water bottle
-
ఎయిర్పోర్ట్లో రూ.10కే టీ, రూ20కే సమోసా!
ఎయిర్పోర్ట్లో స్నాక్స్ ధర రూ.వందల్లో ఉంటుందని తెలుసుకదా. అయితే కొత్తగా ప్రారంభించిన కేఫ్లో మాత్రం కేవలం రూ.10కే టీ, వాటర్ బాటిల్, రూ.20కే సమోసా, స్వీటు లభిస్తుంది. ‘అదేంటి.. షాపింగ్ మాల్స్లోనే వాటర్ బాటిల్ రూ.80 వరకు ఉంది. మరి ఎయిర్పోర్ట్లో ఇంత తక్కువా..?’ అని ధరలు చూసి ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎయిర్పోర్ట్లో ‘ఉడాన్ యాత్రి కేఫ్’ను ప్రారంభించింది. విమాన ప్రయాణికులకు చౌకగా స్నాక్స్ అందించాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేశారు.కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్తగా ప్రారంభించిన ఉడాన్ యాత్రి కేఫ్ పుణ్యమా అని సరసమైన స్నాక్స్ ధరలు అందుబాటులోకి వచ్చాయి. 2024 డిసెంబర్ 21న పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ కేఫ్ను ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతిరోజూ సుమారు 900 మంది ప్రయాణీకులు ఈ కేఫ్ సేవలు వినియోగించుకుంటున్నట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. దీని ఆవిష్కరణ సమయంలో మంత్రి మాట్లాడుతూ..విమానాశ్రయంలో ఆహార ధరల పెరుగుదలపై దీర్ఘకాలంగా వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.No more overpriced food at the airport. Now you can have affordable snacks at airports at Udaan Yatri Cafe.Tea : ₹10Water : ₹10Samosa : ₹20Sweet : ₹20 pic.twitter.com/SGEsKGjEf8— Aaraynsh (@aaraynsh) January 23, 2025ఇదీ చదవండి: 2,000 ఐడీలను బ్లాక్ చేసిన రైల్వేశాఖధరలిలా..ఉడాన్ యాత్రి కేఫ్లో ప్రయాణికులు రూ.10కే టీ, రూ.10కే వాటర్ బాటిల్, కేవలం రూ.20కే సమోసా, రూ.20కు స్వీట్లు వంటి స్నాక్స్ను ఆస్వాదించవచ్చు. ఈ ధరలు విమానాశ్రయంలోని ఇతర ఆహార దుకాణాలు వసూలు చేసే అధిక రేట్లకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ప్రయాణీకుల నుంచి ఈ కేఫ్కు సానుకూల స్పందన వస్తోంది. కేఫ్ ప్రారంభించిన మొదటి నెలలో సుమారు 27,000 మంది ప్రయాణీకులకు సేవలు అందించింది. ఇతర విమానాశ్రయాల్లో ఈ నమూనా కేఫ్లను ప్రారంభించాలని ప్రయాణికుల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయి. -
ఈ నీళ్లు.. చాలా ఖరీదు గురూ!
నీరు.. మానవాళికి తప్పనిసరిగా అవసరమైన వనరు. ఒకప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉచితంగా లభ్యమయ్యే నీటిని ఇప్పుడు డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం. ఒక లీటరు వాటర్ బాటిల్ ఖరీదు సాధారణంగా రూ.20 ఉంటుంది. కంపెనీ, ఇతరత్రా అంశాలను బట్టి రూ.2వేల బాటిల్ కూడా ఉంది. కానీ జపాన్కు చెందిన ఫిల్లికో అనే కంపెనీ ఇంతకుమించిన ధరకు మంచినీళ్లను అమ్ముతోంది. ఆ కంపెనీ వాటర్ బాటిళ్ల ధర రూ.84వేల నుంచి మొదలై ఏకంగా రూ.8 లక్షల వరకు ఉంది. ధర చూస్తే గుండె గుభేల్మనడం ఎంత నిజమో.. ఆ బాటిల్ చూసిన తర్వాత వావ్ అని అనకుండా ఉండలేకపోవడం కూడా అంతే నిజం. ఆ బాటిల్ అందం అలాంటిది మరి. ఇంతకీ ఆ బాటిల్ నీళ్లకు అంత రేటెందుకు? అవేమైనా పైనుంచి దిగొచ్చాయా అనే కదా మీ సందేహం? ఔను.. జపాన్లో అత్యంత స్వచ్ఛమైన ప్రదేశంగా భావించే కోబ్లోని రౌకా నేషనల్ పార్క్లో ఉన్న నునోబికి ఫాల్స్ నుంచి రాతిశిలల ద్వారా సహజసిద్ధంగా శుద్ధి అయి కిందకు వచ్చిన నీళ్లవి. నునోబికి ప్రాంతం అటు పరిశ్రమలకు, ఇటు వ్యవసాయానికి చాలా దూరంగా ఉండటం వల్ల అక్కడ ఎలాంటి కాలుష్యం ఉండదు. అందువల్ల అక్కడ నీళ్లు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటాయి. పైగా రాతిశిలల్లో నుంచి ఫిల్టర్ కావడం వల్ల మరింత స్వచ్ఛత కలిగి ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆ నీటిలోని సహజసిద్ధమైన ఖనిజ లవణాలు, స్వచ్ఛత పోకుండా కనీస ప్రాసెసింగ్ పద్ధతులను ఉపయోగించి ప్యాక్ చేస్తారు. ఎంత కష్టపడి నాణ్యమైన నీటిని తీసుకొచ్చి జాగ్రత్తగా ప్యాక్ చేసినా.. రంగు, రుచి, వాసన లేని నీటికి మరీ ఇంత రేటేంటి బాస్ అంటారా? ఇదే డౌట్ ఫిల్లికో కంపెనీ యజమాని క్రిస్టియన్ డయోర్కీ వచి్చంది. మనిషికి నిత్యావసరమైన నీటిని లగ్జరీ వస్తువుగా అధిక ధరకు అమ్మడం ఎలా అని ఆలోచించారు.దేవతా రెక్కలు.. కిరీటాలు..» ఆకర్షణీయమైన ప్యాకింగ్ చేయడం ద్వారా మార్కెటింగ్ చేయడం సులభం అని డియోర్ భావించారు. దానికి తగినట్టుగా తమ బాటిల్ డిజైన్ను వినూత్నంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. శాటిన్ గాజుతో కంటికి ఇంపుగా కనిపించేలా బాటిల్ డిజైన్ చేయించారు. తాము విక్రయించే ధరకు అది చాలదనే భావనతో దానికి అదనపు సొబగులద్దారు. బాటిల్ మూతలను రాజు, రాణి కిరీటాలను పోలి ఉండేలా రూపొందించారు.దేవతలకు రెక్కలు ఉన్నట్టుగా బాటిల్కు రెండు రెక్కలు కూడా జోడించారు. అవసరమైన చోట వెండి పూత పూయించారు. లగ్జరీ బ్రాండ్ స్ఫటికాలను ఉత్పత్తి చేసే స్వరోవ్స్కీ స్ఫటికాలను బాటిల్పై అమర్చారు. వెరసి.. చూసిన తర్వాత చూపు తిప్పుకోలేనంత అందమైన కళాఖండంగా తీర్చిదిద్దారు. దీనికి ఫిల్లికో జ్యవెలర్ వాటర్ అని పేరు పెట్టి.. ఇది సార్ మా బ్రాండ్ అంటూ తొలుత తమ వీఐపీ కస్టమర్లకు పరిచయం చేశారు. వారి నుంచి అద్భుత స్పందన వచ్చిoది. అనంతరం ఫిల్లికో కంపెనీ 2008లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు స్పాన్సర్గా వ్యవహరించడంతో ఈ బ్రాండ్ పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. అంతే అక్కడ నుంచి వెనుతిరిగి చూడలేదు. 2005లో ప్రారంభమైన ఈ కంపెనీ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. అయితే, బాటిళ్ల డిజైన్ ఎప్పటికప్పుడు కొత్తగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీటిని చేతితోనే తయారుచేస్తారు. అందువల్ల నెలకు 5వేల బాటిళ్లను మించి ఉత్పత్తి చేయరు. ఇది కూడా ఈ బ్రాండ్ డిమాండ్ కొనసాగడానికి మరో కారణం. ప్రస్తుతం ఫిల్లికో జ్యువెలరీ వాటర్ రెండో తరం నడుస్తోంది. ఈ బాటిల్ ప్రారంభ ధర వెయ్యి డాలర్లు. (దాదాపు రూ.84 వేలు). ఒక్కోసారి లిమిటెడ్ ఎడిషన్ పేరుతో మరింత వినూత్నమైన బాటిళ్లను ఉత్పత్తి చేసి విక్రయిస్తుంటారు. వాటి ధర ఏకంగా రూ.8.40 లక్షల వరకు కూడా ఉంటుంది. వాస్తవానికి ఆ బాటిల్లో ఉన్న నీళ్లను కాదు.. ఆ నీళ్లున్న బాటిల్ను ఇంత ధర పెట్టి కొనాలన్న మాట. అయితే, దాహం వేసిన ప్రతిసారీ ఈ నీటిని తాగితే కష్టమే కదా? కేవలం తమ స్టేటస్ సింబల్ చాటుకోవాల్సిన సందర్భాల్లో ఓ రెండు గుటకలు వేయక తప్పదు మరి. అసలే బ్రాండ్ వాటర్.. పైగా లిమిటెడ్ ఎడిషన్స్. ఆ మాత్రం ముందు జాగ్రత్త తప్పనిసరి.. కాదంటారా? – సాక్షి సెంట్రల్ డెస్క్ -
10 రూపాయిల వాటర్ బాటిల్ ఖరీదు వంద రూపాయలా?
ఢిల్లీ: రూ.10 వాటర్ బాటిల్ రూ.100కి అమ్మడం ఏంటి? అని ప్రశ్నిస్తూ ఓ ఐటీ ఉద్యోగి ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఐటీ ఉద్యోగి పల్లబ్దే ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ ఈవెంట్లో రూ.10 వాటర్ బాటిల్ను రూ.100కి అమ్ముతున్నట్లు గుర్తించాడు. ఇదే విషయాన్ని ప్రముఖ ఫుడ్డెలివరీ సంస్థ జొమాటాను అడిగారు.How is @zomato allowed to sell Rs. 10 water bottles for Rs. 100 at concert venues where no one is allowed to bring their own bottles?@VijayGopal_ pic.twitter.com/clQWDcIb7m— Pallab De (@indyan) December 17, 2024 ‘తాము పాల్గొన్న ఈవెంట్లో వాటర్ బాటిల్స్ నిషేదం.ఈవెంట్ నిర్వహించే వాళ్లే వాటర్ బాటిళ్లనూ అమ్ముతున్నారు. దాహం వేస్తుంది కదా అని రూ.10 వాటర్ బాటిళ్లను రెండింటిని కొనుగోలు చేశా. రూ.20 ఇచ్చా. కానీ సదరు వాటర్ బాటిల్ అమ్మే వ్యక్తి నా నుంచి రూ.200 వసూలు చేశారు.‘ఎవరూ తమ సొంత వాటర్ బాటిళ్లను తీసుకురావడానికి అనుమతించని ఈవెంట్లో రూ.10 వాటర్ బాటిల్ను రూ.100కి విక్రయించడానికి జొమాటోకి అనుమతి ఎలా వచ్చింది? అని అడుగుతూ రెండు వాటర్ బాటిళ్ల ఫొటోల్ని ట్వీట్లో జత చేశాడు.పల్లబ్ ట్వీట్పై జొమాటో స్పందించింది. తాము, ఆ వాటర్ బాటిల్స్ను అమ్మలేదని, టికెటింగ్ పార్ట్నర్గా ఉన్నట్లు తెలిపింది. అయినప్పటికీ కస్టమర్కు కలిగిన అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. -
రోగాలను తాగేస్తున్నామా?.. లీటర్ నీటిలో లక్షల్లో మైక్రో ప్లాస్టిక్ కణాలు
సాక్షి, సెంట్రల్ డెస్్క: హోటల్కు వెళ్లి టిఫిన్ చేస్తే వాటర్ బాటిల్.. ఫంక్షన్లలో భోజనం చేస్తే వాటర్ బాటిల్.. ప్రయాణాల్లో దాహం వేస్తే వాటర్ బాటిల్.. ఇలా ఇబ్బడిముబ్బడిగా వాడేస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి పది లక్షలకుపైగా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల అమ్మకాలు జరుగుతున్నట్లు తేలింది. ఈ విషయం బ్రిటిష్ మెడికల్ జర్నల్ అధ్యయనంలో వెల్లడైంది. తాగునీరు మన ఆరోగ్యాన్ని కాపాడడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే రోజుకు కనీసం మూడు లీటర్ల నీళ్లయినా తాగాలని డాక్టర్లు చెప్తుంటారు. దీంతో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ నీళ్లు తాగుతున్నారా, లేదా అని చూసుకుంటారు కానీ.. దేనిలో తాగుతున్నామనే విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ విస్మరిస్తున్నారు. సమృద్ధిగా నీళ్లు తాగితే ఆరోగ్యంగా ఉంటామనే భావనతో రోజువారీ జీవితంలో ఎడాపెడా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు కొనేసి ఉపయోగిస్తున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి పది లక్షలకు పైగా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను వినియోగిస్తుండగా.. ఈ ధోరణి భవిష్యత్తులో విపరీతంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు పర్యావరణం, వాతావరణం పరంగా ప్రపంచం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోందని అధ్యయనం వెల్లడించింది. ఎందుకిలా? ప్రపంచవ్యాప్తంగా కుళాయి నీటి నాణ్యత మీద ప్రజలకు నమ్మకం లేకపోవడమే వాటర్ బాటిళ్ల వినియోగం పెరగడానికి ముఖ్య కారణమని అధ్యయనంలో తేలింది. అలాగే ఇవి ఎక్కడపడితే అక్కడ సులభంగా అందుబాటులో ఉండటం, వాటి ధర కూడా తక్కువగా ఉండటం, ఎక్కడికైనా తీసుకెళ్లడానికి అనువుగా ఉండటం మరో కారణమని నివేదిక తెలిపింది. లీటర్ నీటిలో 3 లక్షల మైక్రో ప్లాస్టిక్ కణాలు.. ప్లాస్టిక్ బాటిళ్ల నుంచి.. అందులోని నీటిలోకి మైక్రో ప్లాస్టిక్లు, బీపీఏ(బిస్ఫెనాల్–ఏ) తదితర హానికర రసాయనాలు విడుదలవుతుంటాయి. ఒక లీటర్ వాటర్ బాటిల్లో లక్ష నుంచి మూడు లక్షల వరకు మైక్రో ప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు తేలిందని ఓ అధ్యయనం వెల్లడించింది. ఇందులో 90 శాతం నానో ప్లాస్టిక్ కణాలే. ఇవి అత్యంత ప్రమాదకరమైనవి. పునరుత్పత్తి హార్మోన్లు, థైరాయిడ్ హార్మోన్లు, రోగ నిరోధక శక్తిపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని నివేదిక తెలిపింది. రక్తపోటు, గుండె, మధుమేహం, ఊబకాయంతో పాటు మానవ అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని హెచ్చరించింది. పర్యావరణంపై ప్రభావం.. పర్యావరణం మీద అత్యంత ప్రభావం చూపిస్తున్న వాటిలో ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా ఒకటి. సముద్ర కాలుష్య కారకాల్లో మొదటి స్థానంలో ప్లాస్టిక్ సంచులు ఉండగా.. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లది రెండో స్థానం. ప్రపంచవ్యాప్తంగా కేవలం 30 శాతం ప్లాస్టిక్ బాటిళ్లు మాత్రమే రీసైక్లింగ్ అవుతున్నాయని తెలిపింది. మిగిలిన 70 శాతం నేలలో, నీటిలో చేరి పర్యావరణానికి, అనంత జీవరాశికి అనర్థం కలుగజేస్తున్నాయని వెల్లడించింది. అలాగే ప్రతి లీటర్ ప్లాస్టిక్ బాటిల్ కోసం 1.39 లీటర్ల నీటిని ఉపయోగిస్తూ.. నీటిని కూడా వృథా చేస్తున్నారని తెలిపింది. అంతేకాకుండా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు ఏటా 600 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తున్నాయని పేర్కొంది. తద్వారా వాతావరణ మార్పులకు దోహద పడుతున్నాయని వెల్లడించింది.ఏం చేయాలి..? ‘ప్రభుత్వాలు ప్రజలందరికీ సురక్షిత తాగునీటిని విస్త్రతంగా అందుబాటులోకి తీసుకురావాలి. దాని మీద ఉన్న అపోహలు తొలగించాలి. ప్లాస్టిక్ బాటిళ్లు వినియోగించకుండా అవగాహన కలి్పంచాలి. వాటి వినియోగం వల్ల కలిగే అనర్థాలను తెలియజేయాలి. అలాగే ప్లాస్టిక్ బాటిళ్లకు ప్రత్యామ్నాయంగా మట్టి, రాగి, స్టెయిన్ లెస్ స్టీల్ నీటి సీసాలను ఉపయోగించేలా ప్రజలను ప్రోత్సహించాలి’ అని నిపుణులు సూచిస్తున్నారు. -
వాటర్ బాటిల్ ధర తగ్గనుందా..?
ఆల్కహాల్లేని పానీయాలపై జీఎస్టీని సరళీకరించాలని ఇండియన్ బేవరేజ్ అసోసియేషన్ సూచించింది. డ్రింక్స్లో ఉండే చక్కెర పరిమాణం ఆధారంగా జీఎస్టీ రేటు విధించాలని తెలిపింది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అన్ని విధాలా ప్రోత్సహిస్తే ఆల్కహాల్లేని పానీయాల మార్కెట్ దేశీయంగా 2030 వరకు రూ.1.5 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని స్పష్టం చేసింది.కార్బొనేటెడ్ పానీయాలపై పన్ను విధానాల మీద ఐసీఆర్ఐఈఆర్ నివేదిక విడుదల చేసింది. ఈ సందర్భంగా ఇండియన్ బేవరేజ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జె.పి.మీనా మాట్లాడుతూ..‘ప్రస్తుతం ఈ విభాగ పరిమాణం రూ.60,000 కోట్లుగా ఉంది. భారత ఆహార ప్రాసెసింగ్ రంగంలో ఆల్కహాలేతర పానీయాలు(సీసాల్లోని నీరు, సాఫ్ట్ డ్రింక్స్) కీలకం. భవిష్యత్తులో భారత్ ఈ విభాగంలో అంతర్జాతీయ తయారీ కేంద్రంగా అవతరించనుంది. ప్రస్తుతం 20 లీటర్లు లేదా అంతకుమించి నీళ్ల సీసాలకు 12 శాతం జీఎస్టీ, 20 లీటర్ల లోపైతే 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. అలా కాకుండా ఒకే రేటు వర్తించేలా చూడాలి. నీళ్ల సీసాలన్నింటికీ 5 శాతం జీఎస్టీ విధించాలి’ అని సూచించారు.ఇదీ చదవండి: పెట్రోల్పై రూ.15, డీజిల్పై రూ.12 లాభం..!దేశీయంగా, అంతర్జాతీయంగా నీళ్ల సీసాల సరఫరాను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని మీనా తెలిపారు. ఈ విభాగంలో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు కూడా ఈ ప్రతిపాదన తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఆల్కహాలేతర పానీయాల్లో చక్కెర స్థాయులు ఎక్కువ ఉంటే అధిక జీఎస్టీ, తక్కువ ఉంటే తక్కువ జీఎస్టీ విధించాలన్నారు. దేశంలో వస్తు సేవల పన్ను విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిన సమయంలో ఆల్కహాలేతర పానీయాలను హానికారక ఉత్పత్తుల కేటగిరీలో చేర్చారని చెప్పారు. దీనిపై ప్రభుత్వ వర్గాలు పునరాలోచించాలన్నారు. సాఫ్ట్డ్రింక్స్పై చక్కెర పరిమాణం ఆధారంగా జీఎస్టీ రేటు నిర్ణయించాలని సూచించారు. -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్!..ఒక లీటర్కే..!
మన ప్రాథమిక అవసరాల్లో నీరు కూడా ఒకటి. నీరు లేకుండా భూమిపై మనుగడ సాగించడం అనేది అసాధ్యం. పెరుగుదలకు, నిర్వహణకు ఎంతో అవసరం నీరు. మానవ శరీరం దాదాపు 60% నీటితోనే ముడిపడి ఉంటుంది. మానవ శరీర పనితీరుకు అత్యంత అవసరం ఇది. ముఖ్యంగా జీర్ణక్రియ, శోషణ,పోషకాల రవాణాను సులభతరం చేయడంలో నీను ప్రధాన పాత్ర పోషిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. సెల్యులార్ ఫంక్షన్కు మద్దతు ఇస్తుంది. వంట చేసే దగ్గర నుంచి క్లీన్ చేయడానికి, చెట్లకు, జంతుజాలం ఉనికికి నీరు అవసరం. అలాంటి నీరుని అత్యంత ధరల్లో కూడా విక్రయిస్తారనే విషయం గురించి విన్నారా?. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్ ఒకటి ఉంది. ఒక లీటర నీటికే ఎంత వెచ్చించాలో వింటే కంగుతింటారు. ఎందుకంతా అంటే..ఈ నీటిని చాలా ప్రత్యేకంగా తయారు చేయడం, దాని స్వచ్ఛత, ఫ్యాకేజింగ్ విధానం తదితరాల కారణంగా అంత లగ్జరీయస్ ఉంటుంది ఈ వాటర్ బాటిల్ ధర. వీటిని ప్రసిద్ధి బ్రాండ్ విడుదల చేస్తుంది. దీనిని ఫిల్లికో జ్యువెలరీ వాటర్ అని పిలుస్తారు. ఈ బాటిల్స్ని స్వరోవ్స్కీ స్పటికాలతో అలంకరిస్తారు. చక్కటి ఆభరణాల ముక్కలతో డిజైన్ చేస్తారు. అందువల్ల దీని ధర అంత రేంజ్లో ఉంటుంది. జపాన్లో కోబ్లోని సహజమైన నీటి బుగ్గ నుంచి తీసుకున్న నీరు ఇది. నాణ్యతకు ప్రసిద్ధి చెందింది. దీనికి తగ్గట్టుగా బాటిల్ డిజైన్ కూడా లగ్జరియస్గా ఉంటుంది. ప్రతి బాటిల్ని బంగారంతో డిజైన్ చేస్తారు. ఈ డిజైన్ని జపాన్ హస్తకళను హైలెట్ చేసేలా రూపొందిస్తారు. కొన్నిబ్రాండ్లు బంగారం, ప్లాటినం, అంతకంటే విలువైన రాళ్లతో డిజైన్ చేస్తారు. ఆ బాటిల్కి ప్రత్యేకమైన ఆకర్షణను తీసుకురావడమే గాకుండా అంత డబ్బు వెచ్చించి కొనుగోలు చేస్తున్నందుకు తగ్గట్టుగా ఆ బాటిల్ లుక్ ఉంటుంది. ఇంతకీ ఈ బాటిల్ లీటర్ నీటి ధర ఏకంగా రూ. 1,16,000/-(చదవండి: చీరకట్టులో హులా హూపింగ్..అథ్లెటిక్ సామర్థ్యాలతో..!) -
నీతా అంబానీ తాగే వాటర్ అంత ఖరీదా? మరి రూ.49 లక్షల బాటిల్ సంగతేంటి?
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్, ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ అత్యంత స్టైలిష్ ఫ్యాషన్ ఐకాన్లలో ఒకరు. అందానికితోడు, వ్యాపార దక్షతకూడా ఆమె సొంతం. వివిధ దాతృత్వ , సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా ఉంటారు. అయితే నీతా బ్యూటీ సీక్రెట్ ఏంటి అనేది ఎపుడూ హాట్ టాపికే. ఇటీవల బ్యూటీ విత్ పర్పస్ హ్యుమానిటేరియన్ అవార్డు'కూడా దక్కించుకున్నారు. తాజాగా నీతా అంబానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నీటిని తాగుతారని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.. అదేంటి అవి నీళ్లా? లేక బంగారమా? ఇదేంటీ విడ్డూరం అనుకుంటున్నారా? అయితే మీరీ స్టోరీ చదవాల్సిందే.నీతా అంబానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నీటిని వాడతారని చాలా చోట్ల ప్రచారంలో ఉంది. ఎంతయినా రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్ ముఖేష్ భార్య కదా. తనకు తక్కువేంటీ? అనుకునే వాళ్లున్నారు. తన సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేకంగా తయారు చేసిన నీళ్లను వాడతారని చెబుతారు. ఒక ప్రచారంలో ఆమె తాగే 750 మిల్లీలీటర్ల వాటర్ బాటిల్ ధర 27 వేల రూపాయలకు పైమాటే అని కూడా ప్రచారం చేఉశారు. ప్రపంచంలోనే ఖరీదైన నీళ్లు ఇవేనని, ఈ నీటిని తాగితే ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు బరువు నియంత్రణలోఉండి, చర్మం నిగారింపును సంతరించుకుంటుందని ఒత్తిడి దూరం అవుతుందని ప్రచారం చేశారు. ఈ నీరు ఎక్కడ పడితే అక్కడ దొరకదని, వసంతకాలంలో ఫిజి, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశంలో ఏర్పడే గ్లాసియర్ల నుంచి సేకరిస్తారని, దాంతోపాటు ఖనిజ లవణాలు కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయని, అందుకే ఈ వాటర్కు అంత క్రేజ్ ఉందని ప్రచారం చేశారు. దీనిపై ఓ సందర్భంలో నీతా అంబానీనే తెలిసిన వాళ్లు ఒకరు అడిగారు. మీ సౌందర్య రహస్యానికి, మీ ఉత్సాహానికి మీరు తాగే నీళ్లే కారణమా అని అడిగారు. ఆ ప్రశ్నవిని ఆశ్చర్యపోయిన నీతా అంబానీ.. ఖరీదైన నీళ్లంటూ జరుగుతున్న ప్రచారమంతా వట్టిదేనని తేల్చేశారట. రూ. 49 లక్షల వాటర్ బాటిల్ కథకాగా 2015లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ఆమె ఓ వాటర్ బాటిల్లోతో కనిపించారు. ఈ బాటిల్ ధర సుమారు రూ.49 లక్షలు అంటూ మార్ఫింగ్ ఫోటో ఇంటర్నెట్లో వైరల్ అయింది. అసలు కథ ఏంటంటే ప్రముఖ మెక్సికన్ డిజైనర్, ఫెర్నాండో అల్టామిరానో ఈ బాటిల్ను నిజంగానే బంగారంతో చేశారు. దాని పేరే అక్వాడి క్రిస్టల్లో ట్రిబ్యూటో ఎ మొడిగ్లియాని. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. అయితే ఖరీదైన నీళ్లలాగే.. ఖరీదైన బాటిల్ గురించి కూడా నీతా ఏదో ఒక స్పష్టత ఇస్తారేమో. -
కరెంట్తో పనిలేకుండానే వాటర్ని కూల్ చేసుకునే సింపుల్ టెక్నిక్!
ఖరీదైన సౌకర్యాలు సమకూర్చుకునేంత సంవద పేదల దగ్గర లేకపోవచ్చు. అయితే ప్రత్యామ్నాయ ఐడియాలకు మాత్రం కొదవ లేదు అని చెప్పే వీడియో ఇది. ఒక మూరుమూల గ్రామంలో ఒక పేదింటి మహిళ ‘ఫ్రిడ్జ్ అవసరం లేకుండా వాటర్ను సింపుల్గా ఇలా కూల్ చేసుకోవచ్చు’ అంటూ ఒక వాటర్బాటిల్లో నీళ్లుపోసి దానికి తడి వస్త్రం చుట్టి చెట్టుకొమ్మలకు వేలాడదీసింది.పావు గంటలో ఆ నీళ్లు చల్లబడ్డాయి. ‘తడి వస్త్రం బాటిల్ లోపల ఉన్న వేడిని బయటికి లాగుతుంది. మా ఊళ్లో అందరం ఇలాగే చేస్తాం’ అంటుంది ఆ యువతి. నిజానికి గతంలోకి వెదుక్కుంటూ వెళితే, ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఇలాంటి సింపుల్ అండ్ ఎఫెక్టివ్ ఆర్గానిక్ ట్రిక్స్ ఎన్నో ఉన్నాయి. ఇలాంటి ఐడియాలన్నీ పర్యావరణానికి హాని కలిగించనివే. పాపులర్ కంటెంట్ క్రియేటర్ దివ్య సిన్హా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. View this post on Instagram A post shared by Divya Sinha (@divyasinha266)(చదవండి: కేన్స్లో మెరిసిన శోభితా ధూళిపాళ..ఆ డ్రస్ ధర ఏకంగా..!) -
వాటర్ బాటిల్లోని నీరు ఎన్నాళ్లకు పాడవుతుంది?
నదిలో పారేనీరు నిత్యం శుభ్రంగా ఉంటుందని అంటారు. అయితే క్లోజ్డ్ బాటిల్లోని నీటికి గడువు తేదీ ఉంటుందా? అయితే ఆ నీరు ఎప్పుడు చెడిపోతుంది? దాని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఎప్పుడో ఒకప్పుడు వాటిర్ బాటిల్పై గడువు తేదీని చూసేవుంటాం. ఒక నివేదిక ప్రకారం వాటిర్ బాటిల్లోని నీటిని దాని ప్యాకింగ్ తేదీ నుంచి రెండేళ్లపాటు వినియోగించవ్చు. బాటిల్లోని ప్లాస్టిక్ నెమ్మదిగా నీటిలో కరగడం ప్రారంభిస్తుందని, అందుకే రెండేళ్ల తర్వాత ఆ నీరు తాగడానికి పనికిరాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాస్తవానికి వాటర్ బాటిల్ గడువు తేదీ దానిలోని నీటికి సంబంధించినది కాదు. బాటిల్ గడువు తేదీ అని దాని అర్థం. వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ రీసెర్చ్ నివేదిక ప్రకారం పంపు నీటిని ఆరు నెలల పాటు నిల్వ చేయవచ్చు. ఆ నీటిని ఉపయోగించవచ్చు. అయితే కార్బోనేటేడ్ పంపు నీరు రుచి క్రమంగా మారుతుంది. ఎందుకంటే దానిలో నుంచి గ్యాస్ నెమ్మదిగా బయటకు వస్తుంది. గాలిలో ఉండే కార్బన్ డయాక్సైడ్ నీటిలో కలిసిన తర్వాత, అది కొద్దిగా ఆమ్లంగా మారుతుంది. అయితే కంటైనర్లను ఆరు నెలల పాటు చల్లని, పొడి, చీకటి ప్రదేశంలో ఉంచినట్లయితే ఆ నీటి రుచి ఎప్పటికీ మారదు. కంటైనర్లలో నీటిని నింపేటప్పుడు పైపులను నేరుగా ఉపయోగించకూడదని నిపుణులు చెబుతుంటారు. దానికి ప్రత్యామ్నాయంగా ఫిల్టర్ను వాడాలని సూచిస్తుంటారు. ఆ నీటికి గాలి తగలకుండా ఉండేందుకు ఒక మూతను ఉంచాలి. నీటిని నిల్వ చేయడానికి మరొక మార్గం కూడా ఉంది. నీటిని సుమారు 15 నిమిషాలు మరిగించి, ఆ తరువాత చల్లబరిచి నిల్వ చేయవచ్చు. -
నాదెండ్ల మనోహర్పై నీళ్ల బాటిల్తో దాడి
తెనాలి(గుంటూరు జిల్లా): పొత్తు పెట్టుకున్నప్పటికీ తెనాలిలో టీడీపీ–జనసేన నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న తీవ్ర విభేదాలు గురువారం బట్టబయలయ్యాయి. జనసేన సీనియర్ నేత, తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్పై టీడీపీ వర్గీయులు నీళ్ల బాటిల్తో దాడి చేశారు. ఈ బాటిల్ ఆయన తలకు తగిలింది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, జనసేన అసెంబ్లీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గురువారం సాయంత్రం తెనాలిలో జనచైతన్య పాదయాత్ర ప్రారంభించారు. బోసు రోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర వీనస్ టాకీస్ దగ్గరకు చేరుకుంది. అక్కడ టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ (రాజా) వచ్చి కలిశారు. ఆ వెంటనే రాజాకు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పోటీగా జనసేన కార్యకర్తలు నాదెండ్ల మనోహర్ జిందాబాద్.. అంటూ నినాదాలు ప్రారంభించారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. ఈ తోపులాటలో టీడీపీ మహిళా కార్యకర్త ఒకరు ఇరుక్కుపోయారు. ఈ సమయంలో∙ఎవరో నీళ్ల బాటిల్ను నాదెండ్ల మనోహర్పైకి బలంగా విసిరారు. ఆయన తప్పుకోవాలని ప్రయత్నించినప్పటికీ తలకు తగిలింది. ఈ ఘటనతో అందరూ కంగుతిన్నారు. ఆలపాటి రాజా వర్గమే అక్కసుతో ఈ దాడికి పాల్పడిందని జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆలపాటి రాజా టీడీపీ నుంచి తెనాలి టికెట్ ఆశించారని, ఆయనకు కాకుండా పొత్తుల్లో భాగంగా జనసేన నేత నాదెండ్ల మనోహర్కు ఇవ్వడంవల్లే ఈ దాడి చేశారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలతో పాదయాత్రకు వచ్చిన అనేక మంది యాత్ర పూర్తికాకుండానే వెళ్లిపోయారు. -
ఒక లీటర్ బాటిల్లో ఎన్ని నానో ప్లాస్టిక్ కణాలు ఉంటాయో తెలుసా!
ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ మంచిది కాదన్న విషయం తెలిసిందే. ఆ నీటిలోకి ప్లాస్టిక్ కణాలు ఉంటాయని అవి మనకు రకరకాల ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడతాయిని విన్నాం. అంతవరకు తెలుసు కానీ ఎంత స్థాయిలో ప్లాస్టిక్ కణాలు ఉన్నాయన్నది పూర్తిగా తెలియదు. ఈ తాజా అధ్యయనాల్లో రెండు లక్షలకు పైగా ప్లాస్టిక్ కణాలు, నానో ప్లాస్టిక్స్ ఉండొచ్చిన వెల్లడయ్యింది. అవి నేరుగా రక్తంలో ప్రవేశించి రకరకాల ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని పరిశోధకులు తెలిపారు. ఈ మేరకు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ప్రొసీడింగ్స్ జర్నల్లో పీర్ రివ్యూడ్ స్టడీ పేరుతో ఈ పరిశోధన ప్రచురితమయ్యింది. ఈ నానో ప్లాస్టిక్ కణాలు మనిషి వెంట్రుకలో డెబై వంతు వెడల్పుతో ఉన్నాయని అన్నారు. మునపటి అధ్యయనాల్లో అంచనావేసిన దానికంటే వందరెట్లు ఉండొచ్చని చెబుతున్నారు. ఎందుకంటే? గత అధ్యయనాల్లో మైక్రోప్లాస్టిక్లు సుమారు ఐదు వేలు ఉన్నట్లు అంచనా వేశారు. అంతేగాదు మైక్రోప్లాస్టిక్ల కంటే రేణువుల్లా ఉండే ఈ నానో ప్లాస్టక్లు మరింత ప్రమాదకరమైనవి. ఇవి నేరుగా మాన రక్తప్రవాహంలో ప్రవేశించి అవయవాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పరిశోధకులు. అంతేగాదు ఇవి పుట్టబోయే బిడ్డలోకి మాయ ద్వారా చేరే అవకాశం కూడా లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ నానోప్లాస్టిక్ని గుర్తించే సాంకేతికత ఇంకా అభివృద్ధి చెందలేదన్నారు. ఆ పరిస్థితిని అధిగమించడానికి కొత్త మైక్రోస్కోపీ టెక్నీక్ను కనుగొన్నారు. అందుకోసం యూఎస్లోని మూడు ప్రసిద్ధ బ్రాండ్ల నుంచి సుమారు 25 లీటర్ వాటార్ బాటిళ్లను కొనుగోలు చేశారు. ప్రతి లీటర్లలో సుమారు ఒక లక్ష నుంచి మూడు లక్షల దాక ప్లాస్టిక్ కణాలను గుర్తించారు. వాటిలో దాదాపు 90% వరకు నానోప్లాస్టిక్లు. ఈ పరిశోధన నానోప్లాస్టిక్లను విశ్లేషించడంలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడంలో సహాయపడుతుందని కొలంబియా పరిశోధకుడు నైక్సిన్ కియాన్ అన్నారు. వీటిలో ఏడు సాధారణ ప్లాస్టిక్ రకాలను లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా పాలిథిన్ టెరెఫ్లాలేట్(పెట్), పాలిమైడ్ వంటి వాటిపై దృష్టిసారించారు. ఎందుకంటే వీటిని సీసాలు తయారు చేయడంలోనూ, బాటిల్ని శుద్ధి చేయడంలోనూ ఉపయోగిస్తారు. అయితే వీటికి సంబంధించిన నానోప్లాస్టిక్ బాటిల్ నీటిలో చాలమటుకు గుర్తించబడవని అన్నారు. గత పరిశోధనలు పరిశీలిస్తే.. 2022 అధ్యయనంలో నీటి పంపుల కంటే వాటర్ బాటిల్లోనే మైక్రోప్లాస్టిక్ సాంద్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇక 2021లో జరిపిన అధ్యయనంలో మూతను తెరిచి మూయడం వల్ల కూడా చిన్ని బిట్ల మాదిరిగా ప్లాస్టిక్ కణాలు నీటిలో చేరతాయని చెప్పారు. ఈ తాజా అధ్యయనం మాత్రం వాటర్ బాటితో ఆగకుండా పంపు నీటిలో ఉన్న మైక్రో ప్లాస్టిక్లను కూడా కనుగొనడమే తమ లక్ష్యం అని పరిశోధకులువివరించారు. అందుకోసం అంటార్కిటికా పంపు నీటిలోని మంచు నుమునాలను సేకరించినట్లు తెలిపారు. ఈ నానోప్లాస్టిక్ చూడటానికి అత్యంత చిన్న రేణువులు, కానీ వీటి వల్ల మానవాళికి వాటిల్లే ముప్పు అంతా ఇంత కాదని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. (చదవండి: 'స్పేస్ మీల్': వ్యోమగాముల కోసం ప్రత్యేక భోజనం! తయారు చేసిన శాస్త్రవేత్తలు) -
ప్లాస్టిక్ మంచిదికాదని స్టీల్ వాటర్ బాటిల్స్ వాడుతున్నారా?
ఇటీవల కాలంలో ప్లాస్టిక్ బాటిల్స్ మంచిదికాదని స్టీల్ లేదా రాగి వాటర్ బాటిల్స్ వాడుతున్నారు. ఈ ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ ఉంటే ఒక రకమైన వాసన రావడమే గాక ఆరోగ్యానికి పర్యావరణానికి మంచిది కాదని శాస్త్రవేత్తలు హెచ్చరించడంతో విరివిగా మార్కెట్లోకి వస్తున్న స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్స్ వాడుతున్నారు చాలామంది. ఇలాంటి పునర్వినియోగ వాటర్ బాటిల్స్ని ఉపయోగించేటప్పుడ తగు జాగ్రత్తుల తీసుకోకపోతే అనారోగ్యం బారిన పడటం ఖాయం. అందుకు నెట్టింట వైరల్ అవుతున్న.. యూఎస్ఏకి చెందిన మహిళ ఉదంతమే ఉదహారణ. ఆమె ఈ పునర్వినియోగ వాటర్ బాటిల్స్తో ఎలా అనారోగ్యం పాలైందో టిక్టాక్లో వివరించింది. మీరు కూడా ఆమెలానే చేస్తున్నట్లయితే అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకన్నట్లే అవుతుంది. అందువల్ల ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో సదరు మహిళ.. ఇలాంటి పునర్వినయోగ స్టెయిన్ లెస్ బాటిల్స్నే తాను వాడుతున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే తనకు ఒక రోజు ఉన్నట్లు జలుబు చేసిందిని, తర్వాత ట్యాబ్లెట్లు వేసుకున్నాక తగ్గింది మళ్లీ రెండు రోజులకే జలుబు, దగ్గు రెండు విపరీతంగా వచ్చాయి. దీంతో డాక్టర్లను సంప్రదించి యాంటీబయోటిక్ మందులు వాడింది. త్వరితగతినే కోలుకుంది కూడా. అయితే మళ్లీ వారం రోజులకే మళ్లీ సైనస్ వంటి లక్షణాలతో జలబు రావడం జరిగింది. తనకు జలుబు చేయడం అన్నదే చాలా అరుదు అలాంటిది ఇలా తరచుగా ఒక నెలలోనే రెండు మూడు సార్లు జలుబున బారిన పడుతున్నానేంటీ ఏమైన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నాయా అని భయపడింది. దీంతో సమస్య ఎక్కడ ఉందా అని చెక్చేసుకుంది. వ్యక్తిగత పరిశుభ్రత దగ్గర నుంచి తీసుకునే ఆహార పదార్థల వరకు ఎక్కడ తలెత్తుంది ఈ సమస్య, దేనివల్ల తనకు ఇలా అయ్యిందని మొత్తం క్షుణ్ణంగా పరిశీలించగా..తాగే వాటర్ సురక్షితంగా ఉందా లేదా అన్న ఆలోచన తట్టింది. వెంటనే బాటిల్స్ అన్ని చెక్చేయగా ఆమె తాగే వాటర్ బాటిల్ అడుగున నాచులా ఆకుపచ్చిన బూజు(శిలింధ్రం) ఉండటం చూసి అవాక్కయ్యింది. అన్ని శుభ్రంగా ఉంచే నేను బాటిల్స్ మాత్ర అస్సలు క్లీన్ చేయడం లేదని తెలిసింది. బహుశా దీని వల్ల ఇన్నిసార్లు జలుబు బారిన పడ్డానని అర్థమయ్యే తక్షణమే వాటిని క్లీన్ చేసినట్లు వివరించింది. ఈ విషయాన్నే వైద్యులకు తెలపగా, వారు కూడా ఇలాంటి ఆకుపచ్చ నాచు కారణంగా ఫుడ్ పాయిజినింగ్, జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ వంటి పలు రకాల ఇన్పెక్షన్లు వస్తాయని చెప్పారు. తాగే నీరు, తీసుకునే ఆహారం విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలని సూచించారని పేర్కొంది. ఈ స్టీల్ బాటిల్స్ పర్యావరణానికి హితమైనప్పటికీ వాడేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోండి లేదంటే తనలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవల్సి వస్తుందని చెబుతోంది సదరు మహిళ. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే.. ఏ బాటిల్ అయినా దానిలో వాటర్ అలానే ఉండిపోతే కచ్చితంగా కింద బాటిట్ అడుగుభాగన జిగురులాంటి సిలికాన్ మాదిరి పదార్థం ఏర్పడుతుంది. కొద్దిరోజులక ఆకుపచ్చని బూజులాంటి శిలిధ్రం ఫామ్ అయ్యిపోతుంది. మనం అందులో ఉన్న నీటిని అలాగే తాగితే ముందుగా గొంతునొప్పి, జలుబు వంటి అనారోగ్యాల బారిన పడతాం. తరుచుగా జలుబుతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. బాటిల్స్ని కనీసం మూడు లేదా ఐదు రోజుల కొకసారి వేడినీటితో క్లీన్ చేసుకోవాలి లోపల జిగురు వంటి సిలాకాన్లాంటి పదార్థం రాకుండా మార్కెట్లో దొరికే బ్రెష్తో క్లన్ చేసుకోవాలి. తాగే బాటిల్ బాగుందో లేదో కూడా చెక్చేసుకుని తాగండి ఏ బాటిల్లోనైన నీరు నిశ్చలంగా మూడు నుంచి నాలుగు రోజులు ఉండిపోతే ఒక విధమైన వాసన వస్తుంది. ఇలాంటి వాటర్ అత్యంత ప్రమాదకరం. సాధ్యమైనంత వరకు బాటిల్లో ఎక్కువకాలం నిల్వ ఉండే వాటర్ని తాగొద్దు, వాటిని ఎప్పిటికప్పుడూ లేదా కనీసం మూడు నుంచి నాలుగురోజుల కొకసారి క్లీన్ చేసుకుని తాగేందుకు యత్నించండి. (చదవండి: బరువు తగ్గడంలో పనీర్ హెల్ప్ అవుతుందా? నిపుణులు ఏమంటున్నారంటే..?) -
ప్రపంచంలోనే అత్యంత ఖరీధైన వాటర్ బాటిల్ ఇదే..టేస్ట్ అదిరిపోతుంది!
ఒక వాటర్ బాటిల్ ధర ఎంత ఉంటుంది? మహా అయితే ఒక 20 రూపాయలు ఉంటుంది. అదే హోటల్స్లో అయితే వంద రూపాయల వరకు ఉంటుంది. కానీ ఈ వాటర్ బాటిల్ ధర తెలిస్తే మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేరు. ఎందుకంటే దీని ధర అక్షరాలా రూ. 45 లక్షలు. అవును మీరు విన్నది నిజమే. ఆ వాటర్ బాటిల్ మాత్రమే కాదు, అందులోని నీళ్లు కూడా ఎంతో ప్రత్యేకమైనవి. మరి ఆ స్పెషల్ ఏంటో తెలియాలంటే స్టోరీ చదవాల్సిందే. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మంచి నీళ్ల గురించి ఎప్పుడైనా విన్నారా?లీటర్ కూడా ఉండని ఈ బాటిల్ ధర దాదాపు 45 లక్షల రూపాలుంటుందట!మనం రోజూ తాగే మంచి నీళ్ల బాటిల్ ధరలు కూడా.. ఊహించని స్థాయిలో ఉంటాయని మనలో చాలా మందికి తెలియదు.అక్వా డి క్రిస్టలో ట్రిబ్యుటొ ఎ మోడిగ్లియాని అనే వాటర్ బాటిల్ గురించే ఈ చర్చంతా. దీనిలో కేవల 750 మిల్లీ లీటర్ల నీళ్లు మాత్రమే ఉంటాయి. అంత చిన్న వాటర్ బాటిల్ ధర అక్షరాలా 45 లక్షల రూపాయలు. ఇప్పుడు ప్రపంచంలోని అతి ఖరీదైన మంచినీళ్లు ఇవేమరి. లీటర్ కూడా లేని ఈ నీళ్లకు ఎందుకింత డిమాండ్? అంటే..ఈ నీళ్లను ఫ్రాన్స్, ఫిజీలలోని సహజ నీటిబుగ్గల నుంచి సేకరిస్తారట. భూగర్భ జలాలు ఉబికి భూమిపైన ప్రవహించే సహజ నీటి బుగ్గల నుంచి ఈ నీటిని సేకరిస్తారు. ఇది వింతేమీ కాదే!! ఈ రోజుకీ మార్కెట్లో అనేక మినరల్ వాటర్ బాటిల్లు ఈ విధమైన సహజ నీటి బుగ్గల నుంచి సేకరించిన నీళ్లను అమ్ముతున్నారు. మన దేశంలో కూడా ఈ విధమైన నీళ్ల బాటిల్లను రూ. 50 నుంచి 150 వరకు అమ్ముతున్నారు. అయినప్పటికీ ఈ వాటర్ బాటిల్ ఎందుకంత ధర పలుకుతుంది? ఇదేనా మీ అనుమానం.. అనేకానేక కారణాల్లో ఈ వాటర్ బాటిల్ డిజైన్ కూడా ఒక కారణమే. ఎందుకంటే.. ►ఈ బాటిల్ లోపలి భాగాన్ని 24 క్యారెట్ల బంగారంతో తయారుచేయడం. ►ఈ బాటిల్ ఆకారాన్ని ప్రపంచంలోనే ప్రసిద్ధ బాటిల్ డిజైనర్ అయిన ఫెర్నాండో అల్టామిరానో డిజైన్ చేశాడు. ప్రపంచంలోనే అతి ఖరీదైన హెన్రీ 4 హెరిటేజ్ డ్యుడోగ్నన్ కోగ్న్యాక్ అనే వైన్ బాటిల్ కూడా ఇతనే డిజైన్ చేశాడు. ►ఈ బాటిల్లోని నీళ్లు కూడా ప్రత్యేక రుచి కలిగి ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో లభించే సగటు తాగునీటి కంటే ఎక్కువ శక్తిని అందిస్తుందట. అంతఖరీదు పెట్టి కొని తాగే వారు ఎవరుంటారని అనుకుంటే పప్పులో కాలేసినట్లే! సెలబ్రెటీలు, ప్రముఖ వ్యక్తులు మనలా సాధారణ నీళ్లను తాగరు. వాళ్లు తాగే నీళ్లు ఇవే మరి.. ! -
విద్యార్థిని వాటర్ బాటిల్లో మూత్రం పోసిన విద్యార్థులు
జైపూర్: తోటి విద్యార్థిని పట్ల కొందరు విద్యార్థులు అమానుషంగా ప్రవర్తించారు. ఆమె మంచినీళ్ల బాటిల్లో మూత్రం పోశారు. ఈ ఘటన రాజస్తాన్లోని భిల్వారా జిల్లా లుహారియా గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ బాలిక స్థానిక స్కూలులో చదువుకుంటోంది. శుక్రవారం కొందరు విద్యార్థులు ఆమె మంచి నీళ్ల బాటిల్లో మూత్రం కలిపారు. ఇది తెలియని బాలిక ఆ నీళ్లు తాగింది. దుర్వాసన రాగా ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేసింది. తన పుస్తకాల బ్యాగులో ప్రేమ లేఖ కూడా ఉన్నట్లు తెలిపింది. స్పందించకపోవడంతో కుటుంబసభ్యులకు తెలిపింది. వారు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. తహశీల్దారు, పోలీసులకు కూడా వారు తెలిపారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో అనుమానితుల ఇళ్లపై రాళ్ల దాడికి దిగారు. -
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్, రూ.20కే కడుపు నిండా భోజనం!
ట్రైన్ జర్నీ చేసే చాలామంది కొన్ని సందర్భాల్లో ఫుడ్ కోసం ఇబ్బందిపడే ఉంటారు. అధిక ధరలు లేదా నాణ్యత లేకపోవడం వంటివి నిజ జీవితంలో ఎదురై ఉండే అవకాశం ఉంది. అయితే ఇలాంటి వాటికి 'ఐఆర్సీటీసీ' (IRCTC) చరమగీతం పాడటానికి సిద్ధమైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ప్రయాణికుల కోసం రైల్వే ఓ కొత్త విధానం తీసుకువచ్చింది. సరసమైన ధరతోనే ప్రయాణికులకు మంచి భోజనం అందించాలనే సదుద్దేశ్యంతో రైల్వే బోర్డు ఇప్పటికే డివిజనల్ యూనిట్లకు 'రైల్వేస్ జనతా ఖానా' ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సర్వీస్ కేవలం 'నార్త్ వెస్ట్రన్ రైల్వే జైపూర్ జంక్షన్'లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ సదుపాయం రానున్న రోజుల్లో మరింత విస్తరించడానికి ప్రణాళికలు చేపడుతున్నారు. (ఇదీ చదవండి: బీచ్లో చిల్ అవుతున్న మస్క్, జుకర్బర్గ్.. ఏంటి, కలిసిపోయారా?) రైల్వేస్ జనతా ఖానా.. ఐఆర్సీటీసీ ఈ ఫుడ్ రెండు కేటగిరీలలో అందించనుంది. 7 పూరీలు (175 గ్రామ్స్), పొటాటో వెజిటేబుల్స్ (150 గ్రామ్స్), ఊరగాయ (12 గ్రామ్స్) వంటివి కేవలం రూ. 20 మాత్రమే. అయితే రూ. 50 కాంబో ప్యాక్లో 350 గ్రామ్స్ రాజ్మా లేదా రైస్, పాప్ బాజీ, మసాలా దోశ, కిచిడి మొదలైనవి ఉంటాయి. ఇక 200 మీలీ వాటర్ బాటిల్ ఖరీదు కేవలం రూ. 3 మాత్రమే. ఈ కొత్త విధానం సమర్థవంతంగా సాగితే ప్రయాణికులకు చాలా అనుకూలంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. -
రెస్టారెంట్లో ఖరీదైన వాటర్ బాటిల్ అంటగట్టారని.. ‘పైసా వసూల్’ పనిచేసి..
ఖరీదైన రెస్టారెంట్లలో బిల్లులు ఏ స్థాయిలో ఉంటాయో మనందరికీ తెలిసిందే. అటువంటి సందర్భాల్లో కాస్త నిట్టూరుస్తూనే బిల్లు చెల్లిస్తుంటాం. తాజాగా ఫిట్నెస్, న్యూట్రిషన్ కోచ్ రితికా బోరా రెస్టారెంట్లో తనకు ఎదురైన అనుభవాన్ని షేర్ చేశారు. ఆమె రెస్టారెంట్లో వాటర్ బాటిల్కు ఆర్డర్ చేయగా, దానికి ఆమె భారీగా బిల్లు చెల్లించాల్సి వచ్చింది. తన అనుభవాన్ని ట్విట్టర్లో షేర్ చేసిన ఆమె క్యాప్షన్లో ‘మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఈ ఫ్యాన్సీ రెస్టారెంట్కు స్నేహితురాలితో పాటు వెళ్లాను. అక్కడ వాటర్ బాటిల్కు రూ.350 చెల్లించాల్సి వచ్చిందంటే ఎవరూ నమ్మరు. అందుకే ఆ బాటిల్ను నాతో పాటు ఇంటికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు దీనిని తిరిగి వినియోగించవచ్చని భావించాను. ఈ విధంగా నేను మాత్రమే చేస్తున్నానా? మీరు కూడా చేస్తారా?’ అని అమె ప్రశ్నించింది. Met up with a friend at this fancy restaurant for lunch, and you won't believe they charged 350 rps for a bottle of water! So, I decided to bring the bottle home with me so that I can reuse it. Is it only me or u have done this too? pic.twitter.com/AecGPLuoV8 — Ritika Borah (@coach_ritika) July 10, 2023 ఎక్కడైనా వాటర్ బాటిల్ రూ. 20కి లభ్యమవుతుంది. అయితే ఈ రెస్టారెంట్లో ఏకంగా వాటర్బాటిల్కు రూ. 350 చెల్లించాల్సి వచ్చిందని ఆమె వాపోయింది. రితికా బోరా పోస్టును చూసిన పలువరు నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు తమకు రెస్టారెంట్లలో ఎదురైన అనుభవాలను తెలియజేయగా, మరికొందు ‘పైసా వసూల్’ పని చేశారంటూ మెచ్చుకుంటున్నారు. ఇది కూడా చదవండి: మహిళ ఆర్తనాదాలపై ఫిర్యాదు.. సంఘటనా స్థలంలో డంగైన పోలీసులు! -
అపస్మారక స్థితిలోకి నాగు.. ఎలా కాపాడాడో చూసేయండి
Snake Viral Video: దప్పికతో ఆ పాము అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కాసేపు అలాగే వదిలేస్తే దాని ప్రాణం పోవడం ఖాయం!. అలాంటి స్థితిలో ఓ వ్యక్తి సాయానికి ముందుకొచ్చాడు. ధైర్యంగా దాని నోటికి నీరు ఒక బాటిల్ సాయంతో అందించాడు. దీంతో అది ఓపిక తెచ్చుకుంది. ఇంటర్నెట్లో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఓ నాగుపాము చచ్చిన ఎలుకను మింగింది. అయితే ఆ ఎలుకలో ఉన్న ఎలుకల మందు కూడా పాము లోపలికి వెళ్లింది. దీంతో అది అపస్మారక స్థితిలోకి వెళ్లి.. విపరీతమైన దాహార్తితో ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. ఆ సమయంలో తన ఇంటి ముందు పాము అలా ఉండడాన్ని నటరాజన్ గమనించాడు. స్థానికంగా ఉండే చెల్లా అనే వ్యక్తికి సమాచారం అందింంచాడు. అయితే అది ఇంకా చనిపోలేని.. డీహైడ్రేషన్తో బాధపడతుందని గుర్తించిన చెల్లా దాని నోటికి ఓ బాటిల్తో వాటర్ అందించాడు. ఎందుకైనా మంచిదని మరో చేత్తో దాని తోకను పట్టుకున్నాడు. దాహం తీరాక అది శక్తి తెచ్చుకుని వేగంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేసింది. மயக்க நிலையில் இருந்த நாகப்பாம்புக்கு சுற்றுச்சூழல் ஆர்வலர் பாட்டிலில் இருந்து தண்ணீர் கொடுத்த வீடியோ சமூக வலைதளங்களில் வைரலாகி வருகிறது. #Cuddalore #snake #water #cobra #viral #Jayaplus pic.twitter.com/3nZ77k6vOi — Jaya Plus (@jayapluschannel) July 5, 2023 Video Source: Jaya Plus ఈలోపు జనం కంగారుపడడంతో.. ఓ ప్లాస్టిక్ డబ్బాలో దాన్ని బంధించి సమీపంలోని అడవిలో వదిలేశాడు. చెల్లా సాహసోపేతంగా ఆ పామును రకక్షించిన వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. తమిళనాడు కడలూరు జిల్లా తిరుచోపరూర్లో ఈ ఘటన జరిగింది. ఇదీ చూసేయండి: ఇలాంటి కామాంధుల వల్లే దేశానికి చెడ్డపేరు! -
ఉడుత సాయం కాదు... ఉడుతకే సాయం!
‘ఉడుత సాయం’ అంటారు కానీ ఇక్కడ ఒక ఉడత మాత్రం సాయం కోసం మనిషి దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చింది. తనకు దాహం వేస్తోందని ఆ వ్యక్తికి సైగలు చేస్తూ చూపించింది. సదరు దయగల వ్యక్తి ఉడుతకు వాటర్ బాటిల్తో నీళ్లు తాగించాడు. ఈ వీడియో పాతదే అయినప్పటికీ ఎవరో ‘రెడ్డిట్’లో రీ–షేర్ చేశారు. పాతదా, కొత్తదా అనే విషయం పక్కన పెడితే ఈ వీడియో ఎంతోమందిని భావోద్వేగానికి గురిచేసింది. -
మైక్రోప్లాస్టిక్స్ కలిసిన నీటిని తాగితే కోలన్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్.. ఇంకా..
Summer Health Tips: అసలే ఎండాకాలం.. దాహం వేస్తుంటుంది. ఇంట్లో ఉన్నప్పుడంటే కావలసినప్పుడల్లా నీళ్లు తాగుతుంటాం. మరి బయటికి వెళ్లేటప్పుడు? అందులో ఆలోచించేదేముంది... ఒక వాటర్ బాటిల్ తీసుకెళతాం.. అంతేకదా అని సింపుల్గా చెప్పేస్తాం. అయితే ఆ బాటిల్ దేనితో తయారు చేసింది... అంటే నూటికి తొంభై పాళ్లు ‘ప్లాస్టిక్ బాటిల్’ అనే సమాధానం వస్తుంది. దాహం వేసినప్పుడు నీళ్లు తాగడం వల్ల ఎంత ఉపయోగమో, ప్లాస్టిక్ బాటిల్స్లో నీళ్లు తాగడం అంత ప్రమాదం. అది ఎండాకాలం అయితే కనక ఈ ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇంతకీ ఏమిటా నష్టాలు అంటారా? అదే చూద్దాం.. ప్లాస్టిక్ వాడకం ఎందుకంటే! ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి ముప్పు అని పదే పదే చెబుతున్నా కూడా ప్లాస్టిక్ ఇంకా వాడకంలోనే ఉండటానికి కారణం ఏమిటంటే, దానిని క్యారీ చేయడం చాలా సులువు. నిర్వహించడం ఇంకా సులువు. ఒకవేళ ఎక్కడైనా పెట్టి మరచిపోయినా పెద్ద ఖరీదు ఉండదు కాబట్టి దిగులు పడనక్కరలేదు. అందువల్ల పర్యావరణ ప్రేమికులు ఎంతగా నెత్తీ నోరు బాదుకుంటున్నా, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించే విషయంలో వెనకబడవలసి వస్తోంది. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయినా, భారీ ప్లాస్టిక్ కంటైనర్లు అయినా వాటి నుంచి నీరు తాగడం ప్రమాదకరం. ముఖ్యంగా ఎండలో ఎక్కువగా ఉంచిన ప్లాస్టిక్ బాటిల్స్లోని నీటిని అసలు తాగకూడదు. పరిశోధన ప్రకారం.. ►ప్లాస్టిక్ బాటిల్స్ మీద ఎండ పడితే.. అవి మైక్రోప్లాస్టిక్లను విడుదల చేస్తాయి. అలాంటి పరిస్థితుల్లో మనం ఈ నీటిని తాగితే.. శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను కాపాడే.. ఎండోక్రైన్ వ్యవస్థ ప్రభావితం అవుతుంది. ఇలాంటి నీటిని ఎక్కువగా తీసుకుంటే.. ఆరోగ్యం దెబ్బతింటుంది. కాలేయాన్ని కూడా పాడు చేస్తుంది. ►ఎండలో ఉండే.. ప్లాస్టిక్ బాటిల్ నుంచి డయాక్సిన్ లాంటి టాక్సిన్ నీటిలోకి విడుదల అవుతుంది. ఈ డయాక్సిన్ నీటిని తాగితే.. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ప్లాస్టిక్ బాటిల్ నీళ్లు తాగితే.. వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. మగవారిలో శుక్ర కణాల సంఖ్య కూడా తగ్గవచ్చు. ►బాటిల్ వాటర్లో మైక్రో ప్లాస్టిక్స్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ►మైక్రోప్లాస్టిక్స్ కలిసిన నీటిని తాగితే పొత్తి కడుపునకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యం, పీసీఓఎస్, ఒవేరియన్ సమస్యలు, బ్రెస్ట్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, ఇతర అనారోగ్య సమస్యలు రావొచ్చు. ►ప్లాస్టిక్ బాటిల్స్లో నీటిని తాగితే ఆరోగ్యానికి మంచిది కాదు. బయటకు వెళ్లినప్పుడు ప్లాస్టిక్ బాటిళ్లకు ఎండ తగిలితే.. అస్సలే తాగొద్దు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బాటిళ్లను కొంతమంది అలానే ఉపయోగిస్తారు. ఇంటికి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. ఇది ఇంకా అపాయకరమైనది. ఇలా అస్సలు చేయొద్దు ఎప్పుడూ. ఏం చేయాలి మరి? ►ప్లాస్టిక్ బాటిల్స్ అంతగా వాడుకలోకి రాని రోజుల్లో పెద్దవాళ్లు ఎక్కడికైనా వెళ్లేటప్పుడు స్టీలు లేదా ఇత్తడి మరచెంబులు తీసుకు వెళ్లేవారు. ఇప్పుడు కూడా అదే మంచిది. అందుకు తగ్గట్టు ఇప్పుడు మార్కెట్లో రకరకాల సైజుల్లో, ఆకారాలలో రాగి, స్టీలు, ఇత్తడి బాటిల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి కాస్తంత ఖరీదు ఎక్కువైనా, ప్లాస్టిక్ వాడకం వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలతో పోల్చుకుంటే ఫరవాలేదనిపిస్తుంది. ►ప్లాంట్ బేస్డ్ బాటిల్స్, గాజుసీసాలు, అల్యూమినియం వాటర్ క్యాన్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. మనం వాడకం మొదలు పెడితే ధరలు కూడా అందుబాటులోనే ఉంటాయి. చదవండి: ఆవకాయ.. పచ్చడి తయారీ ఇలా! నూనెను మరిగించకుండా పచ్చిగా వేసినా ఆహారంలో మునగాకు, మునక్కాయలు వారంలో రెండుసార్లైనా తీసుకోవాలి! ఇంకా.. -
కనిపించని ‘జీవా’
సాక్షి, హైదరాబాద్: బ్రాండెడ్ మంచినీటి సీసాల వినియోగంతో సాలీనా రూ.కోట్లలో అవుతున్న వ్యయాన్ని నియంత్రించడంతోపాటు అదనపు ఆదాయాన్ని పొందే ఉద్దేశంతో ఎంతో ఘనంగా ప్రారంభించిన ఆర్టీసీ సొంత నీటి బ్రాండ్ ఎక్కడా కానరావడం లేదు. జీవా బ్రాండ్ను ఆర్టీసీ నెలన్నర క్రితం ఎంతో అట్టహాసంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎంజీబీఎస్లో కార్పొరేట్ పద్ధతిలో ఆ బ్రాండ్ను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. దాదాపు ఆరు నెలలు శ్రమించి రెండు సంస్థలతో ఒప్పందం చేసుకుని ఈ నీటిని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఆర్టీసీ కృషి చేసింది. కానీ ఇప్పటివరకు ఇటు బస్టాండ్లలో కాని, ఆర్టీసీ బస్సుల్లో కానీ ఎక్కడా అది కనిపించటం లేదు. ఇప్పటికీ ప్రైవేటు బ్రాండెడ్ నీటినే వినియోగిస్తున్నారు. భారీగా వ్యయం చేయటంతోపాటు ప్రసార మాధ్యమాల ద్వారా ముమ్మరంగా ప్రచారం జరిగి ప్రజల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొన్న తర్వాత ఆ బ్రాండ్ కనిపించకపోవటం విశేషం. ♦ కేవలం బస్టాండ్లలోని దుకాణాల్లోనే కాకుండా క్రమంగా, మార్కెట్లోని ఇతర దుకాణాల్లో కూడా అందుబాటులోకి తెచ్చేలా చూడాలని నిర్ణయించారు. కానీ మార్కెట్లోని దుకాణాల్లో కాదు కదా కనీసం ఆర్టీసీ బస్సుల్లో కూడా అవి కనిపించడం లేదు. ఇక ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్భవన్లో అధికారులకు కూడా అవి అందుబాటులో లేకుండా పోయాయి. బస్సులు, ఆర్టీసీ కార్యాలయాల్లో ప్రైవేట్ బ్రాండ్ నీళ్లే.. ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు ఉచితంగా 500 మి.లీ. వాటర్ బాటిళ్లను అందిస్తారు. ఆర్టీసీ సొంతంగా జీవా పేరుతో నీటిని మార్కెట్లోకి తీసుకురావటంతో, ఇక బస్సుల్లో అవే నీళ్లు పంపిణీ జరుగుతాయని ప్రచారం చేసింది. కానీ తాజాగా బస్సుల్లో పంపిణీకి ఓ బడా బ్రాండెడ్ నీటి సీసాలు పెద్ద ఎత్తున డిపోలకు చేరాయి. ఇంతకాలం స్థానికంగా తయారయ్యే ఓ బ్రాండ్ సీసాలు పంపిణీ జరుగుతుండగా, తాజాగా ఓ అంతర్జాతీయ కంపెనీకి చెందిన బ్రాండ్ సీసాలు డిపోలకు చేరాయి. ప్రైవేటు బ్రాండెడ్ కంపెనీ నుంచి నీటి సీసాల కొనుగోలుకు సాలీనా రూ.5 కోట్ల వరకు ఖర్చవుతున్నట్టు సమాచారం. డిమాండ్ ఉన్నా కానరావడం లేదు.. ♦ ప్రకాశం, కాంతి అన్న అర్ధంలో వినియోగించే జీవా (జెడ్ఐవీఏ) అన్న హిబ్రూ భాష నుంచి పుట్టిన పేరును ఖరారు చేసిన ఆర్టీసీ ఆ నీటి సీసాల డిజైన్లో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఇప్పటి వరకు ఏ కంపెనీ వినియోగించని రీతిలో డైమర్ కటింగ్స్ డిజైన్ ఉన్న సీసా ఆకృతిని ఎంపిక చేసింది. చూడగానే ఆకట్టుకునేలా ఉన్నందున, ఆర్టీసీ బ్రాండ్ తోడు కావటంతో సాధారణ ప్రజలు కూడా దాని మన్నికపై నమ్మకంతో కొనే అవకాశం ఏర్పడుతుందని దీంతో ఈ నీటి విక్రయాల ద్వారా సాలీనా రూ.20 కోట్ల ఆదాయం పొందే వీలుందని ఆర్టీసీ అంచనా వేసింది. ప్రస్తుతం వేసని ప్రారంభం కావటంతో వాటర్ బాటిళ్ల విక్రయం ఊపందుకుంది. ఆర్టీసీ ప్రయాణికులు బస్టాండ్లలో నీటి సీసాలు కొని బస్కెక్కుతున్నారు. ఇలా మంచి డిమాండ్ ఉన్న సమయంలో కూడా ఆర్టీసీ నీళ్లు కనిపించడం లేదు. తయారీ కంపెనీల నిర్వాకంతోనే.. ఎంతో గొప్పగా జీవా బ్రాండ్ను ప్రారంభించినప్పటికీ, ఆ నీటిని, సీసాలను రూపొందించేందుకు ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీల నిర్వాకం వల్లనే సమస్యలు తలెత్తాయని సమాచారం. సీసాల ఆకృతి గొప్పగా ఉన్నప్పటికీ, వాటి నాణ్యత అత్యంత తీసికట్టుగా ఉన్నట్టు తెలిసింది. దీంతో ఆ బ్రాండ్పై చెడ్డపేరు వస్తుందనే వాటి మార్కెటింగ్ను ఆపేసినట్టు తెలిసింది. నాణ్యమైన సీసాలు, నీళ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాతనే ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. -
అభిమాని లేఖకు మంత్రి హరీశ్ రావు ఫిదా..
సాక్షి, సిద్దిపేట: హరీశ్రావు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్య బాధ్యతలు చూసే కీలక మంత్రిగా ఉన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషిచేస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తుంటారు. ప్లాస్టిక్ వాడకంతో భయంకరమైన కేన్సర్ బారినపడే ఆవకాశాలు ఉన్నాయని వారిని జాగృతం చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మరో మార్గం లేక మంత్రి కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ దప్పిక తీర్చుకొనే అత్యవసర పరిస్థితి ఏర్పడుతోంది. దీనిని గుర్తించిన ఓ వీరాభిమాని అమాత్యుడు హరీశ్రావు ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలంటూ శుక్రవారం దుబ్బాక పర్యటనలో మంత్రికి లేఖ అందించారు. మీ ఆరోగ్యమే మాకు మహాభాగ్యం..మీరు తప్పని పరిస్థితుల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వాడుతున్నారని, ఈ నీరు తాగడం వల్ల భయంకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నదన్నారు. ఇటీవల అంతర్జాతీయ ప్రముఖ రేడియాలజిస్టు డాక్టర్ విమల్ సోమేశ్వర్ ఇంటర్వ్యూలో చెప్పారని లేఖలో వివరించారు. దయచేసి ఇకపై కాపర్ వాటర్ బాటిల్ వినియోగించాలని మంత్రికి దుబ్బాక పరిధి మల్లాయపల్లికి చెందిన ఎంబీఏ విద్యార్థి కీసరి ప్రవీణ్ లేఖ అందించాడు. ప్రవీణ్ రాసినలేఖను చదివి తన ఆరోగ్యం పట్ల ఎంతో తపనతో రాశాడంటూ ఫిదా అయ్యాడు. ప్రవీణ్ కు మంత్రి ప్రత్యేకంగా ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపారు. సోషల్ మీడియాలో లేఖ హల్చల్ అవుతోంది. చదవండి: చివరిశ్వాస వరకూ ‘అమ్మవారి’తోనే.. -
రెస్టారెంట్ సిబ్బంది నిర్వాకం...వాటర్ బాటిళ్లలో యాసిడ్ అందించి...
పుట్లిన రోజు, పెళ్లి వేడుక లేక మనం ఆనందంగా ఉన్నప్పుడూ సరదాగా రెస్టారెంట్కి వెళ్లి స్నేహితులకు ట్రీట్ ఇచ్చి సెలబ్రెట్ చేసుకుంటాం. కానీ ఇప్పుడూ ఈ విచిత్రమైన సంఘటన గురించి వింటే రెస్టారెంట్కి వెళ్లాలంటేనే జంకుతారు. ఇక్కడొక కుటుంబం పుట్టిన రోజు వేడుకను జరుపుకునేందుకు రెస్టారెంట్కి వెళ్లి ఘోరమైన చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. ఈ ఘటన పాకిస్తాన్లోని ఒక రెస్టారెంట్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....పాకిస్తాన్లోని ప్రముఖ ఇక్బాల్ పార్క్లోని పోయిట్ రెస్టారెంట్లో ఒక కుటుంబం పుట్టిన రోజుల వేడుకలు జరుపుకుంది. ఐతే ఆ రెస్టారెంట్ సిబ్బంది నిర్లక్షపూరిత ధోరణితో సదరు కస్టమర్లకు భోజనంలో వాటర్ బాటిళ్లలో యాసిడ్ని సర్వ్ చేశారు. దీంతో ఆ బాటిల్ని ఉపయోగించి ఇద్దరి చిన్నారుల్లో ఒకరు చేతులు కడుక్కోగా, మరోకరు తాగారు. అంతే కొద్దిసేపటికి ఒకరు మంట మంట అని ఏడవడం, మరోకరు వాంతులు చేసుకుని అశ్వస్థకు గురవ్వడం జరిగిందని చిన్నారులు కుటుంబసభ్యలు చెబుతున్నారు. ఈ మేరకు బాధితుల కుటుంబం సభ్యుడు మహ్మద్ ఆదిల్ మాట్లాడుతూ తన మేనకోడలు రెండేళ్ల వాజిహ, మేనల్లుడు అహ్మద్, రెస్టారెంట్ సిబ్బంది అందించిన వాటర్ బాటిల్లోని యాసిడ్ కారణంగా తీవ్ర అశ్వస్థకు గురయ్యారని చెప్పారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఐతే మేనకోడలు వాజిహ పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పారు. భాదితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరుకు పోలీసులు సదరు రెస్టారెంట్ మేజర్ మహ్మద్ జావెద్ తోపాటు ఐదుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అలాగే దర్యాప్తు పూర్తయ్యే వరకు రెస్టరెంట్ని మూసేశారు. ఈ మేరకు పోలీస్ అధికారి తాహిర్ వాకస్ మాట్లాడుతూ..ఇది చాలా విచిత్రమైన సంఘటన అని, తాము ఈ కేసు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. (చదవండి: యూఎస్లో ఎనిమిదేళ్ల చిన్నారితో సహ భారత సంతతి కుటుంబం కిడ్నాప్) -
అరవింద్ కేజ్రీవాల్పైకి నీళ్ల సీసా విసిరిన వ్యక్తి
రాజ్కోట్: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై గుర్తుతెలియని వ్యక్తి ప్లాస్టిక్ వాటర్ బాటిల్ విసిరాడు. అది ఆయనకు తగలకుండా, తలపై నుంచి వెళ్లి ముందుపడింది. గుజరాత్లోని రాజ్కోట్లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. నగరంలో దేవీ నవరాత్రుల్లో భాగంగా గర్బా వేడుకలో కేజ్రీవాల్ పాల్గొన్నారు. నడుస్తూ అభివాదం చేస్తుండగా, ఇంతలో వెనుక నుంచి ప్లాస్టిక్ నీళ్ల సీసా దూసుకొచ్చింది. అది కేజ్రీవాల్ తల పైభాగం నుంచి ముందుకు వెళ్లింది. ఈ దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఆప్ మీడియా కో–ఆర్డినేటర్ తెలిపారు. Water bottle thrown at #ArvindKejriwal in Rajkot, Gujarat. Delhi CM had come to attend Garba program. pic.twitter.com/AqX5VN6aMV — Hemir Desai (@hemirdesai) October 2, 2022 చదవండి: రాహుల్ భారత్ జోడో యాత్రలో సోనియా గాంధీ -
ప్లాస్టిక్ నీళ్ల సీసాలతో '450 ఏళ్లు' ఇబ్బందే.. ఇక టూత్బ్రష్ అయితే ఏకంగా 500 ఏళ్లు!
సాక్షి, అమరావతి: అందరం సాధారణంగా మంచినీళ్ల సీసాను ఉపయోగిస్తుంటాం. కానీ ఒకసారి వాడి బయట పారేసే ఆ ప్లాస్టిక్ నీళ్ల సీసా నామరూపాలు లేకుండా మట్టిలో కలిసి పోవడానికి ఏకంగా 450 సంవత్సరాల సమయం పడుతుందట. అలానే.. మనం వాడిపారేసిన టూత్బ్రష్ మట్టిలో కలవాలంటే 500 సంవత్సరాలు కావాలంట. పెళ్లిళ్లు, ఇతర పార్టీల సమయంలో ఉపయోగించే ప్లాస్టిక్ గ్లాసులు భూమిలో కలిసిపోవడానికి 450 ఏళ్లు పడుతుంది. చివరకు అందరి చేతుల్లో కనిపించే ప్లాస్టిక్ కవర్ మట్టిలో కలవాలంటే 20 ఏళ్లదాక సమయం పడుతుంది. పర్యావరణానికి విపరీతమైన హానికలిగించే ఒకసారి ఉపయోగించిన తర్వాత పారేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ వస్తువుల వినియోగంపై ఈ ఏడాది జూలై 1 నుంచి నిషేధం విధించిన కేంద్రం.. ప్రజలందరూ నిత్యం ఉపయోగించే రకరకాల ప్లాస్టిక్ వస్తువుల ద్వారా కలిగే అనర్ధాల గురించి విస్తృత ప్రచారం మొదలుపెట్టింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో భాగంగా కేంద్ర జలశక్తి శాఖ పరిధిలో పనిచేసే గ్రామీణ మంచినీటి సరఫరా, పారిశుధ్య (డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్) విభాగం ఈ మేరకు కరపత్రాలను ముద్రించి రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వశాఖల ద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కలిగించే కార్యక్రమాలను మొదలుపెట్టింది. పొంచి ఉన్న ప్రమాదాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వినియోగం వల్ల పర్యావరణానికి విపరీతమైన హాని ఏర్పడుతుందని నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తూనే ఉన్నారు. ఒకసారి వాడి పారేసిన నీళ్ల సీసాలు ఒక్కొక్కటిగా చివరికి భూమి పొరల్లోకి చేరతాయి. ఇలా.. లక్షలు, కోట్ల ప్లాస్టిక్ సీసాలు 450 ఏళ్ల పాటు భూమి పొరల్లో ఉండి వర్షం నీరు కిందకు ఇంకకుండా అడ్డుపడడం వంటి కారణాలతో భూమిలోకి ఇంకే నీటిశాతం తగ్గిపోయి క్రమంగా భూగర్భ జలమట్టాలు బాగా తగ్గిపోతాయి. ఇప్పటికే ఇంట్లో వేసుకునే బోరు 300–400 అడుగులు మేర తవ్వాల్సి రావడం.. కొన్నిచోట్ల 500 అడుగుల మేర తవ్వినా నీరు పడకపోవడం సర్వసాధారణంగా కనిపించే అంశాలే. -
అక్కడ ఇరుక్కుపోయిన వాటర్ బాటిల్.. భార్యకు భయపడి చెప్పని భర్త.. చివరకు..
టెహ్రాన్: ఇరాన్లో అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఓ వ్యక్తికి సీటీ స్కాన్ తీసీ అవాక్కయ్యారు వైద్యులు. అతని మలద్వారంలో 19 సెంటీమీటర్ల వాటర్ బాటిల్ను గుర్తించి కంగుతిన్నారు. సీటీ స్కాన్ చేసే వరకు ఏం జరిగిందో సదరు వ్యక్తి చెప్పకపోడం చూసి ఆశ్చర్యపోయారు. ఆస్పత్రిలో చేరిన ఈ వ్యక్తి వయస్సు 50 ఏళ్లు. కొద్ది రోజులుగా మలబద్దకం, ఆకలి లేకపోవడం, తిమ్మిరి వంటి లక్షణాలు చూసి ఆందోళనతో ఆయన భార్య హాస్పిటల్కు తీసుకెళ్లింది. అయితే ఏం జరిగిందో అతను మాత్రం వైద్యులకు కూడా చెప్పలేదు. పరీక్ష నిర్వహించిన అనంతరం వైద్యులకు అసలు విషయం తెలిసింది. మలద్వారంలో వాటర్ బాటిల్ ఇరుక్కున్న విషయం తన భార్యకు చెబితే రియాక్షన్ ఎలా ఉంటుందోనని భయపడే భర్త ఈ విషయాన్ని దాచినట్లు వైద్యులు చెప్పారు. చివరకు మలద్వారం నుంచి వాటర్ బాటిల్ను బయటకు తీశారు. మూడు రోజుల అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉందని, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని చెప్పారు. అతని పెద్దపేగుకు, ఇతర అవయవాలకు ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు. అయితే బాధితుడు స్వయంగా తానే వాటర్ బాటిల్ను మలద్వారంలోకి ఇన్సర్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పొరపాటున ఇరుక్కు పోయి ఉంటుందని, లైంగిక సంతృప్తి కోసమే అతను ఇలా చేసి ఉంటాడని వైద్యులు పేర్కొన్నారు. చికిత్స అనంతరం అతడ్ని మానసిక వైద్యుడి దగ్గరకు పంపారు. చదవండి: (ట్రంప్ సోషల్ మీడియా డీల్ లీక్!) -
వీటిని ఎక్కువ కాలం వాడుతున్నారా?.. అయితే డేంజర్లో పడ్డట్టే!
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): మనం రోజూ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇంట్లో వివిధ వస్తువులను వినియోగిస్తుంటాం. వాటిని ఎంత కాలం ఉపయోగించాలనే విషయంపై చాలా మందికి అవగాహన లేదు. దీంతో ఎక్కువ కాలం వినియోగిస్తూనే ఉంటాం. కాలపరిమితి ముగిసిన వాటిని వాడితే ప్రమాదం పొంచి ఉంది. వీటితో పాటు వాడుకలో లేని వస్తువులను ఇంట్లోనే కుప్పలుగా వదిలేస్తుంటారు. వాటిల్లోనూ క్రిములు, బ్యాక్టీరియా వృద్ధి చెంది.. మనకు అనారోగ్య సమస్యలు తెచ్చి పెడతాయి. అలాంటి వాటిని సరైన సమయంలో మార్చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం లేవగానే పళ్లను శుభ్రం చేసుకునే బ్రష్ నుంచి రాత్రి పడుకునేందుకు వినియోగించే తలదిండు వరకు ఎలా ఉపయోగించాలి.. ఎప్పుడు మార్చాలి అనే విషయాలు తెలుసుకుందాం. చదవండి: నిజంగా ఏలియన్ల గుట్టు సముద్రాల్లో ఉందా? రెండింటి మధ్య లింకేంటి? మంచినీటి సీసా ఇంట్లో వినియోగించే మంచి నీళ్ల సీసాలు, వాటర్ క్యాన్ల విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. తరచూ వాటిని శుభ్రం చేసుకోవాలి. లేకపోతే అడుగు భాగంలో నాచు పట్టే వీలుంటుంది. మంచినీటి సీసాలను మాత్రం మూడు, నాలుగు నెలలకోసారి మార్చాలి. వీటితో పాటు మార్కెట్లో అప్పటికప్పుడు తాగేందుకు కొనుగోలు చేసే నీటి సీసాలను తిరిగి ఇంట్లో వాడడం హానికరం. పొపుల పెట్టె వంటింట్లో పప్పు దినుసులు వేసే డబ్బాలను తరచూ శుభ్రం చేసుకోవాలి. ఓ సారి వేసిన సరకు అయిపోగానే..డబ్బాలను మళ్లీ శుభ్రం చేసుకుని కొత్త సరకు వేసుకోవాలి. అంతేగాని నీటితో శుభ్రం చేయకుండా అలా ఏడాది పొడవునా సరకులు వేస్తూ ఉండకూడదు. అలా వేస్తే అందులో ఉండే కొన్ని బ్యాక్టీరియాలు సరకుల్లో చేరే వీలుంటుంది. వీలైతే ఏడాదికోసారి డబ్బాలను మార్చి కొత్తవి ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఇంట్లో పెంచుకునే మొక్కలు ఇంట్లోని కుండీల్లో పెంచుకునే మొక్కల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కుండీల్లో చెత్త వేయకూడదు. నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. లేకపోతే దోమలు వృద్ధి చెందే వీలుంటుంది. సాక్స్లు, దువ్వెన కాళ్లకు ధరించే సాక్స్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. కాలపరిమితి ముగిసిన వెంటనే పాతవాటిని మార్చి..కొత్తవి ఉపయోగించాలి. ఇంట్లో పాడైన చెప్పులు, బూట్లను బయట పారేయాలి. లేకపోతే క్రిములు వృద్ధి చెందే వీలుంటుంది. నిత్యం తల దువ్వేందుకు వినియోగించే దువ్వెన విషయంలోనూ శుభ్రత పాటించాలి. పాడైన, పళ్లు సరిగా లేని దువ్వెనను వినియోగించకూడదు. టూత్బ్రష్ ప్రతి ఒక్కరూ ఉదయాన్నే వినియోగించే టూత్ బ్రష్ను తప్పనిసరిగా ప్రతి మూడు నుంచి నాలుగు నెలల్లోపు మార్చాలి. బ్రష్ పాడవకపోయినా.. దానిని ఎక్కువ కాలం వినియోగిస్తే..పళ్లకు ఇబ్బంది కలగొచ్చు. చిన్న పిల్లల బ్రష్ల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. బ్రష్పై ఉండే కుచ్చు పాడైన వెంటనే కాలంతో సంబంధం లేకుండా మార్చేయాలి. పాడైన బ్రష్లతో కొందరు ఇంట్లోని వస్తువులను శుభ్రం చేస్తుంటారు. అలాంటి వాటిల్లోనూ క్రిములు చేరే వీలుంటుంది. అందుకే వినియోగంలో లేని వాటిని బయట పాడేయాలి. తలదిండులు చాలా మంది ఇంట్లో మంచాలపై ఉండే దుప్పట్లు, దిండుకవర్లను మాత్రమే సకాలంలో శుభ్రం చేస్తూ.. అప్పుడప్పుడు కొత్తవి మార్చుతుంటారు. కానీ దిండ్లను మార్చరు. నిత్యం వినియోగించే దిండ్లపై సూక్ష్మక్రిములు వేగంగా వృద్ధి చెందుతాయి. అవి మన తలలోకి చేరడంతో దురద, ఇతర సమస్యలు వస్తాయి. అందుకే కొంతకాలం వాడిన తర్వాత వాటిని మార్చుకోవాలి. లోదుస్తులు మనం ధరించే లోదుస్తులను క్రమం తప్పకుండా ఉతికి ఆరేసిన తర్వాతే ధరించాలి. వీలైతే వేడి నీటితో శుభ్రం చేసుకోవడం ఉత్తమం. అలా చేయని పక్షంలో కనీసం ఇస్త్రీ అయినా చేసి ధరించాలి. అప్పుడే వాటిల్లో ఉండే క్రిములు చనిపోతాయి. లోదుస్తుల్లో క్రిములు చాలా వేగంగా వ్యాప్తి చెందుతాయి. వాటితో మనకు తామర, గజ్జి వంటి చర్మ వ్యాధులు సోకే వీలుంటుంది. పాడవకపోయినా.. లోదుస్తులను కూడా ఏడాదికోసారి మార్చేయడం మంచిది. -
Smart Bottle: ఈ బాటిల్ కేవలం నీళ్లకే కాదు.. మ్యూజిక్ కూడా.. ధర రూ.3,257
ప్రతి ప్రయాణంలో మంచి నీళ్లు ఎంత అవసరమో.. స్నేహితులతో కలిసి చేసే ప్రయాణాల్లో ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ కూడా అంతే అవసరం. 3 ఇన్ 1 స్మార్ట్ ఇన్సులేటెడ్ వాటర్ బాటిల్ అందుకు సై అంటుంది. ఒక వాటర్ బాటిల్ ఎంటర్టైన్మెంట్ని అందించడమేంటీ అనేగా మీ డౌటనుమానం? అదే దీని స్పెషాలిటీ. దీనిలో మ్యూజిక్ స్పీకర్స్, డాన్సింగ్ లైట్స్ ఆన్ చేసుకోవచ్చు. వేడి నీళ్లు కావాలంటే వేడి నీళ్లు, చన్నీళ్లు కావాలంటే చన్నీళ్లూ ఇందులో నిలవ చేసుకోవచ్చు. 12 గంటల పాటు వేడి నీళ్లను వేడిగా, 24 గంటల పాటు చన్నీళ్లను చల్లగా ఉంచుతుంది. వైర్ లెస్ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ ఉండటంతో.. బ్లూటూత్ ద్వారా ఫోన్కి కనెక్ట్ చేసుకుని నచ్చిన పాటను పెట్టుకోవచ్చు. ఈ బాటిల్ని పార్టీల్లో, యోగా చేసే సమయాల్లో, వ్యాయామం చేసేటప్పుడు, క్యాంపింగ్ లేదా అవుట్ డోర్కి వెళ్లినప్పుడు వెంట పెట్టుకుంటే.. చక్కగా కావల్సిన మ్యూజిక్ వింటూ దాహం తీర్చుకోవచ్చు. ఇలాంటి బాటిల్ని మన సన్నిహితులకు లేదా కుటుంబ సభ్యులకు గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు. ఆరోగ్య స్పృహ ఉన్న ఆత్మీయులకు ఇలాంటి బాటిల్ బహుమతిగా ఇవ్వడం కూడా బాగుంటుంది. ధర: 42 డాలర్లు (రూ.3,257) -
Photo Feature: 'పానీ'పట్టు యుద్ధం
విజయవాడ కలెక్టరేట్ ప్రాంగణంలోకి ఆదివారం మధ్యాహ్నం కోతుల గుంపు వచ్చింది. బాగా దప్పికతో ఉన్నాయో ఏమో.. ఆ కోతులు నీటికోసం వెదుకులాడాయి. ఓ కోతికి నీళ్లబాటిల్ దొరింది. అయితే ఎలా తాగాలో అర్థంకాక సతమతమైంది. నీళ్లు తాగేక్రమంలో బాటిల్ కిందపడి నీళ్లు నేలపాలయ్యాయి. ఇంతలో ఓ నీళ్ల బక్కెట్ కోతుల కంటపడింది. ఒక్కొక్కటిగా బక్కెట్ వద్దకు చేరి కడుపునిండా నీళ్లు తాగి దప్పిక తీర్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
ఇది కాకి.. కడవ కాలం కాదు.. ఓ నయా వా‘నరుడి’ స్టోరీ!
బుచ్చినాయుడుకండ్రిగ(చిత్తూరు జిల్లా): ఇది కాకి..కడవ కాలం కాదు. ఒక్కో రాయి కడవలో వేసి నీళ్లు పైకి వచ్చాక దాహం తీర్చుకోవడానికి. ఇదో కారు.. తెలివైన కోతి స్టోరీ. దర్జాగా కారులోకి వెళ్లి వాటర్ బాటిల్తో దాహం తీర్చుకున్న నయా వా‘నరుడి’ గాథ! వేసవి తాపానికి ఇక్కడి చిత్రంలోని వానరం దప్పికతో నీళ్ల కోసం కటకటలాడింది. అటూ ఇటూ పరుగులు తీస్తూ స్థానిక తెలుగుగంగ కార్యాలయం వద్ద నిలిపి ఉన్న కారును వానరం చూసింది. చదవండి: మగతనం లేదని హేళన.. కాస్త శ్రుతిమించడంతో చివరికి ఏం జరిగిందంటే? దానికేదో ఐడియా వచ్చినట్లుంది కాబోలు..గ్లాస్ డోర్ తెరచి ఉండడంతో కారు లోపలికి జంప్ చేసింది. అక్కడో వాటర్ బాటిల్ కనిపించేసరికి చటుక్కున అంది పుచ్చుకుంది. ఇలా దర్జాగా కూర్చుని వాటర్ బాటిల్ మూత తీసి, ఆబగా తాగేసింది. హమ్మయ్య ఈ పూటకు ఓకే అని ఓ క్షణం రిలాక్స్ అయ్యింది. బాటిల్ను అక్కడే పడేసి మళ్లీ చెట్లల్లోకి జంప్ చేసింది. ఔరా! ఏమి తెలివి దీనిది అంటూ అక్కడివారు ఆశ్చర్యంగా చూశారు. మంగళవారం మిట్ట మధ్యాహ్నం ఈ వానరుడు తన చేష్టలతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. -
అవార్డుతో పాటు అభిమానుల మనసు గెలుచుకున్నాడు
Faheem Ashraf Won Fan Hearts.. పాకిస్తాన్ క్రికెటర్ ఫహీమ్ అశ్రఫ్ అభిమానుల మనసు గెలుచుకున్నాడు. మ్యాచ్ చూడడానికి వచ్చిన ప్రేక్షకుడు దాహంతో ఇబ్బందిపడుతున్న వేళ వాటర్ బాటిల్ను అందించి తన ఉదారతను చాటుకున్నాడు. నేషనల్ టి20 కప్లో భాగంగా సదరన్ పంజాబ్, సెంట్రల్ పంజాబ్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఇది చోటుచేసుకుంది. టాస్ గెలిచిన సెంట్రల్ పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా బౌండరీలైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఫహీమ్ అశ్రఫ్ను కొంతమంది అభిమానులు పిలిచారు. ఫహీమ్ వెనక్కి తిరిగి చూడగానే ఆ గుంపులో ఒకడు దాహంగా ఉందని.. తాగేందుకు వాటర్ బాలిల్ ఇవ్వాలని కోరాడు. వెంటనే ఫహీమ్ స్టాండ్స్ దగ్గరకు వచ్చి తన దగ్గరున్న వాటర్బాటిల్ను వారి మధ్యకు విసిరాడు. అనంతరం తమకు సాయం చేసినందుకు ఫహీమ్కు థ్యాంక్స్ చెబుతూ గట్టిగట్టిగా అరిచారు. దీనికి సంబంధించిన వీడియో యూట్యూట్లో ట్రెండింగ్గా మారింది. ఇక మ్యాచ్లో సెంట్రల్ పంజాబ్ను విజయం వరించింది. 120 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సెంట్రల్ పంజాబ్ 19 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. ఇక ఈ మ్యాచ్లో ఫహీమ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా గెలుచుకోవడం విశేషం. ఇక ఫహీమ్ అశ్రఫ్ పాకిస్తాన్ తరపున 11 టెస్టుల్లో 594 పరుగులు.. 31 వన్డేల్లో 218 పరుగులు.. 42 టి20ల్లో 259 పరుగులు సాధించాడు. చదవండి: టీ20ల్లో చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. గేల్, కోహ్లి రికార్డులు బద్దలు Sehwag- SRH: 'నిద్రమాత్రల్లా కనిపించారు.. ఆ నాలుగు ఓవర్లు నిద్రపోయా' -
Kohli Vs Root: రూట్ పట్టించుకోలేదు.. కానీ కోహ్లి మాత్రం
లండన్: ఇంగ్లండ్తో ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో టీమిండియా 2-1 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక చివరిదైన ఐదో టెస్టు మ్యాచ్ రేపటి నుంచి (శుక్రవారం,సెప్టెంబర్ 10న) జరగనుంది. ఈ విషయం పక్కనపెడితే.. నాలుగో టెస్టులో టీమిండియా విజయం అనంతరం ఆటగాళ్లు ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాకా డ్రెస్సింగ్ రూమ్కు బయలుదేరారు. చివరగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ వచ్చారు. చదవండి: Kohli Winning Celebration: వినిపించడం లేదు.. ఇంకా గట్టిగా పెవిలియన్ మార్గంలో ఒక వాటర్ బాటిల్ కింద పడి ఉంది. కోచ్తో కలిసి మాట్లాడుకుంటూ వస్తున్న రూట్ కిందపడి ఉన్న వాటర్ బాటిల్ను గమనించినప్పటికీ దానిని పట్టించుకోలేదు. మెట్లు ఎక్కి పైకి వచ్చేటప్పుడు అక్కడే ఉన్న కెమెరామన్ రూట్కు ఆ వాటర్ బాటిల్ను చూపించాడు. ఆ తర్వాత ఫ్రేమ్లోకి కోహ్లి వచ్చాడు. అయితే కోహ్లి మాత్రం కిందపడిన వాటర్ బాటిల్ను తనతో పాటు డ్రెస్సింగ్రూమ్కు తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ఇన్స్టాగ్రామ్లో వైరల్గా మారింది. ఇది చూడడానికి చిన్నవిషయంలా కనిపించినా.. అభిమానులు మాత్రం తమదైన శైలిలో పోల్చారు. '' కోహ్లి ఎంత అగ్రెసివ్గా ఉన్న తన ప్రవర్తనతో అభిమానుల మనసులు ఎప్పటికీ గెలుచుకుంటూనే ఉంటాడు... రూట్ను ఇక్కడ కించపరచాలని కాదు.. కేవలం ఫన్నీవేలో మాత్రమే పేర్కొంటున్నాం.. కోహ్లికి ఎంత గొప్ప మనసు ఉందో మరోసారి చూశాం..'' అంటూ కామెంట్లు చేశారు. చదవండి: ఇలాంటి విజయం ఊహించలేదు.. మా కుర్రాళ్లు అద్భుతం -
విరాట్ కోహ్లి తాగే లీటర్ వాటర్ బాటిల్ ఖరీదు ఎంతో తెలుసా?
ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఫిట్నెస్ కోసం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కోహ్లి విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూనే తన ఫిట్ నెస్ పై బాగా శ్రద్ద చూపిస్తుంటారు. ఆయన చేసే వర్కౌట్ వీడియోలను సోషల్ మీడియాలో తన అభిమానులతో ఎప్పటికప్పుడు పంచకుంటాడు కూడా. ఇక తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకునే విరాట్ కోహ్లీ తాగే మంచినీటి బాటిల్ ఖరీదు తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే. ఎందుకంటారా..తాను బ్లాక్ వాటర్ తాగుతానని చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకోచ్చాడు. ఈ నీళ్ళలో హైడ్రేటెడ్గా ఉండడమే కాకుండా.. పీహెచ్ అధికంగా ఉంటుంది. చదవండి: T20 World Cup 2021: ‘ఈసారి విజేత భారత్ కాదు.. ఆ జట్టే గెలుస్తుంది సాధారణంగా మనం తాగే లీటర్ వాటర్ బాటిల్ ఖరీదు.. రూ. 20 నుంచి ఆపై మరికాస్త ఖరీదు ఉండొచ్చు.. అయితే ఈ బ్లాక్ వాటర్ ధర లీటరుకు రూ.3000 నుంచి రూ.4000 వరకు ఉంటుంది. ఈ నీళ్ళలో సహజసిద్ధమైన బ్లాక్ ఆల్కలీన్ శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్గా ఉండేలా చేస్తుంది. బ్లాక్ వాటర్లో పీహెచ్(pH) ఎక్కువగా ఉంటుంది. ఈ బ్లాక్ వాటర్ చర్మ నాణ్యతను మెరుగుపరచడంతో పాటు, బరువును కూడా అదుపులో ఉంచుతుంది. కరోనా నేపథ్యంలో చాలా మంది సెలబ్రిటీలు బ్లాక్ వాటర్ తాగుతున్నారు. బాలీవుడ్ హీరోయిన్లు ఊర్వశి రౌటేలా మలైకా అరోడా, శ్రుతిహాసన్ ఫిట్గా ఉండేందుకు బ్లాక్ వాటర్ తాగుతున్నారు. చదవండి: సచిన్లో ఆ బలహీనత గమనించా.. దిగ్గజ స్పిన్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు View this post on Instagram A post shared by EvocusH2O Global (@evocus_water) -
నెక్లెస్ రోడ్లో ఆకట్టుకుంటోన్న వినూత్న బాటిల్ డస్ట్బిన్
సాక్షి, బంజారాహిల్స్: నెక్లెస్ రోడ్...నిత్యం వేలాది మంది నగర వాసులు, పర్యాటకులతో కళకళలాడుతూ ఉండే మార్గం. అయితే, ఇక్కడికి వచ్చే పర్యాటకులు తాము తాగే వాటర్ బాటిళ్లను ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు. దీని ద్వారా పారిశుధ్యం సమస్య తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ సైతం స్పందించి ప్రజలను ఈ విషయంలో చైతన్యపరచాలని ఆదేశించారు. దీంతో ఖాళీ బాటిళ్లను డస్ట్బిన్లో మాత్రమే వేయాలని చైతన్య పరిచే విధంగా జీహెచ్ఎంసీ అధికారులు వాటర్ బాటిల్ మాదిరిగా ఐరన్తో చేసిన పెద్ద బాటిల్ నమూనాను నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేశారు. ఈ వినూత్న బాటిల్ డస్ట్బిన్ సందర్శకులను ఆకట్టుకుంటోంది. -
వామ్మో..! యాసిడ్ తాగేసిన తహసీల్దార్
జమ్మూ: విధుల్లో భాగంగా తహసీల్దార్ ఓ గ్రామానికి వెళ్లగా అక్కడ పని ముగిసిన తర్వాత దుకాణంలో నీళ్ల బాటిల్గా భావించి యాసిడ్ బాటిల్ తీసుకుని తాగేశాడు. వెంటనే అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని తోటి ఉద్యోగులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉంది. అయితే దుకాణదారుడు నీళ్ల బాటిల్ అనుకుని పొరపాటున యాసిడ్ బాటిల్ ఇచ్చాడు. దీంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన జమ్మూకశ్మీర్లో బుధవారం జరిగింది. కుల్గాం జిల్లాలోని దమాల్ హంజిపూర ప్రాంత తహసీల్దార్ నియాజ్ అహ్మద్ ఓ గ్రామంలో సాగు చేస్తున్న గసగసాల పంట పొలాలను పరిశీలించారు. అనంతరం వాటిని ధ్వంసం చేసి ఉదయం 11 గంటల సమయంలో అక్కడే ఉన్న ఓ దుకాణానికి వెళ్లారు. నీళ్ల బాటిల్ అడగ్గా దుకాణదారుడు పొరపాటున యాసిడ్ బాటిల్ ఇచ్చాడు. ఇది గమనించకుండా తహసీల్దార్ నియాజ్ అహ్మద్ తాగేశాడు. తాగిన వెంటనే ఆయన అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే తోటి ఉద్యోగులు స్థానికులతో కలిసి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన దమాల్ హంజిపురలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన అధికారులు దుకాణదారుడిని అరెస్ట్ చేసి అతడిని పోలీస్స్టేషన్కు తరలించారు. చదవండి: అయ్యో పాపం.. అదా రాణి! -
చెంప చెళ్లుమనిపించిన మహిళ, ఫుట్పాత్ వ్యాపారి దాడి
సాక్షి, రాంగోపాల్పేట్: వస్తువులు కొనుగోలు చేయలేదని మహిళను ఫుట్పాత్ వ్యాపారి అసభ్యకరంగా మాట్లాడాడు. దీంతో ఆగ్రహించిన మహిళ చెంప దెబ్బకొట్టింది. మరింత ఆగ్రహానికి లోనైన వ్యాపారి మహిళపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం అడ్డగుట్టకు చెందిన లక్ష్మి హౌస్కీపింగ్ చేస్తోంది. బుధవారం రెతిఫైల్ బస్టాప్ మీదుగా ఆటోలో ఇంటికి వెళ్లేందుకు నడుచుకుంటూ తన స్నేహితురాలితో కలిసి వెళ్తోంది. రేతిఫైల్ బస్టాండ్ ఎదురుగా ఖాజా వాటర్ బాటిళ్లు విక్రయిస్తుండగా లక్ష్మి ఎంత? అని అడిగింది. ధర ఎక్కువ చెప్పడంతో వద్దని వెళ్తుండగా ఖాజా ఆమెను బూతులు తిట్టాడు. ఆగ్రహానికి లోనైన ఆమె చెంప చెల్లుమనిపించింది. దీంతో ఫుట్పాత్ వ్యాపారి ఆమెపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. వెంటనే ఆమె గోపాలపురం పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే వ్యాపారి గతంలోనూ వినియోగదారుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అయినట్లు తెలిసింది. స్టేషన్ వద్ద వ్యాపారిపై దాడి మహిళ ఫిర్యాదు మేరకు గోపాలపురం పోలీసులు ఖాజాను పోలీస్ స్టేషన్కు పిలిపించారు. అదే సమయంలో మహిళ బంధువు ఒకరు అక్కడికి చేరుకుని ఖాజాపై దాడి చేశాడు. దీంతో అతడిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: లాఠీచార్జి అంటూ ప్రచారం: యూట్యూబ్ చానల్పై కేసు -
నీళ్ల బదులు శానిటైజర్ తాగిన కమిషనర్
సాక్షి, ముంబై : నీళ్ల బాటిల్ అనుకుని పొరపాటున శానిటైజర్ తాగిన ఘటన సోషల్ మీడియాలో నవ్వులు తెప్పిస్తోంది. కొద్దిగా శానిటైజర్ తాగిన అనంతరం వెంటనే సిబ్బంది అప్రమత్తమవడంతో ఆయన శానిటైజర్ను ఉమ్మేసి అనంతరం నీళ్లు తాగారు. శానిటైజర్ తాగినట్లు గుర్తించిన ఆ అధికారి నవ్వడంతో తోటి అధికారులు కూడా నవ్వుకున్నారు. ఈ ఘటన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో జరిగింది. 2021-22 సంవత్సరానికి విద్యా శాఖ బడ్జెట్ను బీఎంసీ అసిస్టెంట్ కమిషనర్ రమేశ్ పవార్ సమర్పిస్తున్నారు. నివేదిక ఇచ్చిన అనంతరం అందరూ కూర్చున్న సమయంలో నీళ్లు తాగేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో నీళ్ల బాటిల్ అనుకుని శానిటైజర్ డబ్బాను తీసుకొని తాగారు. ఆయన వెంట నిల్చున సహాయక సిబ్బంది వెంటనే గమనించి వారించారు. అయితే అప్పటికే ఆయన కొద్దిగా శానిటైజర్ తాగారు. వెంటనే ఉమ్మి వేసి నవ్వారు. అనంతరం సిబ్బంది నీళ్ల సీసా అందించారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
పుదుచ్చేరి జిల్లా కలెక్టర్పై విష ప్రయోగం?
సాక్షి ప్రతినిధి, చెన్నై: పుదుచ్చేరి జిల్లా కలెక్టర్ పూర్వ గార్గ్పై విష ప్రయోగం జరిగిందన్న అభియోగాలతో సీబీ–సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ వైఖరిని వ్యతిరేకిస్తూ సీఎం నారాయణస్వామి నేతృత్వంలో శుక్రవారం రాజ్నివాస్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమం బందోబస్తు ఏర్పాట్లపై చర్చించేందుకు కలెక్టరేట్లో అధికారులు గురువారం సమావేశమయ్యారు. సమావేశంలో పాల్గొన్న అధికారులకు ప్రైవేటు కంపెనీకి చెందిన తాగునీటి సీసాలను అందజేశారు. కలెక్టర్ పూర్వగార్గ్ వాటర్ బాటిల్ తెరవగానే స్పిరిట్ వంటి రసాయనం వాసన గుప్పుమనడంతో తాగకుండా అధికారులకు అప్పగించారు. దీనిపై విచారణ జరపాలని ఆదేశించారు. మిగతా బాటిళ్లలో మాత్రం స్వచ్ఛమైన నీరే ఉంది. జిల్లా కలెక్టర్కు అందజేసిన బాటిల్లోని నీరు మాత్రమే విషతుల్యంగా ఉండడంతో అధికారులు హతాశులయ్యారు.ఈ ఘటనను లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఖండించారు. లెఫ్టినెంట్ గవర్నర్కి వ్యతిరేకంగా సీఎం నారాయణస్వామి శుక్రవారం ధర్నా చేశారు. -
రాగి.. ఆరోగ్యరహస్యమేగి
సాక్షి, అదిలాబాద్: రాత్రి పడుకునే ముందు రాగి చెంబులో నీరు పోసి ఉదయం తాగితే ఆరోగ్యంగా ఉంటారని పెద్దలు చెబుతుంటారు. గతంలో రాగి చెంబులను ఎక్కువగా ఉపయోగించేవారు. ప్రస్తుతం ప్లాస్టిక్ గ్లాస్లులు, ప్లాస్టిక్ ప్లేట్లు, నిత్యావసర వస్తువులన్నీ ప్లాస్టిక్ కావడంతో అనారోగ్యనికి గురవుతున్నారు. మారుతున్న జీవన విధానంలో 30ఏళ్లలోపు వారికి కూడా గుండె జబ్బులు, బీపీ, షుగర్, అల్సర్ వంటి వ్యాధులు వస్తున్నాయి. దీంతో పట్టణ ప్రాంత ప్రజలతో పాటు గ్రామీణ ప్రజలు కూడా ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. దీంట్లో భాగంగానే రాగి వినియోగం అమాంతం పెరిగింది. ఇళ్లలోనే కాకుండా రెస్టారంట్లలో కూడా రాగి పాత్రలను వాడుతున్నారు. రాగి పాత్రలోని నీరు ఆరోగ్యకరం రాగి పాత్రల్లో నీటిని తాడగం, రాగి ప్లేట్లల్లో భోజనం చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎలాంటి వ్యాధులు కూడా సోకవు. జీర్ణశక్తి పెరగడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రాగి పాత్రల విలువ తెలుస్తోంది నేను ఇప్పటికీ రాగి చెంబులోనే నీటిని తాగుతా. నాతో పాటు మా ఇంట్లోని వారందరూ కూడా రాగి పాత్రలనే వాడుతారు. రాగి పాత్రల వాడకం వల్ల ఎలాంటి వ్యాధులు రావు. -నల్లా రత్నాకర్ రెడ్డి, రిటైర్డ్ టీచర్ ఆ నీటిని తాగితే ఎంతో మేలు.. ప్రస్తుతం రాగి బాటిళ్లలోనే నీటిని ఎక్కువగా వినియోగిస్తున్నాం. రాగి పాత్రల్లోని నీటిని తాగితే ఆరోగ్యంతో పాటు ఎలాంటి రోగాలు దగ్గరకు రావు. -రాంరెడ్డి, తహసీల్దార్ -
బాటిల్లో చిక్కి.. తాచుపాము పిల్ల హల్చల్
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ తూర్పు ప్రాంతంలోని జంటగోపురాల వద్ద శుక్రవారం ఉదయం తాచుపాము పిల్ల కొద్దిసేపు హల్చల్ చేసింది. అక్కడ పడి ఉన్న ఒక వాటర్ బాటిల్లోకి దూరిన ఆ పాము పిల్ల బయటకొచ్చేందుకు అష్టకష్టాలు పడుతూ.. పడగ విప్పి చూడటం మొదలు పెట్టింది. అంత చిన్న పాము పిల్ల పడగ విప్పి చూస్తుండటాన్ని అక్కడున్న భక్తులంతా ఆసక్తిగా తిలకించారు. ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఒక హోంగార్డు ధైర్యం చేసి ఆ బాటిల్కు మూతపెట్టి, పాము పిల్లను బందీ చేశాడు. అనంతరం కొండపైకి దూరంగా తీసుకెళ్లి పొదల్లో విడిచిపెట్టాడు. -
ప్లాస్టిక్ బాటిల్ వేస్తే ముక్కలే
సాక్షి, కాజీపేట : పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ మేరకు కేంద్రప్రభుత్వం రైల్వే స్టేషన్లలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు చేపడుతోంది. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ రైల్, స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కలిగిస్తోంది. ఇందులో భాగంగా ప్లాస్టిక్ను క్రమక్రమంగా నిర్మూలించేందుకు కృషి జరుగుతోంది. ప్లాస్టిక్ వల్ల కలిగే దుష్పరిణామాలు, నష్టాల గురించి విస్తృత ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే నగరంలోని వరంగల్, కాజీపేట రైల్వేస్టేషన్లలో ఇటీవల ‘బాటిల్ క్రషింగ్ మిషన్’లను ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు ఈ మిషన్లు పని చేస్తాయి. అలవాటు చేసేందుకు.. రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేసిన యంత్రాల వాడకాన్ని ప్రయాణికులకు అలవాటు చేసేందుకు రైల్వే అధికారులు కృషి చేస్తున్నారు. పూణే రైల్వే స్టేషన్లో ఏర్పాటుచేసిన ఈ యంత్రంలో బాటిల్ వేసినట్లయితే పేటీఎం ద్వారా రూ.5 జమ అవుతున్నాయి. ఇదే విధాన్ని అన్ని స్టేషన్లలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ప్లాస్టిక్ వల్ల అనర్థాలపై ప్రజలకు అవగాహన కలుగుతున్నందున చాలా మంది రైల్వే స్టేషన్లలోని యంత్రాల్లో ఈ బాటిళ్లు వేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడే.. నిత్యం రైళ్ల ద్వారా వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈక్రమంలో తాము నీళ్లు తాగిన ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లను ఎక్కడ పడితే అక్కడ పడవేస్తున్నారు. దీంతో చెత్త గుట్టలుగా పేరుకుపోతుంది. దీనిని నివారించేందుకు రైల్వే స్టేషన్లలో బాటిల్ క్రషింగ్ యంత్రాలు ఏర్పాటుచేశారు. ఎవరైనా తమ వద్ద ఉన్న ప్లాస్టిక్ బాటిల్ను ఇందులో వేస్తే బాటిల్ చూరచూర అవుతుంది. తద్వారా చెత్త పేరుకుపోదని భావిస్తున్నారు. ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లు, కప్పులు, గ్లాస్లు, ప్లేట్లు ఇతర ప్లాస్టిక్ వస్తువులను ఈ యంత్రంలో వేస్తే కింది భాగానికి చేరి చిన్నచిన్న ప్లాస్టిక్ ముక్కలుగా మారుతోంది. ఆ ముక్కలను ప్లాస్టిక్ వ్యర్థాలు కరగదీసే ఫ్యాక్టరీకి పంపించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. బాటిల్ క్రషింగ్ యంత్రాలకు ఏర్పాటుచేసిన స్క్రీన్ ద్వారా ప్లాస్టిక్ వల్ల అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ స్క్రీన్పై ఆడియో, వీడియో చిత్రాలు ప్రదర్శితమవుతుంటాయి. ప్లాస్టిక్ వస్తువులను ఏ విధంగా వేయాలి, వేసిన ప్లాస్టిక్ వస్తువులు ఏమైవుతున్నాయి, ప్లాస్టిక్ పేరుకుపోవడం వల్ల వచ్చే అనర్థాలు, ప్లాస్టిక్తో దేశ భవిష్యత్కు ఉన్న ముప్పు వివరాలను ఇంగ్లిష్ భాషలో వివరిస్తుంటారు. -
ఆ రైల్లో ఇక అర లీటరు బాటిళ్లే
న్యూఢిల్లీ: నీటి వృథాను అరికట్టే ప్రయత్నంలో భాగంగా శతాబ్ది రైళ్లలో ప్రయాణించేవారికి ఒక లీటరు ‘రైల్నీర్’ నీటి సీసాల బదులు అరలీటరు నీటి సీసాలను ఇవ్వాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ మేరకు 8.5 గంటల్లోపు ప్రయాణం చేసే శతాబ్ది రైళ్లలో ఇకపై ఒక లీటర్ నీటి సీసాలను ఇవ్వవద్దని ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం శతాబ్ది రైల్లో 5 గంటల ప్రయాణం చేసే వారికి అరలీటరు సీసాలను, అంతకంటే ఎక్కువ సేపు ప్రయాణం చేసేవారికి ఒక లీటరు నీటి సీసాలను అందిస్తున్నారు. నూతన ఆదేశాల ప్రకారం ప్రయాణికులు అడిగితే అదనపు సీసాలు ఇస్తామని, కానీ వాటికి నగదు చెల్లించాల్సి ఉంటుందన్నారు. -
ప్లాస్టిక్కే.. పెనుభూతమై..
ప్లాస్టిక్ భూతం మానవాళికి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.. నదీ, సముద్ర జలాలను కలుషితం చేస్తూ జీవరాశి ప్రాణాలను హరిస్తోంది.. భూగర్భ జలాలను విషతుల్యం చేస్తూ మనకు అనారోగ్యాన్ని తెచ్చిపెడుతోంది భూమిలో వందల ఏళ్లపాటు తిష్ట వేసి భూసారాన్ని పీల్చి పిప్పి చేస్తూ పంటల దిగుబడిని దెబ్బతీస్తోంది.. కాలుస్తుంటే గాలిని కలుషితం చేస్తూ వ్యాధులకు దారితీస్తోంది.. ఆకాశాన్నంటుతున్న కాలుష్యంతో భూతలం మీద జీవుల ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తోంది.. మన దైనందిన జీవితంలో భాగంగా మారిన ప్లాస్టిక్ కలిగిస్తున్న పెనుముప్పు ఇది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) లెక్కల ప్రకారం.. దేశంలో ప్రతి ఒక్కరు ఏడాదికి సగటున 11 కిలోల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడుతున్నారు. ఈ లెక్కన మన దేశంలో 130 కోట్ల జనాభా ఏడాదికి 1,430 కోట్ల కిలోల ప్లాస్టిక్ను వినియోగిస్తున్నారు. దేశంలో తలసరి ప్లాస్టిక్ వినియోగం ఏడాదికి 2022 నాటికి 20 కిలోలకు, 2025 నాటికి 25 కిలోలకు చేరుతుందని అంచనా. కాగా.. అమెరికాలో ప్రతి ఒక్కరూ ఏడాదికి సగటున 109 కిలోలు, చైనాలో 38 కిలోలు వినియోగిస్తున్నారు. సాక్షి, అమరావతి: ఉదయం లేచాక ఇంటికి టిఫిన్ తెచ్చుకోవడం నుంచి ఇంటికి కావాల్సిన సరుకులు, కూరగాయలు, పండ్లు, పిల్లలకు చిరుతిండ్లు, ఆన్లైన్ షాపింగ్ల వరకు.. మరెన్నో రకాలుగా లెక్కకు మిక్కిలిగా సింగిల్ యూజ్ (ఒకసారి వాడి పారేసేది) ప్లాస్టిక్ కవర్లు, వస్తువులు మన ఇంటిలో చేరుతున్నాయి. మన దేశంలో రోజుకు 26 వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పోగుపడుతున్నాయని అంచనా. ఇందులో మున్సిపాలిటీలు, పంచాయతీలు సేకరించని వ్యర్థాలు దాదాపు 10 వేల టన్నులు. అంటే.. ఆ వ్యర్థాలన్నింటినీ రీసైక్లింగ్ చేయడం లేదు. వీటికి అదనంగా ఆన్లైన్ మార్కెటింగ్, ఆహార పదార్థాల డెలివరీ యాప్ల ద్వారా నెలకు 22 వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు అదనంగా చేరుతున్నాయి. ఈ వ్యర్థాలన్నీ మన కాలనీల్లో, ఊళ్లల్లో, రోడ్ల పక్కన, పర్యాటక ప్రదేశాల్లో.. ఇలా ఎక్కడ పడితే అక్కడ గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి కొన్నాళ్లకు కాలువలు, చెరువులు, నదులు, సముద్రాల్లో చేరుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రోజూ 8 మిలియన్ల ప్లాస్టిక్ ముక్కలు సముద్ర జలాల్లో కలుస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే 2050 నాటికి సముద్రంలో చేపల బరువు కంటే ప్లాస్టిక్ వ్యర్థాల బరువే ఎక్కువగా ఉంటుందని ఎలన్ మెక్థన్ ఫౌండేషన్ అంచనా వేసింది. చట్టాలు ఏం చెబుతున్నాయంటే.. 2016లో కేంద్రం రూపొందించిన ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనల ప్రకారం.. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు స్థానిక సంస్థలు బాధ్యత వహించాలి. రోజువారీ వచ్చే చెత్తను తడి, పొడి వ్యర్థాలుగా విభజించి ఇంటింటికీ వెళ్లి సేకరించడం, వాటిని రీసైక్లింగ్ చేయడం, అనంతరం మిగిలిన వ్యర్థాలను సక్రమంగా నిర్వహించడం చేయాలి. ఈ నిబంధనలకు 2018లో కేంద్రం సవరణలు చేసి ప్లాస్టిక్ వ్యర్థాలు వెదజల్లే సంస్థలనే బాధ్యులను చేసింది. రీసైక్లింగ్ చేయడానికి వీలులేని మల్టీలేయర్ ప్లాస్టిక్ (చిప్స్ ప్యాకెట్లకు వాడేది)ను రెండేళ్లలో పూర్తిగా నిషేధించాలి. ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనను కేంద్రం రెండేళ్లపాటు వాయిదా వేసింది. దేశంలో సింగిల్యూజ్ ప్లాస్టిక్, 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ను నిషేధించినా అమలు సక్రమంగా లేదు. చాలా రాష్ట్రాల్లో తూతూమంత్రంగా సాగుతోంది. ప్రభుత్వాలు ఏం చేయాలి? - సింగిల్యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తిని నిషేధించాలి. ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలి. - ప్లాస్టిక్ వ్యర్థాలతో కొత్త ఉత్పత్తులను ప్రోత్సహించాలి. ప్లాస్టిక్తో పర్యావరణానికి హాని కలిగించే సంస్థలకు భారీ జరిమానాలు విధించాలి. ప్యాకింగ్ అవసరాల కోసం ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టాలి. - సిక్కిం దేశంలోనే తొలిసారిగా 1998లోనే సింగిల్యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించింది. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి.. సమర్థంగా అమలు చేస్తోంది. సిక్కింను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలి. ప్రజలు ఏం చేయాలి? - ఇళ్లల్లో సింగిల్యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా మానుకోవాలి. రాగి, గాజు నీళ్ల సీసాలు వాడాలి. - పాలు, ఇతర పదార్థాలు, వస్తువుల ద్వారా వచ్చే ప్లాస్టిక్ కవర్లను చెత్తతో కలిపి పారేయకుండా ఒకచోట ఉంచి నెలకోసారి వాటిని పాత సామాన్లు, పాత పేపర్లు కొనేవారికి విక్రయించాలి. ఇలా చేస్తే వాటి రీసైక్లింగ్ సాధ్యమవుతుంది. - మార్కెట్కు వెళ్లేటప్పుడు చేతి సంచీ తీసుకెళ్లడంతోపాటు వాహనాల్లోనూ ఓ సంచీ పెట్టుకోవాలి. సంప్రదాయ, దేశీయ విధానాలే ఉత్తమం.. ప్లాస్టిక్ భూతాన్ని పారదోలాలి అంటే మనం పాత పద్ధతులనే అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. గతంలో ఫంక్షన్లలో భోజనాలకు ఆకులతో చేసిన విస్తర్లు/అరటి ఆకులు వేసేవారు. సరుకుల ప్యాకింగ్కు పాత పత్రికలు, చిత్తు కాగితాలు వాడేవారు. విస్తర్లు, పేపర్ కవర్ల తయారీ కుటీర పరిశ్రమగా ఉండి ఎంతోమందికి స్వయం ఉపాధి లభించేది. అదేవిధంగా జనపనార ఉత్పత్తుల వాడకాన్ని కూడా పెంచాలి. కొద్ది రోజుల కిందట తమిళనాడులో ఒక ఆవు అనారోగ్యంతో ఉండటంతో దాని యజమాని వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ యూనివర్సిటీ ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించగా పరిశీలించిన వైద్యులు దాని కడుపులో భారీగా ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయని తేల్చారు. ఏకంగా ఐదు గంటలపాటు ఆవుకు శస్త్రచికిత్స నిర్వహించి ఆ వ్యర్థాలను బయటకు తీశారు. అవి ఏకంగా 52 కిలోలు ఉండటం చూసి నివ్వెరపోయారు. రోడ్లపై ప్లాస్టిక్ వ్యర్థాలు ఎలా పెరిగిపోతున్నాయనేదానికి, ఎలాంటి అనర్ధాలు సంభవిస్తాయి అనేదానికి ఈ ఘటన ఓ ఉదాహరణ. ప్లాస్టిక్తో నష్టాలెన్నో.. - నదులు, సముద్ర జలాల్లో కలిసే ప్లాస్టిక్ వ్యర్థాలను చేపలు, కొన్ని అరుదైన తాబేళ్లు, తిమింగలాలు తిని మరణిస్తున్నాయి. విషతుల్యమైన చేపలను తిని ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. - వేడి ఆహార పదార్థాలు, పానీయాలను తినడానికి, తాగడానికి వాడే ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసుల నుంచి కరిగిన ప్లాస్టిక్ మన శరీరంలోకి వెళ్తోంది. దీనివల్ల చర్మ, జీర్ణకోశ సమస్యలు, థైరాయిడ్, గొంతు నొప్పి సంభవిస్తున్నాయి. - ప్లాస్టిక్ను కాలుస్తుండటంతో తీవ్ర వాయు కాలుష్యం విడుదలై శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో చేరడంతో భూగర్భ జలాలు కలుషితమై మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. - ప్లాస్టిక్ వ్యర్థాలు భూమి పొరల్లో వందల ఏళ్లు ఉండిపోతుండటంతో భూసారం తగ్గి పంటల దిగుబడులు తగ్గుతున్నాయి. ఏటా 8 లక్షల తాబేళ్లు, 10 లక్షల సముద్ర పక్షులు, మరెన్నో చేపలు మృత్యువాత పడుతున్నాయి. ప్లాస్టిక్ రహిత జిల్లాయే లక్ష్యం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో సింగిల్యూజ్ ప్లాస్టిక్ను నిషేధిస్తూ మూడు నెలల క్రితం నోటిఫికేషన్ ఇచ్చాం. క్రెడాయ్ వంటి సంస్థల భాగస్వామ్యంతో రైతు బజార్లు, మార్కెట్లు, ఇతర ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సింగిల్యూజ్ ప్లాస్టిక్ రహిత జిల్లాగా కృష్ణా జిల్లాను తీర్చిదిద్దడమే మా లక్ష్యం. – ఇంతియాజ్, కలెక్టర్, కృష్ణా జిల్లా సింగిల్యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తి నిషేధించాలి సింగిల్యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తిని ప్రభుత్వం నిషేధించాలి. అన్ని రాష్ట్రాల్లో ప్లాస్టిక్ రీసైక్లింగ్కు తగిన మౌలిక సదుపాయాల వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయ వస్తువుల ఉత్పత్తిని, మార్కెటింగ్ను పెంచాలి. – మనోజ్ నలనాగుల, పర్యావరణ శాస్త్రవేత్త ప్రత్యామ్నాయ వస్తువులను ప్రోత్సహించాలి సింగిల్ యూజ్ ప్లాస్టిక్కు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించాలి. అడ్డాకులతో చేసిన విస్తర్లు, ప్లేట్లు, కాగితాల కవర్లు, జనపనార ఉత్పత్తుల వినియోగాన్ని పెంచడంతోపాటు వాటి మార్కెటింగ్కు ప్రభుత్వాలు కృషి చేయాలి. దీంతో ఎంతోమందికి స్వయం ఉపాధి కూడా లభిస్తుంది. – జేవీ రత్నం, గ్రీన్ క్లైమేట్ సంస్థ ప్రతినిధి సమన్వయంతోనే సమర్థంగా.. బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ నిషేధం కోసం 2008లో అవగాహన కార్యక్రమాలు ప్రారంభించాం. విద్యాసంస్థలు, మార్కెట్లు, కూరగాయల బజార్లతోపాటు ఇంటింటికీ తిరిగి పెద్ద ఎత్తున ప్రచారం చేశాం. మూడేళ్లలోనే బొబ్బిలి మున్సిపాలిటీని ప్లాస్టిక్ రహితంగా చేయగలిగాం. ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థల సహకారంతో పనిచేస్తే రాష్ట్రంలో ప్లాస్టిక్ నిషేదాన్ని సమర్థంగా అమలు చేయొచ్చు. – రాజగోపాల్ నాయుడు, అమ్మ ఫౌండేషన్, బొబ్బిలి ప్లాస్టిక్ను తినేసే బ్యాక్టీరియా ప్లాస్టిక్ వ్యర్థాల ముప్పును శాశ్వతంగా తొలగించడానికి ప్రపంచ శాస్త్రవేత్తలు పరిశోధనలు ముమ్మరం చేశారు. స్పెయిన్లోని కాంటాబ్రియా యూనివర్సిటీలో బయోమెడిసిన్– బయోటెక్నాలజీ విభాగం శాస్త్రవేత్తలు సింగిల్యూజ్ ప్లాస్టిక్ను తినే చిన్న పురుగులను గుర్తించారు. అయితే.. ఆ పురుగులపై ఎంతవరకు ఆధారపడొచ్చు.. వాటితో ఇతర సమస్యలేమైనా తలెత్తుతాయా అనే అంశాలపై పరిశోధనలు చేస్తున్నారు. -
నీళ్లకు 20, పాలకు 18 రూపాయలా!
సాక్షి, న్యూఢిల్లీ : ‘బాటిల్ మంచినీరు 20 రూపాయలు. లీటరు పాలు 17, 18 రూపాయలా! ఇదెక్కడి అన్యాయం. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో వ్యాపారులు హాయిగానే బతుకుతున్నారు. రైతులకే చావొచ్చింది’ అని లింబాదేవీ గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పశు శిబిరంలో కచ్రూసాహెబ్ రాథోడ్ అనే 62 ఏళ్ల రైతు వ్యాఖ్యానించారు. గత ఏడాది కాలంకాక వర్షాలు లేకపోవడంతో ఇతర రైతుల్లాగానే తాను పంట వేయలేక పోయానని, దీనికి మోదీ మాత్రం ఏం చేయగలరని అదే శిబిరంలో పశువులతోపాటు తలదాచుకుంటున్న హర్షుభాయ్ సనప్ అనే రైతు వ్యాఖ్యానించారు. రాథోడ్ మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నప్పుడల్లా బీజేపీ కార్యకర్త అయిన సనప్ అడ్డుపడుతున్నారు. 2012 నుంచి మూడేళ్లపాటు వర్షాలు లేకపోవడం వల్ల రైతులకు ఈ దుస్థితి దాపురించిందని సనప్ వాదించారు. పంటలు పండించినా మార్కెట్లో తమ పంటలకు మార్కెట్లో ఎవరు గిట్టుబాటు ధరలు ఇస్తారని ఆయన నిర్లిప్తత వ్యక్తం చేశారు. ‘మార్కెట్ ధరల పరిస్థితిని పక్కన పెట్టండి, పంటలను మార్కెట్ను తరలించేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి?’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ యువ రైతు వ్యాఖ్యానించారు. లింబాదేవీ గ్రామం మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఉంది. రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు తాండవిస్తుండడంతో పశువుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో పశు శిబిరాలను నిర్వహిస్తోంది. శిబిరాల నిర్వహణ పట్ల కూడా రైతులు అసంతప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఎన్నికలను దష్టిలో పెట్టుకొని ఈ శిబిరాలను ఏర్పాటు చేశారని, అది కూడా మార్చి నెలలో ఏర్పాటు చేశారని, పశువుల గ్రాసం కూడా అంతంత మాత్రంగానే అందుతుందని పలువురు రైతులు విమర్శించారు. ఎన్నికల గురించి ప్రశ్నించగా మోదీ ప్రభుత్వం పట్ల కొందరు సంతప్తి వ్యక్తం చేయగా, ఎక్కువ మంది ఎవరొస్తే మాత్రం తమకు ఒరిగేదేముంటుందని నిర్లిప్తత వ్యక్తం చేశారు. మోదీ కారణంగా కనీసం రోడ్లు, వంతెనలు, మంచినీళ్లు వస్తున్నాయని చెప్పారు. బీడ్లో ఎవరు గెలుస్తారు ? బీడ్ లోక్సభ నియోజకవర్గానికి ఈ నెల 18వ తేదీన పోలింగ్ జరుగుతుంది. 2014, అక్టోబర్లో ఈ సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రీతమ్ ముండే అఖండ మెజారిటీతో విజయం సాధించారు. బీజేపీ సీనియర్ నాయకుడు, ఆమె తండ్రి గోపీనాథ్ ముండే మరణంతో ఆ సీటుకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గం నుంచి 36 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నప్పటికీ వారిలో ప్రీతమ్ ముండేతోపాటు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న బజరంగ్ సోనవానేలే ప్రముఖులు. వీరిద్దరి మధ్యనే పోటీ ఉంటుంది. ప్రీతమ్ ముండే సమీప బంధువు, ఎన్సీపీ నాయకుడు ధనంజయ్ ముండేకు మద్దతు ఇస్తున్న కారణంగా పోటీ రసవత్తరంగా మారే అవకాశం ఉంది. అయినప్పటికీ విజయావకాశాలు ప్రీతమ్ ముండేకే ఉన్నాయి. -
తొలి టెస్టు: పుజారా జేబులో వాటర్ బాటిల్
రాజ్కోట్: రెండు టెస్టుల సిరీస్లో భాగంగా వెస్టిండీస్తో ఇక్కడ జరుగుతున్న మొదటి టెస్టులో భారత బ్యాట్స్మన్ చతేశ్వర పుజారా హాఫ్ సెంచరీ సాధించాడు. మొదట్లో నెమ్మదిగా ఆడినా.. క్రమంగా వేగం పెంచిన పుజారా 67 బంతుల్లోనే తొమ్మిది బౌండరీలతో కెరీర్లో 19వ హాఫ్ సెంచరీ చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. మూడు పరుగుల వద్ద ఓపెనర్ లోకేష్ రాహుల్ డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ పృథ్వీ షాతో కలిసి వికెట్ పడకుండా ఆడుతున్నాడు. వీరిద్దరూ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. లంచ్ సమయానికి ఈ జోడి అజేయంగా 130 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసింది. అయితే రాజ్కోట్లో వేడిని అధిగమించడానికి పుజారా వాటర్ బాటల్ను చెంతనే పెట్టుకున్నాడు. తన దాహార్దిని తీర్చుకునే క్రమంలో ఒక చిన్నసైజు వాటర్ బాటిల్ను జేబులోనే ఉంచుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియా ఇప్పుడు వైరల్గా మారింది. -
వాటర్ బాటిల్ తీసుకురా!
సాక్షి, హైదరాబాద్: ఓ వాటర్ బాటిల్ కంపెనీ కేసుపై సీరియస్గా వాదనలు జరుగుతున్నాయి. ఇంతలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధాకృష్ణన్ తనకొచ్చిన సందేహ నివృత్తికి వాదనలను ఆపారు. తన సిబ్బందిలోని ఓ వ్యక్తిని పిలిచి, జేబులో నుంచి డబ్బు తీసి హైకోర్టు క్యాంటీన్లో వాటర్ బాటిల్ తీసుకురమ్మని ఆదేశించారు. వెంటనే ఆ వ్యక్తి క్యాంటీన్కు వెళ్లి వాటర్ బాటిల్ తెచ్చారు. దాన్ని పరిశీలించిన సీజే తన సందేహాన్ని నివృత్తి చేసుకున్నారు. ఈ ఆసక్తికర ఘటన సోమవారం హైకోర్టులో చోటు చేసుకుంది. ఆ తర్వాత వాటర్ బాటిళ్లపై సరఫరాదారు చిరునామా, సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ తదితర వివరాలను పొందుపరచని కంపెనీలను నియంత్రించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని రాష్ట్ర తూనికలు, కొలతల శాఖ అధికారులను ఆదేశించారు. ఇందుకు రెండు రోజుల గడువునిచ్చారు. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఎవరికి ఫిర్యాదు చేయాలి? హిందుస్తాన్ కోకాకోలా బేవరేజస్ ప్రైవేట్ లిమిటెడ్ మెదక్ జిల్లా, పాశమైలారంలోని హిమజల్ బేవరేజస్ ప్రైవేట్ లిమిటెడ్ ‘కిన్లే’బ్రాండ్ కింద తాగునీరు సరఫరా చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 2న తూనికలు, కొలతల శాఖ అధికారులు హిమజల బేవరేజస్లో తనిఖీలు నిర్వహించారు. అక్కడ సరఫరాకు సిద్ధంగా ఉన్న బాటిళ్లపై ఫిర్యాదు ఇవ్వాల్సిన వ్యక్తి పేరు, చిరునామా లేదంటూ దాదాపు లక్ష బాటిళ్లను అధికారులు జప్తు చేశారు. దీనిని సవాల్ చేస్తూ హిమజల్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ ముందు అప్పీల్కు అవకాశం ఉండటంతో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో హిమజల్ కంపెనీ కంట్రోలర్ ముందు అప్పీల్ దాఖలు చేసింది. విచారణ జరిపిన కంట్రోలర్ వాటర్ బాటిళ్ల జప్తును సమర్థించారు. దీనిపై కంపెనీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు అధికారుల తీరును తప్పుపట్టారు. ఆ బాటిళ్లపై కేవలం వ్యక్తి పేరు లేదన్న కారణంతో జప్తు చేయడం సరికాదని పేర్కొన్నారు. దీనిపై పౌర సరఫరాల శాఖ అధికారులు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ బి.రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తూనికలు, కొలతల శాఖ తరఫు న్యాయవాది జ్యోతికిరణ్ వాదనలు వినిపిస్తూ, నిబంధనల మేరకే తాము హిమజల్ కంపెనీలో ఉన్న వాటర్ బాటిళ్లను జప్తు చేశామన్నారు. వాదనలు వింటున్న సీజే తన డబ్బులతో హైకోర్టు క్యాంటీన్లో బిస్లరీ వాటర్ బాటిల్ తెప్పించుకుని పరిశీలించారు. ‘ఈ బాటిల్పై ఓ టోల్ఫ్రీ నంబరే ఉంది. అంతకు మించిన వివరాలు లేవు. ఈ బాటిళ్లలోని నీటిని కొందరు మినరల్ వాటర్ అంటున్నారు. వాస్తవానికి అవి ప్యాకేజ్డ్ వాటర్’ అని ఈ సందర్భంగా సీజే వ్యాఖ్యానించారు. -
ప్రమాదానికి కారణమైన వాటర్ బాటిల్
లండన్ : ‘మనం’ సినిమా క్లైమాక్స్లో చూసిన యాక్షన్ సీన్ యూకేలో నిజంగా జరిగింది. ససెక్స్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ కారులో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో ఆ మహిళ ఆందోళనకు గురికాకుండా, ఇతర వాహనాలకు ఇబ్బంది కలగకుండా దగ్గర్లోని గ్యాస్ స్టెషన్లోని రక్షణ గోడ (సేఫ్టీ మెటల్ రాడ్)ను ఢీ కోట్టించి కారును ఆపే ప్రయత్రం చేసింది. నియంత్రణ కోల్పోవడంతో కారు బోల్తా పడినప్పటికీ, స్వల్పగాయాలతో బయటపడ్డారు. పోలీసులు కథనం ప్రకారం.. ఆ మహిళ చెప్పిన కారణం ప్రకారం కారును పరిశీలించిన ససెక్స్ పోలీసులు, బ్రేక్లు ఫెయిల్ కాలేదని వివరిస్తూ ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు. కారు బ్రేకు పెడల్ కింద వాటర్ బాటిల్ ఉండటంతో ఆమె ఎంత ప్రయత్నించినా బ్రేక్లు పడలేదని, అయినప్పటికీ సమయస్పూర్తితో వ్యవహరించటంతో ఘోర ప్రమాదం నుంచి తప్పించుకుందని తెలిపారు. కారు నడిపేటప్పుడు ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని పోలీసులు స్థానిక డ్రైవర్లను హెచ్చరించారు. -
బ్రాండెడ్ బాటిళ్లలో విషం
న్యూయార్క్: దాహాన్ని తీర్చుకునేందుకు గుక్కెడు నీళ్లు తాగాలన్నా భయపడే పరిస్థితులొచ్చాయి. తమ నీళ్లు అత్యంత సురక్షితమైనవని ప్రకటనలు గుప్పించే కంపెనీల నీళ్ల బాటిళ్లలో భారీగా సూక్ష్మస్థాయి ప్లాస్టిక్ అవశేషాలు ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. అమెరికా, చైనా, భారత్, బ్రెజిల్, ఇండోనేసియా, కెన్యా సహా 9 దేశాల్లో న్యూయార్క్ స్టేట్ వర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఈ విషయం తేలింది. 9 దేశాల్లో ప్రజాదరణ పొందిన 11 బ్రాండ్లకు చెందిన 259 ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను పరీక్షించారు. ఈ నీళ్ల బాటిళ్లలో సగటున ఒక్కోదానిలో 325 ప్లాస్టిక్ అవశేషాలు, గరిష్టంగా ఓ బాటిల్లో 10,000 ప్లాస్టిక్ అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. పరీక్షించిన 259 బాటిళ్లలో 90 శాతం వాటిలో ప్లాస్టిక్ రేణువులు ఉన్నాయనీ, 17 బాటిళ్లలో ప్లాస్టిక్ అవశేషాలు లేవని తేల్చారు. జర్నలిజం ప్రాజెక్ట్ ఆర్బ్ మీడియా సూచన మేరకు తాము ఈ పరిశోధన చేశామన్నారు. కుళాయి నీళ్లతో పోల్చుకుంటే ఈ వాటర్ బాటిళ్లలో ప్లాస్టిక్ అవశేషాలు రెండింతలు అధికంగా ఉన్నాయి. దీంతో మంచినీళ్లలో ప్లాస్టిక్ వల్ల కలిగే ముప్పును సమీక్షిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) తెలిపింది. సరైన విధానం కాదు నీళ్ల బాటిళ్లలో ప్లాస్టిక్ అవశేషాలను గుర్తించేందుకు ఆర్బ్ మీడియా, న్యూయార్క్ స్టేట్ వర్సిటీ అనుసరించిన విధానాన్ని నెస్లే సంస్థ తప్పుపట్టింది. శాస్త్రవేత్తలు వాడిన నైల్రెడ్డై సాంకేతికతతో కచ్చితమైన ఫలితాలు వెలువడే అవకాశం లేదని వెల్లడించింది. మరోవైపు, తాము కఠినమైన పద్ధతుల ద్వారా నీళ్ల శుద్ధీకరణను చేపడుతున్నట్లు కోకాకోలా బీబీసీకి తెలిపింది. -
‘బ్రాండెడ్’ బాటిళ్లలో ప్లాస్టిక్ కణాలు...!
పీల్చే గాలి, తినే ఆహారం...చివరకు దాహాన్ని తీర్చుకునేందుకు గుక్కెడు నీళ్లు తాగాలంటేనే భయపడాల్సిన పరిస్థితులొచ్చేశాయి. పేరొందిన బ్రాండెడ్ మినరల్ వాటర్ కంపెనీలకు చెందిన బాటిల్ నీళ్లలో సూక్ష్మస్థాయిలో ప్లాస్టిక్ ముక్కలున్నట్టు వెల్లడైంది. పూర్తిగా శ్రేయస్కరమైనవని, ఎలాంటి సందేహం లేకుండా తాగేయవచ్చునని భావించే వాటర్ బాటిళ్లలో 90 శాతం కంటే ఎక్కువ వాటిలో అతిచిన్న ప్లాస్టిక్ అవశేషాలున్నట్టు బయటపడింది. కుళాయిల్లోని (నల్లాలు) నీటి కంటే రెండురెట్లు అధికంగా ఈ వాటర్బాటిళ్లలో ప్లాస్టిక్ ఫైబర్లున్నట్టు న్యూయార్క్ స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తాజా పరిశోధనలో తేలింది . భారత్తో సహా అమెరికా, చైనా, బ్రెజిల్, ఇండోనేషియా, మెక్సికో, థాయ్లాండ్, లెబనాన్, కెన్యాలలో కొనుగోలు చేసిన బాటిళ్లను పరీక్షించినపుడు విస్మయం కలిగించే ఈ అంశం వెలుగుచూసింది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహేచ్ఓ) స్పందిస్తూ మంచినీళ్లలో ప్లాస్టిక్ వల్ల వాటిల్లే ప్రమాదాన్ని వెంటనే సమీక్షించనున్నట్టు ప్రకటించింది. ఒక్కో లీటర్లో 10వేల ప్లాస్టిక్ అవశేషాలు.. ప్రపంచవ్యాప్తంగా 9 దేశాల్లోని 19 ప్రాంతాల నుంచి 11 రకాల ప్రజాదరణ పొందిన 259 బ్రాండెడ్ మినరల్ వాటర్ బాటిళ్లను ఈ అధ్యయనంలో భాగంగా పరిశీలించారు. ప్రతీ లీటర్ మంచినీళ్ల సీసాలో సగటున 325 ప్లాస్టిక్ కణాలున్నట్టు గుర్తించారు. ఒక్కో లీటర్ బాటిల్లో అత్యధికస్థాయిలో 10 వేల ప్లాస్టిక్ అవశేషాలున్నట్టు తెలిసింది. మొత్తం 259 బాటిళ్లలో కేవలం 19 సీసాల్లో మాత్రమే ఎలాంటి ప్లాస్టిక్ లేదని తేలింది. జర్నలిజం ప్రాజెక్ట్ ఆర్బ్ మీడియా సూచన మేరకు న్యూయార్క్స్టేట్ యూనివర్శిటీ వాటర్ బాటిళ్లలోని నీటిని విశ్లేషించే పని చేపట్టింది. కుళాయిల నీళ్లపై గతంలో తాము నిర్వహించిన పరిశోధనతో పోల్చి చూస్తే ‘బాటిల్డ్ వాటర్’’లో మైక్రోప్లాస్టిక్ రెండింతలున్నట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే ఈ అంశంపై అధ్యయనానికి ఆర్బ్మీడియా అనుసరించిన విధానాన్ని నెస్ట్లే తప్పుబట్టింది. నైల్రెడ్డై సాంకేతికతో కచ్చితమైన ఫలితాలు వెలువడే అవకాశాలు లేవని సీబీసీ ఏజెన్సీకి ఈ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. తాము కఠినతరమైన పద్ధతుల ద్వారా నీటి ఫిల్టరేషన్ను చేపడుతున్నట్లు కోకాకోలా బీబీసీకి వెల్లడించింది. అయితే అత్యంత హెచ్చుస్థాయిలో శుద్ధిచేపట్టినపుడు కూడా పర్యావరణంలో అత్యంత సూక్ష్మస్థాయిలో ఉన్న ప్లాస్టిక్ ఫైబర్లు అందులో కనిపించే అవకాశాలున్నాయని పేర్కొంది. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
వాటర్ బాటిల్ వెనుక అంత కథా..!!
ఒకప్పుడు ఎక్కడికైనా ప్రయాణమవుతున్నామంటే వెంట నీళ్లు తప్పనిసరిగా తీసుకెళ్లడం మర్చిపోయేవారు కాదు. మరి ఇప్పుడు.. ఎక్కడపడితే అక్కడ వాటర్ బాటిళ్లు దొరుకుతున్నాయి. కొనేస్తున్నారు.. తాగేస్తున్నారు! తాగునీరు చాలాచోట్ల అందుబాటులో ఉన్నా కూడా వాటర్ బాటిళ్లనే కొంటున్నారు. ఎందుకు? దీనిపై కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయానికి చెందిన స్టీఫెన్ కోట్ అనే గ్రాడ్యుయేట్ విద్యార్థి పరిశోధన చేసి, వెల్లడించిన వివరాలు ఇవిగో.. ఓసారి చదివేయండి! ఎప్పుడైనా టీవీల్లో వాటర్ బాటిల్ యాడ్ చూశారా? చూసినా.. మీరు బహుశా పెద్దగా గమనించి ఉండరు. ఎందుకంటే, ఆ యాడ్ మీలో లేనిపోని భయాన్ని సృష్టిస్తోంది. బ్రాండెడ్ కంపెనీల వాటర్ బాటిళ్లలోని నీళ్లు కాకుండా మరేవి తాగినా కోరి కోరి కష్టాన్ని తెచ్చుకున్నట్టే..అనేంతగా మనల్ని ట్యూన్ చేస్తాయి. వీటిని చూసిన సాధారణ జనం.. రిస్కెందుకు, కొనేదేదో బ్రాండెడ్ కంపెనీల నీళ్ల సీసాలనే కొని, తాగేస్తే పోలా? అని వాటినే కొంటున్నారు. మరికొందరికి స్టేటస్ సింబల్.. తమ ఆహార్యం ద్వారా స్టేటస్ను చాటుకోవాలని అనుకునేవారు కూడా వాటర్ బాటిల్ ద్వారా ఆ పని చేస్తున్నారు. బ్రాండెడ్ కంపెనీల వాటర్ బాటిల్ను కొని, చేతిలో పట్టుకొని తమ డాంబికాన్ని ప్రదర్శిస్తున్నారు. నీళ్ల సీసా ద్వారా తమ ఫిట్నెస్ను, విలువను, ఫిజికల్ అప్పియరెన్స్ను, ఆర్థిక స్థితిని చాటుకోవాలనుకుంటున్నారు. ఇంకొంతమంది ఇదే వాటర్ బాటిల్తో దేశభక్తిని కూడా చాటుకోవాలనుకుంటున్నారు. ‘మనదేశపు నీళ్లు’ అనే అభిప్రాయంతో కొంటున్నవారు కూడా ఉన్నారు. చెవికెక్కడంలేదు... బాటిళ్లలోని నీళ్ల కంటే మున్సిపల్ నల్లా నీళ్లే మంచివనే విషయాన్ని అనేక స్వ చ్ఛంద సంస్థలు, నిపుణులు చెబుతున్నా ప్రజల చెవికి ఎక్కడంలేదు. నీళ్ల సీసా ల్లోని నీరు అంత సురక్షితమైనది కాదని చెప్పేందుకు స్వచ్ఛంద సంస్థలు, ప్రభు త్వ ఏజెన్సీలు కొత్తగా ఆలోచిం చాల్సిన అవసరముంది. ఆర్థిక, నైతిక, పర్యావరణ అంశాలను జోడిస్తూ ప్రచా రం చేస్తే కొంతమేరకైనా ఫలితముంటుంది. -
అయ్యో ట్రంప్కు ఇలా అయ్యిందేంటి?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఒకింత వికృత చర్యకు పాల్పడ్డారు. బుధవారం దేశాన్ని ఉద్దేశించి.. టీవీలో ప్రసంగిస్తూ.. హఠాత్తుగా ఓ వాటర్ బాటిల్ అందుకొని గుక్కపెట్టకుండా తాగేశారు. ట్రంప్ పాల్పడిన ఈ అనూహ్య చర్య ఒకప్పటి ఆయన ప్రత్యర్థి, రిపబ్లికన్ సెనేటర్ మార్కో రుబియోకు ఊరటనిచ్చి ఉండాలి. నాలుగేళ్ల కిందట రూబియోకు కూడా ఇదే తరహాలో ప్రవర్తించారు. బరాక్ ఒబామా స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగాన్ని ఖండిస్తూ రూబియో ఉపన్యాసం ఇస్తుండగా.. మధ్యలో వాటర్ బాటిల్ అందుకొని గుక్కపెట్టకుండా నీళ్లు తాగేశారు. అప్పట్లో ట్రంప్తోపాటు చాలామంది ఇలా చేసినందుకు రూబియోను తిట్టిపోశారు. నాడు వరద బాధితుడిలా నీళ్లు కోసం అల్లాడాడంటూ రూబియోను తిట్టిన ట్రంపే.. ఇప్పుడు సాక్షాత్తు టీవీలో దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. మధ్యలో వాటర్ కావాలంటూ వికృతంగా ప్రవర్తించడం గమనార్హం. ఇటీవల ముగిసిన ఆసియా పర్యటన గురించి వివరిస్తూ.. మధ్యలో ’ఆగండి.. ఆగండి.. నీళ్లు కావాలి.. నీళ్లు లేవా’ అంటూ అడిగారు. పక్కన నీళ్ల సీసా కనిపించడంతో లైవ్ ప్రసారంలోనే బాటిల్ను అందుకొని ట్రంప్ గడగడ తాగేశారు. వాటర్ బాటిల్ మోమెంట్ విషయంలో రూబియోను పరిహాసం ఆడిన ట్రంపే ఇలా దొరికిపోవడంతో నెటిజన్లు ఆయన మీద సెటైర్లు, జోకులు సంధిస్తున్నారు. -
కాపర్ బాటిల్ను విడుదల చేసిన రాశికన్నా
-
కింగ్ కోబ్రాకు నీళ్లు తాగించడం చూశారా..!
న్యూఢిల్లీ: దాహంతో ఉన్న జంతువులకు నీళ్లు తాగించడమే చాలా అరుదు. అలాంటిది పాములకు నీళ్లు తాగించే ప్రయత్నం చేస్తామా? అదీ కూడా ఒక తీవ్ర విషపూరితమైన కింగ్ కోబ్రాకు తాగించే సాహసం అంటే ఊహించుకోగలమా? కానీ, అదే జరిగింది. తీవ్రమైన ఎండాకాలం కారణంగా దాహార్తితో జనావాసాలకు వచ్చిన ఓ కింగ్ కోబ్రాకు వైల్డ్లైఫ్ జంతువుల సంరక్షణ విభాగంలో పనిచేసే వ్యక్తి అలవోకగా ఏ మాత్రం భయం లేకుండా వాటర్ బాటిల్తో నీళ్లు తాగించాడు. ఆ పాము కూడా చక్కగా చంటి పాపలా కదలకుండా నీళ్లు తాగింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని కైగా అనే గ్రామంలోకి ఓ భారీ విషసర్పమైన కింగ్ బ్లాక్ కోబ్రా వచ్చింది. సాధారణంగా కింగ్ కోబ్రాలు అత్యంత అరుదుగా మాత్రమే జనావాసాల్లోకి వస్తాయి. ప్రస్తుతం వేసవికాలం కారణంగా ఆ భారీ విష సర్పం జనాల మధ్యకి వచ్చింది. దీనిని చూసి తీవ్రంగా జనాలు భయపడిగా అక్కడికి వణ్యప్రాణి సంరక్షణ విభాగానికి చెందిన వారిని పంపించారు. అక్కడికి వచ్చిన వారిలో ఒక వ్యక్తి కింగ్ కోబ్రా తోక పట్టుకోగా మరో వ్యక్తి చక్కగా వాటర్ బాటిల్తో నీటిని తాగించాడు. అనంతరం దానిని వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించారు. -
నిషేధం
పాఠశాలల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల బ్యాన్ ‘సాక్షి’ కథనానికి స్పందించిన విద్యాశాఖ ఎంఈఓ, డిప్యూటీ ఈఓలకు సర్క్యూలర్ నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక జోగిపేట: ప్రభుత్వ పాఠశాలల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల వినియోగాన్ని జిల్లా విద్యా శాఖ నిషేధించింది. ఈ మేరకు డీఈఓ సర్క్యూలర్ జారీ చేశారు. ‘బాటిల్లో విషం’ అనే శీర్షికన నవంబర్ 11న సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సమయంలో విద్యార్థులకు నీటి వసతిని కల్పించాలని, ఇంటి నుంచి ప్లాస్టిక్ బాటిళ్లలో తెచ్చుకోకుండా వారికి అవగాహన కల్పించాలని డీఈఓ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్లాస్టిక్ బాటిళ్లలోని నీటిని తాగడం వల్ల అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉన్నట్టు ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన విషయాన్ని సర్య్కూలర్లో పొందుపరిచారు. నవంబర్ 30న జిల్లాలోని 2,899 పాఠశాలల హెచ్ఎంలకు, ఎంఈఓలకు, ఉప విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వు కాపీని మెయిల్ చేశారు. పాఠశాలలో స్వచ్ఛమైన నీటిని విద్యార్థులకు అందించాలని డీఈఓ ఆదేశించారు. ఈ ఉత్తర్వులను పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
బాటిల్ బాక్సులా..
ఇన్నాళ్లూ వాటర్ బాటిల్ అంటే మనం చూసింది వేరు. ఇది వేరు.. చూశారుగా.. బాటిల్ బాక్సులా మారిపోయింది. దీన్ని ఆస్ట్రేలియాకు చెందిన డిజైనర్లు జెస్సీ లీవర్తీ, జోనాథన్లు తయారుచేశారు. ‘మెమోబాటిల్’లో మూడు సైజులున్నాయి. అవి ఏ5, ఏ4, లెటర్. వీటిల్లో ఏ5 సామర్థ్యం 750 మి.లీ. కాగా.. ఏ4, లెటర్ల సామర్థ్యం 1.25 లీటర్లు. వీటిని బ్యాగులో లేదా వెనుక జేబులో ఈజీగా పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఆఫీసుకు వెళ్లేవారి కోసం వీటిని తయారుచేశారట. పాశ్చాత్య దేశాల్లో యూజ్ అండ్ త్రో టైపు వాటర్ బాటిళ్ల వినియోగం ఎక్కువ. వీటిల్లో 20 శాతం మాత్రమే రీసైకిలింగ్ చేస్తున్నారట. ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యకు ఇది చెక్ పెడుతుందని జెస్సీ, జొనాథన్లు చెబుతున్నారు. దీన్ని ఎన్నిసార్లైనా వినియోగించుకోవచ్చని.. శుభ్రపరచడం కూడా చాలా ఈజీ అని అంటున్నారు. మెమోబాటిళ్లు ఈ ఏడాది చివర్లో మార్కెట్లోకి రానున్నాయి. -
విదేశీ వేస్ట్ వారియర్..!
విదేశీయులెవరైనా మన దేశానికి వస్తే... మన సంస్కృతిని చూసి ముచ్చటపడతారు. మన సంప్రదాయాలను చూసి సెల్యూట్ చేస్తారు. మన కళలను చూసి హ్యాట్సాఫ్ చెబుతారు. కానీ ఒక్క విషయానికి మాత్రం ముఖం చిట్లిస్తారు. అది... అపరిశుభ్రత. జోడీ అండర్హిల్ని కూడా మన దేశంలోని అపరిశుభ్రత చాలా చికాకు పెట్టింది. కానీ ఆమె మిగతావారిలా ముఖం తిప్పుకునో, ముక్కు మూసుకునో వెళ్లిపోలేదు. చీపురు పట్టింది. చెత్తను ఊడ్చడం మొదలుపెట్టింది. భారతదేశాన్ని చెత్త బారి నుంచి రక్షిస్తానంటూ శపథం చేసింది! పార్కలో సరదాగా కూర్చుని చిప్స్ తింటాం. ఖాళీ అయిన ప్యాకెట్ని అక్కడే వదిలి వెళ్లిపోతాం. దాహంగా ఉందని వాటర్ బాటిల్ కొంటాం. ఖాళీ అయిన తర్వాత విసిరేస్తాం. వాటివల్ల తిరిగి మనకే నష్టం వాటిల్లుతుందన్న స్పృహ మనకి ఉండదు. ఆ స్పృహను కలిగించేందుకే తాను వచ్చానంటుంది జోడీ అండర్హిల్. ఎక్కడో బ్రిటన్లో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి, భారతదేశాన్ని చెత్తరహిత దేశంగా మార్చాలని కంకణం కట్టుకుంది. అందుకే ఉత్తర భారతదేశంలో అందరూ ఈమెని ‘చెత్తమ్మాయి’ అంటుంటారు. 1976లో ఇంగ్లండులో పుట్టింది జోడీ. మొదట్నుంచీ సమాజం కోసం ఏదైనా చేయాలని ఆలోచిస్తుండేది. అందువల్లే పెద్దయ్యాక రకరకాల ఉద్యోగాలు చేసినా ఏవీ తృప్తినివ్వలేదు. దాంతో ఓ స్వచ్ఛంద సంస్థలో చేరింది. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. దానికి తోడు జోడీకి ప్రయాణాలు చేయడం చాలా ఇష్టం. దాంతో పలు దేశాలు తిరిగి నిధులు సేకరించేది. పనిలో పనిగా అక్కడి సంస్కృతీ సంప్రదాయాల గురించి ఇష్టంగా తెలుసుకునేది. ఆ విధంగానే 2009లో హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలకు వచ్చింది. ఆ పర్యటన తనను ఎప్పటికీ భారతదేశంలోనే ఉంచేస్తుందని ఆమె ఊహించి ఉండదు. ఒంటరిగా వచ్చింది... సైన్యంగా మారింది... ఉత్తర భారతదేశం జోడీని చాలా ఆకర్షించింది. పర్వత సానువులు, వాటిపై పేరుకున్న మంచు ముద్దలు, పచ్చని చెట్లు, చక్కని జలపాతాలు... ఆ ప్రాకృతిక సౌందర్యానికి పరవశించింది జోడీ. కానీ అంత అందమైన ప్రకృతి పరిశుభ్రంగా లేకపోవడం ఆమెను బాధపెట్టింది. ముఖ్యంగా మల్లెపువ్వులా మెరవాల్సిన హిమాలయాలు సైతం మురికిగా తయారవడాన్ని ఆమె చూడలేకపోయింది. ఆమెలోని సామాజిక స్పృహ మేల్కొంది. అందరినీ కలిసి పరిసరాలను, పర్యాటక కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరాన్ని వివరించేది. కొందరు విని వదిలేసేవారు. కొందరు వినడానికి ఇష్టపడేవారే కాదు. దాంతో మొదటి అడుగు తనే వేయాలని నిర్ణయించుకుంది జోడీ. చలికోటు, బూట్లు, గ్లవుజులు వేసుకున్నా వణికిం చేంత చలి ఉండే హిమాలయాల్లో చెత్త ఏరడం ప్రారం భించింది. అందరూ తనని విచిత్రంగా చూస్తున్నా, చెత్తమ్మాయి అంటున్నా పట్టించుకునేది కాదు. దాంతో కొన్నాళ్లకు ఆమె తపనను అందరూ అర్థం చేసుకున్నారు. ఆమె పనిలో సాయపడటం మొదలుపెట్టారు. అయితే తన పని అంతటితో అయిపోలేదని, చేయా ల్సింది చాలా ఉందని జోడీకి తర్వాత అర్థమైంది. గ్రామాలకు వెళ్లినప్పుడు కనిపించిన కొన్ని దృశ్యాలు ఆమెను కదిలించాయి. ఇళ్ల పక్కనే చెత్తకుప్పలు ఉండటం, వాటి దగ్గరే పిల్లలు ఆడుకోవడం, శుభ్రత లేకపోవడం వల్ల అంటు వ్యాధులు ప్రబలడం వంటివి చూశాక తన సేవలను విస్తరించాల్సిన అవసరం కనబడింది జోడీకి. అప్పుడే ‘వేస్ట్ వారియర్స’ను నెలకొల్పింది. ఆసక్తి ఉన్నవారిని వాలం టీర్లుగా చేర్చుకుంది. వీళ్లందరి లక్ష్యం ఒక్కటే... భారతదేశంలో చెత్త అన్న మాట వినబడకుండా చేయడం! ఎక్కడ చెత్త ఉంటే అక్కడ వేస్ట్ వారియర్స ప్రత్యక్షమైపోతారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో చెత్త అనేది కనబడకుండా చేశారు. భారత దేశంలోని ప్రతి ప్రాంతాన్నీ చెత్తరహితంగా చేయాలనే ఆశయంతో పని చేస్తున్నారు. తన లక్ష్యానికి అడ్డు ఉండకూడదని పెళ్లి కూడా మానుకుంది జోడీ. అంత పెద్ద నిర్ణయం తీసుకోవడం అవసరమా అని అడిగితే... ‘రోజులో ఎక్కువ సమయం చెత్త ఏరు కోవడంలోనే మునిగిపోయే అమ్మాయిని భరించే మగాడు ఎక్కడ దొరుకుతాడు’ అంటూ నవ్వేస్తుంది. పిల్లల్ని పెంచడానికి కేటాయించే సమయాన్ని పనికే కేటాయిస్తాను అంటుంది. సమాజం కోసం బతికేవాళ్లకు తన అనే స్వార్థం ఉండదు. సంకల్పం దృఢంగా ఉన్నప్పుడు ఓటమీ ఉండదు! - సమీర నేలపూడి ‘‘పరిశుభ్రత అనేది ఏ ఒక్కరివల్లో సాధ్యమయ్యేది కాదు. ప్రతి ఒక్కరిలోనూ శుభ్రంగా ఉండాలన్న ఆలోచన ఉంటేనే అది సాధ్యపడుతుంది. చెత్తను తేలికగా తీసుకుంటాం. ఎక్కడ పారేస్తే ఏంటి అనుకుంటాం. దానివల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ప్రకృతికి హాని కలుగుతుంది. పర్యాటక రంగానికి హాని కలుగుతుంది. ఇంకా చెప్పాలంటే... దేశ ప్రతిష్ఠను కూడా అది దెబ్బ తీస్తుంది. భారతదేశాన్ని చెత్తదేశం అని ఎవరూ అనకూడదనే నేను ‘చెత్తమ్మాయి’గా మారాను!’’ -
ఓహో.. బాటిల్నూ తినేయొచ్చు..!
లండన్: ఇకపై నీళ్లు తాగేసి వాటర్ బాటిళ్లను చెత్తకుప్పల్లో... కూల్డ్రింక్ టిన్నులను రోడ్లపై పడేయాల్సిన అవసరం లేదు. చిత్రంలో చూస్తున్న ఈ ‘ఓహో’ ఆల్గే బెలూన్లను బాటిల్గా ఉపయోగిస్తే చాలు.. తాగాల్సింది తాగేసి, బాటిల్ను కూడా లొట్టలేసుకుంటూ తినేయొచ్చు. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా స్పెయిన్కు చెందిన పరిశోధకులు ఈ ‘తినే బాటిల్’ను రూపొందించారు. గోధుమ రంగు నాచు (బ్రౌన్ ఆల్గే) నుంచి సోడియం అల్జినేట్ అనే పదార్థాన్ని తీసుకుని దానికి కాల్షియం క్లోరైడ్, జెల్ పదార్థాన్ని కలిపి జిగురు పొరలతో కూడిన ఈ ఓహో బెలూన్లను తయారు చేశారు. వివిధ ఆకారాల్లోకి మార్చి వీటి జిగురు పొరల మధ్య ద్రవాలను సురక్షితంగా నిల్వచేయొచ్చు. ప్యాకింగ్కూ అనుకూలంగా ఉండే ‘ఓహో’ ఆల్గే బెలూన్లు పర్యావరణహితమైనవే కాకుండా ఎంతో చవకైనవి కూడా. -
వామ్మో.. పెరుగన్నం, వాటర్ బాటిల్ రూ.300 !
శ్రీకాళహస్తి, న్యూస్లైన్: అదేదో ఫైఫ్స్టారో, త్రీస్టారో హోటల్ కాదు; అయినా పెరుగన్నం, వాటర్ బాటిల్ ఖరీదు అక్షరాలా రూ.300..! ఇదేమి చోద్యం అని అనుకుంటున్నారా? మున్సిపల్ ఎన్నికల్లో శ్రీకాళహస్తి మున్సిపల్ అధికారుల వడ్డన ఇది..! ఆ పెరుగున్నంలోకి స్పూను పెడితే... మున్సిపల్ ఎన్నికల్లో విధుల నిర్వహణకు పలమనేరు నుంచి 150 మంది ఉద్యోగులు శనివారం శ్రీకాళహస్తికి వచ్చారు. ఆదివారం పోలింగ్ ముగిసిన తర్వాత ఉద్యోగులకు మున్సిపల్ అధికారులు రూ.500 మాత్ర మే ఇచ్చారు. వాస్తవానికి రూ.800 ఇవ్వాల్సి ఉంది. మరో రూ.300 ఇవ్వాలని ఉద్యోగులు మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. శనివారం మధ్యాహ్నం పెరుగు అన్నం, వాటర్ బాటిల్కు రూ.300 కట్ చేసినట్లు చెప్పారు. దీంతో ఉద్యోగులు షాక్కు గురయ్యారు. పెరుగన్నం, వాటర్ బాటిల్కు మూడు వందలా!? అంటూ మండిపడ్డారు. అధికారులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు నచ్చజెప్పారు. గంటపాటు ధర్నా చేసిన వారు చేసేదేమీలేక పలమనేరు బస్సు ఎక్కి వెళ్లిపోయారు. ఎన్నికల సిబ్బంది ఆకలి కేకలు మదనపల్లె సిటీ, న్యూస్లైన్: మున్సిపల్ ఎన్నికల్లో విధులు నిర్వర్తించిన సిబ్బంది ఆదివారం ఆకలికేకలతో అలమటించారు. మదనపల్లె మున్సిపాలిటీలో 34 వార్డుల్లో ఎన్నికల సిబ్బందికి ప్యాకెట్లలో ఇచ్చిన అల్పాహారం, భోజనం పాచిపోయి ఉండడంతో వాటిని ఎవరూ తినలేదు. పోలింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఏమీ పట్టనట్టు వ్యవహరించారు. వాస్తవానికి ఎన్నికల సిబ్బందికి రెండు రోజులకుగాను రూ.300 ఖర్చు చేయాల్సి ఉండగా మున్సిపల్ అధికారులు చేతివాటం ప్రదర్శించారని ఎన్నికల సిబ్బంది ఆరోపణ. దాదాపు 100 కిలోమీటర్ల దూరం నుంచి ఎన్నికల విధులకు వస్తే డీఏలో కూడా కోతలు పెట్టారని పేర్కొన్నారు.