West Indies tour
-
టీమిండియాకు షాక్.. రెండో వన్డేలో విండీస్ విజయం
రెండో వన్డేలో టీమిండియాకు కరిబీయన్ జట్టు షాకిచ్చింది. సొంతగడ్డపై సత్తా చాటుతూ భారత్పై ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు 36.4 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్ష్యఛేదనకు బరిలోకి వెస్టీండీస్ తరఫున ఓపెనర్ కైల్ మేయర్స్ 36 పరుగులతో రాణించాడు. విండీస్ కెప్టెన్ షై హోప్(63 నాటౌట్) అర్ధసెంచరీతో సత్తా చాటాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కీసీ కార్టీ(48) పరుగులతో కెప్టెన్కు అండగా నిలిచాడు. కాగా.. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లతో రాణించగా.. కుల్దీప్ యాదవ్కు ఒక వికెట్ దక్కింది. విండీస్ తాజా విజయంతో మూడు వన్డేల సిరీస్ను 1-1తో సమం చేసింది. అంతకుముందు బ్యాటింగ్లో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. విండీస్ బౌలర్ల ధాటికి 40.5 ఓవర్లలోనే 181 పరుగులకు చాప చుట్టేసింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (55 బంతుల్లో 55), శుభ్మన్ గిల్ ( 49 బంతుల్లో 34) పరుగులతో రాణించగా.. మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. -
టీమిండియాకు ఊహించని షాక్.. స్వదేశానికి పయనమైన స్టార్ ప్లేయర్
బార్బడోస్ వేదికగా విండీస్తో ఇవాళ (జులై 27) జరుగనున్న తొలి వన్డేకు ముందు టీమిండియాకు ఊహించని షాక్ తగలింది. స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ వన్డే సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడు. వర్క్ లోడ్ కారణంగా సిరాజ్కు విశ్రాంతి కల్పించినట్లు తెలుస్తుంది. వన్డే, టీ20 జట్లలో లేని టీమిండియా సభ్యులతో పాటు సిరాజ్ స్వదేశానికి పయనమయ్యాడని సమాచారం. ఆసియా కప్, వరల్డ్కప్లను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. విండీస్తో రెండో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగిన సిరాజ్.. గత కొంత కాలంగా నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్నాడు. సీనియర్లు బుమ్రా, షమీ గైర్హాజరీలో ఆ ఫార్మాట్, ఈ ఫార్మాట్ అన్న తేడా లేకుండా అన్ని ఫార్మాట్లలో బిజీగా మారాడు. బిజీగా మారడమే కాకుండా భారత పేస్ విభాగాన్ని విజయవంతంగా ముందుండి నడిపించాడు. త్వరలో టీమిండియా మెగా ఈవెంట్లలో పాల్గొననున్న నేపథ్యంలో సిరాజ్ గాయాల బారిన పడకుండా ఉండేందుకు బీసీసీఐ అతన్ని విండీస్ పర్యటన నుంచి అర్థాంతరంగా స్వదేశానికి పిలిపించింది. సిరాజ్కు రీప్లేస్మెంట్ ఎవరనే దానిపై బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి క్లూ ఇవ్వలేదు. అందుబాటులో ఉన్న బౌలర్లతోనే నెట్టుకురావలన్నది బీసీసీఐ ఆలోచనగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే, విండీస్ ఇవాళ జరుగనున్న తొలి వన్డేలో సిరాజ్ గైర్హాజరీలో ఉమ్రాన్ మాలిక్ టీమిండియా పేస్ విభాగానికి నాయకత్వం వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం జట్టులో ఉన్న పేసర్లలో ఉమ్రానే ఎక్కువ వన్డేలు (8) ఆడాడు. తొలి వన్డే కోసం ఎంపిక చేసే తుది జట్టులో స్పెషలిస్ట్ పేసర్లుగా ఉమ్రాన్, ఉనద్కత్లకు అవకాశం దక్కవచ్చు. పార్ట్ టైమ్ పేసర్లుగా ఆల్రౌండర్లు హార్ధిక్, శార్దూల్ ఠాకూర్లు తుది జట్టులో ఉండవచ్చు. -
IND VS WI 2nd Test: రాహుల్ ద్రవిడ్కు విశ్రాంతి
వెస్టిండీస్తో జరుగుతున్న సిరీస్లు ముగిసాక టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, అతని సహాయక సిబ్బందికి కొన్ని రోజుల పాటు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం విండీస్ సిరీస్ ముగిసాక టీమిండియా.. ఐర్లాండ్తో వారి స్వదేశంలో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే ఈ సిరీస్కు వెళ్లకుండా స్వదేశంలో రెస్ట్ తీసుకునేందుకే ద్రవిడ్ బృందానికి బీసీసీఐ అనుమతి ఇచ్చినట్లు సమాచారం. విండీస్తో ఆఖరి రెండు టీ20ల తర్వాత ద్రవిడ్ అండ్ కో యునైటెడ్ స్టేట్స్ (ఆఖరి 2 టీ20లు విండీస్లో కాకుండా యుఎస్ఏలో జరుగనున్నాయి) నుంచి నేరుగా భారత్కు పయనమవుతుంది. ద్రవిడ్ టీమ్లో బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేతో పాటు మరికొంత మంది సభ్యులు ఉన్నారు. సమీప భవిష్యత్తులో టీమిండియాకు ఉన్న బిజీ షెడ్యూల్ దృష్ట్యా వీరికి విశ్రాంతి ఇస్తున్నట్లు తెలుస్తోంది. ద్రవిడ్ టీమ్ గైర్హాజరీలో వీవీఎస్ లక్ష్మణ్ నేతృత్వంలోని జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) సిబ్బంది ఐర్లాండ్ పర్యటనను నిర్వహిస్తారు. లక్ష్మణ్ టీమ్లో బ్యాటింగ్ కోచ్గా హృషికేశ్ కనిత్కర్, బౌలింగ్ కోచ్గా సాయిరాజ్ బహుతులే ఉన్నారు. కాగా, గతంలోనూ పలు సందర్భాల్లో ద్రవిడ్ గైర్హాజరీలో వీవీఎస్ లక్ష్మణ్ టీమిండియా కోచింగ్ బాధ్యతలను నిర్వర్తించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉన్న భారత్ డొమినికా వేదికగా జరిగిన తొలి టెస్ట్లో భారీ విజయం సాధించి, మరో విజయం కోసం తహతహలాడుతుంది. ఈ సిరీస్లో భారత్ తదుపరి మరో టెస్ట్ మ్యాచ్, 3 వన్డేలు, 5 టీ20లు ఆడుతుంది. తొలి టెస్ట్లో యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ శతకాలు సాధించి, టీమిండియా భారీ స్కోర్కు దోహదపడగా.. అశ్విన్ 12 వికెట్లు పడగొట్టి, భారత గెలుపులో ప్రధాన పాత్ర పోషించారు. -
టీమిండియాపై గెలిచి రెండు దశాబ్దాలు దాటిపోయింది.. ఇప్పుడు అస్సలు కాదు..!
ఒకప్పటి మేటి జట్టు వెస్టిండీస్.. టెస్ట్ల్లో టీమిండియాపై విజయం సాధించి రెండు దశాబ్దాలు దాటిపోయిందంటే ఎవరైనా నమ్మగలరా..? నమ్మినా, నమ్మకపోయినా ఇది నిజం. విండీస్ జట్టు చివరిసారిగా 2002లో జమైకాలో జరిగిన టెస్ట్ మ్యాచ్లో టీమిండియాపై గెలుపొందింది. అప్పటి నుంచి 21 సంవత్సరాలుగా విండీస్కు టీమిండియాపై గెలుపే లేదు. విండీస్తో రేపటి నుంచి (జులై 12) తొలి టెస్ట్ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. మరి 21 సంవత్సరాల తర్వాతైనా విండీస్.. టీమిండియాపై గెలుస్తుందా అంటే..? అసంభవమనే చెప్పాలి. ప్రస్తుత భారత జట్టుకు విండీస్ కనీస పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్్కప్ క్వాలిఫయర్స్లో ఆ జట్టు దయనీయ పరిస్థితిని అందరం చూశాం. అయితే ముఖాముఖి రికార్డుల్లో మాత్రం భారత్పై విండీస్దే పై చేయిగా ఉంది. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య జరిగిన 98 మ్యాచ్ల్లో.. విండీస్ 30 గెలిస్తే, భారత్ 22 మ్యాచ్ల్లో మాత్రమే విజయాలు సాధించింది. 46 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. జట్ల వివరాలు.. భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానె, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శ్రీకర్ భరత్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, జయ్దేవ్ ఉనద్కత్, నవ్దీప్ సైని, ముఖేశ్ కుమార్. వెస్టిండీస్: క్రెయిగ్ బ్రాత్వైట్ (కెప్టెన్), జెర్మైన్ బ్లాక్వుడ్ (వైస్ కెప్టెన్), అలిక్ అథనేజ్, త్యాగ్నారాయణ్ చంద్రపాల్, రఖీమ్ కార్న్వాల్, జోష్వా ద సిల్వా, షనోన్ గాబ్రియల్, జేసన్ హోల్డర్, అల్జారి జోసెఫ్, కిర్క్ మెకంజీ, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జోమెల్ వారికన్ రిజర్వ్ ఆటగాళ్లు: టెవిన్ ఇమ్లాచ్, అకీమ్ జోర్డాన్ -
IND VS WI 1st Test: టీమిండియా స్టార్ బౌలర్ ముంగిట అత్యంత అరుదైన రికార్డు
విండీస్తో తొలి టెస్ట్కు ముందు టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తుంది. డొమినిక వేదికగా రేపటి నుంచి (జులై 12) ప్రారంభం కాబోయే మ్యాచ్లో అశ్విన్ మరో 3 వికెట్లు తీస్తే అంతర్జాతీయ క్రికెట్లో 700 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన మూడో భారత బౌలర్గా, అంతర్జాతీయ స్థాయిలో 16వ బౌలర్గా, ఓవరాల్గా ఆరో స్పిన్నర్గా రికార్డుల్లోకెక్కుతాడు. అశ్విన్కు ముందు భారత స్పిన్నర్లు అనిల్ కుంబ్లే (956), హర్భజన్ సింగ్ (711) మాత్రమే 700 వికెట్ల మైలురాయిని అధిగమించారు. ప్రస్తుతం అశ్విన్ ఖాతాలో 270 మ్యాచ్ల్లో (92 టెస్ట్లు, 113 వన్డేలు, 65 టీ20లు) 697 వికెట్లు (టెస్ట్ల్లో 474, వన్డేల్లో 151, టీ20ల్లో 72) ఉన్నాయి. మ్యాచ్ విషయానికొస్తే.. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో టీమిండియాకు ఇది తొలి టెస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్లో ఎలాగైనా విజయం సాధించాలని టీమిండియా ఉవ్విళ్లూరుతుంది. గత రెండు దశాబ్దాల రికార్డును చూస్తే విండీస్పై టీమిండియాకు స్పష్టమైన ఆధిక్యత ఉండటంతో ఈ సిరీస్లో రోహిత్ సేననే ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది. ప్రస్తుత టీమిండియా ఆటగాళ్లలో పోలిస్తే విండీస్ గడ్డపై అశ్విన్కు మెరుగైన రికార్డు ఉంది. కరీబియన్ గడ్డపై అశ్విన్ ఆల్రౌండ్ ప్రదర్శనతో ఇరగదీశాడు. ఇక్కడే కాకుండా ఓవరాల్గా చూసినా అశ్విన్కు విండీస్పై మెరుగైన రికార్డు ఉంది. ఆ జట్టుతో ఆడిన 11 మ్యాచ్ల్లో యాష్, 4 సెంచరీల సాయంతో 552 పరుగులు చేసి, 60 వికెట్లు పడగొట్టాడు. విండీస్ గడ్డపై ఆడిన 4 మ్యాచ్ల్లో అతను 2 సెంచరీల సాయంతో 58.75 సగటున పరుగులు చేసి, 17 వికెట్లు పడగొట్టాడు. చదవండి: టీమిండియాకు చుక్కలు చూపించిన బంగ్లా బౌలర్లు -
బాగా సన్నబడ్డ రోహిత్.. వడపావ్ ముద్రను చెరిపివేసుకున్న టీమిండియా కెప్టెన్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చాలా సన్నబడ్డాడు. వెస్టిండీస్తో సిరీస్కు ముందు బాగా వెయిట్ లాస్ అయ్యాడు. బరువు పెరగడంతో ఫీల్డ్లో చురుగ్గా ఉండలేకపోయిన హిట్మ్యాన్.. ఒబేసిటి కారణంగా చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. అమితంగా అభిమానించే వాళ్లు సైతం రోహిత్ను పలు సందర్భాల్లో వడాపావ్ అని సంబోధించేవారు. ఓవర్ వెయిట్ కారణంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న రోహిత్.. ఇటీవలికాలంలో పరుగులు చేసేందుకు కూడా చాలా ఇబ్బందులు పడ్డాడు. అసలే నిదానంగా, బద్దకంగా కనిపించే రోహిత్.. బరువు పెరగడంతో మరింత నెమ్మదించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అతని స్థాయి ఇన్నింగ్స్ ఆడి చాలాకాలమైంది. అయితే తాజాగా హిట్మ్యాన్ వెయిట్లాస్ కావడం చూస్తుంటే అతను మునుపటి ఫామ్ను అందుకుంటాడని నమ్మకం కలుగుతుంది. అతను బరువు తగ్గేందుకు చాలా శ్రమించినట్లు కనిపిస్తుంది. కఠినమైన డైట్, వ్యాయామాలు చేస్తే తప్పిస్తే అంత ఔట్పుట్ రాదు. రోహిత్ను ఇప్పుడు చూసిన వారెవరైనా.. ఏంటీ ఇంత పలచబడ్డాడని అనక మానరు. అంతలా బరువును తగ్గించుకుని ఫిట్గా కనిపిస్తున్నాడు రోహిత్. అతనిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బాగా పెరిగినట్లు కనిపిస్తున్నాయి. మునుపటితో పోలిస్తే చాలా హుషారుగా కనిపిస్తున్నాడు. ఇది చూసిన అతని అభిమానులు.. హిట్మ్యాన్ ఇదే మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నారు. Captain interviews vice-captain 🎙️pic.twitter.com/xSEfXzqeVG — CricTracker (@Cricketracker) July 11, 2023 కొత్త టెస్ట్ జెర్సీలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.. పెదవి విరుస్తున్న అభిమానులు వెస్టిండీస్తో సిరీస్ ముందు టీమిండియా ఆటగాళ్లు కొత్త టెస్ట్ జెర్సీల్లో కనిపించారు. డ్రీమ్ ఎలెవెన్ టీమిండియా జెర్సీ స్పాన్సర్షిప్ దక్కించుకోవడంతో ఆ పేరు ముద్రించిన కొత్త కిట్లలో టీమిండియా ఆటగాళ్లు దర్శనమిచ్చారు. కొత్త జెర్సీలో తీసుకున్న సెల్ఫీని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిన్న సోషల్మీడియాలో పోస్ట్ చేయగా అనూహ్య స్పందన వచ్చింది. హిట్మ్యాన్ ఏంటీ.. గుర్తుపట్టలేనంతగా ఇలా సన్నబడిపోయాడంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రోహిత్ వెయిట్ లాస్ అయినట్లు ఈ జెర్సీలో స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు కొత్త జెర్సీ డిజైన్పై టీమిండియా అభిమానులు పెదవి విరుస్తున్నారు. జెర్సీ ఛండాలంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. Indian Top 5 in Tests cricket. pic.twitter.com/cZX1lmS7lq— Johns. (@CricCrazyJohns) July 11, 2023 -
విండీస్ పర్యటనకు జట్ల ఎంపిక పూర్తి.. నలుగురు మాత్రం వెరీ వెరీ స్పెషల్
త్వరలో ప్రారంభంకానున్న వెస్టిండీస్ పర్యటనకు భారత జట్ల ఎంపిక పూర్తయ్యింది. విండీస్ పర్యటనలో భారత్ మూడు ఫార్మాట్ల సిరీస్లు ఆడనుంది. ఈ మూడు సిరీస్ల కోసం భారత సెలెక్టర్లు మూడు వేర్వేరు జట్లను ప్రకటించారు. అయితే ఈ పర్యటన నిమిత్తం ఎంపిక చేసిన ఆటగాళ్లలో సెలెక్టర్లు నలుగురికి పెద్ద పీట వేశారు. వారు తమకు వెరీ వెరీ స్పెషల్ అన్నట్లుగా వ్యవహరించారు. రోహిత్, కోహ్లిల కంటే వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. హిట్మ్యాన్, రన్ మెషీన్లను టీ20 జట్టులోకి తీసుకోని సెలెక్టర్లు.. మూడు ఫార్మాట్ల జట్లలో ఆ నలుగరుని ఎంపిక చేసి, వన్డే వరల్డ్కప్ కోసం వారిని సిద్దం చేస్తున్నామన్న సంకేతాలిచ్చారు. ఆ నలుగురు ఎవరంటే.. శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్. ఈ నలుగరు క్రికెటర్లు టెస్ట్, వన్డే, టీ20 జట్లకు ఎంపికయ్యారు. సెలెక్టర్లు వీరికి ఇచ్చిన ప్రాధాన్యతను బట్టి చూస్తే మూడు ఫార్మాట్ల తుది జట్టలో వీరు ఉండటం ఖాయమని తెలుస్తుంది. గిల్ సూపర్ ఫామ్ దృష్ట్యా ఎలాగూ తుది జట్టులో ఉంటాడు. టీమిండియాకు రెగ్యులర్ వికెట్కీపర్ లేనందున ఇషాన్ కిషన్ కూడా లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. ఒకవేళ సంజూ శాంసన్ను కూడా తుది జట్టులోకి తీసుకోవాలని భావిస్తే, ఇషాన్ బ్యాటర్గానైనా కొనసాగే అవకాశం ఉంది. టెస్ట్ల్లో జడేజాకు అవకాశం ఇచ్చినా.. వన్డే, టీ20ల్లో అక్షర్ పటేల్ స్థానానికి ఢోకా ఉండదు. ఇక ఈ నలుగురిలో మోస్ట్ లక్కీ ఎవరంటే ముకేశ్ కుమారేనని చెప్పాలి. షమీ గైర్హాజరీలో స్పెషలిస్ట్ రైట్ ఆర్మ్ పేసర్ కోటాలో ముకేశ్ జాక్పాట్ కొట్టాడు. ఈ నలుగురు విండీస్ పర్యటన పరిమిత ఓవర్ల సిరీస్లలో రాణిస్తే, వరల్డ్కప్ బెర్త్ దక్కించుకోవడం ఖాయం. విండీస్తో టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కెఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ. వన్డే సిరీస్కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, చహల్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్. టీ20 సిరీస్కు భారత జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్. విండీస్ పర్యటన వివరాలు.. జులై 12-16- తొలి టెస్ట్, డొమినికా జులై 20-24- రెండో టెస్ట్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ జులై 27- తొలి వన్డే, బ్రిడ్జ్టౌన్ జులై 29- రెండో వన్డే, బ్రిడ్జ్టౌన్ ఆగస్ట్ 1- మూడో వన్డే, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఆగస్ట్ 4- తొలి టీ20, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఆగస్ట్ 6- రెండో టీ20, గయానా ఆగస్ట్ 8- మూడో టీ20, గయానా ఆగస్ట్ 12- నాలుగో టీ20, ఫ్లోరిడా ఆగస్ట్ 13- ఐదో టీ20, ఫ్లోరిడా -
ఇద్దరు అంతే వెలగబెట్టారు.. పుజారాపై లేని నమ్మకం కోహ్లిపై ఎందుకో..?
వెస్టిండీస్ పర్యటన కోసం ప్రకటించిన భారత టెస్ట్ జట్టులో నయా వాల్ పుజారా పేరు గల్లంతు కావడంపై అతని అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వారితో కొందరు టీమిండియా మాజీలు, విశ్లేషకులు గొంతు కలుపుతున్నారు. పుజారాపై లేని నమ్మకం కోహ్లిపై మాత్రం ఎందుకోనని వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు ఒకేలా చెత్త ప్రదర్శనలు చేసినప్పడు కోహ్లిపై సెలెక్టర్లకు ప్రత్యేక ప్రేమ ఎందుకోనని నిలదీస్తున్నారు. ఈ విషయాన్ని గణాంకాల ఆధారంగా రుజువు చేస్తూ సెలెక్టర్ల తీరుపై ధ్వజమెత్తుతున్నారు. 2020 నుంచి పుజారా 28 టెస్ట్లు ఆడి 29.69 సగటున పరుగులు చేస్తే, కోహ్లి సైతం అదే యావరేజ్తో (25 మ్యాచ్ల్లో) పరుగులు చేశాడని, ఇద్దరూ ఒకేలా వెలగబెట్టినప్పుడు కోహ్లిపై మాత్రమే ప్రత్యేకమైన ఇంటరెస్ట్ చూపడం సమంజసం కాదని అభిప్రాయపడుతున్నారు. పుజారాతో పాటు కోహ్లిని కూడా తప్పిస్తే అతనికీ తెలుసొచ్చేది, అలాగే మిడిలార్డర్లో యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చినట్లూ ఉండేదని అంటున్నారు. పుజారా, కోహ్లిలను పక్కకు పెడితే 2020 నుంచి టెస్ట్ల్లో గిల్ (16 మ్యాచ్ల్లో 32.89 సగటు), రహానే (20 మ్యాచ్ల్లో 26.50)లు కూడా అడపాదడపా ప్రదర్శనలే చేశారని, వీరితో పోలిస్తే రోహిత్ శర్మ (18 మ్యాచ్ల్లో 43.2) ఒక్కడే కాస్త మెరుగైన ప్రదర్శన చేశాడని గణాంకాలతో సహా సోషల్మీడియాలో పోస్ట్లు చేస్తున్నారు. అందరూ ఓపెనర్లే.. మిడిలార్డర్లో ఎవరు..? వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేసిన భారత టెస్ట్ జట్టుపై పలువురు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వన్ డౌన్ ఆటగాడు పుజారాను పక్కకు పెట్టారు సరే.. అతని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిని ఎక్కడ తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. టెస్ట్ జట్టుకు కొత్తగా ఎంపికైన యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్లు ఓపెనర్ బ్యాటర్లేనని, అలాంటప్పుడు పుజారా స్థానాన్ని ఎలా భర్తీ చేయగలరని నిలదీస్తున్నారు. జట్టులో ఆల్రెడీ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్లు ఓపెనర్లుగా ఉన్నప్పుడు కొత్తగా మిడిలార్డర్ బ్యాటర్ను తీసుకుని ఉంటే జట్టు సమతూకంగా ఉండేదని అభిప్రాయపడుతున్నారు. సర్ఫరాజ్ ఖాన్ను ఎందుకు తీసుకోలేదు..? ఓ మిడిలార్డర్ బ్యాటర్పై (పుజారా) వేటు వేసినప్పుడు అతని స్థానాన్ని మరో మిడిలార్డర్ ఆటగాడితోనే భర్తీ చేయాలన్న లాజిక్ను సెలెక్టర్లు ఎలా మిస్ అయ్యారని భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. జట్టులో అందరూ ఓపెనర్లనే ఎంపిక చేయకపోతే, దేశవాలీ క్రికెట్లో అద్భుతాలు చేస్తున్న సర్ఫరాజ్ ఖాన్ లాంటి ఆటగాడిని తీసుకొని ఉండవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. విండీస్తో టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కెఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ. -
రోహిత్ కు విశ్రాంతి మరి కోహ్లీ సంగతి ఏంటి..!
-
తదుపరి కెప్టెన్ రహానే..!
-
టీమిండియా విండీస్ పర్యటన షెడ్యూల్ ఖరారు..!
3 వన్డేలు, 5 టీ20ల సిరీస్ల నిమిత్తం భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ పర్యటనకు బయల్దేరనుంది. 2022 జులై 22 నుంచి ఈ పరిమిత ఓవర్ల సిరీస్లు ప్రారంభంకానున్నాయి. విండీస్ పర్యటనలో భారత్ తొలుత వన్డేలు, ఆతర్వాత టీ20లు ఆడనుంది. బీసీసీఐ, విండీస్ క్రికెట్ బోర్డు అందించిన సమాచారం మేరకు ట్రినిడాడ్లోని క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానం వేదికగా జూలై 22, 24, 27 తేదీల్లో మూడు వన్డేలు జరుగనున్నాయి. అనంతరం జూలై 29న తొలి టీ20, ఆగస్టు 1, 2 తేదీల్లో రెండు, మూడు టీ20లు, ఆగస్టు 6, 7 తేదీల్లో చివరి రెండు మ్యాచ్లు జరగనున్నాయి. చదవండి: 'వార్నర్ కంటే అవమానాలు.. హార్దిక్ పరిస్థితి అలా కాదుగా' -
జేసన్ రాయ్ విధ్వంసం.. 36 బంతుల్లోనే శతకం
వెస్టిండీస్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు ముందు జరిగిన వార్మప్ మ్యాచ్లో ఇంగ్లండ్ బ్యాటర్ జేసన్ రాయ్ విధ్వంసం సృష్టించాడు. 36 బంతుల్లో 10 సిక్సర్లు, 9 ఫోర్లతో శతక్కొట్టాడు. బార్బడోస్ ప్రెసిడెంట్స్ ఎలెవన్తో జరిగిన మ్యాచ్లో జేసన్ ఈ ఫీట్ను సాధించాడు. కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో మొత్తం 47 బంతులను ఎదుర్కొన్న జేసన్.. 115 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతను పొట్టి ఫార్మాట్లో పదో వేగవంతమైన శతకాన్ని సాధించాడు. ఫలితంగా ఇంగ్లండ్ నాలుగు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ప్రత్యర్ధి కేవలం 137 పరుగులకే చేతులెత్తేయడంతో పర్యాటక జట్టు విజయం సాధించింది. ఈ సునామీ ఇన్నింగ్స్తో జేసన్ రాయ్ ఐపీఎల్ జట్లకు ఛాలెంజ్ విసిరాడు. మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్ మెగా వేలం ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ ఇన్నింగ్స్ అతనికి భారీ ధర సమకూర్చి పెట్టే అవకాశం ఉంది. కాగా, రాయ్.. గత ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. చదవండి: టీమిండియా క్రికెటర్లకు మరో అవమానం.. పాక్ ఆటగాళ్లకే అందలం -
మరో ఇద్దరు స్టార్ క్రికెటర్లకు కరోనా..
న్యూయార్క్: కరోనా మహామ్మారి క్రికెట్ ప్రపంచంపై మరోసారి పంజా విసురుతుంది. కొద్ది గంటల క్రితమే ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్కు కరోనా పాజిటివ్గా నిర్దారణ కాగా.. తాజాగా మరో ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు పాజిటివ్గా తేలింది. కీలకమైన విండీస్ పర్యటనకు ముందు అమెరికాలో బస చేస్తున్న ఐర్లాండ్ ఆటగాళ్లు పాల్ స్టిర్లింగ్, షేన్ గెట్కేట్ కరోనా బారిన పడ్డారు. వచ్చే ఏడాది జనవరి 8 నుంచి 23 వరకు విండీస్తో మూడు వన్డేలు, టీ20 మ్యాచ్ ఆడాల్సి ఉండగా.. జట్టులోని ఇద్దరు కీలక ఆటగాళ్లు మహమ్మారి బారిన పడడంతో ఐర్లాండ్ జట్టులో కలవరం మొదలైంది. స్టిర్లింగ్, గెట్కేట్లు ఇద్దరు వేర్వేరుగా 10 రోజుల పాటు క్వారంటైన్లో ఉండనున్నట్లు ఐర్లాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. వీరిద్దరు జనవరి 9న తిరిగి(రెండోసారి పరీక్షల అనంతరం) జట్టులో చేరే అవకాశం ఉందని జట్టు యాజమాన్యం పేర్కొంది. కాగా, పాల్ స్టిర్లింగ్ ఐర్లాండ్ తరఫున 134 వన్డేల్లో 38.09 సగటుతో 12 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీల సాయంతో 4982 పరుగులు, 94 టీ20ల్లో 30.06 సగటుతో ఓ సెంచరీ, 19 హాఫ్ సెంచరీల సాయంతో 2606 పరుగులు సాధించాడు. అతని ఖాతాలో 43 వన్డే వికెట్లు, 20 టీ20 వికెట్లు ఉన్నాయి. ఇక, షేన్ గెట్కేట్ విషయానికొస్తే.. ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్ ఐర్లాండ్ తరఫున 4 వన్డేలు, 25 టీ20లు ఆడాడు. చదవండి: IND Vs SL Final: భారత బౌలర్ల ధాటికి లంక జట్టు విలవిల.. -
క్రికెట్ ఆస్ట్రేలియాకు షాక్.. విదేశీ సిరీస్ల నుంచి ఏడుగురు ఔట్
సిడ్నీ: ఐపీఎల్ 2021లో ఆడిన అగ్రశ్రేణి ఆసీస్ క్రికెటర్లు వెస్టిండీస్, బంగ్లాదేశ్ పర్యటనల నుంచి వైదొలుగుతూ, క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)కు షాకిచ్చారు. ఈ ఏడాది చివర్లో జరుగనున్న టీ20 ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని, సీఏ ఈ రెండు విదేశీ పర్యటనలను ఖరారు చేయగా, ఆసీస్ స్టార్ ఆటగాళ్లు మాత్రం నిరాసక్తత కనబర్చారు . కొందరు వ్యక్తిగత కారణాలు సాకుగా చూపిస్తూ, మరికొందరు గాయాల నుంచి కోలుకోలేదని నివేదికలు సమర్పిస్తూ ఈ రెండు విదేశీ పర్యటనలకు డుమ్మా కొట్టారు. సీనియర్లు డేవిడ్ వార్నర్, పాట్ కమిన్స్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టాయినీస్లు వ్యక్తిగత కారణాల వల్ల తమను ఈ టూర్ కోసం పరిగణించవద్దని విజ్ఞప్తి చేయగా, స్టీవ్ స్మిత్, జే రిచర్డ్సన్, కేన్ రిచర్డ్సన్, డేనియల్ సామ్స్లు ఐపీఎల్ సమయంలో తగిలిన గాయాల కారణంగా జట్టు నుంచి తప్పించమని అభ్యర్ధించారు. టీ20 ప్రపంచ కప్ అక్టోబర్ నెలలో ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆటగాళ్లు ఒక్కొక్కరు ఒక్కొక్క సాకు చూపుతూ జట్టుకు దూరంగా ఉండటం సీఏను కలవరపెడుతుంది. ఇదిలా ఉంటే, విండీస్, బంగ్లా టూర్ కోసం 18 మందితో కూడిన జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం ప్రకటించింది. ఆసీస్ జట్టు జూలై 9 నుంచి 24 మధ్య విండీస్తో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడాల్సి ఉండగా, బంగ్లాదేశ్లో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్పై ఇంకా స్పష్టతరావాల్సి ఉంది. చదవండి: KL RAHUL: ప్రియసఖితో తొలిసారి.. గతంలో విరుష్క జోడీ కూడా ఇలానే -
రీఎంట్రీ ఇచ్చిన ఆసీస్ స్టార్ ఆటగాళ్లు
మెల్బోర్న్: విండీస్తో జులై 10 నుంచి ప్రారంభం కానున్న పరిమిత ఓవర్ల సిరీస్ కోసం 23 మంది సభ్యులతో కూడిన బృందాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) సోమవారం ప్రకటించింది. ఇటీవల న్యూజిలాండ్ పర్యటనకు దూరమైన స్టార్ క్రికెటర్లు స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్వుడ్, డేవిడ్ వార్నర్, పాట్ కమిన్స్ తిరిగి జట్టులోకి వచ్చారు. ఈ పర్యటన నిమిత్తం ఆసీస్ సెలెక్షన్ కమిటీ ఏకంగా నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేసింది. అరోన్ ఫించ్ సారథ్యంలోని ఆసీస్ జట్టు విండీస్ పర్యటనలో 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఈ ఏడాది చివర్లో భారత్లో జరుగబోయే టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా జంబో జట్టును ప్రకటించింది. జట్టు వివరాలు: ఆరోన్ ఫించ్(కెప్టెన్), ఆస్టన్ అగర్, జేసన్ బెహ్రెరెన్డార్ఫ్, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్, జోష్ హేజిల్వుడ్, మోసిస్ హెన్రిక్స్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్వెల్, రిలే మెరిడిత్, జోష్ ఫిలిప్, కేన్ రిచర్డ్సన్, జై రిచర్డ్సన్, తన్వీర్ సంఘా, డి షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్వెప్సన్, అండ్రూ టై, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా చదవండి: నేను సచిన్ పోస్టర్లు చించితే.. అతను అఫ్రిది ఫోటోలను చించాడు -
హోప్పై వేటు వేశారు
సెయింట్ జాన్స్ (అంటిగ్వా): న్యూజిలాండ్తో వచ్చే నెలలో మొదలయ్యే టి20, టెస్టు సిరీస్లకు వెస్టిండీస్ జట్లను ప్రకటించింది. టెస్టు జట్టులోకి డారెన్ బ్రేవో, హెట్మైర్, కీమో పాల్ పునరాగమనం చేయగా... బ్యాట్స్మన్ షై హోప్ ఉద్వాసనకు గురయ్యాడు. గత కొంత కాలంగా పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతోన్న హోప్ను సెలక్టర్లు పక్కన పెట్టారు. టెస్టు జట్టుకు సారథిగా జేసన్ హోల్డర్ వ్యవహరించనున్నాడు. వికెట్ కీపర్ ఆండ్రూ ఫ్లెచర్ 2018 తర్వాత తొలిసారి టి20 జట్టులో స్థానం దక్కించుకోవడం విశేషం. కరోనా నేపథ్యంలో తాము న్యూజిలాండ్ పర్యటనలో పాల్గొనలేమని ఆల్రౌండర్ ఆండ్రూ రసెల్, ఓపెనర్లు లెండిల్ సిమ్మన్స్, ఎవిన్ లూయిస్లు విండీస్ బోర్డుకు తెలియజేయడంతో వారిని పరిగణనలోకి తీసుకోలేదు. టి20 జట్టుకు కీరన్ పొలార్డ్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. వెస్టిండీస్... న్యూజిలాండ్ పర్యటనను టి20 సిరీస్తో ఆరంభించనుంది. నవంబర్ 27, 29, 30వ తేదీల్లో మూడు టి20లను ఆడనున్న కరీబియన్ జట్టు... డిసెంబర్ 3–7, 11–15 మధ్య రెండు టెస్టు మ్యాచ్ల్లో కివీస్తో తలపడనుంది. -
బంగర్... ఏమిటీ తీరు?
న్యూఢిల్లీ: టీమిండియా బ్యాటింగ్ కోచ్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన అనంతరం సంజయ్ బంగర్ ప్రవర్తించిన తీరు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. మిగతా కోచింగ్ సిబ్బందికి పొడిగింపు ఇచ్చి తనను విస్మరించినందుకు రగిలిపోయిన బంగర్... ఇటీవలి వెస్టిండీస్ పర్యటనలో జట్టుతో పాటు ఉన్న జాతీయ సెలక్టర్ దేవాంగ్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించాడు. హోటల్లోని దేవాంగ్ గాంధీ గదికి వెళ్లి వాగ్వాదానికి దిగాడు. ఓ దశలో మరింత కోపోద్రిక్తుడయ్యాడు. ఈ విషయమంతా బోర్డు దృష్టికి వచ్చింది. దీంతో బంగర్ను ప్రశ్నించాలని నిర్ణయించింది. అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ సునీల్ సుబ్రమణియన్, చీఫ్ కోచ్ రవిశాస్త్రిలను ఘటనపై నివేదిక కోరింది. బంగర్ ఆవేదనలో అర్థం ఉన్నా సెలక్టర్లను ప్రశ్నించే హక్కు అతడికి లేదని స్పష్టంచేసింది. ‘రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ల పనితీరు బాగున్నందుకే కొనసాగింపు ఇచ్చాం. అదేమీ లేని బంగర్ మళ్లీ అవకాశం దక్కుతుందని ఎలా అనుకుంటాడు? ఎవరైనా సరే నిబంధనలు పాటించాల్సిందే. జట్టు మేనేజ్మెంట్ నివేదిక వచ్చాక దానిని క్రికెట్ పాలకుల కమిటీ (సీవోఏ) ముందుంచుతాం’ అని బోర్డు అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఇటీవలి ప్రక్రియలో హెడ్ కోచ్ నియామకాన్ని క్రికెట్ సలహా మండలి చూసుకోగా, సహాయ కోచ్లను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. మరోవైపు జట్టులోకి తీసుకోకపోవడంపై ఆటగాళ్లు సోషల్ మీడియాలో సెలక్టర్లపై కామెంట్లు చేస్తుండటం పైనా చర్చ నడుస్తోంది. గత సీజన్లో 850 పైగా పరుగులు చేసినా దులీప్ ట్రోఫీకి పరిగణనలోకి తీసుకోని వైనాన్ని సౌరాష్ట్ర బ్యాట్స్మన్ షెల్డన్ జాక్సన్ ప్రశ్నించాడు. ఇలాంటివాటిపై చర్యలు తీసుకునేలా సీవోఏ ఓ విధానం రూపొందించాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నారు. -
కోహ్లికి మద్దతు పలికిన పాక్ క్రికెటర్
ఇస్లామాబాద్ : ప్రపంచకప్ ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా అతన్ని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు అప్పగించాలనే డిమాండ్ వ్యక్తం అవుతోంది. ప్రపంచకప్ ప్రదర్శనపై ఒక్క సమీక్షా సమావేశం లేకుండానే కోహ్లిని తిరిగి కెప్టెన్గా కొనసాగించడాన్ని దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ సైతం తప్పుబట్టాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ క్రికెట్ విషయాలపై ఎప్పటికప్పుడు విశ్లేషణలు చేసే పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ మాత్రం టీమిండియా కెప్టెన్సీ మార్పు అవసరం లేదన్నాడు. కెప్టెన్గా కోహ్లినే సరైనవాడని చెప్పుకొచ్చాడు. మంగళవారం ట్విటర్రో అభిమానుల అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని.. ‘రోహిత్ శర్మ టీమిండియా సారథ్య బాధ్యతలు చేపడుతాడా?’ అని ప్రశ్నించాడు. దీనికి అక్తర్ ఆ అవసరం లేదని సమాధానమిచ్చాడు. ప్రస్తుతం కోహ్లినే సరైన వాడని అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్ ఓటమితో జట్టు విభేదాలు తలెత్తాయని, ముఖ్యంగా కోహ్లి, రోహిత్ శర్మకు అసలు పడటం లేదని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన కెప్టెన్సీ కాపాడుకోవడానికే కోహ్లి వెస్టిండీస్ పర్యటకు వెళ్తున్నాడనే పుకార్లు వెలువడ్డాయి. వీటిపై కెప్టెన్ కోహ్లి విండీస్ పర్యటనకు ముందు నిర్వహించిన సమావేశంలో స్పష్టతనిచ్చినా ఈ తరహా ప్రచారం ఆగడం లేదు. Not required — Shoaib Akhtar (@shoaib100mph) July 29, 2019 -
అంతా నాన్సెన్స్ : రవిశాస్త్రి
ముంబై : జట్టులో విభేదాలు అంటూ చేస్తున్న ప్రచారమంతా నాన్సెన్స్ అని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి కొట్టిపారేశాడు. ప్రపంచకప్ ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య విభేదాలు తలెత్తాయని జరుగుతున్న ప్రచారంపై ఆయన ఘాటుగా స్పందించాడు. క్రికెటర్ల భార్యలు బ్యాటింగ్, బౌలింగ్ కూడా చేస్తున్నారనే వార్తలు కూడా త్వరలో చదువుతారని, పరస్థితి ఆస్థాయికి దిగజారిందన్నాడు. వీండిస్ పర్యటనకు బయల్దేరేముందు నిర్వహించిన మీడియా సమావేశంలో కెప్టెన్ కోహ్లితో కలిసి రవిశాస్త్రి మాట్లాడాడు. ‘జట్టులో ఆటకన్నా ఎవరు గొప్ప కాదు. అది కెప్టెన్ విరాట్ అయినా, నేనైనా.. ఇంకెవరైనా అందరం జట్టుకోసమే ఆలోచించేవాళ్లమే. జట్టులో విభేదాలుంటే అన్ని ఫార్మాట్లలో ఇంత నిలకడగా, ఇన్నేళ్లు ఏ జట్టు రాణించేది కాదు. డ్రెస్సింగ్ రూంలోని ఓ వ్యక్తిగా చెబుతున్నా జట్టులో ఎలాంటి విభేదాలు లేవు’ అని రవిశాస్త్రి స్పష్టం చేశాడు. అయితే ప్రపంచకప్ గెలవాల్సిందని కానీ దురదృష్టవశాత్తు చేజారిందన్నాడు. న్యూజిలాండ్తో జరిగిన సెమీస్ మ్యాచ్లో ప్రారంభ 30 నిమిషాలు ఎంతో గుణపాఠాన్ని నేర్పిందని చెప్పుకొచ్చాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి సైతం జట్టులో అంతా బాగుందని, ఎవరో కావాలని ఇలాంటివి పుట్టిస్తున్నారని అసహనం వ్యక్తం చేశాడు. కోచ్గా రవిశాస్త్రికే తన ఓటని అతనితో ఉన్న అనుబంధాన్ని కోహ్లి మరోసారి ప్రదర్శించాడు. ‘కోచ్ ఎంపిక విషయంపై సీఏసీ ఇప్పటి వరకైతే నన్ను ఏమీ అడగలేదు. అయితే నాకు, శాస్త్రికి మధ్య మంచి సమన్వయం ఉంది. ఆయన కోచ్గా కొనసాగాలని కోరుకుంటున్నా. నన్ను అభిప్రాయం అడిగితే మాత్రం ఇదే చెబుతా’ అని కోహ్లి స్పష్టం చేశాడు. విండీస్ పర్యటనలో భాగంగా కోహ్లిసేన ఆగస్టు 3,4న రెండు టీ20లు, 8 నుంచి 14 మధ్య మూడు వన్డేలు, ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 3 మధ్య రెండు టెస్ట్లు ఆడనుంది. -
అలాంటిదేమి లేదు.. కోహ్లి వివరణ
ముంబై : ప్రపంచకప్ సెమీస్లో న్యూజిలాండ్పై టీమిండియా ఓటమి అనంతరం ఓపెనర్ రోహిత్ శర్మతో విభేదాలు తలెత్తాయన్నా వార్తలను సారథి విరాట్ కోహ్లి కొట్టిపారేశాడు. వెస్టిండీస్ పర్యటనకు భారత క్రికెట్ జట్టు బయల్దేరి ముందు కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రి ప్రెస్ కాన్ఫరెన్స్లో పలు ఆసక్తిక విషయాలను వెల్లడించాడు. ప్రపంచకప్ ఓటమి ప్రభావం కుర్రాళ్లపై పడకూడదనే ఉద్దేశంతోనే విండీస్ టూర్కు విశ్రాంతి తీసుకోలేదని వివరించాడు. ఇక రోహిత్ శర్మతో వాగ్వాదం జరిగిందని, మాట్లాడుకోవడం లేదనేది అసత్యమని తేల్చిచెప్పారు. ‘రోహిత్-కోహ్లి మధ్య విభేదాలు అనే వార్తలు నేను కూడా విన్నాను. డ్రెస్సింగ్ రూంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటేనే విజయం వరిస్తుంది. ఒకవేళ ఆ వార్తలే నిజమైతే.. మేం ఇంత గొప్పగా రాణించేవాళ్లం కాదు. విజయాలు సాధించే వాళ్లం కాదు. నేను ఎవరినైనా ద్వేషిస్తే అది నా ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. నేను రోహిత్ని ఎప్పుడు ప్రశంసిస్తూనే ఉంటాను. ప్రపంచకప్ హీరో అయిన రోహిత్తో నేను గొడవపడటం ఏంటి. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఇవన్నీ సృష్టించడం వల్ల ఎవరు లాభపడ్డారో అందరికీ తెలుసు. డ్రెస్సింగ్ రూంలో సీనియర్లను ఎలా గౌరవిస్తామో.. జూనియర్లతో కూడా అలానే ఉంటాం. టీమిండియా ప్రదర్శన, ఆటగాళ్ల తీరును చూస్తే ఎటుమంటి సమస్యలు మా మధ్య లేవనే అనుకుంటున్నాను. రవి భాయ్(రవి శాస్త్రి)నే కోచ్గా కొనసాగిస్తే.. మాకు అది ఆనందమే. ఈ విషయంపై క్రికెట్ అడ్వైజరీ కమిటీ(సీఏసీ)తో నేను మాట్లాడలేదు’అంటూ కోహ్లి వివరించాడు. -
ధోని స్థానాన్ని భర్తీ చేయగలను.. కానీ
ముంబై: టీమిండియా సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోని వారసుడిగా పేర్కొంటున్న యువ సంచలనం రిషభ్ పంత్పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. కెరీర్ ఆరంభంలోనే భారత్ మిస్టర్ 360గా పేరుగాంచిన ఈ యువ ఆటగాడు.. తనదైన స్టైలీష్ ఆటతో అభిమానులను అలరిస్తుంటాడు. దీంతో పంత్కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. వెస్టిండీస్ పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో మూడు ఫార్మట్లలో చోటు దక్కించుకున్న పంత్.. టీమిండియా భవిష్యత్ ఆశాకిరణంగా సెలక్టర్లు భావిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం ఓ జాతీయ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంత్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ‘ధోని వంటి దిగ్గజ ఆటగాడి స్థానంలో ఆడుతున్న విషయం తెలుసు. కాని దీని గురించి ఎక్కువగా ఆలోచిస్తే సమస్యలు ఏర్పాడతాయి. ధోని స్థానాన్ని భర్తీ చేయగలను. కానీ ఇప్పుడే కాదు.. దానికి కొంచెం సమయం పడుతుంది. ఇక అభిమానులు ఏం అనుకుంటున్నారో ఎక్కువగా ఆలోచించను. ప్రస్తుతం నా దృష్టంతా మంచి ప్రదర్శన చేయడం.. ఆటను మెరుగుపరుచుకోవడం. స్టైలీష్గా ఆడటం కంటే జట్టు పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటం ముఖ్యం. ప్రస్తుతం నేర్చుకునే దశలోనే ఉన్నాను. తప్పిదాలు చేయడం సహజం. కానీ పొరపాట్ల నుంచి గుణపాఠం నేర్చుకుంటున్నాను. ఇక ఏ స్థానంలోనైనా బ్యాటింగ్కు చేయగలను. ప్రస్తుతం నాలుగు స్థానంలోనైనా దిగడానికి సిద్దం. కీపింగ్లో మరింత మెరుగుపడాలి. ధోనిని ఎప్పుడు కలిసినా కీపింగ్ మెళుకువలపై చర్చిస్తుంటా. టెస్టులతోనే నా ఆటలో పరిణితి చెందిందని భావిస్తున్నా. చిన్ననాటి కోచ్ల నుంచి ఇప్పటి ప్రధాన కోచ్ల వరకు ఆందరూ నా ఆట మెరుగుపడడానికి, ఈ స్థాయికి రావడానికి కృషి చేసిన వారే. వారందరికీ రుణపడి ఉంటాను’అంటూ పంత్ వివరించాడు. -
అందుకే కోహ్లి విశ్రాంతి తీసుకోలేదు!
న్యూఢిల్లీ : ప్రపంచకప్ నిష్క్రమణ అనంతరం భారత జట్టులో గ్రూపు తగాదాలున్నాయనే ఊహాగానాలు వెలువడిన విషయం తెలిసిందే. ప్రధానంగా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ చెరో క్యాంప్ నడుపుతున్నారనే పుకార్లు హల్చల్ చేసాయి. కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్ శర్మకు ఇవ్వాలనే డిమాండ్ కూడా వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే ఇండియాకు ఇద్దరి కెప్టెన్లను తీసుకొచ్చే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు... కోహ్లి కెప్టెన్సీని టెస్ట్లకే పరిమితం చేస్తూ లిమిటెడ్ ఓవర్ల ఫార్మాట్ బాధ్యతలను రోహిత్కు ఇవ్వనున్నట్లు ప్రచారం కూడా జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే అభద్రతాభావానికి లోనైన కోహ్లి.. విశ్రాంతిని కాదనుకొని వెస్టిండీస్ పర్యటనకు వెళ్తున్నాడనే మాటలు వినిపించాయి. అయితే ఇవన్నీ తప్పుడు మాటలేనని బీసీసీఐ సన్నిహిత వర్గాలు తెలిపినట్లు టౌమ్స్నౌ పేర్కొంది. ప్రపంచకప్ ఓటమి అనంతరం ఆత్మవిశ్వాసం కోల్పోయిన జట్టును వీడి విశ్రాంతి తీసుకోవడం కెప్టెన్గా భావ్యం కాదని భావించే కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. ‘ప్రపంచకప్ నిష్క్రమణ అనంతరం జట్టు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో ఉన్న జట్టును విండీస్ పర్యటనకు పంపించడం భావ్యం కాదని, ఆటగాళ్లలో సానుకూల ధృక్పథం తీసుకురావాలని భావించాడు. ప్రపంచకప్ ఓటమి జట్టులో ప్రతి ఒక్కరిని బాధపెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో జట్టుకు దూరంగా ఉండటం కన్నా జట్టుతో ఉండడమే ఓ కెప్టెన్ కర్తవ్యమని కోహ్లి భావించాడు.’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఆగస్టు 3 నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు వెస్టిండీస్లో పర్యటించనున్న భారత జట్లను బీసీసీఐ ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. మూడు ఫార్మాట్లకు కోహ్లినే కెప్టెన్గా కొనసాగించింది. -
‘ఆ క్రెడిట్ అంతా గంభీర్దే’
న్యూఢిల్లీ: తనలోని టాలెంట్ను గుర్తించి ప్రోత్సహించినందుకు గౌతం గంభీర్కు జీవితాంతం రుణపడి ఉంటానని టీమిండియా యువ పేసర్ నవదీప్ షైనీ పేర్కొన్నాడు. తన కెరీర్ ఎదుగుదలలో గంభీర్ భయ్యా చేసిన సాయాన్ని ఎప్పటికీ మరువలేని తాజాగా తెలిపాడు. విండీస్ పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించుకున్న షైనీ మాట్లాడుతూ.. తన టాలెంట్ను గంభీర్ గుర్తించడమే కాకుండా ఎంతో అండగా నిలిచాడన్నాడు. ‘నా కెరీర్లో గంభీర్ భయ్యా సహకారాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. ఈ స్థాయిలో నేను ఇక్కడ ఉన్నానంటే అందుకు కారణం అతడే. నేను ఏమైనా సాధిస్తే, అందులో గంభీర్ పేరు తప్పక ఉంటుంది. నా ఎదుగుదల క్రెడిట్ అంతా గంభీర్ భయ్యాదే’ అని షైనీ పేర్కొన్నాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో సైతం నవదీప్ షైనీ తన పదునైన బంతులతో ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్మెన్కు చుక్కలు చూపించాడు. ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన రెండో ఆటగాడిగా నవదీప్ షైనీ 152.85 కి.మీ వేగంతో రికార్డు నెలకొల్పాడు. దేశవాళీ క్రికెట్లో గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. -
ధోని దరఖాస్తుకు ఆమోద ముద్ర!
న్యూఢిల్లీ: ఆర్మీ బెటాలియన్లో శిక్షణ కోసం టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని చేసిన దరఖాస్తుకు భారత ఆర్మీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం. ఈ మేరకు భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. విండీస్ పర్యటన నుండి స్వయంగా తప్పుకున్న ధోని.. గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో రెండు నెలల పాటు పారామిలటరీ రెజిమెంట్లో పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. దీనిలో భాగంగా ఆర్మీలో పని చేయడానికి ఇటీవల భారత ఆర్మీ ఉన్నతాధికారులకు దరఖాస్తు చేశాడు. తాజాగా భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్.. ధోని దరఖాస్తుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం తెలిసింది. ప్యారాచూట్ రెజిమెంట్ బెటాలియన్లో రెండు నెలల పాటు శిక్షణ తీసుకుంటాడు. కశ్మీర్ లోయ పరిసర ప్రాంతాల్లో శిక్షణ ఉండే అవకాశం ఉంది. -
విండీస్ సిరీస్కు సై
ముంబై: ప్రపంచ కప్ సాధించలేకపోయిన బాధను అధిగమిస్తూ వెస్టిండీస్ సిరీస్కు టీమిండియాను ఎంపిక చేసింది జాతీయ సెలక్టర్ల బృందం. విడివిడిగా కాకుండా మూడేసి టి20లు, వన్డేలతో పాటు రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్కు ఒకేసారి జట్లను ప్రకటించింది. చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో ఆదివారం ఇక్కడ సమావేశమైన సెలక్టర్లు పరిమిత ఓవర్ల ఫార్మాట్కు 15 మంది చొప్పున, టెస్టులకు 16 మంది సభ్యుల పేర్లను వెల్లడించారు. వీరిలో పేసర్ నవదీప్ సైనీ (ఢిల్లీ), స్పిన్నర్ రాహుల్ చహర్ (రాజస్తాన్) పూర్తిగా కొత్త ముఖాలు. విశ్రాంతి ఊహాగానాలను తోసిరాజంటూ కెప్టెన్ విరాట్ కోహ్లి మొత్తం పర్యటనలో పాల్గొననున్నాడు. వన్డే ప్రపంచ కప్ జట్టులో ఉన్న వికెట్ కీపర్ బ్యాట్స్మన్ దినేశ్ కార్తీక్పై వేటు పడింది. పనిభారం రీత్యా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను టెస్టులకే పరిమితం చేయగా, ఫిట్నెస్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను పరిగణనలోకి తీసుకోలేదు. ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 3 వరకు జరిగే కరీబియన్ పర్యటనలో భారత్ 3 టి20లు, 3 వన్డేలు, 2 టెస్టులు ఆడుతుంది. హార్దిక్ది గాయయా? విశ్రాంతా? మూడు ఫార్మాట్లలోనూ కీలకమైన పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను మొత్తం విండీస్ టూర్కే ఎంపిక చేయలేదు. ప్రపంచ కప్లో బాగానే రాణించిన హార్దిక్... సెమీస్కు వచ్చేసరికి ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడ్డాడు. కొంతకాలంగా అతడిని వేధిస్తున్న వెన్నునొప్పి తిరగబెట్టకుండా సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. పృథ్వీ షా మళ్లీ మిస్... అరంగేట్రంలోనే సెంచరీతో అదరగొట్టిన యువ సంచలనం పృ థ్వీ షాను ఆ తర్వాత దురదృష్టం వెంటాడుతున్నట్లుంది. పట్టిం చుకోనవసరం లేని ప్రాక్టీస్ మ్యాచ్లో క్లిష్టమైన క్యాచ్ అందుకోబోయి పాదం గాయానికి గురై, కెరీర్కు కీలకమైన ఆస్ట్రేలియా పర్యటనకు దూరమైన పృథ్వీ... ఇప్పుడు మరో గాయంతో వెస్టిండీస్ సిరీస్నూ చేజార్చుకున్నాడు. రెండు నెలల క్రితం ముంబై టి20 లీగ్లో ఆడుతూ గాయం బారినపడ్డ అతడు ప్రస్తుతం కరీబియన్ దీవుల్లో ఆడుతున్న భారత ‘ఎ’ జట్టులో స్థానాన్ని కోల్పోయాడు. విండీస్తో టెస్టులకు కొంత సమయం ఉన్నా సెలక్టర్లు పృథ్వీని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో విదేశాల్లో సత్తా చాటేందుకు అతడు ఇంకొంత కాలం ఆగక తప్పలేదు. టెస్టు జట్టు: సభ్యులు 16 ఎంపిక తీరు: మయాంక్ అగర్వాల్, రాహుల్, పుజారా, కోహ్లి, రహానే, హనుమ విహారి, రోహిత్ శర్మ, రిషభ్ పంత్, సాహా, అశ్విన్, జడేజా, కుల్దీప్, షమీ, ఇషాంత్ శర్మ, బుమ్రా, ఉమేశ్ యాదవ్. ఎంపిక తీరు: స్పెషలిస్ట్ మూడో ఓపెనర్గా ఎవరినీ తీసుకోలేదు. మయాంక్, రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారు. అవసరమైతే తెలుగు ఆటగాడు విహారిని ఓపెనింగ్కు పరిశీలించే వీలుంది. ఈ కారణంగానే దేశవాళీ, ‘ఎ’ జట్ల తరఫున సెంచరీలతో దుమ్మురేపుతున్న ప్రియాంక్ పాంచాల్ (గుజరాత్), అభిమన్యు ఈశ్వరన్ (బెంగాల్)లకు పిలుపు అందలేదు. ప్రపంచ కప్ టాప్ స్కోరర్ రోహిత్ శర్మకు మళ్లీ అవకాశం దక్కింది. రోహిత్ ఆస్ట్రేలియాలో పర్యటించిన జట్టులోనూ సభ్యుడు. ఏడాదిగా గాయంతో అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన వృద్ధిమాన్ సాహాను రెండో వికెట్ కీపర్గా తీసుకున్నారు. ఆసీస్ టూర్లో జట్టులో ఉన్న మిగతా నలుగురు పేసర్లకూ స్థానం కల్పించిన సెలెక్టర్లు పేసర్ భువనేశ్వర్ను పక్కన పెట్టారు. స్పిన్ బాధ్యతలను అశ్విన్–జడేజా–కుల్దీప్ త్రయం మోయనుంది. వన్డే జట్టు: సభ్యులు 15 ఎంపిక తీరు: రోహిత్ శర్మ, ధావన్, కోహ్లి, రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, పంత్, జడేజా, కుల్దీప్, చహల్, కేదార్ జాదవ్, షమీ, భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్, నవదీప్ సైనీ. ఎంపిక తీరు: వేలి గాయంతో ప్రపంచ కప్ నుంచి తప్పుకొన్న ఓపెనర్ శిఖర్ ధావన్ ఫిట్నెస్ సాధించడంతో అందుబాటులోకి వచ్చాడు. బ్యాటింగ్ ఆర్డర్లో నంబర్–4 స్థానం సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో నిఖార్సైన బ్యాట్స్మెన్ అయ్యర్, పాండేలకు అవకాశం దక్కింది. సీనియర్ దినేశ్ కార్తీక్పై వేటుతో రిషభ్ పంత్ ఏకైక కీపర్గా వ్యవహరించనున్నాడు. ఆల్రౌండర్ కేదార్ జాదవ్ను తప్పిస్తారని ఊహించినా అతడిపై భరోసా ఉంచారు. ఎడంచేతి వాటం పేసర్ ఖలీల్ పునరాగమనం చేస్తున్నాడు. గాయం నుంచి ఇంకా కోలుకోని ఆల్రౌండర్ విజయ్ శంకర్ పేరు ప్రస్తావనకు రాలేదు. టి20 జట్టు: సభ్యులు 15 ఎంపిక తీరు: రోహిత్, ధావన్, కోహ్లి, రాహుల్, అయ్యర్, పాండే, పంత్, కృనాల్ పాండ్యా, జడేజా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చహర్, దీపక్ చహర్, ఖలీల్, భువనేశ్వర్, నవదీప్ సైనీ. ఎంపిక తీరు: జాతీయ జట్టు సభ్యులుగా సోదర ద్వయం రాహుల్ చహర్ (స్పిన్), దీపక్ చహర్ (పేసర్) తొలిసారి మైదానంలో దిగే వీలుంది. దీపక్ గతంలో ఒక వన్డే, ఒక టి20 ఆడాడు. ఐపీఎల్, ‘ఎ’ జట్టు తరఫున అదరగొట్టిన 19 ఏళ్ల రాహుల్ చహర్ తన ప్రతిభకు గుర్తింపుగా టీమిండియా గడప తొక్కాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్లకు పట్టించుకోని వాషింగ్టన్ సుందర్కు తిరిగి పిలుపొచ్చింది. మణికట్టు ద్వయం కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్ను ఎంపిక చేయకపోవడం గమనార్హం. బుమ్రా అందుబాటులో లేని నేపథ్యంలో షమీని పొట్టి ఫార్మాట్కు పరిగణించలేదు. అద్భుత ఫామ్లో ఉన్నప్పటికీ అతడిపై మరింత భారం మోపకుండా ఖలీల్, దీపక్, సైనీ వంటి యువ పేసర్లను పరీక్షించనున్నారు. భువీ ప్రధాన పేసర్గా వ్యవహరిస్తాడు. -
విండీస్తో ఆడే భారత జట్టు ఇదే
న్యూఢిల్లీ : బొటనవేలి గాయంతో ప్రపంచకప్ నుంచి అర్థాంతరంగా తప్పుకున్న టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వెస్టిండీస్ పర్యటనకు ఎంపికయ్యాడు. ఆగస్టు 3 నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు వెస్టిండీస్లో పర్యటించనున్న భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న ధావన్ను సెలెక్టర్లు లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్కు ఎంపిక చేయగా.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు విశ్రాంతినిస్తూ మూడు ఫార్మాట్లకు దూరం పెట్టారు. ప్రపంచకప్ ఓటమి నేపథ్యంలో ఇద్దరి కెప్టెన్ల ప్రతిపాదన వచ్చినప్పటికీ.. మూడు ఫార్మాట్లకు కెప్టెన్గా విరాట్ కోహ్లినే ప్రకటించారు. లిమిటెడ్ ఫార్మాట్కు రోహిత్ శర్మ, టెస్ట్లకు అజింక్యా రహానే వైస్ కెప్టెన్ బాధ్యతలను నిర్వర్తించనున్నారు. ఇక ఎన్నాళ్ల నుంచో భారత జట్టును వేధిస్తున్న నాలుగో స్థానం సమస్య సమస్యగానే మిగిలిపోవడం.. ప్రపంచకప్ కూడా అదే కారణంతో చేజారడంతో సెలక్టర్లు ఆ దిశగా దృష్టిసారించారు. ఈ సిరీస్ ద్వారా ఆ సమస్యకు పరిష్కారం కనుగొనాలని భావించి యువ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండేలకు జట్టులో స్థానం కల్పించారు. భారత్-ఏ జట్టు తరఫున విండీస్ పర్యటనలోనే ఉన్న ఈ ఆటగాళ్లు అద్భుతంగా రాణించడంతో జట్టులో చోటు దక్కించుకున్నారు. సీనియర్ వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని సెలవుతో రిషబ్ పంత్ ఆ స్థానాన్ని దక్కించుకోగా.. టెస్ట్లకు వృద్ధిమాన్ సాహాను ప్రత్యామ్నయ కీపర్గా ఎంపిక చేశారు. ఇక చహల్ను టీ20, టెస్ట్లకు దూరం పెట్టగా.. కుల్దీప్ను టీ20లకు ఎంపిక చేయలేదు. యార్కర్ల కింగ్ జస్ప్రిత్ బుమ్రాను టెస్ట్లకు మాత్రమే ఎంపిక చేశారు. ప్రపంచకప్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న రోహిత్ టెస్టుల్లో సైతం చోటు దక్కించుకున్నాడు. టెస్ట్ బ్యాట్స్మన్ చతేశ్వర పుజారా, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్ట్ జట్టులో చోటుదక్కించుకున్నారు. టీ20 జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండె, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుంధర్, రాహుల్ చహర్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, దీపక్ చహర్, నవదీప్ సైనీ వన్డే జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండె, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, కేదార్ జాదవ్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, ఖలీల్ అహ్మద్, నవదీప్ సైనీ టెస్ట్ జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్యా రహానే(వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, పుజారా, హనుమ విహరి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా, అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్ -
అక్షర్ అదరగొట్టినా.. తప్పని ఓటమి
అంటిగ్వా: ఆల్రౌండర్ అక్షర్ పటేల్(81నాటౌట్; 63 బంతుల్లో 8ఫోర్లు, 1సిక్సర్) ఒంటరి పోరాటంతో అదరగొట్టిన టీమిండియా-ఏకు ఓటమి తప్పలేదు. వెస్టిండీస్-ఏతో జరుగుతున్న అనధికారిక ఐదు వన్డేల సిరీస్లో భారత జట్లు తొలి ఓటమి నమోదు చేసింది. ఇప్పటికే మూడు వన్డేల్లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా నాలుగో వన్డేలో ఐదు పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. విండీస్ నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 293 పరుగులకే పరిమితమైంది. భారత ఆటగాళ్లలో అక్షర్ పటేల్ మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేదు. కృనాల్ పాండ్యా(45) ఫర్వాలేదనిపించాడు. విండీస్ బౌలర్లలో కీమో పాల్, పావెల్లు తలో రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేపట్టిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. రోస్టన్ ఛేజ్(84; 100 బంతుల్లో 4ఫోర్లు, 2 సిక్సర్లు), థామస్(70; 95 బంతుల్లో 4ఫోర్లు, 4 సిక్సర్లు), కార్టర్(50; 43 బంతుల్లో 8ఫోర్లు) అర్దసెంచరీలతో రాణించడంతో టీమిండియా ముందు విండీస్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్ నాలుగు వికెట్లతో రాణించగా.. అవేష్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇరు జట్ల మధ్య చివరి వన్డే ఆదివారం జరగనుంది. -
ఆడింది తొమ్మిదే.. కానీ ర్యాంకేమో
హైదరాబాద్ : ‘9 టెస్టులు.. 2 శతకాలు.. 2 అర్దశతకాలు.. 696 పరుగులు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో 15వ స్థానం. రిషభ్ పంత్ను టెస్టులకు ఎంపిక చేయడానికి ఇంకేమైనా గణాంకాలు కావాలా?’. సెలక్టర్లకు పంత్ అభిమానులు సంధిస్తున్న ప్రశ్న. వెస్టిండీస్ పర్యటన కోసం ఆదివారం సెలక్టర్లు భారత జట్టును ప్రకటించనున్నారు. అయితే గాయం నుంచి కోలుకున్న వృద్దిమాన్ సాహాను తిరిగి టెస్టులకు ఎంపిక చేస్తారనే ఊహాగానాలు రావడంతో పంత్ అభిమానులు ఈ విధంగా స్పందిస్తున్నారు. ‘ఆడింది తొమ్మిది టెస్టులే కానీ ర్యాంక్ 15. పంత్ ట్యాలెంట్ను ఐసీసీ గుర్తించింది.. మరి సెలక్టర్లు గుర్తిస్తారా’ అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రిషభ్ పంత్ టీమిండియా తరుపున ఇంగ్లండ్పై టెస్టు అరంగేట్రం చేశాడు. ఇంగ్లండ్తో జరిగిన చివరి టెస్టులో తొలి శతకం సాధించి టీమిండియాను గెలిపించినంత పనిచేశాడు. అయితే దురదృష్టవశాత్తు చివర్లో అవుటవ్వడంతో కోహ్లి సేన ఓటమిపాలైంది. ఇక ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో 350 పరుగులు చేసి టీమిండియా చారిత్రక విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక వన్డేలు కూడా తొమ్మిది ఆడిన పంత్ అంతగా ఆకట్టుకోలేదు. విండీస్ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ పర్యటన కోసం భారత జట్టును ఎంపిక చేసేందుకు ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆదివారం సమావేశం కానుంది. -
విండీస్ టూర్: వీరికి అవకాశం దక్కేనా?
హైదరాబాద్: ప్రపంచకప్లో టీమిండియా ఓటమికి అనేక కారణాలు. బలహీన మిడిలార్డర్, నాలుగో స్థానంలో సరైన బ్యాట్స్మన్ లేకపోవడం వంటి కారణాలను క్రీడా విశ్లేషకులు వెతుకుతున్నారు. అయితే ప్రపంచకప్ వంటి మెగా టోర్నీ అనంతరం వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో అందరి దృష్టి భారత జట్టు ఎంపికపై పడింది. సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తుండటంతో పలువురు ఆటగాళ్లు తెరపైకి వస్తున్నారు. మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్, ఖలీల్ అహ్మద్, సిరాజ్ వంటి వారిపైనే కాకుండా మరికొంత మంది యువ కిశోరాలపై సెలక్టర్ల కన్ను పడింది. గతకొంత కాలంగా దేశవాళీ టోర్నీల్లో విశేషంగా రాణిస్తున్న ప్రియాంక్ పంచల్, అభిమన్యు ఈశ్వరన్, నవదీపై సైనీ, రాహుల్ చహర్, కేఎస్ భరత్ వంటి యువ ఆటగాళ్లు విండీస్ పర్యటనలో టీమిండియా తరుపున అరంగేట్రం చేసే అవకాశం ఉందని జోరుగా వార్తలు వస్తున్నాయి. టీమిండియా యువ కిశోరం పృథ్వీ షా గాయం తర్వాత ఫిట్నెస్ నిరూపించుకోలేదు. సెలక్టర్ల సమావేశంలోపు పృథ్వీ షా తన ఫిట్నెస్ నిరూపించుకంటేనే జట్టులో ఉంటాడు లేకుంటే అంతే సంగతులు. ఇక టెస్టులకు సీనియర్ ఆటగాళ్లు మురళీ విజయ్, శిఖర్ ధావన్లను పూర్తిగా పక్కకు పెట్టే ఆలోచనలో సెలక్టర్లు ఉన్నారు. దీంతో మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్తో పాటు మూడో ఓపెనర్గా గుజరాత్ సారథి ప్రియాంక్ పంచల్కు అవకాశం దక్కవచ్చు. గుజరాత్ సారథిగా, ఓపెనర్గా ప్రియాంక్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. దీంతో ప్రియాంక్కు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక మరోవైపు బెంగాల్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ ప్రియాంక్కు పోటీ ఇస్తున్నాడు. లిస్టు ఏ మ్యాచ్ల్లో బంగ్లాదేశ్, శ్రీలంకలపై పరుగుల ప్రవాహం సృష్టించిన ఈశ్వరన్ విండీస్ పర్యటనకు ఎంపిక చేస్తారనే ఆశాభావంతో ఉన్నాడు. కీపర్గా ఎంఎస్ ధోని వారసుడిగా రిషభ్ పంత్ ఆల్మోస్ట్ ఫిక్స్ చేశారు. అయితే టెస్టుల విషయానికి వస్తే వృద్దిమాన్ సాహా గాయం నుంచి కోలుకోవడంతో సెలక్టర్లు అతడివైపు మొగ్గు చూపవచ్చు. అయితే పంత్, సాహాల తర్వాత కేఎస్ భరత్వైపు సెలక్టర్ల దృష్టి ఉంది. భారత్ ఏ మ్యాచ్ల్లో విశేష ప్రతిభతో సెలక్టర్లును ఆకట్టుకున్నాడు. భరత్ చివరి 11 మ్యాచ్ల్లో 3 సెంచరీలు, రెండు అర్దసెంచరీల సహాయంతో 686 పరుగులు సాధించాడు. అంతేకాకుండా కీపింగ్లో 41 క్యాచ్లు, 6 స్టంపింగ్స్ చేశాడు. దీంతో టెస్టులకు రెగ్యులర్ కీపర్కు బ్యాకప్గా భరత్ను ఎంపిక చేసే అవకాశం ఉంది. సెలక్టర్లు పంత్, సాహాలను కాదని భరత్ను ఎంపిక చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతడి ప్రతిభ అలాంటిది. ఇప్పటికిప్పుడు టీమిండియా తరుపున ఆడే సత్తా, అనుభవం, ప్రతిభ గల బౌలర్ నవదీప్ సైనీ. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కంటే వేగంగా బౌలింగ్ చేయగల సామర్థ్యం.. వికెట్లు తీయగల నైపుణ్యం అతడి సొంతం. ఇప్పటికే కోహ్లి సేనతో పాటు విదేశీ పర్యటనలకు వెళుతూ.. నెట్స్లో బ్యాట్స్మెన్కు బౌలింగ్ చేస్తూ వారి ప్రాక్టీస్కు దోహదపడుతున్నాడు. ఇక ఐపీఎల్, లిస్ట్ ఏ మ్యాచ్ల్లో వికెట్లు పడగొడుతున్న సైనీ అతి త్వరలోనే టీమిండియా జెర్సీ వేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ప్రస్తుత క్రికెట్లో మణికట్టు స్పిన్నర్లు జోరు నడుస్తోంది. టీమిండియా స్పిన్నర్లు చాహల్, కుల్దీప్లు తమ మాయాజాలంతో మిడిల్ ఓవర్లలో వికెట్లు పడగొడుతున్నారు. అయితే ప్రపంచకప్లో వారు విఫలమవ్వడంతో వారికి ప్రత్యామ్నాయంగా రాహుల్ చహర్ తెరపైకి వచ్చాడు. టీమిండియా- ఏ తరుపున తనదైన శైలిలో రాణిస్తున్న ఈ స్టైలీష్ స్పిన్నర్పై సెలక్టర్ల కన్నుపడింది. బౌలింగ్లో వేగం.. అంతకుమించి వైవిధ్యమైన బంతులతో ఆకట్టుకుంటున్న చహర్ కనీసం టీ20లకైనా సెలక్ట్ అవుతాడని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఆటకు ‘సెలవు’.. సైన్యంలోకి ధోని
న్యూఢిల్లీ : ప్రపంచకప్ ముగిసింది. భారత్కప్ చేజారింది. చర్చంతా సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని చుట్టూ తిరుగుతోంది. ధోని రిటైర్మెంట్ ఇస్తాడా? మరికొద్ది రోజులు కొనసాగుతాడా? ఆదివారం వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేసే జట్టులో ధోనికి చోటు దక్కుతుందా? లేక 15 మంది సభ్యుల్లో ఒకడిగా ఎంపికై తుది జట్టులో చోటు దక్కకుండా సలహాలు, సూచనలిచ్చేవరకు పరిమితం అవుతాడా? అని అనేక సందేహాలు జోరందుకున్నాయి. అయితే ధోని మాత్రం ప్రపంచకప్ అనంతరం రెండు నెలల వరకు క్రికెట్కు దూరంగా ఉంటానని బీసీసీఐకి ముందే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ రెండు నెలలు ఆర్మీలో చేరి సేవలందిస్తానని లెఫ్టినెంట్ కల్నల్ హోదా కలిగిన ధోని పేర్కొన్నట్లు ఓ సీనియర్ బీసీసీఐ అధికారి తెలిపారు. పారాచూట్ రెజిమెంట్ విభాగంలో చేరి దేశసైనికుడిగా ధోని మరో రెడునెలలు సేవలందిస్తాడన్నారు. ‘ధోని తనకు తానుగా వెస్టిండీస్ పర్యటనకు అందుబాటులో ఉండటం లేదు. మరో రెండు నెలలు పారామిలటరీ రెజిమెంట్లో చేరి సేవలందించనున్నాడు. ప్రస్తుతం ధోని తన ఆటకు రిటైర్మెంట్ ప్రకటించడం లేదు. ప్రపంచకప్ ముందుకు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి దేశసైనికుడిగా రెండు నెలలు సేవలందించనున్నాడు. ఈ విషయాన్ని జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్కు తెలియజేశాం.’ అని ఆ అధికారి పేర్కొన్నారు. ధోని గైర్హాజరితో యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్కు చోటుదక్కనుండగా.. ప్రత్యామ్నాయంగా వృద్ధిమాన్ సాహా పేరును పరిశీలించే అవకాశం ఉంది. ఇక విండీస్ పర్యటనకు భారత జట్టును ఆదివారం ప్రకటించనున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్ సెమీస్లో టీమిండియా ఓటమి తర్వాత ధోనిపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. స్లో బ్యాటింగ్తో జట్టుకు భారంగా మారుతున్న ధోని ఇక ఆటకు స్వస్తి పలకాల్సిన సమయం వచ్చిందంటూ అన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పట్లో ధోనికి రిటైర్మెంట్ ప్రకటించే ఉద్దేశమే లేదని అతని చిరకాల మిత్రుడు, వ్యాపార వ్యవహరాలు చూసే అరుణ్ పాండే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
ఆదివారానికి వాయిదా!
న్యూఢిల్లీ: వచ్చే నెలలో వెస్టిండీస్తో జరుగనున్న మూడు టి20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్కు శుక్రవారం జరగాల్సిన భారత క్రికెట్ జట్టు ఎంపిక ఆదివారానికి వాయిదా పడింది. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లి ఎంతవరకు అందుబాటులో ఉంటాడు? వెటరన్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని భవితవ్యం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం రెండు రోజుల తర్వాతే లభించనుంది. శుక్రవారం నాటి సమావేశం వాయిదాకు బీసీసీఐ కొత్త రాజ్యాంగంలో పొందుపర్చిన నిబంధన ఒక కారణం కాగా, అందరు ఆటగాళ్ల ఫిట్నెస్ నివేదికలు శనివారం నాటికి అందే వీలుండటం మరో కారణంగా తెలుస్తోంది. మరోవైపు బీసీసీఐ కార్యదర్శి ఇప్పటివరకు సెలక్షన్ కమిటీ కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. జట్టు ఎంపిక వివరాలు ఆయన పేరిటే విడుదలయ్యేవి. కొత్త రాజ్యాంగం ప్రకారం కార్యదర్శిని ఈ బాధ్యత నుంచి తప్పించారు. సెలక్షన్ కమిటీ ఛైర్మనే... కన్వీనర్గా ఉంటారు. ఈ విషయమై క్రికెట్ పాలకుల కమిటీ (సీవోఏ), బీసీసీఐ మధ్య సంఘర్షణ నెలకొంది. కొత్త నిబంధన ప్రకారం క్రికెట్ కమిటీ సమావేశాల్లో బోర్డు ఆఫీస్ బేరర్లు, సీఈఓ పాల్గొనడానికి వీల్లేదు. మరోవైపు విజయ్ శంకర్, శిఖర్ ధావన్ల ఫిట్నెస్ నివేదికలు కూడా ఇంకా బోర్డు అందలేదు. దాంతో జట్టు ఎంపికను ఆదివారానికి వాయిదా వేశారు. -
ధోని భవితవ్యం తేలేది రేపే!
ముంబై : ప్రపంచకప్ సెమీస్లో టీమిండియా ఓటమి అనంతరం అందరి దృష్టి సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోనిపై పడింది. ప్రస్తుతం ధోని రిటైర్మెంట్ హాట్ టాపిక్గా మారిన సమయంలో వెస్టిండీస్ పర్యటనకు టీమిండియా ఆటగాళ్లను ఎంపిక చేసేందుకు సెలక్టర్లు శుక్రవారం సమావేశం కానున్నారు. దీంతో ధోని భవితవ్యం రేపు తేలనుంది. సెలక్టర్లు ధోనిని ఎంపిక చేస్తారా లేదా పక్కకు పెడతారా అనే విషయం తెలుసుకోవడానికి అందురూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పర్యటనకు ధోనిని ఎంపిక చేయకుంటే అతడి క్రికెట్ కెరీర్కు ఫుల్స్టాప్ పడినట్లేనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తొలుత కరేబియన్ పర్యటనకు సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని సెలక్టర్లు భావించారు. అయితే కోహ్లి దీనికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. దీంతో అతడి సారథ్యంలోని జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. ప్రస్తుత తరుణంలో ధోనికి విశ్రాంతి ఇచ్చామన్నా ఎవరూ ఒప్పుకోరు. కోహ్లితో పాటు ధోనికి విశ్రాంతినిస్తే పరిస్థితి వేరేలా ఉండేది. ప్రస్తుతం సెలక్టర్లకు ఒక్కటే దారి ధోనిని కొనసాగించడమా లేదా పక్కకు పెట్టడమా. శుక్రవారం భేటికానున్న సెలక్టర్ల సమావేశంలో ఇది తేలనుంది. అయితే ధోని, పంత్లను ఎంపిక చేసి.. తుదిజట్టులో పంత్ను ఆడించాలని భావిస్తోంది. కొంతకాలం పంత్కు దిశానిర్దేశం చేసేందుకు ధోనిని ఎంపిక చేయాలని సెలక్టర్లు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక ప్రపంచకప్లో దారుణంగా విఫలమైన దినేశ్ కార్తీక్ను పక్కకు పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. విండీస్ టూర్లో నాలుగో స్థానం కోసం యువ ఆటగాళ్లు మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్లను పరిశీలించే అవకాశం ఉంది. జస్ప్రిత్ బుమ్రాకు విశ్రాంతినివ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారు. దీంతో భువనేశ్వర్, మహ్మద్ షమీలతో పాటు ఖలీల్ అహ్మద్, నవదీప్ సైనీలను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇక యువ సంచలనం రిషభ్ పంత్ టెస్టులకు పక్కాగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే వన్డే, టీ20లకు అతడు ఎంపిక అవుతాడా లేదా అనే సందిగ్థత నెలకొంది. -
‘విశ్రాంతి వద్దు.. నేను వెళతాను!’
ముంబై : ప్రపంచకప్ అనంతరం వెస్టిండీస్ పర్యటనపై టీమిండియా ప్రత్యేక దృష్టిపెట్టింది. ఈ సిరీస్కు ఆటగాళ్ల ఎంపిక సెలక్టర్లకు, బీసీసీఐకి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ తరుణంలోనే సారథి విరాట్ కోహ్లి నిర్ణయం సెలక్టర్లకు ఆశ్చర్యానికి గురిచేసింది. ముందుగా అనుకున్న ప్రకారం వెస్టిండీస్తో జరగబోయే టీ20, వన్డే సిరీస్లకు కోహ్లి, జస్ప్రిత్ బుమ్రాలకు విశ్రాంతినివ్వాలని సెలక్టర్లు భావించారు. దీనికి కోహ్లి, బుమ్రాలు కూడా సుముఖత వ్యక్తం చేశారు. అయితే ప్రపంచకప్ సెమీస్లో టీమిండియా అనూహ్య ఓటమి.. అనంతరం జరిగిన పలు నాటకీయ పరిణామాల అనంతరం కోహ్లి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. విశ్రాంతిని తీసుకోనని, పూర్తి స్థాయి వెస్టిండీస్ పర్యటనకు వెళతానని సెలక్టర్లకు కోహ్లి తెలిపినట్టు సమాచారం. (చదవండి: వన్డేలకు రోహిత్.. టెస్ట్లకు కోహ్లి!) ‘విండీస్ పర్యటనకు విశ్రాంతి తీసుకోవడానికి కోహ్లి ఇష్టపడటం లేదు, ప్రపంచకప్ ఓటమి అనంతరం అతడు చాలా కుంగిపోయాడు. క్రికెట్తోనే మరల పునరుత్తేజం లభిస్తుందని భావించడంతో కోహ్లి తన నిర్ణయం మార్చుకున్నాడు’అంటూ బీసీసీకి చెందిన ఓ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రపంచకప్ ఓటమి అనంంతరం కెప్టెన్, కోచ్ల మార్పుపై తీవ్ర చర్చజరుగుతున్న నేపథ్యంలో రిస్క్ చేయడం ఇష్టం లేకనే కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక విండీస్ టూర్లో టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఆగస్టు 3న టీ20తో విండీస్ పర్యటన ప్రారంభం కానుంది. ఇక టీమిండియా విండీస్ పర్యటన నేపథ్యంలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ప్రపంచకప్ అనంతరం ఆటకు గుడ్బై చెబుతానన్న గేల్.. తన ప్రియ నేస్తం భారత్తో సిరీస్ ముగిశాక క్రికెట్కు వీడ్కోలు పలుకుతానని ప్రకటించిన విషయం తెలిసిందే. (చదవండి: ఇక టీమిండియా కెప్టెన్ రోహితేనా?) -
భారత్ ఘన విజయం
-
భారత్ ఘన విజయం: సిరీస్ కైవసం
కింగ్స్టన్: కరీబియన్ గడ్డపై టీమ్ఇండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. నాలుగో వన్డేలో అనూహ్య విజయం సాధించిన సిరీస్ రేసులో నిలిచిన హోల్డర్ సేన చివరిదైన ఐదో వన్డేలో విఫలమైంది. టీమిండియా సారధి విరాట్ కోహ్లి 111(115) సెంచరీతో కప్పును సొంతం చేసుకుంది. గురువారం కింగ్స్టన్లో జరిగిన ఆఖరి వన్డేలో వెస్టిండీస్పై 8 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించడంతో 3-1 తేడాతో సిరీస్ను కోహ్లీసేన సొంతం చేసుకుంది. కీలకమైన చివరి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన విండీస్, మహ్మద్ షమీ(4/48), ఉమేశ్ యాదవ్(3/53) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 205 పరుగులు చేసింది. హోప్ సోదరులు షెయ్(51), కైల్(46) పరుగులు చేశారు. విజృంభించిన బౌలర్లు టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. విండీస్ స్కోరు 39 వద్ద హార్దిక్ పాండ్య బౌలింగ్లో లూయిస్(9) వెనుతిరగడంతో విండీస్ వికెట్ల పతనం ప్రారంభమైంది. ఉమేశ్ వరుస బంతుల్లో ఫీల్డర్ చేజ్ల పెవిలియన్ చేర్చాడు. 76 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన విండీస్ను షెయ్, మహ్మద్లు కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇన్నింగ్స్ గాడిలో పెడుతున్నమహ్మద్(16)ను జాదవ్ ఔట్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హోల్డర్ ధాటిగానే ఆడాడు. 34 బంతులాడిన హోల్డర్ 4ఫోర్లు, సిక్సర్ లతో 36 పరుగులు చేశాడు. స్పిన్నర్లు జడేజా, కుల్దీప్ యాదవ్లు ప్రత్యర్థి బౌలర్లను కట్టడి చేశారు. రాణించిన విరాట్, రహానే 206 పరుగుల స్వల్ప ఛేదనలో భారత్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. జోసెఫ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఆఖరి బంతికే శిఖర్ ధావన్(4) ఔటయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన విరాట్, మరో ఓపెనర్ రహానె వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. చెత్తబంతులను బౌండరీలు దాటిస్తూ.. వీలుచిక్కినప్పుడల్లా సింగిల్స్ తీస్తూ లక్ష్యం వైపు అడుగులేశారు. భారీ భాగస్వామ్యం వైపు దూసుకెళ్తున్న ఈ జోడీని దేవేంద్ర బిషూ విడదీశాడు. 19వ ఓవర్ ఆఖరి బంతికి రహానె 39(51)ఎల్బీగా వెనుదిరిగాడు. విరాట్కోహ్లీ 22వ ఓవర్లో ఫోర్తో 67 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. చాలా రోజుల తర్వాత కోహ్లీ తనదైన శైలిలో అలరించాడు. లక్ష్యానికి దగ్గరవుతున్నా కొద్దీ కోహ్లీ, కార్తీక్ ద్వయం భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. విలియమ్స్ వేసిన 35వ ఓవర్లో ఫోర్ బాదిన విరాట్ వన్డే కెరీర్లో 28వ శతకాన్ని సాధించాడు. 108 బంతులాడిన విరాట్ 12 ఫోర్లు, సిక్సర్ సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. అనంతరం 37వ ఓవర్ మూడో బంతికి సింగిల్ తీసి కార్తీక్ 50(52)బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. శతకంతో రాణించిన ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ను విరాట్ కోహ్లి అందుకోగా.. ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును ఆజింక్య రహానె దక్కించుకున్నాడు. -
టీమిండియా కోచ్గా ఆయనా???
న్యూఢిల్లీ: టీమిండియా కోచ్గా అనిల్కుంబ్లే ఆకస్మిక రాజీనామా అనంతరం బీసీసీఐ కోచ్ వేట మొదలు పెట్టింది. గతంలో వెస్టిండీస్ పర్యటన అనంతరం కోచ్ నియమించాలని, అప్పటి వరకూ కుంబ్లే కోచ్గా కొనసాగుతాడని బీసీసీఐ ప్రకటించింది. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ, కుంబ్లే మధ్య వివాదాలు తలెత్తడంతో కుంబ్లే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో జట్టు మాజీ డైరెక్టర్ రవిశాష్త్రికి బీసీసీఐ కోచ్ పదవికి తలుపులు తెరిచినట్టయింది. ఇది వరకే కోహ్లీ రవిశాష్త్రిని ఛీఫ్కోచ్గా నియమించాలని బీసీసీఐని కోరిన సంగతి విదితమే. సచిన్ టెండూల్కర్, సౌరవ్గంగూలీ, వీవీఎస్ లక్ష్మణలతో కూడిన క్రికెట్ సలహా కమిటీ అంగీకరిస్తే రవిశాస్త్రి కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు నియమించిన అడ్మినిస్టేటరీ కమిటీ తెలిపింది. అడ్మినిస్ట్రేటివ్ కమిటీ సభ్యుడు తెలిపిన సమాచారం ప్రకారం, ఇంతకుముందు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న వారు మాత్రమే కోచ్ పదవికి అర్హులు. కానీ సలహా కమిటీ ప్రత్యేక విన్నపం ద్వారా బయటి వ్యక్తులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. మామూలుగా రవిశాస్త్రి కోచ్ పదవికోసం దరఖాస్తు చేసుకోలేదు. దీంతో ఆయన్ని కోచ్గా ఎంపిక చేసుకొనే అవకాశంలేదు. కానీ బీసీసీఐ ప్రత్యేక విన్నపం ద్వారా ఆస్థానాన్ని భర్తీ చేసుకోవచ్చు. రవిశాష్త్రిని ఇంటర్యూ చేయాలనుకుంటే ఆయనకోసం తలుపులు తెరిచే ఉన్నాయని ఆయన తెలిపారు. ఇందుకోసం బీసీసీఐ ప్రత్యేక విన్నపాన్ని అడ్మినిస్ట్రేటివ్ కమిటీకి సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ బీసీసీఐ అలా చేయకపోతే రవిశాష్త్రిని కోచ్గా ఎంపిక చేసే అవకాశం లేదు. గతేడాది కోచ్ పదవికోసం కుంబ్లేతో పోటీ ఓడిపోవడంతో ఇప్పుడు దరఖాస్తు చేసుకోలేదు. అయితే చాంపియన్ట్రోఫీకి వెళ్లే ముందు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్లు రవిశాష్త్రిని పరిగణలోకి తీసుకోవాలని బీసీసీఐని కోరారు. అంతే కాకుండా కోచ్ పదవికోసం భారత్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, సన్రైజర్స్ కోచ్ టామ్మూడీ, రిచర్డ్ పైబస్, ఆఫ్ఘనిస్తాన్ కోచ్ లాల్ చంద్ రాజ్పుత్, దొడ్డా గణేష్లు దరఖాస్తు చేసుకున్నారు. -
కుంబ్లే ‘శిక్షణ’ ముగిసింది
⇔ హెడ్ కోచ్ పదవికి రాజీనామా ⇔ విండీస్ పర్యటనకు దూరం ⇔ పంతం నెగ్గించుకున్న కోహ్లి భారత క్రికెట్ జట్టులో నివురుగప్పిన నిప్పులా ఉన్న వివాదం చివరకు మంటలు రేపింది. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవని నిరూపిస్తూ కెప్టెన్, కోచ్ కలహాల కాపురం ఏడాది కాలానికే ముగిసింది. విభేదాలు లేవంటూ గత మూడు వారాలుగా మాటలతో సాగదీసినా, చివరకు పరిస్థితి చేయి దాటిపోయే స్థాయికి అవి చేరిపోయాయి. కోచ్ అనిల్ కుంబ్లేతో కలిసి ముందుకు వెళ్లలేనంటూ కెప్టెన్ కోహ్లి కుండ బద్దలు కొట్టిన మూడు రోజులకు అనివార్య పరిణామం చోటు చేసుకుంది. తనను కాదనుకునే వారితో తానూ కొనసాగలేనంటూ కుంబ్లే కోచ్ పదవి నుంచి తప్పుకున్నారు. తన కాంట్రాక్ట్ ముగియడంతో రాజీనామా చేస్తున్నట్లు బోర్డుకు సమాచారమిచ్చారు. కుంబ్లేను కొనసాగించాలంటూ సలహా కమిటీ సభ్యులు సచిన్, గంగూలీ, లక్ష్మణ్లు సిఫారసు చేసినా తన వల్ల కాదంటూ అనిల్ కుంబ్లే తప్పుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ముంబై: ఒకరు సూపర్ స్టార్ హోదా ఉన్న కెప్టెన్... మరొకరు దిగ్గజ ఆటగాడు... వీరిద్దరు కలిస్తే అద్భుతాలు ఖాయమని అంతా భావించారు. నిజంగానే ఫలితాలు అదే తరహాలో వచ్చాయి. కానీ వాటి వెంట వీరిద్దరు సొంత ‘అహం’ కూడా మోసుకొచ్చారు. ఫలితంగా ఇద్దరు కలిసి పని చేయలేని పరిస్థితి వచ్చేసింది. చివరకు కెప్టెన్ పంతమే నెగ్గింది. కోచ్ తప్పనిసరిగా తప్పుకోవాల్సి వచ్చింది. భారత జట్టు హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంట్రాక్ట్ ప్రకారం ఆయన పదవీ కాలం ముగుస్తున్న మంగళవారం రోజే కుంబ్లే తన నిర్ణయాన్ని వెల్లడించారు. కుంబ్లే ఇష్టపడితేనే విండీస్ పర్యటనకు వెళతారని ఇటీవలే సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ వెల్లడించారు. నిజంగానే కుంబ్లే కొనసాగేందుకు ఆసక్తి చూపించలేదు. దాంతో కోచ్ లేకుండా టీమిండియా విండీస్ పయనమైంది. ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్గా ఉన్న కుంబ్లే, ఈ నెల 23 వరకు సాగే ఆ సమావేశాల్లో పాల్గొనేందుకే విండీస్ వెళ్లడం లేదని మొదట్లో భావించినా... అది అసలు కారణం కాదని ఇప్పుడు అర్థమైంది. కుంబ్లే రాజీనామాను నిర్ధారించిన బీసీసీఐ, విండీస్ పర్యటనలో జట్టును పర్యవేక్షించేందుకు మేనేజర్గా హైదరాబాద్ మాజీ రంజీ క్రికెటర్ డాక్టర్ ఎంవీ శ్రీధర్ వెళుతున్నట్లు ప్రకటించింది. ఈ సిరీస్కు బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ జట్టుతో పాటు ఉంటారు. మున్ముందు కొత్త కోచ్ ఎంపిక విషయంలో కూడా క్రికెట్ సలహా కమిటీ సూచనలు తీసుకుంటామని బోర్డు వెల్లడించింది. పరిణామాలు వేగంగా...: భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీకి బయల్దేరే ముందే కోచ్, కెప్టెన్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. కుంబ్లే ‘శైలి’ శిక్షణ తమకు చాలా ఇబ్బందికరంగా మారిందని జట్టులో కొందరు ఆటగాళ్లు ఫిర్యాదు చేశారు. కనీసం పది మంది కుంబ్లేకు వ్యతిరేకంగా ఉన్నట్లు వినిపించింది. దీనిని బీసీసీఐ పెద్దలతో పాటు కోహ్లి కూడా ఖండించాడు. సరిగ్గా టోర్నీకి ముందు కొత్త కోచ్ కోసం బోర్డు దరఖాస్తులు ఆహ్వానించడం కూడా అనుమానాలు రేకెత్తించింది. అయితే టోర్నీ మొదలయ్యాక అందరి దృష్టి ఆటపైనే నిలిచింది. ప్రాక్టీస్ సెషన్ల సమయంలో ఇద్దరి మధ్య పెద్దగా మాటలు లేకున్నా ఫోకస్ అంతా సన్నద్ధతపైనే సాగింది. అయితే టోర్నీ ముగిశాక మరోసారి ముందుకొచ్చిన ఈ అంశం కుంబ్లే నిష్క్రమణ దాకా సాగింది. శనివారం కోహ్లితో సమావేశమైన సలహా కమిటీ సభ్యులు, బోర్డు అధికారులు సోమవారం కుంబ్లేతో కూడా మాట్లాడారు. ఈ భేటీలో కుంబ్లే ఆసాంతం ‘నాకు, కోహ్లికి మధ్య ఎలాంటి సమస్యా లేదు’ అనే చెబుతూ వచ్చారు. అయితే కోహ్లి తమతో చెప్పిన విషయాలన్నీ కుంబ్లే ముందు ఏకరువు పెట్టడంతో కథ మారిపోయింది. అంతా విన్న తాను ఇక కొనసాగలేనంటూ తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇప్పుడు కొత్త కోచ్ వేటలో అందరి దృష్టి మరో మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్పై నిలిచింది. విధ్వంసకర ఆటగాడిగా గుర్తింపు ఉన్నా, కోచ్గా అతను ఏ మాత్రం పనికొస్తాడో చెప్పలేం. టామ్ మూడీ, లాల్చంద్ రాజ్పుత్, రిచర్డ్ పైబస్, దొడ్డ గణేశ్ కూడా కోచ్ రేసులో ఉన్నారు. ఎవరికి నష్టం? కోచ్ జాన్రైట్తో కలిసి చక్కటి ఫలితాలు సాధించిన కెప్టెన్ గంగూలీకి గ్రెగ్ చాపెల్తో మాత్రం ఎందుకు పడలేదు? సచిన్, కపిల్ల మధ్య సమన్వయం ఎందుకు కుదరలేదు? రైట్తో పోలిస్తే చాపెల్ దిగ్గజ బ్యాట్స్మన్లలో ఒకడు. గంగూలీకంటే అద్భుతమైన రికార్డు అతనిది. రైట్ సర్దుకుపోగా... చాపెల్తో ‘ఇగో’ సమస్యలు వచ్చాయి. సచిన్, కపిల్ విషయం కూడా ఇంతే. ఇద్దరు అగ్రశ్రేణి వ్యక్తులు కలిసి పని చేస్తే ఎదురులేని ఫలితాలు సాధించవచ్చని అనిపిస్తుంది. కానీ దాంతోపాటు సర్దుబాటు సమస్య కూడా ఉంటుంది. కోచ్, కెప్టెన్లలో ఇద్దరికీ సొంత ఆలోచనలు ఉంటాయి. ఒకరికి సరైనదిగా అనిపించింది మరొకరికి తప్పుగా తోచవచ్చు. విభిన్న అభిప్రాయాలు ఉండటంలో తప్పు లేదు అంటూ ఇద్దరూ గొడవ లేకుండా పని చేసే ప్రయత్నం చేస్తారు. కానీ రాన్రానూ అది అసాధ్యంగా మారిపోతుంది. కోహ్లి, కుంబ్లే మధ్య కూడా అదే జరిగింది. కోహ్లి ఆటగాళ్లకు స్వేచ్ఛను కోరుకునే రకం. అందుకే అతను ‘ఫ్రెండ్లీ’ రవిశాస్త్రిలాంటి వ్యక్తిని కోచ్గా కావాలనుకున్నాడు. కానీ ఏ స్థాయి ఆటగాడైనా శ్రమించేందుకు వెనుకాడవద్దనేది కుంబ్లే తత్వం. అందుకే ఆటగాళ్లంతా కలిసి అతడిని ‘హెడ్ మాస్టర్’గా చిత్రీకరించారు. ఆ కఠోర సాధన తమ వల్ల కాదని చేతులెత్తేశారు. ఈ మైదానంలోని అంశాలు కాకుండా ఇద్దరి మధ్య విభేదాలకు ‘వ్యక్తిగత’ కారణాలు ఏమైనా ఉన్నాయేమో ప్రస్తుతానికైతే తెలీదు. మధ్యలో అగ్నికి ఆజ్యం పోసినట్లుగా బీసీసీఐ అధికారులు తమ పాత్ర పోషించారు. కోచింగ్తో సరిపెట్టకుండా ఆటగాళ్ల ఫీజు పెంచడంవంటి అంశాల్లో దూకుడుగా ముందుకు వెళ్లటం వారిలో చాలా మందికి నచ్చలేదు. దాంతో రోగి కోరిందే వైద్యుడు ఇచ్చాడు అన్నట్లుగా... ఇటు తన మాటే చెల్లుబాటు కావాలనుకుంటున్న కోహ్లి వ్యతిరేకతకు బోర్డు ఆలోచన కూడా తోడై కుంబ్లేను సాగనంపారు. క్రికెట్లో కోచ్ పాత్ర తక్కువే కావచ్చు... కానీ ఆటగాడిగా, కెప్టెన్గా ‘జెంటిల్మెన్’ ఇమేజ్ సంపాదించిన కుంబ్లే కోచ్గా ఉండటం జట్టుకు కచ్చితంగా మేలు చేసే విషయం. అతని సేవలను కోల్పోతే నష్టపోయేది కుంబ్లే మాత్రం కాదు. మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడి తాజా పరిణామాన్ని విశ్లేషిస్తూ ‘ఆత్మగౌరవం ఉన్న కుంబ్లే లాంటి వ్యక్తి అక్కడ పని చేయలేడు. అతనిపై తిరుగుబాటు చేస్తున్నవారంతా కృతజ్ఞత లేనివారే. చివరకు భారత క్రికెట్టే నష్టపోతుంది’ అని వ్యాఖ్యానించడం కుంబ్లే విలువను చూపిస్తోంది. –సాక్షి క్రీడావిభాగం కోచ్గా కుంబ్లే రికార్డు టెస్టుల్లో... ఆడినవి: 17 గెలిచినవి: 12 ఓడినవి: 1 ‘డ్రా’: 4 వన్డేల్లో... ఆడినవి: 13 గెలిచినవి: 8 ఓడినవి: 5 టి20ల్లో... ఆడినవి: 5 గెలిచినవి: 2 ఓడినవి: 2 ఫలితం తేలనివి: 1 -
విండీస్ పర్యటనకు కుంబ్లేనే...
ముంబై: భారత క్రికెట్ జట్టు కోచ్గా అనిల్ కుంబ్లే మరో సిరీస్కు కూడా కొనసాగనున్నారు. ‘విండీస్తో జరిగే సిరీస్ వరకు కూడా కుంబ్లే కోచ్గా ఉంటారు. అయితే అది ఆయన అంగీకారం మీద ఆధారపడి ఉంటుంది’ అని పరిపాలకుల కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ వెల్లడించారు. మరోవైపు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ సమస్యలు పరిష్కరించేందుకు బీసీసీఐ త్వరలోనే కొత్తగా ఎథిక్స్ ఆఫీసర్ను నియమించనుంది. ఈ అంశంపై చాలా ఫిర్యాదులు వచ్చాయని, ఎథిక్స్ ఆఫీసర్ వీటిపై దృష్టి పెడతారని రాయ్ చెప్పారు. 26న ఎస్జీఎం: బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం) ఈ నెల 26న జరగనుంది. ఇందులో కొత్త కోచ్ ఎంపిక అంశం చర్చించడం లేదని బోర్డు స్పష్టం చేసింది. ప్రధానంగా లోధా కమిటీ సిఫారసుల అమలుపైనే ఇందులో చర్చ జరగనుంది. దీంతో పాటు ఇటీవల జరిగిన ఐసీసీ సమావేశాలు, వాటి పరిణామాలు, రాబోయే సిరీస్లు, పాకిస్తాన్తో ఇటీవల దుబాయ్లో జరిగిన సమావేశం తదితర ఏడు అంశాలతో బీసీసీఐ అజెండా సిద్ధమైంది. -
అలా ఆడేందుకు సిగ్గుపడను : భారత క్రికెటర్
బ్యాటింగ్ లో తాను మిడిల్, లోయర్ ఆర్డర్లో ఆడాలని కెప్టెన్, కోచ్ నిర్ణయిస్తే దానిని అమలు చేసేందుకు తాను ఎప్పుడూ సిగ్గుపడనని భారత డాషింగ్ బ్యాట్స్ మన్ రోహిత్శర్మ అంటున్నాడు. తాను ముఖ్యంగా సహజశైలిలో ఆడేందుకు ఇష్టపడతానని, అయితే పరిస్థితులకు తగ్గట్లుగా ఆడాల్సి వచ్చినప్పుడు వన్డేలా, టెస్టులా అని ఆలోచించనని చెప్పాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో తక్కువ స్కోరు(9)కే అవుటైన రోహిత్, రెండో ఇన్నింగ్స్ లో మాత్రం చెలరేగిపోయి కేవలం 59 బంతుల్లోనే 3 సిక్సర్లు, 1 ఫోర్ బాది 41 పరుగులు చేసి భారత్ ఆధిక్యంతో పాటు రన్ రేట్ ను చాలా త్వరగా పెంచేశాడు. వాస్తవానికి బౌలర్లపై ఎదురుదాడికి దిగి వారి లయను దెబ్బతీస్తూ వారిని ఒత్తిడిలోకి నెట్టడం తనకు ఇష్టమన్నాడు. అయితే ఇందుకోసం తాను ఆడతున్నతి ఓవర్లో తొలి బంతినా లేక చివరి బంతా.. అనే దాంతో సంబంధం లేకుండా షాట్లు ఆడతానన్నాడు. తాను ఎలా బ్యాటింగ్ చేయాలో.. ఎలా చేయకూడదో తనకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. వన్డేల్లో ఆడిన తరహాలో టెస్టుల్లో ఆడటం కుదరదని చెప్పాడు. జట్టు అవసరాలకు తగ్గట్టుగా ఆడటాన్ని తాను అలవర్చుకోవడంతో ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలో కోచ్, కెప్టెన్ చెబితే తాను సులువుగా అందుకు తగ్గట్టుగా ఆట తీరును మార్చుకుంటానని రోహిత్ శర్మ వెల్లడించాడు. గతేడాది లంకతో సిరీస్ లో ఇదే పాటించానని గుర్తుచేశాడు. -
కెప్టెన్ హోదాలో తిరిగొచ్చాను : కోహ్లీ
అంటిగ్వా: వెస్టిండీస్ పర్యటన అంటే తనకెంతో ప్రత్యేకమని టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటున్నాడు. సరిగ్గా ఐదేళ్ల కిందట 2011లో విండీస్తో జరిగిన టెస్ట్ సిరీస్తోనే తాను టెస్ట్ కెరీర్ ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. గురువారం విండీస్తో భారత్ తొలి టెస్ట్ ఆడనున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడాడు. 'టెస్ట్ క్రికెట్ ఓనమాలు ఇక్కడే నేర్చుకున్నాను. ఆటలో మార్పులు, పరిస్థితులకు తగ్గట్లుగా ఎలా ఆడాలి లాంటి ఎన్నో విషయాలపై అవగాహన వచ్చింది' అని విరాట్ చెప్పుకొచ్చాడు. అప్పట్లో సాధారణ ఆటగాడిగా కరీబియన్ పర్యటనకు వచ్చిన తాను ప్రస్తుతం కెప్టెన్ హోదాలో ఇక్కడికి వచ్చానని హర్షం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా, శ్రీలంక సిరీస్ లలో పాటించిన ఐదుగురు బౌలర్ల వ్యూహాన్ని ఇక్కడ అమలు చేయనున్నాడు. దాంతో టాప్ ఆర్డర్ లో లోకేష్ రాహుల్, శిఖర్ ధావన్లలో ఒకరికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. తుదిజట్టులో ఎవరికి అవకాశం ఇవ్వాలో అర్థం కావడం లేదన్నాడు. టీమిండియా అంచనాలు ఎక్కువగా స్పిన్ విభాగంపైనే ఆధారపడి ఉన్నాయన్నాడు. -
రిటైరయినందుకు బాధపడను: ధోనీ
వెస్టిండీస్తో నేటి(గురువారం) నుంచి ప్రారంభమయ్యే నాలుగు టెస్టుల సిరీస్లో స్పిన్నర్లు కీలకపాత్ర పోషిస్తారని భారత పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అభిప్రాయపడ్డాడు. కరీబియన్ గడ్డపై మందకొడి పిచ్ల దృష్ట్యా జట్టులో స్పిన్నర్లు చాలా కీలకం కానున్నారని తెలిపాడు. భారత జట్టులో పేసర్లు విరివిగా అందుబాటులో ఉండడంపై ధోని అనందం వ్యక్తం చేశాడు. టెస్టుల నుంచి తాను వైదొలగినందుకు(రిటైర్మెంట్) చింతించడం లేదని పేర్కొన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియాకు తన సేవలు కొనసాగుతున్నాయని చెప్పాడు. గతంలో టెస్టులు, వన్డేలు, టీ20లు అంటూ అన్ని ఫార్మాట్ల మ్యాచ్ లతో బిజీబిజీగా ఉండేవాడిని. అయితే టెస్టులకు గుడ్ బై చెప్పినందున ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతున్న సమయంలో కుటుంబంతో గడపడంతో పాటు తన ఫిట్నెస్పై దృష్టి సారిస్తున్నట్లు ఎంఎస్ ధోని తెలిపాడు. -
బ్యాటింగ్ లైనప్లో మార్పులు ఉండకపోవచ్చు
న్యూఢిల్లీ: వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు ఉండకపోవచ్చని పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ అన్నాడు. భారత జట్టుకు నిలకడైన బ్యాటింగ్ లైనప్ ఉందని ధోనీ అభిప్రాయపడ్డాడు. భారత టి-20, వన్డే జట్లకు ధోనీ, టెస్టు జట్టుకు విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. వెస్టిండీస్లో జరిగే టెస్టు సిరీస్లో కోహ్లి సారథ్యంలో టీమిండియా బరిలో దిగుతోంది. భారత బ్యాటింగ్ లైనప్లో టాప్-6 ఆటగాళ్లు నిలకడగా ఆడుతున్నారని, ఉపఖండం ఆవల ఆడిన అనుభవం ఉందని ధోనీ చెప్పాడు. తుది జట్టులోకి ఒకర్నో ఇద్దర్నో కొత్తగా తీసుకోవచ్చని అభిప్రాయపడ్డాడు. జట్టుకు అవసరమైనంతమంది బౌలర్లు అందుబాటులో ఉన్నారని చెప్పాడు. వెస్టిండీస్లో వికెట్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందన్నాడు. భారత్, విండీస్ల మధ్య గురువారం నుంచి తొలిటెస్టు జరగనుంది. 2011లో వెస్టిండీస్కు భారత్ వెళ్లినపుడు ధోనీ 1-0తో సిరీస్ను గెలిపించాడు. -
ప్రాక్టీస్ జోరు పెంచిన భారత్
* నెట్స్లో చెమటోడ్చిన టాప్-6 బ్యాట్స్మెన్ * రేపటి నుంచి వెస్టిండీస్తో తొలి టెస్టు అంటిగ్వా: వెస్టిండీస్లో అడుగుపెట్టినప్పట్నించీ సరదాలు, షికారులు... మధ్యలో రెండు వార్మప్ మ్యాచ్లతో ఉల్లాసంగా గడిపిన భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్ ముమ్మరం చేసింది. రేపటి నుంచి (గురువారం) విండీస్తో తొలి టెస్టు నేపథ్యంలో శనివారం అంటిగ్వాకు చేరుకున్న కోహ్లిసేన సోమవారం నెట్స్లో తీవ్రంగా సాధన చేసింది. విజయ్, ధావన్; పుజారా, రాహుల్; విరాట్, రహానేలు వరుసగా మూడు నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ఒకరి బలం గురించి మరొకరు తెలుసుకోవడానికి వీలుగా జంటలుగా బరిలోకి దిగారు. ఒక్కోక్కరు నాలుగు నుంచి ఆరు బంతులు ఎదుర్కొన్న తర్వాత స్ట్రయికింగ్ను మార్చుకున్నారు. గంట పాటు కొనసాగిన వీళ్ల ప్రాక్టీస్ తర్వాత వృద్ధిమాన్ సాహా, రోహిత్ శర్మ, జడేజా, మిగతా ఆటగాళ్లు నెట్స్లోకి వచ్చారు. విజయ్కు రాహుల్ సరైన జోడీ అని వార్తలు వస్తున్న నేపథ్యంలో... కోచ్, కెప్టెన్లిద్దరు అతని బ్యాటింగ్ను క్షుణ్ణంగా పరీశిలించారు. రాహుల్కు కీపింగ్ చేసే సత్తా కూడా ఉండటంతో తుది జట్టు కూర్పు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇషాంత్, బిన్నీ, షమీ, అశ్విన్, మిశ్రాలు తొలి సెషన్లో బౌలింగ్ ప్రాక్టీస్కే పరిమితంకాగా... చివర్లో జడేజా కలిశాడు. బౌలర్లందరూ తమ స్థాయిలో ఆకట్టుకున్నారు. కుడి చేతి వాటం బ్యాట్స్మన్కు లెగ్ బ్రేక్ బంతులు వేయడంలో (లెంగ్త్ విషయంలో) మిశ్రాకు కుంబ్లే పలు సూచనలు చేశారు. స్పిన్నర్ల బౌలింగ్లో బ్యాట్స్మన్ ఎక్కువగా స్వీప్ ఆడేందుకు ప్రయత్నించగా, కోహ్లి, రహానే, విజయ్లు రివర్స్ స్వీప్ కూడా ప్రాక్టీస్ చేశారు. అవి బంగారు మాటలు: కోహ్లి విండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టుకు ఊహించని అదృష్టం దక్కింది. బ్యాటింగ్ దిగ్గజం వీవీఎన్ రిచర్డ్స్... టీమ్ బస చేసిన హోటల్కు రావడంతో క్రికెటర్లు ఆనందంలో తేలిపోయారు. ధావన్, రహానే, విజయ్, రాహుల్ సెల్ఫీలు దిగుతూ ‘కింగ్’ దగ్గర విలువైన సలహాలు, సూచనలను తీసుకున్నారు. రిచర్డ్స్ చెప్పినవి ‘బంగారు మాటలు’ అని విరాట్ వ్యాఖ్యానించాడు. ఈ మొత్తం సమావేశం గురించి ఆటగాళ్లు ట్వీట్లు చేశారు. సిరీస్ గెలిస్తేనే... ర్యాంక్ నిలుస్తుంది! దుబాయ్: వెస్టిండీస్తో జరగబోయే నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్ను కచ్చితంగా గెలిస్తేనే... ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత్ రెండో స్థానం పదిలంగా ఉంటుంది. లేదంటే విలువైన ర్యాంకింగ్ పాయింట్లను కోల్పోవాల్సి వస్తుంది. ప్రస్తుతం 112 పాయింట్లతో ఉన్న కోహ్లి బృందం... విండీస్పై 3-0 లేదా అంతకంటే మెరుగ్గా సిరీస్ను సాధిస్తే పాయింట్లలోగానీ, ర్యాంక్లోగానీ ఎలాంటి మార్పు ఉండదు. ఒకవేళ 3-1 లేదా 2-0తో సిరీస్ గెలిచినా భారత్ 110 పాయింట్లకు పడిపోతుంది. కానీ అదే విండీస్ 3-1 లేదా 2-0తో సిరీస్ను సొంతం చేసుకుంటే టీమిండియా 98 పాయింట్లకు దిగజారుతుంది. -
ఆరంభం అదిరింది
ప్రాక్టీస్ మ్యాచ్లో భారత్ 108/0 బసెటెర్రె (సెయింట్ కిట్స్): వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టుకు మంచి ఆరంభం లభించింది. వెస్టిండీస్ బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్తో జరుగుతున్న రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో తొలి రోజు కడపటి వార్తలు అందే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 108 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (51; 7 ఫోర్లు), లోకేశ్ రాహుల్ (50; 5 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధసెంచరీలు చేసి రిటైరయ్యారు. కోహ్లి, పుజారా క్రీజులో ఉన్నారు. ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో తొలి రోజు భారత్, రెండో రోజు బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ బ్యాటింగ్ చేస్తాయి. -
నంబర్వన్ మా లక్ష్యం కాదు
* మంచి క్రికెట్ ఆడడమే ముఖ్యం * టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి బెంగళూరు: నిరంతరం మారే ర్యాంకులను దృష్టిలో పెట్టుకుని టీమిండియా ఆడదని టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు. అలాగే రానున్న రోజుల్లో జరగబోయే టెస్టు మ్యాచ్లకు తామెలా సన్నద్ధమయ్యామో వెస్టిండీస్ పర్యటన తేలుస్తుందని అన్నాడు. తమ లక్ష్యం నంబర్వన్కు చేరడం కాదని, మంచి క్రికెట్ ఆడడమే తమకు ముఖ్యమని తేల్చాడు. కరీబియన్ టూర్కు వెళ్లే ముందు కోచ్ అనిల్ కుంబ్లేతో కలిసి చిన్నస్వామి స్టేడియంలో విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. విండీస్తో ఈనెల 21 నుంచి భారత జట్టు నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్ను 4-0తో క్లీన్స్వీప్ చేస్తే భారత్ నంబర్వన్ ర్యాంకును దక్కించుకుంటుంది. ‘ఓ టెస్టు జట్టుగా మాకు మేము సవాల్ను ఎదుర్కొంటూ ఓ అంచనాకు రావడానికి ఇదే సరైన అవకాశం. భవిష్యత్లో మేమెలా ఆడతామో కొన్ని నెలల్లో తేలుతుంది. ఈ ఫార్మాట్లో నంబర్వన్ ర్యాంకును పొందడం మా లక్ష్యం కాదు. మా ప్రధాన లక్ష్యం మంచి క్రికెట్ ఆడడమే. ఒక్కో టెస్టుపై దృష్టి పెడుతూ ముందుకు సాగుతాం’ అని కోహ్లి అన్నాడు. టెస్టు జట్టులో కేఎల్ రాహుల్ ఉన్నా కీపర్గా తమ తొలి ప్రాధాన్యం వృద్ధిమాన్ సాహాకేనని తేల్చాడు. దాదాపు 15 నెలలు భారత జట్టుకు దూరంగా ఉన్న పేసర్ మొహమ్మద్ షమీ నాణ్యమైన బౌలర్ అని కొనియాడాడు. టెస్టు మ్యాచ్లకు అతడి లైన్ అండ్ లెంగ్త్ సరిగ్గా సరిపోతుందని, విండీస్ పిచ్లపై అతడు రాణించడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశాడు. విరాట్ దూకుడును అడ్డుకోను: కుంబ్లే మైదానంలో కెప్టెన్ విరాట్ కోహ్లి దూకుడును తాను అడ్డుకోనని కోచ్ కుంబ్లే తెలిపారు. అయితే తామంతా భారత రాయబారులమనే విషయాన్ని కూడా క్రికెటర్లు గుర్తుంచుకోవాలని సూచించారు. దేనికైనా ఓ హద్దు ఉంటుందని గుర్తుచేశారు. ఏ ఆటగాడి సహజసిద్ధమైన దూకుడును తాను అడ్డుకోనని, కానీ క్రికెట్ గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం కూడా వారిపైనే ఉందని అన్నారు. రానున్న 17 టెస్టుల్లో నిలకడగా ఆడి వీలైనన్ని మ్యాచ్లను గెలవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆటను ఆస్వాదించండి: ధోని బిజీ షెడ్యూల్ ముందుండడంతో మైదానం వెలుపలా, లోపలా సరదాగా ఉండడం ఎంతో ముఖ్యమని వన్డే కెప్టెన్ ఎంఎస్ ధోని ఆటగాళ్లకు తెలిపాడు. ఆదివారం జరిగిన డ్రమ్ సర్కిల్లో పాల్గొన్న అనంతరం కొద్దిసేపు క్రికెటర్లతో సంభాషించాడు. తొలిసారిగా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు కలిగిన అనుభూతే క్రికెట్లోనూ చూపించాలని అన్నాడు. యువ ఆటగాళ్లతో కూడిన టెస్టు జట్టు ఇక సత్తా నిరూపించుకుని భవిష్యత్పై భరోసా కల్పించేలా ఆడాల్సిన తరుణం ఇదేనని వారికి హితబోధ చేశాడు. -
విరాట్లో నచ్చింది అదే: కుంబ్లే
బెంగళూరు: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిలోని దూకుడును తాను ఎన్నటికీ అడ్డుకోనని ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే స్పష్టం చేశాడు. విరాట్ కు సహజసిద్ధంగా లభించిన దూకుడు అంటే తనకు కూడా చాలా ఇష్టమన్నాడు. ' నాకు విరాట్లో దూకుడు అంటే ఇష్టం. నేను కూడా నా వరకూ దూకుడుగానే ఉంటా. కొంతమందికి సహజసిద్ధంగా లభించింది ఏదొకటి ఉంటుంది. ఆటగాళ్లలో ఉన్న వారి సహజత్వాన్ని నేను ఎప్పటికీ అడ్డుకోను. విరాట్ లో నాకు నచ్చింది అతని దూకుడే' అని కుంబ్లే తెలిపాడు. మరో రెండు రోజుల్లో వెస్టిండీస్ పర్యటనకు టీమిండియా బయల్దేరనుంది. దీనిలో భాగంగా సోమవారం బెంగళూరులో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో కుంబ్లే-విరాట్లో మాట్లాడారు. తొలుత విరాట్ నాయకత్వంపై కుంబ్లే విశ్వాసం వ్యక్తం చేశాడు. అతని కెప్టెన్సీలో టీమిండియా మరిన్ని విజయాలను సాధిస్తుందన్న కుంబ్లే.. తమకు విండీస్ పర్యటన ఒక సవాల్ అని పేర్కొన్నాడు. ఆ తరువాత విరాట్ మాట్లాడుతూ.. తమతో అనిల్ కుంబ్లే వంటి దిగ్గజ ఆటగాడు ఉండటం నిజంగా జట్టు అదృష్టమన్నాడు. అతనికున్న విశేషమైన అనుభవం కచ్చితంగా జట్టుకు లాభిస్తుందన్నాడు. ప్రస్తుత విండీస్ పర్యటనతో తొలి అంతర్జాతీయ సవాల్కు కుంబ్లే సిద్ధమయ్యాడని విరాట్ అన్నాడు. ఈ సిరీస్ను దిగ్విజయంగా ముగించి తిరిగి రావడమే తమ ముందన్న లక్ష్యమని విరాట్ పేర్కొన్నాడు. విండీస్ పర్యటనలో భారత్ నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. జూలై 21 నుంచి 25 వరకు ఆంటిగ్వాలో తొలి టెస్టు, జూలై 30 నుంచి ఆగస్టు 3 వరకు జమైకాలో రెండో టెస్టు జరుగుతాయి. మూడో టెస్టు ఆగస్టు 9 నుంచి 13 వరకు సెయింట్ లూసియాలో, నాలుగో టెస్టు ఆగస్టు 18 నుంచి 22 వరకు ట్రినిడాడ్లో జరుగుతాయి. -
కోహ్లీ మళ్లీ మొదలుపెట్టాడు
టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ మళ్లీ ప్రాక్టీసు మొదలుపెట్టాడు. వచ్చే నెలలో అత్యంత కీలకమైన వెస్టిండీస్ టూర్ ఉండటంతో 27 ఏళ్ల డాషింగ్ బ్యాట్స్మన్ నెట్స్వద్దకు వచ్చాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ 9వ సీజన్లో 973 పరుగులు చేసి ఆరంజ్ క్యాప్ సాధించిన కోహ్లీ.. అద్భుతమైన ఫాంలో ఉన్నాడు. దానికి ముందు జరిగిన టి20 ప్రపంచకప్లో కూడా భారత జట్టును సెమీస్ వరకు నడిపించాడు. కారులో కిట్ బ్యాగ్ వేసుకుని శిక్షణకు వెళ్తున్న ఫొటోను కోహ్లీ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం జింబాబ్వేలో జరుగుతున్న సిరీస్ నుంచి కోహ్లీకి విశ్రాంతి ఇచ్చారు. దాంతో కొన్నాళ్ల పాటు ఊరుకున్న విరాట్.. ఇప్పుడు వెళ్లేది విండీస్ కావడంతో గట్టిగా సిద్ధం అవ్వాలని భావిస్తున్నాడు. విండీస్లో 49 రోజుల పాటు జరిగే పర్యటనలో టీమిండియా నాలుగు టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంది. దానికి ముందు రెండు వార్మప్ మ్యాచ్లు కూడా ఉంటాయి. జూలై 9న సెయింట్ కిట్స్లో టూర్ ప్రారంభం అవుతుంది. తొలి టెస్టు జూలై 21వ తేదీ నుంచి మొదలవుతుంది. Guess who is back. On my way for my first net session. And that's how I feel; that good old feeling #Grateful -
రూ. 250 కోట్లు డిమాండ్ చేస్తున్న క్రికెట్ బోర్డు
భారతదేశంలో సిరీస్ను అర్ధాంతరంగా వదిలిపెట్టి వెళ్లినందుకు దాదాపు 250 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ తెలిపింది. వెస్టిండీస్ జట్టు భారత సిరీస్ను సగంలో వదిలిపెట్టి వెళ్లిపోయినందుకు తమకు భారీ నష్టం వాటిల్లిందని, వెంటనే దీనికి సంబంధించిన పరిష్కారంతో ముందుకు రావాలంటూ వెస్టిండీస్ బోర్డుకు బీసీసీఐ ఓ లేఖ రాసింది. ఇందుకు 15 రోజుల గడువు ఇచ్చింది. ఒక్క మీడియా హక్కుల రూపంలోనే బీసీసీఐకి 35 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. టికెట్ అమ్మకాల రూపంలో మరో 2 మిలియన్ డాలర్లు, టైటిల్ స్పాన్సర్షిప్ కోసం మైక్రోమాక్స్కు 1.6 మిలియన్ డాలర్లు.. ఇలా భారీ నష్టమే వాటిల్లిందని చెబుతున్నారు. ఇవి కాక ఇంకా నైక్ ఇచ్చిన కిట్ స్పాన్సర్షిప్.. ఇలాంటివి చాలా ఉన్నాయి. వీటన్నింటినీ వివరిస్తూ వెస్టిండీస్ బోర్డుకు బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ లేఖ రాశారు. -
మొయిన్ ‘మ్యాజిక్’ వెనుక...
‘ప్రపంచానికి మొయిన్ అలీ ఓ మామూలు స్పిన్నర్... కానీ భారత బ్యాట్స్మెన్కు మురళీధరన్లా కనిపిస్తున్నాడు’... ఇంటర్నెట్లో ఇప్పుడు హల్చల్ చేస్తున్న కామెంట్ ఇది. స్పిన్ బాగా ఆడతారనే పేరున్న భారత్పై ఆరు వికెట్లు తీయడం... అది కూడా ఇంగ్లండ్ పిచ్పై విశేషమే. మరి మొయిన్ విజయ రహస్యం ఏమిటి? సాక్షి క్రీడావిభాగం ఈ ఏడాది ఫిబ్రవరిలో వెస్టిండీస్ పర్యటన ద్వారా మొయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్లో టి20 ప్రపంచకప్ సందర్భంగా అతని పేరు వినిపించింది. వెస్టిండీస్ పర్యటనలో ఫర్వాలేదనిపించినా... టి20 ప్రపంచకప్లో వూత్రం విఫలవుయ్యూడు. అరుునా లంకతో టెస్టు సిరీస్కు మాత్రం జట్టులో చోటు దక్కించుకున్నాడు. రెండు మ్యాచ్ల్లోనూ బ్యాట్స్మన్గా రాణించాడు. పార్ట్టైమ్ స్పిన్నర్గా సహచరులకు మద్దతు ఇచ్చే బౌలర్ పాత్ర పోషించాడు. కానీ భారత్తో సిరీస్ సమయానికి అనూహ్యంగా జట్టుకు ప్రధాన స్పిన్నర్గా మారాడు. గత యాషెస్ సమయంలో గ్రేమ్ స్వాన్ ఆకస్మిక రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లండ్కు నాణ్యమైన స్పిన్ బౌలర్ దొరకలేదు. రకరకాల ప్రత్యామ్నాయాలను చూసినా... అలీని పట్టించుకోలేదు. కానీ ప్రస్తుతం భారత్తో అతని ప్రదర్శన చూసిన తర్వాత ఇంగ్లండ్కు స్పిన్నర్ కొరత తీరిందనే అనుకోవాలి. జడేజా లాంటి స్పెషలిస్ట్ స్పిన్నర్ విఫలమైన చోట అలీ అద్భుతమైన ఫ్లయిట్, బౌన్స్, టర్న్ రాబట్టాడు. ఇప్పటివరకు అలీ కెరీర్లో ఆడింది 5 టెస్టులు, 3 వన్డేలు, 6 టి20లు మాత్రమే. అన్ని ఫార్మాట్లలో కలిపి తీసింది 21 వికెట్లు. ఈ గణాంకాల ఆధారంగా అతణ్ని గొప్ప స్పిన్నర్గా లెక్కకట్టడం కాస్త తొందరపాటే. అయితే ఇంగ్లండ్కు మాత్రం అతనిలో స్వాన్ కనిపిస్తున్నాడు. అలీ ఆ అంచనాలను అందుకుంటే మాత్రం గొప్ప ఆల్రౌండర్గా ఎదుగుతాడు. అజ్మల్ దగ్గర దూస్రాలు... పాకిస్థాన్ సంతతికి చెందిన మొయిన్ అలీ బర్మింగ్హామ్లో జన్మించాడు. అతని సోదరుడు ఖాదీర్ అలీ స్ఫూర్తితో క్రికెట్లో అడుగుపెట్టిన అలీ... ఇంగ్లండ్లోని చాలామంది లాగే రకరకాల కౌంటీ డివిజన్లలో మ్యాచ్లు ఆడాడు. కానీ అతని కెరీర్ మలుపు తిరిగింది 2011లో. ఆ సీజన్లో వర్సెస్టర్షైర్ తరఫున పాక్ స్పిన్నర్ అజ్మల్తో కలిసి ఆడటం అలీని బౌలర్గా బాగా ఎదిగేలా చేసింది. అజ్మల్ దగ్గర దూస్రాలు నేర్చుకున్నాడు. బంతిలో వేగాన్ని ఎలా పెంచుకోవాలో తెలుసుకున్నాడు. వీటిని ఇంగ్లండ్ కౌంటీల్లో ప్రదర్శించి విజయం సాధించాడు. అంతే... 13 మంది సభ్యుల ఇంగ్లండ్ డెవలెప్మెంట్ జట్టులోకి వచ్చేశాడు. రెండేళ్లలోనే నాణ్యమైన ఆల్రౌండర్గా ఎదిగి ఇంగ్లండ్ జాతీయ జట్టులోకి వచ్చాడు. ‘బ్యాండ్’ వివాదం... భారత్తో మూడో టెస్టులో తన చేతికి ‘సేవ్ గాజా, సేవ్ పాలస్తీనా’ అనే రిస్ట్బ్యాండ్లను ధరించి వివాదాల్లోకీ వచ్చాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఓ క్రికెటర్ రాజకీయు, వుతపరమైన, జాతి కార్యకలాపాలు ప్రదర్శించకూడదు. దీంతో ఐసీసీ మొయిన్ను హెచ్చరించింది. కానీ ఈ విషయుంలో ఈసీబీ మొరుున్ అలీని సవుర్థించడం విశేషం. -
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్:కాన్పూరు వన్డే
కాన్పూర్: టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య ఇక్కడ ఒక రోజు అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య ఇది మూడవ వన్డే. ఆస్ట్రేలియాలాంటి బలమైన జట్టు మీద సంచలనాత్మక స్కోర్లతో సిరీస్ గెలిచిన భారత జట్టు వెస్టిండీస్తో సిరీస్లో తడబడటం కాస్త ఆశ్చర్యకరమే. విశాఖపట్నం వన్డేలో అనూహ్యంగా పుంజుకున్న వెస్టిండీస్... సిరీస్లో 1-1తో ఆఖరి వన్డే కోసం కాన్పూర్ వచ్చింది. ఈ రోజు డే మ్యాచ్ అయినందున మంచు ప్రభావం పెద్దగా ఉండదు.