varalakshmi
-
మూడు నెలల శిశువు అపహరణ
కాచిగూడ హైదరాబాద్: దుస్తులు ఇప్పిస్తానని నమ్మించి ఓ తల్లి నుండి మూడు నెలల చిన్నారిని ఎత్తుకెళ్లిన దుండగుడిని సీసీ కెమెరాల సాయంతో కాచిగూడ పోలీసులు గంటల వ్యవధిలో పట్టుకున్నారు. ఈస్ట్జోన్ డీసీపీ బాలస్వామి, అడిషనల్ డీసీపీ నర్సయ్య, ఏసీపీ రఘు, ఇన్స్పెక్టర్ చంద్రకుమార్లు మంగళవారం ఇక్కడ వివరాలు వెల్లడించారు. వనపర్తి జిల్లా మదనాపూర్ మండలం, అగ్రహారం గ్రామానికి చెందిన రవి, వరలక్ష్మి దంపతులు 3 నెలల బాబుతో ఉపాధి కోసం నగరానికి వచ్చి ఉప్పుగూడలో నివాసం ఉంటూ కూలీ పనిచేస్తున్నారు. గౌలిగూడా ప్రాంతానికి చెందిన బోగ నర్సింగ్ రాజ్ పంజగుట్టలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. అతనికి కార్వాన్ ప్రాంతానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి రాఘవేందర్ (48), అదే ప్రాంతానికి చెందిన ఎన్.ఉమావతి (55)తో పరిచయం ఉంది. ఉమావతి పనిచేస్తున్న బట్టల షాపులో లాల్దర్వాజా ప్రాంతానికి చెందిన సంధ్యారాణి పనిచేస్తుంటుంది. శివ, సంధ్యారాణి దంపతులకు పిల్లలు లేకపోవడంతో తాను పెంచుకోవడానికి దత్తతకు పిల్లలు కావాలని ఉమావతిని కోరింది. ఉమావతి ఈ విషయాన్ని నర్సింగ్ రాజ్, రాఘవేంద్రలకు తెలిపింది. వారు తమకు తెలిసిన వాళ్లు పిల్లలను దత్తతకు ఇస్తారని, వారికి లక్షన్నర డబ్బులు ఇవ్వాలని సంధ్యారాణికి తెలిపారు. దానికి అంగీకరించిన సంధ్యారాణి తొలివిడతగా లక్ష రూపాయలు చెల్లించింది. డబ్బులు చెల్లించి ఆరు నెలలు గడుస్తున్నా వారు ఇచి్చన మాట నిలబెట్టుకోక పోవడంతో సంధ్యారాణి వారిపై ఒత్తిడి చేసింది. దీనితో కిడ్నాప్ చేసి, ఆమెకు చిన్నారిని అందించాలని ప్లాన్ వేశారు. ఈ క్రమంలో సోమవారం చాదర్ఘాట్ చౌరస్తాలో వరలక్ష్మి తన మూడేళ్ల కుమారుడితో భిక్షాటన చేస్తుండగా నర్సింగ్రాజ్ ఆమెతో మాటలు కలిపి పరిచయం చేసుకున్నాడు. కొత్త దుస్తులు ఇప్పిస్తానని వరలక్ష్మీని మాటల్లో పెట్టాడు. తన వెంట కాచిగూడ డిమార్ట్కు తీసుకెళ్లాడు. వరలక్ష్మి దుస్తులు చూస్తుండగా నర్సింగ్రాజ్ అక్కడి నుండి బాబును తీసుకొని ఆటోలో ఉడాయించాడు.లాల్ దర్వాజాలో ఉండే సంధ్యారాణికి అప్పజెప్పాడు. బాలుడు కని్పంచకపోవడంతో వరలక్ష్మి కొద్దిసేపు వెదికింది. ఫలితం లేకపోవడంతో సోమవారం సాయంత్రం కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న ఎస్ఐలు సుభాష్, రవికుమార్లు రెండు టీంలుగా ఏర్పడి సీసీ కెమెరాల సహాయంతో లాల్దర్వాజలో బాలుడు ఉన్నట్లు కనుగొన్నారు. సోమవారం రాత్రి 7 గంటలకు చాకచక్యంగా కిడ్నాపర్లను పట్టుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. నర్సింగ్రాజ్, రాఘవేందర్లను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బాబును తల్లిదండ్రులకు అప్పగించారు. ఉమావతి పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. ఆరు గంటల్లో కేసును ఛేదించిన కాచిగూడ పోలీస్ సిబ్బందిని డీసీపీ అభినందించారు. -
ఆత్మహత్య చేసుకుంటా
సాక్షి, టాస్క్ఫోర్స్: తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక దాడి చేయడమే కాకుండా.. తన వర్గీయులతో వేధిస్తున్నారంటూ కేవీబీ పురం మండల టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరలక్ష్మి ఆరోపించింది. బాధిత మహిళ పట్ల సానుభూతి చూపించకుండా.. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిస్తున్నారంటూ వాపోయింది. ఫిర్యాదు చేసినా చంద్రబాబు, లోకేశ్ న్యాయం చేయకపోవడంతో.. ఇక ‘ఆత్మహత్య చేసుకుంటున్నా’నంటూ సోషల్ మీడియాలో ఆమె పోస్టు చేసింది. దీంతో నియోజకవర్గ టీడీపీలో తీవ్ర దుమారం రేగింది. చంద్రబాబు, లోకేశ్ వల్లే..వరలక్ష్మికి టీడీపీలోని యాదవ సామాజికవర్గ నాయకులు మద్దతుగా నిలిచారు. వరలక్ష్మికి న్యాయం చేయడం మానేసి.. తిరిగి ఆమెనే వేధింపులకు గురిచేస్తున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకర భాషతో నీచాతినీచంగా తిడుతూ.. ఫోన్కాల్స్ చేసి వేధిస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ వెంటనే స్పందించి.. కఠిన చర్యలు తీసుకొని ఉంటే పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదన్నారు. బలవంతపు మరణానికి దారితీసేలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు. బాధితురాలి ప్రాణానికి హాని జరిగితే ఊరుకునేది లేదని వారు హెచ్చరిస్తున్నారు.దళిత ఎమ్మెల్యేపై కుట్ర చేశారంటూ ఆందోళనటీడీపీలోని అగ్రకుల నాయకులు కుట్ర పన్ని ఎమ్మెల్యే ఆదిమూలాన్ని ఈ కేసులో ఇరికించారంటూ స్థానిక దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు ఆదివారం సత్యవేడులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. వరలక్ష్మిపై కేసు నమోదు చేసి, ఆమె వెనుక ఎవరున్నారో విచారించి.. శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే నారాయాణవనం మండలంలో కూడా ఆదిమూలం వర్గీయులు రెండు రోజులుగా ధర్నా చేస్తున్నారు. దళిత ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి ఓ మాజీ ఎమ్మెల్యేను ఇన్చార్జ్గా నియమించి పెత్తనం చెలాయించేందుకు కుట్రలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఆదిమూలం వర్గీయులు కొందరు టీడీపీ జిల్లా అధ్యక్షుడు నరసింహయాదవ్కు ఫోన్ చేసి.. వరలక్ష్మి కేసు ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. -
వరలక్ష్మి పెళ్లి వేడుకలో సినీతారల సందడి (ఫొటోలు)
-
డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్న 'హనుమాన్' నటి..?
-
అయినవాళ్లు సహకరిస్తలేరని.. తల్లీకూతుళ్ల విషాదం!
మహబూబ్నగర్: వారసత్వ భూమి విక్రయించగా వచ్చిన డబ్బుల్లో వాటా ఇచ్చి.. తమ బిడ్డ పెళ్లి, కుమారుడి చదువుకు సహకరించాలని అయిన వాళ్లను ప్రాధేయపడినా పట్టించుకోకపోవడంతో ఓ కుటుంబం తీవ్ర మనస్తాపానికి గురైంది. కూతురితో సహా భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడ్డారు. మొదట తల్లీకూతురు పురుగు మందు తాగగా.. తండ్రి భయపడి మిన్నంకుండిపోయాడు.విషయం తెలుసుకున్న స్థానికులు తల్లీకూతురిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే కన్నుమూసిన విషాదకర ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఏ బూడిదపాడు గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. ఏ బూడిదపాడుకు చెందిన మాల హరన్నకు నలుగురు కుమారులు ఉండగా.. ఎకరా పట్టా పొలం, 30 గుంటల అసైన్డ్ (సీలింగ్) పొలాన్ని అన్నదమ్ముళ్లకు పంచారు.పట్టా పొలం రెండవ, మూడవ కుమారుడికి పంపకాల్లో రాగా.. పెద్ద కుమారుడైన నర్సింహులు, చిన్న కుమారుడికి 30 గుంటల సీలింగ్ భూమి వచ్చింది. కొన్నేళ్ల కిందట ఇద్దరు అన్నదమ్ములు పట్టా పొలాన్ని అమ్ముకున్నారు. సీలింగ్ పొలాన్ని ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో నర్సింహులు కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కూతురి పెళ్లి, కుమారుడి చదువు వారికి భారంగా మారింది. ఈక్రమంలో ఆర్థిక ఇబ్బందులు తోడయ్యాయి. దీంతో అమ్మిన పట్టా పొలం డబ్బులను అందరికీ సమానంగా పంచాలని అన్నదమ్ముళ్లతో గొడవ పెట్టుకోవడంతోపాటు పెద్దలను ఆశ్రయించారు.తన బిడ్డ పెళ్లి, కుమారుడి చదువు కోసం డబ్బులు అవసరమని.. పట్టా పొలంలో తనకూ వాటా ఇవ్వాలని ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. దీంతో నర్సింహులు, అతడి భార్య వరలక్ష్మి (39), కూతురు అనురాధ(18) పురుగు మందు తాగి, చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో మొదట వరలక్ష్మి, ఆమె కూతురు పురుగు మందు తాగారు. నరసింహులు పురుగుల మందు తాగడానికి భయపడి విరమించుకున్నాడు. విషయం తెలుసుకున్న స్థానికులు.. తల్లీకూతురిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.కళ్ల ముందే భార్య, కూతురు చనిపోవడంతో నర్సింహులు కుప్పకూలిపోయాడు. తల్లీ కూతురి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నర్సింహులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు శాంతినగర్ ఏఎస్ఐ అయ్యన్న తెలిపారు. గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. -
నార్సింగ్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
-
నకిలీ దందా.. దామచర్ల చుట్టూనే..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో సంచలనం సృష్టించిన నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ రబ్బరు స్టాంపుల కుంభకోణం టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే సాగాయి. సిట్ దర్యాప్తులో వెలుగుచూస్తున్న విషయాలను పరిశీలిస్తే టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ దందా సాగినట్లు తెలుస్తోంది. ప్రధానంగా 2014 నుంచి 2019 వరకు పచ్చ పార్టీ నేతల కనుసన్నల్లోనే మూడు డాక్యుమెంట్లు...ఆరు రబ్బరు స్టాంపుల చందంగా విరాజిల్లింది. ఈ దందా అంతా టీడీపీ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ అండదండలతోనే ఒంగోలు నగరంతో పాటు జిల్లాలో వేళ్లూనుకుపోయింది. దామచర్ల నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపుల కుంభకోణానికి రింగ్ లీడర్గా అవతారమెత్తాడు. ఈ కేసులో ఇప్పటికే కీలక వ్యక్తిగా ఉన్న టీడీపీకి చెందిన మహిళా నాయకురాలు, దామచర్ల ప్రధాన అనుచరురాలు పెరంమూరు వరలక్ష్మి అలియాస్ పెద్దిశెట్టి వరలక్ష్మికి 2012లో స్టాంప్ వెండర్ లైసెన్స్ను ఇప్పించాడు. అప్పటి నుంచే ఆమె దస్తావేజులను కేవలం నకిలీ డాక్యుమెంట్ల తయారీకి విక్రయిస్తూ ఈ రాకెట్కు తెరతీసింది. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత దామచర్ల తన అనుచరులను శాఖకు బదిలీ చేయించుకోవడంతో నకిలీ డాక్యుమెంట్ల కుంభకోణానికి అడ్డే లేకుండా పోయింది. నకిలీల చేతిలో 1100 దస్తావేజులు జిల్లా కోర్టు ప్రాంగణానికి సమీపంలో దస్తావేజులు విక్రయించేందుకు వరలక్ష్మికి ఒక దుకాణం కూడా ఏర్పాటు చేయించి దాన్ని దామచర్ల ప్రారంభించాడు. అప్పటి నుంచి దస్తావేజులను నకిలీ దందాలు చేసే ముఠాలకు మాత్రమే విక్రయిస్తూ భారీగా ఆర్జించింది. నకిలీ డాక్యుమెంట్లు, రబ్బరు స్టాంపుల కుంభకోణం వెలుగు చూడటంతో ఎస్పీ మలికాగర్గ్ సిట్ను ఏర్పాటు చేసింది. రంగంలోకి దిగిన సిట్ బృందం లోతైన దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తులో స్టాంప్ వెండర్ వరలక్ష్మి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. రిజిస్ట్రేషన్ శాఖ నిబంధనలను ఉల్లంఘించిన ఆమె నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసే వారికి, సంతకాలు ఫోర్జరీ చేసే వాళ్లకు మాత్రమే విక్రయించి సొమ్ము చేసుకుంది. సిట్ దర్యాప్తులో ఇప్పటి వరకు దాదాపు 1100 దస్తావేజులు నిబంధనలకు విరుద్ధంగా విక్రయించినట్లు తేలింది. వరలక్ష్మికి పార్టీ పదవులెన్నో... నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపుల కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన వరలక్ష్మికి రాష్ట్ర స్థాయిలో అంగన్వాడీ విభాగం అసోసియేషన్కు కార్యదర్శి పదవిని కూడా ఇప్పించాడు. ఆ తరువాత ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికల్లో 29వ డివిజన్ పార్టీ అభ్యర్థిగా పార్టీ కోసం పనిచేసిన ముఖ్యులు నలుగురిని కాదని వరలక్ష్మికి టిక్కెట్ ఇప్పించాడు. టిక్కెట్ ఇప్పించటంతో పాటు ఎన్నికల ఖర్చు కూడా దామచర్లే పెట్టుకున్నాడన్న ప్రచారమూ అప్పట్లో జరిగింది. ఇవన్నీ పరిశీలిస్తే దామచర్ల ఆమెను ఎంతగా ప్రోత్సహించారో అర్థం చేసుకోవచ్చు. ఎల్లో మీడియాను అడ్డంపెట్టుకుని.. సిట్ దర్యాప్తులో టీడీపీ నాయకుల పాత్రలు వెలుగుచూస్తుడడంతో అధికార పార్టీపై నెపం వేసేందుకు దామచర్ల ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకున్నారు. నిత్యం అధికార పార్టీపై బురద జల్లుతూ వాస్తవాలను వక్రీకరిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. అసలు ఈ దర్యాప్తును కోరిందే ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. దోషులు ఎవరున్నా వదిలిపెట్టవద్దని సీఎంఓలో ఉన్న కీలక అధికారులను సైతం ఆయన కోరిన విషయం తెలిసిందే. ఇవన్నీ పక్కన పెట్టి ఎల్లో మీడియా ప్రతి రోజూ ఒక కథనాన్ని వండి వారుస్తోంది. రూ.100 దస్తావేజు రూ.10 వేలకు విక్రయం... ఒంగోలు కేంద్రంగా దస్తావేజులు అక్రమ విక్రయాలకు పెద్దిశెట్టి వరలక్ష్మి కేంద్ర బిందువుగా మారింది. సాధారణంగా రూ.100 విలువైన దస్తావేజును అదే ధరకు అమ్మాలి. అయితే ఒక్కో చోట స్టాంపు వెండర్లు రూ.100 విలువ చేసే దస్తావేజుకు అదనంగా రూ.20 నుంచి రూ.40 వరకు వసూలు చేసుకుంటారు. ఈ విషయం రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు తెలిసినా పెద్దగా పట్టించుకునే వారు కాదు. అయితే వరలక్ష్మి మాత్రం రూ.100 దస్తావేజును రూ.10 వేలకు విక్రయించి భారీ స్థాయిలో సొమ్ము చేసుకుంది. దానికి ప్రధాన కారణం అప్పటి ఎమ్మెల్యేగా దామచర్ల అండదండలే. టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే.. నకిలీ డాక్యుమెంట్ల వ్యవహారం మొత్తం టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే సాగినట్లు ఇప్పటి వరకు సిట్ దర్యాప్తులో తేటతెల్లమైంది.. ఇప్పటి వరకు 18 కేసులు నమోదు చేసి దాదాపు 25 మంది వరకు అరెస్టు చేశారు. వారిలో టీడీపీ నాయకులు దాదాపు ఏడెనిమిది మంది ఉన్నారు. మిగతా వాళ్లలో టీడీపీ సానుభూతి పరులే అధికం. టీడీపీ నాయకుడు బాపట్ల వెంకటేశ్వర్లు, అసదుల్లా, రాయపాటి ఏలియా, రాయపాటి అచ్యుత్, కారాని దుర్గాతో పాటు పలువురు ఉన్నారు. రాజాపానగాలరోడ్డుకు చెందిన డాక్యుమెంట్ రైటర్ సురేష్ కూడా 10 రోజుల నుంచి పరారీలో ఉన్నాడు. ఈ కేసులో డాక్యుమెంట్ల రైటర్ల పాత్ర సైతం ఉన్నట్లు సిట్ దర్యాప్తులో తేలినట్లు సమాచారం. దీంతో నగరానికి చెందిన పలువురు డాక్యుమెంట్లు రైటర్లు పరారీలో ఉండగా పోలీసులు గాలిస్తున్నారు. వరలక్ష్మి కోసం పోలీసుల ముమ్మర గాలింపు... దస్తావేజుల కుంభకోణంలో వరలక్ష్మి పాత్ర వెలుగుచూడడంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. రాజాపానగాలరోడ్డులో నివాసం ఉంటే వరలక్ష్మి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఎస్పీ మలికాగర్గ్ నేతృత్వంలోని సిట్ బృందం ఆమె కదలికలపై నిఘా పెట్టింది. అయితే టీడీపీలోని ప్రధాన నాయకులు ఆమెను తమ సంరక్షణలో ఉంచుకొని కాపాడుతున్నట్లు సమాచారం. సెల్ఫోన్లు, ఫోన్ నంబర్లు మారుస్తూ ఇతర ప్రాంతాలకు వెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వరలక్ష్మితో పాటు ఆమెకు ఆశ్రయం కల్పించిన వారి కదలికలపై కూడా సిట్ నిఘా ఉంచినట్లు విశ్వసనీయ సమాచారం. వరలక్ష్మి విక్రయించిన దస్తావేజులు కోర్టుల్లో కేసుల రూపంలో కొనసాగుతున్నట్లు కూడా సిట్ బృందానికి సమాచారం వచ్చింది. అనేక సమస్యలకు, ఆస్తులు వివాదాల్లోకి వెళ్లటానికి కూడా వరలక్ష్మి విక్రయించిన దస్తావేజులు ప్రధానంగా ఉన్నటు దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నాయి. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో రికార్డుల పరిశీలనలో 1100 దస్తావేజులను నిబంధనలకు విరుద్ధంగా విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఇంకా వేల సంఖ్యలో దస్తావేజులను అక్రమార్కులకు విక్రయించినట్లు తెలుస్తోంది. -
ఉమెనిఫెస్టో ప్లీజ్!
హక్కులు, అవకాశాల్లో మహిళలకు సమాన భాగస్వామ్యం ఎండమావిగానే మిగిలింది. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో రాజకీయపార్టీలు హామీల వర్షం కురిపిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాలు వస్తున్నాయి..పోతున్నాయ్. కానీ మహిళల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి, సామాజిక భద్రత ఇప్పటికీ నినాదాలకే పరిమితమవుతున్నాయి. ఇల్లు, బడి, కార్యాలయంతో పాటు రోడ్డు ఇతర బహిరంగ ప్రదేశాల్లో.. ఎప్పుడూ ఏదో ఒక చోట ఏదో రకమైన వివక్ష, వేధింపులు, అణచివేత నిత్యకృత్యంగానే ఉంటున్నాయి. మహిళల రక్షణ కోసం గృహహింస చట్టం, నిర్భయ చట్టం వంటివి ఎన్ని వచ్చినా, షీటీమ్స్, భరోసా కేంద్రాలు, సఖి వంటి ప్రత్యేక రక్షణ బృందాలు ఎన్ని ఉన్నా లైంగిక దాడులు, హింస కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కోటి దాటిన గ్రేటర్ హైదరాబాద్ జనాభాలో సగం మంది మహిళలే. కాగా ప్రస్తుత ఎన్నికల వేళ.. రాజకీయ పార్టీలు ఏ మేరకు మహిళల ఆకాంక్షలకు, మహిళా సంబంధిత అంశాలకు పెద్ద పీట వేస్తున్నాయనేది చర్చనీయాంశంగా మారింది. పలు మహిళా సంఘాలు, హక్కుల సంఘాలు, వివిధ విభాగాల్లో మహిళల సంక్షేమం కోసం పని చేసే స్వచ్ఛంద సంస్థలు ‘మహిళా మేనిఫెస్టో’పై దృష్టి సారించాయి. మహిళల సంక్షేమం లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు మహిళా మేనిఫెస్టోను రూపొందించాలని డిమాండ్ చేస్తున్నాయి. సమాన అవకాశాలు లభించాలి.... స్త్రీలపై జరుగుతున్న అన్ని రకాల హింసను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని రంగాల్లో మహిళలకు 50 శాతం అవకాశాలు లభించాల్సిందేనని మహిళా సంఘాలు కోరుతున్నాయి. ‘అన్నిచోట్లా స్త్రీల ప్రాతినిధ్యం పెరగాలి. విద్య, ఆరోగ్యం, జీవితబీమా, బ్యాంకింగ్, పోలీసు, రవాణా, న్యాయ, వైద్య, ఎయిర్ఫోర్స్, నావిక, తదితర అన్ని రంగాల్లో మహిళలు రాణించే విధంగా సమాన అవకాశాలను కల్పించి ప్రోత్సహించాలి. సమాజంలో మహిళలపై హింసకు మద్యపానం కూడా ఒక కారణమే. మద్యాన్ని ఆదాయ వనరుగా భావించే ప్రభుత్వాల దృక్పథం పూర్తిగా మారాలి. మద్యం దుకాణాలను తగ్గించాలి. కచ్చితమైన నియంత్రణ పాటించాలి. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల లోపే మద్యం షాపులు తెరిచి ఉంచాలి. ప్రధాన హైవేలు, బస్టాపులు, ఆలయాలు, బడులు, ప్రార్ధనాస్థలాలకు సమీపంలో ఉన్నవాటిని తొలగించాలి..’ అని డిమాండ్ చేస్తున్నాయి. నిర్భయ సెల్ ఏర్పాటు చేయాలి ‘ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలలు, తదితర అన్ని విద్యాసంస్థల్లో బాలికలు, యువతులు నిశ్చింతగా చదువుకొనేందుకు అనువైన వాతావరణం, మౌలిక సదుపాయాలు కల్పించాలి. అన్ని విద్యాసంస్థల్లో ఇందుకోసం ప్రత్యేంగా 2013 నిర్భయ చట్టానికి అనుగుణంగా నిర్భయ సెల్ ఏర్పాటు చేయాలి. కానీ ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అమ్మాయిల అవసరాలకు అనుగుణమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. టాయిలెట్లు, రక్షిత మంచినీళ్లు, పౌష్టికాహారం అందజేయాలి. చాలామంది పిల్లలు ముఖ్యంగా బాలికలు తీవ్రమైన పోషకాహార లేమితో బాధపడుతున్నారు. అమ్మా యిల్లో రక్తహీనత ఒక సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో స్కూళ్లలో తృణ ధాన్యా లతో కూడిన పోషకాహారాన్ని అందజేయాలి. స్కూళ్లలో తప్పనిసరిగా చైల్డ్ హెల్త్ కేర్ రికార్డులను అమలు చేయాలి. ఇందులో ఉపాధ్యాయులు, ఆరోగ్యకార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు భాగస్వాములు కావాలి. యుక్త వయస్సు బాలికలకు చక్కటి ఆరోగ్య విద్య అందజేయాలి. శానిటరీ ప్యాడ్స్, న్యాప్కిన్స్ అందుబాటులో ఉంచాలి. యుక్త వయస్సులో వచ్చే మార్పుల గురించి అమ్మాయిలకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించే విధంగా జెండర్ సెన్సిటైజేషన్ వర్క్షాపులను ఏర్పాటు చేయాలి. వృత్తి విద్యాకోర్సుల్లో శిక్షణ ఇప్పించి అమ్మాయిలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందుకొనేలా చర్యలు తీసుకోవాలి. స్వీయ రక్షణ కు నిరంతర శిక్షణ ఉండాలి. ఈ మేరకు మేనిఫెస్టోలో పొందుపరచాలి..’ అని పలు సంఘాలు, సంస్థలు సూచిస్తున్నాయి. మెరుగైన ప్రజా రవాణా అవసరం ‘ప్రస్తుతం గ్రేటర్లో వివిధ రకాల రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. కానీ మెట్రోతో సహా అన్ని సేవలు రాత్రి 11కే ముగుస్తాయి. దీంతో రాత్రివేళల్లో విధులు నిర్వహించే సాఫ్ట్వేర్ ఉద్యోగినులు, కాల్సెంటర్లలో పని చేసే అమ్మాయిలు, రాత్రి పూట ఆలస్యంగా ఇళ్లకు చేరవలసిన సమయాల్లో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆటోలు, క్యాబ్లలో మహిళల భద్రత ప్రశ్నార్ధకంగానే ఉంది. రాత్రి 9 దాటితే ఇలాంటి వాహనాల్లో ప్రయాణం చేయడం దుస్సాహసమే. ఈ పరిస్థితుల్లో సిటీ బస్సులు 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి..’ అని మహిళా సంఘాలు డిమాండ్ చేసు ్తన్నాయి. రాజకీయ పార్టీలు ఈ అంశాలు దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నాయి. అవకాశం ఇస్తే.. అమలు చేసి చూపిస్తాం ‘అమ్మాయిలకు ఉచిత విద్య. వైద్యం కేటాయిస్తే చాలు సాధికారత అనేది దానంతట అదే వస్తుందని మేము నమ్ముతున్నాం. విద్యాపరంగా బలోపేతమైతే..కెరీర్ పరంగా నిర్ణయాలు తీసుకొని జీవితంలో స్థిరపడగలుగుతారు. రాష్ట్రంలో బీజేపీకి ఒక్కసారి అవకాశం లభిస్తే దీనిని అమలు చేయడం ద్వారా చేసి చూపేందుకు సిద్ధంగా ఉన్నాం. జాతీయస్థాయిలో బీజేపీ ఇచ్చిన మేనిఫెస్టోను ఒకసారి పరిశీలిస్తే...అనేక కీలకమైన అంశాలు పూర్తిస్థాయిలో అమలుచేసే ప్రయత్నాలు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేస్తోంది. అందులో భాగంగానే మహిళా సాధికారతను సంబంధించిన గతంలో ఇచ్చిన హామీని అమలుచేసేందుకు పూనుకున్నాము. – గీతామూర్తి, బీజేపీ మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మహిళలకు పెద్దపీట వేసేది కాంగ్రెస్ పార్టీనే.. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక మహిళల హక్కులకు భంగం కలుగుతోంది. దిశ లాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర కేబినెట్సహా ఏ అంశంలోనూ మహిళలకు బీఆర్ఎస్ తగిన ప్రాధాన్యత కల్పించలేదు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూస్తే మహిళలకు పెద్దపీట వేసేది తామేనని అర్థమవుతుంది. మహిళలను ప్రధానిగా, రాష్ట్రపతిగా చేసింది కాంగ్రెస్ పార్టీనే. జాతీయ పార్టీ అధ్యక్షురాలిగా కూడా బాధ్యతలు అప్పగించింది కూడా మేమే. రాబోయే ఎన్నికల్లో ప్రజలకు మేమిచ్చిన ఆరు గ్యారంటీల్లో కూడా మహిళాసాధికారత కోసం పథకాలు ప్రకటించాం. ప్రతి మహిళకు నెలకు రూ.2,500 నగదు, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఆసరా పింఛన్ల పెంపు, చదువుకునే విద్యారి్థనులకు మోటారు సైకిళ్లు లాంటి పథకాలతో రాష్ట్రంలో మహిళాభ్యున్నతికి పాటుపడతాం’ – మచ్చా వరలక్ష్మి, గ్రేటర్ హైదరాబాద్ మహిళాకాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు -
దంపతులను బలి తీసుకున్న పాతకక్షలు
అయ్యంకి(మొవ్వ): గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో జరిగిన జంట హత్యలు కృష్ణాజిల్లాలో కలకలం రేపాయి. ఆస్తి తగాదాలు, పాత కక్షలు భార్య భర్తలను బలితీసుకున్నాయి. మొవ్వ మండలం అయ్యంకి గ్రామంలో గురువారం చోటు చేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అయ్యంకి గ్రామానికి చెందిన వీరంకి చిన ఆంజనేయులుకు కుమారులు వీరంకి వీరకృష్ణ, వీరంకి పూర్ణచంద్రరావు, కుమార్తె అమ్ములు ఉన్నారు. ఆంజనేయులుకి గ్రామంలో 3.01 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి వల్ల ఏర్పడిన వివాదాల కారణంగా 2008లో తండ్రి చినఆంజనేయులును, 2012లో తమ్ముడు పూర్ణచంద్రరావును వీరకృష్ణ హత్య చేశాడనే ఆరోపణలొచ్చాయి. అయితే ఈ కేసుల్లో సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కోర్టు కేసును కొట్టివేసింది. కాగా, పూర్ణచంద్రరావు హత్యానంతరం అతడి భార్య స్వర్ణ, ముగ్గురు కుమారులు గణేశ్, లోకేశ్, భువనేశ్ అయ్యంకి గ్రామం విడిచి వెళ్లిపోయారు. ఇటీవల స్వర్ణ తన పొలానికి పట్టాదారు పాసు పుస్తకానికి అప్లయ్ చేయగా లింక్ డాక్యుమెంట్స్ లేవంటూ వీఆర్వో, ఆర్ఐలు రిజక్ట్ చేశారు. దీనిపై వివరణ కోరేందుకు తాజాగా ఆమె తన కుమారులు ముగు్గరితో కలిసి గురువారం మధ్యాహ్నం అయ్యంకిలోని వీఆర్వో కార్యాలయానికి వచ్చింది. ఈ సందర్భంగా పాస్పుస్తకాల విషయంలో స్వర్ణ కుటుంబానికి, అక్కడే ఉన్న వీరకృష్ణకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తులైన స్వర్ణ కుమారులు వెంట తెచ్చుకున్న కత్తులతో పెదనాన్న వీరకృష్ణను విచక్షణా రహితంగా నరికి హత్య చేశారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న అన్న సమారాధన కార్యక్రమం వద్ద ఉన్న వీరకృష్ణ భార్య వరలక్ష్మిని సైతం కత్తులతో పొడిచి హత్యచేసి పరారయ్యారు. గుడివాడ డీఎస్పీ శ్రీకాంత్, పామర్రు సీఐ ఎన్.వెంకటనారాయణ, కూచిపూడి ఎస్ఐ డి.సందీప్ ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. వారు మీడియాతో మాట్లాడుతూ.. పక్కా ప్లాన్తోనే వీరకృష్ణ, వరలక్ష్మి దంపతుల హత్య జరిగినట్లు తెలిపారు. వీరకృష్ణ తమ్ముడి భార్య స్వర్ణ, ఆమె కొడుకులే హత్యలకు కారణమని వెల్లడించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. మృతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
కోట బొమ్మాళి పాట
మలయాళ హిట్ ఫిల్మ్ ‘నాయట్టు’ (2021)కు తెలుగు రీమేక్గా ‘కోట బొమ్మాళి పీఎస్’ చిత్రం రూపొందుతోంది. శ్రీకాంత్ మేకా, వరలక్ష్మీ శరత్కుమార్ ప్రధాన పాత్రల్లో రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తేజ మార్ని దర్శకత్వంలో బన్నీ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలో ఉన్న శ్రీకాకుళం ఫోక్ సాంగ్ను ఈ నెల 11న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, కొత్త పొస్టర్ను విడుదల చేసింది యూనిట్. ‘‘పూర్తి స్థాయి ఫోక్ సాంగ్గా రానున్న ఈ పాట ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్. -
అత్తింటివారే హింసించి, ఉరేసి చంపారని.. తల్లి ఫిర్యాదు..
కరీంనగర్: కరీంనగర్లోని వివేకానందపురి కాలనీలో నివాసముంటున్న ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు త్రీటౌన్ పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. రామగుండం మండలంలోని వీర్లపల్లికి చెందిన వరలక్ష్మి, గట్టెపల్లికి చెందిన సూత్రాల వరుణ్కుమార్లకు 13 ఏళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం కరీంనగర్లోని వివేకానందపురి కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. వరుణ్కుమార్ మద్యానికి బానిసై, అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు తల్లిగారింటి నుంచి డబ్బులు, ఆస్తులు తీసుకురావాలని తన కుటుంబసభ్యులతో కలిసి భార్య వరలక్ష్మిని వేధించసాగాడు. ఈ విషయాన్ని ఆమె తరచూ పుట్టింటివారికి చెప్పుకొని, బాధపడేది. మంగళవారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రించిన తర్వాత ఉరేసుకుంది. కాగా, తమ కూతుర్ని ఆమె భర్త వరుణ్కుమార్, అతని కుటుంబసభ్యులు హింసించి, ఉరేసి చంపారని మృతురాలి తల్లి పూల జయమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
న్యాయం చేయండంటూ జడ్జి ముందు ఏడ్చేసిన నటి
తిరువళ్లూరు: నామ్ తమిళర్ కట్చి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీ నటుడు సీమాన్ వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్టు ఆరోపణలు చేసిన సినీనటి విజయలక్ష్మి తిరువళ్లూరు మహిళా కోర్టు న్యాయమూర్తి పవిత్ర ఎదుట హాజరై వాగ్మూలం ఇచ్చారు. దీంతో పాటు ఆధారాలను న్యాయమూర్తికి సమర్పించి తనకు న్యాయం చేయాలని కోరారు. నామ్ తమిళర్ కట్చి పార్టీ నేత సీమాన్ తన సహచర నటి విజయలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు ప్రధాన ఆరోపణ. అయితే సీమాన్ మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఆందోళన చేపట్టిన నటి దీంతో విజయలక్ష్మి 2011లో వలసరవాక్కం పోలీస్ స్టేసన్లో సీమాన్పై లైంగిక వేధింపులు, అత్యాచారం చేసినట్టు ఫిర్యాదు చేశారు. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఈ కేసు పెండింగ్లో ఉండటంతో పది రోజుల క్రితం విజయలక్ష్మి ఆందోళన బాటపట్టారు. తనకు అన్యాయం జరిగిందని, పోలీసులకు ఫిర్యాదు చేసినా అరెస్టు చేయలేదని ఆరోపణలు చేయడం కలకలం రేపింది. తానూ, సీమాన్ సంవత్సరాల పాటు సహజీవనం చేశామని, చివరకు అతడు తనను మోసం చేశాడని ఆమె మీడియాకు వివరించారు. పోలీస్ స్టేషన్లో 6 గంటలు విచారణ ఈ ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో వలసరవాక్కం పోలీసులు అప్రమత్తమయ్యారు. వలసరవాక్కం డిప్యూటీ కమిషనర్ ఉమయాల్, అసిస్టెంట్ కమిషనర్ గౌతమ్, సీఐలు మహ్మద్బర్గతుల్లా, రాజ్యలక్ష్మి.. విజయలక్ష్మిని శుక్రవారం ఉదయం పోలీస్ స్టేషన్కు తరలించి ఆరు గంటల పాటు విచారణ జరిపారు. అనంతరం తిరువళ్లూరు మహిళా కోర్టు న్యాయమూర్తి పవిత్ర ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి పవిత్ర.. విజయలక్ష్మిని రెండు గంటల పాటు విచారించారు. ఆధారాలు సమర్పించిన నటి గతంలో చేసిన ఆరోపణలకు ఆధారాలను ఇవ్వాలని న్యాయమూర్తి కోరగా అందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించారు. తనకు సీమాన్ నుంచి ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించడంతో పాటు అతనిపై చర్యలు తీసుకోవాలని ఆమె కంటతడిపెట్టారు. బాధితురాలు విజయలక్ష్మి ఇచ్చిన వాంగ్మూలాన్ని రికార్డు చేసుకున్న న్యాయమూర్తి ఆమెకు ధైర్యం చెప్పారు. అనంతరం బందోబస్తు నడుమ విజయలక్ష్మిని కారులో చైన్నెకు తరలించారు. చదవండి: ప్రముఖ నటి అపర్ణ మృతికి భర్తే కారణం.. ఏం జరిగిందంటే -
అమెరికాలో వరలక్ష్మి వ్రతం ఆచరించిన హీరోయిన్ లయ (ఫోటోలు)
-
వరలక్ష్మి కుటుంబానికి పరామర్శ
సింహాచలం: జీవీఎంసీ 95వ వార్డు పరిధి సుజాతనగర్లో ఇటీవల హత్యకు గురైన వరలక్ష్మి కుటుంబాన్ని శనివారం పవన్ కల్యాణ్ పరామర్శించారు. ఆమె ఇంటికి వెళ్లి వరలక్ష్మి భర్త గోపాలకృష్ణమూర్తి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. సింహాచలం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద 98వ వార్డు జనసేన నాయకులు పంచ గ్రామాల భూ సమస్యను పవన్ దృష్టికి తీసుకెళ్లారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీకి సంబంధించి యువతపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరుతూ అప్పన్నపాలెం కూడలిలో పలువురు ఆయన్ని కలిశారు. ఆ పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్, పంచకర్ల రమేష్బాబు, తమ్మిరెడ్డి శివశంకర్, పంచకర్ల సందీప్ తదితరులు పాల్గొన్నారు. సీబీసీఎన్సీ భూముల పరిశీలన బీచ్రోడ్డు: సిరిపురంలోని సీబీసీఎన్సీ భూములను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పరిశీలించారు. అనంతరం అక్కడ విలేకరులతో మాట్లాడుతూ విశాఖ ప్రజలు ఓటేస్తేనే ఎంపీగా ఎన్నికై న ఎంవీవీ ఇప్పుడు వేరే చోట వ్యాపారం చేస్తానడం సరికాదన్నారు. అలాంటప్పుడు ఎంపీ పదవికి రాజీనామా చేసి వెళ్లిపోవాలన్నారు ఎంవీవీ కుటుంబం కిడ్నాప్ వెనుక, సీబీసీఎన్సీ భూములతో సంబంధం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రశాంతమైన విశాఖలో గొడవలు పెడుతున్నారని ఆరోపించారు. జనసేన కార్యకర్తల వీరంగం పవన్ కల్యాణ్ను చూడడానికి వచ్చిన జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించారు. పోలీసులపై దురుసగా ప్రవర్తించి వారి సహనాన్ని పరీక్షించారు. ఓ కార్యకర్త పోలీసులను దూషిస్తూ.. వారిపైకి దూసుకెళ్లాడు. దీంతో పోలీసులు అతన్ని మందలించారు. మరో వైపు సీబీసీఎన్సీ లోపలకు వెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ పార్టీ కార్యకర్తలు ఎంత రెచ్చగొట్టినా పోలీసులు శాంతియుతంగా తమ విధులను నిర్వర్తించారు. -
ఆమెపాటకు అరవై ఏళ్లు
వరలక్ష్మికి గాత్రం దేవుడిచ్చిన వరం. గురువులు లేరు... శిక్షణ లేదు. రేడియో ఆమెకుపాటలు నేర్పింది. రేడియో ఆమెచేతపాడించుకుంది. ఆలయాలు ఆమెపాటలకు వేదికనిచ్చాయి. ఇప్పుడామె ముంబయిలో తెలుగు స్వరం. వరలక్ష్మి నారాయణమ్ పుట్టిల్లు గుంటూరు జిల్లాలోని బ్రాహ్మణ కోడూరు. రేడియోలో వచ్చినపాటలు వింటూపాడడం నేర్చుకున్నారు. అందుకే కాబోలుపాటపాడాలనే అభిలాష ఉన్న వాళ్లను ఏర్చికూర్చి, వాళ్లకుపాడడంలో మెళకువలు నేర్పించి, వారిని ఒక వేదిక మీదకు తీసుకువచ్చిపాడించారు. ఘంటసాల జయంతి రోజున ఘంటసాలపాటలుపాడడానికి మహామహులైన గాయకులు పో టీ పడుతుంటారు. కరతాళ ధ్వనులలో ఉ΄÷్పంగిపో తుంటారు. జనం వారినే చూస్తారు, వారికే హారతులు పడుతుంటారు. కానీ...పాడాలనే తపన ఉన్న అనేక మంది ఆశావహుల ముఖాలను చూశారామె. వారిలో గృహిణులున్నారు. డాక్టర్లు, లాయర్లు, లెక్చరర్లు కూడా ఉన్నారు. ఇలాంటి గానాభిలాషులతో ఘంటసాల జయంతిని ప్రత్యేకంగా నిర్వహించేవారు వరలక్ష్మి. బీఈడీ చేసిన వరలక్ష్మిపాఠాలు చెప్పడంలో స్వరం మాధుర్యం కోల్పోతుందేమోనన్న భయంతోపాటల కోసంపాఠాల ఉద్యోగానికి దూరమయ్యారు.పాటపాడక పో తే తోచదు. ఇప్పుడు ముంబయిలో నివసిస్తున్నప్పటికీ అక్కడి తెలుగు వారిని ఒక చోటకు చేర్చడానికిపాటనే మాధ్యమంగా చేసుకున్నారామె. అరవై ఐదేళ్ల వరలక్ష్మి అరవై ఏళ్ల తనపాటల ప్రస్థానాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ► పాట చాలా ఇచ్చింది! ‘‘నేనుపాట కోసం జీవితాన్ని అంకితం చేశాననే ప్రశంస సంతోషంగా ఉంటుంది. కానీపాటకు నేను చేసిన సేవకంటేపాట నాకిచ్చిన గుర్తింపు, గౌరవమే పెద్దది.పాట నాకెంతో ఇచ్చింది. ఐదేళ్ల వయసులో గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ఘంటసాల గారితో కలిసి ‘ఆకాశవీథిలో అందాల జాబిలి’పాడాను. నాలో గాయని ఉందని గుర్తించిన స్కూల్ టీచర్లు ఏ కార్యక్రమం అయినా నాతోపాడించేవారు. ఇక కాలేజ్లో మ్యూజిక్ ఒక సబ్జెక్ట్గా తీసుకున్నాను. మా సరోజిని మేడమ్ ఎక్కడ పో టీలు జరిగినా నన్ను పంపేవారు. సినీనటి సుమలత మ్యూజిక్లో నా క్లాస్మేట్. ఆ పరిచయం ఉన్నప్పటికీ నేను సినిమా గానం వైపు వెళ్లలేదు. రేడియోలో ‘బి గ్రేడ్’ సింగర్గా సెలెక్ట్ అయ్యాను. ‘ఈ మాసపుపాట, లలిత గీతాలు’ లెక్కలేనన్నిపాడాను. టీవీలో తరిగొండ వెంగమాట కీర్తనలు, సమస్త దేవతా కీర్తనలనుపాడడంతోపాటు బాణీలు కూడా కట్టాను. ఆరు సొంత ఆల్బమ్లు చేశాను. మా రోజుల్లో ఇప్పుడున్నన్ని సౌకర్యాల్లేవు. చాలా మంది మహిళలకు తమపాటలను రికార్డు చేసుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ ఇంట్లో సహకారం లేక ఆశను చంపేసుకునేవారు. అలా నా దృష్టికి వచ్చిన వారందరి చేత సొంత ఆల్బమ్లు చేయించగలిగాను. పెళ్లి తర్వాత మా వారి ఉద్యోగరీత్యా మచిలీపట్నంలో ఉన్నంత కాలం నాపాటయానం ఇన్నర్ వీల్ సర్వీస్తో కలగలిసిపో యి సాగింది. మా అబ్బాయి చదువు కోసం తిరుపతికి మారాం. అప్పుడు మరో మలుపు తీసుకుంది. తిరుపతిలో ఉన్నంత కాలం ‘ఘంటసాల స్వరాభిషేకం’ కార్యక్రమంలో వందల మందితో అన్నమాచార్య కీర్తనలు, సాధారణపాటలుపాడించాను. వీటన్నింటిలో నాకు అత్యంత సంతోషాన్నిచ్చిన సంఘటన తిరుమలలో జరిగింది. ► గిరులు ప్రతిధ్వనించాయి తిరుమల రేడియో స్టేషన్ ్రపారంభోత్సవానికి ఆహ్వానించారు. వామన చరిత్రపారాయణం చేశాను. తిరుమలలోనే మరో సంఘటన వేదపాఠశాలలో జరిగింది. మా వదిన తిరుప్పావైపాటలను తెలుగులో రాశారు. ఆపాటలకు నేను ట్యూన్ కట్టాను. ముప్పైవపాట ట్యూన్ చేస్తున్నప్పుడు అనుకోకుండా తిరుపతిలోనే ఉన్నాను. వేదపాఠశాల నుంచి ఆహ్వానం వచ్చింది. గోవిందనామాలతో మొదలుపెట్టి తిరుప్పావైపాశురాలన్నీపాడాను. అప్పుడు వేదపాఠశాల గురువులు, ఐదు వందల మంది విద్యార్థులు గొంతుకల్లో పలికిన ఆశీర్వచనం తిరుమల గిరుల్లో ప్రతిధ్వనించింది.పాటను కమర్షియల్గా మార్చకుండా కళగా గౌరవిస్తే భగవంతుడు తనవంతుగా ఇనుమిక్కిలిగా ఇస్తాడని నమ్ముతాను. రెమ్యూనరేషన్ ఇవ్వలేని వాళ్ల కోసం సొంత ఖర్చులతో వెళ్లిపాడిన సందర్భాలున్నాయి. అందుకే నాకు ఆహ్వానాలు కూడా ఎక్కువే వస్తుంటాయి. తెలుగు నేల మీద ఆలయాలన్నీ నాపాటను ఆహ్వానం పలికాయనే చెప్పాలి. ఆర్కెస్ట్రాతో వెళ్తే తప్పనిసరిగా ఖర్చులుంటాయి. అందుకే చెన్నైకి వెళ్లి ట్రాక్లు రికార్డు చేయించుకున్నాను. నేను, నా ఫోన్ ఉంటే చాలు. ఎక్కడికైనా వెళ్లిపాడతాను. దేశవిదేశాల్లోనూ నా స్వరం వినిపించే అవకాశం వచ్చింది. ► మెండైన ప్రోత్సాహం పాట కోసం నేను టీచర్ ఉద్యోగాన్ని వదులుకుంటానంటే మా వారు రెండోమాటకు తావులేకుండా ్రపో త్సహించారు. ఆయన కెమిస్ట్రీ ప్రోఫెసర్గా రిటైరయ్యారు. మా అబ్బాయికి రిలయెన్స్లో ఉద్యోగం. తనుపాడతాడు కానీ వృత్తిగా కాదు. మనుమరాళ్లిద్దరికీ మంచి గొంతు ఉంది. వాళ్లకు నేర్పించాలనే ప్రయత్నం చేస్తున్నాను. కానీ పెరటిచెట్టు వైద్యానికి పనికిరాదన్నట్లు నా దగ్గర క్రమశిక్షణగా కూర్చునిపాడలేకపో తున్నారు. రెండుపాటలుపాడి ‘ఇక ఆడుకుంటాం నానమ్మా’ అని వెళ్లిపో తారు’’ అన్నారామె నవ్వుతూ. అరవై ఐదేళ్ల వయసులో కూడా ఆమె స్వరంలో మాధుర్యం ఏ మాత్రం తగ్గలేదు. ‘పాట కోసం గొంతు సవరించుకోని రోజు నాకు అనారోగ్యం వచ్చినట్లు. ఇంత వరకు ఒక్కరోజు కూడా ముసుగుపెట్టి పడుకున్నది లేదు.పాటలోనే నా ఆరోగ్యం,పాటతోనే నా జీవితం’ అన్నారు వరలక్ష్మి నారాయణమ్. – వాకా మంజులారెడ్డి -
లవ్ మ్యారేజ్.. నా భర్త బతికున్నాడో లేదో కూడా తెలీదు: నటి
మూడు దశాబ్దాలపాటు వెండితెరపై తన నటనతో అలరించారు సీనియర్ నటి పీఆర్ వరలక్ష్మి. సుమారు 800 సినిమాల్లో నటించిన ఆమె కమల్ హాసన్, జెమిని గణేశన్, ఎన్టీఆర్, కృష్ణ వంటి ఎంతోమంది స్టార్ హీరోలతో నటించారు. తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో అలరించిన ఆమె వెండితెరపై కనిపించి చాలాకాలమే అయింది. బిగ్స్క్రీన్ నుంచి బుల్లితెరకు షిఫ్ట్ అయిన ఆమె ప్రస్తుతం తమిళ సీరియల్స్లో నటిస్తున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. 'నాకు సాయం చేసే అలవాటు ఎక్కువ. రోజూ ఎంతోకొంత దానం చేయకపోతే నిద్రపట్టేదే కాదు. అలా అందరికీ సాయం చేసుకుంటూ పోవడం వల్ల కొంత ఆస్తి పోయింది. సినిమాల కోసం ఇల్లు అమ్ముకున్నాను, కోట్లు ఖర్చు పెట్టాను. అలా మరికొంత కరిగిపోయింది. ఇప్పుడు సంపాదిస్తోంది నా ఖర్చులకు సరిపోతుంది. అంతేకానీ నాకు వందల కోట్లు లేవు. నాది లవ్ మ్యారేజ్. ఏడేళ్లు ప్రేమించుకున్నాం. ఇంట్లో ఒప్పుకోకపోతే ఇంటి నుంచి పారిపోయి మరీ పెళ్లి చేసుకున్నాం. నా భర్త మంచి మనిషి, గోల్డ్ మెడలిస్ట్. కానీ మామధ్య ఏదైనా చిన్న గొడవయ్యిందంటే ఏడాది దాకా మాట్లాడే వాడు కాదు. అలా ఓసారి ఇల్లు అమ్మే విషయంలో మా ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. అది కాస్తా పెద్దదిగా మారడంతో మా మధ్య దూరం పెరిగింది. ఆయన నన్ను వదిలేసి అమెరికా వెళ్లిపోయాడు. 30 ఏళ్లవుతోంది.. ఒక్కసారి కూడా టచ్లోకి రాలేదు. బతికున్నాడో లేదో కూడా తెలియదు. అయినా... తనంతట తానుగా నన్ను వెతుక్కుంటూ వస్తే సరి కానీ ఆయన ఎక్కడున్నాడో అని మేము వెతుక్కుంటూ వెళ్లడం వద్దనుకున్నాను. కానీ చిన్న గొడవ వల్ల బంగారం లాంటి మనిషికి దూరమయ్యానని బాధపడుతుంటా' అని చెప్పుకొచ్చారు వరలక్ష్మి. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే సినిమాలివే! -
అందరూ అలా పిలవడంతో చాలా బాధపడేదాన్ని: వరలక్ష్మి
సినీ ఇండస్ట్రీలో అప్పట్లో స్టార్ నటిగా వెలుగొందిన వారిలో బేబీ వరలక్ష్మీ ఒకరు. మొదట 1973లో చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించిన ఆమె దాదాపు 30 ఏళ్లపాటు ఇండస్ట్రీలో కొనసాగారు. ఆ తర్వాత సినీ పరిశ్రమకు చాలా దూరంగా ఉన్నారు. ఇప్పుడు మరోసారి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. బేబీ వరలక్ష్మి తెలుగులో ఎక్కువగా హీరోలకు చెల్లెలి పాత్రలో నటించింది. ఆ తర్వాత కోలీవుడ్, బాలీవుడ్లోనూ పలు సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన జీవితంలో ఎదురైనా పలు చేదు అనుభవాలను వివరించారు. సూపర్ స్టార్ కృష్ణ చనిపోయినప్పుడు తాను బాగా ఏడ్చానని ఆమె తెలిపారు. అయితే ఈ రేప్ సీన్స్లో నటించిన కారణంగా తాను అనేక అవమానాలకు గురైనట్లు వెల్లడించారు. కొంతమంది నన్ను రేపుల వరలక్ష్మి అని పిలిచినప్పుడు చాలా బాధపడినట్లు తెలిపింది. కొంతమంది సహనటులు అలా పిలిస్తే.. తనకు నచ్చేది కాదని గుర్తు చేసుకుంది. అనంతరం తన అస్తుల విషయాల గురించి కూడా ఆమె స్పందించింది. అయితే తమకు చెన్నైలో తనకు కోట్ల ఆస్తులు ఉన్నాయన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. అప్పట్లో చైల్డ్ ఆర్టిస్టులకు చాలా తక్కువగా పారితోషికాలు ఉండేవని.. శాలిని అధిక పారితోషికం తీసుకుందని తెలిపింది. ఆ తర్వాత తెలుగులో హీరోయిన్లతో సమానంగా సినిమాలు చేసిన వరలక్ష్మి.. పారితోషికం భారీగానే తీసుకున్నట్లు పేర్కొంది. అప్పట్లో మా పారితోషికాలు తన స్కూల్ ఫీజులకు కూడా సరిపోయేవి కాదని బేబీ వరలక్ష్మి తెలిపింది. తన తండ్రి స్కూల్ ఫీజులు కట్టడానికి చాలా ఇబ్బందులు పడేవారని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత చెల్లెలు పాత్రలు చేశాక.. పారితోషికాలు బాగా అందుకున్నట్లు తెలిపింది. తనకు కోట్ల ఆస్తులు ఏమీ లేవని మినిమం ఆస్తులు సంపాదించుకొని ప్రస్తుతం సంతోషంగానే ఉన్నట్లు చెప్పుకొచ్చింది. అయితే ఈ తరం హీరోలకు తల్లి పాత్రల్లో నటించాలన్న కోరికను బయటపెట్టారు. -
రాష్ట్రపతి ముర్ముకు ఎంపీపీ లేఖ
ఏన్కూరు: ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం కొత్తమేడేపల్లిలోని ఆదివాసీ, గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎంపీపీ అరెం వరలక్ష్మి భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముకు గురువారం లేఖ రాశారు. గ్రామానికి చెందిన రెండేళ్ల బాలికకు సరైన వైద్యం అందకపోవడంతో ఇటీవల మృతి చెందగా, అంబులెన్స్ లేక ద్విచక్ర వాహనంపై మృతదేహాన్ని తీసుకొచ్చారు. ఈ మేరకు కొత్తమేడేపల్లితో పాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలోని ఆదివాసీ, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేలా చూడడంతో పాటు అటవీహక్కుల చట్టాల అమలు తీరును పర్యవేక్షించాలని ఎంపీపీ ఆ లేఖలో రాష్ట్రపతిని కోరారు. -
ప్రియునికి ప్రియురాలి తండ్రి షరతు.. లాడ్జ్లో రూం తీసుకొని..
మైసూరు: పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని విరక్తి చెందిన ప్రేమికులు ఉరి వేసుకుని తనువు చాలించారు. ఈ విషాద ఘటన మైసూరులో జరిగింది. చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలూకా బొమ్మలాపుర గ్రామానికి చెందిన బీజీ సతీశ్ (21), వరలక్ష్మి (20) అనే ఇద్దరు మృతులు. వీరు గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సతీశ్తో పెళ్లికి వరలక్ష్మి కుటుంబం అంగీకరించలేదు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన తర్వాతనే తమ కూతురును ఇచ్చి పెళ్లి చేస్తామని తెలిపారు. బీఏ చదివిన సతీశ్ పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. యువతి నర్సింగ్ చదువుతోంది. కాగా, సతీశ్ మరోసారి పెళ్లి ప్రస్తావన తీసుకురాగా, మొదట ఉద్యోగం తెచ్చుకో అని ప్రియురాలి తండ్రి సిద్ధలింగ తేల్చి చెప్పడంతో ప్రేమ జంట మనస్తాపానికి గురైంది. మైసూరుకు వచ్చిన జంట మంగళవారం సాయంత్రం లాడ్జ్లో రూం తీసుకున్నారు. బుధవారం ఉదయం ఎంతకీ బయటకు రాకపోవడంతో సిబ్బంది కిటికీ నుంచి చూడగా గదిలో కొక్కీకి ఉరి వేసుకుని చనిపోయి ఉన్నారు. లాడ్జ్ యజమాని లష్కర్ ఏరియా పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: (జైళ్లో నేత్ర.. నిర్మానుష్య బంగ్లాలో చోరీ) నదిలో దూకిన మరో ప్రేమజంట మైసూరు: తమ ప్రేమను ఇంట్లో పెద్దవాళ్లు అంగీకరించలేదని ప్రేమజంట కపిలా నదిలోకి దూకింది. నంజనగూడు తాలూకా ముడికట్టె వద్ద జరిగింది. చామరాజనగర జిల్లా సోమవారపేట గ్రామ నివాసి అభి (19), చామరాజనగరకు చెందిన 17 ఏళ్ల బాలిక ప్రేమించుకున్నారు. బాలిక కాలేజీలో చదువుకుంటుండగా, అభి పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడు. వీరి ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. బుద్ధిగా ఉండాలని మందలించారు. దీంతో యువ జంట ఆవేదనకు గురై కపిలా నదిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించారు. నదిలో తెప్పలు నడుపుతున్నవారు ప్రేమ జంటను రక్షించడంతో గండం తప్పింది. ఇద్దరిని నంజనగూడు ఆస్పత్రిలో చేర్పించారు. పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది. -
‘స్పై’ కెమెరాలపై ‘స్పై’..మూడో కన్నుతో చూడొద్దు!
స్పై కెమెరాల ద్వారా జరిగే అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని ‘యాంటీ రెడ్ ఐ’ పేరుతో ఐదేళ్ల క్రితం ముందుకు వచ్చారు హైదరాబాద్ వాసి వరలక్ష్మి. స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాల్లో ప్రోగ్రామ్లు నిర్వహిస్తూ ‘అమ్మాయిలూ జాగ్రత్తగా ఉండండి’ అని చెబుతూ వచ్చారు. ‘‘ఈ క్రమంలోనే జనంలోకి వెళుతున్నకొద్దీ మహిళలు, పిల్లలపై జరుగుతున్న దాడులు, వేధింపులు, హింస.. ఏ స్థాయిలో ఉందో అర్థమైంది. విషయాలు తెలుస్తున్నకొద్దీ నేరాలకు అడ్డుకట్ట వేయలేమా.. అనే ఆలోచన ఎక్కువైంది’’ అంటారు వరలక్ష్మి. ఆ దిశగానే మహిళల రక్షణ విషయంలో అనేక కోణాల్లో పరిశీలించి ‘వాయిస్ ఆఫ్ భారత్’ ను తీసుకొచ్చాను అని వివరించారు. మహిళలు, పిల్లల రక్షణ కోసం చట్టాలు కఠినతరం చేయాలంటూ నినదించే వరలక్ష్మి ‘సాక్షితో పంచుకున్న విషయాలు... ‘‘మహిళల రక్షణపై దాదాపు వందమంది సెలబ్రిటీలు, స్త్రీ, పురుషుల వాయిస్ను 45 రోజులు పాటు వీడియో రూపంలో రికార్డు చేశాను. వారందరూ మాట్లాడిన విషయాలో ముఖ్యమైన పాయింట్స్ను క్రోడీకరించారు. అడ్వకేట్ అభిప్రాయాన్ని కూడా తీసుకొని 24 ముఖ్యమైన పాయింట్ల జాబితాను తీసుకొచ్చాను. రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు అధికారులను సంప్రదించి, ఆ జాబితాను అమలు పరిచాలని కోరుతున్నాను. రోజు రోజుకూ నేరాలుపెరుగుతున్న నేపథ్యంలో మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఒక ఎజెండా ఇది. 2017లో ‘యాంటీ రెడ్ ఐ’ పేరుతో జనంలోకి వెళ్లినప్పుడు కొత్త కొత్త సమస్యలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆగస్టు 15, 2020 నుంచి పబ్లిక్ నుంచి వాయిస్ తీసుకోవడం మొదలుపెట్టాను. తెలంగాణ, ఆంధ్రాలోని అన్ని రాజకీయ పార్టీలు, పోలీసు డిపార్ట్మెంట్ నుంచి కూడా వాయిస్ తీసుకున్నాం. తెలుగు రాష్ట్రాల్లో మహిళలు, పిల్లలపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయడానికి, నిరోధించడానికే నా ప్రయత్నం అంతా. దీంట్లో భాగంగానే మహిళలకు శిక్షణా తరగతులు, క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్స్, బాలకార్మికులకు సంబంధించినవి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ అవగాహన, ఆరోగ్య శిబిరాలు.. ఇవన్నీ ఒక దగ్గర చేర్చడానికి ‘హెవెన్ హోమ్ సొసైటీ’ పేరుతో ఎన్జీవోను ఏర్పాటు చేశాను. సీసీ కెమెరాలు, పుటేజీ ‘వాయిస్ ఆఫ్ భారత్’లో భాగంగా గ్రామణస్థాయి నుంచి నా కార్యాచరణను మొదలుపెట్టాను. అప్పుడే పిల్లలు, మహిళలపై అఘాయిత్యాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయనేది అర్ధమైంది. ఏదైనా నేరం జరిగిన వార్త తెలిసినప్పుడు ‘అయ్యో’ అనేసి ఊరుకుంటున్నాం. కానీ, చాలా వరకు గురుకులాలు, కార్యాలయాలు, పాఠశాలల్లో... సీసీ కెమెరాల ఏర్పాటు, వాటికి సంబంధించిన పుటేజీ రికార్డులో ఉండటం అనేది ఏ మాత్రం జరగడం లేదు. ఎక్కడా రికార్డు కాకపోవడంతో నేరాలు కూడా వెలుగు చూడటం లేదు. నేరస్థులు నిర్భయంగా బయట తిరుగుతున్నారు. మిస్సింగ్ అయిన కథనాలెన్నో.. లాక్డౌన్ తర్వాత వరుస చిన్నారులు మిస్సింగ్ కథనాలు ఎక్కువగా వినవస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ దమ్మాయిగూడలో నలుగురు పిల్లలు మిస్సింగ్ న్యూస్ ప్రధానమైంది. అందులో ఒక చిన్నారిని అత్యంత దారుణంగా రేప్ చేసి, చంపారు. మరో రెండు కేసులు వెలుగులోకే రాలేదు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట రావాలంటే అన్నిచోట్లా సిసి కెమెరాల ఏర్పాట్లు పెంచాలి. సెక్షన్లు త్వరగా అమల్లో పెట్టాలి. పార్టీలతో సంబంధంలో లేకుండా మహిళల రక్షణకు సంబంధించిన విషయాలన్నీ వారి ఎజెండాలో పెట్టాలి. ప్రతి మహిళా ఆలోచించాల్సిన తరుణం ఇది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిల్లలు, మహిళల భద్రత విషయాల పట్ల వెంటనే స్పందించి, అమలులో పెట్టాలి. అఘాయిత్యాలు చోటు చేసుకున్నాక కాదు రక్షణ గురించి ఆలోచించడం కాదు, ముందే బతికుండటానికి రక్షణ కావాలన్నదే ‘వాయిస్ ఆఫ్ భారత్’ నినాదం. మహమ్మారి టైమ్ కరోనా టైమ్లో బయట తిరిగే వారి సంఖ్య తగ్గింది, క్రైమ్ తగ్గింది అనుకుంటున్నారు. నిజానికి పరిస్థితి అలా లేదు. దీనికి సంబంధించిన డేటా కోసం అన్ని పోలీసు విభాగాల్లోనూ వివరాలను సేకరించాను. ఒక్కో పోలీస్ స్టేషన్ పరిధిలో కనీసం ఐదు కేసులు ఫైల్ అవుతున్నాయి. గృహహింస అయితే మరీ దారుణం. కరోనా కారణంగా ఎవరి ప్రాణాలు వారు కాపాడుకోవడంలో మునిగిపోయి ఈ తరహా క్రైమ్ వినడానికి, చెప్పుకోవడానికి ఎవరూ పట్టించుకోవడం లేదు. మూడో కంటితో చూడొద్దు... యాంటీ రెడ్ ఐ షాపింగ్ మాల్స్, కాంప్లెక్సులు, హోటల్ గదులు, అద్దె ఇల్లు.. ఇలా ప్రతి చోట అమ్మాయిలు, మహిళలను స్పై కామ్ ద్వారా నగ్న వీడియోలు, ఫొటోలు తీసి వాటిని సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేసే నేరగాళ్లు పెరిగారు. దీనివల్ల జరిగే అనర్థాలకు అడ్డుకట్టవేసే ఉద్దేశంతోనే మూడో కన్నుతో చూడొద్దు అని ‘యాంటీ రెడ్ ఐ’ ఏర్పాటు చేశాను. దాదాపు ఐదేళ్లుగా ఈ స్పై కెమరా నేరాలకు సంబంధించి వర్క్ చేస్తున్నాను. ఎంతోమంది సాయంగా! మహిళల భద్రతకు సంబంధించిన ‘యాప్’ ను తీసుకురావాలని ప్రభుత్వాలను కోరుతూ, మహిళల రక్షణకు సంబంధించిన విషయాలను ప్రింట్ చేస్తూ వాటిని అధికారులకు అందజేస్తూ వస్తున్నాను. వేధింపులు, అఘాయిత్యాలకు గురైన బాధితులకు సాయం చేయమంటూ వేడుకోళ్లు వస్తూనే ఉంటాయి. దానికి తగినట్టుగానే అడ్డుకోవడానికి ‘చంపేస్తాం’ అంటూ ఎన్నో బెదిరింపులు వచ్చాయి. ఇలాంటప్పుడు కుటుంబం శ్రేయస్సు గురించి ఆలోచించి, విడిగా ఉంటూ ఈ పనులు చూస్తున్నాను. ఈ సంస్థ ముందుకెళ్లడానికి నా స్నేహితుల సాయమే నాకు కొండంత అండగా నిలుస్తోంది’’ అని వివరించారు వరలక్ష్మి. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: రాజేష్ రెడ్డి నోముల -
పోలీస్ కస్టడీకి వరలక్ష్మి హత్య కేసు నిందితుడు అఖిల్
-
వరలక్ష్మి హత్య కేసు: పోలీస్ కస్టడీకి అఖిల్
సాక్షి, విశాఖపట్నం : విశాఖలో సంచలనం రేకెత్తించిన ఇంటర్మీడియట్ విద్యార్థిని వరలక్ష్మి హత్య కేసులో నిందితుడు అఖిల్ సాయిని పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. అందులో భాగంగా బుధవారం నుంచి విచారణ కొనసాగించారు. ముఖ్యంగా ఒక మైనర్ బాలికను హత్య చేయడం వెనుక అఖిల్ అనుసరించిన అంశాలను పోలీసులు సేకరించారు. నిందితుడు ప్రేమ పేరిట బాలికను నిర్మానుష్య ప్రాంతానికి రప్పించడమే కాక హత్య నేరాన్ని మరొకరిపై నెట్టే ప్రయత్నం జరిగింది. వీటిపై ఫోరెన్సిక్ నిపుణుల సహకారంతో కొన్ని ఆధారాలను పోలీసులు సేకరించారు. నిందితునిపై త్వరితగతిన శిక్ష పడే రీతిలో పోలీసులు సాంకేతికపరమైన ఆధారాలు ఈ కేసులో సేకరిస్తున్నట్లు తెలిసింది. విశాఖ దీక్ష ఏసీపీ ప్రేమ్ కాజల్ స్వయంగా నిందితుడిని విచారించినట్లు తెలుస్తోంది. కస్టడీ గడువు ముగియడంతో అగనంపూడి ప్రాథమిక వైద్యశాలలో పరీక్షలు నిర్వహించి పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. చదవండి: వరలక్ష్మి హత్య కేసులో మరో ట్విస్ట్ -
వరలక్ష్మి హత్య కేసులో మరో ట్విస్ట్
గాజువాక(విశాఖపట్నం): స్థానిక శ్రీనగర్కు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని వరలక్ష్మి హత్య కేసులో మరో ఇద్దరు నిందితులను గాజువాక పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ప్రేమోన్మాది అఖిల్సాయి వెంకట్ చేతిలో వరలక్ష్మి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు సంఘటన జరిగిన రోజే నిందితుడు అఖిల్సాయి వెంకట్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తాజాగా కొప్పెర్ల హరి రామకృష్ణరాజు, తంగెళ్ల చిన్న అప్పన్న అనే మరో ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. వరలక్ష్మితో చనువుగా ఉంటున్నాడనే కారణంతో ఆమె సోదరు డు ఇటీవల వంగపండు రామునాయుడు అనే వ్యక్తితో గొడవపడ్డాడు. మరోసారి తన చెల్లెలతో మాట్లాడినట్టు తెలిస్తే బాగుండదని హెచ్చరించాడు. రెండేళ్ల క్రితం హత్యకు గురైన రౌడీషీటర్ కుమారుడు హరి రామకృష్ణరాజుతో ఈ విషయాన్ని చెప్పాడు. దీన్ని అదనుగా తీసుకున్న హరి ఇటీవల రామునాయుడుకు ఫోన్ చేసి షీలానగర్ వచ్చి తనను కలవా లని, లేనిపక్షంలో ఇబ్బంది పడతావని హెచ్చరించాడు. అతడి ని కలిసిన రామునాయుడుని రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తాను అడిగిన డబ్బులు ఇస్తే ఎవరినుంచీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తానని చెప్పాడు. దీంతో రాము నాయుడు అతడికి దఫదఫాలుగా రూ.7వేలు ఇచ్చాడు. ఉప్పర కాలనీ నివాసి, హరి స్నేహితుడు చిన్న అప్పన్న అనే వ్యక్తికి కూడా రూ.1000 ఇచ్చాడు. వరలక్ష్మి హత్య కేసులో విచారణ ప్రారంభించిన పోలీసులకు రామునాయుడు ఈ విషయాలు చెప్పడంతో హరి, చిన్న అప్పన్నలను కూడా అరెస్టు చేసినట్టు గాజువాక సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. ఈ కేసులో మొత్తం ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని ఎస్ఐ గణేష్ తెలిపారు. -
వరలక్ష్మిని చంపేందుకు క్రైమ్ సినిమాలు చూశాడు..
అమ్మాయిని ప్రేమించాడు. ఆమెతోనే జీవితమనుకున్నాడు. కానీ అతడు అనుకుంది జరగలేదు. ఆమె అతడిని స్నేహితుడిగా మాత్రమే చూసింది. తట్టుకోలేకపోయాడు. కక్ష పెంచుకున్నాడు. తనకు దక్కని ప్రేమ మరొకరికి దక్కకూడదని నిశ్చయించుకున్నాడు. అలా తనలోని ప్రేమికుడు కాస్తా రాక్షసుడిగా మారాడు. ప్రేమికురాలిని హతురాలిగా మార్చేందుకు క్రైమ్ సినిమాలు చూశాడు. నేరం చేసి తప్పించుకోవడమూ నేర్చుకున్నాడు. కానీ అది సినిమా, ఇది నిజ జీవితమని గుర్తించలేకపోయాడు. యువతిని పొట్టనపెట్టుకున్నాడే కానీ హత్యా ఘాతుకం నుంచి తప్పించుకోలేకపోయాడు. సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన వరలక్ష్మి హత్య కేసులో సంచలన నిజాలు బయటపెడుతున్నాయి. నిందితుడు అఖిల్ సాయి వెంకట్ తనకు దూరమైన వరలక్ష్మి ఎవరికీ దక్కకూడదనే కోపంతో ఈ హత్యకు పథకం వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. హత్య చేయడంతో పాటు, నేరం బయటపడకుండా ఉండేందుకు అతడు పాపులర్ క్రిమినల్ సినిమాలను చూశాడు. ఓ పాపులర్ సినిమాలో హత్య చేసిన తర్వాత చుట్టూ కారం చల్లితే డాగ్ స్క్వాడ్ కూడా పసిగట్టని సీన్లను చూసినట్టు నిందితుడు వెల్లడించాడు. దీంతో పక్కా పథకం ప్రకారం ముందుగానే కారం కొనుగోలు చేసి, అనంతరం ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి రప్పించి, బ్లేడుతో కోసి, ఎటువంటి ఆధారాలు లభించకుండా చుట్టూ కారం చల్లాలని భావించాడు. అలాగే 'దృశ్యం' సినిమాలో చేసినట్లు పోలీసులను తప్పుదారి పట్టించిన మరొకరిపై నేరాన్ని మోపే ప్రయత్నం కూడా చేశాడని తేలింది. (చదవండి: వరలక్ష్మి హత్యకేసులో మరింత లోతుగా విచారణ) మరికొన్ని రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేస్తాము కాగా గాజువాక శ్రీనగర్లోని సుందరయ్య కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని వరలక్ష్మి (17)పై చిట్టినాయుడు కాలనీకి చెందిన అఖిల్సాయి వెంకట్ (21) శనివారం రాత్రి బ్లేడ్తో దాడి చేసి.. అతి కిరాతకంగా గొంతుకోసి చంపేసిన విషయం తెలిసిందే. హత్య జరిగిన ప్రాంతంలో పోలీసులు నేడు (గురువారం) మరోసారి సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. చుట్టుపక్కల పరిసరాలలో కొందరి నుంచి సాక్ష్యాలు కూడా సేకరించారు. నిందితుడిపై హత్యానేరంతోపాటు మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన అభియోగంపై యాక్ట్ జత చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఏసీపీ ప్రేమ్ కాజల్ మాట్లాడుతూ కొద్ది రోజుల్లోనే ఈ కేసుకు సంబంధించి చార్జిషీట్ దాఖలు చేస్తామని తెలిపారు. నిందితుడిపై పోక్సో యాక్ట్ అమలు చేస్తామని పేర్కొన్నారు. (చదవండి: చదువుల తల్లిని చిదిమేశాడు) -
రామ్తో చనువుగా ఉండటాన్ని భరించలేక..
సాక్షి, విశాఖపట్నం : ఉన్మాది చేతిలో హత్యకు గురైన వరలక్ష్మి కేసును విశాఖ పోలీసులు మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే ప్రధాన నిందితుడు అఖిల్ సాయి కుమార్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. అదే సమయంలో ఇతరుల ప్రమేయంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో హోంమంత్రి ఆదేశాల మేరకు విచారణను మరింత లోతుగా కొనసాగిస్తున్నారు. వరలక్ష్మి మరో యువకుడు రామ్తో చనువుగా ఉండటాన్ని భరించలేక అఖిల్ సాయి హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. చదవండి: హత్యకేసులో సెంట్రల్ జైలుకి అఖిల్.. ఈ హత్యకు ముందు అఖిల్ సాయి గాజువాకలో రౌడీషీటర్ గేదెల రాజు కొడుకు సూర్యనారాయణ రాజుతో కలిసి రామును బెదిరించడమే కాకుండా తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద దాడి కూడా చేసినట్లు గుర్తించారు. ఆ సమయంలో వరలక్ష్మి సోదరుడు జై ప్రకాష్ కూడా ఉన్నారు. వరలక్ష్మితో రాము సన్నిహితంగా ఉంటున్నాడని చెప్పి వరలక్ష్మి సోదరుడు జై ప్రకాష్ను రెచ్చ గొట్టి ఈ దాడికి పాల్పడ్డాడు. అయితే వరలక్ష్మి హత్యలో ఈ రౌడీషీటర్ గేదెల రాజు కొడుకు ప్రమేయం ఏ మేరకు ఉందన్న కోణంలో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. -
నేరస్తులపై కఠిన చర్యలు
సాక్షి, విశాఖపట్నం: వరలక్ష్మి కేసులో నేరస్తులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, దిశ చట్టం ప్రకారం ఏడు రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీటు వేస్తామని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గాజువాక మండలం చినగంట్యాడ సుందరయ్య కాలనీలో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన వరలక్ష్మి కుటుంబాన్ని మంత్రి సుచరిత సోమవారం పరామర్శించారు. సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన ఆర్థిక సాయానికి సంబంధించిన రూ.10 లక్షల చెక్కును వరలక్ష్మి తల్లిదండ్రులు పద్మప్రియ, సత్యగురునాథ్కు కలెక్టర్ వినయ్చంద్, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డితో కలిసి ఆమె అందించారు. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని వరలక్ష్మి కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు. అనంతరం సుచరిత మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా పరిగణించినట్లు తెలిపారు. తక్షణమే వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని ఆదేశించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం తీసుకొచ్చిన దిశ చట్టం స్ఫూర్తితో నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపడతామన్నారు. నిందితుడు అఖిల్ సాయిని రిమాండ్కు తరలించారని.. అతని తండ్రి, వారి కుటుంబసభ్యులపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు మంత్రి తెలిపారు. వరలక్ష్మి కుటుంబసభ్యులకు రూ.10 లక్షల చెక్కు అందజేస్తున్న హోంమంత్రి సుచరిత దిశ యాప్లో ఫిర్యాదు చేయండి.. చిత్తూరులో చిన్నారిపై హత్యాచారం ఘటనలో నిందితుడికి 7 నెలల్లోనే ఉరిశిక్ష ఖరారైందని.. విజయవాడలో 4 నెలల్లోనే నిందితుడికి ఉరిశిక్ష పడిందని హోం మంత్రి సుచరిత గుర్తు చేశారు. పాఠశాల స్థాయిలోనే మగపిల్లలకు అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో అవగాహన కల్పించడంతో పాటు చట్టాలను కూడా వివరించేందుకు తగు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థినీ దిశ యాప్, ఏపీ పోలీస్ సేవా యాప్ డౌన్లోడ్ చేసుకునేలా ప్రత్యేక డ్రైవ్ చేపడతామని చెప్పారు. ఇలాంటి ఘటనలపై ఫిర్యాదు వస్తే వెంటనే స్పందించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో విశాఖ సీపీ మనీష్కుమార్ సిన్హా, దిశ చట్టం ప్రత్యేకాధికారులు కృతికా శుక్లా, దీపికా ఎం.పాటిల్, డీసీపీ ఐశ్వర్య రస్తోగి, సౌత్ ఏసీపీ రామాంజనేయరెడ్డి, ఆర్డీవో కిశోర్ తదితరులు పాల్గొన్నారు. -
వరలక్ష్మి కుటుంబానికి పరామర్శ
సాక్షి, విశాఖపట్నం: ప్రేమోన్మాదానికి బలైన ఇంటర్ విద్యార్థిని వరలక్ష్మి కుటుంబానికి హోంమంత్రి మేకతోటి సుచరిత రూ.10 లక్షల చెక్ను అందజేశారు. సోమవారం వరలక్ష్మి కుటుంబసభ్యులను పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ వరలక్ష్మి ఘటన చాలా బాధాకరమన్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోందని, నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. వరలక్ష్మి కుటుంబానికి పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తామన్నారు. ‘ఈ హత్యలో నిందితునికి ఇతరులు సహకరించరన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. ప్రతి విద్యార్థి దిశ యాప్ డౌన్లోడ్ చేసుకునేలా విద్యాసంస్థల్లో అవగాహన కల్పిస్తున్నాం. టీనేజ్ వయసులో అమ్మాయిల ప్రవర్తనపైనే కాదు, అబ్బాయిల కదలికలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. వరలక్ష్మి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉందని చెప్పడానికే 10 లక్షల సహాయం అందించామ’ని హోంమంత్రి తెలిపారు. నిందితుడు అఖిల్కు మరికొంతమంది సహకరించారని ఆరోపించిన వరలక్ష్మి తల్లిదండ్రులు.. అఖిల్కు రౌడీషీటర్లతో సంబంధాలున్నాయని తమకు రక్షణ కల్పించాలని సుచరితను కోరారు. వారికి రక్షణ కల్పించాలని పోలీసులను సుచరిత ఆదేశించారు. (చదవండి: వరలక్ష్మి హత్య కేసులో కొత్త ట్విస్ట్) -
వరలక్ష్మి కుటుంబానికి రూ.10 లక్షల సాయం
సాక్షి, అమరావతి: విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకాన్ని తీవ్రంగా పరిగణించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి ఆదివారం సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ల నుంచి వివరాలను తెలుసుకున్న సీఎం బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మృతురాలు వరలక్ష్మి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం చేయాలని, ఆ కుటుంబాన్ని పరామర్శించాలని హోంమంత్రి మేకతోటి సుచరిత, దిశ ప్రత్యేక అధికారులు కృతికా శుక్లా, దీపికా పాటిల్ను ఆదేశించారు. ప్రతి టీనేజ్ బాలిక మొదలు మహిళలందరూ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకునేలా ఎడ్యుకేట్ చేయాలని సూచించారు. పాఠశాల, కాలేజీ విద్యార్థినులు వందశాతం ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలపై జరిగే నేరాలను అదుపుచేయడానికి కఠిన చర్యలు చేపట్టాలన్నారు. ఫలానా వ్యక్తి లేదా వ్యక్తుల నుంచి ముప్పు ఉందని మహిళలు సమాచారం ఇస్తే ఏ మాత్రం ఉదాసీనంగా వ్యవహరించకుండా సీరియస్గా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. -
చదువుల తల్లిని చిదిమేశాడు
సాక్షి, విశాఖపట్నం/గాజువాక: అతడి ప్రేమోన్మాదం చదువుల తల్లిని పొట్టన పెట్టుకుంది. గాజువాక శ్రీనగర్లోని సుందరయ్య కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని వరలక్ష్మి (17)పై చిట్టినాయుడు కాలనీకి చెందిన అఖిల్సాయి వెంకట్ (21) శనివారం రాత్రి బ్లేడ్తో దాడి చేసి.. అతి కిరాతకంగా గొంతుకోసి చంపేసిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆదివారం కేజీహెచ్లో పోస్ట్మార్టం నిర్వహించాక వరలక్ష్మి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. చదువులో టాపర్ వరలక్ష్మి పదో తరగతిలో 9.5 జీపీఏ, ఇంటర్లో 9.8 జీపీఏ సాధించింది. ఆమె గాజువాకలో పాఠశాలలో చదువుతున్నప్పుడు అఖిల్సాయి వెంకట్ పరిచయమయ్యాడు. అతడు ప్రస్తుతం బీఎల్ ఫైనలియర్ చదువుతున్నాడు. మూడేళ్లుగా వారిద్దరి మధ్య స్నేహం ఉందని చెబుతున్నారు. శనివారం వరలక్ష్మి మేనత్త ఇంట్లో పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు కుటుంబ సభ్యులంతా వెళ్లారు. మధ్యాహ్నం బట్టలు మార్చుకుని వస్తానని తల్లిదండ్రులకు చెప్పడంతో వరలక్ష్మిని ఆమె అన్నయ్య ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం యువతి సమీపంలోని సాయిబాబా ఆలయానికి వెళ్లినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బ్లేడ్తో గొంతు కోసి.. ఇటీవలే అనారోగ్యం నుంచి కోలుకున్న అఖిల్సాయి వరలక్ష్మికి ఫోన్ చేసి.. ఆమెను చూడాలని ఉందని.. సాయిబాబా ఆలయం వద్దకు రావాలని చెప్పాడు. అక్కడికి వెళ్లిన వరలక్ష్మితో చాలాసేపు మాట్లాడాడు. ఆ తరువాత వెంట తెచ్చుకున్న బ్లేడ్తో ఆమెపై దాడి చేసి.. గొంతు, చేతుల్ని కోయడంతోపాటు మొహంపై పిడిగుద్దులు కురిపించాడు. వరలక్ష్మి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఆమె సోదరుడు, తండ్రి ఘటనా స్థలానికి చేరుకోగా.. అప్పటికే తీవ్ర రక్తస్రావమై వరలక్ష్మి మృతి చెందినట్టు పోలీసులు చెప్పారు. పథకం ప్రకారమే హత్య వరలక్ష్మిని అఖిల్సాయి వెంకట్ పథకం ప్రకారమే హత్య చేశాడని పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్సిన్హా స్పష్టం చేశారు. ఆదివారం ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన వరలక్ష్మి తల్లిదండ్రులతో మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. నిందితుణ్ణి అరెస్ట్ చేశామని, ఈ కేసును దిశ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశామని చెప్పారు. దిశ ఏసీపీ దర్యాప్తు చేస్తున్నారని, వారం రోజుల్లో చార్జిషీటు దాఖలు చేస్తామని చెప్పారు. నిందితుడు హత్య తరువాత ఘటనా స్థలంలో వేరే సీన్ తయారు చేశాడని, ఈ దాడిని వేరే వ్యక్తిపై నెట్టడానికి ప్రయత్నం చేశాడని చెప్పారు. హత్యకు ముందు ఓ రౌడీషీటర్ను కూడా సంప్రదించినట్టు సమాచారం ఉందన్నారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ పరామర్శ వరలక్ష్మి కుటుంబాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదివారం పరామర్శించారు. మృతురాలి తల్లిదండ్రుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకుని నిందితులకు కఠిన శిక్షపడేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారని తెలిపారు. నేడు విశాఖకు హోం మంత్రి సాక్షి, గుంటూరు: రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత సోమవారం విశాఖపట్నం వెళ్తున్నారు. ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన వరలక్ష్మి కుటుంబాన్ని ఆమె పరామర్శిస్తారు. ఈ మేరకు హోం మంత్రి కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. బాధితురాలి కుటుంబానికి అన్నివిధాలా అండగా నిలుస్తామని ఆ ప్రకటనలో హోం మంత్రి పేర్కొన్నారు. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడానని.. నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించామని తెలిపారు. భవిష్యత్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. -
అఖిల్ను వెంటపడవద్దని హెచ్చరించినా..
సాక్షి, విశాఖ : ఉన్మాది చేతితో దారుణంగా ప్రాణాలు కోల్పోయిన వరలక్ష్మి కుటుంబ సభ్యుల్ని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. గాజువాక శ్రీనగర్ కాలనీలో వరలక్ష్మి మృతదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ ‘వరలక్ష్మి హత్య అమానుషం. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. దిశ చట్టం ప్రకారం నిందితులపై పోలీసులు త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నారు. నిందితులకు దిశ చట్టం ద్వారా కఠినమైన శిక్ష పడుతుంది. ఏడాది క్రితం అఖిల్ను తమ కుమార్తె వెంట పడవద్దని వరలక్ష్మి కుటుంబీకులు హెచ్చించినా అతడి వైఖరి మారలేదు. అయినా ఈ దారుణానికి ఒడిగట్టాడు. (చదవండి : పక్కా ప్లాన్తోనే వరలక్ష్మిని హత్య చేశాడు..) ఈ హత్యలో అఖిల్ తండ్రి పాత్రపైన కూడా అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆపదలో ఉన్న యువతులు దిశ యాప్ను వినియోగించుకోవాలి. ప్రేమ పేరిట దాడుల నియంత్రణకు విద్యార్థులకు కౌన్సిలింగ్ అవసరం. ఇలాంటి ఘటనకు కారణమైన అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంది. బాధిత యువతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 10 లక్షల పరిహారం ప్రకటన ప్రభుత్వం అండగా ఉందని చెప్పడానికే.’ అని అన్నారు. (చదవండి : వరలక్ష్మి హత్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు) ఈ ఘటనను విశాఖ జిల్లా ఇంఛార్జి మంత్రి కురసాల కన్నబాబు తీవ్రంగా ఖండించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వం పోలీసు అధికారులు వెంటనే స్పందించిన తీరును అభినందించారు. అయితే ఇలాంటి ఘటనలు జరగకుండా సమాజంలో అన్ని వర్గాలు కూడా బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు. మరోవైపు పోస్ట్మార్టం అనంతరం వరలక్ష్మి మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులకు అప్పగించారు. విగతజీవిగా ఉన్న కూతురిని చూసి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. వరలక్ష్మీ కుటుంబ సభ్యులను పరామర్శించనున్న హోమంత్రి సుచరిత మోన్మాది చేతిలో మరణించిన వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి హోంమంత్రి మేకతోటి సుచరి ఈ రోజు రాత్రి విశాఖపట్నంకు బయలుదేరారు. రేపు ఉదయం 10 గంటలకు గాజువాక చేరుకొని వరలక్ష్మి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శిస్తారు. ఇప్పటికే దాడి చేసిన ప్రేమోన్మాది అఖిల్ సాయి పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులను హోంమంత్రి సుచరిత ఆదేశించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. -
పక్కా ప్లాన్తోనే వరలక్ష్మిని హత్య చేశాడు..
సాక్షి, విశాఖపట్నం : గాజువాకలోని శ్రీనగర్ సుందరయ్య కాలనీలో శనివారం రాత్రి ప్రేమోన్మాదానికి ఇంటర్ విద్యార్థిని వరలక్ష్మి బలైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. తాజాగా వరలక్ష్మిని పక్కా పథకం ప్రకారమే హత్య చేసినట్లుగా భావిస్తున్నట్లు విశాఖ నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. ఆదివారం గాజువాక శ్రీనగర్లోని వరలక్ష్మి ఇంటికి స్వయంగా వెళ్లిన సీపీ కుటుంబసభ్యుల వివరాలు సేకరించారు. (చదవండి : గాజువాకలో ప్రేమోన్మాది ఘాతుకం) అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 'వరలక్ష్మి హత్య పక్కా ప్రణాళికతో జరిగింది. హత్య చాలా బాధాకరమైన సంఘటన. నిందితుడు తండ్రి ఇచ్చిన సమాచారంతో సంఘటన ప్రాంతానికి వెళ్లడం జరిగింది. అయితే అప్పటికే చాలా రక్తం పోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లిన కాసేపటికే వరలక్ష్మి మృతి చెందింది. కాగా ఈ హత్య కేసులో నిందితులను ఇప్పటికే అరెస్టు చేశాం. ఈ కేసును దిశా ఏసీపీకి అప్పగించాం. వారం రోజుల్లో చార్జీ షీట్ వేస్తాం. (చదవండి : వరలక్ష్మి హత్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు) విశాఖ కమిషనర్ మనీష్కుమార్ సిన్హా 'సంఘటనా ప్రాంతంలో ఎలాంటి క్లూస్ లభించకూడదని తారుమారు చేయాలననే ప్రయత్నం చేశారు. వరలక్ష్మి హత్యకు ముందే అఖిల్ ఒక రౌడీ షీటర్ను సంప్రదించినట్లు తెలిసింది. నిందితుడు చాలా పక్కా ప్లాన్ తో మర్డర్ చేశాడు. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం కత్తి, కారం తీసుకుని వరలక్ష్మిని హత్య చేయడానికి సిద్ధం అయ్యాడు. ఆ తర్వాత ఇదంతా వేరే వాళ్ళు చేసినట్లుగా చూపించేందుకు యత్నించాడు.అయితే నిందితుడు తండ్రి నుంచి పోలీసులకు సమాచారం మొదటగా రావడంతో వరలక్ష్మి హత్య కేసులో అఖిల్ తండ్రి పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నాం. కాగా 6.42 సమయంలో హత్య జరిగినట్లు అఖిల్ తండ్రి ఫోన్లో చెప్పారని.. కాగా అఖిల్ తండ్రిపై గతంలో రౌడీషీట్ ఉందని తేలింది. పక్క ప్లాన్తోనే ప్యూర్ క్రిమినల్ మర్డర్ చేశారు. .చట్ట ప్రకారం అన్ని కఠిన చర్యలు తీసుకుంటామని' కమిషనర్ మనీష్ తెలిపారు. -
గాజువాక: వరలక్ష్మి హత్య కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: గాజువాకలో హత్యకు గురైన వరలక్ష్మి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. పథకం ప్రకారమే వరలక్ష్మి హత్య జరిగింది. యువతి హత్యకు ఆమె మరొకరితో సన్నిహితంగా ఉండటమే కారణమని తేలింది. వరలక్ష్మిపైన అనుమానంతోనే అఖిల్ ఆమెను సాయిబాబా గుడి వద్దకు పిలిచి దారుణంగా హతమార్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. (మరదలితో రెండో పెళ్లి.. నిప్పంటించిన మొదటి భార్య) కాగా.. సుందరయ్య కాలనీలో ఉంటున్న వరలక్ష్మితో, చిట్టిబాబు కాలనీకి చెందిన అఖిల్ ప్రేమ పేరిట వెంట పడ్డాడు. అదే సమయంలో రాము అనే యువకుడు వరలక్ష్మితో సన్నిహితంగా ఉండటంతో భరించలేక పథకం ప్రకారం హత్య చేసినట్టు వెల్లడైంది. మరో వైపు ఊహించని ఈ పరిణామంతో వరలక్ష్మి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అమానుషంగా తమ కుమార్తె ప్రాణం తీసిన అఖిల్ను కఠినంగా శిక్షించాలని వరలక్ష్మి తల్లి కోరుకుంటోంది. తాజా ఘటనపై స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటన ఏ కుటుంబానికి ఎదురు కారాదని స్థానికులు బాధిత యువతి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. (గాజువాకలో ప్రేమోన్మాది ఘాతుకం) నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం: సుచరిత గుంటూరు: విశాఖపట్నం ప్రేమోన్మాది ఘటనపై హోంమంత్రి సుచరిత తీవ్రంగా మండిపడ్డారు. దారుణానికి ఒడిగట్టిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అయితే అంతకు ముందు డీజీపీ, ఇతర ఉన్నాతాధికారులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకున్న హోంమంత్రి.. బాధితురాలి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. (గాజువాక ఘటనపై సీఎం జగన్ సీరియస్) శాంతి ర్యాలీకి మహిళా కమిషన్ పిలుపు ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని వరలక్ష్మికి నివాళి అర్పిస్తూ ఆదివారం సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నం బీచ్ రోడ్లో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీకి మహిళా కమిషన్ పిలుపునిచ్చింది. వరలక్ష్మికి మద్దతుగా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ విజ్ఞప్తి చేశారు. -
హెల్త్ జీరో కాకూడదు
నాజూకు రాణులు సన్నజాజుల్లా ఉండాలట.వాళ్ల బరువు ఏడు మల్లెల ఎత్తు తూగాలట.కానీ... ఇక్కడో అందమైన, ఆరోగ్యకరమైన ఆల్టర్నేటివ్ మాట కూడా ఉంది.‘చక్కనమ్మ చిక్కినా అందమే’ అని ఓ వాడుక. అంటే మరి... చిక్కిపోకుండా బొద్దుగా ఉంటేనో? అప్పుడామె ఇంకా మరింత అందంగా ఉందనే కదా అర్థం!అన్నట్టు ఒక్కమాట...సైజ్ జీరో అయితే హెల్త్ కూడా జీరో కావచ్చు. హెల్త్ జీరో అయితే జీవితమూ జీరో కావచ్చు. హెల్త్ కొరవడిన లైఫ్ హెల్ అనిపించవచ్చు.అందుకే సన్నబడినా, కండపట్టినాఆరోగ్యానికి మించిన అందం లేదని గ్రహించాలి.అటు ఆ ఏడుమల్లెలూ, సన్నజాజులే కాదు...ఇటు ఈ బొండుమల్లెలూ, ముద్దబంతులూ ఇచ్చే‘అందమైన’ సందేశం ఇదే! ‘‘ఆద్యా.. ఏంటమ్మా ఇది? ఏమీ తినకుండానే చేయి కడుక్కుంటున్నావ్?’’ కంచంలో వడ్డించిన భోజనం వడ్డించినట్టే వదిలేసిన ఆరేళ్ల మనవరాలిని మందలించింది అమ్మమ్మ.‘‘అమ్మో.. కర్రీస్లో ఎంత ఆయిల్ ఉందో?’’ భయంతో కళ్లింత చేసుకొని జవాబిచ్చింది ఆద్యా.‘‘ఏయ్ వేషాలా? ఎక్కడుందే ఆయిల్?’’ గద్దించింది ఆద్యా పిన్ని.‘‘అంతంత ఆయిల్ తింటే రోడ్డు రోలర్లా తయారవుతారు. నేను కంగనా రనౌత్లా ఉండాలి’’ .. కళ్లు, చేతులు, నడుము తిప్పుకుంటూ ఆ పిల్ల.అక్కడున్న పెద్దవాళ్లంతా ముక్కున వేలేసుకున్నారు. ఇంకానయం.. ఆరేళ్ల వయసులో ఆద్యా ఆ మాటలు మాట్లాడుతోంది.ఆ పిల్ల మేనత్త కూతురు.. నాలుగేళ్ల పసికూనకైతే బార్బీడాలే రోల్ మోడల్!విస్మయం చెందాల్సిన విషయమే. జీరో సైజ్.. ప్రభావం!తెల్లటి ఛాయే అందం అనే భ్రమను ‘నిజం’గా ఎలా నమ్మించారో.. బ్యూటీ అంటే జీరోసైజే అనే పిచ్చినీ అంతే ‘వాస్తవం’గా ప్రాచుర్యంలోకి తెచ్చారు. మ్యాగజైన్లు, పత్రికలు, టీవీలు, సినిమాల్లో ప్రకటనలు, కథనాలు, కథలు, సీరియళ్లు.. అన్నీ ఆ అతి నాజూకుతనానికే కిరీటం పెట్టాయి. అందం అంటే తెల్లటి రంగుతో.. 36–24–36 శరీర కొలతలు కాదు మొర్రో.. అందం అంటే ఆరోగ్యంతో ఉన్న ఆత్మవిశ్వాసమని ఇవే పత్రికల్లో మానసిక విశ్లేషకులు, వైద్యులు నెత్తీనోరు కొట్టుకొని చెప్తున్నా కమర్షియల్ యాడ్స్ మాయలో.. హోరులో వినట్లేదు.. చూడట్లేదు!శారీరక వ్యాయామం లేకుండా డైట్తో ఫలానా రోజుల్లోగా ఫలానా అన్ని కేజీలు తగ్గుతారు.. మేము గ్యారెంటీ అంటూ.. ‘డైట్కి ముందు.. తర్వాత’ అని ఫోటోలు వేసి మరీ నిలబెట్టిన హోర్డింగులు చూసి.. క్యూ కడ్తున్నారు. సన్నబడ్డమేమో గానీ.. నీరసించి ఆసుపత్రి పాలైన టీనేజ్ అమ్మాయిలు కళ్లముందే కనిపిస్తున్నా! సన్నజాజి.. ముద్దబంతి వెనకట.. ‘‘ఆ అమ్మాయి చూడు.. సన్నజాజి తీగలా ఎంత నాజూగ్గా ఉందో?’’ అని అన్నవాళ్లే కాస్త బొద్దుగా కనిపించిన ఆడపిల్లను చూసి‘‘ముద్దబంతి పువ్వు’’ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చేవాళ్లు. అంటే అందం.. మనిషి మనిషికీ మారినట్టే కదా! సన్నజాజి తీగను, ముద్దబంతినీ అభినందించారు అంటే ఆరోగ్యాన్ని.. దానిద్వారా వచ్చిన ఆత్మవిశ్వాసాన్నే పరిగణనలోకి తీసుకున్నట్టు కదా! కండ కలవాడే (కలది కూడా) మనిషని గురజాడ కూడా సెలవిచ్చాడు. మనిషి మనిషికీ ఒంటితీరు మారుతుంది. ఎవరి బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం వాళ్ల బరువు ఉండాలి. కష్టే ఫలి. చెమటోడ్చే శ్రమే ఆరోగ్య సూత్రం. అందుకే జీరో సైజ్ అబ్సేషన్గా మారిన తరాన్ని ఆ వెర్రిలోంచి బయటపడేయడానికి చాలా ప్రయత్నాలే మొదలయ్యాయిప్పుడు. ధమ్ లగాకే హైష్షా..! జీరో సైజ్కు బ్రాండ్ అంబాసిడర్స్గా వెలిగిందీ.. అందులో ఆరోగ్యం జీరో అని చాటిందీ సినిమా స్టార్సే.. సినిమాలే అయినా ఇప్పడు తూచ్ అంటోందీ అవే.. వాళ్లే! కరీనా కపూర్తో ఈ తరహా నాజూకుతనం విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది. జీరో సైజ్ కొలతల్లో ఇమడడానికి కరీనా తీసుకున్న అతి శ్రద్ధ ఆమెను అనారోగ్యం పాలు చేసింది. దాంతో హెల్త్ను మించిన గ్లో, ఫేమ్ లేదని అంతే త్వరగా దాంట్లోంచి బయటకు వచ్చింది కరీనా. పాజిటివ్ దృక్పథం, చేస్తున్న పనిపట్ల నిబద్ధత, ప్లస్ పాయింట్స్.. ప్లస్ సైజ్ను బీట్ చేస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని ప్రొజెక్ట్ చేస్తాయి. ఇదే అందానికి యూనివర్స్ ఇచ్చే నిర్వచనం. బ్యూటీ పేజెంట్స్లో క్రౌన్ను డిసైడ్ చేసే లాస్ట్ రౌండ్ కూడా వీటికి సంబంధించే ఉంటుంది. ఈ సత్యానికి సినిమాలు పబ్లిసిటీ ఇస్తున్నాయి. లావుగా ఉన్న భార్యతో బయటకు వెళ్లడానికి సిగ్గుపడే భర్తను రక్షించి ఆత్మవిమర్శలోకి నెట్టిన హీరోయిన్ కథ తెలుగులో ‘కితకితలు’తో ప్రారంభమై.. హిందీలో భూమి ఫడ్నేకర్ కథానాయికగా వచ్చిన ‘ధమ్ లగాకే ౖహె ష్షా’గా కొనసాగుతోంది. ప్లస్ సైజ్ కథానాయికతో తెలుగులో ‘సైజ్ జీరో’ అనే సినిమా వచ్చింది. ఈ చిత్రం కోసం అనుష్క శెట్టి బరువు పెరిగి పాత్రకు ప్రాణం పోసింది. అయినా.. ఆమె పట్ల ప్రేక్షకుల అభిమానం గ్రాము కూడా తగ్గలేదు. తెలుగు, తమిళ భాషల నటి ఆర్. వరలక్ష్మి (ఆర్. శరత్ కుమార్ కూతురు), బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఎట్సెట్రా.. నటనతోనే అభిమానులను సంపాదించుకున్నారు తప్ప నాజుకుతనంతో కాదు. పాతకాలంలో సంధ్యా, సావిత్రి, దేవిక, రాజశ్రీ తర్వాత జయచిత్ర లాంటి వారు లేరా.. అంటే ఉన్నారు. స్లిమ్గా ఉండే ట్రెండ్లో కూడా కాన్ఫిడెన్స్ పాత్ను ఎంచుకున్న లేటెస్ట్ హీరోయిన్స్ ఉదాహరణగా చూపించింది.. ఈ తరం కనెక్ట్ అవడం కోసమే. ప్లేబాయ్ టు మాల్స్..! లావుగా ఉండే వారిలో ఆత్మన్యూనత పోగొట్టడానికి ప్లస్ సైజ్ మోడల్స్ కూడా వచ్చారు. వరల్డ్ ఫేమస్ డిజైనర్స్ ప్లస్ సైజ్లో లేటెస్ట్ ఫ్యాషన్స్ను క్రియేట్ చేస్తున్నారు. వరల్డ్ టాప్ బ్రాండ్స్ వాటికి తమ బ్రాండ్నేమ్నిస్తున్నాయి. మాల్స్లో స్పెషల్ స్పేస్ దొరుకుతోంది. ప్లేబాయ్ లాంటి పత్రికలు ప్లస్ సైజ్ మోడల్స్ను తమ ముఖచిత్రంగా వేసి స్టీరియో టైప్ను బ్రేక్ చేస్తున్నాయి. ఆ పత్రిక ఫోటోగ్రాఫర్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో చోటు సంపాదించుకున్న ఎల్. రామచంద్రన్ ఆ మోడల్స్తో ఫోటో షూట్ చేస్తున్నాడు. ‘‘సన్నని మేను, తెల్లటి రంగు అంటూ అందానికి నిర్వచనాలుండవ్. అవి కథల్లో, కవితల్లో మాత్రమే. ఆత్మసౌందర్యమే అసలైన సౌందర్యం’’ అంటాడు ఎల్. రామచంద్రన్. ఆయన ఫోటో షూట్కు మోడల్గా పనిచేసిన అక్షయ నవనీతన్.. టాప్ మోడల్, ఫ్యాషన్ డిజైనర్, పలు టీవీ షోలకు యాంకర్ కూడా. ఎల్.రామచంద్రన్ ఫోటో షూట్లో ఆమె గుండు చేయించుకుని (క్యాన్సర్ మీద అవగాహన, క్యాన్సర్ బాధితలకు సంఘీభావంగా) కూడా పాల్గొన్నారు. ‘‘బాడీ షేమింగ్ను బ్రేక్ చేయడానికి విజువల్ ఆర్ట్ను మించిన మీడియం లేదు’’ అంటాడాయన.క్లారిటీ, సింప్లిసిటీ, స్ట్రెంత్.. సెల్ఫ్కాన్ఫిడెన్స్కు గ్రామర్.. గ్లామర్! దీన్ని మించిన అందం ఏం ఉంటుంది? ప్రపంచంలో ఏ గొప్ప వ్యక్తుల జీవితాలను చదివినా.. ఈ సామాన్య లక్షణాలే కనిపిస్తాయి! – సరస్వతి రమ అన్కండిషనల్గా ప్రేమించుకోవాలి మనమంటే హోల్ ప్యాకేజ్.. దాన్ని మొత్తంగా చూడగలగాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలి అన్ కండిషనల్గా. ఇంప్రూవ్ చేసుకోవాల్సిన క్వాలిటీస్ను ఇంప్రూవ్ చేసుకోవాలనుకోవడంలో తప్పులేదు. చేసుకోవాలి కూడా. అలాగని అప్పియరెన్స్కు మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చి.. అదీ ఓ భ్రమ కోసం మనల్ని మనం హింసించుకోవడం తప్పు. మోడల్స్ను రోల్ మోడల్స్గా తీసుకోకూడదు. వాళ్ల ఫోటోలు.. షూట్స్ను చూసి మనం ఫోలో కావద్దు. కారణం.. అవన్నీ ఎడిట్, గ్రాఫిక్ల గిమ్మిక్కులు. ఆరోగ్యం కోసం, ఒబేసిటీతో బాధపడ్తున్న వాళ్లు సన్నబడాలనుకోవడంలో తప్పులేదు. అది అవసరం కూడా. కాని అందం కోసం.. అదీ స్పెసిఫిక్గా జీరో సైజ్ ఫ్రేమ్లోకి రావాలని తాపయత్రయ పడడం మాత్రం ప్రమాదమే. దీనివల్ల శారీరకంగానే కాదు మానసిక సమస్యలూ తలెత్తుతాయి. ఎప్పుడైనా .. ఎక్కడైనా సెల్ఫ్కాన్ఫిడెన్స్ మ్యాటర్ అవుతుంది. – డాక్టర్ పద్మాపాల్వాయి, సీనియర్ సైకియాట్రస్ట్ -
వరూ... వచ్చేసింది!
బెంగళూరులో పుట్టి చెన్నైలో పెరిగిన వరలక్ష్మి మైక్రోబయాలజీ, బిజినెస్మేనేజ్మెంట్ చదువుకుంది. తమిళంలో తన తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించిన వరలక్ష్మి హీరో శరత్కుమార్ ముద్దుల తనయ. విశాల్ ‘పందెంకోడి–2’తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన వరలక్ష్మి శరత్కుమార్ గురించి కొన్ని ముచ్చట్లు... లాటిన్ అమెరికా డ్యాన్సర్ నటన మీద ఎప్పటి నుంచో ఆసక్తి ఉంది. ముంబైలోని ‘అనుపమ్ఖేర్స్ యాక్టింగ్ స్కూల్’లో నటనలో మెళకువలు నేర్చుకున్న వరలక్ష్మికి డ్యాన్స్లో మాంచి టాలెంట్ ఉంది. తొలి సినిమా ‘పోడా, పొడి’లో శింబుతో పోటీ పడి డ్యాన్స్ చేసింది. శింబు హిప్ హప్లో టాప్ అయితే, వరూ లాటిన్ అమెరికన్ డ్యాన్స్లో టాప్. సామాజికంగా... సెంటిమెంట్లు, విధిరాత మీద వరలక్ష్మికి పెద్దగా నమ్మకం లేదు. సామాజిక విషయాలపై స్పందించడంలో ముందుండటానికి ఇష్టపడుతుంది. తానేదో తన ప్రపంచమేదో అన్నట్లు కాకుండా సమాజంలో జరుగుతున్న పరిణామాలను పట్టించుకోవడంతో పాటు ఉద్యమాలతో మమేకమవుతుంటుంది. ‘మీ టూ’ ఉద్యమానికి ఆమె పూర్తి మద్దతుగా నిలిచింది. పురుషాధిక్యభావజాలాన్ని వ్యతిరేకిస్తుంది. కాస్త భిన్నంగా... కొత్త భాషలను నేర్చుకోవడంలో వరూ మంచి నేర్పరి. తెలుగు, తమిళ, మలయాళి, ఫ్రెంచ్ భాషలలో ప్రవేశం ఉంది. గ్లామర్ పాత్రలు మాత్రమే చేయాలనుకోవడం లేదు. నెగటివ్ రోల్ అయినా సరే, మూసపోసిన పాత్రల్లో కాకుండా భిన్నమైన, సవాలుగా నిలిచే పాత్రల్లో నటించాలనుకుంటుంది వరలక్ష్మి. తెగ నచ్చేసింది కొందరు నటిస్తే వాళ్లు మాత్రమే కనిపిస్తారు. కొందరు నటిస్తే పాత్ర మాత్రమే కనిపించి ‘శబ్భాష్’ అనిపించుకుంటారు. వరలక్ష్మికి కూడా ఇలాంటి ప్రశంస దక్కింది. ‘పందెంకోడి–2’లో ఆమె నటన డైరెక్టర్ లింగుస్వామికి తెగనచ్చేసిందట. ‘నేను అనుకున్నదానికంటే చాలా గొప్పగా నటించావు’ అని ప్రశంసించి నూటికి నూరు మార్కులు వేశాడు. అవును... ఏదో ఒకరోజు ఎప్పటికైనా డైరెక్టర్ కావాలనేది వరలక్ష్మి కల. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో తప్పనిసరిగా డైరెక్షన్ చేస్తాను అంటుంది. హార్డ్కోర్ థ్రిల్లర్స్, గ్యాంగ్స్టర్ సినిమాలు చేయడం అంటే ఇష్టమట. ఇప్పటికే ఆమె దగ్గర కొన్ని ఐడియాలు రెడీగా ఉన్నాయి. వరూ మెగాఫోన్ పట్టడమే ఆలస్యం అవి వెండితెర మీదికి వస్తాయన్నమాట. అమ్మ అంటే ఉక్కుమహిళ జయలలిత బయోపిక్లో శశికళ పాత్రను తిరస్కరించడం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు... ‘ఒకవేళ సినిమా చేయాల్సివస్తే అమ్మ పాత్రే చేస్తాను. మహిళాలోకానికి ఆమె స్ఫూర్తి. జ్ఞానం, ధైర్యం, తెలివితేటలు ఆమెను ఉక్కుమహిళగా నిలిపాయి’ అంటుంది వరూ. ఏదో సినిమా కార్యక్రమంలో వరూ చేసిన డ్యాన్స్ అమ్మ జయకు నచ్చేసి మెచ్చుకుందట. ఇదొక మధురజ్ఞాపకం అంటుంది వరూ. కవర్ ఫొటో: శివ మల్లాల -
కంటికి కన్ను
చిల్లర సరుకుల్లా.. స్పై కెమెరాలు ఫుట్పాత్ మీద కూడా దొరుకుతున్నాయి. కొనేవారికి హద్దులు లేవు, అమ్మేవారికి పరిమితులు లేవు. ఫలితం.. మన అమ్మ, అక్క, చెల్లి, వదిన.. వీళ్ల నగ్నచిత్రాలు వీధికెక్కుతున్నాయి. అవమానంతో కృంగిపోయి.. వాళ్ల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇలాంటి మరణాలను అరికట్టడానికే ‘హెవెన్ హోమ్ సొసైటీ’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ‘యాంటీ రెడ్ ఐ’ పేరుతో ఓ ఉద్యమ పోరాటం చేస్తున్నారు వరలక్ష్మి. అందులో భాగంగా షార్ట్ఫిల్మ్లు తీసి ప్రజల్లో ఈ సమస్యపై చైతన్యం తెస్తున్నారు. మిస్డ్ కాల్తో ఓటింగ్ ద్వారా సమస్యను చట్టసభల్లోకి తీసుకెళ్లబోతున్నారు. ‘‘నరకాసుర వధకు ఓ స్త్రీ శక్తి సరిపోయిందేమో కాని, ఈ స్పై కెమెరా విష సంస్కృతిని సమూలంగా ఛేదించడానికి అందరి చేయూత కావాలి’’ అంటున్నారు వరలక్ష్మి. ఆ అమ్మాయి షాపింగ్మాల్కి వెళ్లింది. డ్రెస్ సెలక్ట్ చేసుకుంది. ట్రైల్ రూమ్లోకి వెళ్లి సైజు సరిపోయిందో లేదో చూసుకుంది. మళ్లీ తన డ్రెస్ వేసుకుని బయటకు వచ్చేసింది. కావలసిన బట్టలు కొనుక్కుంది. వారం తర్వాత.. ట్రైల్ రూమ్లో తను బట్టలు మార్చుకున్న వీడియోలు నెట్లో సర్క్యులేట్ అవడం గమనించి షాక్ తింది. సిగ్గుతో చచ్చిపోయింది. ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకుంది. సురేఖ దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతోంది. ఒకరోజున వారి ఏకాంతానికి సంబంధించిన ఫొటోలు వాట్సాప్కి వచ్చాయి. భార్యాభర్తలిద్దరూ ఆశ్చర్యపోయారు. ఇది ఎలా జరిగిందా అని ఆలోచించారు. ఇంటి గోడలకున్న చిన్న చిన్న మేకులలో స్పై కెమెరాలు ఉన్నట్లు తెలిసింది. ఆ దంపతులు చాలాకాలం ఎవ్వరికీ కనపడకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.నిజామాబాద్ మాక్లూర్ మండలానికి చెందిన బీటెక్ విద్యార్థి రమ్యకృష్ణ. ఆమెకు ప్రసాద్ అనే వ్యక్తి ఫేస్బుక్లో పరిచయమయ్యాడు. వృత్తిరీత్యా అతడు కువైట్లో ఉంటున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ విషయం ఆమెకు తెలియకపోవడంతో, అతనితో స్నేహం చేసింది. తెలియక చేసిన స్నేహానికి ఇప్పుడు ఆమెను సాధిస్తున్నాడు. ఇవే కాదు..! కేరళలో ఒక ఫొటోగ్రాఫర్ వివాహ వేడుకలో ఫొటోలు తీయడానికి వచ్చాడు. అక్కడ ఫొటోలు తీసి, వాటిని మార్ఫింగ్ చేసి 50 వేల మందికి సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. భద్రాచలంలో ఒక యువకుడు తనకు సోదరి వరుస అయిన యువతి నగ్న చిత్రాలు తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. బోయినపల్లిలో ఒక యువతికి తెలియకుండా వీడియో తీసి బ్లాక్మెయిల్ చేయడంతో ఆ యువతి సజీవదహనం అయిపోయింది. విచ్చలవిడి విష సంస్కృతి ఇటువంటి అనేక ఘటనలు అనునిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఎంతోమంది ఆడపిల్లలు తమకు తెలియకుండానే స్పైటెక్ వలలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. మనోవ్యధ చెందుతున్నారు. ఇటువంటి బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. తమకు తెలియకుండా జరుగుతున్న ఈ అఘాయిత్యాలను ఎలా ఎదుర్కోవాలో తెలియని పరిస్థితి. ఒక మహిళను ఆమె అనుమతి లేకుండా ఫొటో లేదా వీడియోలో షూట్ చెయ్యడం, వాటిని షేర్ చేయడం తీవ్రమైన నేరం. అయినప్పటికీ ఈ తరహా నేరాలు ఆగడం లేదంటే అందుకు ఉపకరిస్తున్నవి స్పై కెమెరాలు. ఈ సంస్కృతికి అడ్డుకట్టు వేసేదెలా మరి? ‘‘దేశవ్యాప్తంగా విచ్చలవిడిగా జరుగుతున్న స్పై కెమెరాల అమ్మకాలను క్రమబద్ధీకరించాలి. ప్రతి సంస్థ మహిళా కస్టమర్ల భద్రతని తమ స్వంత బాధ్యతగా తీసుకొని వారి వ్యాపార సంస్థలు, హోటల్స్, మాల్స్, హాస్టల్స్ వంటి వాటిలో తమ సిబ్బంది కాని, ఎవరైనా ఇతరులు కాని స్పై కెమెరాలు బిగించారా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. చట్టపరంగా కూడా బాధితులకు తక్షణ న్యాయం జరగేలా చూడాలి’’ అంటున్నారు ‘యాంటీ రెడ్ ఐ’ వ్యవస్థాపకురాలు శ్రీమతి జి. వరలక్ష్మి. యాంటీ రెడ్ ఐ ఆవిర్భావం వరలక్ష్మి ఖమ్మం జిల్లాలో జన్మించారు. తండ్రి సూర్య ప్రకాశ్ పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేశారు. తల్లి సౌదామిని గృహిణి. భర్త జి. ఎన్. వి. సంజయ్ కుమార్ సొంతంగా వ్యాపారం చేస్తున్నారు. అమ్మాయి భార్గవి ఉద్యోగం చేస్తోంది. అబ్బాయి కిరీటి బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. వరలక్ష్మి ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంబరుగా పని చేస్తున్న రోజుల్లో కొన్ని కేసులను టెక్నికల్ టీమ్ ఇన్వెస్టిVó ట్ చేస్తున్నప్పుడు చూశారు. స్పయింగ్ ఎలా జరుగుతోందో తెలుసుకుని కదిలిపోయారు. ఎంతోమంది ఇటువంటి సంఘటనల కారణంగా మనోవ్యధకు గురవుతున్నారని, కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని తెలుసుకున్నాను. స్పై కెమెరాలను దుర్వినియోగం చేయడం వల్ల అత్యాచారాలు కూడా జరుగుతున్నాయని, స్పై కెమెరాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా యాంటీ రెడ్ ఐ క్యాంపెయిన్ ప్రారంభించారు. షీ టీమ్లను పెంచాలి చట్టాల్లోని లొసుగులతో ఇటువంటి నేరాలకు పాల్పడుతున్న వారంతా వెంటనే బెయిలు మీద బయటకు వచ్చేస్తున్నారు. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానికి కూడా ఒక షాపింగ్ మాల్లో ఇలాంటి చేదు అనుభవమే ఎదురైనప్పుడు నిందితులు ఐదు వేల రూపాయలు జరిమానా కట్టి, మర్నాడే బయటకు వచ్చేశారంటే సాధారణ మహిళ భద్రత సంగతి ఏమిటి? ‘‘కఠిన చట్టాలు ఉండాలి. అవి సక్రమంగా అమలవ్వాలి. ఓటింగ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం చట్టాలు అమలుచేసేలా రాజకీయ నేతలు, అధికారులు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు... అందరూ సమన్వయంతో మహిళల తరఫున పోరాడటమే దీనికి పరిష్కారం’’ అంటున్నారు వరలక్ష్మి. స్పయింగ్ని రూట్ లెవల్ నుంచి పెకలించడానికి షీటీమ్స్ పెంచడం ఆమె సూచిస్తున్న ఒక మార్గం. దురదృష్టం ఏమిటంటే.. వరలక్ష్మి ఎనిమిది నెలల పాటు దీనిపై గ్రౌండ్ వర్క్ చేసి, అనేక సంఘటనల నేపథ్యం అర్థం చేసుకుని, కోర్టులో పిల్ వేసి ఏడాది గడుస్తున్నా, ఇంతవరకు ఆ కేసు బెంచ్ మీదకు రాకపోవడం! నివేదిక ఇవ్వలేదు! ‘‘ప్రస్తుత సమాజం మొత్తం టెక్నాలజీ మీదే నడుస్తోంది. ముందు ముందు ఈ సాంకేతికత కారణంగా సమాజం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. పిల్ వేసిన తరవాత, డీజీపీ నెలరోజులలో నివేదిక ఇవ్వాలి.ఇవ్వలేదు! వారే కనుక వెంటనే యాక్షన్ తీసుకుని నివేదిక కోర్టుకి ఇచ్చి ఉంటే కొన్నైనా ఇలాంటి ఘటనలు జరక్కుండా ఉండేవి’ అని వరలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘దక్షిణ కొరియాలో ఇటీవల మహిళలు పెద్ద ఎత్తున స్పై కెమెరాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. వారి పోరాటం ఫలించింది. ఆ పని మన దేశానికి ఎందుకు చేతనవడం లేదు?’’ అని ప్రశ్నిస్తున్నారు వరలక్ష్మి. రోజుకో ఘటన! ఆ మధ్య ఓ మంత్రిగారి చొరవతో, ఓ షోరూమ్ లో ట్రయల్ రూమ్లో బయటపడిన సీసీ కెమెరాలు, ఎంత మంది అమ్మాయిల మానసిక క్షోభకు కారణమయ్యాయో తెలిసిందే. పబ్లిక్ ప్లేసులు, ప్రైవేట్ స్థలాలు, హోటల్ రూమ్స్ చివరకు కట్టుకున్న భార్యపై అనుమానంతో బెడ్రూమ్లో కెమెరా అమర్చిన శాడిస్ట్, భార్య స్నానపు దృశ్యాలనే కెమెరాలో బంధించి, స్నేహితులకు షేర్ చేసిన పైశాచికపు మృగాడు.చెప్పుకుంటూ పోతే రోజుకో ఘటన, పూటకో అవమానం, క్షణానికో అఘాయిత్యం. నాన్ బెయిలబుల్ అవ్వాలి మన దగ్గర గన్ ఉండాలంటే అనుమతి కావాలి. డ్రగ్స్ తీసుకోవాలంటే అనుమతి కావాలి. లిక్కర్ తీసుకోవాలంటే అనుమతి కావాలి. నిద్ర మాత్రలు వేసుకోవాలంటే అనుమతి కావాలి. మరి స్పై కెమెరాల కొనుగోలుకు అనుమతి ఎందుకు అవసరం లేదు. ఇష్టానుసారం కొనుక్కుని, వాడుకోవచ్చా! ప్రభుత్వం వీటిని నియంత్రించాలి. ఆన్లైన్లో ఆఫ్లైన్లో స్పై కెమెరాల అమ్మకం సరైన మార్గంలో ఉండాలి. 354సి, 2013 యాక్టులో నాన్బెయిలబుల్ చేయాలి. పోర్న్ ఫొటోగ్రఫీ మీద సైట్లు 40 లక్షల దాకా ఉన్నాయి. వాటిని నియంత్రించాలి. ఇందుకోసం ప్రతిఒక్కరూ8099259925కి మిస్డ్ కాల్ ఇవ్వండి. యాంటీ రెడ్ ఐ టీమ్ ద్వారా మహిళలకు ఈ సమస్యను ఎదుర్కోవటానికి కావలసిన సాంకేతిక అవగాహన మేము కలిగిస్తాం. – జి. వరలక్ష్మి సంభాషణ: వైజయంతి పురాణపండ -
నా టాప్ టెన్ మూవీస్లో ‘కురుక్షేత్రం’ ఒకటి
‘‘35 సంవత్సరాల సినీ కెరీర్లో ఎంతో మంది దర్శక–నిర్మాతలతో పనిచేశా. స్థిరంగా కష్టపడుతూ వస్తే దాని ఫలితం తప్పకుండా ఉంటుంది. ‘కురుక్షేత్రం’ నా 150వ సినిమా. నేను నటించిన టాప్ టెన్ మూవీస్లో ఇదొకటిగా నిలుస్తుంది. ఈ చిత్రంలో రియాలిటీకి దగ్గరగా ఉండే పోలీస్ పాత్ర చేశా. మంచి సినిమాలను ప్రోత్సహించే తెలుగు ప్రేక్షకులు మా సినిమాను ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని అర్జున్ అన్నారు. అర్జున్ హీరోగా అరుణ్ వైద్యనాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కురుక్షేత్రం’. ప్యాషన్ స్టూడియోస్ సమర్పణలో శ్రీనివాస్ మీసాల ఈ చిత్రాన్ని ఈ నెల 13న విడుదల చేస్తున్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో అరుణ్ వైద్యనాథన్ మాట్లాడుతూ– ‘‘తమిళంలో మంచి విజయం సాధించిన ‘నిబునన్’ చిత్రాన్ని సాయిక్రిష్ణ, మీసాల శ్రీనివాస్గారు తెలుగులో విడుదల చేస్తున్నందుకు నా కృతజ్ఞతలు. అర్జున్గారు డైరెక్టర్స్ యాక్టర్. 150 సినిమాలు చేసినా ఎక్కడా గర్వం లేకుండా డౌన్ టు ఎర్త్ పర్సన్లా ఉంటారు. ప్రసన్న, వరలక్ష్మి, చందన అద్భుతంగా నటించారు’’ అన్నారు. ‘‘అర్జున్గారి 150వ సినిమా ‘కురుక్షేత్రం’ను మా బ్యానర్లో విడుదల చేయడం గర్వంగా ఉంది’’ అన్నారు ప్యాషన్ స్టూడియోస్ అధినేత ఉమేష్ రెడ్డి. ‘‘దండుపాళ్యం 3’ సినిమా తర్వాత మేం తెలుగులో విడుదల చేస్తున్న చిత్రం ‘కురుక్షేత్రం’’ అన్నారు మీసాల శ్రీనివాస్. ‘‘అర్జున్ అంటే నాకు ఎంతో అభిమానం. మంచి మనిషి. మా అందరికీ ఎంతో స్ఫూర్తి. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి’’ అన్నారు హీరో శ్రీకాంత్. నిర్మాతలు తమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయికృష్ణ పాల్గొన్నారు. -
అర్ధాంగిని నరికేశాడు!
కంభం: కట్టుకున్న భార్యను.. భర్త అతికిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటన కంభంలో గురువారం సాయంత్రం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. సంగా వీధిలో నివాసం ఉంటున్న నూనె రమేశ్ ఆటో నడుపుకొని జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి 12 సంవత్సరాల క్రితం గిద్దలూరు సమీపంలోని సక్రేటపల్లికి చెందిన వర్రామద్దిలేటి కుమార్తె వరలక్ష్మి (30)తో వివాహం జరిగింది. అయితే వీరి కాపురం సజావుగా జరగడంలేదు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి. గతంలో కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం భార్యభర్తల మధ్య వివాదం చోటు చేసుంది. దీంతో కోపం పట్టలేని రమేశ్ తన భార్యను గొడ్డలితో నరకరడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అనంతరం మారణాయుధాన్ని అక్కడే విసిరేసి పారిపోయాడు. మృతురాలికి ఇద్దరు పిల్లలున్నారు. అర్జున్ (2వతరగతి), అమత (1వ తరగతి) చదువుతున్నారు. విషయం తెలుసుకున్న మార్కాపురం సీఐ బత్తుల శ్రీనివాసరావు, కంభం ఎస్సై రామానాయక్లు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
మా మధ్య అది లేదు!
తమిళసినిమా: సాధారణంగా మల్టీస్టారర్ చిత్రాల్లో ఇద్దరు కథానాయకుల మధ్య ఏదో విషయంలో ఈగో తొంగి చూస్తుంటుంది. అలాంటిది మా మధ్య ఈర‡్ష్య, పోటీలు లేవని నటుడు మాధవన్ అన్నారు. ఈయన విజయ్సేతుపతితో కలిసి నటిస్తున్న చిత్రం విక్రమ్వేదా. నటి వరలక్ష్మీ శరత్కుమార్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వైనాట్ స్టూడియోస్ పతాకంపై శశికాంత్ నిర్మిస్తున్నారు. పుష్కర్–గాయత్రిల ద్వయం కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రంలో మాధవన్ పోలీస్ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గానూ, విజయ్సేతుపతి రౌడీగానూ నటిస్తున్నారు. నటి వరలక్ష్మీ గుడిసె ప్రాంత యువతిగా నటిస్తున్నారు. కాగా బుధవారం మధ్యాహ్నం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ల్యాబ్లో చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న నటుడు మాధవన్ మాట్లాడుతూ తానింత వరకూ చాలా చిత్రాల్లో నటించినా, విజయ్సేతుపతితో కలిసి నటిస్తున్న తొలి చిత్రం విక్రమ్వేదా అని పేర్కొన్నారు. తమ మధ్య ఎలాంటి ఈర‡్ష్యగాని, గొడవలుగాని, పోటీతత్వంగాని ఏర్పడలేదన్నారు. ఇంకా చెప్పాలంటే కొన్ని విషయాల్లో విజయ్సేతుపతి నుంచి చాలా నేర్చుకున్నానన్నారు. తను అభిమానులను కలుసుకోవడం అన్నది చాలా మంచి విషయం అని అన్నారు. ఇక విక్రమ్వేదా చిత్రం కమర్షియల్ అంశాలతో కూడిన వైవిధ్యభరిత కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ఇందులో విజయ్సేతుపతికి తనకు మధ్య గొడవతో మొదలైన స్నేహం గొడవతోనే ముగుస్తుందని మాధవన్ తెలిపారు. ఈ సమావేశంలో విజయ్సేతుపతి, నటి వరలక్ష్మీశరత్కుమార్, దర్శక ద్వయం పుష్కర్–గాయత్రి, నిర్మాత శశికాంత్ పాల్గొన్నారు. -
నటి వరలక్ష్మీ కిడ్నాప్..!
తమిళ నటి వరలక్ష్మి కిడ్నాప్కు గురయ్యారంటూ ట్విట్టర్లో ఓ ఫొటో వైరల్ అయింది. ఫోటో వరలక్ష్మి చేతులు కట్టేసి, నోటికి ప్లాస్టర్ అంటిచారు. ఆ ఫోటోను చూసిన అభిమానులు ఆందోళనలకు గురయ్యారు. అయితే, ఆ ఫోటోను వరలక్ష్మీ తర్వాతి చిత్ర ప్రచారం కోసం విడుదల చేసినట్లు చిత్ర బృందం వెల్లడించింది. తాజాగా ఈ విషయంపై వరలక్ష్మీ ట్విట్టర్లో వివరణ ఇచ్చారు. తను బాగానే ఉన్నానని.. అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ పనిని తన సినిమా ప్రచారంలో భాగంగా చేశామని, సాయంత్రం ఆరు గంటలకు ఆ వివరాలు ప్రకటిస్తామని వరలక్ష్మి చెప్పారు. I'm absolutely fine.. thank u for ur concern..it's a part of our movie promotion.. announcement at 6pm..!! — varu sarathkumar (@varusarath) April 18, 2017 -
సకల వరప్రదాయినీ.. వరలక్ష్మి
– సామూహిక వరలక్ష్మివ్రతాలతో మల్లన్న ఆలయప్రాంగణం కళకళ – 1100కు పైగా ముతై ్తదువల శాస్త్రోక్త వ్రతపూజలు – ముతైదువులందరికి అమ్మవారి శేషవస్త్రాలు, అన్న, ప్రసాద వితరణలు శ్రీశైలం: శ్రీశైల మహా క్షేత్రంలో శుక్రవారం మల్లన్న ఆలయప్రాంగణం వరలక్ష్మి వ్రత మంత్రోచ్చరణతో ప్రతిధ్వనిస్తుండగా, వందల సంఖ్యలో ముౖలె వుదులు తమ ఐదవతనం వృద్ధిచెందాలని అషై ్టశ్వర్యాలు సిద్ధించాలని కోరుతూ వరలక్ష్మివ్రతాచరణకు పూనుకున్నారు. ఉదయం 10. ంటలకు వరలక్ష్మీవ్రత నోములు నిర్వహించుకోవడానికి ముందుగా నమోదు చేసుకున్న వారందరికీ వరుస క్రమంలో కలశాల ఎదుట కూర్చోబెట్టారు. ఆ తరువాత వచ్చిన వారందరికి కూడా వ్రతనోములను నిర్వహించుకోవడానికి వీలుగా సమీప స్థలంలోనే అప్పటికప్పుడు ఏర్పాట్లను చేశారు. సుమారు 1100 మందికి పైగా ముతై ్తదువలు ఈ వ్రతాల్లో పాల్గొని తమ జన్మధన్యమైందిగా భావించారు. వ్రత ఆరంభంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజను చేసి శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల కల్యాణమూర్తులకు, అలంకారమండపంలోని ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలను నిర్వహించారు. అనంతరం వ్రతాలకు హాజరైన ముతై ్తదువచేత కలశస్థాపన చేయించి ఆ కలశంలో వరలక్ష్మి దేవిని సమంత్రకంగా ఆవహింపజేశారు. శ్రీసూక్త విధానంతో వ్రతకల్పపూర్వకంగా ఆలయ అర్చకులు, వేదపండితులు పూజలు చేయించారు. వ్రత ముగింపుగా కర్పూర నీరాజనాలను అర్పించి కలశోద్వాసన చేశారు. అనంతరం ముతై ్తదువులను అందరికి రూ.500 ప్రత్యేక క్యూలైన్ ద్వారా ఉచితంగా స్వామిఅమ్మవార్ల దర్శన అవకాశాన్ని కల్పించారు. శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల శేషవస్త్రాలను అందజేసి స్వామిఅమ్మవార్ల అన్నపూర్ణభవన్లో వ్రతంలో పాల్గొన్న వారందరికి ఉచిత భోజనసౌకర్యాన్ని కల్పించారు. కార్యక్రమంలో జేఈఓ హరినాథ్రెడ్డి, పర్యవేక్షకులు మల్లికార్జునరెడ్డి, మధుసూదన్రెడ్డి, వివిధ విభాగాల సిబ్బంది, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు. 300 మందికిపైగా చెంచు గిరిజనులు ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల సన్నిధిలో చివరి శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీశైలం, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన చెంచు గూడాల నుంచి వచ్చిన గిరిజనులు సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని స్వామిఅమ్మవార్ల నిత్య కల్యాణమండపంలో చివరి శ్రావణ శుక్రవారం రోజున 300 మందికిపైగా చెంచుముతైదువులు వరలక్ష్మివ్రతంలో పాల్గొన్నారు. -
దుర్గమ్మ సన్నిధిలో వరలక్ష్మీ వ్రతం
సామూహిక వ్రత నిర్వహణకు ఏర్పాట్లు ఈవో సూర్యకుమారి వెల్లడి ఒక్కో టికెట్ రూ. 1500 ఇంద్రకీలాద్రి : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో 26వ తేదీ శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఈవో సూర్యకుమారి తెలిపారు. వ్రతం జరిగే రోజున అమ్మవారి మూలవిరాట్తో పాటు ఉత్సవ మూర్తిని మహాలక్ష్మీ దేవిగా అలంకరిస్తారు. వ్రతంలో పాల్గొనేందుకు టికెటు ధరను రూ. 1500గా ఆలయ అధికారులు నిర్ణయించారు. మహా మండపంలోని ఆరో అంతస్తులోని ఆర్జిత సేవల ప్రాంగణంలోని అమ్మవారి ఉత్సవ మూర్తి వద్ద వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. మొదటి షిఫ్టు ఉదయం 6 గంటల నుంచి 8–30 గంటల వరకు , రెండో షిప్టు ఉదయం 10–30 గంటల నుంచి మధ్యాహ్నం 12–30 గంటల వరకు నిర్ణయించారు. ఇక వ్రతంలో పాల్గొన్న భక్తులకు పూజా సామాగ్రితో పాటు కుంకుమ భరిణ, అష్టలక్ష్మీ యంత్రం, కాళ్ల మెట్టెలు, రవిక, అమ్మవారి లామినేషన్ ఫోటో, అమ్మవారి ప్రసాదాలను దేవస్థానం అందచేస్తుంది. 24 నుంచి టికెట్ల విక్రయాలు స్థలాభావం కారణంగా టికెటు కొనుగోలు చేసిన ముల్తైదువునే వ్రతం ప్రాంగణంలోకి అనుమతిస్తారు. ఈ నెల 24వ తేదీ నుంచి టికెట్లు దేవస్థాన ఆర్జిత సేవాకౌంటర్లో లభిస్తాయని ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఇతర వివరాలకు దేవస్థాన టోల్ప్రీ నెం.1800 4259 099 కు సంప్రదించవచ్చు. -
విశాల్ క్లారిటీ ఇచ్చాడు
తమిళనాట సినిమాలతో పాటు సినీ రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేస్తున్న యంగ్ హీరో విశాల్. వరుస హిట్స్తో హీరోగా మంచి ఫాం కొనసాగిస్తునే నడిగర్ సంఘం నేతగా కూడా తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అదే సమయంలో సీనియర్ యాక్టర్ శరత్ కుమార్ కూతురు వరలక్ష్మితో ప్రేమాయణం వార్తలతో కూడా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నాడు. చాలా కాలంగా విశాల్, వరలక్ష్మిల మధ్య ఏదో ఉందంటూ చర్చ జరుగుతున్నా.. క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. ముఖ్యంగా నడిగర్ సంఘం ఎన్నికల సమయంలో శరత్ కుమార్, విశాల్ ముఖాముఖి తలపడటంతో.. ఇక విశాల్, వరలక్ష్మి కలవటం అసాధ్యం అనుకున్నారు. కానీ అన్ని అనుమానాలకు చెక్ పెడుతూ ఒక్క ఫొటోతో మొత్తం క్లారిటీ ఇచ్చేశాడు విశాల్. వరలక్ష్మితో కలిసి తీసుకున్న ఓ సెల్పీ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన విశాల్, అన్ని ప్రశ్నలకు ఈ ఫొటోనే సమాధానం చెబుతుందంటూ కామెంట్ చేశాడు. విశాల్ ఉద్దేశం ఏంటో తెలియదు గానీ, సినీ వర్గాలు మాత్రం ఈ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ వ్యవహారం మీదే విశాల్ క్లారిటీ ఇచ్చాడని భావిస్తున్నారు. విశాల్ ఫొటో పోస్ట్ చేసిన సమయంలో శరత్ కుమార్ అస్వస్థతకు గురికావటం కూడా హాట్ టాపిక్గా మారింది. Dis pic says it all. pic.twitter.com/SFL6nBfdDx — Vishal (@VishalKOfficial) 26 June 2016 -
వివాహిత ఆత్మహత్య
తహశీల్దార్ కార్యాలయంలో డాటా ఎంట్రీ ఆపరేటర్గా పని చేస్తున్న వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరంలో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన వరలక్ష్మీ(22) ఎమ్మార్వో కార్యాలయంలో ఆపరేటర్గా పని చేస్తోంది. ఈక్రమంలో ఈ రోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి భర్త, మూడేళ్ల కొడుకు ఉన్నారు. -
వరలక్ష్మికి మంచి రోజులొచ్చాయా?
కుట్రపరంపరై ఇద్దరు ప్రముఖ దర్శకుల మధ్య పోరుకు కారణమైన కథ ఇది. దీంతో చాలా ఏళ్లుగా మరుగున పడ్డ ఈ కథ ఇప్పుడు ఎనలేని ప్రచారాన్ని సంపాదించుకుంది. కొన్నేళ్ల క్రితం జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రాసిన ఈ కథతో తాజాగా ప్రయుఖ దర్శకుడు భారతీరాజా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తూ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. చిత్రాన్ని ఆయన ఇటీవలే ప్రారంభించారు కూడా. అదే పేరుతో దర్శకుడు బాలా చిత్రం తెరకెక్కించనున్నట్లు వెల్లడించారు. ఇందులో విశాల్, ఆర్య, అరవింద్సామి, అధర్వ, రానా, అనుష్క నటించనున్నట్లు ప్రకటించడంతో భారతీరాజా,బాలాల మధ్య వివాదం మొదలైంది. అయితే ఆరోపణలు, ప్రతి ఆరోపణలనంతరం బాలా తాను కుట్రపరంపరై కథను చిత్రంగా చేయడం లేదు,అదే కాల ఘట్టంలో జరిగిన వేరే సంఘటనలను చిత్రంగా ఆవిష్కరించనున్నట్లు స్పష్టం చేయడంతో వివాదం సద్దుమణిగింది. ఇకపోతే బాలా తన చిత్ర నిర్మాణ పనులను వేగవంతం చేశారు. అలాగే తన చిత్రంలో అదనంగా నటి వరలక్ష్మికి పాత్రను సృష్టించారన్నది తాజా సమాచారం. వరలక్ష్మి ఇంతకు ముందు బాలా దర్శకతంలో తారైతప్పట్టై చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో ఆమె నటన బాలాను విపరీతంగా ఆకట్టుకుంది. ఫలితం తాజా చిత్రంలోనూ వరలక్ష్మికి అవకాశం కల్పించినట్లు తెలిసింది. ప్రపంచ సినిమానే ప్రశంసించే పాత్ర అని కోలీవుడ్లో ప్రచారం హల్చల్ చేస్తోంది. మరో విషయం ఏమిటంటే చాలా కాలంగా విడుదలకు నోచుకోకుండా ల్యాబ్కే పరిమితమైన విశాల్కు జంటగా ఈ బ్యూటీ నటించిన మదగజరాజా చిత్రానికి మోక్షం వచ్చింది. ఈ నెల 29న తెరపైకి రానుంది. మొత్తం మీద ఆలస్యంగా అయినా వరలక్ష్మికి మంచి రోజులు మొదలయ్యాయన్న మాట. -
ఆస్తి తగాదాలతో మహిళ ఆత్మహత్యాయత్నం
సాలూరు: అన్నదమ్ముల ఆస్తి తగాదాల నేపథ్యంలో ఓ మహిళ కిరోసిన్ పోసుకుని బలవన్మరణానికి యత్నించింది. విజయనగరం జిల్లా సాలూరు మండల కేంద్రంలో గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. సాలూరు తెలగ వీధికి చెందిన కూనుశెట్టి రాంబాబుకు తోబుట్టువులతో ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు బుధవారం కోర్టు నోటీసులు అందాయి. దీనిపై బుధవారం రాత్రి అన్నదమ్ములతో వాగ్వాదం చోటు చేసుకుంది. వీటన్నిటితో మనస్తాపం చెందిన రాంబాబు భార్య వరలక్ష్మి(45) గురువారం ఉదయం ఆ వీధిలో అందరూ చూస్తుండగానే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. చుట్టుపక్కల వారు మంటలను ఆర్పి రక్షించేందుకు ప్రయత్నించినా అప్పటికే 90 శాతం కాలిన గాయాలయ్యాయి. ఆమెను సాలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
'భూమిలో వాటా ఇవ్వకుంటే చచ్చిపోతా'
తోడ పుట్టిన వారితో పాటు.. తనకు కూడా ఆస్తిలో వాటా ఇవ్వక పోతే.. ఆత్మహత్య చేసుకుంటా అంటూ ఓ మహిళ బెదిరిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం కొండెవరం గ్రామానికి చెందిన గొలుం రాఘవమ్మకు నలుగురు కుమార్తెలు. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. ముగ్గురు కూతుళ్లకు తనకున్న ఎకరంన్నర పొలాన్ని రాసిచ్చిన రాఘవమ్మ నాలుగో కుమార్తె పెంకె వరలక్ష్మికి మాత్రం ఇంటి స్థలం కేటాయించింది. దీనిపై వరలక్ష్మి మూడు రోజులుగా కుటుంబ సభ్యులతో గొడవ పడుతోంది. సోమవారం తన ఇద్దరు పిల్లలను, కిరోసిన్ డబ్బా తీసుకుని పొలంలోకి వెళ్లి, వాటా ఇవ్వకుంటే నిప్పంటించుకుని చనిపోతానంటూ బెదిరించింది. దీంతో కుటుంబసభ్యులతో గ్రామపెద్దలు వరలక్ష్మికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. -
టీఆర్ఎస్ కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలు
తాండూరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు కేవలం టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకే అందుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వరలక్ష్మి ఆరోపించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా తాండూరులో ఆమె మాట్లాడుతూ.... నిజమైన పేదలకు ప్రభుత్వ పథకాలు అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్లు, ఆహార భద్రతకార్డులు రాక పేదలు ఇబ్బందులు పడుతున్నా... టీఆర్ఎస్ సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తుందని వరలక్ష్మీ మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలు నిజమైన పేదలకు అందే విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీపై విశ్వాసం పోయిందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని వరలక్ష్మి డిమాండ్ చేశారు. -
డాక్టర్ అవతారమెత్తిన పాత నర్సు
హైదరాబాద్: వైద్యురాలినని చెప్పి... ప్రజలను మోసం చేస్తున్న ఓ మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ మారుతీ నగర్ పరిధిలోని కంచన్బాగ్ ఏరియాలో గురువారం చోటు చేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న వరలక్ష్మీ అనే మహిళ ప్రజలను బురిడీ కొట్టించి... డాక్టర్గా చలామణీ అవుతుంది. దీంతో వరలక్ష్మీ నిజంగా వైద్యురాలేనా అని సందేహించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి ఆరా తీయగా వరలక్ష్మి గతంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పని చేసేదని... ఆ అనుభవంతో ఆమె ఏకంగా డాక్టర్ అవతారం ఎత్తి ప్రజలను మోసం చేస్తోందన్న పోలీసు విచారణలో తెలింది. -
భార్యను విదేశాల నుంచి రప్పించాలంటూ...
తిరుపతి : తిరుపతిలో గత అర్థరాత్రి కలకలం రేగింది. విదేశాల్లో ఉన్న తన భార్యను రప్పించాలంటూ ఓ వ్యక్తి నానా హంగామా సృష్టించాడు. స్థానిక బీటీఆర్ కాలనీకి చెందిన కరుణాకర్... కువైట్లో ఉన్న తన భార్య వరలక్ష్మిని వెంటనే రప్పించాలంటూ కుమారుడితో కలసి గృహ నిర్బంధం చేసుకొన్నాడు. కాగా కరుణాకర్, వరలక్ష్మిలకు పదేళ్ల క్రితం వివాహం అయ్యింది. కాగా ఉపాధి కోసం కువైట్ వెళ్లిన వరలక్ష్మి గత మూడు నెలలుగా భర్తతో ఫోన్లో మాట్లాడటం లేదని సమాచారం. దీంతో తన భార్యను వెంటనే తిరుపతికి రప్పించాలంటూ కరుణాకర్ ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. భార్యను రప్పించకపోతే గ్యాస్ సిలిండర్ను పేల్చుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. సుమారు ఆరు గంటలపాటు ఈ హైడ్రామా సాగింది. చివరకు పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి కరుణాకర్ను బయటకు తీసుకొచ్చారు. -
జమ్మూ కాశ్మీర్లో వరదలు
-
కాశ్మీర్ వరదల్లో కాకినాడ వాసులు
-
కాశ్మీర్ వరదల్లో చిక్కుకున్న కాకినాడ వాసులు
శ్రీనగర్ : కాశ్మీర్ వరదల్లో తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన దంపతులు చిక్కుకున్నారు. దైగోలుపాడుకు చెందిన నాయుడు, వరలక్ష్మి రూరల్ డెవలప్మెంట్ ప్రోగామ్ కోసం కాశ్మీర్ వెళ్లారు. హెలీప్యాడ్ వద్ద వరదల్లో చిక్కుకున్నట్లు బాధితులు ఫోన్ ద్వారా బంధువులకు సమాచారం అందించారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి మరో 30మంది వరదల్లో చిక్కుకున్నట్లు సమాచారం. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో వరద ఉధృతి సాధారణ స్థాయికి చేరుకుంటోంది. జలవిలయంతో తీవ్రంగా దెబ్బతిన్న జమ్మూ కాశ్మీర్లో ఇప్పటివరకూ 47 వేల మంది బాధితులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగినా, ఇంకా 4 లక్షలమందికిపైగా జనం జలదిగ్బంధంలోనే ఉన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో భారీ ఎత్తున సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మరో వైపు, వరదనీరు తగ్గనిచోట్ల బాధితులు ఇంకా ఇళ్లపైకప్పులపైనే గడుపుతున్నారు. భారీవర్షాలు వరదల్లో కొండచరియలు విరిగిపడటం, ఇళ్లుకూలడం వంటి సంఘటనల్లో ఇప్పటివరకూ దాదాపు 200మంది ప్రాణాలు కోల్పోయారు. సహాయ కార్యక్రమాల్లో సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, నావికాదళం నిర్విరామంగా పాల్గొంటున్నాయి. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
సీటీఆర్ఐ (రాజమండ్రి), న్యూస్లైన్ : స్థానిక పేపరుమిల్లు సమీపంలోని ఆనంద్నగర్లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. అతడి భార్య నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి విషయం తెలపడంతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. సింహాద్రి నగర్కు చెందిన వరప్రసాద్ (30)కు గాదిరెడ్డి నగర్కు చెందిన వరలక్ష్మితో 11 ఏళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలం తర్వాత వరప్రసాద్ అప్పులు చేసి ఆటోలు కొనడం, వాటిని తిరిగి అమ్మేసి ఖాళీగా తిరగడం చేసేవాడు. ఇదిలావుండగా అతడి భార్య వరలక్ష్మి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుం డడంతో తరచూ ఘర్షణ పడేవారు. 2012 ఆగస్టులో వారిద్దరూ ఓ అంగీ కారానికి వచ్చి వేర్వేరుగా జీవిస్తున్నారు. వరలక్ష్మి ఇద్దరు పిల్లలతో కలసి మరో వ్యక్తితో జీవిస్తుండగా, వరప్రసాద్ తన అక్క వద్ద ఉంటున్నాడు. గురువారం వరప్రసాద్, వరలక్ష్మిల పుట్టినరోజు కావడంతో అతడు ఆనందనగర్లో నివసిస్తున్న భార్య వద్దకు వచ్చి.. ‘ఇకపై ఇద్దరం కలసి జీవిద్దామ’ని చెప్పాడు. అంగీకరించిన వరలక్ష్మి ఆ రోజు సాయంత్రం గాదాలమ్మ నగర్లోని పుట్టింటికి వెళ్లింది. అతడు వరలక్ష్మి ఇంట్లోనే ఉండిపోయాడు. శుక్రవారం ఉదయం కుమారుడు సిద్ధును భర్త వద్దకు పంపించింది. కుమారుడితో ‘నీవు అమ్మను తీసుకురా’ అని చెప్పి వరప్రసాద్ పంపించేశాడు. ఉదయం 9.30 గంటల సమయంలో వచ్చి చూసేసరికి తలుపులు వేసి ఉన్నాయని, లోనికి వెళ్లి చూడగా తన భర్త ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడని ఆమె పోలీసులకు వివరించింది. సీఐ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనుమానాలెన్నో వరప్రసాద్ మృతిపై స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతను వరలక్ష్మి ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి సమయంలో ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తి కూడా ఇంటికి వచ్చినట్టు సమాచారం. వీరి మధ్య ఏమైనా తగా దా జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఫ్యానుకు ఉరి వేసుకున్న వ్యక్తిని చూసిన వెంటనే చీరను కత్తి పీటతో కోసేశానని చెబుతున్న వరలక్ష్మి మాటలు ఎంతమేర నిజమో నిర్ధారించాల్సి ఉంది. ఆ ఇంటికి దూరంగా ఎందుకు పడవేయాల్సి వచ్చిందనే ప్రశ్న తలెత్తుతు తోంది. వరలక్ష్మి ఉదయం భర్త ఇంటి ముందు ముగ్గు వేసి, తాపీగా పోలీసుస్టేషన్కు వెళ్లి పోలీసులకు తెలిపినట్టు స్థానికులు చెబుతున్నారు. -
అనుమానాస్పద స్థితిలో డిగ్రీ విద్యార్థిని మృతి
గుత్తి, న్యూస్లైన్ : మూడు రోజుల క్రితం అదృశ్యమైన పట్టణంలోని కోట వీధికి చెందిన డిగ్రీ విద్యార్థిని స్వాతి(20) బుధవారం తన ఇంటి పక్కనున్న పాడుబడిన బావిలో శవమై తేలింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోట వీధిలో నివసిస్తున్న మాజీ సైనికోద్యోగి దస్తగిరి, వరలక్ష్మి దంపతులకు ఐదుగురు ఆడపిల్లలు కాగా ముగ్గురికి పెళ్లిళ్లు చేశాడు. మిగతా ఇద్దరిలో స్వాతి పట్టణంలోని ఎంఎస్ డిగ్రీ కాలేజ్లో దూరవిద్య ద్వారా డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. మరో కూతురు కూడా స్థానిక శ్రీసాయి డిగ్రీ కాలేజీలో డిగ్రీ ఫస్టియర్ అభ్యసిస్తోంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి నుంచి స్వాతి కనిపించడం లేదు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లతో పాటు పలుచోట్ల వెదికినా ఆచూకీ లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం స్వాతి అక్క నీరజ తమ ఇంటి పక్కన ఉన్న పాడుబడిన బావిలోకి కసువు వేసేందుకు వెళ్లింది. అందులో కసువు వేస్తూ తొంగి చూడగా స్వాతి శవం తేలి ఉండడాన్ని చూసింది. ఆమె కేకలు విన్న బావి పక్కనే ఉన్న ఇళ్లలోని వారు, మృతురాలి కుటుంబ సభ్యులు పరుగున వచ్చారు. స్వాతి మృతదేహం చూసి బోరున విలపించారు. స్థానికుల సమాచారంతో ట్రెయినీ డీఎస్పీ ఉషారాణి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. స్వాతి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదనిస్నేహితులు, సన్నిహితులు అంటున్నారు. కాగా పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగుచూడాల్సి ఉంది. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ట్రెయినీ డీఎస్పీ చెప్పారు. మృతదేహానికి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
సచివాలయ సీమాంద్ర ఉద్యోగుల ఫోరం నేత వరలక్ష్మితో సాక్షి వేదిక