనే, కర్ణాటక ప్రభుత్వం తరఫున లింగత్వ అల్పసంఖ్యాకుల వేదికకు రాష్ట్ర కోఆర్డినేటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. అలాగే కర్ణాటక ఎయిడ్స్ అవగాహన ప్రాజెక్ట్కు అయిదు జిల్లాల కోఆర్డినేటర్గా కూడా ఆ ప్రభుత్వం నాకు బాధ్యతలు అప్పగించింది. మున్ముందు నేను చేపట్టబోయే కార్యక్రమాలకు సొంత రాష్ట్రంలో కూడా ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నా. -
కుమార్తెతో కలిసి తండ్రి ఆత్మహత్య
బెంగళూరు(బనశంకరి) : ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మరో వ్యక్తితో వెళ్లిపోవడంతో మనస్థాపం చెందని భర్త, తన కుమార్తెతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన వివరాలు... హున్నేనహళ్లికి చెందిన గ్రాఫిక్ డిజైనర్ ప్రసన్నకుమార్(38), ఉషా ఏడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి కీర్తి(7) అనే కూతురు ఉంది. ఆరు నెలలుగా గుల్బర్గాకు చెందిన మల్లికార్జునతో ఉషా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే భర్తతో గొడవపడి నెల క్రితం మల్లికార్జునతో కలిసి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న కుటుంబ పెద్దలు జోక్యం చేసుకుని ఉషాను పిలుచుకువచ్చి దంపతుల మధ్య రాజీ చేసి, వదిలి వెళ్లారు. అయినా ఉషాలో మార్పు రాలేదు. తనకు విడాకులు కావాలంటూ వేధించేది. ఈ విషయంపై కోర్టుకు కూడా వెళ్లింది. విడాకులు ఇచ్చేందుకు ప్రసన్నకుమార్ అంగీకరించలేదు. దీంతో మూడ్రోజుల క్రితం ఉషా మళ్లీ మల్లికార్జునతో వెళ్లిపోయింది. దీంతో మనస్థాపం చెందిన ప్రసన్నకుమార్, కుమార్తె కీర్తితో కలిసి ఇంటిలో ఉరి వేసుకున్నాడు. సోమవారం ఉదయం ప్రసన్నకుమార్ తండ్రి ఇంటికి చేరుకుని తలుపు తట్టినా తెరవకపోవడంతో బద్దులు గొట్టి లోపలకు వెళ్లి చూశాడు. తండ్రి, కూతురు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. ఘటనపై రాజానుకుంట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
శ్రీనివాసరావుకు స్వర్ణం
ఉష, వెంకట లక్ష్మిలకు కాంస్యాలు * జాతీయ క్రీడలు త్రిసూర్: జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ తొలి రోజే స్వర్ణ పతకంతో మెరిసింది. ఆదివారం సోమవారం జరిగిన వెయిట్లిఫ్టింగ్ పోటీల్లో ఏపీ ఆటగాళ్లు మూడు పతకాలు సాధించారు. పురుషుల 56 కేజీల విభాగంలో వల్లూరి శ్రీనివాస రావు (243 కేజీలు) స్వర్ణం సాధించగా... మహిళల 48 కేజీల విభాగంలో బంగారు ఉష (161 కేజీలు), 53 కేజీల విభాగంలో వెంకట లక్ష్మి (168 కేజీలు) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు సాధించారు. ఈ ముగ్గురూ విజయనగరం జిల్లాకు చెందిన వెయిట్లిఫ్టర్లు కావడం విశేషం. 2011 జార్ఖండ్ జాతీయ క్రీడల్లో ఇదే విభాగంలో పోటీ పడి స్వర్ణం దక్కించుకున్న 34 ఏళ్ల శ్రీనివాస రావు ఈసారి కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేశాడు. మహిళల 53 కేజీల విభాగంలో పోటీపడాల్సిన ఆంధ్రప్రదేశ్ స్టార్ వెయిట్లిఫ్టర్ మత్స సంతోషి బరిలోకి దిగలేదు. తొలిరోజు జరిగిన పోటీల్లో హరియాణా ఆరు స్వర్ణాలు, ఓ రజతంతో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. -
తిరుపతి ఎంపీపీపై అనర్హతవేటు
మరో ఇద్దరు ఎంపీటీసీ సభ్యులపై కూడా.. విప్ను ధిక్కరించినందుకే! జెడ్పీ మీటింగ్కు రానీయకుండా అడ్డుకునేందుకే జెడ్పీకి సమాచారం చిత్తూరు(టౌన్): తిరుపతి మండలాధ్యక్షునిపై అనర్హ త వేటు పడింది. విప్ను ధిక్కరించిన నేరానికి ఎంపీపీతో పాటు మరో ఇద్దరు ఎంపీటీసీ సభ్యులపై అనర్హత వేటు వేసినట్టు ఆ మండల ఎన్నికల ప్రిసైండిం గ్ అధికారి, ఎంపీడీవో సుశీలాదేవి జిల్లా పరిషత్కు సమాచారాన్ని అందజేశారు. జిల్లాలోని అన్ని మం డల పరిషత్లకు జరిగిన ఎన్నికల్లో భాగంగా తిరుప తి రూరల్ మండలంలో మొత్తం 40 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వాటిలో 21 ఎంపీటీసీ స్థా నాలను అధికారపార్టీ దక్కించుకోగా, 14 స్థానాలను వైఎస్ఆర్ సీపీ, ఒకదాన్ని సీపీఎం, నాలుగింటిని ఇం డిపెండెంట్లు గెలుచుకున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ సభ్యులతో పాటు ఇండిపెండెంట్ల మద్దతుతో టీడీపీ కి చెందిన మునికృష్ణయ్య ఎంపీపీగా ఎన్నికయ్యారు. అతనికి టీడీపీకి చెందిన ఉష, సుధాకర్రెడ్డి మద్దతు లభించింది. దీంతో మునికృష్ణయ్య ఎంపీపీగా ఎన్నికయ్యేందుకు మార్గం సుగమమయ్యింది. అయితే దీ న్ని అవమానంగా భావించిన అధికారపార్టీ నాయకులు తమ పార్టీ తిరుగుబాటు అభ్యర్థులుగా తయారైన వారిపై చర్యలు తీసుకుని వారిని తొలగించేందుకు సన్నాహాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యం లో తమ పార్టీ సభ్యుల ద్వారా విప్ జారీ చేయించా రు. ఆ తర్వాత పైస్థాయిలో నుంచి జిల్లా, మండల ప్రిసైడింగ్ అధికారులపై ఒత్తిళ్లు తెప్పించారు. ఎట్టకేలకు వారి ప్రయత్నాలు ఫలించడంతో ఎంపీపీగా ఎ న్నికైన మునికృష్ణయ్య, అతనికి మద్దతిచ్చిన ఎంపీటీ సీ సభ్యులు ఉష, సుధాకర్రెడ్డిపై అనర్హత వేటు ప డింది. వారిని ఎంపీటీసీ సభ్యత్వాల నుంచి కూడా తొలగిస్తున్నట్టు ఈ నెల 28న ఆదేశాలు జారీ చేసిన ట్టు జెడ్పీకి అందిన సమాచారం బట్టి తెలుస్తోంది. వి ప్ ధిక్కరించినట్టు తమకు అందిన ఫిర్యాదు మేరకు వారిపై అనర్హత వేటువేస్తూ చర్యలు తీసుకున్నట్టు తిరుపతి రూరల్ మండల ప్రిసైండింగ్ అధికారి, ఎంపీడీవో సుశీలాదేవి ఫోన్లో వివరించారు. వీరిని ఎంపీటీసీ సభ్యత్వాల నుంచి కూడా తొలగిస్తున్నట్టు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. జెడ్పీ మీటింగ్కు రాకుండా అడ్డుకునేందుకే.. ఆదివారం జరగనున్న జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్యసమావేశంలో తిరుపతి ఎంపీపీ హాజరు కాకుండా చూడాలని అధికారపార్టీ నాయకులు తీవ్రంగా ప్ర యత్నించి సఫలమయ్యారని తెలిసింది. పార్టీ అధికారంలో వుండికూడా అవకాశమున్న ఎంపీపీని చేజిక్కించుకోలేకపోయామనే ఆవేదన చంద్రగిరి నియోజకవర్గ అధికారపార్టీ నేతలను ఎంతో కలవరపెట్టింది. అందులో భాగంగానే వీలైనంత త్వరగా అతనిపై వేటుపడేటట్లు చేసి జెడ్పీ మీటింగ్హాలులోకి అడుగుపెట్టకుండా చేయాలని భీష్మించుకుని కూర్చున్నట్టు తెలిసింది. దీంతో విప్ జారీచేయడం, వెనువెంటనే జిల్లా అధికారులపై ఒత్తిడితెచ్చి అనర్హత వేటుపడేటట్లు చర్యలు తీసుకుని తద్వారా ప్రతీకారం తీర్చుకున్నారని తెలిసింది. అయితే దీనివెనక మాజీమంత్రి గల్లా అరుణకుమారి హస్తమున్నట్లు స్పష్టమవుతోంది. -
రోడ్డు ప్రమాదంలో ఎన్ఆర్ఐ దంపతుల మృతి
మదనపల్లెక్రైం: వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చి న ఎన్ఆర్ఐ దంపతులు రోడ్డు ప్రమాదంలో దుర్మర ణం చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డా రు. ఓ యువకుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు, కారు, ద్విచక్ర వాహనం నుజ్జయ్యాయి. ఈ సంఘటన శుక్రవారం మదనపల్లెకు మూడు కిలోమీట ర్ల దూరంలోచెన్నై-ముంబయి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. స్థానికులు, మృతుల కుటుంబసభ్యుల కథనం మేరకు.. నిమ్మనపల్లె మండలం గంగాపురంపల్లెకు చెందిన ఓబుల్రెడ్డి కుమారుడు కేశవరెడ్డి (58) రైల్వే స్టేషన్మాస్టారుగా పనిచేస్తూ పీలేరులో స్థిరపడ్డారు. వీరి అన్న వెంకట్రమణారెడ్డి మదనపల్లెలో సోషియల్ వెల్ఫేర్ అధికారిగా పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు. వీరి చివరి తమ్ముడు చక్రపాణిరెడ్డి (40) ఆర్మీలో పనిచేసి ఏడాదిన్నర కాలంగా భార్య ఉషా(35), కుమార్తె తాని యా(17)తో సింగపూర్లో ఉంటున్నారు. అన్న వెంకట్రమణారెడ్డి కుమార్తె వివాహం కోసం చక్రపాణిరెడ్డి, ఉషా, తానియాలు రెండురోజుల క్రితం మదనపల్లెకు వచ్చారు. గురువారం రాత్రి నుంచి పెళ్లి వేడుకల్లో పా ల్గొన్నారు. శుక్రవారం తెల్లవారుజామున ముహూర్తం అనంతరం పుంగనూరులోని పెళ్లికుమారుడి ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత చక్రపాణిరెడ్డి, ఉషా, తానియాతో పాటు, అన్న వదినలు కేశవరెడ్డి, భూషణమ్మ కారులో తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలోని నవోదయ పాఠశాల సమీపంలోకి రాగానే మదనపల్లె నుంచి చిత్తూరుకు వెళుతున్న ఆర్టీసీ బస్సు వేగంగా కారును ఢీకొని రోడ్డుపక్కన కాలువలోకి దూసుకెళ్లింది. ఇదే సమయంలో కారు వెనుక వస్తున్న పుంగనూరు మం డలం కొత్తార్లపల్లెకు చెందిన చెంగప్ప కుమారుడు శంకర్(24) కారును ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న భార్యాభర్తలు చక్రపాణిరెడ్డి, ఉషా అక్కడికక్కడే మృతి చెందారు. కేశవరెడ్డి, భూషణమ్మ, తానియా తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో ఉన్న పలమనేరు మం డలం ముసలమర్రికి చెందిన నాగమ్మ(55) కాలు విరి గిపోగా పలమనేరుకు చెందిన రత్నమ్మ(56), రాంబాబు(60) గాయపడ్డారు. వీరిని 108లో మదనపల్లె ఏరియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన కేశవరెడ్డి, భూషణమ్మ, తానియాను బెంగళూరుకు తరలించారు. నాగమ్మను తిరుపతికి రెఫర్ చేశారు. ద్విచక్ర వాహనదారుడు శంకర్కు స్వల్ప గాయాలయ్యాయి. తానియా, కేశవరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కాపాడడంలో రూరల్ సీఐ చంద్రశేఖర్, ఎస్ఐలు రవిప్రకాష్రెడ్డి, శ్రీనివాసరావు సహకారం అందించారు. రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భవిష్యత్తులో మరిన్ని పతకాలు: ఉష
సాక్షి, హైదరాబాద్: జాతీయ అథ్లెటిక్స్లో తాజా పరిస్థితిపై స్ప్రింట్ క్వీన్ పీటీ ఉష తన మనోభావాలు వెల్లడించింది. ‘స్పీడ్స్టార్’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉష హైదరాబాద్ వచ్చింది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’తో మాట్లాడింది. కొత్త ప్రతిభ: చాలా చోట్ల ప్రతిభ గల అథ్లెట్లు వెలుగులోకి వస్తున్నారు. కానీ కంటిన్యుటీ లేకపోవడమే సమస్యగా మారింది. నిలకడగా ఎక్కువ కాలం కొనసాగితేనే ఫలితాలు వస్తాయి. తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి. మాలిక్కు బోల్ట్ అకాడమీలో శిక్షణ: మన దేశం నుంచి అలాంటి అవకాశం రావడం అదృష్టమే. అయితే 3-4 వారాల కోచింగ్ ఏ మాత్రం ఉపయోగ పడదు. సుదీర్ఘ కాలం పట్టుదలగా ఆడాలి. తన అకాడమీ పని తీరు: బాగుంది. టింటూ లూకా సీనియర్ స్థాయిలో, జెస్సీ జోసెఫ్ జూనియర్ స్థాయిలో రాణిస్తున్నారు. వారి ప్రదర్శన చాలా మెరుగైంది. ఇతర రాష్ట్రాలలో అకాడమీ: ప్రస్తుతం నేను నడిపిస్తున్న అకాడమీలో పూర్తి స్థాయి సౌకర్యాలు లేవు. అదంతా అయ్యాకే మరో రాష్ట్రం గురించి ఆలోచించగలను. అయితే ఆయా ప్రభుత్వాల సహకారం కూడా కావాలి. భారత అథ్లెటిక్స్: ఈ ఏడాది ఆసియా క్రీడల్లో, కామన్వెల్త్లో పతకాల సంఖ్య పెరగొచ్చు. లండన్ ఒలింపిక్స్లో మన అథ్లెట్లు ఇద్దరు ఫైనల్స్ చేరడం చెప్పుకోదగ్గదే. వచ్చే ఒలింపిక్స్లో ఇంకా ఎక్కువ మంది వస్తారని నా నమ్మకం.