YSR Rythu Bharosa
-
పంటల బీమాకు ‘పాత’ర!
రూ.4 లక్షల బీమా పరిహారం అందుకున్నా..పసుపు, కంద, అరటి, తమలపాకు సాగు చేస్తుంటా. వైఎస్సార్ ఉచిత పంటల బీమా రైతులకు ఎంతో బాసటగా నిలిచింది. గత ఐదేళ్లలో పైసా ప్రీమియం చెల్లించకుండా రూ.4 లక్షలకు పైగా బీమా పరిహారం పొందా. రూ.2 లక్షల వరకు పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) అందుకున్నా. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పరిహారం జమైంది. రైతాంగానికి ఎంతో ఆసరాగా ఉన్న పథకాన్ని రద్దు చేసి 2019కి ముందు ఉన్న విధానం అమలు చేయాలని నిర్ణయించడం సరికాదు. ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలి.– ముత్తిరెడ్డి శ్రీనివాసరావు, కిష్కిందపాలెం, బాపట్ల జిల్లాసాక్షి, అమరావతి: ఇన్నాళ్లూ తమపై పైసా భారం పడకుండా కష్టకాలంలో ఆదుకున్న డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమాకు పాతరేసే దిశగా టీడీపీ సర్కారు సన్నద్ధం కావడం అన్నదాతల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ‘సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తాం.. ఏ ఒక్కటీ ఆపే ప్రసక్తే లేదు. ఇంకా మెరుగైన రీతిలో అమలు చేస్తాం’ అని ఎన్నికల ప్రచార సభల్లో హామీలిచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇతర కూటమి నేతలు వాటిని గాలికి వదిలేశారు. రైతులకు మేలు చేసే వ్యవసాయ సలహా మండళ్లను రద్దు చేసిన కూటమి సర్కారు కన్ను తాజాగా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకంపై పడింది. ఈ – క్రాప్ నమోదు ప్రామాణికంగా నోటిఫై చేసిన ప్రతీ పంటకు, సాగు చేసిన ప్రతీ ఎకరాకు యూనివర్శల్ బీమా కవరేజ్ కల్పిస్తూ ఈ పథకం దేశానికే తలమానికంగా నిలిచింది. అయితే 2019కి ముందు అమలులో ఉన్న పాత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్టు తొలి సమీక్షలో సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన రైతన్నల గుండెల్లో గుబులు రేపింది. గత ఐదేళ్లుగా తాము కట్టాల్సిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించి పైసా భారం లేకుండా ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది అదే సీజన్ ప్రారంభానికి ముందే నేరుగా తమ ఖాతాల్లో జమ చేసే పరిస్థితి ఇక ఉండదన్న ఆందోళన వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. టీడీపీ సర్కారు తన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకుని ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే ఉద్యమ బాట పట్టక తప్పదని హెచ్చరిస్తున్నాయి.ఏళ్ల తరబడి ఎదురు చూపులు..1965లో కేంద్రం తెచ్చిన క్రాప్ ఇన్సూరెన్స్ బిల్లు ఆధారంగా ప్రవేశపెట్టిన మోడల్ ఇన్సూరెన్స్ పథకం వివిధ రూపాలు మార్చుకుని ప్రధాని ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై)గా 2016 నుంచి దేశవ్యాప్తంగా అమలవుతోంది. దీని ప్రకారం నోటిఫై చేసిన వ్యవసాయ పంటలకు ఖరీఫ్లో 2 శాతం, రబీలో 1.5 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం చొప్పున రైతులు ప్రీమియం చెల్లించగా మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాయి. అయితే ప్రీమియం భారం అధికంగా ఉండడంతో పాటు అవగాహన లేక పలువురు రైతులు సొంతంగా బీమా చేయించుకునేందుకు ముందుకొచ్చేవారు కాదు. రుణాలు తీసుకునే రైతులకు మాత్రం బ్యాంకులు ప్రీమియం రూపంలో నిర్దేశించిన మొత్తాన్ని మినహాయించుకొని మిగతాది అందచేసేవి. అయితే బీమా చేయించుకున్న వారు సైతం ఎంతొస్తుంది? ఎప్పుడొస్తుందో అంతుబట్టక ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.2014–19 పరిహారం రూ.3,411.20 కోట్లే చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడూ కేంద్ర పథకాలపై ఆధార పడడం మినహా అన్నదాతల సంక్షేమం కోసం తపించిన దాఖలాలు లేవు. 2014–19 మధ్య తొలి రెండేళ్లు వ్యవసాయ ఇన్సూరెన్స్కీమ్ (ఏఐఎస్), ఆ తర్వాత పీఎంఎఫ్బీవై అమలు చేశారు. ప్రీమియం రూపంలో 2014–19 మధ్యలో రైతులు తమ వాటాగా రూ.1249.90 కోట్లు చెల్లిస్తే, రాష్ట్ర ప్రభుత్వం రూ.1281 కోట్లు చెల్లించింది. హుద్హుద్ లాంటి పెను తుపాన్, కరువు కాటకాటకాలతో రూ.వేల కోట్ల పంటలను కోల్పోయిన రైతులకు 2014–19 మధ్య దక్కిన పరిహారం కేవలం రూ.3,411.20 కోట్లు మాత్రమే. పైసా భారం పడకుండా.. పాదయాత్ర హామీ మేరకు వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 జూలై 8న వైఎస్సార్ ఉచిత పంటల బీమాకు శ్రీకారం చుట్టారు. తొలి ఏడాది పీఎం ఎఫ్బీవైతో అనుసంధానించి అమలు చేశారు. 2019 ఖరీఫ్ సీజన్లో రూపాయి ప్రీమియంతో పథకానికి శ్రీకారం చుట్టగా అనంతరం ఆ భారం కూడా రైతులపై పడకూడదన్న ఆలోచనతో ఖరీఫ్–2020 నుంచి నోటిఫైడ్ పంటలకు ఉచితంగా బీమా కవరేజ్ కల్పించారు. క్లెయిమ్లు, సెటిల్మెంట్లు, చెల్లింపుల బాధ్యతను కూడా ప్రభుత్వం తన భుజాన వేసుకుంది. తొలి ఏడాది రైతుల వాటా (రూ.468 కోట్ల)తో కలిపి ప్రీమియం రూపంలో వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.971 కోట్లు బీమా కంపెనీలకు చెల్లించింది. యూనివర్సల్ కవరేజ్కు కేంద్రం ముందుకు రాకపోవడంతో 2020–21, 2021–22 సీజన్లలో పీఎం ఎఫ్బీవైతో సంబంధం లేకుండా మొత్తం బీమా పరిహారం ప్రభుత్వమే చెల్లించింది. 2022–23 నుంచి ఫసల్ బీమాతో అనుసంధానించి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేశారు. వాతావరణ ఆధారిత పంటలకు మాత్రం గత ప్రభుత్వం సొంతంగానే బీమా పరిహారం చెల్లించింది. ఈ క్రాప్ ప్రామాణికంగా.. ఈ క్రాప్తో పాటు ఈ కేవైసీ నమోదు ప్రక్రియ పూర్తి కాగానే గత ప్రభుత్వం ఉచిత పంటల బీమా పధకం వర్తించే నోటిఫై చేసిన పంటలకు (స్టార్) గుర్తుతో ప్రత్యేకంగా తెలియచేస్తూ రైతులకు భౌతిక రసీదు అందచేసింది. ‘డాక్టర్ వైస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద నోటిఫై చేసిన పంటకు ప్రీమియంను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించి పంట బీమా చేసింది‘ అని అందులో స్పష్టంగా తెలియచేసింది. ఈ జాబితాలను సామాజిక తనిఖీల్లో భాగంగా ఆర్బీకేల్లో ప్రదర్శించి అభ్యంతరాలను పరిష్కరించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ బీమా పరిహారం అందచేసింది. ప్రీమియం రూపంలో రైతుల వాటాతో కలిపి 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.3,022.26 కోట్లు కంపెనీలకు చెల్లించింది. 2019–24 మధ్య 1.91 కోట్ల హెక్టార్లకు బీమా కవరేజీ కల్పించగా 2.04 కోట్ల మంది రైతులకు బీమా రక్షణ లభించింది. రికార్డు స్థాయిలో పరిహారం.. 2014–19 మధ్య 30.85 లక్షల మందికి రూ.3411.20 కోట్ల పరిహారం చెల్లిస్తే 2019–24 మధ్య 54.55 లక్షల మందికి రూ.7,802.05 కోట్ల బీమా పరిహారం అందింది. టీడీపీ హయాంలో 6.19 లక్షల మంది రైతులకు చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.715.84 కోట్ల బకాయిలు కూడా చెల్లించి గత సర్కారు అండగా నిలిచింది. ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం చెల్లించిన బీమా మొత్తం కంటే రూ.3,273.64 కోట్ల మేర అదనంగా లబ్ధి చేకూర్చగా 13.81 లక్షల మంది రైతులు అదనంగా ప్రయోజనం పొందారు. ఏపీ బాటలో పలు రాష్ట్రాలు.. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని దేశంలోనే అత్యుత్తమ పంటల బీమా పథకంగా కేంద్రం గుర్తించింది. ఇన్నోవేషన్ కేటగిరి కింద ఉత్తమ బీమా పథకంగా ఎంపిక చేసింది. 2023 ఏప్రిల్ 14న కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహూజా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని అందించారు. ఏపీ స్ఫూర్తిగా జాతీయ స్థాయిలో పీఎంఎఫ్బీవైలో పలుమార్పులు చేసినట్టుగా కేంద్రం ప్రకటించింది. ఏపీ తరహాలో మిగిలిన రాష్ట్రాలు కూడా అమలు చేయాలని సూచించింది. 2023–24 నుంచి మహారాష్ట్ర, మేఘాలయ, ఒడిశా, పుదుచ్చేరి తదితర రాష్ట్రాలు ఏపీ బాటలోనే రూపాయి ప్రీమియంతో పంటల బీమా అమలుకు శ్రీకారం చుట్టాయి. ఉచిత పంటల బీమా పథకాన్ని కేంద్రం సహా పలు రాష్ట్రాలు ప్రశంసించాయి. రూ.1,278.80 కోట్ల ప్రీమియం చెల్లింపులకు ఎగనామం.. 2023–24 సీజన్కు సంబంధించి బీమా కవరేజ్ పరిధిలోకి వచ్చిన అర్హుల జాబితాను గతంలోనే కేంద్రానికి పంపించారు. ఆ మేరకు రైతుల వాటాతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,278.80 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఎన్నికల కోడ్ అమలులోకి రావడం, ప్రభుత్వం మారడంతో ప్రీమియం చెల్లించాల్సిన బాధ్యత టీడీపీ సర్కారుపై ఉంది. అయితే పాత పద్ధతిలోనే పంటల బీమా అమలు చేస్తామని ప్రకటించడం ద్వారా 2023–24 సీజన్ ప్రీమియం చెల్లింపులు జరపవద్దని అధికారులకు సీఎం చంద్రబాబు సంకేతాలిచ్చారు. దీంతో 2023–24 సీజన్లో వర్షాభావం, వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు బీమా పరిహారం అందే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు 2024–25 సీజన్ నుంచి రైతులే చెల్లించేలా చూడాలంటూ మౌఖిక ఆదేశాలు ఇవ్వడంతో వారిపై పెనుభారం పడనుంది. రైతులపై ఏటా రూ.800 కోట్లకుపైగా భారం ఏ పంటైనా సరే జిల్లాలో కనీసం ఐదువేల ఎకరాల్లో సాగైతేనే నోటిఫై చేస్తారు. నోటిఫై చేసిన పంట పెట్టుబడి ఖర్చులను బట్టి బీమా కంపెనీలు ప్రీమియం నిర్దేశిస్తాయి. ఉదాహరణకు వరికి ఎకరాకు రూ.40 వేలు ఖర్చవుతుంటే కనీసం 8 శాతం అంటే రూ.3,200 చొప్పున ప్రీమియం చెల్లిస్తేనే బీమా కవరేజ్ కల్పిస్తుంది. ఈ మొత్తంలో ఖరీఫ్లో అయితే 2 శాతం, రబీలో 1.5 శాతం చొప్పున రైతులు గతంలో చెల్లించగా మిగతాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించేవి. ఈ లెక్కన నోటిఫై పంటలకు రైతులు తమ వాటాగా ఏటా కనీసం రూ.800 కోట్లకు పైగా ప్రీమియం రూపంలో భరించాల్సి ఉంటుంది. బ్యాంకుల నుంచి రుణాలు పొందని కౌలు రైతులు, సన్న, చిన్నకారు రైతులు సొంతంగానే ప్రీమియం చెల్లించాలి. వీరికి అవగాహన కల్పించకపోవడం, ఆర్ధిక భారం కారణంగా బీమాకు ముందుకు రావడం లేదు. దీంతో పంట నష్టపోతే విపత్తుల వేళ బీమా పరిహారం అందని దుస్థితి నెలకొంటుంది. వైఎస్సార్ రైతు భరోసాను హడావుడిగా అన్నదాతా సుఖీభవగా మార్చేసి రూ.20 వేలు ఇవ్వకుండా ఇప్పటికే సీజన్లో అన్నదాతలను ముంచేసిన టీడీపీ సర్కారు ఇప్పుడు ఉచిత పంటల బీమాను కూడా రద్దు చేసే దిశగా అడుగులు వేయడం పిడుగుపాటుగా మారింది.రూ.2.75 లక్షల పరిహారం ఇచ్చారువైఎస్సార్ ఉచిత పంటల బీమా అన్నదాతలను ఎంతో ఆదుకుంది. నోటిఫై చేసిన పంటలు ఈ క్రాప్లో నమోదైతే చాలు బీమా వర్తింపచేశారు. మాకు 20 ఎకరాల భూమి ఉంది. పత్తి, శనగ, ఉల్లి సాగు చేస్తుంటాం. 2019–20లో ఒక్క ఉల్లి పంటకే రూ.1.10 లక్షల బీమా పరిహారం వచ్చింది. ఆ తర్వాత రూ.70 వేలు, రూ.42 వేలు, రూ.53 వేలు చొప్పున వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రూ.2.75 లక్షల బీమా పరిహారం అందింది. రూపాయి ప్రీమియం చెల్లించకపోయినా ఇంత భారీగా పరిహారం దక్కటం ఎంతో ఊరటనిచ్చింది. అన్నదాతలకు ఎంతగానో ఆసరాగా నిలిచిన ఈ ఉచిత పంటల బీమాను కొనసాగించాలి. 2019కి ముందు ఉన్న పంటల బీమా పథకాన్ని కొనసాగిస్తే రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. –గౌర మహేశ్వరరెడ్డి, ఏ.గోకులపాడు, కర్నూలు జిల్లాపాత విధానం సరికాదు..30 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నా. 2021 ఖరీఫ్లో అరటి పంట దెబ్బతినడంతో రూ.90 వేల పంటల బీమా పరిహారం నేరుగా నా ఖాతాలో జమ చేశారు. దళారుల ప్రమేయం లేకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసింది. ఐదేళ్లూ పైసా కూడా మేం ప్రీమియం చెల్లించలేదు. మా వాటా కూడా ప్రభుత్వమే కట్టింది. చంద్రబాబు ప్రభుత్వం పాత విధానంలో పంటల బీమా అమలు చేస్తామని చెప్పడం సరికాదు.– గనివాడ సన్యాసినాయుడు, పెదమదుపాడ, విజయనగరం జిల్లారైతులు బీమా చేయించుకోలేరు2019కు ముందు టీడీపీ హయాంలో రైతులు బీమా చేయించుకుంటేనే నష్టపరిహారం వర్తించేది. రైతులలో చాలా మంది నిరక్షరాస్యులు ఉన్నందున అవగాహన లేక నష్టపోయే ప్రమాదం ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉచిత పంటల బీమాను అమలు చేసింది. 2021లో వర్షాలకు 80 సెంట్లు పొలంలో నష్టపోతే నేరుగా రూ.5,100 పరిహారం ఇచ్చారు. – డి. ప్రభాకర్, తాటితూరు, భీమిలి మండలంరూ.3.80 లక్షల పరిహారం వచ్చిందినేను పైసా ప్రీమియం చెల్లించకపోయినా 2021లో ఖరీఫ్లో పంట నష్టపోతే రూ.3.80 లక్షల బీమా పరిహారం జమైంది. గతంలో ప్రీమియం చెల్లించిన తర్వాత కూడా పరిహారం కోసం అధికారులు, కంపెనీల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వచ్చేది. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం ఎంతగానో ఉపయోగపడింది. ఈ పథకాన్ని కొనసాగించాలి.– వీరపురం భీమేష్, గడేకల్లు, అనంతపురం జిల్లారైతుల తరపున ఉద్యమిస్తాం..రైతులపై భారం పడకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాల్సిందే. పాత పద్ధతిలో పంటల బీమా అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించటాన్ని ఖండిస్తున్నాం. పెరిగిన పెట్టుబడి ఖర్చులకు తోడు బీమా ప్రీమియం రైతులకు తలకు మించిన భారమవుతుంది. ప్రీమియం చెల్లించలేక బీమాకు మెజార్టీ రైతులు దూరమవుతారు. ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించకుంటే ఉద్యమిస్తాం.– కె.ప్రభాకరరెడ్డి, ప్రధాన కార్యదర్శి, ఏపీ రైతు సంఘంపాత పద్ధతితో తీవ్ర నష్టంగతంలో క్రాప్ లోన్ ఆధారంగా రైతులు సాగు చేసిన పంటలకు కాకుండా ఇష్టానుసారంగా ఇన్సురెన్స్ ఇచ్చేవారు. ఐదేళ్లుగా ఉచిత పంటల బీమా అమలు చేయడం వలన పైసా ప్రీమియం చెల్లించాల్సిన పని లేకుండా సాగు చేసిన పంటకు బీమా పరిహారం నేరుగా అందింది. ఈ పథకాన్ని కొనసాగించాలి. పాత పద్ధతితో తీవ్రంగా నష్టపోతాం.– ఎన్.రాజేశ్వరరెడ్డి, సింహాద్రిపురం, వైఎస్సార్ జిల్లా -
గడిచిన ఐదేళ్లూ ఈ పాటికే ఖాతాల్లోకి..
సాక్షి, అమరావతి: ఖరీఫ్ ఊపందుకుంటున్న వేళ పెట్టుబడి ఖర్చుల కోసం చేతిలో చిల్లిగవ్వలేక అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అప్పుల కోసం ముప్పుతిప్పలు పడుతున్నారు. గత ఐదేళ్లుగా ఏటా మూడు విడతల్లో పెట్టుబడి సాయం చేతికందగా ఈసారి వ్యవసాయ పనులు మొదలైనా దిక్కులు చూడాల్సి వస్తోందని వాపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే ఆర్బీకేలలో విత్తనాలు, ఎరువులు నిల్వ చేయడంతోపాటు కొన్ని సందర్భాల్లో పీఎం కిసాన్ కంటే ముందుగానే తొలి విడత పెట్టుబడి సాయం చేతికందిన వైనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ డబ్బులు రైతులు దుక్కి దున్ని భూమిని సిద్ధం చేసుకోవడం, సబ్సిడీ పచ్చి రొట్ట విత్తనాలు వేసుకోవడం, నారుమళ్లు పోసు కోవడం, నాట్లు వేయడం లాంటి అవసరాలకు ఉపయోగపడేవి. గతంలో వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏటా మూడు విడతల్లో అందించిన సాయం సన్న, చిన్నకారులకు ఎంతగానో ఉపయోగపడేది. రాష్ట్రంలో అర హెక్టార్ (1.25 ఎకరాలు) లోపు విస్తీర్ణం కలిగిన రైతులు 50 శాతం మంది ఉండగా హెక్టార్ (2.50 ఎకరాలు) లోపు విస్తీర్ణమున్న రైతులు 70 శాతం మంది ఉన్నారు. అర హెక్టార్ లోపు సాగుభూమి ఉన్న రైతులు వేసే పంటలకు అయ్యే పెట్టుబడిలో 80 శాతం ఖర్చు రైతు భరోసా రూపంలో అందడంతో వారికి ఎంతో ఊరటగా ఉండేది. తాము అధికారంలోకి వస్తే ప్రతీ రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తామని సూపర్ సిక్స్లో టీడీపీ – జనసేన కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే అమలు చేస్తామని ప్రకటించారు. ఒకపక్క వ్యవసాయ పనులు జోరందుకున్నా ప్రభుత్వ పెద్దలెవరూ ఇంతవరకూ ఆ ఊసెత్తక పోవడం పట్ల రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పేరు మార్చేందుకే ఉత్సాహం..ఇచ్చిన హామీ కంటే మిన్నగా వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించి వైఎస్ జగన్ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. ప్రతీ రైతు కుటుంబానికి ఏటా మే/ జూన్లో రూ.7500, అక్టోబర్లో రూ.4 వేలు, జనవరిలో 2 వేలు చొప్పున క్రమం తప్పకుండా జమ చేశారు. ఏటా సగటున 51.50 లక్షల మందికి ఐదేళ్లలో వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్ కింద రూ.34,288.17 కోట్లు జమ చేసి రైతులకు అండగా నిలిచారు. భూ యజమానులతో పాటు అటవీ, దేవదాయ భూసాగుదారులకే కాకుండా సెంటు భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులకు ఐదేళ్లూ వైఎస్ జగన్ ప్రభుత్వమే సొంతంగా పెట్టుబడి సాయం అందించి అండగా నిలిచింది. పీఎం కిసాన్ కింద 2024–25 సీజన్ తొలి విడత సాయాన్ని మాట ప్రకారం కేంద్రం ఇటీవలే జమ చేసింది. సీఎం చంద్రబాబు కూడా అదే మాదిరిగా రైతన్నలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ రూ.20 చొప్పున పెట్టుబడి సాయాన్ని కేంద్ర సాయంతో సంబంధం లేకుండా ఇవ్వాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. వైఎస్సార్ రైతు భరోసా పేరును అన్నదాత సుఖీభవగా మార్చటంలో చూపిన ఉత్సాహాన్ని సాయం అందించడంలోనూ ప్రదర్శించాలని కోరుతున్నారు.పెట్టుబడి కోసం అగచాట్లు..గత ఐదేళ్లు పెట్టుబడి సాయం సకాలంలో అందింది. దీంతో అదునులో విత్తనాలు కొనుగోలు చేసేవాళ్లం. ఈ ఏడాది కూటమి ప్రభుత్వం పెట్టుబడి సాయం ఎప్పుడు ఇస్తుందో చెప్పడం లేదు. కేంద్రం నుంచి పీఎం కిసాన్ సాయం అందింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం ఇంతవరకు విడుదల కాకపోవడంతో పెట్టుబడి కోసం అగచాట్లు తప్పడం లేదు. వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది.– కారసాని శివారెడ్డి. సూరేపల్లి, బాపట్ల జిల్లాసాగు ఖర్చుల కోసం ఇబ్బందులు..గత ప్రభుత్వం ఏటా క్రమం తప్పకుండా అందజేసిన వైఎస్సార్ రైతు భరోసా సాయం రైతులకు కొండంత అండగా నిలిచేది. ఏటా మూడు విడతలుగా రైతుల ఖాతాలో నేరుగా జమ చేసి భరోసా కల్పించేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెట్టుబడి సాయం డబ్బులు ఇవ్వకపోవడంతో సాగు ఖర్చుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.– చింతల రాజు, బురదకోట, ప్రత్తిపాడు రూరల్, కాకినాడ జిల్లాఐదేళ్లు నమ్మకంగా ఇచ్చారు..వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జూన్ మొదటి వారంలోనే రైతు భరోసా డబ్బులు పడేవి. ఆ నగదుతో పాటు కొంత డబ్బు కలిపి పంటలు సాగు చేసేవాళ్లం. ఐదేళ్లు నమ్మకంగా రైతు అకౌంట్లో జమ చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ఇంత వరకు ఆ ఆలోచన చేయలేదు. ఎప్పుడు ఇస్తారో నమ్మకం లేదు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. రైతులు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. – తూళ్లూరి నీరజ, గమళ్లపాలెం, కొత్తపట్నం మండలం, ప్రకాశం జిల్లామా గోడు పట్టించుకోండి..గత ఐదేళ్లు రైతు భరోసా సకాలంలో అందడంతో సాగు సాఫీగా సాగేది. ప్రస్తుత పాలకులు మా బాధను పట్టించుకుని రైతులకు ఆర్థిక సాయం త్వరగా అందించాలి. – రాధయ్య, రైతు, పెద్దతయ్యూరు, శ్రీరంగరాజపురం, చిత్తూరు జిల్లా.పాత రోజులు గుర్తుకొస్తున్నాయి..సీజన్ మొదలై నెల గడుస్తున్నా ఇప్పటి వరకూ పెట్టుబడి సాయం అందలేదు. ప్రధాని మోదీ సాయం అందిచాన అది ఎందుకూ సరిపోలేదు. రాష్ట్ర ప్రభుత్వం సాయం అందక పోవడంతో మళ్లీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. అధిక వడ్డీలకు అప్పులు చేయక తప్పడం లేదు. ఏదో బాధపడి విత్తనాలు కొనుగోలు చేశాం. మిగిలిన పనులకు పెట్టుబడి సహాయం అత్యవసరం. – చింతల వెంకటరమణ, రైతు, లుకలాం, నరసన్నపేట మండలం, శ్రీకాకుళం జిల్లావారం పది రోజుల్లోనే ఇస్తామని..అధికారంలోకి వచ్చిన వారం పది రోజుల్లోనే రైతు భరోసా అందిస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు ఆ ఊసే లేదు. ఖరీఫ్ సీజన్లో రైతులను ఆదుకోవాలి. లేదంటే అప్పులే శరణ్యం.– ప్రభాకర్, రైతు, తిరుపతి రూరల్ మండలంవ్యవసాయం ఇక కష్టమేజగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జూన్ నెలలో రైతు భరోసా సాయం ఖాతాలో పడేది. ఇప్పుడు ప్రభుత్వం మారడం వల్ల రైతుల గురించి ఆలోచన చేసే విధంగా కనిపించడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే రైతులు వ్యవసాయం చేయడం కష్టమే,–ఆకుల నారాయణ రైతు వంగర సాయం చేయాలి...మాలాంటి పేద రైతులకు గత ప్రభుత్వం అందించిన రైతు భరోసా సాయం ఎంతో ఉపయోగపడేది. ప్రస్తుతం వ్యవసాయ పనులు, సేద్యం ప్రారంభమైనా కొత్త ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు అందకపోవడం విచారకరం. రైతుల పట్ల ప్రభుత్వాలు సానుకూల దృక్పథంతో ఆలోచించి సాయం చేయాలి. – వెన్నపూస కృష్ణారెడ్డి, ఖాన్సాహెబ్పేట, మర్రిపాడు మండలం -
ఖరీఫ్లో ఎరువుల సరఫరాకు కార్యాచరణ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాల ద్వారా గ్రామస్థాయిలో ఎరువుల సరఫరాను మరింత మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను సిద్ధంచేస్తోంది. 2024–25 వ్యవసాయ సీజన్లో ఆర్బీకేలలో ఎరువులు లేవన్న మాట వినిపించకూడదన్న లక్ష్యంతో రైతులు కోరుకున్న ఎరువులను అందించేలా ఏర్పాట్లుచేస్తోంది. గడిచిన నాలుగేళ్లలో ఆర్బీకేల ద్వారా 31.54 లక్షల మంది రైతులకు రూ.1,311.80 కోట్ల విలువైన 11.88 లక్షల టన్నుల ఎరువులు సరఫరా చేయగా, రానున్న సీజన్లో కనీసం 10 లక్షల టన్నుల ఎరువుల సరఫరాకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రైతులకు రూ.100 కోట్ల వరకు ఆదాసాగు ఉత్పాదకాల పంపిణీలో ఆర్బీకేలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఎరువుల కోసం రైతులు మండల, జిల్లా కేంద్రాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగేవారు. అయినా అరకొరగానే అందేవి. ఒక్కోసారి సమయానికి దొరక్క బ్లాక్లో కొనాల్సి వచ్చేది. ఎరువుల వంకతో అవసరంలేని పురుగుల మందులను కొనాల్సి రావడం రైతులకు భారంగా మారేది. ప్రస్తుతం సర్టిఫై చేసిన ఎరువులను ఆర్బీకేల ద్వారా అందుబాటులో ఉంచడంతో ఎరువు కోసం రైతులు ఇబ్బందిపడిన దాఖలాలు కన్పించలేదు. లోడింగ్, అన్లోడింగ్ చార్జీల కింద బస్తాకు రూ.20 నుంచి రూ.50 వరకు రైతులకు ఆదా అవుతోంది. ఇలా నాలుగేళ్లలో రూ.100 కోట్లకు పైగా రైతులకు ఆదా అయ్యింది. ఆర్బీకేలకు ఎరువుల లైసెన్సులు కేంద్రం కేటాయించిన ఎరువులను జిల్లాల వారీగా మార్క్ఫెడ్ గోడౌన్లలో నిల్వచేసి అక్కడ నుంచి పీఏసీఎస్, ఆర్బీకేలకు సరఫరా చేయడానికి ఏటా రూ.70 కోట్లకు పైగా ఖర్చవుతోంది. ఈ భారాన్ని గత నాలుగేళ్లుగా ప్రభుత్వమే భరిస్తోంది. వచ్చే ఏడాది నిల్వ సామర్థ్యం పెరగనుండడంతో ఇందుకు కనీసం రూ.150 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ భారాన్ని తగ్గించుకోవడంతో పాటు పంపిణీలో జాప్యాన్ని నివారించేందుకు ప్రతీ ఆర్బీకేలో కనీసం 20 టన్నులు అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం గ్రామస్థాయిలో వివిధ శాఖల పరిధిలో 1,864 గోదాములు, సచివాలయ ప్రాంగణాల్లో 3,979 గోదాములు అందుబాటులో ఉన్నాయి. ఆర్బీకేలకు అనుబంధంగా 500 టన్నుల సామర్థ్యంతో రూ.493.15 కోట్లతో 1,167 గోదాములు నిరి్మస్తుండగా, వాటిలో 664 గోదాములు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన చోట్ల అద్దెకు తీసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆర్బీకేలకు ఎరువుల విక్రయ లైసెన్సులు జారీచేశారు. ఫలితంగా సమయంతో పాటు రవాణా, హ్యాండ్లింగ్ చార్జీలు చాలావరకు తగ్గే అవకాశాలున్నాయి. ఖరీఫ్–24కు 17.50 లక్షల టన్నులు ఎరువులు..ఇక ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 81.25 లక్షల ఎకరాలు. ఇందులో ప్రధానంగా 37.79 లక్షల ఎకరాల్లో వరి, 14.48 లక్షల ఎకరాల్లో పత్తి, 13.88 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 5.85 లక్షల ఎకరాల్లో కందులు, 3.10 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేస్తుంటారు. ఖరీఫ్ కోసం 17.50 లక్షల టన్నుల ఎరువులు అవసరమని అంచనా వేశారు. ఇందులో 6.50 లక్షల టన్నుల యూరియా, 2.30 లక్షల టన్నుల డీఏపీ, ఏడు లక్షల టన్నుల కాంప్లెక్స్, లక్ష టన్నుల ఎస్ఎస్పీ, 70 వేల టన్నుల ఎంఓపీ ఎరువులు అందుబాటులో ఉంచేలా కార్యాచరణ సిద్ధంచేశారు. మరోపక్క.. ఇఫ్కో ద్వారా 5 లక్షల నానో యూరియా, 2 లక్షల నానో డీఏపీ బాటిల్స్ సరఫరాకు ఏర్పాట్లుచేస్తున్నారు. రాష్ట్రానికి కేటాయించిన ఎరువుల్లో కనీసం 5.60 లక్షల టన్నులు ఆర్బీకేల ద్వారా సరఫరాకు ప్రణాళిక సిద్ధంచేసారు. -
రైతు భరోసా పెంచిన సీఎం జగన్
-
సీఎం జగన్ గురించి గుంటూరు రైతు.. గొప్ప మాటలు
-
fact check: కుంభకర్ణ నిద్ర మీదే రామోజీ
సాక్షి, అమరావతి: నిత్యం కుట్రపూరిత ఆలోచనలు, విషపూరిత రాతలు.. అక్షరాలకు అందని ఆక్రోశం.. ఇదీ ఈనాడు రామోజీరావు పరిస్థితి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పదేపదే అబద్ధాలను అచ్చేస్తూ వయోభారానికి తోడు తనకున్న అల్జీమర్స్ వ్యాధి ముదిరి పోయిందని సోమవారం మరోసారి రుజువు చేసుకున్నాడు. దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో ఖరీఫ్తో పాటు రబీలో పంటల సాగు తగ్గిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేందుకు వీలుగా ఒకే వ్యవసాయ సీజన్లో నాలుగు సార్లు సబ్సిడీపై విత్తనాలు ప్రభుత్వం అందించిన విషయాన్ని తన రాతల్లో మరుగున పరిచారు. 103 కరువు మండలాల పరిధిలో పంటలు నష్టపోయిన రైతులతో పాటు డిసెంబర్లో విరుచుకుపడిన మిచాంగ్ తుపాన్ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకూ పెట్టుబడి రాయితీని నాలుగు రోజుల క్రితమే విడుదల చేసిన విషయాన్ని మరచిపోయారు. మూడో విడత రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీలు కలిపి ఏకంగా 75.96 లక్షల మందికి రూ.2588.92 కోట్లు లబ్ధి చేకూర్చిన అంశం ఈ కబోదికి కన్పించలేదు. ఆరోపణ: ఖరీఫ్, రబీలో కలిపి 45 లక్షల ఎకరాల్లో బీడు వాస్తవం: ఖరీఫ్, రబీ పంట కాలాల్లో సాధారణ విస్తీర్ణం 140.24 లక్షల ఎకరాలకు గాను 104.94 లక్షల ఎకరాల్లో సాగైంది. బెట్ట పరిస్థితుల వలన 35.30 లక్షల ఎకరాలలో పంటలు వేయలేదు. కానీ ఉద్యాన పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. పండ్లు, ప్లాంటేషన్ తోటలు, కూరగాయలు, వాణిజ్య పూలు, ఇతర ఉద్యాన పంటల విస్తీర్ణం ఖరీఫ్, రబీల్లో 7,87,621 ఎకరాలకు చేరింది. సాధారణం కన్నా కేవలం 27.42 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు తగ్గింది. కానీ ఈనాడుకు మాత్రం ఏకంగా 45 లక్షల ఎకరాల్లో తగ్గినట్టుగా కని్పంచింది. ఆరోపణ: కరువు, తుపానులతో మరో 43 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాస్తవం: వర్షాభావ పరిస్థితుల వల్ల ఏడు జిల్లాల్లో 103 కరువు మండలాలను ప్రకటించారు. ఈ మండలాల్లో 14,24,245 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. ఇందులో ఉద్యాన, వ్యవసాయ పంటలున్నాయి. రబీ సీజన్ ఆరంభంలో విరుచుకుపడిన మిచాంగ్ తుపాన్ భారీ వర్షాల వలన 6,64,380 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. కరువు, మిచాంగ్ తుపాన్ వల్ల 20,88,625 ఎకరాలు పంటలు దెబ్బతింటే ఈనాడుకు మాత్రం 43 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా కని్పంచింది. ఆరోపణ: వెంటాడిన పొడి వాతావరణం వాస్తవం:దేశ వ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు ఖరీఫ్తో పాటు రబీలోనూ కొనసాగింది. కానీ పొడి వాతావరణం కని్పంచినంత మాత్రాన కరువు ఉన్నట్టు కాదన్న విషయం రామోజీకి తెలియంది కాదు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు ఏదైనా ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా గుర్తించాలంటే ఆరు ప్రామాణికాల ఆధారంగా తీసుకుంటారు. తొలుత ప్రాథమిక అంచనా, క్షేత్ర స్థాయి పరిశీలన, తర్వాత నిబంధనల మేరకు 33 శాతానికి పైగా మునిగిపోయి దెబ్బతిన్న పంటలను పరిగణనలోకి తీసుకొని నష్టం తుది అంచనాలను రూపొందిస్తారు. ఆ మేరకు పంటలవారీగా లెక్కించి పరిహారాన్ని (ఇన్పుట్æసబ్సిడీ) అందిస్తారు. ఆరోపణ: పడిపోయిన 3 కోట్ల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వాస్తవం: కరువు, మిచాంగ్ ప్రభావం ఉన్నప్పటికీ 2023–24లో ఆహార ధాన్యాల దిగుబడి 154.73 లక్షల టన్నులు నమోదవుతున్నట్టు డైరెక్టర్ ఆఫ్ స్టాటస్టిక్స్ (కేంద్ర గణాంక శాఖ) రెండో ముందస్తు అంచనా వేసింది. ఈ దిగుబడులు గడిచిన ఐదేళ్ల సగటు దిగుబడులతో పోలిస్తే తక్కువేమీ కాదు. వరితో సహా జొన్న, సజ్జ, రాగి, పెసలు, మినుము, ఉలవలు వేరుసెనగ, నువ్వులు, పత్తి పంటల ఎకరా దిగుబడి గత ఏడాదితో పోలిస్తే పెరిగింది. 2023–24 సీజన్లో 57.87 లక్షల ఎకరాలకు 48.93లక్షల ఎకరాల్లో వరి సాగైంది. వాస్తవాలు ఇలా ఉంటే ఏకంగా 3 కోట్ల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి తగ్గిందంటూ కాకిలెక్కలు అచ్చేశారు. ఆరోపణ: కరువు విజృంభిస్తున్నా ఉపశమన చర్యలేవీ వాస్తవం: ఒకే సీజన్లో నాలుగు సార్లు సబ్సిడీపై విత్తనాలు అందించారు. బెట్ట పరిస్థితులు నెలకొన్న సమయంలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలకు అనుగుణంగా ఆర్బీకేల ద్వారా 80 శాతం సబ్సిడీపై విత్తనాలను సరఫరా చేశారు. 2023లో జూలై– ఆగస్ట్ నెలల్లో కురిసిన అధిక వర్షాలకు వరి నారుమళ్ళు దెబ్బతిని నష్టపోయిన రైతులు మరలా విత్తుకునేందుకు 1479 క్వింటాళ్ళ స్వల్పకాలిక వరి రకాలు అందించారు. బెట్ట పరిస్థితుల వల్ల ఖరీఫ్ 2023లో పంటలు దెబ్బతిన్న రైతులకు 30వేల క్వింటాళ్ల ఉలవలు, అలసంద, మినుము, పెసర, కంది, రాగి, జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు విత్తనాలను రూ.26.02 కోట్ల సబ్సిడీతో 1.14 లక్షల మందికి ఇచ్చారు. 2023 డిసెంబర్లో మిచాంగ్ తుపాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు 49,758 క్వింటాళ్ల శనగ, వేరుశనగ, మినుములు, పెసర, నువ్వులు, రాగి, తక్కువ పంట కాల వరి రకాలను రూ. 31.06 కోట్ల సబ్సిడీతో 71415 మందికి పంపిణీ చేశారు. మిచాంగ్ తుపాన్ వేళ రంగుమారిన, తడిసిన 6.79లక్షల టన్నుల ధాన్యాన్ని 1.11లక్షల మంది రైతుల నుంచి కొనుగోలు చేసి వారికి జీఎల్టీతో సహా రూ.1483.61 కోట్లు జమ చేశారు. ఆరోపణ: కరువు, తుపాన్ వేళ సాయమేది? వాస్తవం: కరువు, మిచాంగ్, అకాల వర్షాల వల్ల అందించిన సాయానికి అదనంగా 2023–24 సీజన్లో వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.7226.08 కోట్ల పెట్టుబడి సాయంతో పాటు వైఎస్సార్ ఉచిత పంటల బీమా పధకం ద్వారా రూ.1117.21కోట్లు, వై.ఎస్.ఆర్. సున్నావడ్డీ పంట రుణాల పథకం ద్వారా రూ.215.98 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేసింది అంతేకాకుండా ఈ సీజన్లో ఇప్పటి వరకు రూ.326.14 కోట్ల ఖర్చుతో ఆర్బీకేల ద్వారా రైతులకు అందించారు. ఇవేమీ ఈనాడుకు కని్పంచకపోవడం విడ్డూరంగా ఉంది. ఆరోపణ: సాయంపై సర్కార్ మీనమేషాలు వాస్తవం: ఖరీఫ్ 2023 పంటకాలంలో మే–ఆగస్ట్ మధ్య కురిసిన వర్షాలు, వరదల వల్ల 12,198.62 ఎకరాల్లో దెబ్బతిన్న అరటి, కూరగాయలు, బొప్పాయి, తమలపాకు, మామిడి తదితర ఉద్యాన పంటల రైతులు 11,373 మందికి పెట్టుబడి రాయితీగా రూ.11 కోట్లు అందించారు. 2023 మార్చి–మే మధ్య కురిసిన అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న మొక్కొజొన్న, జొన్న పంటలకు సంబంధించి 1892 మంది రైతులకు క్వింటాలుకు రూ. 500 చొప్పున రూ.5 కోట్ల ప్రత్యేక పెట్టుబడి రాయితీ ఇచ్చారు. 2023లో కరువు వల్ల నష్టపోయిన 6.96 లక్షల మంది రైతులకు రూ.847.23 కోట్లు, మిచాంగ్ తుపాన్ వల్ల నష్టపోయిన 4.61 లక్షల మంది రైతులకు రూ.442.36 కోట్లు పెట్టుబడి రాయితీని రైతుల ఖాతాలకు ఇటీవలే విడుదల చేశారు. దీనికోసం జీవో ఎంఎస్ నెం.5 జారీ చేశారు. ఈ జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శించారు. తమ పేరు లేదని కానీ, ఇన్పుట్ సబ్సిడీ రాలేదని ఒక్కరంటే ఒక్క రైతూ ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవు. అదే ఈనాడుకు కంటగింపుగా ఉంది. గతంలో ఎన్నడూ లేనంత దుర్భిక్షం చంద్రబాబు పాలనలో ఏటా సగటున 324 మండలాల్లో కరువు తాండవించేది. కరువు మండలాలను సీజన్కు అనుగుణంగా ప్రకటించిన దాఖలాలు లేవు. 2014 ఖరీఫ్ కరువు మండలాలను 2015 నవంబర్లో, 2015వి 2016 నవంబర్లో, 2016వి 2017 జూన్లోనూ, 2017వి 2018 ఆగష్టులోనూ ప్రకటించారు. 2018 ఖరీఫ్, 2018–19 రబీ సీజన్లలో ఏర్పడిన కరువు మండలాలను అసలు ప్రకటించనే లేదు. తన ఐదేళ్ల పాలనలో 24,79,985 మంది రైతులకు చెల్లించాల్సిన రూ.2558 కోట్లు ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబుదే. -
మాటకు మించి సాయం
సాక్షి, అమరావతి: అన్నదాతల కష్టం తెలిసిన ప్రభుత్వంగా ఈ ఐదేళ్లలో ప్రతి అడుగూ రైతులు, రైతు కూలీలు బాగుండాలని మనసా వాచా కర్మణా వేస్తూ వచ్చామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ప్రగాఢంగా విశ్వసిస్తూ విత్తనం నుంచి పంట విక్రయం వరకూ అన్ని విధాలుగా చేయి పట్టుకుని నడిపించామ న్నారు. ప్రతీ పథకాన్ని పేద రైతు కుటుంబాలకు అందుబాటులోకి తెచ్చి సంక్షేమ ఫలాలన్నీ అందించామని, రాష్ట్రంలో ఐదేళ్లుగా మాత్రమే ఇలా జరుగుతోందని గుర్తు చేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా చెప్పిన సమయానికి చెప్పినట్లుగా రైతన్నలకు భరోసా కల్పిస్తూ వ్యవసాయాన్ని పండగ చేసిన ప్రభుత్వం ఇదేనని, భవిష్యత్లోనూ ఇదే రీతిలో అండగా నిలిచి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వైఎస్సార్ రైతు భరోసా ద్వారా వరుసగా ఐదో ఏడాది మూడో విడత కింద ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున 53.58 లక్షల మందికి రూ.1,078.36 కోట్ల పెట్టుబడి సాయంతో పాటు 10.79 లక్షల మందికి వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద రూ.215.98 కోట్లు కలిపి మొత్తం 64.37 లక్షల మంది ఖాతాలకు రూ.1,294.34 కోట్లను బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా జమ చేశారు. సీఎం జగన్ ఏమన్నారంటే.. హామీ కంటే మిన్నగా.. వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో ప్రతి రైతు కుటుంబానికి రూ.50 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తా మని మేనిఫెస్టోలో హామీ ఇచ్చాం. ఇచ్చిన హామీ కంటే మిన్నగా రూ.12,500 బదులు ఏటా రూ. 13,500 చొప్పున అందచేశాం. రూ.50 వేలకు బ దులు ఐదేళ్లలో ప్రతి రైతు కుటుంబానికి రూ. 67,500 చొప్పున లబ్ధి చేకూర్చాం. హామీకి మించి ప్రతి రైతు కుటుంబానికి రూ.17,500 చొప్పున అదనంగా అందచేశాం. తద్వారా ఏటా మూడు విడ తల్లో రూ.13,500 చొప్పున ఈ ఐదేళ్లలో మొత్తం రూ.67,500 రైతన్నల చేతుల్లో పెట్టినట్లైంది. ఇవాళ జమ చేస్తున్న పెట్టుబడి సాయంతో కలిపి ఐదేళ్లలో 53.58 లక్షల రైతు కుటుంబాలకు మొత్తం రూ.34,288 కోట్లు పంటలు వేసే సమయంలో పెట్టుబడి సాయంగా అందించాం. క్రమం తప్పకుండా సున్నా వడ్డీ రాయితీ ప్రతి రైతన్నకు పెట్టుబడి సాయంగా డబ్బులు ఇవ్వడమే కాకుండా సున్నా వడ్డీని కూడా వర్తింపజేస్తూ రూ.లక్ష వరకు పంట రుణాలను అందిస్తున్న కార్యక్రమం కూడా మన ప్రభుత్వ హయాంలోనే జరుగుతోంది. పంట రుణాలు క్రమం తప్పకుండా చెల్లిస్తే బ్యాంకులకు రైతులపై నమ్మకం పెరుగుతుంది. ఎక్కువ మంది రైతులకు రుణాలు ఇచ్చే పరిస్థితి నెలకొంటుంది. దీన్ని ప్రోత్సహిస్తూ రైతన్నలు వడ్డీ సొమ్మును బ్యాంకులకు కట్టిన వెంటనే మళ్లీ ఆ వడ్డీ రాయితీ డబ్బులను క్రమం తప్పకుండా అన్నదాతలకు తిరిగి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నదీ ఈ ప్రభుత్వ హయాంలోనే. బ్యాంకులకు కట్టిన వడ్డీని తిరిగి వెనక్కి ఇవ్వడం వల్ల రైతులకు వడ్డీ లేకుండా రుణాలు అందుతాయి. ఆ డబ్బులు వారికి వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చుల కింద ఉపయోగపడతాయి. దీన్ని ప్రోత్సహిస్తూ ప్రతి రైతుకు సహాయం చేస్తూ వస్తున్నాం. గత ప్రభుత్వం 39.07 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టిన బకాయిలతో కలిపి 84.67 లక్షల మంది అన్నదాతలకు సున్నా వడ్డీ రాయితీ కింద దాదాపు రూ.2,051 కోట్లు అందించాం. నాణ్యమైన వ్యవసాయ విద్యుత్తు.. 19 లక్షల మంది రైతులకు 9 గంటల పాటు పగటి పూటే నాణ్యమైన ఉచిత విద్యుత్తు ఇచ్చే కార్యక్రమం ఈ 57 నెలల్లోనే జరుగుతోంది. మనం అధికారంలోకి రాకముందు ఇలా పగటిపూటే రైతన్నలకు ఉచిత కరెంట్ ఇచ్చిన పరిస్థితి లేదు. ఎందుకంటే నాడు ఫీడర్లకు ఆ సామర్థ్యమే లేదు. మన ప్రభు త్వం వచ్చిన తర్వాత రూ.1,700 కోట్లు ఖర్చు చేసి వ్యవసాయ విద్యుత్తు ఫీడర్ల సామర్థ్యాన్ని పెంచాం. పగటి పూట 9 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ అందిస్తూ ప్రతి రైతన్నకు రూ.45 వే ల వర‡కు మేలు చేశాం. ఉచిత విద్యుత్ కోసం ఏడాదికి రూ.9 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఉచిత పంటల బీమా.. దేశంలో మరెక్కడా లేని విధంగా గ్రామ స్థాయిలో ఆర్బీకేల వ్యవస్థను తీసుకొచ్చాం. రైతులు పండించే ప్రతి ఎకరాను ఈ– క్రాప్ చేస్తూ నోటిఫై చేసిన ప్రతి పంట, సాగైన ప్రతి ఎకరా ఇన్సూరెన్స్ కవరేజీలోకి తెచ్చాం. రైతన్నల తరపున ప్రీమియం డబ్బులను పూర్తిగా రాష్ట్రమే కడుతున్న ప్రభుత్వం మనదే. ఈ 57 నెలల కాలంలోనే ఇది కూడా జరుగుతోంది. మునుపెన్నడూ ఇలా జరగలేదు. ఇంతకుముందు రైతన్నకు బీమా ప్రీమియం ఉందన్న సంగతి కూడా తెలిసేది కాదు. కొందరు రైతులకు మాత్రమే క్రాప్ లోన్ ఇచ్చిన సమయంలో బ్యాంకులు బీమా ప్రీమియం సొమ్ముని కట్ చేసుకుని వర్తింప చేసిన పరిస్థితి ఉండేది. రైతులు బ్యాంకులకు వెళ్లకుంటే రుణాలు రాని పరిస్థితి. తద్వారా వారికి ఇన్సూరెన్స్ గురించి తెలియక చెల్లించలేకపోయేవారు. అలా వారు నష్టపోతున్న పరిస్థితులకు పూర్తిగా చెక్ పెడుతూ ప్రతి రైతన్న పంట వేసిన వెంటనే ఆటోమేటిక్గా గ్రామ సచివాలయంలో ఈ– క్రాప్ ద్వారా పూర్తిగా ఇన్సూరెన్స్ కవరేజ్ కలి్పస్తూ వారి తరపున ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తున్న పరిస్థితి తొలిసారిగా మన ప్రభుత్వ హయాంలోనే మొదలైంది. ఆక్వాకు తోడుగా.. పాడికి అండగా గతంలో ఆక్వా రైతులకు యూనిట్ రూ.1.50కే కరెంట్ ఇచ్చి వారిని అదుకున్న పరిస్థితి లేదు. ఆక్వా రైతులకు రూపాయిన్నరకే కరెంట్ అందించి వారిని కూడా చేయిపట్టుకుని నడిపిస్తూ ఆదుకుంటున్న పరిస్థితులు ఈ ప్రభుత్వం వచ్చాకే ఏర్పడ్డాయి. ఆక్వా, పాడి రైతుల కోసం కొత్త చట్టాలు తీసుకొచ్చాం. చివరికి పాలసేకరణలో కూడా గతంలో లేనివిధంగా లీటరుకు రూ.10 నుంచి రూ.22 వరకు ఈ 57 నెలల కాలంలోనే సేకరణ ధరలు పెరిగాయి. దీనికి కారణం మనం చేపట్టిన పాలవెల్లువ అనే కార్యక్రమమే. సహకార రంగంలో దేశంలోనే అతి పెద్దదైన అమూల్ లాంటి సంస్ధను రాష్ట్రానికి తీసుకొచ్చాం. తద్వారా స్థానికంగా పోటీని సృష్టించాం. అమూల్ రేట్లు పెంచింది కాబట్టి మిగిలిన వారు కూడా పెంచక తప్పని పరిస్థితిని తీసుకొచ్చాం. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం.. దాదాపు 100 ఏళ్ల క్రితం బ్రిటీషర్ల కాలంలో మన భూముల సర్వే జరిగింది. రికార్డులు అప్డేట్ కాకపోవడం, సబ్ డివిజన్లు, సర్వేలు జరగకపోవడం వల్ల ప్రతి గ్రామంలోనూ భూ వివాదాలు తలెత్తాయి. వీటన్నింటికీ చెక్ పెడుతూ భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ సమగ్ర భూసర్వే చేపట్టాం. రికార్డులన్నీ అప్డేట్ చేసి ఏకంగా రిజి్రస్టేషన్ ప్రక్రియను గ్రామస్ధాయిలో సచివాలయాల పరిధిలోకి తెచ్చిన గొప్ప మార్పు కూడా ఈ 57 నెలల్లోనే సాకారమైంది. దాదాపు 34.72 లక్షల ఎకరాలపై రైతులు, పేదలకు అసైన్డ్ భూములపై పూర్తి హక్కులు కల్పిస్తూ ఏకంగా చట్టాల్లో మార్పులు తెచ్చాం. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే గతానికి, ఈ 57 నెలల కాలానికి మధ్య తేడాను గమనించండి. ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి ఆర్బీకే మనతో కనెక్ట్ అయి ఉంది. గ్రామాల్లో ఉన్న ప్రతి రైతన్న ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు కాబట్టి వారందరికీ ఈ విషయాలన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. పెట్టుబడికి భరోసా.. చిన్న రైతుకు 80% ఖర్చులు కవర్ రాష్ట్రంలో అర హెక్టార్ (1.25 ఎకరాలు) లోపు భూమి కలిగిన రైతులు 50% మంది ఉండగా హెక్టార్ (2.50 ఎకరాలు) లోపు విస్తీర్ణం కలిగిన వారు 70% ఉన్నారు. సాగు పెట్టుబడి కోసం తీసుకునే రుణాలపై వడ్డీలు కట్టుకోలేని పరిస్థితి వారిది. ప్రైవేట్ వ్యాపారుల వద్ద అప్పు తీసుకుంటే నడ్డీ విరిగే వడ్డీలు చెల్లించాల్సి వచ్చేది. మన ప్రభుత్వం రైతన్నలకు ఆ అవస్థలను తొలగించి రైతు భరోసాతో ఆదుకుంటోంది. వైఎస్సార్ రైతు భరోసా ద్వారా అందించే సాయంతో అర హెక్టారు లోపు విస్తీర్ణం ఉన్న రైతులకు 80% పెట్టుబడి ఖర్చులు కవర్ అవుతుండగా హెక్టారు లోపు పొలం ఉన్నవారికి 70% ఖర్చులు పథకంతో కవర్ అవుతున్నాయి. నష్టపోతే అదే సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ ఈ ఐదేళ్లలో వచ్చిన మరో గొప్ప మార్పు ఏమిటంటే ఎక్కడైనా రైతన్నలకు వరదలు లాంటి ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం దాన్ని తన కష్టంగానే భావించింది. ఏ సీజన్లో జరిగిన పంట నష్ట పరిహారాన్ని అదే సీజన్ ముగిసేలోగా అందించే కార్యక్రమం కూడా మొట్ట మొదటిసారిగా ఈ 57 నెలలుగా జరుగుతోంది. ఇదో విప్లవాత్మకమైన మార్పు. నష్టపోయిన రైతులు మళ్లీ సీజన్లో పంటలు వేసుకునే పరిస్థితుల్లోకి రావాలి. అలా జరగాలంటే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు ఆయా సీజన్ ముగిసేలోగా చేతికిస్తేనే పెట్టుబడి కోసం వారికి ఉపయోగపడుతుంది. ఇలా క్రమం తప్పకుండా పెట్టుబడి సాయాన్ని అందిస్తూ వారికి బాసటగా నిలిచిన ప్రభుత్వం మనది. ఇలాంటి ఆలోచనలు మనం ప్రభుత్వంలోనే జరిగాయి. పంటలకు ‘మద్దతు’.. గ్రామ సచివాలయాలకు అనుబంధంగా 10,778 ఆర్బీకేలను నెలకొల్పి పంటలను కొనుగోలు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయని పంటలకు సైతం మనం కనీస మద్దతు ధర ప్రకటించాం. మార్కెట్లో మద్దతు ధర తగ్గినప్పుడు వెంటనే అప్రమత్తమై ఆర్బీకేల ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతున్నది కూడా మన ప్రభుత్వంలోనే. మాఫీ పేరుతో బాబు మోసాలు.. 2014 ఎన్నికల్లో రూ.87,612 కోట్ల రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానన్న చంద్రబాబు గద్దెనెక్కిన తర్వాత ఎలా మోసగించారో గుర్తు తెచ్చుకోవాలని కోరుతున్నా. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలని పబ్లిసిటీ చేసి ఆ తరువాత వంచనకు పాల్పడ్డారు. చివరికి ఆ రూ.87,612 కోట్లపై సున్నావడ్డీని కూడా ఎగ్గొట్టాడు. ఐదేళ్లలో దాదాపు రూ.30 వేల కోట్లు ఆ వడ్డీలకే అవుతుంది. ఆయన ఎగ్గొట్టిన సున్నా వడ్డీ బకాయిలను కూడా మనమే ఇచ్చాం. ఐదేళ్లలో ఒక్క వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం ద్వారానే రైతుల చేతుల్లో రూ.34,288 వేల కోట్లు పెట్టాం. ధాన్యం కొనుగోలు కోసం మరో రూ.65 కోట్లు వెచ్చించాం. ఇలా పథకాల ద్వారా రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ వ్యవసాయం కోసం ఐదేళ్లలో రూ.1.85 లక్షల కోట్లు ఖర్చు చేసిన పరిస్థితి కళ్లెదుటే కనిపిస్తోంది. ఎమ్మెస్పీ కంటే 30 శాతం అధికంగా పాలకుడు మంచివాడైతే ప్రకృతి కరుణిస్తుంది. ముఖ్యమంత్రి జగన్ మనసు, పాలన బాగున్నాయి కాబట్టి రాష్ట్రం సుభిక్షంగా ఉంది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మి ఆచరిస్తున్న సీఎం జగన్ దేశం గర్వించేలా పలు సంస్కరణలు తెచ్చారు. నెల్లూరు, ఒంగోలు జిల్లాల్లో లేట్ ఖరీఫ్, ఎర్లీ రబీ, కోతలు ప్రారంభమయ్యాయి. గతంలో పుట్టి (850 కేజీలు) రూ.18,000 ఉంటే చంద్రబాబు హయాంలో రూ. 12 వేల నుంచి రూ.13 వేలకు పడిపోయింది. కానీ ఇవాళ పుట్టి రూ.23,500 నుంచి రూ.24 వేలు పలుకుతోంది. ఇది ఎమ్మెస్పీ కంటే 30 శాతం అధికం. – కాకాణి గోవర్ధన్రెడ్డి, వ్యవసాయ శాఖమంత్రి పంట మాది.. బీమా మీది నాకు 3.38 ఎకరాలున్నా గతంలో బీడుగా ఉండేది. గత నాలుగేళ్లుగా పంటలు పండిస్తున్నాం. ఐదేళ్లలో రైతు భరోసా కింద రూ.67,500 ఇచ్చారు. మేం పంట వేస్తే మీరు బీమా చెల్లిస్తున్నారు. సున్నా వడ్డీ రాయితీ కూడా ఇస్తున్నారు. సన్న, చిన్నకారు రైతులకు వ్యవ సాయ పనిముట్లు అందజేసి ఆదుకున్నారు. వ్యవసాయ సలహా మండళ్లు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. గతంలో విత్తనాల కోసం మండల కేంద్రాల్లో పడి గాపులు కాశాం. ఇప్పుడు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు ఆర్బీకేల ద్వారా మా ఇంటికే పంపిస్తున్నారు. గతంలో పాలు కర్ణాటకలో విక్రయించగా ఇప్పుడు మా గ్రామంలోనే అమూల్ కేంద్రంలో మంచి గిట్టుబాటు ధరకు అమ్ముకోగలుగుతున్నాం. మీద్వారా మా కుటుంబం రూ.3,42,152 మేర లబ్ధి పొందింది. మీరు మళ్లీ సీఎం కావాలి. –ఎన్. బాబు, రైతు, అనంతపురం జిల్లా రైతుల కోరిక.. మళ్లీ మీరే నాలుగెకరాల్లో పత్తి, మూడెకరాల్లో వరి, మొక్కజొన్న పండిస్తున్నా. గతంలో ధర్నాలు చేస్తే కానీ విత్తనాలు దొరికేవి కాదు. నేడు ఆర్బీకేల ద్వారా అన్నీ గ్రామంలోనే అందిస్తున్నారు. ఈ–క్రాప్ ద్వారా పంట రుణాలు, వడ్డీ రాయితీ అందిస్తున్నారు. గతంలో కరువుతో ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు అలాంటి పరిస్ధితి లేదు. పైసా భారం పడకుండా ఉచితంగా ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. దేశంలో ఎక్కడా ఈ–క్రాప్ విధానాన్ని చూడలేదు. మన దగ్గర చక్కగా అమలవుతోంది. నేను మూడెకరాల్లో 78 బస్తాల ధాన్యాన్ని పండిస్తే రూ.1,56,000 నేరుగా నా ఖాతాలో జమ చేశారు. పిల్లలకు విద్యాదీవెన అందింది. నా భార్యకు అనారోగ్యం వస్తే వైజాగ్ అపోలో ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం రూ.1,48,000 చెల్లించింది. పైగా కోలుకోవడానికి ఆసరాతో రూ.4,750 జమ చేశారు. మీరు మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నాము. –వై.శ్రీనివాసరావు, రైతు, గజపతినగరం, విజయనగరం జిల్లా వ్యవసాయం సుసంపన్నం పుస్తకావిష్కరణ ఐదేళ్లలో రాష్ట్ర వ్యవసాయ రంగం పురోగతిపై ‘వ్యవసాయం సుసంపన్నం–రాష్ట్రానికి సౌభాగ్యం’ పేరిట వ్యవసాయ శాఖ రూపొందించిన పుస్తకాన్ని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ, ఉద్యాన శాఖల సలహాదారులు ఐ.తిరుపాల్రెడ్డి, పి.శివప్రసాద్రెడ్డి, సీఎస్ కె.ఎస్.జవహర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ రైతు భరోసా నిధులను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు
-
చెప్పిన దానికన్నా ఎక్కువ సాయం జగన్ చరిత్రలో నిలిచిపోతాడు: కాకాణి గోవర్ధన్ రెడ్డి
-
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: వరుసగా ఐదో ఏడాది.. వైఎస్సార్ రైతు భరోసా పెట్టుబడి సాయం సొమ్మును రైతుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జమ చేశారు. రబీ 2021–22, ఖరీఫ్–2022 సీజన్లకు గాను అర్హులైన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును కూడా చెల్లించారు. ఈ రెండు పథకాలకు అర్హత పొందిన రైతు కుటుంబాల ఖాతాలకు సాయాన్ని సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వరుసగా ఐదో ఏడాది రైతు భరోసా అందిస్తున్నాం. మొత్తం 53.58 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో రూ.1,078.36 కోట్లు జమ. కౌలు రైతులు, అటవీ, దేవాదాయ భూముల సాగు రైతులకు సాయం. 57 నెల్లలో రైతు భరోసా కింద అందించిన మొత్తం రూ.34,288 కోట్లు. మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా ఒక్కో రైతన్నకు అదనంగా రూ.17,500 ఇస్తున్నాం. రైతు ప్రభుత్వం మనది.. మన ప్రభుత్వం వేసిన ప్రతీ అడుగూ కూడా రైతులు, రైతు కూలీలు బాగుండాలని వేశాం. క్రమం తప్పకుండా వైయస్సార్ రైతు భరోసా కింద సహాయాన్ని అందించాం. పెట్టుబడి సహాయంగా, రైతన్నకు దన్నుగా ఇది అందించాం. రాష్ట్రంలో దాదాపు 50శాతం లోపు రైతులన్నకున్న భూమి అర హెక్టారు లోపలే. హెక్టారు లోపల ఉన్న రైతులు 70 శాతం ఉన్నారు. ఈ పెట్టుబడి సహాయం వారికి ఎంతో మేలు చేసింది. వంద శాతం రైతులకు 80శాతం ఖర్చు రైతు భరోసా కింద కవర్ అయ్యింది. పేద రైతుల పక్షపాత ప్రభుత్వం మనది, దీనికి నేను గర్వపడుతున్నాను. సున్నా వడ్డీ కింద కూడా రూ.215.98 కోట్లు విడుదల చేస్తున్నాం. రుణాలు తీసుకుని క్రమం తప్పకుండా కట్టే రైతులకు మేలు చేస్తున్నాం.ఇప్పటివరకూ 84.66 లక్షల మంది రైతన్నలకు ఇప్పటి వరకూ అందించిన వడ్డీ రాయితీ 2,050 కోట్లు. మొత్తంగా రైతు భరోసా, సున్నా వడ్డీ కింద రైతులకు ఇవాళ విడుదలచేస్తున్న మొత్తం రూ.1,294.38 కోట్లు అందించాం. ప్రతీ అడుగులోనూ రైతన్నలకు తోడుగా నిలుస్తున్నాం. ప్రతీ పథకం దాదాపుగా పేద రైతు కుటుంబానికి అందుబాటులో ఉంచడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఏడాదికి రూ.12500 బదులు వేయి పెంచి రూ.13500 ఇచ్చాం. 50వేల స్థానంలో ఐదేళ్లలో రూ.67,500 ఇచ్చాం. చెప్పినదానికంటే ఎక్కువగా ఇచ్చిన ప్రభుత్వం మనది. రైతు కష్టం తెలిసిన ప్రభుత్వంగా ఈ ఐదేళ్లలో ముందుకు సాగాము. ప్రతీ సందర్భంలోనూ వారికి తోడుగా నిలిచాం. రైతులకు నాణ్యమైన ఉచిత కరెంట్.. 19 లక్షల మంది రైతులకు 9 గంటలపాటు నాణ్యమైన కరెంటు ఇస్తున్నాం. ఉచిత విద్యుత్ కింద ప్రతి రైతుకు రూ.45వేల మేర మేలు జరుగుతుంది. ఏడాదికి దాదాపుగా రూ.9 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. రైతుల తరఫున ఉచిత పంటల బీమాకు ప్రీమియం కడుతున్న ఏకైక రాష్ట్రం మన రాష్ట్రం మనది. గతంలో ఎప్పుడూ కూడా రైతుల తరఫున ఎప్పుడూ బీమా ప్రీమియం చెల్లించలేదు. దేశంలో కూడా ఎక్కడా లేదు. రైతులకు ఎక్కడ కష్టం వచ్చినా ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. కేవలం ఈ ఐదేళ్లలో మాత్రమే ఇలా జరిగింది. ఇదొక విప్లవాత్మక మార్పు. నష్టం నుంచి రైతు తట్టుకుని నిలబడి తిరిగి పంటలు వేసుకునే పరిస్థితి రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం విప్లవాత్మక చర్యగా దీన్ని అమలు చేసింది. ఆక్వా రైతులకు సాయం.. గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రాలను పెట్టాం. అగ్రికల్చర్ అసిస్టెంట్ను రైతుకోసం పెట్టాం. రైతులకు ఇ-క్రాప్ చేస్తూ అన్నిరకాలుగా ఆదుకుంటున్నాం. విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ కూడా రైతులను చేయిపట్టుకుని నడిపించాం. ఈ ఐదేళ్లకాలంలో మాత్రమే ఇలా జరిగింది. ఆక్వా రైతులకు రూ.1.5కే కరెంటు ఇస్తూ ఆదుకున్నాం. ఆక్వాజోన్లలో ఉన్న ఆక్వారైతులకు తోడుగా నిలిచాం. పాల సేకరణలో కూడా రైతులకు తోడుగా నిలిచాం. రూ.10-20ల వరకూ రైతులకు అధిక ధరలు వచ్చాయి. పాలసేకరణలో ఈ ఐదేళ్ల కాలంలోనే రైతులకు రేట్లు పెరిగాయి. సహకార రంగంలోనే దేశంలోనే అతిపెద్ద సంస్థ అయిన అమూల్ను తీసుకు వచ్చి ఈ రంగంలో పోటీని పెంచాం. తద్వారా రైతులకు మేలు జరిగింది. భూ సర్వే.. 100 సంవత్సరాల క్రితం భూ సర్వే జరిగింది. అప్పటినుంచి రికార్డులు అప్డేట్ కాకపోవడం, సబ్ డివిజన్లు జరక్కపోవడం జరిగింది. వివాదాలకు చెక్పడుతూ సమగ్ర సర్వే చేపట్టాం. రికార్డులను అప్డేట్ చేస్తూ రిజిస్ట్రేషన్ సేవలను గ్రామస్థాయిలో తీసుకు వచ్చాం. 34.77 లక్షల ఎకరాల మీద పూర్తి హక్కులను రైతులకు, పేదలకు కల్పించాం. గతానికి, ఈ ఐదేళ్ల కాలానికి తేడా గమనించాలని కోరుతున్నాను. 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాలు మాఫీచేస్తామని చంద్రబాబు చెప్పారు. బ్యాంకుల్లో బంగారం రావాలంటే బాబే ముఖ్యమంత్రి కావాలన్నారు. దీంతో రైతులు నమ్మి అధికారం ఇస్తే.. దారుణంగా మోసం చేశారు. బేషరుతుగా రుణాలు మాఫీచేస్తానని చెప్పి చివరకు రుణమాఫీ పత్రాలు ఇచ్చి మోసం చేశారు. చివరకు సున్నా వడ్డీ పథకాన్ని కూడా ఎగొట్టారు. చివరకు మన ప్రభుత్వమే చెల్లించింది. బాబు హయాంలో రైతన్నలు కట్టిన వడ్డీలు, చక్రవడ్డీలే ఏడాదికి దాదాపు రూ.5-6 వేల కోట్లు. అంత దారుణంగా చంద్రబాబు గతంలో మోసం చేశారు. మనం ఈ ఐదేళ్లలో వైయస్సార్ రైతు భరోసా కింద రూ.34వేల కోట్లు ఇచ్చాం. ధాన్యం కొనుగోలుకోసం రూ.65 కోట్లు ఖర్చు చేశాం. ఇదికాక రూ.1.2 లక్షల కోట్లు రైతున్నలకు వివిధ పథకాలు ద్వారా అందించాం అని అన్నారు. -
నేడు మూడో విడత రైతు భరోసా జమ
సాక్షి, అమరావతి: వరుసగా ఐదో ఏడాది.. వైఎస్సార్ రైతు భరోసా కింద మూడో విడత పెట్టుబడి సాయం సొమ్మును రైతుల ఖాతాల్లో బుధవారం జమ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంతోపాటు రబీ 2021–22, ఖరీఫ్–2022 సీజన్లకు గాను అర్హులైన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును సైతం చెల్లించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ రెండు పథకాలకు అర్హత పొందిన 64.37 లక్షల రైతు కుటుంబాల ఖాతాలకు రూ.1,294.34 కోట్ల సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేయనున్నారు. ఐదేళ్లలో రైతు భరోసా కింద రూ.34,228 కోట్ల లబ్ధి ఎన్ని కష్టాలు ఎదురైనా.. ఇచ్చిన మాట కంటే మిన్నగా చెప్పిన సమయానికి వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. నాలుగేళ్ల పాటు ప్రతి రైతు కుటుంబానికి రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందించిన ప్రభుత్వం వరుసగా ఐదో ఏడాది ఇప్పటికే రెండు విడతల్లో రూ.11,500 చొప్పున జమ చేసింది. మూడో విడతగా ఒక్కొక్కరికి మరో రూ.2 వేల చొప్పున 53.58 లక్షల మంది రైతన్నల ఖాతాలకు రూ.1,078.36 కోట్లను బుధవారం జమ చేయనుంది. దేశంలో మరెక్కడా లేనివిధంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతన్నలతో పాటు సెంటు భూమి కూడా లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కౌలు రైతులు, ఆర్వోఎఫ్ఆర్ (అటవీ), దేవదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతన్నలకు కూడా ‘వైఎస్సార్ రైతు భరోసా‘ కింద ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వంగా నిలిచింది. ఏటా రూ.12,500 చొప్పున ఐదేళ్లలో రూ.50 వేలు అందిస్తామన్న ఎన్నికల హామీకి మిన్నగా ఏటా రూ.13,500 చొప్పున రూ.67,500 జమ చేసింది. బుధవారం అందిస్తున్న సాయంతో కలిపి రూ.34,288 కోట్లు జమ చేసినట్టవుతుంది. క్రమం తప్పకుండా సున్నా వడ్డీ రాయితీ రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకుని సమయానికి తిరిగి చెల్లించిన రైతన్నలకు వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద పూర్తి వడ్డీ రాయితీని రాష్ట ప్రభుత్వం చెల్లిస్తోంది. రబీ 2021–22, ఖరీఫ్–2022లో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 10,78,615 మంది రైతన్నలకు రూ.215.98 కోట్ల వడ్డీ రాయితీ సొమ్మును బుధవారం జమ చేయనున్నారు. 2014–15 నుంచి 2018–19 వరకు పెండింగ్ పెట్టిన బకాయిలతో సహా బుధవారం అందిస్తున్న రూ.215.98 కోట్లతో కలిపి.. 57 నెలల్లో వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల కింద 84.66 లక్షల మంది రైతులకు అందించిన వడ్డీ రాయితీ మొత్తం రూ.2,050.53 కోట్లు అవుతోంది. తాజాగా జమ చేస్తున్న సాయంతో కలిపి 57 నెలల్లో రైతులకు వివిధ పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.1,84,567 కోట్ల సాయం అందించింది. -
28న వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ జమ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కింద 2023–24 సీజన్ మూడో విడత పెట్టుబడి సాయంతో పాటు రబీ–2021–22, ఖరీఫ్–2022 సీజన్లో అర్హత పొందిన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్ముల పంపిణీకి రంగం సిద్ధమైంది. రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ కింద 64.37 లక్షల రైతు కుటుంబాలకు రూ.1,294.34 కోట్ల సాయం అందించనున్నారు. మూడో విడత రైతు భరోసా కింద 53.58 లక్షల మందికి రూ.1,078.36 కోట్లు సాయమందిస్తారు. రబీ 2021–22, ఖరీఫ్–2022కు సంబంధించి 10.79 లక్షల మందికి రూ.215.98 కోట్ల సున్నా వడ్డీ రాయితీ సొమ్ము అందిస్తారు. ఈ నెల 28న తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి ఈ సొమ్ము జమ చేయనున్నారు. ఒక్కో రైతు కుటుంబానికి రూ.67,500 ఎన్నికలకు ముందు ఏటా రూ.12,500 చొప్పున ఐదేళ్లలో రూ.50 వేల సాయం ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చినప్పటికీ, అధికారంలోకి వచ్చిన వెంటనే అంతకంటే మిన్నగా ఏటా 3 విడతల్లో రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన హామీకంటే రూ.17,500 ఎక్కువగా ప్రతి రైతుకూ సాయం అందించి సీఎం జగన్ రైతన్నల పట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారు. భూ విస్తీర్ణంతో ముడిపెట్టకుండా చివరికి 5 సెంట్ల భూమి ఉన్న రైతుకు సైతం రూ.13,500 చొప్పున ఏటా పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఇలా 2019–20లో 46,69,375 మందికి రూ.6,173 కోట్లు, 2020–21లో 51,59,045 మందికి రూ.6,928 కోట్లు, 2021–22లో 52,38,517 మందికి రూ.7,016.59 కోట్లు, 2022– 23లో 51,40,943 మందికి రూ.6,944.50 కోట్లు చొప్పున పెట్టుబడి సాయం అందించారు. 2023–24లో గరిష్టంగా 53.58 లక్షల కుటుంబాలకు లబ్ధి 2023–24లో తొలి విడతలో 52,57,263 రైతు కుటుంబాలకు రూ.3,942.95 కోట్లు, రెండో విడతలో 53,52,905 కుటుంబాలకు రూ.2,204.77 కోట్లు సాయం అందించారు. కాగా మూడో విడతలో 53,58,368 రైతు కుటుంబాలకు రూ.1,078.36 కోట్లు జమచేయనున్నారు. లబ్ధిదారుల్లో 51,00,063 మంది భూ యజమానులు కాగా, భూమి లేని ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీ సాగుదారులు 1,64,705 మంది, దేవదాయ, అటవీ భూమి సాగుదారులు 93,600 మంది ఉన్నారు. తొలి విడతతో పోల్చుకుంటే రెండో విడతలో 95,642 మంది పెరగ్గా, రెండో విడతతో పోల్చుకుంటే మూడో విడతలో మరో 5,463 మంది పెరిగారు. మూడో విడత సాయంతో కలిపి ఈ ఏడాది 53.58 లక్షల మందికి రూ.7,226.08 కోట్ల పెట్టుబడి సాయం అందించగా, ఈ ఐదేళ్లలో సగటున 51.13 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.67,500 చొప్పున రూ.34,288.17 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందించినట్టవుతుంది. క్రమం తప్పకుండా సున్నా వడ్డీ రాయితీ వడ్డీ భారం తగ్గించడంతో పాటు రైతుల్లో ఆర్థిక క్రమశిక్షణ తీసుకురావడమే లక్ష్యంగా 2019 ఖరీఫ్ సీజన్ నుంచి వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తోంది. సీజన్లో రూ.లక్ష లోపు తీసుకున్న రుణాన్ని ఏడాది లోపు చెల్లించిన వారిలో ఈ క్రాప్ ప్రామాణికంగా అర్హులైన రైతుల పొదుపు ఖాతాలకు సీజన్ చివర్లో సున్నా వడ్డీ రాయితీని ఈ ప్రభుత్వం జమ చేస్తోంది. ఇలా ఇప్పటి వరకు 73.88 లక్షల రైతు కుటుంబాలకు రూ.1,834.55 కోట్లు చెల్లించింది. ఈ మొత్తంలో చంద్రబాబు ఆయన పాలించిన ఐదేళ్లలో 39.07 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టిన రూ.1,180.66 కోట్లు కూడా ఉన్నాయి. తాజాగా రబీ –2021–22 సీజన్లో అర్హత పొందిన 4.48 లక్షల మంది రైతులకు రూ.84.30 కోట్లు, ఖరీఫ్–2022 సీజన్లో అర్హత పొందిన 6.31లక్షల మందికి రూ.131.68 కోట్లు వెరసి 10.79 లక్షల మందికి రూ.215.98 కోట్లు జమ చేయనున్నారు. తాజాగా జమ చేసే మొత్తంతో కలిపి ఈ ఐదేళ్లలో 84.67 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.2,050.53 కోట్లు జమ చేశారు. అదే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 40.61 లక్షలమందికి రూ.685.46 కోట్ల వడ్డీ రాయితీని మాత్రమే చెల్లించారు. గత ప్రభుత్వంతో పోలిస్తే రైతుల సంఖ్య రెట్టింపు కాగా, వడ్డీ రాయితీ సొమ్ము మూడు రెట్లు ఎక్కువగా అందించినట్టయింది. ఇచ్చిన మాట కంటే ఎక్కువగా ఇస్తున్న సీఎం జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీకంటే మిన్నగా వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించి రైతులకు అండగా నిలిచారు. ఇప్పటికే రూ.65,500 చొప్పున సాయం అందించగా, మిగిలిన సాయం ఈ నెల 28న జమ చేస్తున్నాం. తాజా సాయంతో కలిపి ఈ 5 ఏళ్లలో 34,288 కోట్ల పెట్టుబడి సాయం అందించినట్టయ్యింది. రైతు రుణ మాఫీ, అన్నదాత సుఖీభవ పథకాల కింద చంద్రబాబు రైతులకు ఇచ్చిన సాయంకంటే రెట్టింపు సాయం ఒక్క రైతు భరోసా పథకం కిందే ఇచ్చాం. – కాకాణి గోవర్ధన్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి -
డిజిటల్లో దుమ్ము దులిపేస్తోంది
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘వైఎస్సార్ రైతు భరోసా ఛానల్’ దుమ్ము దులిపేస్తోంది. మూడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ చానల్ నిరంతరాయంగా వీక్షకుల మన్ననలు పొందుతోంది. రైతాంగానికి కావాల్సిన సలహాలిస్తూ, వ్యవసాయం అనుబంధ రంగాలకు సూచనలు అందించి తోడ్పాటు ఇవ్వడంలో ముందు వరుసలో ఉంది. ఫలితంగా తక్కువ కాలంలోనే రైతులు ఆర్బీకే ఛానల్పై అధిక సంతృప్తి కనపరుస్తున్నారు. సొంతగా యూ ట్యూబ్ ఛానెల్ నెలకొల్పి అన్నదాతకు ఆసరాగా నిలబడుతుండడంతో ఏపీ ప్రభుత్వాన్ని పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని అక్కడ కూడా ఏర్పాటు చేసేలా అడుగులు వేస్తున్నాయి. అన్నపూర్ణగా వెలుగొందుతున్న ఏపీ వ్యవసాయ రంగంలో కాలానికి తగినట్లుగా విప్లవాత్మక మార్పులు రావడంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా ఛానల్ అనతి కాలంలోనే అన్నదాతలతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన వారి మన్ననలు చూరగొంటోంది. ప్రారంభించి మూడేళ్లు కూడా పూర్తి కాకుండానే 2.75లక్షల సబ్ స్క్రిప్షన్, 55 లక్షల వ్యూయర్ షిప్తో దూసుకుపోతోంది. దేశంలో మరెక్కడా లేని విధంగా ‘ఆర్బీకే’ పేరిట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ యూ ట్యూబ్ ఛానల్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. కేంద్రంతోపాటు పొరుగు రాష్ట్రాలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, ప్రముఖుల ప్రశంసలందుకుంటోంది. ఏపీ స్ఫూర్తితో ఇప్పటికే రాజస్థాన్ ప్రభుత్వం రైతుల కోసం సొంతంగా యూ ట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేస్తుండగా.. పలు రాష్ట్రాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. నీతి ఆయోగ్, ఐసీఎఆర్, ఆర్బీఐ వంటి జాతీయ సంస్థలకే కాదు వరల్డ్బ్యాంక్, యూఎన్కు చెందిన ఎఫ్ఏఒతోపాటు వివిధ దేశాల ప్రముఖులను సైతం ఆకట్టుకుంది. తెలంగాణ, తమిళనాడు, కేరళ, రాజస్థాన్తో పాటు వివిధ రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు ఛానల్ను సందర్శించి నిర్వహణ తీరును ప్రశంసించారు. ఎస్ఎంఎస్ ద్వారా రైతులకు సమాచారం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సాగులో వస్తున్న నూతన విధానాలను ఎప్పటికప్పుడు డిజిటల్ మీడియా ద్వారా రైతులకు చేరువ చేసే లక్ష్యంతో ఆర్బీకే ఛానల్ను ఏర్పాటు చేసింది. రైతుల అభ్యుదయ గాథలు, ఆదర్శ రైతుల అనుభవాలను ఆకట్టుకునేలా తీర్చి దిద్ది ప్రసారం చేస్తున్నారు. అలాగే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొనే అధికారిక కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాల్లో ఉండే పరికరాలు, ఉపయోగాలు రైతులందరికీ తెలిసేలా రైతు గ్రూపులతో ఛానల్ ద్వారా ఇంటరాక్షన్ కార్యక్రమాలు నిర్వహిసున్నారు. ఏ రోజు ఏ శాఖకు చెందిన కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయో? ఆర్బీకేల ద్వారా ప్రసారం చేసున్నారు. ఛానల్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాలను యూ ట్యూబ్లో అప్లోడ్ అవుతుండడంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు మొబైల్ ద్వారా రైతులు వీక్షిస్తున్నారు. 1,628 వీడియోలు.. 500కు పైగా ప్రత్యక్ష ప్రసారాలు ఆర్బీకే ఛానల్ కోసం ప్రత్యేకంగా గన్నవరం ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్లో మూడేళ్ల క్రితం డిజిటల్ స్టూడియోను ఏర్పాటు చేసింది. డిజిటల్ రంగంలో విశేష అనుభవం కలిగిన సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. క్షేత్ర స్థాయిలో ఆదర్శ, అభ్యుదయ రైతులు సాధిస్తోన్న విజయాలపై ఇంటరŠూయ్వలు, డాక్యుమెంటరీలు రూప కల్పన కోసం ప్రత్యేకంగా అవుట్ డోర్ యూనిట్ను కూడా ఏర్పాటు చేసారు. శాఖల వారీగా అప్లోడ్ చేస్తున్న వీడియోలు, ప్రత్యక్ష ప్రసారాలకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు 599 వ్యవసాయ, 589 ఉద్యాన, 257 పశు సంవర్ధక, 97 మత్స్య, 13 పట్టు శాఖలకు చెందిన వీడియోలతో పాటు వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి 73 వీడియోలు కలిపి ఇప్పటి వరకు 1,628 వీడియోలను అప్లోడ్ చేశారు. 500కు పైగా ప్రత్యక్ష ప్రసారాలను చేసారు. ఛానల్ను 2.75లక్షల మంది సబ్ స్క్రిప్షన్ చేసుకోగా, జనవరి 4వ తేదీ నాటికి అప్లోడ్ చేసిన వీడియోలు, ప్రసారాలను 54,67,079 మంది వీక్షించారు. ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన ఓ యూట్యూబ్ ఛానల్కు ఈ స్థాయి వ్యూయర్ షిప్ లభించడం గొప్ప విషయమని చెబుతున్నారు. ఆర్బీకే ఛానల్ ద్వారా ఎంతో మేలు ‘ఆర్బీకే చానల్’ చాలా బాగుంది. ఈ ఛానల్ ద్వారా ప్రసారం చేసే వీడియోలను రెగ్యులర్గా వీక్షిస్తుంటాను. సీజన్లో విత్తనాలు, ఎరువులు ఏ మేరకు నిల్వ ఉన్నాయి. ఎలా బుక్ చేసుకోవాలి. సాగులో సందేహాలనే కాకుండా.. విత్తు నుంచి విక్రయం వరకు రైతులు ఎదుర్కొనే సమస్యలకు చక్కని పరిష్కారాలు చూపిస్తున్నారు. ఈ తరహా ప్రయోగం ప్రభుత్వ పరంగా చేపట్టడం నిజంగా ప్రశంసనీయం. –నందం రఘువీర్, మొక్కల జన్యు రక్షక్షుకుని అవార్డు గ్రహీత, పెనమూలురు, కృష్ణ జిల్లా రైతులు స్వచ్చందంగా సబ్ స్ర్కైబ్ రైతు ప్రాయోజిత కార్యక్రమాలను ప్రసారం చేసే ఈ ఛానల్కు వ్యూయర్షిప్ అరకోటి దాటడం నిజంగా గొప్ప విషయం. సాగులో సందేహాలను నివృత్తి చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు వ్యవసాయ అనుబంధ రంగాల్లో వస్తోన్న మార్పులు, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఛానల్ ద్వారా రైతులకు చేరువ చేస్తున్నాం. రైతులు స్వచ్చందంగా సబ్ స్ర్కైబ్ చేసుకుంటున్నారు. –చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
Fact Check: మీ అబద్ధాలకే లేదు హద్దు
విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండడమే కాదు.. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు, రైతుల అభ్యున్నతికి పాటుపడుతూ వ్యవసాయ, అనుబంధ రంగాల్లో స్పష్టమైన మార్పునకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాలు (ఆర్బీకేలు). దేశానికే ఇవి ఆదర్శంగా నిలుస్తూ రైతులకు అన్ని విధాలుగా భరోసా కల్పిస్తుంటే మెచ్చుకోవాల్సింది పోయి.. ఎలాగైనా రైతులకు వీటి సేవలను దూరం చేయాలన్న దుర్మార్గపు పన్నాగంతో నిత్యం వీటిపై బురద జల్లడమే పనిగా ఈనాడు రామోజీరావు పెట్టుకున్నారు. ఏ పల్లెకు వెళ్లినా సకల సౌకర్యాలతో ఆర్బీకేలు స్వాగతం పలుకుతుండడాన్ని.. రైతులు వీటి సేవలను కొనియాడుతుండడాన్ని చూసి రామోజీకి అస్సలు నిద్ర పట్టడంలేదు. ఇలాగైతే తన ఆత్మబంధువు చంద్రబాబుకు అధికారం దక్కడం అసాధ్యం అని భావించే నిత్యం ఏదో ఒక అంశంపై విషం చిమ్ముతున్నారు. అందులో భాగమే తాజాగా ‘ప్రచారానికి లేదు హద్దు.. వసతులు అడగొద్దు’.. అంటూ ఆర్బీకేలపై తన అక్కసును చాటుకుని తన అబద్ధాలకు ఎలాంటి హద్దులేదని అక్షరం అక్షరంలో చెప్పుకున్నారు. ఈ కథనంలో వాస్తవాలేమిటంటే.. –సాక్షి, అమరావతి ఆరోపణ : రైతులను గాలికొదిలేశారు.. వాస్తవం : గ్రామస్థాయిలో ఏర్పాటుచేసిన 10,778 ఆర్బీకేల ద్వారా 14,323 మంది సిబ్బందితో పాటు 1,573 బహుళార్ధ వ్యవసాయ విస్తరణ అధికారులు సేవలందిస్తున్నారు. వీటికి గ్రామ వలంటీర్తో పాటు బ్యాంకింగ్ కరస్పాండెంట్ను అనుసంధానం చేశారు. గతంలో ఏది కావాలన్నా మండల కేంద్రాలకు పరుగులు తీసేవారు. పగలనకా, రేయనకా నిద్రహారాలు మాని రోజుల తరబడి పడిగాపులు పడేవారు. కానీ, ప్రస్తుతం చూద్దామన్నా ఎక్కడా క్యూలైన్ అనేది కన్పించడంలేదు. వివక్షకు తావులేకుండా అడిగిన ప్రతీరైతుకు అవసరమైన మేరకు సర్టిఫైడ్ చేసిన సాగు ఉత్పాదకాల పంపిణీతో పాటు ఈ–క్రాప్ బుకింగ్, సంక్షేమ పథకాల అమలుతో పాటు ధాన్యంతో సహా ఇతర పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. పరిశోధనా ఫలాలను నేరుగా రైతు క్షేత్రాలకు చేరవేస్తూ రైతుల్లో సామర్థ్యం పెంపుదలకు శిక్షణనిస్తున్నారు. ఆరోపణ : ఆర్బీకేల్లో సౌకర్యాలేవి? వాస్తవం : 526 గ్రామాల్లో ఆర్బీకేలకు సొంత భవనాలుండగా, మిగిలిన 10,252 గ్రామాల్లో ఆర్బీకేలకు రూ.2,260 కోట్ల అంచనాతో కొత్త భవనాల నిర్మాణం చేపట్టారు. తొలుత ఒక్కో భవన నిర్మాణానికి రూ.21.80 లక్షలు అంచనా వేయగా, అదనపు సదుపాయాల కోసం దీనిని రూ.23.94 లక్షలకు పెంచింది. ప్లాన్ ప్రకారం ప్రతీ ఆర్బీకే భవనం వద్ద మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉంది. టాయిలెట్స్ నిర్మాణ పనులు జాప్యం జరిగిన చోట, సిబ్బందికి ఇబ్బందిలేకుండా ఉండేందుకు సచివాలయం, హెల్త్ క్లినిక్, ఆర్బీకే భవనాల సముదాయంలో నిర్మించిన టాయిలెట్ను ఆర్బీకే సిబ్బంది వినియోగించేలా ఏర్పాటుచేశారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 4,239 ఆర్బీకే భవనాలను వ్యవసాయ శాఖకు అప్పగించారు. మరో 4,935 భవనాలు వివిధ దశల్లో ఉండగా, భూ వివాదాలు, స్థలాల కొరత, కోర్టు కేసులు వంటి వివిధ కారణాలతో 1,078 భవనాల నిర్మాణం ప్రారంభించలేదు. ఇప్పటివరకు భవనాల నిర్మాణం కోసం రూ.1,014.82 కోట్లు ఖర్చుచేయగా, మౌలిక వసతుల కల్పన కోసం మరో రూ.357 కోట్లు ఖర్చుచేశారు. సాగు ఉత్పాదకాల బుకింగ్తో పాటు ఎప్పటికప్పుడు వాతావరణ, మార్కెట్ సమాచారం తెలుసుకునేందుకు వీలుగా 9,484 ఆర్బీకేల్లో కియోస్క్లను.. వీటి పనితీరు పర్యవేక్షణకు ప్రత్యేక డాష్బోర్డును ఏర్పాటుచేశారు. ఆరోపణ : ఎరువుల లారీ వస్తే సిబ్బందికి ఇబ్బందే.. వాస్తవం : ఆర్బీకేలకు ఎరువుల సరఫరాను పగటిపూట మాత్రమే చేస్తున్నారు. ఏదైనా ప్రత్యేక పరిస్థితులలో లారీల రవాణా ఆలస్యమైతే మరుసటి రోజు ఉదయం అన్లోడ్ అయ్యేలా ఏర్పాట్లుచేసుకోవాలని లారీ డ్రైవర్లకు మార్క్ఫెడ్ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఇక ఆర్బీకేల ద్వారా ఎరువు అమ్మకాలను ప్రోత్సహించేందుకు 2020–21లో మాత్రమే నగదు ప్రోత్సహకాలు ప్రకటించారు. ఆ మేరకు మార్క్ఫెడ్ ద్వారా చెల్లింపులు చేసేందుకు మార్కెఫెడ్ చర్యలు తీసుకుంది. 2023–24లో జిల్లాకు 8 వేల నుండి 10 వేల వరకు భూసార పరీక్షల నిమిత్తం 26 జిల్లాలకు మట్టి నమూనాల సేకరణ కోసం రూ.54.50 లక్షలు విడుదల చేశారు. ఆరోపణ : నిర్వహణకు నిధులే లేవు? వాస్తవం : 3,830 ఆర్బీకేల అద్దె చెల్లింపు కోసం రూ.43 కోట్లు ఖర్చుచేయగా, 2023–24 ఆర్ధిక సంవత్సరం చివరి వరకు అద్దెల నిమిత్తం మరో రూ.32.98 కోట్లు విడుదల చేశారు. ఇప్పటికే రూ.22.98 కోట్లు నేరుగా భవన యజమానుల ఖాతాలకు జమచేశారు. మిగిలిన రూ.10 కోట్లు చెల్లించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. అలాగే, ఈ ఏడాది మార్చి వరకు పెండింగ్లో ఉన్న విద్యుత్ బిల్లుల కోసం రూ.12 కోట్లు విడుదల చేయగా.. 2023–24 ఆర్థిక సంవత్సరం నుండి విద్యుత్ బిల్లుల చెల్లింపునకు అవసరమయ్యే బడ్జెట్ను నేరుగా విద్యుత్ శాఖకే కేటాయించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. స్టేషనరీ కోసం ఇప్పటికే రూ.3 కోట్లు విడుదల చేశారు. అలాగే, ఇందుకోసం ఖర్చుచేసిన ఆర్బీకే సిబ్బందికి నేరుగా రూ.53.48 లక్షలు విడుదల చేశారు. స్థానికంగా హైస్పీడ్ నెట్వర్క్ ఏది అందుబాటులో ఉంటే ఆ ఇంటర్నెట్ సదుపాయాన్ని ఆర్బీకేల్లో సమకూర్చారు. ఇందుకోసం ఇప్పటికే రూ.23 కోట్లు విడుదల చేశారు. సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు, రైతుసేవలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు సొంత మొబైల్ డాటాని ఉపయోగించిన సిబ్బందిపై పైసా కూడా భారం పడకుండా ఏర్పాటుచేశారు. ఆరోపణ : రైతుభరోసా పత్రికల పేరిట అదనపు బాదుడు.. వాస్తవం : ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వ్యవసాయ రంగంలో వచ్చే మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం ఎప్పటికప్పుడు రైతులకు చేరవేసే సంకల్పంతో తీసుకొచ్చిన వైఎస్సార్ రైతుభరోసా మాస పత్రిక అనతి కాలంలోనే రైతుల ఆదరణ పొందింది. 14,300 ప్రతులను వ్యవసాయ శాఖ సొంత నిధులతో ముద్రించి ఆర్బీకేలకు సరఫరా చేస్తోంది. రూ.300 చొప్పున వార్షిక చందా చెల్లించగలిగే రైతులకు నేరుగా వారి ఇంటికి పంపిస్తున్నారు. వ్యవసాయ విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఆర్బీకే స్థాయిలో అవగాహన కల్పించి ఔత్సాహిక రైతులు చందాదారులుగా చేరే కార్యక్రమం చేపట్టారు. ఈ విషయంలో ఎవరిపైనా ఎలాంటి ఒత్తిడి లేదు. ఆర్బీకేల ద్వారా అందించిన సేవలిలా.. అదును దాటక ముందే.. కాదు కాదు.. సీజన్కు ముందుగానే సర్టిఫై చేసిన నాణ్యమైన సాగు ఉత్పాదకాలను బుక్ చేసుకున్న 24 గంటల్లోపే రైతుల ముంగిట్లో వాటిని అందిస్తున్నారు. ♦ ఇలా ఇప్పటివరకు ఆర్బీకేల ద్వారా 34.09 లక్షల క్వింటాళ్ల సర్టిఫైడ్ విత్తనాలను రూ.1,027.66 కోట్ల రాయితీతో 58 లక్షల మంది రైతులకు, నాన్ సబ్సిడీ కేటగిరీ కింద రూ.13 కోట్ల విలువైన 1,661 క్వింటాళ్ల పత్తి, మిరప, వరి, మొక్కజొన్న, సజ్జ, సోయాబీన్ తదితర సర్టిఫైడ్ విత్తనాలను 30వేల మంది రైతులకు సరఫరా చేశారు. ♦ఆర్బీకేల ద్వారా ఈ మూడున్నరేళ్లలో రూ.1,312 కోట్ల విలువైన 11.88 లక్షల టన్నుల ఎరువులను 31.54 లక్షల మంది రైతులకు పంపిణీ చేశారు. అలాగే, 1.51 లక్షల మంది రైతులకు రూ.14 కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగు మందులను పంపిణీ చేశారు. ♦ వీటితో పాటు.. ఆక్వా రైతులకు సర్టిఫై చేసిన ఫీడ్, సీడ్, పాడి రైతులకు సంపూర్ణ మిశ్రమ దాణా, పశుగ్రాసం విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. టమరోవైపు.. ఆర్బీకేల ద్వారా వైఎస్సార్ రైతుభరోసా కింద 53.53 లక్షల మంది రైతులకు రూ.33,209.81 కోట్ల పెట్టుబడి సాయం, వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద 54.48 లక్షల మంది రైతులకు రూ.7,802.05 పంటల బీమా పరిహారం, 22.85 లక్షల మంది రైతులకు రూ.1,976.44 కోట్ల పెట్టుబడి రాయితీ (పంట నష్టపరిహారం), 73.88 లక్షల మంది రైతులకు రూ.1,442.66 కోట్ల సున్నా వడ్డీ రుణాలు అందించగా.. ఆర్బీకేలకు అనుబంధంగా ఏర్పాటుచేసిన 10,936 వైఎస్సార్ యంత్రసేవా కేంద్రాల కోసం రూ.366.25 కోట్ల సబ్సిడీని అందించారు. .. ఇలా నిర్విరామంగా రైతుల సేవలో నిమగ్నమైన ఆర్బీకేలకు అనతి కాలంలోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రశంసలతో పాటు అవార్డులు, రివార్డులు వరించాయి. అలాగే, సకల సౌకర్యాలతో అన్ని విధాలుగా రైతులకు భరోసా కల్పిస్తున్న వీటిపై ఈనాడు అదే పనిగా నిత్యం విషం కక్కడం వెనుక ఉన్న లక్ష్యాలు అందరికీ తెలిసిందే. -
Fact Check: కౌలు రైతన్నలపై రామోజీ కుళ్లు
సాక్షి, అమరావతి: బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే అత్యధికంగా ఉండే కౌలు రైతులకు మంచి చేస్తుంటే ఈనాడు రామోజీ కుళ్లుతో కుతకుతలాడిపోతున్నారు! వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఈ ప్రభుత్వంపై అభాండాలు వేస్తూ రోత రాతలకు తెగబడ్డారు. భూ యజమానులతోపాటు వాస్తవ సాగుదారులకూ సంక్షేమ ఫలాలను అందిస్తూ మేలు చేస్తున్న ప్రభుత్వం మరెక్కడైనా ఆయనకు కనిపించిందా? గత ప్రభుత్వాలు కనీసం ఆలోచన కూడా చేయని పంట సాగు హక్కుదారుల చట్టం 2019ని తేవడమే కాకుండా సీసీఆర్సీల ఆధారంగా అన్ని ప్రయోజనాలను సీఎం జగన్ అందిస్తున్నారు. వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం నుంచి పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీతో పాటు దురదృష్టవశాత్తూ ఆత్మహత్యలకు పాల్పడ్డ అన్నదాతల కుటుంబాలకు వారు కౌలు రైతులైనా సరే రూ.7 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నారు. కౌలు రైతులకు ఈ క్రాప్ ప్రామాణికంగా సబ్సిడీ విత్తనాలు, ఎరువులతోపాటు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), ఉచిత పంటల బీమాతో లబ్ధి చేకూరుస్తున్నారు. తుపాన్తో నష్టపోయిన అన్నదాతలను ఆదుకునేందుకు రంగు మారిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. గతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వమూ అలా కొనుగోలు చేయలేదు. రికార్డు స్థాయిలో సీసీఆర్సీలు భూ యజమాని హక్కులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా వాస్తవ సాగుదారులకు ప్రభుత్వం పంట సాగుదారు హక్కు పత్రాలు (సీసీఆర్సీ) జారీ చేస్తోంది. ఏటా ఖరీఫ్కు ముందు ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. 2019 నుంచి ఇప్పటివరకు 25,86,178 మంది కౌలు రైతులకు సీసీఆర్సీలు జారీ చేశారు. అత్యధికంగా ఈ ఏడాది 8,25,054 మందికి సీసీఆర్సీలు జారీ అయ్యాయి. వాస్తవ సాగుదారులందరికీ పంట రుణాలివ్వాలన్న సంకల్పంతో పీఏసీఎస్లను ఆర్బీకేలతో అనుసంధానం చేశారు. సీసీఆర్సీలు లేని కౌలు రైతులను గుర్తించి జాయింట్ లయబిలిటీ గ్రూపులు (జేఎల్జీ) నెలకొల్పి రుణాలు అందిస్తున్నారు. 2019 నుంచి ఇప్పటివరకు 14.39 లక్షల మంది కౌలుదారులకు రూ.8,246 కోట్ల రుణాలు అందాయి. కౌలు రైతుకూ సంక్షేమ ఫలాలు దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కౌలు రైతులకు రూ.13,500 పెట్టుబడి సాయాన్ని అందచేస్తోంది. కేంద్రం ఇవ్వకున్నా వైఎస్సార్ రైతు భరోసాతో సహా భూ యజమానులకు వర్తింçపచేసే సంక్షేమ ఫలాలన్నీ భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాగుదారులతో పాటు అటవీ, దేవదాయ భూమి సాగుదారులకు కూడా ప్రభుత్వం అందిస్తోంది. సీసీఆర్సీ కార్డుల ఆధారంగా 9.52 లక్షల మందికి రూ.1,235.03 కోట్ల మేర వైఎస్సార్ రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని అందచేశారు. రూ.లక్ష లోపు పంట రుణాలు పొందిన కౌలుదారులకు ఈ – క్రాప్ ఆధారంగా వైఎస్సార్ సున్నావడ్డీ రాయితీ కూడా అందేలా చర్యలు చేపట్టారు. ఇలా ఇప్పటి వరకు 30 వేల మందికి రూ.6.26 కోట్ల సున్నా వడ్డీ రాయితీని అందించారు. 3.55 లక్షల మందికి రూ.731.08 కోట్ల పంటల బీమా పరిహారం, 2.41లక్షల మందికి రూ.253.56 కోట్ల పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) పంపిణీ చేశారు. దురదృష్టవశాత్తూ ఆత్మహత్యకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలకు భూ యజమానులతో సమానంగా రూ.7 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం అందిస్తోంది. 2019 నుంచి ఇప్పటివరకు రూ.90.72 కోట్లు పరిహారం అందించగా కౌలు రైతులకు రూ.34.65 కోట్లు సాయం అందింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన రైతు ఆత్మహత్యలపై పునర్విచారణ జరిపి 474 మందికి రూ.23.70 కోట్లు పరిహారం కింద ఈ ప్రభుత్వమే చెల్లించింది. తాజాగా తుపాన్తో నష్టపోయిన కౌలు రైతులు, అటవీ భూ సాగుదారులకు సైతం పంట నష్ట పరిహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే కేంద్ర బృందాలు రాష్ట్రంలో పర్యటించాయి. 4.42 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బ తిన్నట్లు గుర్తించి రూ.703 కోట్ల పెట్టుబడి రాయితీ ఇవ్వాలని అంచనా వేశారు. ప్రస్తుతం పంట నష్టం తుది అంచనాల ప్రక్రియ కొనసాగుతోంది. భూ యజమానులతో పాటు సీసీఆర్సీ కార్డులు పొందిన కౌలు రైతులకు కూడా 80 శాతం రాయితీతో 86 వేల క్వింటాళ్ల విత్తనాలను తిరిగి విత్తుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే సరఫరా చేసింది. -
పశు సంవర్ధక శాఖలో పోస్టుల భర్తీకి నేడు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సచివాలయాలకు అనుబంధంగా ఉన్న వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 1,896 గ్రామ పశుసంవర్ధక సహాయకులు (వీఏహెచ్ఏ) పోస్టుల భర్తీకి పశుసంవర్ధక శాఖ సోమవారం నోటిఫికేషన్ జారీ చేస్తోంది. ఈ నెల 20వ తేదీ నుంచి డిసెంబర్ 11వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. అభ్యర్థులకు డిసెంబర్ 27న హాల్టికెట్లు జారీ చేస్తారు. డిసెంబర్ 31వ తేదీన కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన వారికి జనవరిలో నియామక పత్రాలు అందిస్తారు. వేతనం రూ.22,460 ఎంపికైన వారికి రెండేళ్లపాటు ప్రొబేషన్ సమయంలో రూ.15 వేల చొప్పున కన్సాలిడేషన్ పే ఇస్తారు. ఆ తర్వాత రూ.22,460 చొప్పున ఇస్తారు. అభ్యర్థులు 18–42 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి, విద్యార్హతలు, ఇతర వివరాలు ahd.aptonline.in, https://apaha- recruitment.aptonline.in వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. దరఖాస్తులు కూడా ఇదే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని నిర్ధేశిత రుసుములను డిసెంబర్ 10వ తేదీలోగా చెల్లించాలి. దరఖాస్తులను డిసెంబర్ 11వ తేదీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే రెండు విడతల్లో 4,643 పోస్టుల భర్తీ సచివాలయాలకు అనుబంధంగా గ్రామ స్థాయిలో 10,778 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు సేవలందిస్తున్న విషయం తెలిసిందే. స్థానికంగా ఉండే పశు సంపద ఆధారంగా 9,844 వీఏహెచ్ఏలు అవసరమని గుర్తించి ఆ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. రెండు విడతల్లో 4,643 ఆర్బీకేల్లో వీఏహెచ్ఏలను నియమించారు. రేషనలైజేషన్ ద్వారా గ్రామ పరిధిలో 2–3 ఆర్బీకేలు ఉన్న చోట గ్రామాన్ని యూనిట్గా వీఏహెచ్ఏలను నియమించి, అదనంగా ఉన్న వీఏహెచ్ఏలను లేనిచోట్ల సర్దుబాటు చేశారు. మిగిలిన 1,896 ఆర్బీకేల పరిధిలో వీఏహెచ్ఏల నియామకానికి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో పోస్టుల భర్తీకి పశు సంవర్ధక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి జిల్లాల వారీగా భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు జిల్లా పోస్టుల సంఖ్య అనంతపురం 473 చిత్తూరు 100 కర్నూలు 252 వైఎస్సార్ 210 నెల్లూరు 143 ప్రకాశం 177 గుంటూరు 229 కృష్ణా 120 పశ్చిమ గోదావరి 102 తూర్పు గోదావరి 15 విశాఖపట్నం 28 విజయనగరం 13 శ్రీకాకుళం 34 -
సున్నావడ్డీ సూపర్
-
బడుగు బలహీన వర్గాలను బలమైన వర్గాలుగా మార్చిన వైనం
-
మరోసారి మంచి మనసు చాటుకున్న సీఎం జగన్
-
నా నిరుపేద వర్గాలకు మంచి జరగాలనే అడుగులు వేశాం: సీఎం జగన్
-
అన్నదాతలకు అండగా నిలిచామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడి. వైఎస్సార్ రైతు భరోసా నిధులు విడుదల.. ఇంకా ఇతర అప్డేట్స్
-
అన్నదాతలను ఆదుకున్నాం
రైతులు, అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, చదువుకొనే పిల్లలు, నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద వర్గాల వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే వారి గుండెల్లో ఎంతగా స్థానం ఇస్తారని చెప్పడానికి ఒక వైఎస్సార్, ఒక వైఎస్ జగన్ను చూస్తే అర్థం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు జరుగుతున్న సామాజిక సాధికార యాత్రలను చూస్తే తెలుస్తుంది. ఆయా వర్గాల వారి నాయకత్వంలో జరుగుతున్న ఈ యాత్రలకు, మీటింగ్లకు తండోపతండాలుగా కదిలి వస్తున్న జనాలను చూస్తుంటే వారి గుండెల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానం, మీ బిడ్డ జగన్ స్థానం ఏమిటో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి అడుగులోనూ రైతన్నలకు, పేద వాడికి, నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు జరగాలని.. వారి కుటుంబాలు బాగుండాలని, పిల్లలు బాగుండాలి, గొప్పగా చదవాలని, ఎదగాలని ఎంతో తపిస్తూ అడుగులు వేసిన ప్రభుత్వం మనది. రైతన్న బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం. ఇలాంటి మన ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి మధ్య ఎంత తేడా ఉందనేది ప్రతి రైతన్న ఆలోచించాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘రాష్ట్రంలో నాలుగేళ్లు కరువనేది లేకపోయినా రైతులకు చేయాల్సిన సాయం చేశాం. రైతును చేయి పట్టుకుని నడిపిస్తున్న ప్రభుత్వమిది. గతంలో ఏ ప్రభుత్వమూ ఆలోచించని విధంగా ఆలోచించి అన్నదాతలకు మేలు చేశాం. గతంలో ఎప్పుడూ జరగని విధంగా వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏటా 53 లక్షల మంది పైచిలుకు రైతులకు, వారితో పాటు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులకు రూ.13,500 చొప్పున ఇచ్చిన ప్రభుత్వం మనదే. మీ అందరి ఆశీస్సులు, పుట్టపర్తి స్వర్గీయ బాబా దీవెనలు మెండుగా ఉన్నాయి. అందుకే రైతుల గుండెల్లో నిలిచాం. ఈ రోజు వరుసగా ఐదో ఏడాది రెండో విడత పెట్టుబడి సాయాన్ని కంప్యూటర్లో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నా’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ పథకం కింద రైతులకు నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 53.53 లక్షల మంది రైతులకు, వారితోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులకు, ఆర్వోఎఫ్ఆర్ రైతులకు లబ్ధి జరుగుతోందన్నారు. దాదాపు రూ.2,200 కోట్లలో రేపటికల్లా మన ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన రూ.1,200 కోట్లు నేరుగా రైతుల ఖాతాలో జమ అవుతుందని చెప్పారు. తర్వాత పీఎం కిసాన్ కింద రావాల్సిన రూ.1,000 కోట్లు వాళ్లు ఇచ్చిన వెంటనే ప్రతి రైతన్న ఖాతాలో జమ అవుతుందన్నారు. ఇక్కడికి రాక ముందు కూడా తాను వాళ్లతో మాట్లాడానని, మీ డబ్బులు కూడా క్రోడీకరించాలని కోరానని.. ఈ నెలలో కచ్చితంగా ఇస్తామని చెప్పారని తెలిపారు. ఈ 53 నెలల్లో 53 లక్షల మంది పైచిలుకు రైతన్నలకు మన ప్రభుత్వం రూ.61,500 చొప్పున ఇచ్చిందన్నారు. ఈ ఏడాది ఈ విడత ఇచ్చే రూ.4,000 కలుపుకుంటే రూ.65,500 లబ్ధి కలిగినట్లవుతుందని చెప్పారు. ఈ ఒక్క పథకం ద్వారానే రైతులకు నేరుగా రూ.33,209.81 కోట్లు ఇచ్చామని స్పష్టం చేశారు. రైతులకు ఇలా మేలు చేయాలనే ఆలోచన 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబుకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఈ సభలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఇదివరకెన్నడూ లేని విధంగా రైతులకు లబ్ధి ► విత్తనం వేసినప్పటి నుంచి పంట అమ్మకం వరకు ప్రతి రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించేందుకు 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఈ క్రాప్ ద్వారా ప్రతి ఎకరా నమోదు చేస్తున్నాం. పంట పండించే ప్రతి రైతన్నకూ పారదర్శకంగా ప్రతి అడుగులోనూ చేయి పట్టుకుని నడిపిస్తూ మంచి చేస్తున్నాం. ► పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నది మన ప్రభుత్వం మాత్రమే. గతంలో పగలూ రాత్రి రెండు సమయాల్లో కలిపినా కనీసం 7 గంటలు కూడా ఇవ్వలేకపోయారు. వ్యవసాయ ఫీడర్ల సామర్థ్యం పెంచేందుకు రూ.1,700 కోట్లు ఖర్చు చేశాం. పంటల బీమా కోసం రైతన్న ఒక్క రూపాయి కూడా కట్టకుండా తాను చెల్లించాల్సిన మొత్తం ప్రీమియం కూడా మనందరి ప్రభుత్వమే చెల్లిస్తోంది. ► వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.1,834 కోట్లు, ఉచిత పంటల బీమా కింద రూ.7,802 కోట్లు, ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.1,976 కోట్లు, విత్తన సబ్సిడీ కింద రూ.1,286 కోట్లు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం రూ.45 వేల కోట్లు..చివరకు ఆక్వా జోన్లలో రూ.1.50కే యూనిట్ విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం ఇదే. రైతు కుటుంబాలకు మంచి జరిగేందుకు, రైతన్నకు తోడుగా ఉండేందుకు రూ.1.75 లక్షల కోట్లు రైతన్నలకు ఇచ్చిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. 62 శాతం జనాభా ఆధారపడిన వ్యవసాయం మీద ఇలాంటి పనులు చేయాలన్న ఆలోచన చంద్రబాబు ఎందుకు చేయలేదు? కనీస మద్దతు ధర కల్పించాం ► గతంలో బాబు ఐదేళ్ల పాలనలో 17,94,000 మంది రైతన్నల వద్ద రూ.40,200 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేశారు. మన ప్రభుత్వ పాలన నాలుగేళ్లలో దళారీ వ్యవస్థను నిర్మూలిస్తూ ఈ క్రాప్ తెచ్చి ఆర్బీకేల ద్వారా 33 లక్షల మంది రైతన్నల దగ్గర నుంచి రూ.60 వేల కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేయగలిగాం. ఇతర పంటల కొనుగోలుకు కనీస మద్దతు ధర కేంద్రం చెప్పకపోయినా ఆర్బీకేల్లో జాబితాలు పెట్టి కనీస మద్దతు ధర ఇచ్చాం. రూ.8 వేల కోట్లు వెచ్చించి ఇతర పంటలూ కొనుగోలు చేశాం. ► సున్నా వడ్డీ పథకాన్ని చంద్రబాబు ఎలా నిర్వీర్యం చేశారో అందరం చూశాం. మనం ఆ పథకానికి నిజమైన అర్థం చెబుతూ పంట రుణాలు తీసుకుంటే ప్రభుత్వం తోడుగా ఉంటుందని భరోసా కల్పించాం. వ్యవసాయం ఒక్కటే రైతన్నకు సరిపోదని అనుబంధ రంగాలపై దృష్టి పెట్టాం. పాడి రైతులకు మంచి చేశాం. గతంలో తక్కువ ధర చెల్లిస్తూ చంద్రబాబు తన హెరిటేజ్కు, మిత్రుల డెయిరీలకు మేలు చేశారు. మనం సహకార రంగంలో విప్లవాన్ని తీసుకొచ్చాం. పాడి రైతులకు పాల వెల్లువ ద్వారా లీటరుకు రూ.10 నుంచి రూ.22 వరకు అదనపు ఆదాయం వచ్చేలా చేశాం. అప్పుడు స్కీములు లేవు.. స్కాములే ► చంద్రబాబు అధికారంలోకి రావాలనుకునేది ప్రజలకు మంచి చేయడానికి కాదు. కేవలం తాను, తనతోపాటు ఒక గజదొంగల ముఠా, ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు.. వీళ్లకు మేలు చేయడానికే. రాష్ట్రాన్ని దోచేసేందుకు, దోచుకున్నది పంచుకొనేందుకు మాత్రమే. ► వాళ్ల హయాంలో ఒక్కటంటే ఒక్క మంచి స్కీముందా? కేవలం స్కాములు మాత్రమే జరిగాయి. స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ గ్రిడ్, మద్యం, ఇసుక, రాజధాని భూములు ఇలా ఎక్కడ చూసినా స్కాములే. ఇప్పుడూ అదే రాష్ట్రం, అదే బడ్జెట్. కేవలం మారిందల్లా ముఖ్యమంత్రి మాత్రమే. అప్పుల గ్రోత్ రేటు కూడా ఇప్పుడు తక్కువే. ఈ ప్రభుత్వ హయాంలో మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు.. నేరుగా ఇప్పటికే 53 నెలల కాలంలోనే రూ.2.40 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్లింది. ► చంద్రబాబు హయాంలో ఆయన ఎందుకు ఇవ్వలేకపోయాడు? ఆ డబ్బులన్నీ ఎవరి జేబులోకి వెళ్లాయి? ఈ నిజాల గురించి అందరూ ఆలోచించాలి. మీ బిడ్డ హయాంలో గవర్నమెంట్ స్కూళ్లు ఎందుకు మారుతున్నాయి? ఇంగ్లిషు మీడియం ఎందుకు వచ్చింది? 6వ తరగతి నుంచే డిజిటల్ బోధన కోసం ఐఎఫ్పీలు ఎందుకు పెడుతున్నారు? 8వ తరగతిలో ట్యాబులు ఎందుకు పెట్టగలుగుతున్నాం. టెక్ట్స్ బుక్లో ఒక పేజీ ఇంగ్లిషులో, మరో పేజీ తెలుగులోకి ఎందుకు మారింది? చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో పిల్లల చదువులు, బడులు ఎందుకు మారలేదో ఆలోచించండి. ► గతంలో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా ఆస్పత్రులకు వెళితే పక్కన పెట్టే పరిస్థితి. గతంలో 1,058 ప్రొసీజర్లు ఉండగా, నేడు 3,300 ప్రొసీజర్లకు పెంచి పథకం పరిధిని విస్తరించాం. 1,600 పైచిలుకు 104, 108 వాహనాలు కొనుగోలు చేశాం. 108కు ఫోన్ చేసినా, 104కు ఫోన్ చేసినా గ్రామాల్లోనే ఇంటికి వచ్చి.. వైద్యం అందిస్తున్నారు. పేదవాడు వైద్యం కోసం అప్పులపాలు కాకూడదని పరితపిస్తూ చేయి పట్టుకుని నడిపిస్తున్న ప్రభుత్వం ఇదే. ► వ్యవసాయం, చదువులు, ఆరోగ్య రంగం ఇలా ఏ రంగం తీసుకున్నా కనీవినీ ఎరుగని మార్పులు కనిపిస్తున్నాయి. అక్కచెల్లెమ్మల సాధికారత సాధించాం. దిశ యాప్ 1.24 కోట్ల మంది అక్కచెల్లెమ్మల ఫోన్లలో కనిపిస్తుంది. 10 నిమిషాల్లోనే పోలీసు సోదరుడు వచ్చి మీకు అండగా, తోడుగా నిలిచే గొప్ప వ్యవస్థ. గ్రామ స్థాయిలోనే మహిళా పోలీసులు కనిపిస్తున్నారు. ► పేదలకు సొంత ఇంటి కల ఉంటుంది. ఆ కలను నిజం చేశాం. 31 లక్షల ఇంటి స్థలాలు ఇచ్చి 22 లక్షల ఇళ్లు కడుతున్నాం. ఒక్కో ఇల్లు పూర్తయితే ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల ఆస్తి పెట్టినట్లవుతుంది. ఇవన్నీ గతంలో ఎందుకు జరగలేదు? మీ బిడ్డ హయాంలో ఎందుకు జరుగుతున్నాయో ఆలోచించాలి. ► మీ బిడ్డకు అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం చేతకాదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 మద్దతు ఉండదు. దత్తపుత్రుడి వద్దకు వెళ్లి సపోర్ట్ లేకపోతే నేను బతకలేనని చెప్పలేడు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని, మిమ్మల్ని మాత్రమే. రాబోయే రోజుల్లో చంద్రబాబు సైన్యం అబద్ధాలు, మోసాలు మరింతగా పెరుగుతాయి. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారిస్తామంటారు. ఆ అబద్ధాలు నమ్మకండి. మీకు మంచి జరిగిందా, లేదా అన్నది మాత్రమే చూడండి. చంద్రబాబు హయాంలో వరుసగా కరువు ► గడిచిన 53 నెలల కాలంలో దేవుడి దయతో నాలుగేళ్లలో ఎక్కడా కరువు లేదు. చంద్రబాబు హయాంలో వరుసగా ఐదేళ్లూ కరువే. అయినా రైతుల తరఫున బీమా సొమ్ము ప్రభుత్వమే కట్టాలని, రైతన్నకు తోడుగా ఉండాలని, ప్రతి రైతుకూ బీమా అందాలనే ఆలోచన చేయలేదు. కరువు తాండవిస్తున్నా చంద్రబాబు.. రైతుల దగ్గర బీమా ప్రీమియం రూ.1,250 కోట్లు లాగేసుకున్నాడు. ► మన ప్రభుత్వం నాలుగేళ్ల పరిపాలనలో పుష్కలంగా వర్షాలు పడినా ఇన్సూ్యరెన్స్ సొమ్ము కింద రూ.7,802 కోట్లు ఇచ్చింది. కరువు రావటం, రాకపోవటం మన చేతుల్లో లేకపోయినా, కరువు వస్తే ఆదుకోవడం మన చేతుల్లో ఉంటుంది. ఇది మనసున్న ప్రభుత్వానికి, మనసు లేని ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడా. uమన ప్రాంతానికి దుర్భిక్ష పరిస్థితులు, కష్టాలు కొత్త కాదు. ఈ ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లుగా ఎక్కడా కరువు మండలంగా డిక్లేర్ చేయాల్సిన పరిస్థితి రాలేదు. ఈ సంవత్సరం మాత్రం కొన్ని మండలాల్లో వర్షాభావంతో రైతన్నలకు కాస్త ఇబ్బందులు కలిగాయి. ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్ ముగిసేలోపే మీ బిడ్డ ప్రభుత్వం పరిహారం ఇస్తోంది. గతంలో ఎప్పుడైనా ఇన్పుట్ సబ్సిడీ సమయానికి ఇచ్చారా? ఇవ్వాల్సిన వారందరికీ ఇచ్చారా? మీ బిడ్డ హయాంలో అంతా సక్రమంగా జరుగుతున్నప్పుడు.. నాటి పాలకులు ఎందుకు చేయలేకపోయారు? ► 2014లో చంద్రబాబు అధికారంలోకి రావడానికి రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. బాబు మాటలు నమ్మి రైతులు ఓటేస్తే అధికారంలోకి వచ్చాక మోసం చేశాడు. ముష్టి వేసినట్లు రూ.15 వేల కోట్లు విదిల్చి చేతులు దులుపుకున్నారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం వేలం వేసేట్టుగా చేశాడు. అప్పటిదాకా ఇస్తున్న సున్నా వడ్డీ పథకాన్ని సైతం నీరుగార్చారు. మిమ్మల్ని మా గుండెల్లో దాచుకుంటాం గతంలో చంద్రబాబు రుణమాఫీ చేస్తానని మధ్యలో చేతులెత్తేశాడు. దాంతో అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అందరి కష్టాలను కళ్లారా చూసిన మీరు (సీఎం వైఎస్ జగన్).. తండ్రిని మించిన తనయుడిగా ప్రజలను ఆదుకుంటున్నారు. రైతులకు అన్ని విధాలా అండగా నిలిచారు. నేను రైతు భరోసా, సున్నా వడ్డీ, ఉచిత పంటల బీమా ద్వారా లబ్ధి పొందాను. ఆర్బీకేల వల్ల ఎంతో మేలు జరుగుతోంది. కనీస మద్దతు ధర ఆదుకుంటోంది. పొలంబడి ద్వారా కొత్త విషయాలు తెలుస్తున్నాయి. వ్యవసాయాన్ని పండుగగా మార్చారు. మొత్తంగా మీ పథకాల వల్ల మా కుటుంబానికి రూ.2,52,000 లబ్ధి జరిగింది. మీ వల్ల మారుమూల ప్రాంతంలోని పేద విద్యార్థి ఐక్యరాజ్యసమితిలో కూర్చోగలిగాడు. మిమ్మల్ని మా గుండెల్లో పదిలంగా దాచుకుంటాం. – రమేష్, రైతు, గాజులపల్లి, అమడగూరు మండలం రాక్షస పాలనలోని చీకట్లను చీల్చిన నేత జగన్ రాష్ట్రంలో రాక్షస పాలనలో అలుముకున్న చీకట్లను చీల్చుకుంటూ అధికారం చేపట్టిన నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి. రైతుల కోసం దివంగత వైఎస్సార్ ఉచిత విద్యుత్ పేరుతో ఒక అడుగు వేస్తే.. ఆయన తనయుడు వైఎస్ జగన్ రైతు భరోసా, పరిహారం, ఆర్బీకే ఇలా.. ఎన్నో అడుగులు ముందుకేసి అండగా నిలిచాడు. ఇది రైతు ప్రభుత్వం అని నిరూపించారు. గత టీడీపీ ప్రభుత్వంలో రెయిన్గన్ల పేరుతో రూ.450 కోట్లు దోచేశారు. చంద్రబాబు ఏనాడూ రైతు సమస్యల గురించి పట్టించుకోలేదు. ఏం చేశారో చెప్పుకోలేక స్థానిక టీడీపీ మాజీ ఎమ్మెల్యే (పల్లె రఘునాథరెడ్డి) కులం పేరుతో రెచ్చగొట్టి రాజకీయం చేస్తుండటం దౌర్భాగ్యం. – దుద్దుకుంట శ్రీధర్రెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే సమగ్ర భూసర్వే ద్వారా కొత్త చరిత్ర ► వంద సంవత్సరాల క్రితం భూముల సర్వే జరిగింది. భూ రికార్డులు సరిగా లేక వివాదాలు వస్తున్నాయి. ఎన్ని సమస్యలు వచ్చినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో విప్లవాత్మకంగా సమగ్ర భూసర్వే చేపట్టాం. తద్వారా భూముల రికార్డులు అప్డేట్ చేస్తున్నాం. భూ వివాదాలకు శాశ్వతంగా స్వస్తి పలుకుతూ రైతన్నకు మంచి చేస్తున్నాం. ► రాష్ట్రంలో గతంలో ఎవరూ ఎప్పుడూ చేయని రీతిలో 19.31 లక్షల కుటుంబాలకు మేలు చేస్తూ 20 సంవత్సరాలకు పైగా అసైన్డ్ భూములున్న వారికి హక్కులు కల్పిస్తున్నాం. 22ఏలో ఇరుక్కున్న చుక్కల భూములకు విముక్తి కల్పించాం. సర్వీస్ ఈనాం పట్టాలు ఉన్న కుల వృత్తుల రైతులకు సంబంధించి ఏకంగా 34.89 లక్షల ఎకరాలకు పూర్తి హక్కులతో యాజమాన్య హక్కులు కల్పిస్తున్న ఘనత ఈ ప్రభుత్వానిదే. ► గతంలో చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పండిన ఆహార ధాన్యాలు సగటున ఏటా 154 లక్షల టన్నులు. ఈ ప్రభుత్వ హయాంలో అది 166 లక్షల టన్నులకు పెరిగింది. మనసున్న మారాజు సీఎం జగన్ ముఖ్యమంత్రికి తమ కష్టాలు చెప్పుకున్న వ్యాధిగ్రస్తులు ఏడుగురికి రూ.5.5 లక్షల తక్షణ సాయం గంటల వ్యవధిలో చెక్కులు అందజేసిన కలెక్టర్ మెరుగైన వైద్యం కోసం చర్యలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మనసున్న మహారాజు అని మరోమారు చాటుకున్నారు. వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ నిధుల విడుదల కోసం మంగళవారం పుట్టపర్తికి విచ్చేసిన ఆయన్ను తిరుగు ప్రయాణంలో విమానాశ్రయం వద్ద పలువురు వ్యాధిగ్రస్తులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారందరి కష్టాన్ని ఓపికగా విని.. తక్షణమే పరిష్కారం చూపాలని కలెక్టర్ పి.అరుణ్బాబును ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్ కొద్ది గంటల వ్యవధిలోనే వివిధ వ్యాధులతో బాధ పడుతున్న ఏడుగురికి తక్షణ సాయంగా రూ.5.5 లక్షలు చెక్కుల రూపంలో అందజేశారు. మెరుగైన వైద్యం కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు. –పుట్టపర్తి అర్బన్ (శ్రీసత్యసాయి జిల్లా) -
పుట్టపర్తి: వైఎస్సార్ రైతు భరోసా సీఎం జగన్ బహిరంగ సభ (ఫొటోలు)
-
సీఎం జగన్ సభకు జన సునామి
-
చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నా ఎందుకు మీ బిడ్డ జగన్లా సంక్షేమం అందించలేదు: సీఎం జగన్
-
రైతులు ఇబ్బందుల పడకూడదనే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా నిధులు ఇస్తోంది: సీఎం జగన్
-
ఈ రైతన్న మాటలకు సీఎం జగన్ ఫిదా
-
చంద్రబాబు, ఎల్లో మీడియాకు సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, పుట్టపర్తి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టపర్తిలో ఐదో ఏడాది రెండో విడతలో వైఎస్సార్ రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఎల్లో మీడియాకు సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. చంద్రబాబు ఏనాడూ ప్రజలు, పేదవాడి గురించి ఆలోచించలేదని విమర్శించారు. సభలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. ‘చంద్రబాబు హయంలో స్కాంలు తప్ప స్కీమ్లు గుర్తుకు రావు. బాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం, ఫైబర్ గ్రిడ్ స్కాం, మద్యం, ఇసుక దందా ఇలా అన్నీ స్కామ్లే. చంద్రబాబు ఏది ముట్టుకున్నా స్కాంలే. చంద్రబాబుకు దోచుకోవడం, దాచుకోవడమే తెలుసు. ఏపీని దోచుకునేందుకు చంద్రబాబు పదవి కావాలి. చంద్రబాబు పాలనలో ప్రజలు, పేదలు, వృద్ధులు, విద్యార్థుల గురించి ఆలోచించలేదు. బాబు పాలనలో స్కీముల గురించి కాదు.. స్కాముల గురించి పాలన జరిగింది. మీ బిడ్డకు అబద్ధాలు చెప్పడం రాదు. అందరికీ మంచి చేయడం మాత్రమే తెలుసు. మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అనేది మాత్రమే చూడండి. మీకు మంచి జరిగి ఉంటే మీరే సైనికులుగా నిలబడండి. గెలవడానికి ఒక దత్తపుత్రుడి సాయం, ఎల్లో మీడియా సపోర్టు అవసరం లేదు. గెలవడానికి పైన దేవుడు, మీ అందరి ఆశీస్సులే. మీ బిడ్డ నమ్ముకుంది మిమ్మల్ని మాత్రమే. నాకు మద్దతు ఇవ్వాలని దత్తపుత్రుడిని మీ బిడ్డ కోరడు. నాకు సపోర్ట్ చేయాలని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5ని మీ బిడ్డ ఏనాడూ కోరడు. మీ బిడ్డకు మీరు ఉన్నారు. మీ సపోర్టు ఉంది. రాబోయే రోజుల్లో మోసాలు, అబద్దాలు ఎక్కువగా ఉంటాయి.. వాటిని నమ్మకండి. బంగారం, కార్లు ఇస్తామంటారు.. అవన్నీ అబద్దాలే. మీ బిడ్డకు ఎల్లో మీడియా అండదండలు లేవు. మీరు మాత్రమే ఉన్నారు’ అంటూ కామెంట్స్ చేశారు. -
ప్రతీ విషయంలో అన్నదాతకు అండగా నిలబడ్డాం: సీఎం జగన్
సాక్షి, పుట్టపర్తి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సత్యసాయి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వరుసగా ఐదో ఏడాది రెండో విడతలో వైఎస్సార్ రైతు భరోసా నిధులను విడుదల చేశారు. పుట్టపర్తిలో బటన్ నొక్కి ఒక్కొక్కరికి రూ.4,000 చొప్పున 53.53 లక్షల మంది రైతన్నలకు రూ.2,204.77 కోట్ల రైతు భరోసా సాయం అందజేశారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘దేవుడి దయంతో మంచి కార్యక్రమం జరుగుతోంది. వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా రైతన్న ఖాతాల్లోకి డబ్బు జమ చేస్తున్నాం. రైతులు ఇబ్బందులు పడకూడదనే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా నిధులు ఇస్తోంది. పీఎం కిసాన్ నిధులు కూడా విడుదల చేయాలని కేంద్రాన్ని కోరాను. ఈనెలలోనే అవి కూడా వస్తాయి. ప్రతీ విషయంలో అన్నదాతలకు అండగా నిలబడ్డాం. మొత్తం రూ.33,209.81 కోట్లు సాయం అందించాం. 14 ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రైతులకు చేసిందేమీ లేదు. రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాలని గతంలో ఎప్పుడూ ఆలోచన చేయలేదు. రైతులకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబుకు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నాను. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను నాయకత్వంలోకి తీసుకొచ్చాం. నా నిరుపేద వర్గాలకు మంచి జరగాలనే అడుగులు వేశాం. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలున్న గిరిజన రైతున్నలకు రైతు భరోసా అందించాం. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా?. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా చూడాలి. సామాజిక సాధికార యాత్రకు విశేష స్పందన వస్తోంది. బాబు హయాంలో వ్యవసాయానికి ఏడు గంటల కరెంట్ కూడా ఇవ్వలేకపోయారు. మీ బిడ్డ ప్రభుత్వంలో పుష్కలంగా వర్షాలు పడ్డాయి. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా?. ఈ నాలుగేళ్లలో రూ.7800 కోట్ల బీమా అందించాం. ఈ క్రాప్ ద్వారా ప్రతీ రైతుకు మంచి జరిగేలా చేస్తున్నాం. ప్రతీ గ్రామంలో నేడు ఆర్బీకే కేంద్రాలు పనిచేస్తున్నాయి. గడచిన నాలుగేళ్ల కాలంలో రూ.60వేల కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేశాం. చంద్రబాబు హయాంలో వరుసగా ఐదేళ్లు కరువే. దేవుడి దయతో గత నాలుగేళ్లలో కరువు మాటేలేదు. మన ప్రభుత్వంలో పంట సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ అందిస్తున్నాం. సున్నా వడ్డీకి నిజమైన అర్థం చెప్తూ రైతన్నకి భరోసా కల్పిస్తున్నాం. గతంలో సున్నా వడ్డీ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం జరిగింది. చంద్రబాబు హయాంలో హెరిటేజ్ కంపెనీకి లాభాలు పెరిగాయి. రైతులకు ఎందుకు మంచి జరగలేదు’ అని ప్రశ్నించారు. -
పుట్టపర్తిలో వైఎస్సార్ రైతు భరోసా నిధుల విడుదల భారీ జనసందోహం (ఫొటోలు)
-
మమ్మల్ని తిట్టడమే మీ పని.. పుట్టపర్తి ఎమ్మెల్యే
-
వైఎస్ఆర్ రైతు భరోసా ముఖ్య ఉద్దేశం ఇదే!
-
సీఎం జగన్ రాకతో దద్దరిల్లిన పుట్టపర్తి సభ..
-
సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ
-
సీఎం జగన్ పాలన ఎంతో భరోసానిస్తోందంటున్న రైతులు
-
వైఎస్ఆర్ రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీకి రంగం సిద్ధం
-
మీకు మంచి జరిగి ఉంటే మీరే సైనికులుగా నిలబడండి: సీఎం జగన్
Updates 12:40PM, Nov 7, 2023 ►రైతు భరోసా నిధులను బటన్ నొక్కి విడుదల చేసిన సీఎం జగన్ 11:50AM, Nov 7, 2023 వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమంలో సీఎం జగన్ ప్రసంగంఅ ►అక్క చెల్లెమ్మల మంచి కోసం అమ్మ ఒడి, ఆసరా, చేయూత, సున్నావడ్డీ పథకాలు అందిస్తున్నాం ►అబద్ధాలు, మోసాలు చేసేందుకు పెద్దపెద్ద మాటలు చెబుతారు ►మోసాలు, అబద్ధాలను నమ్మకండి ►ఈ నాలుగేళ్లలో మీ ఇంట్లో మంచి జరిగింది.. లేదా మీరే చూడాలి ►గెలిచేందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 సపోర్టు అవసరం లేదు ►మీ బిడ్డకు ఎల్లో మీడియా అండదండలు లేవు ►మీ బిడ్డ నమ్ముకుంది మిమ్మల్నే ►మీకు మంచి జరిగి ఉంటే మీరే సైనికులుగా నిలబడండి ►ఒక్క రైతు భరోసా ద్వారానే రూ. 33వేల 210 కోట్లు అందించాం ►రైతులకు అండగా నిలిచేందుకుందుకు రూ. 1లక్ష 73 వేల కోట్లు ఖర్చు చేశాం ►చంద్రబాబుకు అధికారం తాను తన గజదొంగల ముఠా కోసమే ►పేదలు, అవ్వాతాతలు, నిరుద్యోగుల కోసం చంద్రబాబు ఆలోచన చేయడం లేదు ►చంద్రబాబుకు దోచుకోవడం, దాచుకోవడం తెలుసు ►చంద్రబాబు పేరు చెబితే స్కామ్లే గుర్తుకొస్తాయి ►రాష్ట్రాన్ని దోచుకునేందుకు చంద్రబాబుకు అధికారం కావాలి ►బాబు హయాంలో ఫైబర్ గ్రిడ్, ఇన్నర్రింగ్ రోడ్డు, స్కిల్ డెవలప్మెంట్ ఇలా అన్నీ చంద్రబాబు హయాంలో స్కామ్లే ►మన ప్రభుత్వంలో ఇప్పటికే రూ. 2 లక్షల 42 వేల కోట్లు అక్క చెల్లెమ్మలకు అందించాం ►చంద్రబాబు హయాంలో ఈ డబ్బంతా ఎవరి జేజుల్లోకి వెళ్లింది ►చంద్రబాబు హయాంలో మన పిల్లల చదువులు, బడులు ఎందుకు మారలేదు ►ఇంటి వద్దకే వైద్య సేవలు అందేలా ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్ కార్యక్రమాలు తీసుకొచ్చాం ►ఆరోగ్యశ్రీని పరిధిని 3,300 ప్రొసీజర్లకు పెంచాం ►ఏ పేదవాడు వైద్యానికి అప్పులు చేయకూడదన్నదే మా లక్ష్యం ►ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మల కోసం దిశయాప్ తీసుకొచ్చాం ►గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసులను ఏర్పాటు చేశాం ►అక్క చెల్లెమ్మల మంచి కోసం అమ్మ ఒడి, ఆసరా, చేయూత, సున్నావడ్డీ పథకాలు అందిస్తున్నాం ►ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలున్న గిరిజన రైతున్నలకు రైతు భరోసా అందించాం ►పంట సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ అందిస్తున్నాం ►గడిచిన నాలుగేళ్లలో రూ. 60 వేల కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేశాం ►సున్నా వడ్డీకి నిజమైన అర్థం చెబుతూ రైతన్నకి భరోసా కల్పిస్తున్నాం ►గతంలో సున్నా వడ్డీ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం జరిగింది ►చంద్రబాబు హయాంలో హెరిటేజ్ కంపెనీకి లాభాలు పెరిగాయి ►రైతులకు మంచి చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు ఎందుకు రాలేదు..? ►మీ బిడ్డ ప్రభుత్వంలో పుష్కలంగా వర్షాలు పడ్డాయి ►గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా..? ►బాబు ప్రభుత్వంలో వ్యవసాయానికి 7 గంటల కరెంట్ కూడా ఇవ్వలేకపోయారు ►మనసున్న ప్రభుత్వానికి మనసులేని ప్రభుత్వానికి తేడా గమనించండి ►ఈ-క్రాప్ ద్వారా ప్రతి రైతుకు మంచి జరిగేలా చేస్తున్నాం ►ప్రతి గ్రామం్లో నేడు ఆర్బీకే కేంద్రాలు పని చేస్తున్నాయి ►ఏటా రూ. 13, 500 రైతు భరోసా సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం ►రూ. 1700 కోట్లతో ఫీడర్ల సామర్థ్యం కూడా మన ప్రభుత్వంలోనే పెంచాం ►ఈ నాలుగేళ్లలో రూ, 7,800 కోట్ల బీమా అందించాం ►చంద్రబాబు హయాంలో వరుసగా ఐదేళ్లు కరువే ►దేవుడి దయతో గత నాలుగేళ్లుగా కరువు మాటేలేదు ►14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు రైతులకు చేసిందేమీ లేదు ►గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా చూడాలి ►ఎందుకు మీ బిడ్డ జగన్లా గత ప్రభుత్వం సంక్షేమం అందించలేకపోయింది? ►కేంద్రం పీఎం కిసాన్డబ్బులు కూడా ఈనెలలోనే వస్తాయి ►పీఎం కిసాన్ నిధులు కూడా విడుదల చేయాలని కేంద్రాన్ని కోరాను ►ప్రతి విషయంలో అన్నదాతలకు అండగా నిలబడ్డాం ►దేవుడి దయతో మంచి కార్యక్రమం జరుగుతుంది ►53 లక్షల 53 మంది రైతులకు పెట్టబడి సాయం ►రైతులకు రూ. 2,200 కోట్ల ఆర్థిక సాయం ►రైతులు ఇబ్బందులు పడకూడదనే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా నిధులు ఇస్తోంది ►సామాజిక సాధికారిత బస్సుయాత్రకు విశేష స్పందన లభిస్తోంది. 11:24AM, Nov 7, 2023 ►వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమం పాల్గొన్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుమ్మనూరు జయరాం, ఉషాశ్రీచరణ్, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, శంకర్ నారాయణ, అనంతవెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, డాక్టర్ సిద్ధారెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీలు మంగమ్మ, శివరామిరెడ్డి, జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ తదితరులు 11:21AM, Nov 7, 2023 ►ఐదో ఏడాది రెండో విడత రైతు భరోసా కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన సీఎం జగన్ 11:15AM, Nov 7, 2023 ►పుటపర్తి చేరుకున్న సీఎం జగన్ 10:54AM, Nov 7, 2023 ►కాసేపట్లో పుటపర్తికి సీఎం వైఎస్ జగన్ 9:17AM, Nov7, 2023 ►పుట్టపర్తి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ ►కాసేపట్లో వైఎస్సార్ రైతు భరోసా నిధులను విడుదల చేయనున్న సీఎం జగన్ ►వరుసగా ఐదో ఏడాది.. రెండో విడత వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం పంపిణీ చేయనున్న ఏపీ ప్రభుత్వం ►ఒక్కొక్కరికి రూ.4,000 చొప్పున 53.53 లక్షల మంది రైతన్నలకు రూ.2,204.77 కోట్ల రైతు భరోసా సాయం ►శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మంగళవారం బటన్ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహన్రెడ్డి రైతన్నలకు వెన్నుదన్నుగా సీఎం జగన్ వ్యవసాయం దండగ అనే గత పరిస్థితులను సమూలంగా మార్చి వ్యవసాయాన్ని పండుగ చేసి రైతన్నలకు అడుగడుగునా వెన్నుదన్నుగా నిలుస్తూ చెప్పిన దాని కన్నా ముందుగా, మాట ఇచ్చిన దానికన్నా మిన్నగా.. రైతన్నలకు సాయం అందిస్తున్నారు. మేనిఫెస్టోలో ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేల సాయం అందిస్తామన్న హామీకి మిన్నగా.. ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 చొప్పున అంటే మేనిఫెస్టోలో చెప్పిన దాని కంటే రైతన్నకు అదనంగా రూ.17,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఖరీఫ్ పంట వేసే ముందు మేలో రూ.7,500, అక్టోబర్–నవంబర్ నెల ముగిసే లోపే ఖరీఫ్ కోతలకు, రబీ అవసరాల కోసం రూ.4,000, పంట ఇంటికి వచ్చే వేళ జనవరి/ఫిబ్రవరిలో రూ.2 వేల చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులు, ఆర్వోఎఫ్ఆర్ (అటవీ), దేవదాయ భూ సాగుదారులకు భూ యజమానులతో సమానంగా రైతు భరోసా కింద ప్రభుత్వం రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది. తాజాగా జమచేస్తున్న రూ.2,204.77 కోట్లతో కలిపి వైఎస్సార్ రైతు భరోసా కింద ఒక్కో రైతు కుటుంబానికి రూ.65,500 చొప్పున ఈ నాలుగున్నరేళ్లలో రూ.33,209.81 కోట్ల పెట్టుబడి సాయం అందించింది. -
రైతన్నలకు జగనన్న ఆర్థిక సాయం..
-
రేపు రైతన్నలకు ‘రైతు భరోసా’
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో విడత పెట్టుబడి సాయం పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈ నెల 7వతేదీన శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేయనున్నారు. ఈ ఏడాది తొలి విడతలో రూ.7,500 చొప్పున 52.57 లక్షల మందికి రూ.3,942.95 కోట్ల మేర ఇప్పటికే పెట్టుబడి సాయాన్ని అందించగా తాజాగా రెండో విడతగా రూ.4 వేల చొప్పున 53.53 లక్షల మందికి రూ.2,204.77 కోట్ల లబ్ధి చేకూర్చనున్నారు. ఏటా పెరుగుతున్న లబ్ధిదారులు వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఇచ్చిన మాట కంటే మిన్నగా అర్హులైన రైతు కుటుంబాలకు ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. వెబ్ల్యాండ్ ఆధారంగా అర్హులైన భూ యజమానులతోపాటు దేవదాయ, అటవీ(ఆర్వోఎఫ్ఆర్) భూములను సాగు చేసేవారే కాకుండా సెంటు భూమి కూడా లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులకు కూడా తొలివిడతగా మే నెలలో రూ.7,500, రెండో విడతగా అక్టోబర్లో రూ.4 వేలు, మూడో విడతగా జనవరిలో రూ.2 వేలు చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు. 2019–20లో 46,69,375 మందికి రూ.6,173 కోట్ల మేర పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందచేసింది. 2020–21లో 51,59,045 మందికి రూ.6,928 కోట్లు మేర లబ్ధి చేకూర్చగా 2021–22లో 52,38,517 మందికి రూ.7,016.59 కోట్ల సాయాన్ని పంపిణీ చేసింది. 2022–23లో 51,40,943 మందికి రూ.6,944.50 కోట్ల పెట్టుబడి సాయాన్ని నేరుగా ఖాతాలకు జమ చేశారు. నాలుగున్నరేళ్లలో రూ.33,209.81 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడతలో 52,57,263 మంది అర్హత పొందారు. వీరిలో 50,19,187 మంది భూ యజమానులు కాగా 1,46,324 మంది కౌలుదారులు, 91,752 మంది అటవీ భూ సాగుదారులున్నారు. వీరికి ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున తొలి విడతగా జూన్ 1వ తేదీన భూ యజమానులకు, సెప్టెంబర్ 1న కౌలుదారులు, అటవీ సాగుదారులకు రూ.3,942.95 కోట్ల మేర సాయాన్ని అందించారు. రెండో విడతలో 53,52,905 మంది అర్హత పొందారు. వీరిలో భూ యజమానులు 51,00,065 మంది కాగా 1,59,674 మంది కౌలుదారులు, 93,168 మంది అటవీ భూ సాగుదారులు ఉన్నారు. తొలి విడతతో పోల్చుకుంటే 80,878 మంది భూ యజమానులు, 13,350 మంది కౌలుదారులు, 1416 మంది అటవీ భూ సాగుదారులు కలిపి మొత్తం 95,642 మంది కొత్తగా అర్హత పొందారు. వీరికి తొలి విడత సాయంతో కలిపి రూ.11,500 జమ చేయనున్నారు. అర్హత పొందిన 53.53 లక్షల మంది రైతు కుటుంబాలకు 7వ తేదీన రెండో విడతగా రూ.2,204.77 కోట్ల సాయాన్ని అందించనున్నారు. ఈ మొత్తంతో కలిపితే ఈ ఏడాది రూ.6,147.72 కోట్ల సాయాన్ని అందుకున్నట్లవుతుంది. తాజాగా జమ చేయనున్న రెండో విడత సాయంతో కలిపితే గత నాలుగున్నరేళ్లలో సగటున 53.53 లక్షల మందికి వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.33,209.81 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందచేసినట్లవుతుంది. రేపు పుట్టపర్తికి సీఎం జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పుట్టపర్తి చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొని వైఎస్సార్ రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తారు. అనంతరం మధ్యాహ్నం అక్కడి నుంచి బయలుదేరి తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. -
ఆర్బీకేల హేతుబద్ధీకరణ
సాక్షి, అమరావతి: విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అండగా నిలుస్తున్న వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను (ఆర్బీకేలను) వైఎస్ జగన్ ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం జనాభా ప్రాతిపదికన ఉన్న ఆర్బీకేలను పంటల విస్తీర్ణం ప్రాతిపదికన హేతుబద్దీకరణ (రేషనలైజేషన్)కు నిర్ణయించింది. అవసరానికి మించి ఉన్న మండలాల్లోని ఆర్బీకేల సిబ్బందిని తక్కువ ఉన్న మండలాలకు సర్దుబాటు చేయనుంది. అక్టోబర్ కల్లా సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేసి, ఖరీఫ్ సీజన్ పూర్తయిన తర్వాత నవంబర్లో తాజా పోస్టింగుల ఉత్తర్వులు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రజల గుమ్మం వద్దకు పౌర సేవలందించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి 2వేల జనాభాకు ఒక సచివాలయం ఏర్పాటు చేశారు. ఈ సచివాలయాలకు అనుబంధంగా రైతు సేవల కోసం ప్రత్యేకంగా 10,778 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పూర్వపు జిల్లా ప్రాతిపదికన జరిగిన నియామకాల ద్వారా వీటిలో 6,218 మంది వ్యవసాయ, 2,352 మంది ఉద్యాన, 374 మంది పట్టు సహాయకులతో పాటు 4,652 మంది పశుసంవర్ధక, 731 మంది మత్స్య సహాయకులు ఆర్బీకేల్లో సేవలందిస్తున్నారు. వీరికి అదనంగా 904 మంది వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవో), 1,396 మంది వ్యవసాయ మలీ్టపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ (ఎంపీఈవో), 77 మంది ఉద్యాన ఎంపీఈవోలు పని చేస్తున్నారు. ఆర్బీకేలను పంటల విస్తీర్ణం ప్రాతిపదికన కాకుండా జనాభా ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. ఒక్కో ఆర్బీకేకు స్థానికంగా సాగయ్యే పంటలనుబట్టి గ్రామ వ్యవసాయ, ఉద్యాన, పట్టు సహాయకులను ఇన్చార్జిలుగా నియమించారు. సిబ్బందిపై పనిఒత్తిడి తగ్గించడమే లక్ష్యం కొన్ని మండలాల్లో ఒక సచివాలయం పరిధిలో రెండు, అంతకు మించి ఆర్బీకేలు కూడా ఉన్నాయి. ఈ కారణంగా ఒకే మండలంలో కొన్ని ఆర్బీకేల పరిధిలో సాగు విస్తీర్ణం పదుల ఎకరాల్లో ఉంటే, కొన్నింటిలో వందల ఎకరాలు, మరికొన్నింటిలో 7 వేలు, 8 వేల ఎకరాల్లో ఉంది. విస్తీర్ణం ఎక్కువగా ఉన్న ఆర్బీకేల్లో సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది. సర్టీఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల పంపిణీ, పంటల వివరాలను ఈ క్రాప్ యాప్లో నమోదు చేయడం, పొలాలకు వెళ్లి ఫొటోలతో పాటు రైతుల ఈ కేవైసీ నమోదు చేయడం, వైపరీత్యాల వేళ నష్టపోయిన పంటల వివరాలను నమోదు చేయడం, పంట కోత ప్రయోగాలు, పంటల బీమా అమలు.. ఇలా రైతుల కోసం ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమంలో భాగస్వాములవ్వాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్బీకే వ్యవస్థలో హేతుబద్ధీకరణకు ప్రభుత్వం సంకల్పించింది. విస్తీర్ణం ప్రాతిపదికన సిబ్బంది సర్దుబాటు హేతుబద్ధీకరణలో భాగంగా పంటల విస్తీర్ణం ప్రాతిపదికన మండలం యూనిట్గా సిబ్బందిని సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏజెన్సీ ప్రాంతాల్లో 600 నుంచి 800 ఎకరాలకు, మైదాన ప్రాంతాల్లో 1000 నుంచి 1500 ఎకరాలకు ఒకరు చొప్పున సిబ్బంది ఉండేలా ఏర్పాటు చేస్తోంది. అవసరానికి మించి ఉన్న సిబ్బందిని ఇతర మండలాల్లో సర్దుబాటు చేస్తారు. స్థానికంగా సాగయ్యే ఉద్యాన, పట్టు పంటలను బట్టి వీఎస్ఏ, వీహెచ్ఎలకు తొలి ప్రాధాన్యతనిస్తారు. ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉన్న చోట ఉద్యాన ఎంపీఈవోలను సర్దుబాటు చేస్తారు. వ్యవసాయ పంటలు సాగు ఎక్కువగా ఉంటే ఏఈవో, వ్యవసాయ ఎంపీఈవోలను సర్దుబాటు చేస్తారు. అర్బన్ ప్రాంతాల్లో మాత్రం ఏఈవో, ఏంపీఈవోలను నియమిస్తారు. ఏఈవోలను జిల్లా పరిధిలో సర్దుబాటు చేస్తుండగా, ఎంపీఈవోలను అవసరాన్ని బట్టి ఇతర జిల్లాల పరిధిలో సర్దుబాటు చేసేలా వెసులుబాటు కల్పించారు. ఖరీఫ్ తర్వాతే రిపోర్టింగ్ ప్రస్తుతం ఖరీఫ్–2023 సీజన్ ఈ క్రాప్ బుకింగ్ జోరుగా సాగుతోంది. మరో వైపు కోతలు ప్రారంభమైన తర్వాత ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. ఖరీఫ్ సీజన్ పూర్తయిన తర్వాతే సర్దుబాటు చేసిన సిబ్బంది వారికి కేటాయించిన స్థానాల్లో రిపోర్టింగ్ చేయాలి. జిల్లాల పరిధిలో స్థానిక అవసరాలనుబట్టి సర్దుబాటు చేసుకునే వెసులుబాటు కల్పించారు. – చేవూరు హరికిరణ్, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ -
ఆపరేషన్కు రూ.33 లక్షలు.. సాయం చేసిన సీఎం జగన్ ప్రభుత్వం
కర్నూలు: మాట ఇచ్చారంటే..కచ్చితంగా చేస్తారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. యువకుడి శస్త్రచికిత్స కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ. 33 లక్షలు మంజూరు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం కుమారుడు క్షేమంగా ఇంటికి రావడంతో సీఎం పునర్జన్మ ప్రసాదించారని శనివారం పత్తికొండలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవిని కలిసి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. మద్దికెర గ్రామానికి చెందిన పూజారి చిదానంద, ఈరక్క సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు ఈరన్న (24) కూడా అదే వృత్తిలో ఉంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేవాడు. ఉన్నట్టుండి కడుపులో నొప్పి రావడంతో ఆసుపత్రిలో చూపించగా పేగు పాడైందని, మార్చాలని, ఇందుకు లక్షల రూపాయల ఖర్చు అవుతుందని డాక్టర్లు సూచించారు. పేదలు కావడంతో అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియక అల్లాడిపోయారు. జూన్ 1 వతేదీన పత్తికొండలో జరిగిన రైతు భరోసా కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రావడంతో ఎమ్మల్యే కంగాటి శ్రీదేవి, మద్దికెర జెడ్పీటీసీ సభ్యులు మురళీధర్ రెడ్డి, మార్కెట్యార్డు డైరెక్టర్ భద్రయ్య సహకారంతో సీఎంను కలిశారు. ఈరన్న ఆరోగ్య పరిస్థితి వివరించడంతో సీఎం వెంటనే జిల్లా కలెక్టర్, సంబంధిత ఆరోగ్య శాఖ అధికారులకు తెలియజేశారు. ఆపరేషన్కు రూ.33 లక్షలు ఖర్చు అవుతుందని అదికారులు చెప్పడంతో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో పేగు మర్పిడి ఆపరేషన్ పూర్తి చేసుకుని ఈరన్న ఆరోగ్యంగా ఇంటికి చేరుకున్నారు. -
మరింత మందికి రైతు భరోసా
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా సాయం అందని రైతు ఒక్కరు కూడా ఉండకూడదన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. అర్హత కలిగి ఇంకా పెట్టుబడి సాయం దక్కని భూ యజమానులను గుర్తించి, వారి వివరాలను నమోదు చేసేందుకు అవకాశం కల్పించింది. ఆర్బీకే సిబ్బంది ద్వారా రైతు భరోసా పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో అర్హులకు అక్టోబర్లో రెండు విడతల సాయం కలిపి పంపిణీ చేయనున్నారు. ఏటా మూడు విడతల్లో పెట్టుబడి సాయం 2023–24 వ్యవసాయ సీజన్కు సంబంధించి ఇటీవల పంపిణీ చేసిన తొలి విడత సాయంతో కలిపి ఈ నాలుగేళ్లలో ఇప్పటివరకు 52,57,263 రైతు కుటుంబాలకు రూ.31 వేల కోట్ల పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ఏటా తొలి విడత సాయం పంపిణీ సమయంలోనే రైతు భరోసా పోర్టల్ లాగిన్ను తెరుస్తుంటారు. ఆ సమయంలో చనిపోయిన వారి వివరాలను తొలగించడంతో పాటు ఆ ఏడాది అర్హత పొందిన భూ యజమానుల వివరాలను నమోదు చేసి పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఇలా తొలి ఏడాది (2019–20) 45,11,252 భూ యజమానులు అర్హత పొందగా.. ఆ తర్వాత వరుసగా 2020–21లో 50,04,874 మంది, 2021–22లో 50,66,241 మంది, 2022–23లో 49,26,041 మంది లబ్ధి పొందారు. 2023–24 వ్యవసాయ సీజన్లో 50,19,187 మంది భూ యజమానులు లబ్ధి పొందారు. ఏటా పెరుగుతున్న భూ యజమానులు ఇలా ఈ నాలుగేళ్లలో 5,07,935 మంది అదనంగా భూ యజమానులు అర్హత పొందారు. ఈ ఏడాది కూడా అన్ని అర్హతలు ఉండి ఈ పథకం కింద లబ్ధి పొందలేకపోయిన వారికి మరో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా భూములు కొనుగోలు చేసి పట్టాదార్ పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్స్ పొందిన వారు, తల్లిదండ్రులు మృతిచెందగా వారసత్వంగా భూములు పొందినవారు, అన్నదమ్ములు వాటాల కింద భూములు పంచుకున్న వారు, వివిధ రూపాల్లో మ్యుటేషన్ పొందిన వారు తమ వివరాలను రైతు భరోసా పోర్టల్లో నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఇప్పటివరకు లాక్ అయిన ఈ పోర్టల్ లాగిన్ను ఈ నెల 12నుంచి కొత్త రిజిస్ట్రేషన్స్ కోసం తెరిచారు. ఇంకా అర్హత ఉండి అవకాశం వినియోగించుకోని మిగిలిన రైతులతో పాటు కొత్తగా చేరిన రైతు కుటుంబాలు ఈ పథకంలో అర్హత సాధించటానికి ప్రస్తుతం భూ యజమాని రైతులకు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. నమోదు చేసుకున్న వారిలో అన్ని అర్హతలు కల్గిన భూ యజమానులకు అక్టోబర్లో రెండు విడతల సాయం అందించనున్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సంతృప్తికర స్థాయిలో అర్హత ఉన్న వారికి పెట్టుబడి సాయం అందించే సంకల్పంతో రైతు భరోసా పోర్టల్లో రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించాం. మ్యుటేషన్ చేయించుకున్న వారు, కొత్తగా భూములు కొనుగోలు చేసిన వారు, వారసత్వ హక్కులు పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. తమ పరిధిలోని ఆర్బీకే సిబ్బందిని సంప్రదించి వివరాలను నమోదు చేయించుకోవాలి. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
అభివృద్ధి అంటే పక్క రాష్ట్రాలతో పోలికా ?
-
రాజన్న రాజ్యంలో రైతే రారాజు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ వేసిన ప్రతీ అడుగు, చేసిన ప్రతీ ఆలోచన రైతుల కోసమే. రైతును రాజుగా చూడాలన్న కాంక్షతో అమలుచేసిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు వారి హృదయాలలో చెరగని ముద్రవేశాయి. ఉచిత విద్యుత్ ఫైల్పై తొలి సంతకంతో మొదలైన తన పాలనలో అడుగడుగునా రైతులకు తోడుగా నిలిచారు. రుణమాఫీతో రైతుకు వెన్నుదన్ను.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రుణమాఫీని అమలుచేయగా, దేశంలోనే అత్యధికంగా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 64లక్షల మంది రూ.11,100 కోట్ల లబ్ధిపొందారు. రుణమాఫీ దక్కని 36 లక్షల మంది రైతులకు “ప్రోత్సాహం కింద’ ఒకొక్కరికి రూ.5వేల చొప్పున రూ.1,800 కోట్లు అందించారు. పునరావాస ప్యాకేజీ కింద.. వ్యవసాయ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడిన భూ యజమానులు, కౌలుదారుల కుటుంబాలకు సైతం రూ.2లక్షల ఎక్స్గ్రేషియా అందించారు. అలాగే, ఉమ్మడి ఏపీలోని 23 డీసీసీబీల్లో 18 డీసీసీబీలు దివాళ తీసే స్థాయికి చేరుకోగా, వైద్యనాథన్ కమిటి సిఫార్సు మేరకు ఒక్క సంతకంతో రూ.1,800 కోట్ల సాయం అందించి సహకార రంగం పునరుజ్జీవానికి బాటలు వేశారు. ప్రపంచంలోనే తొలిసారి పావలా (3 శాతం) వడ్డీకే రుణాలకు శ్రీకారం చుట్టారు. కనీస మద్దతు కనీవినీ రీతిలో పెంపు.. 1999లో క్వింటాల్కు రూ.490 ఉన్న ధాన్యం కనీస మద్దతు ధర 2004లో టీడీపీ అధికారం కోల్పోయే నాటికి రూ.550కు చేరింది. ఐదేళ్లలో పెరిగిన ఎమ్మెస్పీ కేవలం రూ.60 (12.5%) మాత్రమే. అలాంటిది 2004–09 మధ్య రూ.550 నుంచి రూ.1,000కు అంటే అక్షరాల రూ.450 (78.5%) పెరిగిందంటే అది ఆ మహానేత కృషి ఫలితమే. ధాన్యంతో పాటు ఇతర పంటల మద్దతు ధరను భారీగా పెంచగలిగారు. తండ్రి బాటలో తనయుడు రైతుల కోసం ఆ మహానేత ఒక అడుగు వేస్తే.. నేను రెండడుగులు ముందుకేస్తానంటూ అధికారంలోకి వచ్చింది మొదలు నాలుగేళ్లుగా రైతు సంక్షేమం కోసమే సీఎం జగన్ అహరహం శ్రమిస్తున్నారు. మహానేత జయంతిని ఏటా రైతు దినోత్సవంగా రైతుల మధ్యలో జరుపుకుంటున్నారు. విత్తు నుంచి విక్రయం వరకు గ్రామస్థాయిలో రైతులను చేయిపట్టి నడిపించేలా ఆర్బీకేలు తీసుకొచ్చారు. సహకార రంగ బలోపేతానికి రూ.295 కోట్ల మూలధనంగా సమకూర్చారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు చెల్లించే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచారు. ఇక సంక్షేమ పరంగా చూస్తే.. వైఎస్సార్ రైతుభరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఇలా రైతు సంక్షేమం కోసం గతంలో ఎన్నడూలేని విధంగా ఈ నాలుగేళ్లలో జగన్ ప్రభుత్వం అక్షరాల రూ.1,70,769.23 కోట్ల లబ్ధిని చేకూర్చింది. -
1న కౌలు రైతులకు ‘వైఎస్సార్ రైతు భరోసా’
సాక్షి, అమరావతి: దేశంలోనే తొలిసారిగా కౌలు రైతులతో పాటు దేవదాయ, అటవీ భూములను సాగు చేస్తున్న వాస్తవ సాగుదారులకు కూడా వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని వర్తింపచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 2023–24 సీజన్కు సంబంధించి తొలి విడత పెట్టుబడి సాయాన్ని సెప్టెంబర్ 1న అందించనుంది. నేడు(గురువారం) జరగాల్సిన కార్యక్రమం వాయిదా పడిన సంగతి తెలిసిందే. పంట హక్కు సాగు పత్రాలు పొందిన వారిలో అర్హులైన 1,46,324 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులు, దేవదాయ భూములను సాగు చేస్తున్న రైతులకు ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున రూ.109.74 కోట్లు సాయం పంపిణీ చేయనున్నారు. రేపు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి రైతుల ఖాతాలకు నేరుగా సాయాన్ని జమ చేస్తారు. ఏటా మూడు దఫాల్లో.. రాష్ట్రంలో భూ యజమానులకు వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే. మే నెలలో రూ.7,500, అక్టోబర్లో రూ.4 వేలు, జనవరిలో రూ.2 వేలు చొప్పున మూడు విడతల్లో ఈ సాయాన్ని జమ చేస్తోŠంది. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతుల కుటుంబాలతో పాటు దేవదాయ, అటవీ భూమి సాగుదారులకు కూడా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే అందచేస్తోంది. ఐదో ఏడాది తొలి విడతగా తాజాగా అందచేస్తున్న సాయంతో కూడా కలిపితే ఇప్పటివరకు 5,38,227 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులు, 3,99,321 మంది అటవీ భూమి సాగుదారులకు (ఆర్వోఎఫ్ఆర్ పట్టాదారులు) మొత్తం రూ.1,122.85 కోట్ల పెట్టుబడి సాయం అందించినట్లు కానుంది. ఇక మొత్తంగా అందరికీ కలిపి ఇప్పటి వరకు పథకం ద్వారా 52.57 లక్షల రైతు కుటుంబాలకు రూ.31,005.04 కోట్ల మేర పెట్టుబడి సాయాన్ని అందించినట్లవుతోంది. -
YSR Rythu Bharosa: కౌలు రైతులకు రైతు భరోసా.. నిధులు జమ చేయనున్న సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(గురువారం) కౌలు రైతులకు రైతు భరోసా అందించనున్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ బటన్ నొక్కి నగదు జమ చేయనున్నారు. వివరాల ప్రకారం.. సీఎం జగన్ ఏపీలోని కౌలు రైతులకు రైతు భరోసా అందించనున్నారు. అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా నగదును సీఎం జగన్ జమ చేయనున్నారు. కౌలు రైతులతో పాటుగా దేవాదాయ భూమి సాగుదారులకు కూడా సాయం అందనుంది. క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. కౌలు రైతులకు కౌలు కార్డులు.. ఇదిలా ఉండగా.. ఏపీలో కౌలు రైతులకు పెద్దఎత్తున కౌలు కార్డులు జారీ చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సీసీఆర్సీ (క్రాప్ కల్టివేషన్ రైట్స్ కార్డ్స్) మేళాలు నిర్వహిస్తోంది. ఆర్బీకే స్థాయిలో మేళాలు నిర్వహించేలా వ్యవసాయ, రెవెన్యూ శాఖలు చర్యలు చేపట్టాయి. కౌలు రైతులకు నూరు శాతం పంట రుణాలు ఇవ్వాలన్న సంకల్పంతో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్ల)ను ప్రభుత్వం ఇప్పటికే ఆర్బీకేలతో అనుసంధానించింది. ప్రతి కౌలు రైతుకు రుణంతోపాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలన్న భావనతో కౌలుదారులందరికీ పంట సాగు హక్కు పత్రాలు (కౌలు కార్డులు) జారీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఇది కూడా చదవండి: రాష్ట్రానికి రక్ష జగనన్న.. సీఎం జగన్పై ప్రేమను చాటుకున్న విద్యార్థులు -
రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని విధాలా సహాయ సహకారాలు
-
జోరందుకున్న ఖరీఫ్
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్కు ముందుగానే సాగునీరు విడుదల చేయడంతో పాటు ముందే వైఎస్సార్ రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించింది. ఖరీఫ్–2022లో దెబ్బతిన్న పంటలకు బీమా పరిహారం అందించడంతో పాటు ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు సరఫరా చేశారు. అవసరమైనన్ని ఎరువులు, పురుగు మందుల నిల్వల్ని అందుబాటులో ఉంచారు. కానీ.. జూన్లో రుతు పవనాలు మొహం చాటేయడంతో రైతులు ఒకింత కలవరపాటుకు గురయ్యారు. దీంతో ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక సిద్ధం చేయగా.. పది రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రైతులంతా జోరు పెంచి సార్వా సాగుకు శ్రీకారం చుట్టారు. సాగుకు ముందే రూ.5,040.43 కోట్ల సాయం సీజన్కు ముందుగానే వైఎస్సార్ రైతు భరోసా కింద 52.31 లక్షల మంది రైతులకు తొలి విడతగా రూ.7,500 చొప్పున రూ.3,923.22 కోట్ల పెట్టుబడి సాయంతో పాటు ఖరీఫ్–2022లో పంటలు దెబ్బతిన్న 10.20 లక్షల మందికి రూ.1,117.21 కోట్ల బీమా పరిహారాన్ని అందించారు. ఆర్బీకేల ద్వారా 5.73 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలు సిద్ధం చేయగా.. ఇప్పటికే 5.15 లక్షల టన్నులను రైతులకు పంపిణీ చేశారు. ఇందులో ప్రధానంగా 1.52 లక్షల టన్నుల వరి, 2.91 లక్షల టన్నుల వేరుశనగ, 39 వేల టన్నుల పచ్చిరొట్ట విత్తనాలు అందించారు. నాన్ సబ్సిడీ విత్తనాలకు సంబంధించి పత్తి 14.15 క్వింటాళ్లు, మిరప 60 కేజీలు, సోయాబీన్ 137 క్వింటాళ్లను రైతులకు విక్రయించారు. సీజన్కు 17.44 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా.. 14.75 లక్షల టన్నులు అందుబాటులో ఉంచారు. ఇందులో ఇప్పటికే 4.59 లక్షల టన్నులు విక్రయించారు. ఆర్బీకేల ద్వారా 5.60 లక్షల టన్నుల సరఫరా లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు 1.59 లక్షల టన్నులు నిల్వ చేశారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆర్బీకేల్లో అవసరమైన పురుగుల మందులను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. 23 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు ఖరీఫ్ సాగు లక్ష్యం 89.37 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 23 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. 39.70 లక్షల ఎకరాల్లో వరి సాగు లక్ష్యం కాగా.. ఇప్పటివరకు 9.62 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. ఇతర పంటల విషయానికొస్తే 5.12 లక్షల ఎకరాల్లో పత్తి, 4 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 4.6 లక్షల ఎకరాల్లో అపరాలు, 1.35 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, పంటలు వేశారు. 9 ఎకరాల్లో వరి వేశా 9 ఎకరాల్లో స్వర్ణ రకం వరి సాగు చేస్తున్నా. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ముదురు దశకు చేరుకున్న పంటకు మేలు చేస్తాయి. మా గ్రామంలో పంట బాగానే ఉంది. కాస్త ఆలస్యంగా నాట్లు వేసిన వారికి కొంత ఇబ్బందిగా ఉంటుంది. వర్షాలు రెండ్రోజులు తెరిపిస్తే నీరు కిందకు దిగిపోతే నాట్లకు ఇబ్బంది ఉండదు. – కె.శ్రీనివాసరెడ్డి, పసలపూడి, అంబేడ్కర్ కోనసీమ జిల్లా స్వల్పకాలిక రకాలే మేలు ఈ వర్షాలతో పత్తి, ఆముదం, కంది వంటి పంటలకు ఇబ్బంది ఉండదు. ఇప్పటివరకు నారుమడులు వేయకపోతే మాత్రం బీపీటీ–5204, ఎన్ఎల్ఆర్–34449, ఎంటీయూ–1153, ఎంటీయూ–1156, ఎంటీయూ–1010, ఐఆర్–64 వంటి స్వల్పకాలిక రకాలను సాగు చేసుకుంటే మేలు. ఉత్తరకోస్తా, కృష్ణాడెల్టాలో వెద పద్ధతిలో సాగు చేసే రైతులు పడిపోని రకాలను ఎంపిక చేసుకోవాలి. – టి.శ్రీనివాస్, ప్రధాన శాస్త్రవేత్త, వరి పరిశోధనా కేంద్రం, మార్టేరు ఈ సూచనలు పాటిస్తే మేలు విత్తిన 15 రోజుల్లోపు నారుమడులు, వెదజల్లిన పొలాలు 3 రోజుల కంటే ఎక్కువ నీట మునిగి ఉంటే మొలక శాతం దెబ్బతినకుండా నీరు తీయగలిగితే ఇబ్బంది ఉండదు. ఒకవేళ మొలక దెబ్బతింటే మాత్రం మళ్లీ నారు ఊడ్చుకోవచ్చు లేదా స్వల్పకాలిక రకాలు సాగు చేసుకోవచ్చు. విత్తిన 15–30 రోజులలోపు ఉన్న పొలాలు 5 రోజుల కంటే ఎక్కువ నీట మునిగితే.. నీరు పూర్తిగా తీసివేసి 5 సెంట్ల నారుమడికి ఒక కిలో యూరియా, ఒక కిలో ఎంవోపీ బూస్టర్ డోస్గా వేసుకుంటే వారం రోజుల్లో కొత్త ఆకు చిగురిస్తుంది. నారుమడి కుళ్లకుండా లీటరు నీటికి ఒక గ్రాము చొప్పున కార్బన్డిజమ్ మందును పిచికారీ చేసుకోవాలి. – ఎం.గిరిజారాణి, ప్రిన్సిపల్ సైంటిస్ట్, వరి పరిశోధనా కేంద్రం, మచిలీపట్నం -
అన్నదాతకు ప్రతి అడుగులో అండగా ఏపీ ప్రభుత్వం
-
ఏపీలో ధాన్యం ఉత్పత్తి వ్యయం తక్కువే
సాక్షి, అమరావతి: ధాన్యం ఉత్పత్తి వ్యయం పంజాబ్ తరువాత ఆంధ్రప్రదేశ్లోనే తక్కువగా ఉంది. దేశ సగటుతో పోల్చినా రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి వ్యయం తక్కువగానే ఉంది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల్లో వెల్లడించింది. పంజాబ్లో క్వింటాల్ ధాన్యం ఉత్పత్తి వ్యయం రూ.808 ఉండగా.. ఆంధ్రప్రదేశ్లో రూ.1,061గా నమోదైంది. దేశంలో క్వింటాల్ ధాన్యం ఉత్పత్తి సగటు వ్యయం రూ.1,360 ఉన్నట్టు తెలిపింది. వ్యవసాయ భూమి లీజుతోపాటు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీలు, కుటుంబ సభ్యుల శ్రమ, పశువుల శ్రమ, ఇరిగేషన్ చార్జీలు, పెట్టుబడి వ్యయం, వడ్డీలను కలిపి రాష్ట్రాల వారీగా 2022–23లో ధాన్యం క్వింటాల్ ఉత్పత్తి వ్యయాన్ని వెల్లడించింది. ప్రభుత్వ చర్యలే కారణం రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలోనే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి సేద్యానికి అవసరమైన అన్నిరకాల ఇన్పుట్స్ను రైతులకు అందుబాటులోకి తెచ్చింది. సబ్సిడీపై విత్తనాలను అందించడంతో పాటు వైఎస్సార్ రైతు భరోసా కింద వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందిస్తోంది. వైఎస్సార్ ఉచిత పంటల బీమా అమలు చేయడంతోపాటు ప్రకృతి వైపరీత్యాలకు పంటలు దెబ్బతింటే ఆ సీజన్ దాటకుండానే ఇన్పుట్ సబ్సిడీ అందిస్తోంది. కూలీలకు బదులుగా వ్యవసాయ పరికరాలను వినియోగించడాన్ని ప్రోత్సహించడంతో సేద్యం వ్యయం తగ్గుతోంది. వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాల ద్వారా 50 సబ్సిడీతో వ్యవసాయ పరికరాలను అందిస్తోంది. యంత్ర పరికరాల వినియోగం కారణంగా ఉత్పత్తి వ్యయం తగ్గుతోంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తుండటం, మెరుగైన వ్యవసాయ పద్ధతుల కారణంగా ధాన్యం ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంటోంది. దేశంలో ఎక్కువగా ధాన్యం పండించే రాష్ట్రాల్లో పంజాబ్, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉండగా మహారాష్ట్రలో క్వింటాల్ ధాన్యం ఉత్పత్తి వ్యయం అత్యధికంగా ఉంది. ఆ తరువాత పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడుల్లో ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉంది. వరి పండించే రాష్ట్రాల్లో పంజాబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే క్వింటాల్ ధాన్యం ఉత్పత్తి వ్యయం మిగతా రాష్ట్రాల కన్నా తక్కువగా ఉంది. -
కౌలు రైతులకు చకచకా కార్డుల పంపిణీ
సాక్షి, అమరావతి: కౌలు రైతులకు పెద్దఎత్తున కౌలు కార్డులు జారీ చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సీసీఆర్సీ (క్రాప్ కల్టివేషన్ రైట్స్ కార్డ్స్) మేళాలు నిర్వహిస్తోంది. ఆర్బీకే స్థాయిలో మేళాలు నిర్వహించేలా వ్యవసాయ, రెవెన్యూ శాఖలు చర్యలు చేపట్టాయి. కౌలు రైతులకు నూరు శాతం పంట రుణాలు ఇవ్వాలన్న సంకల్పంతో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్ల)ను ప్రభుత్వం ఇప్పటికే ఆర్బీకేలతో అనుసంధానించింది. ప్రతి కౌలు రైతుకు రుణంతోపాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలన్న భావనతో కౌలుదారులందరికీ పంట సాగు హక్కు పత్రాలు (కౌలు కార్డులు) జారీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఈ ఏడాది ఇప్పటికే 1.10 లక్షల మంది కౌలు రైతులకు కౌలు కార్డులను అధికారులు జారీ చేశారు. మిగిలిన వారికి జారీ చేసే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారుల వివరాలను రైతు భరోసా పోర్టల్లో అప్లోడ్ చేసి ఆగస్టు లేదా సెప్టెంబర్లో వైఎస్సార్ రైతు భరోసా కింద ఈ ఏడాది తొలివిడత సాయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రక్షణ కవచం సీసీఆర్సీ చట్టం రాష్ట్రంలో 76.21 లక్షల మంది రైతులు ఉండగా.. వీరిలో కౌలు రైతులు ఎంతమంది ఉన్నారనే దానిపై వేర్వేరు అంచనాలు ఉన్నాయి. గతంలో కౌలుదారులు రుణాలు, ప్రభుత్వ సంక్షేమ ఫలాల కోసం నానాఅగచాట్లు పడేవారు. వీరికి ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.1.60 లక్షల వరకు పంట రుణం అందించే అవకాశం ఉన్నా.. బ్యాంకులు నిబంధనల పేరుతో మొండిచేయి చూపేవి. ఈ నేపథ్యంలో కౌలుదారులకు మేలు చేయాలన్న సంకల్పంతో 2019లో తెచ్చిన పంట సాగుదారుల హక్కు పత్రాల (సీసీఆర్సీ) చట్టంతో 11 నెలల కాల పరిమితితో ప్రభుత్వమే కౌలు కార్డులు జారీ చేస్తోంది. వీటిద్వారా కౌలు రైతులకు నాలుగేళ్లుగా పంట రుణాలతో పాటు వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ, పంటల బీమా, పంట నష్టపరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) వంటి సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు. వీరు పండించిన పంటలను ఈ క్రాప్ ఆధారంగా ఆర్బీకేల ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నారు. నూరు శాతం కౌలు కార్డుల జారీ లక్ష్యం సీసీఆర్సీ మేళాలకు మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే 1.10 లక్షల మందికి కౌలు కార్డులు జారీ చేశాం. భూ యజమానులు సహకరిస్తే మరింత మందికి మేలుచేసే అవకాశం ఉంటుంది. సీసీఆర్సీ కార్డుల ఆధారంగా పంట రుణాలతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందచేస్తాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
CM YS Jagan: రైతు రాజ్యమిది
రైతుభరోసా నాలుగు విడతలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పినా రైతన్నలు అప్పుల పాలు కాకూడదనే ఉద్దేశంతో అదనంగా ఐదో విడత కూడా ఇస్తున్నాం. పంట నష్టపోతే వెంటనే ఇన్పుట్ సబ్సిడీ చెల్లించేలా మార్పులు తెచ్చాం. అదే సీజన్ ముగిసేలోగా పరిహారం చెల్లించి ఆదుకుంటున్నాం. రైతన్నలు బాగుండాలని మీబిడ్డ రాజీ పడకుండా పని చేస్తున్నాడు. రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల దిగుబడులు పెరిగాయి. నిషేధిత జాబితాలోని చుక్కల భూములకు మోక్షం కల్పించాం. రైతుల పాలిట శత్రువు, వ్యవసాయం అంటే గిట్టని చంద్రబాబు మాయ మాటలతో మళ్లీ మోసం చేసేందుకు వస్తున్నాడు. మీరంతా జాగ్రత్తగా ఉండాలని, మంచి – చెడుకు తేడాను ఆలోచించాలని కోరుతున్నా. – పత్తికొండ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి కర్నూలు: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని దృఢంగా విశ్వసిస్తూ అన్నదాతలకు నాలుగేళ్లలో రూ.1.61 లక్షల కోట్లకుపైగా నేరుగా ప్రయోజనం చేకూర్చినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. గురువారం కర్నూలు జిల్లా పత్తికొండలో ‘వైఎస్సార్ రైతు భరోసా’ ద్వారా 52,30,939 మంది రైతుల ఖాతాల్లో రూ.3,923 కోట్లను బటన్ నొక్కి జమ చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాంతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. కర్నూలు జిల్లా పత్తికొండలో జరిగిన సభకు భారీగా హాజరైన జనసందోహంలో ఓ భాగం చెప్పిన దానికి కంటే మిన్నగా.. ‘మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన ప్రతీ మాటను మీబిడ్డ ప్రభుత్వం నిలబెట్టుకుంది. వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ యోజన కింద ఐదో ఏడాది తొలి విడత సాయాన్ని విడుదల చేస్తున్నాం. ప్రతీ రైతుకు మంచి జరగాలనే తాపత్రయంతో ఏటా రూ.12,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని మేనిఫెస్టోలో చెప్పాం. చెప్పిన దానికి కంటే మిన్నగా రూ.13,500 చొప్పున ఇస్తున్నాం. మేనిఫెస్టోలో నాలుగేళ్లు మాత్రమే అని చెప్పినా రైతన్నలు ఇబ్బందులు పడకూడదని ఐదో ఏడాది కూడా ఇస్తున్నాం. మొత్తంగా రూ.67,500 ఇస్తున్నాం. మీ బిడ్డ ప్రభుత్వం చెప్పిన దాని కంటే రూ.17,500 ఎక్కువ ఇస్తోంది. ఇప్పటికే 50 లక్షల పైచిలుకు రైతులకు రూ.54 వేలు చొప్పున వైఎస్సార్ రైతు భరోసా డబ్బులు అందించాం. ఈదఫా ఇస్తున్న రూ.7,500 కలిపితే రూ.61,500 నేరుగా రైతన్నల ఖాతాల్లో చేరినట్లవుతుంది. ప్రతీ రైతన్న ఖాతాల్లోకి రూ.5,500 వెళ్తాయి. మిగిలిన రూ.2 వేలు పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా జమ అవుతుంది. వారు ఇచ్చేది ఆలస్యమైనా రైతన్నలు ఇబ్బంది పడకూడదని ఈరోజే బటన్ నొక్కి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులను ఇచ్చేస్తున్నాం. ఈరోజు వరకూ మీ బిడ్డ ప్రభుత్వం ఒక్క రైతుభరోసా ద్వారా రైతన్నల ఖాతాల్లో జమ చేసిన సొమ్ము అక్షరాలా రూ.31 వేల కోట్లు. ఇన్పుట్ సబ్సిడీగా మరో రూ.54 కోట్లు రైతు భరోసాతో పాటు ఇవాళ ఇంకో మంచి కార్యక్రమం జరుగుతోంది. ఇన్పుట్ సబ్సిడీ విషయంలో మీబిడ్డ ప్రభుత్వం ఇప్పటికే ఒక విప్లవాత్మక మార్పు తెచ్చింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఏ సీజన్లో జరిగిన నష్టానికి అదే సీజన్లోనే పరిహారాన్ని చెల్లిస్తున్నాం. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన 51 వేల మంది రైతన్నల ఖాతాల్లోకి నేరుగా మరో రూ.54 కోట్లు ఇన్పుట్ సబ్సిడీగా ఈరోజే జమ చేస్తున్నాం. గత నాలుగేళ్లుగా 22,77,000 మంది రైతన్నలకు ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లో ఆదుకుంటూ రూ.1,965 కోట్లు నేరుగా ఖాతాల్లో జమ చేశాం. వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు దండిగా దిగుబడులు.. చంద్రబాబు హయాంలో ఆర్బీకేలు, ఈ–క్రాప్, సోషల్ ఆడిట్ ఊసే లేదు. 10,778 ఆర్బీకేలను నెలకొల్పి రైతన్నలకు నిరంతరం తోడుగా ఉంటున్నాం. 2014–19లో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఏటా 153 లక్షల టన్నులు కాగా మన ప్రభుత్వంలో 2019–23 మధ్య ఏటా సగటున 165 లక్షల టన్నులకు చేరింది. ఉద్యాన పంటల దిగుబడి చంద్రబాబు హయాంలో ఏటా సగటున 228 లక్షల టన్నులు ఉండగా మన హయాంలో 332 లక్షల టన్నులకు పెరిగింది. బాబు హయాం మొత్తం కరువే చంద్రబాబు హయాంలో ఏ ఏడాది చూసినా కరువే కరువు. ఏటా కనీసం సగం మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించిన దుస్థితి. అప్పట్లో 1,623 కరువు మండలాలు ప్రకటించారు. ఇప్పుడు గత నాలుగేళ్లలో ఒక్కటంటే ఒక్క కరువు మండలం కూడా ప్రకటించాల్సిన పరిస్థితి రాలేదు. చంద్రబాబు పాలనలో సున్నా వడ్డీ కింద 40,60,000 మంది రైతన్నలకు రూ.685 కోట్లు విదల్చగా మీ బిడ్డ ప్రభుత్వం రూ.1,835 కోట్లు ఇచ్చింది. 74 లక్షల మంది రైతులకు సున్నా వడ్డీ ద్వారా మంచి చేయగలిగాం. చంద్రబాబు హయాంలోని సున్నా వడ్డీ పెండింగ్ బకాయిలను చిరునవ్వుతో ఇచ్చాం. ఇక చంద్రబాబు హయాంలో 30,85,000 మంది రైతులకు రూ.3,411 కోట్లు పంటల బీమా కింద ఇవ్వగా ఇప్పుడు నాలుగేళ్లలో వైఎస్సార్ ఉచిత పంటల బీమా ద్వారా 44 లక్షల మంది రైతులకు రూ.6,685 కోట్లు అందించాం. నిరుడు ఖరీఫ్కు సంబంధించిన ఇన్సూరెన్స్ను నాన్న జయంతి రోజైన జూలై 8వ తేదీన జమ చేస్తాం. రైతన్నల నుంచి ఒక్క రూపాయి కూడా బీమా ప్రీమియం తీసుకోకుండా పూర్తి బీమా తానే భరిస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం మనదే. ధాన్యం సేకరణ.. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో 2.65 కోట్ల టన్నుల ధాన్యం సేకరించగా మనందరి ప్రభుత్వం నాలుగేళ్లలోనే 3.09 కోట్ల టన్నుల ధాన్యం సేకరించింది. ఇంకా రబీలో సేకరణ జరుగుతోంది. మరో ఏడాది కూడా సేకరణ జరుగుతుంది. గతంలో సగటున ఏటా 53 లక్షల టన్నులు మాత్రమే సేకరిస్తున్న పరిస్థితి నుంచి ఈరోజు 75 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరుగుతోంది. గత ప్రభుత్వం ఐదేళ్లలో ధాన్యం సేకరణకు చేసిన వ్యయం రూ.40,237 కోట్లు. మీ బిడ్డ ప్రభుత్వం నాలుగేళ్లలోనే ఇప్పటికే రూ.60 వేల కోట్లు సేకరణకు వెచ్చించింది. ఇంకా రబీ పూర్తి కాలేదు. మరో ఏడాది కూడా ఉంది. ఈ ఏడాది కూడా కలిపితే కనీసం రూ.77 వేల కోట్లు అవుతుంది. ఎక్కడ రూ.40 వేలకోట్లు? ఎక్కడ రూ.77 వేల కోట్లు? తేడా గమనించాలని కోరుతున్నా. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.960 కోట్ల ధాన్యం సేకరణ బకాయిలను సైతం మీబిడ్డ ప్రభుత్వం చెల్లించింది. చంద్రబాబు బకాయి పెట్టిన రూ.384 కోట్ల విత్తన బకాయిలు కూడా మనమే చెల్లించాం. చంద్రబాబు హయాంలో ఎగ్గొట్టిన కరెంట్ బకాయిలు రూ.8,845 కోట్లను కూడా రైతన్నల కోసం మీబిడ్డ ప్రభుత్వమే భరిస్తోంది. గ్రామాల్లోనే రిజిస్ట్రేషన్లు.. మీబిడ్డ ప్రభుత్వంలో 70 నియోజకవర్గ స్థాయిలో 70 ఆర్గానిక్ టెస్టింగ్ ల్యాబ్స్ కళ్లెదుటే కనిపిస్తున్నాయి. రెండు జిల్లాస్థాయి ల్యాబ్స్ , మరో నాలుగు రీజనల్ కోడింగ్ సెంటర్లు కూడా ఏర్పాటయ్యాయి. మరో 77 నియోజకవర్గాల్లో అగ్రి టెస్టింగ్ ల్యాబ్లు నిర్మిస్తున్నాం. మరో 11 జిల్లా స్థాయి ల్యాబ్స్ కూడా నిర్మాణాలు మొదలయ్యాయి. ఆర్బీకేల స్థాయిలో సీడ్ టెస్టింగ్, సాయిల్ టెస్టింగ్ దిశగా అడుగులు పడుతున్నాయి. ఆర్బీకేలు రానున్న రోజుల్లో వ్యవసాయం చేసే విధానాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. వందేళ్ల తర్వాత సమగ్ర భూసర్వే ద్వారా వివాదాలకు తావు లేకుండా రైతన్నల చేతుల్లో భూహక్కు పత్రాలను పెట్టే కార్యక్రమం మీబిడ్డ హయాంలో జరుగుతోంది. గ్రామస్థాయిలో సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకున్నాం. చుక్కల భూములకు మోక్షం.. టీడీపీ హయాంలో నిషేధిత జాబితాలో చేర్చిన లక్షల ఎకరాల చుక్కల భూములకు విముక్తి కల్పించింది మీబిడ్డ ప్రభుత్వమే అని చెప్పేందుకు గర్వపడుతున్నా. రైతులకు ఏ ఇబ్బందీ రాకూడదని పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. రూ.1,700 కోట్లతో ఫీడర్లను బలోపేతం చేశాం. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్తు రూపాయిన్నరకే అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదే. ఆక్వా రైతులకు రూ.2,967 కోట్లు సబ్సిడీ రూపంలో ఇచ్చాం. కరువు సీమగా పేరున్న రాయలసీమ ఈరోజు కళకళలాడుతోంది. అమూల్ రాకతో హెరిటేజ్ లాంటి సంస్థలు తప్పని పరిస్థితుల్లో పాల సేకరణ ధర పెంచాయి. కేంద్రం ఎంఎస్పీ ప్రకటించని ఆరు పంటలకు కూడా మీబిడ్డ ప్రభుత్వం మద్దతు ధరలను ప్రకటించింది. పశు నష్టపరిహారం కింద రూ.667 కోట్లు చెల్లించాం. ఆయిల్పామ్ రైతులను ఆదుకునేందుకు రూ.85 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత ద్వారా ఐదు లక్షల మంది అక్కచెల్లెమ్మలు పశుసంపద కొనుగోలు చేసి పాడి వ్యాపారాలను నిర్వహించుకునేలా తోడుగా నిలబడ్డాం. పశువులకు సైతం 340 అంబులెన్స్లు ఈరోజు అందుబాటులో రాష్ట్రంలో ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో పశువ్యాధుల కోసం డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ ఏర్పాటయ్యాయి. రూ.1,052 కోట్ల విలువైన యంత్ర పరికరాలను ఆర్బీకేల స్థాయిలో అందుబాటులోకి తెస్తున్నాం. వ్యవసాయంలో తొలిసారిగా డ్రోన్లు తెస్తున్నాం. ప్రతీ ఆర్బీకేలో మన రైతన్నలే డ్రోన్ల ద్వారా వ్యవసాయం చేసే రోజు త్వరలోనే రానుంది. -
చంద్రబాబు పై రైతు ఫన్నీ కామెంట్స్
-
మన మట్టి నుంచి పుట్టిందే వైఎస్సార్సీపీ మేనిఫెస్టో: సీఎం జగన్
Updates.. ► బటన్ నొక్కి వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ నిధులు జమ చేసిన సీఎం జగన్ ► బాబు బతుకే కాపీ, మోసం. చంద్రబాబుకు క్యారెక్టర్, క్రెడిబిలిటీ లేవు. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్లేని పార్టీ టీడీపీ. పొత్తుల కోసం ఎంతకైనా దిగజారే పార్టీ టీడీపీ. పొత్తుల కోసం ఎలాంటి గడ్డికరవడానికైనా సిద్దపడే పార్టీ టీడీపీ. పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కుయుక్తులు కలగలిపిన పార్టీ టీడీపీ. ► మంచి చేయడమనేది చంద్రబాబు డిక్షనరీలోనే లేదు. ఎవరికైనా మంచి చేశానని చెప్పుకోలేని వ్యక్తి చంద్రబాబు. గజ దొంగల ముఠా, చంద్రబాబుది అధికారం కోసం ఆరాటం. దోచుకుని, దాచుకుని నలుగురూ పంచుకోవడానికే వీరి పోరాటం. ధైర్యంగా, ఒంటరిగా పోటీ చేసే సత్తా చంద్రబాబుకు లేదు. ► రాబోయే ఎన్నికల్లో యుద్ధం జరగబోతోంది. చంద్రబాబు డీపీటీ కావాలా.. మన డీబీటీ కావాలా?. పేదవాడికి, పెత్తందారుడికీ మధ్య యుద్ధం జరుగుతోంది. మీ బిడ్డ కేబినెట్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారే ఉన్నారు. గతంలో ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటున్నారా అని వెటకారం చేశారు. ► చంద్రబాబు ఎల్లో మీడియా ప్రచారానికి, ఇప్పుడు జరుగుతున్న మంచికీ మధ్య యుద్దం. వీరి యుద్ధం జగన్తో కాదు పేదలతో. మీ బిడ్డ నమ్ముకుంది దేవుడి దయ, మీ చల్లని దీవెనలు మాత్రమే. ► నా నమ్మకం మీరేనని గర్వంగా చెబుతున్నా. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు సైనికుల్లా నిలబడండి. మీ బిడ్డకు దేవుడి దయ, మీ చల్లని దీవెనెలు ఎప్పుడూ ఉండాలి. ► ఎన్నికలు వస్తుంటే చంద్రబాబుకు ప్రాజెక్టులు గుర్తొస్తాయి. చంద్రబాబుకు ఎన్నికలప్పుడు మాత్రమే కర్నూలు గుర్తొచ్చేది. తన హయాంలో కర్నూలుకు 10కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ► లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం రూ.80కోట్లు కేటాయిస్తున్నాం. టామోటా ప్రాసెసింగ్ యూనిట్ కోసం రూ.10కోట్లు కేటాయిస్తున్నాం. ► మేనిఫెస్టో ఎలా తయారవుతుందో బాబుకు తెలుసా?. నా పాదయాత్రలో ప్రజల కష్టాల నడుమ మేనిఫెస్టో పుట్టింది. పేదవాడి గుండె చప్పుడు నుంచి మన మేనిఫెస్టో పుట్టింది. మన మట్టి నుంచి మన మేనిఫెస్టో పుట్టింది. ► చంద్రబాబు మేనిఫెస్టో ఏపీలో పుట్టలేదు. చంద్రబాబు మేనిఫెస్టో కర్ణాటకలో పుట్టింది. కర్ణాటక రెండు పార్టీల మేనిఫెస్టోతో బిస్మిల్లా బాత్ వండేశాడు. అన్ని పార్టీల పథకాలు కాపీ చేసేసి మేనిఫెస్టో తీసుకొచ్చాడు. మన పథకాలను కాపీ కొట్టేసి పులిహోర కలిపేశాడు. ► కరువు సీమగా పేరున్న రాయలసీమ ఇప్పుడు కళకళలాడుతోంది. రిజర్వాయర్లు కూడా నిండుగా కనిపిస్తున్నాయి. రైతన్నకు అదనపు ఆదాయం రావాలన్న లక్ష్యంతోనే పథకాలు తీసుకొచ్చాం. ► ప్రపంచలోనే ప్రముఖ కంపెనీ అమూల్ను తీసుకొచ్చాం. గతంలో హెరిటేజ్ పేరుతో దోచుకున్న వారికి అడ్డుకట్ట వేశాం. అమూల్ ధర పెంచాక హెరిటేజ్ కూడా ధర పెంచింది. ► రైతుకు శత్రువైన చంద్రబాబు అన్నదాతను ముంచేశాడు. రాజమండ్రిలో డ్రామా కంపెనీ మాదిరి ఒక షో జరిగింది. ఆ డ్రామా పేరు మహానాడు. ► వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్న వ్యక్తి చంద్రబాబు. ► తానే చంపేసిన మనిషికి మళ్లీ తానే పూల దండలు వేస్తున్నారు. ► చంద్రబాబు మరోసారి మోసపూరిత మేనిఫెస్టోతో వచ్చాడు. చంద్రబాబుకు విలువలు, విశ్వసనీయత అసలే లేవు. చంద్రబాబు సత్యం పలకడు, ధర్మానికి కట్టుబడడు, మాట నిలబడడు. చంద్రబాబును చూస్తే మారీచుడు, రావణుడు గుర్తుకొస్తారు. ► చంద్రబాబు హయాంలో ఈ-క్రాప్ లేదు, సోషల్ ఆడిట్ లేదు. ►సమగ్ర భూసర్వేతో భూవివాదాలను పరిష్కరిస్తున్నాం. వందేళ్ల తర్వాత సమగ్ర భూసర్వే జరుగుతోంది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు మీ గ్రామానికే తీసుకొచ్చే అడుగులు పడుతున్నాయి. ► చుక్కల భూములపై సర్వ హక్కులు రైతులకే ఇచ్చిన ప్రభుత్వం మనదే. ఆక్వారైతులకు మేలు చేసిన ప్రభుత్వం కూడా మనదే. ► రైతులకు పగటి పూటే 9 గంటల పాటు ఉచిత విద్యుత్. రూ.1700 కోట్లతో ఫీడర్లను బలపరుస్తున్నాం. రూ.1.50కే యూనిట్ విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ. ► చంద్రబాబు పాలనలో ప్రతీ ఏటా కరువే. టీడీపీ పాలనలో కనీసం సగం మండలాలను కరువు మండలాలుగా ప్రకటించేవారు. ఇప్పుడు రాష్ట్రంలో కరువు లేదు, వలసలు లేవు. ► గడిచిన నాలుగేళ్లలో ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించలేదు. మీ బిడ్డ పరిపాలన ప్రారంభమైన తర్వాత మంచి వానలు ఉన్నాయి. ► గత ప్రభుత్వ పాలనకు, మీ బిడ్డ పాలనకూ మధ్య తేడా చూడండి. మహానేత వైఎస్సార్ జయంతి రోజున ఇస్క్యూరెన్స్ కూడా జమ చేస్తాం. ► ప్రతీ రైతన్నకు ఇప్పటికే రూ.54వేలు చొప్పున అందించాం. ఇప్పుడు అందిస్తున్న రైతు భరోసాతో కలిపితే ప్రతీ రైతన్న ఖాతాలో రూ.61,500 జమ. ► ఇప్పటి వరకు రైతు భరోసా ద్వారా రూ. 31వేల కోట్లు జమ. ఇన్పుట్ సబ్సిడీ చరిత్రలోనే విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాం. ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీ. ► వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ప్రతీ గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. చంద్రబాబు హయాంలో ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా చేశారా?. ► రాష్ట్రంలో ఆహారధాన్యాల దిగుబడి పెరిగింది. ఉద్యానవన పంటల దిగుబడి 332 లక్షల టన్నులకు పెరిగింది. ► సీఎం జగన్ మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. మీ ప్రేమానురాగాలకు రెండు చేతులూ జోడించి నమస్కరిస్తున్నాను. ► బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో సాయం జమ చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి సదా రుణపడి ఉంటాను. మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకున్నాం. ► రైతులు ఇబ్బంది పడకూడదనే పెట్టుబడి సాయం అందిస్తున్నాం. వైఎస్ఆర్ రైతు భరోసాతో అన్నదాతలకు ఎంతో మేలు జరిగింది. ► మేనిఫెస్టోలో ప్రకటించిన దాని కంటే ఎక్కువగా రూ.12,500కి బదులుగా ఏడాదికి రూ.13,500 రైతు భరోసా అందిస్తున్నాం. ► ఈ కార్యక్రమంలో లబ్దిదారులు మాట్లాడుతూ.. రైతులకు అండగా నిలిచిన సీఎం జగన్కు ధన్యవాదాలు. రైతుల పక్షపాతి ప్రభుత్వాన్ని చూస్తున్నాం. పంట బీమా అందించిన సీఎం జగన్కు రుణపడి ఉంటాం. రైతు భరోసా కేంద్రాలతో ఎంతో మేలు జరిగింది. ►ఎమ్మెల్యే కొంగటి శ్రీదేవి మాట్లాడుతూ.. పత్తికొండ ప్రజల తరఫున సీఎం జగన్కు స్వాగతం. ► వైఎస్సార్ అడుగుజాడల్లో జగనన్న రైతులకు అండగా ఉన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సీఎం జగన్ పాలన అందిస్తున్నారు. భవిష్యత్తు తరాల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి చేస్తున్నారు. హామీలన్నీ నెరవేర్చినా సీఎం జగన్పై దుష్ప్రచారం చేస్తున్నారు. ► బడుగు బలహీన వర్గాల ఆశాదీపం సీఎం జగన్. ప్రజల గుండెల్లో జగనన్న సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ప్రజల కష్టాలు తెలిసిన జననేత సీఎం జగన్. పాలనలో సీఎం జగన్ విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. ► వేదిక వద్ద మహానేత వైఎస్సార్ విగ్రహానికి సీఎం జగన్ నివాళులు. ► సీఎం జగన్ పత్తికొండ చేరుకున్నారు. ► కర్నూలు జిల్లా పర్యటనకు బయలుదేరిన సీఎం జగన్ ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదో ఏడాది.. తొలి విడత వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ► 2023–24 సీజన్కు సంబంధించి 52.31 లక్షల రైతు కుటుంబాలకు తొలివిడతగా రూ.7,500 చొప్పున మొత్తం రూ.3,923.22 కోట్ల పెట్టుబడి సాయంతో పాటు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన 51 వేల మంది రైతులకు రూ.53.62 కోట్ల మేర ఇన్పుట్ సబ్సిడీని సీఎం జగన్ గురువారం కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించే కార్యక్రమంలో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. నాలుగేళ్లలో రూ.30,985.31 కోట్ల పెట్టుబడి సాయం ► వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు. వెబ్ల్యాండ్ ఆధారంగా అర్హులైన భూ యజమానులతో పాటు దేవదాయ, అటవీ (ఆర్ఓఎఫ్ఆర్) భూముల సాగుదారులతోపాటు సెంటు కూడా భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులకు మే నెలలో రూ.7,500, అక్టోబర్లో రూ.4 వేలు, జనవరిలో రూ.2 వేలు చొప్పున జమ చేస్తున్నారు. ► 2019–20లో 46,69,375 మందికి రూ.6,173 కోట్లు సాయం అందించారు. 2020–21లో 51,59,045 మందికి రూ.6,928 కోట్ల మేర సాయం అందింది. ► 2021–22లో 52,38,517 మందికి రూ.7,016.59 కోట్లు, 2022–23లో 51,40,943 మందికి రూ.6944.50 కోట్లు చొప్పున సాయాన్ని ఖాతాల్లో జమ చేశారు. తాజాగా 2023–24కి సంబంధించి 52,30,939 మంది అర్హత పొందగా వీరికి తొలి విడతగా రూ.3923.22 కోట్ల మేర సాయం అందించనున్నారు. -
అన్నదాతకు కొండంత అండగా సీఎం వైఎస్ జగన్
-
నేడు గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం గుంటూరు జిల్లా మంగళగిరి, కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 7.30 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మంగళగిరి చేరుకుంటారు. అక్కడ సీ కే కన్వెన్షన్ సెంటర్లో వైఎస్సార్సీపీ నేత పేర్నాటి శ్యామ్ప్రసాద్రెడ్డి సోదరుడు పేర్నాటి రామలింగారెడ్డి కుమారుడు కౌశిక్ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం అక్కడ నుంచి గన్నవరం చేరుకుని.. కర్నూలు జిల్లాకు బయలుదేరుతారు. పత్తికొండలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం వరుసగా ఐదో ఏడాది.. తొలి విడత వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
YSR Rythu Bharosa: వరుసగా ఐదో ఏడాదీ వైఎస్సార్ రైతు భరోసా
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా తొలి విడత పెట్టుబడి సాయంతో పాటు ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన రైతన్నలకు సీజన్ ముగియక ముందే పంట నష్ట పరిహారం పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2023–24 సీజన్కు సంబంధించి 52.31 లక్షల రైతు కుటుంబాలకు తొలివిడతగా రూ.7,500 చొప్పున మొత్తం రూ.3,923.22 కోట్ల పెట్టుబడి సాయంతో పాటు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన 51 వేల మంది రైతులకు రూ.53.62 కోట్ల మేర ఇన్పుట్ సబ్సిడీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించే కార్యక్రమంలో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నాలుగేళ్ల వ్యవధిలో సీఎం జగన్ ప్రభుత్వం రైతన్నలకు వివిధ పథకాల ద్వారా రూ.1,61,236.72 కోట్ల మేర నేరుగా సాయాన్ని అందించడం గమనార్హం. నాలుగేళ్లలో రూ.30,985.31 కోట్ల పెట్టుబడి సాయం వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు. వెబ్ల్యాండ్ ఆధారంగా అర్హులైన భూ యజమానులతో పాటు దేవదాయ, అటవీ (ఆర్ఓఎఫ్ఆర్) భూముల సాగుదారులతోపాటు సెంటు కూడా భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులకు మే నెలలో రూ.7,500, అక్టోబర్లో రూ.4 వేలు, జనవరిలో రూ.2 వేలు చొప్పున జమ చేస్తున్నారు. ఇలా 2019–20లో 46,69,375 మందికి రూ.6,173 కోట్లు సాయం అందించారు. 2020–21లో 51,59,045 మందికి రూ.6,928 కోట్ల మేర సాయం అందింది. 2021–22లో 52,38,517 మందికి రూ.7,016.59 కోట్లు, 2022–23లో 51,40,943 మందికి రూ.6944.50 కోట్లు చొప్పున సాయాన్ని ఖాతాల్లో జమ చేశారు. తాజాగా 2023–24కి సంబంధించి 52,30,939 మంది అర్హత పొందగా వీరికి తొలి విడతగా రూ.3923.22 కోట్ల మేర సాయం అందించనున్నారు. ఈ ఏడాది తొలి విడత సాయం కోసం అర్హత పొందిన వారిలో భూ యజమానులు 50,19,187 మంది, అటవీ భూ సాగుదారులు 91,752 మంది ఉండగా, భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాగుదారులు 1.20 లక్షల మంది ఉన్నారు. 2023–24లో అందించే ఈ తొలివిడత సాయం రూ.3923.22 కోట్లతో కలిపి ఇప్పటివరకు సగటున 52 లక్షల మందికి వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.30,985.31 కోట్ల పెట్టుబడి సాయం అందించనట్లవుతుంది. ఏ సీజన్లో నష్టపోతే అదే సీజన్ ముగియక ముందే.. వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు ఏ సీజన్లో నష్టపోతే అదే సీజన్ ముగియక ముందే పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) అందిస్తూ బాధిత రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలలో కురిసిన అకాల వర్షాల వల్ల 78,830 ఎకరాల్లో పంటలు దెబ్బతినగా 51,468 మంది రైతులకు పంట నష్టం వాటిల్లింది. దీనికి సంబంధించి రూ.53.62 కోట్ల పంట నష్టపరిహారాన్ని పెట్టుబడి సాయంతో పాటు బుధవారం జమ చేయనున్నారు. ఈ సాయంతో కలిపి 22.73 లక్షల మంది రైతులకు రూ.1,965.41 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని జమ చేసినట్లవుతుంది. -
30న వైఎస్సార్ రైతుభరోసా సాయం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతుభరోసా 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలివిడత పెట్టుబడి సాయం, ఇటీవలి అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈ నెల 30వ తేదీన కర్నూలు జిల్లా పత్తికొండలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి ఈ సొమ్మును రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు. పెట్టుబడి సాయం కింద గతేడాది 51.41 లక్షలమంది రైతులు లబ్ధిపొందగా.. ఈ ఏడాది 52.31 లక్షలమంది లబ్ధిపొందనున్నారు. వీరికి తొలివిడతలో రూ.7,500 చొప్పున రూ.3,934.25 కోట్లను ముఖ్యమంత్రి జమచేయనున్నారు. పెట్టుబడిసాయంతో పాటు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతు కుటుంబాలకు ఇన్పుట్ సబ్సిడీ కూడా అందించనున్నారు. ఏటా పెరుగుతున్న లబ్ధిదారులు వైఎస్సార్ రైతుభరోసా కింద ఇచ్చిన మాటకంటే మిన్నగా అర్హులైన రైతు కుటుంబాలకు ఏటా మూడువిడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. వెబ్ల్యాండ్ ఆధారంగా అర్హులైన భూ యజమానులతో పాటు దేవదాయ, అటవీ (ఆర్వోఎఫ్ఆర్) భూములు సాగుచేసేవారే కాకుండా సెంటు భూమి కూడా లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులకు తొలివిడతగా మే నెలలో రూ.7,500, రెండోవిడతగా అక్టోబర్లో రూ.4 వేలు, మూడోవిడతగా జనవరిలో రూ.2 వేలు చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఇలా 2019–20లో 46,69,375 మందికి రూ.6,173 కోట్లు, 2020–21లో 51,59,045 మందికి రూ.6,928 కోట్లు, 2021–22లో 52,38,517 మందికి రూ.7,016.59 కోట్లు, 2022–23లో 51,40,943 మందికి రూ.6,944.50 కోట్ల పెట్టుబడి సాయాన్ని నేరుగా వారి ఖాతాలకు జమచేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 52,30,939 మంది అర్హత పొందారు. వీరికి తొలివిడతగా రూ.3,934.25 కోట్ల సాయం అందించనున్నారు. గతేడాది 49,26,041 మంది భూ యజమానులు కాగా, 1,23,871 మంది కౌలురైతులు, 91,031 మంది అటవీ భూ సాగుదారులు లబ్ధిపొందారు. ఈ ఏడాది తొలి విడత సాయం కోసం అర్హత పొందిన 52,30,939 మందిలో భూ యజమానులు 50,19,187 మంది, అటవీ భూ సాగుదారులు 91,752 మంది, భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాగుదారులు 1.20 లక్షల మంది ఉన్నారు. ఈ నెలలో అందించనున్న సాయంతో కలిపి ఈ నాలుగేళ్లలో సగటున 52.30 లక్షల మందికి వైఎస్సార్ రైతుభరోసా కింద రూ.30,996.34 కోట్ల పెట్టుబడి సాయం ఇచ్చినట్లవుతుంది. 48,032 మందికి రూ.46.39 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు సీజన్ ముగియకముందే పంట నష్టపరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) నేరుగా వారి ఖాతాల్లోనే జమచేస్తూ బాధిత రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. అదేరీతిలో గతేడాది డిసెంబర్లో మాండూస్ తుపాన్తో పంటలు దెబ్బతిన్న 91,237 మంది రైతులకు రూ.76.99 కోట్ల నష్టపరిహారాన్ని ఫిబ్రవరిలో అందజేసిన విషయం తెలిసిందే. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలకు 78,510 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వీటిలో 59,230 ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 19,280 ఎకరాల్లో ఉద్యాన పంటలు ఉన్నాయి. ఈ మేరకు పంటలు దెబ్బతిన్న 48,032 మంది రైతులకు రూ.46.39 కోట్ల పంట నష్టపరిహారాన్ని ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి జమచేయనున్నారు. ఇప్పటికే ఈ నాలుగేళ్లలో 22.22 లక్షలమందికి రూ.1,911.79 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని జమచేశారు. తాజాగా జమచేయనున్న సాయంతో కలిసి 22.70 లక్షల మంది రైతులకు రూ.1,958.18 కోట్ల పంట నష్టపరిహారం అందించినట్లవుతుంది. -
రైతు భరోసాకు 18 వరకు దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, అమరావతి: 2023–24 సీజన్కు సంబంధించి వైఎస్సార్ రైతు భరోసా పథకానికి కొత్తగా అర్హత పొందినవారు, గతంలో అర్హత కలిగి లబ్ధి పొందని భూ యజమాన రైతులు, అటవీ భూసాగుదారులు ఈ నెల 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ చేవూరు హరికిరణ్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత నాలుగేళ్లుగా ఈ పథకం ద్వారా మే నెలలో తొలి విడత పెట్టుబడి సాయం విడుదలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఇందుకోసం అర్హత పొందినవారు సమీప ఆర్బీకేల్లో వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని సూచించారు. తమ దరఖాస్తులను రైతు భరోసా పోర్టల్లో అప్లోడ్ చేసుకునేందుకు ఈ నెల 3 వరకు గడువునివ్వగా 90,856 మంది భూ యజమానులు, 6,632 మంది అటవీ భూసాగుదారులు కొత్తగా దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వీరితో పాటు 2022–23లో రైతు భరోసా కింద లబ్ధి పొందేందుకు అర్హత కలిగిన రైతుల జాబితాలను సామాజిక తనిఖీల్లో భాగంగా ఈ నెల 12 నుంచి ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నామని చెప్పారు. అర్హుల జాబితాలో ఎవరైనా అనర్హులున్నట్టుగా గుర్తించినట్లయితే వెంటనే వ్యవసాయ శాఖ సిబ్బంది దృష్టికి తీసుకురావచ్చన్నారు. అలాగే అర్హతలు ఉండి ఇంకా దరఖాస్తు చేసుకోనివారు ఎవరైనా ఉంటే ఈ నెల 15 నుంచి 18 వరకు అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. దీన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. గతేడాది లబ్ధి పొందిన వారు మళ్లీ దరఖాస్తు చేయనవసరం లేదని తెలిపారు. వారికి ఈ ఏడాది కూడా యధావిధిగా రైతు భరోసా సాయం అందుతుందన్నారు. గతేడాది లబ్ధి పొంది ప్రస్తుతం మరణించినట్లైతే వారి భార్య లేదా భర్త నామినీగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. భూమికి సంబంధించిన పత్రాలు, ఆధార్ కార్డు, ఇతర ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. -
Andhra Pradesh: సంపూర్ణ ‘మద్దతు’
రైతులు పండించిన ప్రతి పంటకూ మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఎక్కడైనా మద్దతు ధర లభించని పక్షంలో వెంటనే మార్కెట్లో జోక్యం చేసుకుని ఎమ్మెస్పీ దక్కేలా చర్యలు తీసుకోవాలి. పంటల ధరల పర్యవేక్షణకు తెచ్చిన ‘సీఎం యాప్’ విషయంలో మాక్ డ్రిల్స్ నిర్వహించాలి. యాప్ ద్వారా రోజువారీ పర్యవేక్షణ ఉండాలి. నిర్దేశించుకున్న విధంగా (ఎస్వోపీ) పనిచేసేలా పర్యవేక్షిస్తూ, లోపాలుంటే చక్కదిద్దుకుంటూ ముందుకెళ్లాలి. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతన్నలను అక్కడకు వెళ్లండి.. ఇక్కడకు వెళ్లండంటూ తిప్పొద్దు. ఏ ఒక్క రైతన్న కూడా ఇబ్బంది పడటానికి వీల్లేదు. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రబీ ధాన్యం కొనుగోళ్ల సందర్భంగా ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ధాన్యం సేకరించిన తర్వాత రైతులకు తప్పనిసరిగా రసీదు అందచేయడంతోపాటు అందులో కొన్ని సూచనలు తప్పనిసరిగా పొందుపరచాలన్నారు. నాణ్యతా ప్రమాణాలు ఎలా ఉండాలి? అందుకోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే వివరాలతో సూచనలు ఉండాలన్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి తీసుకొచ్చిన 1967 టోల్ఫ్రీ నంబర్ రసీదులో తప్పనిసరిగా ఉండాలని, దళారులు, మిల్లర్ల ప్రమేయానికి తావులేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే తక్షణమే చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. కొనుగోళ్ల సందర్భంగా ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలపై సమీక్షించిన ముఖ్యమంత్రి జగన్ ఉన్నతాధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలివీ.. విదేశాల్లో డిమాండ్ ఉన్న వంగడాల సాగు.. విదేశాల్లో డిమాండ్ ఉన్న వరి వంగడాలను సాగు చేయడంపై అన్నదాతలకు అవగాహన కల్పించాలి. ఆ విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలి. దీనివల్ల ఎగుమతులు పెరిగి రైతులకు మంచి ధర వస్తుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే మే నెలలో వైఎస్సార్ రైతు భరోసా తొలి విడత పెట్టుబడి సాయాన్ని జమ చేసేలా ఏర్పాట్లు చేయాలి. మే 10వతేదీ కల్లా అర్హులైన జాబితాలను సిద్దం చేయాలి ప్రతీ ఆర్బీకే పరిధిలో గోడౌన్ కొనుగోలు చేసిన పంట ఉత్పత్తులను నిల్వ చేసేందుకు వీలుగా దశలవారీగా ప్రతి ఆర్బీకే పరిధిలో ఒక గోడౌన్ ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలి. ఖరీఫ్ సీజన్ కోసం అవసరమైన నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను ఆర్బీకేల ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలి. ఏటా పంపిణీ చేసే ఇన్పుట్స్ పెంచుకుంటూ వెళ్లాలి. పంపిణీ ప్రక్రియ మరింత సమర్థంగా ఉండాలి. ఆర్బీకేల్లో ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలి. మే 20వతేదీలోగా మిగిలిన ఆర్బీకేల్లో వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి సాగు ఉపకరణాల పంపిణీ చేపట్టాలి. జూలై కల్లా 500 ఆర్బీకేల పరిధిలో కిసాన్ డ్రోన్లు అందుబాటులోకి తెచ్చేలా సన్నద్ధం కావాలి. ఈ – కేవైసీ 97.5 శాతం రబీలో సాగైన 48.02 లక్షల ఎకరాల్లో పంటలను ఈ–క్రాప్ బుకింగ్ పూర్తి చేసినట్లు సమీక్షలో అధికారులు తెలిపారు. రైతులందరికీ డిజిటల్గానే కాకుండా భౌతికంగా కూడా రశీదులిచ్చి పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖలకు డేటాను పంపినట్లు వివరించారు. ఈ–కేవైసీ 97.5 శాతం పూర్తైందన్నారు. రబీలో సాగైన పంట ఉత్పత్తుల కొనుగోలుకు అన్ని చర్యలు చేపట్టామని, తొలిసారిగా రైతులకు అందిస్తున్న గన్నీ బ్యాగులు, రవాణా ఖర్చుల చెల్లింపులు దాదాపుగా పూర్తి చేశామని చెప్పారు. ఖరీఫ్ సీజన్లో రూ.7,233 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించగా ఇప్పటికే రూ.7,200 కోట్లు రైతులకు చెల్లించినట్లు వెల్లడించారు. సాంకేతిక కారణాల వల్ల మరో రూ.33 కోట్లు పెండింగ్లో ఉన్నట్లు తెలియచేయడంతో వాటిని పరిష్కరించి రైతులకు చెల్లింపులు జరిపేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సమీక్షలో మంత్రులు కాకాణి గోవర్ధన్రెడ్డి, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారు ఐ. తిరుపాల్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ముఖ్య కార్యదర్శులు గోపాలకృష్ణ ద్వివేది, చిరంజీవి చౌదరి, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్, ఉద్యాన, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖల కమిషనర్లు ఎస్ఎస్ శ్రీధర్, రాహుల్పాండే, హెచ్.అరుణ్కుమార్, విత్తనాభివృద్ధి, పౌరసరఫరాల సంస్థల ఎండీలు డాక్టర్ గెడ్డం శేఖర్ బాబు, జి.వీరపాండ్యన్ తదితరులు పాల్గొన్నారు. డ్రోన్ల వినియోగంపై ఎన్జీరంగా వర్సిటీ శిక్షణ ► జూలై నాటికి 500, డిసెంబర్ నాటికి 1,500 ఆర్బీకేల పరిధిలో కిసాన్ డ్రోన్లు సమకూర్చేలా కార్యాచరణ సిద్ధం. ► డ్రోన్ల వినియోగంపై తిరుపతి, కడప, మార్టేరు, విజయనగరంలో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు. ► ఇప్పటికే 6,500 ఆర్బీకేల పరిధిలో యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటు. మరో 3,953 ఆర్బీకేల పరిధిలో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు (సీహెచ్సీ), 194 క్లస్టర్ స్ధాయి సీహెచ్సీలకు మే 20లోగా వైఎస్సార్ యంత్రసేవా పథకం ద్వారా సాగు ఉపకరణాలు అందించేలా సన్నద్ధం. ► ఆర్బీకేల స్ధాయి సీహెచ్సీలకు రూ.8.2 లక్షలు, క్లస్టర్ స్ధాయి సీహెచ్సీలకు రూ.25 లక్షల విలువైన యంత్రాలు అందుబాటులోకి. ► గతేడాది సుమారు 7 లక్షల టన్నులకు పైగా ఎరువుల సరఫరా. ఈ ఏడాది మరింత పెంచేలా చర్యలు. ► ఆర్బీకేల్లో 4,656 పశు సంవర్ధక, 1,644 ఉద్యాన, 467 వ్యవసాయ, 64 మత్స్య, 23 పట్టు సహాయకుల పోస్టుల ఖాళీల భర్తీకి చర్యలు. ► ప్రతి ఆర్బీకే పరిధిలో గోదాము నిర్మించే లక్ష్యంతో మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి. ఇప్పటికే 1,005 చోట్ల గోడౌన్ల నిర్మాణం చేపట్టగా 206 చోట్ల పూర్తి. తుది మెరుగులు దిద్దుకుంటున్న మరో 93 గోడౌన్లు. వివిధ దశల్లో గోదాములను జూలై కల్లా పూర్తి చేసేలా చర్యలు. -
మొక్కల డాక్టర్లు వచ్చేస్తున్నారు!
సాక్షి, అమరావతి: మొక్కల డాక్టర్లు వచ్చేస్తున్నారు.. వీరు ఏటా భూసార పరీక్షలు చేయడమే కాదు.. భూసారాన్ని కాపాడేందుకు సిఫార్సు మేరకు తగిన సూక్ష్మపోషకాలందిస్తారు. విత్తు నుంచి కోత వరకు పంటలకు సోకే తెగుళ్లను గుర్తించి శాస్త్రవేత్తల సూచనల మేరకు ఎంత మోతాదులో మందులు వాడాలో చెబుతారు. దగ్గరుండి మొక్కలకు అందేలా చూస్తారు. నాణ్యమైన పంట దిగుబడులు సాధించడమే లక్ష్యంగా..దేశంలోనే తొలిసారిగా ఏపీలోని ఆర్బీకేల్లో ప్లాంట్ హెల్త్ డయాగ్నస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి తొలుత మండలానికి ఓ ఆర్బీకేలో వీటి సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తొలి దశలో 670 ఆర్బీకేల పరిధిలో అమలు.. విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అండగా నిలుస్తోన్న వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను ప్లాంట్ హెల్త్ డయాగ్నస్టిక్ సెంటర్లు (పీహెచ్డీసీ)గా తీర్చిదిద్దేందుకు రంగం సిద్ధం చేశారు. భూసారం, నీటి, సూక్ష్మ పోషక లోపాలను గుర్తించేందుకు రైతు క్షేత్రం నుంచి నమూనాలు సేకరించి నిర్దేశిత గడువు లోగా ఫలితాలు అందించడమే కాకుండా.. సకాలంలో తగిన సలహాలు, సూచనలు అందించాలన్న లక్ష్యంతోనే ప్లాంట్ డాక్టర్ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. తొలుత మండలానికి ఓ ఆర్బీకే పరిధిలో పీహెచ్డీసీ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ విధంగా తొలిదశలో రాష్ట్ర వ్యాప్తంగా 670 ఆర్బీకేల పరిధిలో అమలు చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత దశల వారీగా మిగిలిన ఆర్బీకేలలోనూ ఈ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ నుంచి ప్లాంట్ డాక్టర్స్గా శిక్షణ పీహెచ్డీసీ ఏర్పాటుకు అనువైన భవనం, సౌకర్యాలున్న ఆర్బీకేలను ఎంపిక చేస్తారు. అగ్రికల్చర్, హార్టికల్చర్ సైన్స్లో పోస్టు గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్, డిప్లమో పూర్తయిన ఆర్బీకేల్లోని వ్యవసాయ, ఉద్యాన, పట్టు సహాయకుల (వీఏఏ, వీహెచ్ఏ, వీఎస్ఎ)ను ఎంపిక చేస్తారు. వీరికి జిల్లా స్థాయిలోని కేవీకే, ఏఆర్ఎస్, డాట్ సెంటర్లలో ఏప్రిల్–మే నెలల్లో కనీసం మూడు వారాల పాటు విడతల వారీగా పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వనున్నారు. ఎంపిక చేసిన ఆర్బీకేల్లో అవసరమైన మినీ కిట్స్తో పాటు పంటల ఆధారిత లీఫ్ కలర్ (ఎల్సీసీ), సూక్ష్మ పోషక లోపాల చార్ట్లను అందిస్తారు. ప్రత్యేకంగా. ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ కోసం మొబైల్ అప్లికేషన్ను అభివృద్ధి చేయనున్నారు. అగ్రి ల్యాబ్స్లో ఉచితంగా పరీక్షలు స్థానికంగా పరీక్షించ తగ్గ వాటిని ఆర్బీకే స్థాయిలో పరీక్షిస్తారు. భూసారంతో పాటు సూక్ష్మపోషక లోపాలు, మొక్కలకు వచ్చే తెగుళ్లు, వ్యాధులను నిర్ధారించేందుకు వాటి శాంపిల్స్ను సమీప వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్కు పంపిస్తారు. నిర్దేశిత గడువులోగా ఉచితంగా పరీక్షించి వాటి ఫలితాలను ఎస్ఎంఎస్, వాట్సాప్ మెసేజిల ద్వారా రైతులకు పంపిస్తారు. అవే ఫలితాలను సంబంధిత శాస్త్రవేత్తలకు పంపిస్తారు. ఫలితాల ఆధారంగా వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు సూచించే సిఫార్సులను రాత పూర్వకంగా రైతులకు అందిస్తారు. ఏ రకమైన ఎరువులు ఎంత మోతాదులో ఏ సమయంలో వాడాలో చెబుతారు. సామూహికంగా, వ్యక్తిగతంగా పాటించాల్సిన జాగ్రత్తలు, ఆచరించాల్సిన యాజమాన్య పద్ధతులపై పీహెచ్డీసీల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తారు. సిఫార్సు మేరకు అవసరమైన సూక్ష్మ పోషకాలు, మందులు తగిన మోతాదులో అందేలా చూస్తారు. 2023–24లో కనీసం 5 లక్షల భూసార పరీక్షలు నిర్వహించి ప్రతీ రైతుకు ఈ పీహెచ్డీసీల ద్వారా సాయిల్ హెల్త్ కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. -
175 చోట్ల ఒంటరిగా పోటీ చేసే ధైర్యముందా?
చంద్రబాబుకు, దత్తపుత్రుడికి సవాల్ విసురుతున్నా.. 175 నియోజకవర్గాలకు 175 చోట్ల ఒంటరిగా పోటీ చేసి గెలిచే ధైర్యం ఉందా? ఆ ధైర్యం వాళ్లకు లేదు.. ఎందుకంటే జీవితంలో ఏ రోజూ వారు ప్రజలకు మంచి చేయలేదు కాబట్టి. కానీ మీ బిడ్డకు ఆ ధైర్యం ఉంది.. కారణం మేం మంచి చేశాం కనుకనే. చేసిన మంచి గురించి చెప్పుకుని మళ్లీ అధికారంలోకి వస్తానన్న నమ్మకం, ధైర్యం మీ బిడ్డకు ఉంది. రాబోయే రోజుల్లో కుట్రలు ఇంకా ఎక్కువ కనిపిస్తాయి. రాజకీయాల్లో అన్యాయాలు పెరుగుతాయి. అన్నీ గమనించండి. నిర్ణయం తీసుకునేటప్పుడు మాత్రం బాగా ఆలోచించండి. మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అన్న ఒకే ఒక్కటి ప్రామాణికంగా తీసుకోండి. మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు మీరే సైనికులుగా తోడుగా నిలబడండి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, గుంటూరు: వచ్చే ఎన్నికల్లో యుద్ధం కరువుతో ఫ్రెండ్షిప్ ఉన్న చంద్రబాబుకు, వరుణ దేవుడి ఆశీస్సులున్న మనందరి ప్రభుత్వానికి మధ్య జరుగుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఐదేళ్ల పాలనలో ప్రజలకు ఒక్క మంచి పని కూడా చేయని చంద్రబాబు ఇక చెప్పుకునేందుకు ఏమీ లేకపోవడంతో దుష్ట చతుష్టయంతో కలసి దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన 98.5 శాతం హామీలను నెరవేర్చి ఈ రోజు సంతృప్తిగా ఓటు అడగడానికి వస్తున్నామని, ఎమ్మెల్యేలు ప్రతి గడపనూ సందర్శిస్తున్నారని చెప్పారు. మంగళవారం గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ యార్డు వద్ద నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్సార్ రైతు భరోసా, మాండూస్ తుపాన్ బాధిత రైతులకు ఇన్పుట్ సబ్సిడీని బటన్ నొక్కి జమ చేసిన అనంతరం సీఎం జగన్ ప్రసంగించారు. ఆ వివరాలివీ.. రైతులకు పంట నష్ట పరిహారం– పెట్టుబడి రాయితీకి సంబంధించిన చెక్ను విడుదల చేస్తున్న సీఎం వైఎస్ జగన్ నాడు డీపీటీ.. నేడు డీబీటీ ప్రభుత్వ పాఠశాలల్లో పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియం వద్దన్న చంద్రబాబుకు, అదే స్కూళ్లను నాడు–నేడుతో రూపురేఖలు మార్చేసి సీబీఎస్ఈ విధానంలో ఇంగ్లిష్ మీడియం తెచ్చిన మీ బిడ్డ ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతోంది. మొదటి సంతకంతోనే డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి మోసగించి పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను రోడ్డుమీదకు తెచ్చిన చంద్రబాబుకు... వైఎస్సార్ ఆసరా, సున్నావడ్డీ, వైఎస్సార్ చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, జగనన్న అమ్మఒడి, 30 లక్షల ఇళ్ల పట్టాలిచ్చి ఇప్పటికే 22 లక్షల గృహ నిర్మాణాలను చేపట్టిన చేస్తున్న మీ బిడ్డ ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతోంది. జన్మభూమి కమిటీలనే గజదొంగల ముఠాతో మొదలుపెడితే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడితో కలిసి దోచుకో, పంచుకో, తినుకో (డీపీటీ) స్కీంలు సృష్టించిన చంద్రబాబుకు, గ్రామ రూపురేఖలను సమూలంగా మార్చేసిన మన ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతోంది. కళ్లెదుటే కనిపిస్తున్న గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం చదువులు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ విధానం, అందుబాటులోకి రానున్న డిజిటల్ గ్రంథాలయాల ద్వారా గ్రామాల స్వరూపం మారిపోతోంది. ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా ఏ ఒక్క అర్హుడూ మిస్ కాకూడదన్న ఉద్దేశంతో సోషల్ ఆడిట్ చేసి పేదలకు రూ.1.93 లక్షల కోట్లను డీబీటీ ద్వారా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి మీ ప్రభుత్వం జమ చేసింది. అప్పుడెందుకు ఇవ్వలేదంటే... ఆ రోజూ, ఈ రోజూ ఒకే బడ్జెట్ అయినా అప్పులలో పెరుగుదల గ్రోత్ రేటు మాత్రం అప్పటికన్నా ఇవాళ తక్కువే. మీ బిడ్డ మాత్రమే ఎందుకు బటన్న్నొక్కగలుగుతున్నాడు? చంద్రబాబు బటన్¯ నొక్కే స్కీంలు ఎందుకు లేవన్నది ఆలోచన చేయండి. అప్పట్లో ఆ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో ఆలోచన చేయండి. ఆ డబ్బులన్నీ గ్రామస్థాయిలో మొదలుపెడితే జన్మభూమి కమిటీల నుంచి గజదొంగల ముఠా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడు, వీళ్లందరి బాస్ చంద్రబాబు కలసి దోచుకో, పంచుకో, తినుకో అని పంచుకున్నారు. పేదలు ఒకవైపు.. పెత్తందార్లు మరోవైపు ఎస్సీ కులాలలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? బీసీల తోకలు కత్తిరిస్తాం.. పేదలకు ఇళ్లు, ఇళ్ల స్ధలాలు ఇవ్వడానికి వ్యతిరేకమన్న పెత్తందారీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు, మనకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు గ్రామ స్థాయి నుంచి కేబినెట్ వరకూ రాజకీయ సాధికారిత కల్పించాం. నామినేటెడ్ పదవుల నుంచి పాలించే పదవుల దాకా ప్రతి అడుగులోనూ భాగస్వాములుగా చేశాం. ఈ రోజు యుద్ధం జరుగుతోంది కులాల మధ్య కాదు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతోంది క్లాస్ వార్. పేదవాడు ఒకవైపు, పెత్తందార్లు మరోవైపు ఉన్నారు. పొరపాటు జరిగిందంటే రాజకీయాల్లో ఇక ఎవరూ మాట ఇవ్వడం, మాట మీద నిలబడటం అన్న మాటకు అర్థమే లేకుండా పోతుంది. రాజకీయ వ్యవస్ధలో మార్పు రావాలి. విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియాలి. ఒక మాట చెబితే, ఆ మాట నిలబెట్టుకోలేకపోతే.. ఆ వ్యక్తి రాజకీయాలలో ఉండడానికి అర్హుడు కాదన్న పరిస్థితులు రావాలి. సభకు హాజరైన అశేష జనవాహినిలో ఓ భాగం టార్గెట్ 175 దిశగా అడుగులు.. ఈ రోజు మీ బిడ్డకు ఉన్నదల్లా దేవుడి దయ, మీ అందరి చల్లని ఆశీస్సులు మాత్రమే. మీ బిడ్డకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 లేకపోవచ్చు. దత్తపుత్రుడు తోడు ఉండకపోవచ్చు. మీ బిడ్డ ఏరోజూ వాళ్లమీద ఆధారపడలేదు. మీకు మంచి జరిగింది అనిపిస్తే మీ బిడ్డకు తోడుగా ఉండాలని కోరుతున్నా. మీ బిడ్డకు భయం లేదు. అందుకే 175 టార్గెట్ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాం. దుష్ట చతుష్టయానికి కడుపు మంట వ్యవసాయం దండగన్న చంద్రబాబుకు, రైతుకు ఇచ్చిన ప్రతి మాటా తప్పిన చంద్రబాబుకు, ఆయన భజన బృందానికి, దుష్ట చతుష్టయానికి మన ప్రభుత్వంపై కడుపు మండుతోంది. అయినా కడుపు మంటకు మందు లేదు. అసూయకు అసలే మందు లేదు. మనది పేదల ప్రభుత్వం. మనది రైతన్నల ప్రభుత్వం. రైతులను వంచించిన చంద్రబాబు ఒకవైపున, అన్నదాతలకు అండగా నిలుస్తున్న మనందరి ప్రభుత్వం మరోవైపున నిలిచి ఇవాళ యుద్ధం జరుగుతోంది. సభాస్థలి కిక్కిరిసిసోవడంతో బయటే ఉండిపోయిన ప్రజలు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగు ► ఇవాళ రెయిన్ గన్లు లేవు.. రెయిన్ మాత్రమే ఉంది ► మనందరి ప్రార్థనలను దేవుడు ఆలకించి రైతులకు అండగా నిలిచారు ► అన్యాయస్తుడు సీఎంగా ఉన్నప్పుడు కచ్చితంగా కరువు తాండవిస్తుంది ► వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్తో రూ.1,090.76 కోట్లు.. 51.12 లక్షల మందికి లబ్ధి ► ఇన్పుట్ సబ్సిడీతో మరో రూ.76.99 కోట్లు పరిహారం.. 91,237 మందికి ప్రయోజనం ► నాలుగేళ్లుగా ఏటా 12 లక్షల టన్నుల మేర పెరిగిన ఆహార ధాన్యాల దిగుబడి ► గత ప్రభుత్వ హయాంలో సగటున దిగుబడి 154 లక్షల టన్నులు.. ఇవాళ 166 లక్షల టన్నులు ► గత సర్కారు హయాంలో రూ.40,237 కోట్లతో 2.65 కోట్ల టన్నుల ధాన్యం సేకరణ ► ఈ మూడేళ్ల 8 నెలల వ్యవధిలో రూ.55,444 కోట్లతో 2.94 కోట్ల టన్నుల సేకరణ ► గతంతో పోలిస్తే ఉద్యాన పంటల విస్తీర్ణం 1,43,901 హెక్టార్లు పెరుగుదల ► మనందరి ప్రభుత్వంలో రైతులకు చెల్లించిన బీమా సొమ్ము రూ.6,685 కోట్లు ► గత సర్కారు హయాంలో రూ.3,411 కోట్లు మాత్రమే n ఆక్వా రైతులకు రూ.2,647 కోట్లు విద్యుత్ సబ్సిడీ ► ఉచిత విద్యుత్ కోసం రూ.27,800 కోట్లు వ్యయం n వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.1,834 కోట్లు అందచేశాం -
కదిలి వచ్చిన తెనాలి (ఫొటోలు)
-
Tenali: వైఎస్సార్ రైతు భరోసా సభకు పోటెత్తిన జనాభిమానం..(ఫొటోలు)
-
వైఎస్ఆర్ రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్
-
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో వరుసగా నాలుగో ఏడాది కూడా వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారు. ఈ ఏడాది మూడో విడతగా 51.12 లక్షల మందికి రూ.1,090.76 కోట్లను సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లోకి జమచేశారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘మీ ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఇవాళ్ల రైతులకు సంబంధించి రెండు మంచి కార్యక్రమాలు చేస్తున్నాము. 50 లక్షలకుపైగా రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. వరుసగా నాలుగో ఏడాది మూడో విడత వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తున్నాం. తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీగా ఏటా రూ.13,500 భరోసా అందిస్తున్నాము. ఈ ఏడాది ఇప్పటికే రెండు విడతల్లో 50.92 లక్షల మందికి రూ.5,853.74 కోట్లు లబ్ధిచేకూరింది. మూడో విడత కింద 51.12 లక్షల మందికి రూ. 1.090.76 కోట్లు జమ చేస్తున్నాం. నాలుగేళ్లలో ఒక్కో కుటుంబానికి రూ.54వేల చొప్పున సాయం అందించాం. ఈ నాలుగేళ్ల కాలంలో రైతు భరోసా కింద రూ.27,062 కోట్లు సాయం అందజేశాము. ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లో పరిహారం అందిస్తున్నాము. మాండూస్ తుఫాన్ వల్ల పంట నష్టపోయిన 91,237 మంది రైతులకు రూ. 76,99 కోట్లు అందిస్తున్నాం. వ్యవసాయం బాగుంటేనే రైతులు బాగుంటారు. రైతుల బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. నాలుగేళ్లుగా వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయి. నాలుగేళ్ల కాలంలో ఎక్కడా కరువు అనే మాటే లేదు. 2014-19 మధ్య గత ప్రభుత్వంలో ఓ అన్యాయస్థుడు సీఎంగా ఉన్నాడు. చంద్రబాబు పాలనలో ప్రతీ ఏటా కరువే ఉంది. కరువుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు. మాజీ సీఎం హయంలో ఏటా కరువు మండలాల ప్రకటనే ఉండేది. నాలుగేళ్లుగా ప్రతి చెరువు, రిజర్వాయర్ నిండాయి. రాష్ట్రంలో నాలుగేళ్లుగా భూగర్భ జలాలు పెరిగాయి. నాలుగేళ్లుగా ఆహార ధాన్యాల దిగుబడి సగటున 166 లక్షల టన్నులకు పెరిగింది. నాలుగేళ్లుగా రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ జరిగింది. ధాన్యం సేకరణ కోసం ఇప్పటి వరకు రూ. 55వేల కోట్లకుపైగా ఖర్చు చేశాం. రైతు భరోసా ద్వారా రూ.27వేల కోట్లు అందజేశాం. పట్టా ఉన్న రైతులకే కాకుండా అసైన్డ్ భూముల రైతులు, కౌలు రైతులలకూ రైతు భరోసా అందించాము. ఆర్బీకేల ద్వారా రైతన్నలకు విత్తనం నుంచి ఎరువుల వరకు తోడుగా నిలిచాం. మన ఆర్బీకేలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. టీడీపీ పాలనలో ఐదేళ్లలో 30.85 లక్షల మంది రైతులకు రూ. 3,411 కోట్లు మాత్రమే అందించారు. మన ప్రభుత్వంలో గడిచిన నాలుగేళ్లుగా రైతులకు రూ.6,685 కోట్ల సాయం అందించాం. రైతన్నకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా నిలుస్తున్నాం. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను మేం తీర్చుతున్నాం. సున్నా వడ్డీ కింద ఇప్పటి వరకు రూ,1,834 కోట్లు చెల్లించాం. వ్యవసాయం దండగా అన్న చంద్రబాబుకు మన ప్రభుత్వం మీద కడుపు మండుతోంది. కడుపు మంటకు, అసూయకు అసలే మందు లేదు. చంద్రబాబుది పెత్తందార్ల పార్టీ. మనది పేదల ప్రభుత్వం, రైతన్న ప్రభుత్వం’ అని అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Tenali: వైఎస్సార్ రైతు భరోసా నిధులు జమ చేసిన సీఎం జగన్ (ఫోటోలు)
-
మీ ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు: సీఎం జగన్
Updates.. మీ ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు: సీఎం జగన్ ► సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘మీ ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఇవాళ్ల రైతులకు సంబంధించి రెండు మంచి కార్యక్రమాలు చేస్తున్నాము. 50 లక్షలకుపైగా రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీగా ఏటా రూ.13,500 భరోసా అందిస్తున్నాము. ఈ ఏడాది ఇప్పటికే రెండు విడతల్లో 50.92 లక్షల మందికి రూ.5,853.74 కోట్లు లబ్ధిచేకూరింది. మూడో విడత కింద 51.12 లక్షల మందికి రూ. 1.090.76 కోట్లు జమ చేస్తున్నాం. నాలుగేళ్లలో ఒక్కో కుటుంబానికి రూ.54వేల చొప్పున సాయం అందించాం. ఈ నాలుగేళ్ల కాలంలో రైతు భరోసా కింద రూ.27,062 కోట్లు సాయం అందజేశాము. ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లో పరిహారం అందిస్తున్నాము. మాండూస్ తుఫాన్ వల్ల పంట నష్టపోయిన 91,237 మంది రైతులకు రూ. 76,99 కోట్లు అందిస్తున్నాం. వ్యవసాయం బాగుంటేనే రైతులు బాగుంటారు. రైతుల బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. నాలుగేళ్లుగా వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయి. నాలుగేళ్ల కాలంలో ఎక్కడా కరువు అనే మాటే లేదు. చంద్రబాబు పాలనలో ప్రతీ ఏటా కరువే ఉంది. కరువుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు. మాజీ సీఎం హయంలో ఏటా కరువు మండలాల ప్రకటనే ఉండేది. మన ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి ప్రతిపక్షానికి కడుపుమంటగా ఉంది. రాష్ట్రంలో ఈరోజు యుద్ధం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో కరువుతో స్నేహం చేసిన చంద్రబాబుకు మీ బిడ్డకు మధ్య యుద్ధం జరగబోతోంది. వచ్చే ఎన్నికల్లో ఇంగ్లీష్ మీడియం వద్ద చంద్రబాబుకు మీ బిడ్డకు యుద్ధం జరగబోతోంది. రాష్ట్రంలో గజ దొంగల ముఠా ఉంది. ఈ ముఠా పని దోచుకో.. పంచుకో.. తినుకో మాత్రమే. గజదొంగల ముఠాలో ఇంకొకరు దత్తపుత్రుడు. దుష్టచతుష్టాయానికి తోడు దత్తపుత్రుడు జతకలిశాడు. చంద్రబాబు ఎందుకు సంక్షేమ పథకాలు పెట్టలేకపోయాడు. ఆ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్లాయి?. ఇప్పుడు కూడా అదే బడ్జెట్, అదే రాష్ట్రం. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వ్యతిరేకం అన్నాడు చంద్రబాబు. మీ బిడ్డ పాలనకు.. చంద్రబాబు పాలనకు వ్యత్యాసాన్ని గమనించాలి. మంచి చేశాం, మంచి జరిగిందని అనిపిస్తే తోడుగా ఉండండి. ఇచ్చిన హామీలు అన్ని నెరవేస్తున్నాం. చంద్రబాబుకు, దత్తపుత్రుడికి సవాల్ విసురుతున్నాను. 175కి 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం ఉందా?. మీ బిడ్డకు భయంలేదు. చేసిన మంచి చెప్పుకునే మళ్లీ అధికారంలోకి వస్తాం’ అని అన్నారు. ► కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతే అసలైన శాస్త్రవేత్త అని నమ్మిన వ్యక్తి సీఎం జగన్. ఏ సీజన్లో పంట నష్టం ఆ సీజన్లోనే అందిస్తున్న ఏకైన సీఎం వైఎస్ జగన్. దేశంలోనే వందశాతం రైతు బీమా ప్రీమియం భరించిన ఏకైన రాష్ట్రం ఏపీ. చంద్రబాబు హయంలో అన్నీ కరువు కాటకాలే అని అన్నారు. ► తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ.. సీఎం జగన్ పాదయాత్ర రాష్ట్రంలో ప్రజల గుండె చప్పుడు. రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ పాలన అందుతోంది. రైతు భరోసా, అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, చేయూత వంటి పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరం. జగనన్న సేవకుడు శివకుమార్ అన్ని అన్నారు. నియోజకవర్గంలో పేదలకు 26వేల ఇళ్లు ఇచ్చిన ఘనత సీఎం జగనన్నకే దక్కింది. తెనాలి గడ్డ.. జగనన్న అడ్డ అని అన్నారు. ► రైతుల గుండెల్లో సీఎం జగన్ చిరస్థాయిగా నిలిచిపోతారు. దేశ చరిత్రలో రైతు సంక్షేమం కోసం పాటుపడిన ఏకైక సీఎం వైఎస్ జగన్. పాదయాత్రతో రాష్ట్ర దశదిశను మార్చిన వ్యక్తి సీఎం జగన్. ► రైతుల గురించి సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా.. రైతు బాగుంటనే రాష్ట్రం బాగుంటుంది అని కామెంట్స్ చేశారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది.#YSRRythuBharosa pic.twitter.com/kgtewgmrAZ — YS Jagan Mohan Reddy (@ysjagan) February 28, 2023 ► తెనాలి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్. ► గుంటూరు జిల్లా తెనాలికి బయలుదేరిన సీఎం జగన్. సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో వరుసగా నాలుగో ఏడాది కూడా వైఎస్సార్ రైతు భరోసా అమలుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తోంది. ఈ ఏడాది మూడో విడతగా 51.12 లక్షల మందికి రూ.1,090.76 కోట్లను సీఎం జగన్ మంగళవారం తెనాలి మార్కెట్యార్డులో జరిగే కార్యక్రమంలో నేరుగా వారి ఖాతాల్లోకి జమచేయనున్నారు. ► రైతులకు ఏటా రూ.12,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని ఎన్నికల మానిఫెస్టోలో హామీ ఇవ్వగా, అంతకంటే మిన్నగా ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్నారు. వరుసగా నాల్గో ఏడాదిలో కూడా ఇప్పటికే రెండు విడతల్లో రూ.11,500 సాయం అందించారు. మూడో విడతగా ఒక్కొక్కరికి మరో రూ.2వేల చొప్పున 51.12 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో రూ.1,090.76 కోట్లను సీఎం జగన్ నేడు జమచేయనున్నారు. ► ఇక 2022 డిసెంబర్లో మాండూస్ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన 91,237 మంది వ్యవసాయ, ఉద్యాన రైతన్నలకూ రూ.76.99 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ మొత్తాన్ని రబీ సీజన్ ముగియక ముందే వారి ఖాతాల్లో జమచేస్తున్నారు. ఈ మొత్తంతో కలిపి ఇప్పటివరకు 22.22 లక్షల మంది రైతన్నలకు రూ.1,911.78 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని అందించారు. ఇలా గడిచిన మూడేళ్ల తొమ్మిది నెలల్లో రైతులకు మొత్తం మీద నేరుగా రూ.1,45,751 కోట్ల లబ్ధిని చేకూర్చారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పాడి రైతుకు తోడు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు పాడి రైతన్నలకు బాసటగా నిలుస్తూ పశువులకు పూర్తిస్థాయి ఆరోగ్య భద్రత కల్పిస్తున్నాయి. ఆర్బీకేల రాకతో తమ కష్టాలకు తెర పడిందని పాడి రైతులు చెబుతున్నారు. ప్రాథమిక వైద్యం కోసం మండల కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిన అవస్థలు తొలగిపోయాయి. ఆర్బీకేలతో గ్రామ స్థాయిలో పశువైద్య సేవలందించడమే కాకుండా సర్టిఫై చేసిన నాణ్యమైన పశుగ్రాస విత్తనాలు, సంపూర్ణ మిశ్రమ దాణా, మినరల్ మిక్చర్, చాప్ కట్టర్స్.. ఏది కావాలన్నా గుమ్మం వద్దకే తెచ్చి ఇస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 108 అంబులెన్స్ల తరహాలో వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా దేశంలోనే తొలిసారిగా వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవా రథాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. రూ.240.69 కోట్ల వ్యయంతో రెండు విడతల్లో 340 అంబులెన్స్లను సిద్ధం చేశారు. వీటిని నియోజక వర్గానికి రెండు చొప్పన అందుబాటులోకి తీసుకొచ్చి ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ప్రతి అంబులెన్స్ లో రూ.35 వేల విలువైన 81 రకాల మందులను అందుబాటులో ఉంచారు. 54 రకాల అత్యాధునిక పరికరాలతో పాటు వెయ్యి కిలోలు బరువున్న జీవాలను ఎత్తగలిగేలా హైడ్రాలిక్ లిఫ్ట్ సౌకర్యం కల్పించారు. ఇప్పటివరకు కాల్ సెంటర్కు రైతుల నుంచి రోజుకు సగటున 1500 కాల్స్ చొప్పున 3.90 లక్షల కాల్స్ రాగా మారుమూల పల్లెల్లో 1.30 లక్షల ట్రిప్పులు తిరిగాయి. దాదాపు 2 లక్షలకుపైగా పశువులకు అత్యవసర వైద్య సేవలు అందించారు. ఇప్పటి వరకు 1.35 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. ఏపీ తరహాలో పంజాబ్, కేరళ, ఛత్తీస్ ఘడ్ తదితర రాష్ట్రాలు వెటర్నరీ అంబులెన్స్లను తీసుకొస్తున్నాయి. ఆర్బీకేల ద్వారా అందిస్తున్న పశు వైద్యసేవలపై ‘సాక్షి బృందం’ రాష్ట్రవ్యాప్తంగా క్షేత్ర స్థాయి పరిశీలన నిర్వహించింది. మూగ జీవులపై మమకారం.. వైఎస్సార్ పశు సంరక్షణ పథకం కింద పశువులకు హెల్త్కార్డులు జారీ చేయడమే కాకుండా పాడి రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులతో ఆర్ధిక చేయూతనిస్తున్నారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తూ సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు అందిస్తున్నారు. కృత్రిమ గర్భదారణ, పునరుత్పత్తి, దూడల సంరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతినెలా 3వ శనివారం పాడి రైతులకు, 2, 4వ బుధవారాల్లో గొర్రెలు, మేకల పెంపకందారులకు వైఎస్సార్ పశువిజ్ఞానబడులు నిర్వహిస్తూ సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఆర్బీకేల్లో దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా పాడి, మూగజీవాల పెంపకంపై శిక్షణ ఇస్తున్నారు. పాడి రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా 155251, 1962 టోల్ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. రెండున్నరేళ్లలో సేవలిలా.. రాష్ట్రవ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు కాగా పాడి సంపద ఎక్కువగా ఉన్న 8,330 ఆర్బీకేల్లో ట్రైవిస్ను ఏర్పాటు చేశారు. ప్రతి నెలా రూ.4 వేల విలువైన మందులను సరఫరా చేస్తున్నారు. ఆర్బీకేల ద్వారా గత 32 నెలల్లో 4,468 టన్నుల గడ్డి విత్తనాలు, 62,435 టన్నుల సంపూర్ణ మిశ్రమం, 60 వేల కిలోల నూట్రిషనల్ సప్లిమెంట్స్, 350 టన్నుల పశువుల మేతతో పాటు 3,909 చాప్ కట్టర్స్ పంపిణీ చేశారు. ఆర్బీకేల ద్వారా 2 కోట్ల పశువులకు టీకాలిచ్చారు. 33.08 లక్షల పశువులకు హెల్త్ కార్డులు జారీ చేశారు. 14.73 లక్షల పశువులకు కృత్రిమ గర్భధారణ జరిగింది. 1.61 కోట్ల పశువులకు ప్రాథమిక వైద్యసేవలు అందించారు. పశువిజ్ఞాన బడుల్లో 13.99 లక్షల మంది రైతులకు శిక్షణ నిచ్చారు. ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు 42 వేల మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులందించి రుణ పరపతి కల్పిస్తున్నారు. 75 శాతం రాయితీపై విత్తనాలు గతంలో నాణ్యమైన పచ్చగడ్డి దొరక్క పశువులు సకాలంలో ఎదకు వచ్చేవి కావు. పాల దిగుబడి సరిగా ఉండేది కాదు. ఆర్బీకేల ద్వారా రాయితీపై నాణ్యమైన మొక్కజొన్న (ఆఫ్రికన్ టాల్ గడ్డి రకం) విత్తనాలను 75 శాతం రాయితీపై తీసుకొని సాగు చేశా. 60 రోజుల్లో 9 అడుగులు పెరిగి ఎకరానికి 5–6 టన్నుల దిగుబడి వచ్చింది. ఇప్పుడు మేత ఇష్టంగా తింటున్నాయి. సకాలంలో ఎదకు రావటమే కాకుండా పాల దిగుబడి రోజుకి 2–3 లీటర్లు పెరిగింది. సీఎం జగన్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. – అంకంరెడ్డి రవికుమార్, ఓఈపేట, అనకాపల్లి జిల్లా ఆరోగ్యంగా పశువులు.. అదనంగా లాభం నాకు 8 పశువులున్నాయి. గడ్డి కత్తిరించే యంత్రాల ద్వారా మేత వృథా కాకుండా ఎలా నివారించవచ్చో పశువిజ్ఞాన బడి కార్యక్రమాల ద్వారా తెలుసుకున్నా. 40 శాతం రాయితీపై గడ్డి కత్తిరించే యంత్రాన్ని ఆర్బీకేలో తీసుకున్నా. మొక్కజొన్న గడ్డిని ముక్కలుగా చేసి అందిస్తున్నా. గేదెలు ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నాయి. గతంలో 62 లీటర్ల పాల దిగుబడి రాగా ప్రస్తుతం 70 లీటర్లు వస్తున్నాయి. అదనంగా రూ.320 లాభం వస్తోంది. ప్రభుత్వానికి నిజంగా రుణపడి ఉంటాం. – చిలంకూరి తిరుపతయ్య, లింగారెడ్డిపల్లి, ప్రకాశం జిల్లా మేతకు ఇబ్బంది లేదు.. గతంలో పశుగ్రాసం కోసం చాలా ఇబ్బందిపడే వాళ్లం. ఇటీవలే ఆర్బీకేలో సీఎస్హెచ్–24 గడ్డిజాతి విత్తనాలను రాయితీపై తీసుకున్నా. ఎకరం పొలంలో 15 కిలోలు చల్లా. 60 రోజుల్లో ఆరడుగులు పెరిగింది. కత్తిరించి పశువులకు మేతగా వేస్తున్నాం. సకాలంలో ఎదకు వస్తున్నాయి. పాల దిగుబడి కూడా పెరిగింది. –శ్రీరాం లక్ష్మీనారాయణ, చిల్లకల్లు, ఎన్టీఆర్ జిల్లా ఆర్బీకేల ద్వారా పశువైద్య సేవలు ఆర్బీకేల ద్వారా పాడిరైతుల గడప వద్దకే పశు వైద్య సేవలందిస్తున్నాం. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. పాడిరైతుకు ఏది కావాలన్నా ఆర్బీకేల ద్వారా అందిస్తున్నాం. రూ.4 వేల విలువైన మందులతో పాటు నాణ్యమైన పశుగ్రాస విత్తనాలు, సంపూర్ణ మిశ్రమ దాణా, గడ్డికోసే యంత్రాలను ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచుతున్నాం. –డాక్టర్ అమరేంద్రకుమార్, డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ వెన్న శాతం, దిగుబడి పెరిగింది వైఎస్సార్ జిల్లా వెలమవారిపల్లెకు చెందిన జే.గుర్రప్ప జీవనాధారం పాడిపోషణే. తనకున్న 15 పశువులకు మేతగా ఎండుగడ్డి, శనగ కట్టెతో పాటు ఆరు బయట లభ్యమయ్యే పచ్చగడ్డి అందించినప్పుడు ఆశించిన పాల దిగుబడి వచ్చేది కాదు. పశువులు తరచూ అనారోగ్యాల బారిన పడేవి. ఆర్నెళ్ల క్రితం ఆర్బీకే ద్వారా 50 కిలోల గడ్డి విత్తనాలు తీసుకొని సాగు చేశాడు. గడ్డిలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో పశువులు ఇష్టంగా మేత మేశాయి. పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. రోజుకు 4–4.5 లీటర్ల పాలు ఇచ్చే ఈ పశువులు ప్రస్తుతం 5–6.5 లీటర్లు ఇస్తున్నాయి. పాలల్లో వెన్న శాతం 5–6 నుంచి 7–8 శాతానికి పెరిగింది. లీటర్పై రూ.10 అదనంగా పొందగలుగుతున్నట్లు గుర్రప్ప ఆనందంగా చెబుతున్నాడు. -
వైఎస్సార్ రైతు భరోసా నగదు పంపిణీ చేయనున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం గుంటూరు జిల్లాలోని తెనాలిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నాలుగో ఏడాది మూడో విడతలో భాగంగా వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్, ఇటీవల పంటలు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ చేయనున్నారు. షెడ్యూల్ ఇదే.. - సీఎం జగన్ మంగళవారం ఉదయం 9.50 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి.. 10.15 గంటలకు తెనాలి చేరుకుంటారు. - ఉదయం 10.35 గంటలకు స్ధానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలోని బహిరంగ సభా వేదికకు చేరుకుంటారు. - నాలుగో ఏడాది మూడో విడత వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్, ఇటీవల పంటలు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ కార్యక్రమంలో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. - అనంతరం 12.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.10 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
తలరాత మార్చే చైతన్యదీప్తి.. గడప గడపలో నూతన శోభ!
అద్దె చెల్లించాల్సిన బాధ తప్పి సొంత ఇంట్లో ఉన్నామనే సంతోషం ఉందని నియోజకవర్గంలో గడప గడపకు తిరుగుతున్నప్పుడు చాలామంది మహిళలు చెబుతున్నారు. ఇలాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో ఉన్నారు. నూతన సంవత్సర శోభ పల్లె గడప తొక్కిందని చెప్పడానికి ఇది కేవలం ఒక ఉదాహరణ. ఇలాంటి ఉదాహరణలు రాష్ట్రంలో కోకొల్లలుగా మనకు కనిపిస్తున్నాయి. జీవన ప్రమాణాలు మెరుగు పడటమే నిజమైన అభివృద్ధి అని గట్టిగా నమ్మిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం... పాలనను ప్రజల గడప వద్దకు తీసుకెళ్లింది. సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. కరోనా విపత్తు సృష్టించిన ఆర్థిక అల్లకల్లోలం నుంచి తేరుకోవడానికి ప్రయత్నిస్తూనే... పేదల జీవితాలకు ఆసరాగా నిలబడాలనే చిత్తశుద్ధి ప్రభుత్వం అందుకుంటున్న ప్రతి పథకం లోనూ ప్రజలకు ప్రస్పుటంగా కనిపిస్తోంది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా ప్రజల గుమ్మం ముందుకు వెళుతున్న క్రమంలో.. పేదల జీవితాల్లో వస్తున్న మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సొంతింటి కల నెరవేరిన అక్కాచెల్లెమ్మల కళ్లల్లో, ఎవరి మీదా ఆధార పడకుండా ఒకటో తేదీ వేకువనే అందుతున్న పెన్షన్తో గౌరవంగా బతుకుతున్న అవ్వాతాతల ముఖాల్లో, ఆసరా–చేయూతతో తన కాళ్ల మీద నిలబడి ఆత్మగౌరవంతో జీవిస్తున్న అక్కల ఆత్మీయ పలకరింపుల్లో, పిల్లలకు మంచి చదువులు చెప్పించడానికి అండగా నిలిచిన ‘అమ్మఒడి’ అందుకుంటున్న చెల్లెమ్మల సంతోషంలో, అన్నం పెడుతున్న అమ్మను గౌరవించడాన్ని బాధ్యతగా తీసుకొని ఇంటి ముందుకు ప్రభుత్వం పంపించిన వాహనం నుంచి బియ్యం తీసు కుంటున్న మహిళల మోముల్లో, వ్యవసాయాన్ని పండగ చేయడానికి అండగా నిలిచిన రైతు భరోసా కేంద్రాల సేవలు అందుకుంటున్న రైతన్నల ఆనందంలో... ఒకరేమిటి... ఊరిలో అన్ని వర్గాల ప్రజల్లో వ్యక్తమవుతున్న సంతృప్తిలో కొత్త సంవత్సరం శోభ కనిపిస్తోంది. రైతుల నుంచి సేకరించిన ధాన్యం సొమ్ము రైతుల ఖాతాల్లో పడుతోంది. మిల్లర్లు, దళారుల బెడద లేకుండా మద్దతు ధరకు రైతులు ధాన్యం విక్రయిస్తున్నారు. ఊరికే కొత్త రూపుతెచ్చిన గ్రామ సచివాలయాలు... ప్రజల ముంగిటకు పాలనను తీసుకొచ్చి ప్రజల అవసరాలు తీర్చి వారి ముఖాల్లో సంతోషానికి కారణంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు అందుబాటులోకి రావడంతో నూతన సంవత్సరం శోభ ఇనుమ డిస్తోంది. సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో లక్ష మందికి ఒకేసారి ప్రొబేషన్ ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఉద్యోగులు తమ ఇళ్లతో పాటు వారు పనిచేస్తున్న సచివాలయం పరిధిలోని ఇళ్లకూ నూతన సంవత్సరం శోభను తీసుకురావడానికి, ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన సందేశాన్ని మోసుకెళ్లడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. అవ్వాతాతలకు ఇస్తున్న పెన్షన్ ఈ జనవరి 1 నుంచి రూ. 2,750 పెంచారు. పెన్షన్ పెంపుతో 64 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది. రైతు భరోసాను అర కోటి మందికి పైగా రైతులకు అందిస్తున్నారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద దాదాపు 4 లక్షల మంది అక్కాచెల్లెమ్మలు లబ్ధి పొందుతున్నారు. జగనన్న చేదోడు 3 లక్షల మందికి, జగనన్న తోడు దాదాపు 5.5 లక్షల మందికి... ఇలా చెప్పుకొంటూపోతే, పల్లె గడపలో ప్రభుత్వం నుంచి పథకాలు అందుకోని వారు ఉండరనే చెప్పాలి. అందుకే ప్రగతిపథం వైపు అడుగులేస్తున్న ప్రతి ఇంటి గడపలో నూతన సంవత్సరం శోభ కనిపిస్తోంది. చదువు ఒక్కటే పేదల తలరాత మారుస్తుందని నమ్మిన ప్రభుత్వం ఇది. ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే దృఢ సంకల్పం ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఉండటం వల్లే ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉచితంగా ట్యాబ్లు ఇచ్చి... అందులో బైజూస్ పాఠాలు అందిస్తున్నారు. ఒకప్పుడు కేవలం కార్పొరేట్ స్కూళ్లకే పరిమితమయిన ఇలాంటివి ఇప్పుడు ప్రభుత్వ బడుల్లో సాకారం కావడం.. రాజ్యాంగం ఇచ్చిన సమాన అవకాశాలు పొందే హక్కును రక్షించడమే. నాణ్యమైన చదువులతో పైకొస్తున్న ప్రతి విద్యార్థి.. ఒక తరం తలరాత మార్చే చైతన్యదీప్తి. ఈ వెలుగులతో కొత్త సంవత్సరం శోభ పల్లె గడప తొక్కింది. (క్లిక్ చేయండి: బాబోయ్! హ్యాండిల్ విత్ కేర్...) - కైలే అనిల్ కుమార్ ఎమ్మెల్యే, పామర్రు, కృష్ణా జిల్లా -
సున్నా వడ్డీ రుణాలు.. గిరిజన రైతులకు మేలు
ఏజెన్సీ ప్రాంతాలలో వ్యవసాయం చేసే గిరిజన కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం బ్యాంకులు ఈ చిన్న, సన్న కారు రైతులకు రుణాలు ఇవ్వకపోవడమే. ఏటా ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో వడ్డీ వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుండి ఏజెన్సీ ఏరియాకి వస్తుం టారు. బ్యాంకు రుణం దొరకని రైతులు తప్పనిసరి పరిస్థితిలో ఈ వడ్డీ వ్యాపారుల నుండి విత్తనాలు, ఎరువులు, అప్పు తీసుకుంటారు. వ్యాపారులు 10 నుంచి 15 శాతం వడ్డీ వసూలు చేస్తారు. సుమారు 20 శాతం పంట డబ్బులను బయానా (అడ్వాన్స్)గా పొందడమే గాక, వాటికి వడ్డీ చెల్లించకపోవడం కొసమెరుపు మోసం. తిండి గింజల కోసం ఆరుగాలం కష్టించే రైతులు... ప్రత్యామ్నాయంగా పత్తి తదితర వాణిజ్య పంటలు పండించినా ఆదాయం అంతంత మాత్రమే వస్తుండటంతో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణ లోని కొన్ని ఆదివాసీ ప్రాంత రైతులకు అటవీ హక్కు పత్రాలు ఇవ్వక పోవ డంతో బ్యాంకు రుణాలు అందటం లేదు. 2016లో గిట్టుబాటు ధర లభించని ఒక కుటుంబం (ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ లోని కుంటగూడ గ్రామం) వడ్డీ వ్యాపారికి రూ.60 వేల విలువైన ఎడ్లను అమ్మివేసి, తమ పిల్లలను చదువు మాన్పించి, కూలి పనులకు కుదిర్చింది. వడ్డీ వ్యాపారులకు భయపడి కొందరు రాత్రివేళ ఇళ్ళు చేరడం, లేదా గూడేలు వదిలి పోవడం జరుగుతోంది. ఇక రోజువారీ ‘గిరిగిరి’ వ్యాపారం వర్ణించ లేనిది. గిరిజనుల అమాయకత్వాన్ని, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకొని, వడ్డీ వ్యాపారులు చేస్తున్న మోసాలు అరికట్టేందుకు ప్రభుత్వం ఏజెన్సీలో వడ్డీ వ్యాపార నిబంధన చట్టం–1960ను రూపొందించింది. దీని ప్రకారం నాము, సిరి నాము పేరుతో పంటల మీద వడ్డీకి అప్పులు ఇవ్వడం నిషేధించబడింది. ఈ చట్టం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 5,948 షెడ్యూల్డ్ ఏజెన్సీ ప్రాంతాలన్నింటికీ వర్తిస్తుంది. ఈ చట్టం ప్రకారం లైసెన్స్ పొందకుండా రుణాలు ఇవ్వరాదు. అనుమతి లేకుండా వ్యాపారం చేస్తే ఏడాది జైలు శిక్ష లేదా రూ. 1000 వరకు జరిమానా లేదా రెండూ విధిస్తారు. అయితే చట్టాన్ని అమలు చేయడంలో ఉన్న సాచివేత ధోరణి వల్ల ఏజెన్సీ రైతుల కష్టాలు అలాగే ఉండిపోయాయి. ప్రస్తుతం ఏపీలో ‘వైఎస్సార్ రైతు భరోసా’, తెలంగాణలో ‘రైతుబంధు’ పథకాల ద్వారా అందే సాయం వల్ల కొంత మేలు జరుగుతోంది. రైతులందరికీ పెట్టుబడిగా ఇవ్వబోయే ముందస్తు సాయం, రుణాలు సకాలంలో అందించి ఏజెన్సీ ప్రాంత అన్నదాతలను ఆదుకోవాలి. ప్రభుత్వం సున్నా వడ్డీ రుణాలు ఇస్తే ఈ రైతులకు మేలు జరుగుతుంది. (క్లిక్ చేయండి: యావజ్జీవ శిక్ష అంటే జీవిత శేషభాగం) – గుమ్మడి లక్ష్మీనారాయణ, ఆదివాసీ రచయితల వేదిక వ్యవస్థాపక కార్యదర్శి (డిసెంబర్ 23 జాతీయ రైతు దినోత్సవం) -
దేశ వ్యాప్తంగా ఆర్బీకేలు
సాక్షి, అమరావతి: వ్యవసాయంలో రైతన్నలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలందించేందుకు, నాణ్యమైన ఇన్పుట్స్, సాగుకు సంబంధించి అన్ని రకాల ఇతర సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన అద్భుత వ్యవస్థ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు). రాష్ట్ర వ్యవసాయ రంగంలో అత్యున్నత ఫలితాలు ఇస్తున్న ఈ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకుంటోంది. ఈ వ్యవస్థ ఏర్పాటుకు ఇప్పటికే ఇథియోపియా దేశం రాష్ట్ర అధికారుల సహకారం తీసుకుంటోంది. దేశంలోని పలు రాష్ట్రాలు కూడా ఈ వ్యవస్థ ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఆ రాష్ట్రాల అధికార బృందాలు రాష్ట్రానికి వచ్చి ఆర్బీకేలు, డిజిటల్ కియోస్క్లపై అధ్యయనం చేశాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ తరహా వ్యవస్థను దేశవ్యాప్తంగా నెలకొల్పడానికి చర్యలు చేపట్టింది. బుధవారం న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఏఆర్ఐ–పూస)లో ప్రారంభమైన మూడు రోజుల 5వ ఇండియా అగ్రి బిజినెస్ సమ్మిట్–2022 సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే ఈ విషయం చెప్పారు. సదస్సులో భాగంగా నిర్వహించిన జాతీయ అగ్రి ఎక్స్పోలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన ఆర్బీకేల నమూనా, డిజిటల్ కియోస్క్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆర్బీకే ద్వారా అందిస్తున్న సేవలు, డిజిటల్ కియోస్క్ల పనితీరును కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్తో పాటు ఫిలిప్పైన్స్ వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి విలియం దార్, రోమన్ ఫోరమ్ ప్రెసిడెంట్ మహారాజ్ ముతూ, ఇండియన్ ఛాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ చైర్మన్ డాక్టర్ ఎంజే ఖాన్, సలహాదారు ఎన్కే దడ్లాని, నేషనల్ రెయిన్ఫెడ్ ఏరియా అథారిటీ (ఎన్ఆర్ఏఏ) సీఈవో అశోక్ దాల్వాయి తదితరులు అడిగి తెలుసుకున్నారు. ఆర్బీకేల ద్వారా ఏపీ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సేవలను తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ఆర్బీకే సేవలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని, ఇదే తరహా సేవలను దేశవ్యాప్తంగా గ్రామస్థాయిలో ఏర్పాటు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే చెప్పారు. ఆర్బీకేలు, వాటిలోని కియోస్క్లు వ్యవసాయ రంగంలో విప్లవం తీసుకొచ్చే వినూత్నమైన పరిజ్ఞానమని ఆయన కొనియాడారు. ‘ఏపీ ఆర్బీకేల గురించి చాలా వింటున్నాం. వాటి ద్వారా అందిస్తున్న సేవలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆర్బీకేల్లో డిజిటల్ కియోస్క్ల ద్వారా ఇన్పుట్స్ బుకింగ్ విధానం అద్భుతం. వాటిని జాతీయ స్థాయిలో రైతులకు అందుబాటులోకి తేవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో వీటిని గ్రామ స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తా’ అని చెప్పారు. ఈ మేరకు కార్యాచరణ సిద్ధం చేయాలని, డిసెంబరుకల్లా డిజిటల్ కియోస్క్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సదస్సుకు వచ్చిన మధ్యప్రదేశ్ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు కేంద్ర మంత్రి ఆదేశాలు జారీ చేశారు. రైతు ముంగిటకే విత్తన సరఫరా భేష్ కేంద్ర మంత్రి సంజీవ్కుమార్ బల్యాన్, నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్చంద్ ప్రశంసలు నాణ్యమైన ధ్రువీకరించిన విత్తనాలను గ్రామ స్థాయిలో రైతుల ముంగిటకే అందించడం వినూత్న ఆలోచన అని కేంద్ర మత్స్య, పశు సంవర్ధక శాఖల సహాయ మంత్రి సంజీవ్ కుమార్ బల్యాన్, నీతి ఆయోగ్ సభ్యుడు (వ్యవసాయం) రమేష్ చంద్ ప్రశంసించారు. విత్తన పంపిణీలో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికే ఆదర్శమని చెప్పారు. మూడేళ్లలో 50.95 లక్షల మందికి 34.97 లక్షల క్వింటాళ్ల విత్తనాలను అత్యంత పారదర్శకంగా పంపిణీ చేయడం నిజంగా గొప్ప విషయమన్నారు. వ్యవసాయ రంగంలో విశేష ప్రతిభ కనబర్చిన సంస్థలకు ఇండియన్ చాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ఐసీఎఫ్ఏ) ఏటా అందించే ఇండియా అగ్రి బిజినెస్ అవార్డుల్లో విత్తన పంపిణీ కేటగిరీలో ఏపీ సీడ్స్కు గ్లోబల్ అగ్రి అవార్డును అందించింది. బుధవారం జరిగిన ఇండియా అగ్రి బిజినెస్ సమ్మిట్లో ఈ అవార్డును సంజీవ్కుమార్ బల్యాన్, రమేష్చంద్ చేతుల మీదుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్పర్సన్ పి.హేమసుష్మిత, ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్బాబు అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విత్తన పంపిణీలో ఏపీ అనుసరిస్తున్న విధానాన్ని జాతీయ స్థాయిలో అమలు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. ఇదే ఆలోచనతో కేంద్రం పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను తీసుకొచ్చిందని చెప్పారు. మిగతా రాష్ట్రాలు కూడా ఏపీ బాటలోనే విత్తన పంపిణీని గ్రామ స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పంతోనే.. విత్తు నుంచి విక్రయం వరకు ఆర్బీకేల ద్వారా అందిస్తున్న సేవలను రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య సదస్సులో వివరించారు. పౌర సేవలు ప్రజల గుమ్మం వద్ద అందించాలన్న సంకల్పంతో ఏపీ సీఎం వైఎస్ జగన్ సచివాలయ, ఆర్బీకే వ్యవస్థలను తీసుకొచ్చారని చెప్పారు. ఆర్బీకేల్లోని డిజిటల్ కియోస్క్ల ద్వారా సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను బుక్ చేసుకున్న గంటల్లోనే రైతుల ముంగిట అందిస్తున్నామని చెప్పారు. ఆర్బీకేలకు అనుబంధంగా యంత్ర సేవా కేంద్రాలు, నియోజకవర్గ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటు చేశామన్నారు. గ్రామాల్లో గోదాములతో పాటు పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ప్రతి ఎకరాలో సాగయ్యే పంటల వివరాలను ఈ– క్రాప్ ద్వారా నమోదు చేయడం, ఈ డేటా ఆధారంగా పైసా భారం పడకుండా పంటల బీమా, పెట్టుబడి రాయితీ, సున్నా వడ్డీ పంట రుణాలు వంటి సంక్షేమ ఫలాలు రైతులకు అందిస్తున్నామని వివరించారు. బ్యాంకింగ్ కరస్పాండెంట్ల ద్వారా ఆర్బీకే స్థాయిలో బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఆర్బీకేలను కొనుగోలు కేంద్రాలుగా కూడా మార్చి, గ్రామస్థాయిలోనే పంట ఉత్పత్తులు కొంటున్నామన్నారు. ఆర్బీకేల సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు పలు రాష్ట్రాలతో పాటు ఇథియోపియా వంటి ఆఫ్రికన్ దేశం కూడా ముందుకొచ్చిందని వివరించారు. ఆసక్తిగా విన్న పలు రాష్ట్రాల ఉన్నతాధికారులు ఆర్బీకేల పని తీరును మరింత లోతుగా రాష్ట్ర అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సదస్సులో ఏపీ సీడ్స్ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్బాబు, మచిలీపట్నం ఎంఏవో జీవీ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
AP: దేశంలోనే తొలిసారిగా.. రైతుల కోసం మొక్కల డాక్టర్లు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు త్వరలో ప్లాంట్ అండ్ సాయిల్ క్లినిక్లుగానూ సేవలందించనున్నాయి. ఆర్బీకేల్లో సేవలందిస్తున్న గ్రామ వ్యవసాయ, ఉద్యాన, పట్టు సహాయకులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్లాంట్ డాక్టర్లుగా తీర్చిదిద్దే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పంటలకు సోకే తెగుళ్లు, మట్టి నమూనాలను పరీక్షించేందుకు వచ్చే మార్చి నాటికి ప్రతి ఆర్బీకేకు ప్లాంట్ డాక్టర్ కిట్లను అందించనున్నారు. దేశంలోనే తొలిసారిగా ప్లాంట్ డాక్టర్ల వ్యవస్థను వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. భూసారం, పోషకాలు, నీటి, సూక్ష్మ పోషక లోపాలకు సంబంధించి క్షణాల్లో పరీక్ష ఫలితాలను అందించడమే కాకుండా.. సకాలంలో తగిన సలహాలు, సూచనలు అందించేలా ప్లాంట్ డాక్టర్ విధానానికి రూపకల్పన చేసింది. ఇందుకోసం ప్రతి ఆర్బీకేలో రూ.75 వేల విలువైన సాయిల్ టెస్టింగ్ పరికరాలు (భూ పరీక్షక్), పంటల ఆధారిత లీఫ్ కలర్ చార్ట్ (ఎల్సీసీ), సూక్ష్మ పోషకాల లోపాల చార్ట్, మేగ్నిఫయింగ్ లెన్స్, జీపీఎస్, డిజిటల్ కెమెరా తదితర పరికరాలను మార్చి నాటికి అందుబాటులోకి తీసుకొస్తారు. ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ కోసం మొబైల్ అప్లికేషన్ను అభివృద్ధి చేస్తున్నారు. రైతులు భూసారం, పోషకాలు.. నీటి యాజమాన్యం, సూక్ష్మపోషక లోపాల గుర్తింపు, పురుగులు–తెగుళ్లు, వ్యాధి నిర్ధారణ, కలుపు నివారణ చేపట్టాలంటే వెంటనే పరీక్ష ఫలితాలు వస్తేనే సాధ్యమవుతుంది. గతంలో భూసార, నీటి పరీక్షలు చేయాలంటే రోజులు, వారాల సమయం పట్టేది. ఫలితాలొచ్చేలోగా అదును దాటిపోయేది. దీంతో చేసేది లేక మూస పద్ధతిలోనే భూసారంతో సంబంధం లేకుండా మోతాదుకు మించి ఎరువులు, పురుగుల మందులు వినియోగించేవారు. దీంతో పంటలు తరచూ తెగుళ్ల బారినపడి ఆశించిన దిగుబడులు రాక అన్నదాతలు ఆర్థికంగా ఇబ్బందిపడేవారు. ఇందుకు ప్రధాన కారణం తగినన్ని ప్రయోగశాలలు లేకపోవడం, సిబ్బంది కొరత ఉండేది. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ను తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి గ్రామ స్థాయిలో ప్లాంట్ డాక్టర్లను అందుబాటులోకి తెస్తోంది. ఇందుకోసం రూ.100 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. 60 సెకన్లలోనే ఫలితాలు ఐఐటీ కాన్పూర్ అభివృద్ధి చేసిన భూ పరీక్షక్ పరికరాన్ని ప్రతి ఆర్బీకేలో వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి అందుబాటులో తీసుకొస్తున్నారు. ఈ పరికరంలో మట్టి నమూనా వేస్తే.. భూమి స్వభావంతోపాటు భూమిలోని ఆరు (ఎన్, పీ, కే, ఓసీ, సీఈసీ, క్లే) పారామీటర్స్ను పరీక్షిస్తుంది. ఎలాంటి కెమికల్స్ ఉపయోగించకుండా స్పెక్ట్రోస్కోపీ, ఎల్ఓటీ టెక్నాలజీ ద్వారా కేవలం 60 సెకన్లలోనే ఫలితాలను అందిస్తుంది. రోజుకు వంద శాంపిల్స్ను పరీక్షించే సామర్ధ్యం ఉన్న ఈ పరికరాల ద్వారా వచ్చే ఫలితాల ఆధారంగా భూమిలోని లోపాలను పసిగట్టవచ్చు. ఒక్క భూసారమే కాదు.. సూక్ష్మపోషక లోపాలు, మొక్కలకు వచ్చే తెగుళ్లు, వ్యాధులను కూడా పరీక్షించి నిర్ధారించుకోవచ్చు. ఫలితాలను రైతుల మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్, వాట్సాప్ మెసేజిల ద్వారా పంపిస్తారు. ఫలితాల ఆధారంగా ప్లాంట్ క్లినిక్ (ఆర్బీకే) ద్వారా వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు సూచించే సిఫార్సులను రాతపూర్వకంగా (వైద్యుని ప్రిస్కిప్షన్ మాదిరిగా) రైతులకు అందిస్తారు. ఏ రకమైన ఎరువులు ఎంత మోతాదులో ఏ సమయంలో వాడాలో రాతపూర్వకంగా రైతులకు అందిస్తారు. రైతులకు బహుళ ప్రయోజనాలు ► ప్రతి రైతుకు సాయిల్ హెల్త్ కార్డు ఇస్తారు. శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకే ఎరువులు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. సాయిల్ హెల్త్ కార్డుల్లో సూచించే సిఫార్సుల వల్ల ఎరువుల వినియోగం 20–25 శాతం తగ్గుతుంది ► పంటకు సోకే తెగుళ్లను ప్లాంట్ క్లినిక్స్లో ఏర్పాటు చేసే పరికరాలతో ఇట్టే పసిగట్టవచ్చు. తెగుళ్లు, వ్యాధుల ఉధృతి ఎక్కువగా ఉంటే శాంపిల్స్ సేకరించి వైఎస్సార్ అగ్రి ల్యాబ్స్కు పంపించి పరీక్షిస్తారు. ► వ్యాధులు, తెగుళ్లు సోకకుండా ముందస్తు జాగ్రత్త చర్యల వల్ల పురుగుల మందుల వినియోగం 15–25 శాతం తగ్గుతుంది. ► మొత్తంగా రైతుకు పెట్టుబడి ఖర్చులు కనీసం 15–20 శాతం తగ్గుతాయి. దిగుబడుల్లో నాణ్యత పెరుగుతుంది. గతంతో పోలిస్తే 18–20 శాతం వరకు ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. ► పెట్టుబడి ఖర్చులు తగ్గడం, దిగుబడులు పెరగడం వలన రైతులు కనీసం 20–25 శాతం అదనంగా ఆదాయం పొందే అవకాశం కలుగుతుంది. సీఎం వైఎస్ జగన్ ఆలోచన మేరకు.. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించే దిశగా రైతులను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలో భాగంగానే ‘ప్లాంట్ డాక్టర్’ విధానానికి రూపకల్పనం చేశాం. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి ప్లాంట్ క్లినిక్స్ రైతులకు అందుబాటులోకి రానున్నాయి. – పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్, వ్యవసాయ శాఖ -
అర్హత ఉంటే నారా దేవాన్ష్కు కూడా అమ్మఒడి ఇస్తాం: వెల్లంపల్లి
-
‘గడప గడపకు’ కార్యక్రమంలో ఆసక్తికర ఘటన.. టీడీపీ నేత వర్ల రామయ్య ఇంటికెళ్లిన వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో చేపట్టిన ‘గడప గడపకి మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విద్యాధరపురంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. గడప గడపకి కార్యక్రమంలో భాగంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఇంటికి వెళ్లారు. ఆయన భార్య జయప్రదకు రైతు భరోసా కింద 13,500 రూపాయలు అందినట్లుగా ధ్రువీకరణ ప్రతాన్ని అందజేశారు. చదవండి: ‘సైకిల్’ కకావికలం.. కుప్పంలో పడిపోయిన టీడీపీ గ్రాఫ్ ఇంటిలోనే ఉన్నప్పటికీ వర్ల రామయ్య, ఆయన భార్య జయప్రద బయటకురాలేదు. ధ్రువీకరణ పత్రం తీసుకోవడానికి డ్రైవర్ను పంపించారు. రైతు భరోసా అందినట్లుగా డ్రైవర్ ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. టీడీపీ నేత వర్ల రామయ్య ఇంట్లో కూడా రైతు భరోసా ఇచ్చామని తెలిపారు. టీడీపీ నేత కూడా ప్రభుత్వ పథకం అందుకున్నారన్నారు. అర్హత ఉంటే నారా దేవాన్ష్కు కూడా అమ్మ ఒడి ఇస్తామని వెల్లంపల్లి అన్నారు. -
నాడు.. దోచుకో.. పంచుకో.. తినుకో 'నేడు నేరుగా లబ్ధి'
మూడేళ్ల నాలుగు నెలల్లో మీ బిడ్డ బటన్ నొక్కి అక్షరాలా రూ.1,74,931 కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేశాడు. ఎక్కడా లంచాలు లేవు. వివక్ష లేదు. అప్పట్లోనూ ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్.. అప్పుల గ్రోత్రేట్ కూడా అప్పటి కంటే ఇప్పుడే తక్కువ. మరి మీ బిడ్డ ఎలా చేయగలుగుతున్నాడు? చంద్రబాబు ఎందుకు చేయలేదు? అని ఆలోచించాలని అడుగుతున్నా! అప్పట్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, చంద్రబాబు, దత్తపుత్రుడు దోచుకో, పంచుకో, తినుకో అనేలా డీపీటీ అనే పథకం అమలయ్యేది. ఈ రోజు మీ బిడ్డ ‘డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్’తో బటన్ నొక్కుతున్నాడు. నేరుగా మీ ఖాతాల్లో సొమ్ము జమ అవుతోంది. అప్పట్లో అంత దోచుకున్నా ఎవడూ రాయడు, ప్రశ్నించడు. కారణం.. వీరందరిదీ గజదొంగల ముఠా కాబట్టి! దేవుడి దయతో, మీ అందరికీ మంచి చేసే పరిస్థితులు రావాలని, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే పార్టీలు, మీడియా సంస్థలు కూలిపోవాలని కోరుతున్నా. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, కర్నూలు: రైతన్నలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని త్రికరణ శుద్ధిగా విశ్వసించి అడుగులు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. అన్నదాతకు ఇంతగా తోడ్పాటు అందిస్తున్న ప్రభుత్వం దేశ చరిత్రలో బహుశా ఎప్పుడూ, ఎక్కడా లేదని మీ బిడ్డగా చెప్పేందుకు గర్విస్తున్నానన్నారు. ప్రతి పథకాన్ని క్రమం తప్పకుండా కాలెండర్లో పేర్కొన్న ప్రకారం అమలు చేస్తూ ప్రతి కుటుంబానికీ అండగా నిలిచామన్నారు. వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం రెండో విడత సాయాన్ని ముఖ్యమంత్రి జగన్ సోమవారం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ప్రారంభించారు. బటన్ నొక్కి 50.92 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.2,096 కోట్లు జమ చేశారు. రైతులకు మెగా చెక్ అందచేసి లబ్ధిదారులతో ముచ్చటించారు. వారితో కలసి గ్రూపు ఫోటో దిగారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఆ వివరాలివీ.. 82 శాతం చిన్నకారు రైతులకు ప్రయోజనం మూడేళ్ల నాలుగు నెలల పాలనలో దేశంలోని 27 రాష్ట్రాలలో ఎక్కడా లేనివిధంగా రైతు పక్షపాత ప్రభుత్వంగా అడుగులు వేస్తున్నాం. రాష్ట్రంలో రైతన్నల పరిస్థితి ఎలా ఉందని ఒక్కసారి ఆలోచిస్తే కేవలం అర హెక్టార్ అంటే 1.25 ఎకరాలలోపు ఉన్నవారు 68 శాతం మంది ఉన్నారు. ఒక హెక్టార్ వరకూ అంటే 2.5 ఎకరాలు ఉన్న రైతులు 82 శాతం ఉన్నారు. వీరికి ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్న రైతుభరోసా సొమ్ము దాదాపు 80 శాతం పెట్టుబడి ఖర్చులకు సరిపోతుంది. అన్నదాతలు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు. పంట వేసే సమయానికి పెట్టుబడి సొమ్ము చేతికందాలి. ఎక్కడా లంచాలు, వివక్షకు తావులేకుండా నేరుగా, పారదర్శకంగా ఖాతాల్లో ఈ డబ్బులు మూడు విడతల్లో జమ చేస్తున్నాం. ఏటా ఖరీఫ్ సీజన్ మొదలయ్యేలోపే మే నెలలో రూ.7,500, పంటలు కోతకు వచ్చేముందు అక్టోబర్లో మరో రూ.4 వేలు, సంక్రాంతి సందర్భంగా జనవరిలో మరో రూ.2 వేలు కలిపి మొత్తం రూ.13,500 రైతన్నల చేతిలో పెడుతున్నాం. మూడున్నరేళ్లలో వైఎస్సార్ రైతుభరోసా – పీఎం కిసాన్ ద్వారా దాదాపు 50.50 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.25,971 కోట్లకుపైగా నేరుగా జమ చేశాం. అంటే ఏటా దాదాపు రూ.7 వేల కోట్లను రైతన్నల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. ఒక్కో కుటుంబానికి రూ.51 వేలు నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేశామని సగర్వంగా తెలియజేస్తున్నా. కౌలు, గిరిజన రైతులకూ భరోసా పట్టా భూములున్న రైతులే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు కౌలు రైతులు, దేవదాయశాఖ భూములు సాగు చేస్తున్న వారు, గిరిజన ప్రాంతాల్లో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలున్న రైతులకు కూడా రైతు భరోసా ద్వారా ఏటా రూ.13,500 చొప్పున అందచేసి మంచి చేయగలుగుతున్నాం. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వ్యవసాయానికి సాయంగా, అన్నదాతలకు అన్ని రకాలుగా అండగా ఉండేందుకు మూడేళ్ల నాలుగు నెలల్లో రైతన్నల కోసం రూ.1.33 లక్షల కోట్లు వ్యయం చేశామని సగర్వంగా తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీ అందరి ముందు ఉంచుతున్నా. ఒక్కసారి ఆలోచన చేయాలని కోరుతున్నా. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జరిగిన సభకు హాజరైన భారీ జన సందోహం మాఫీ పేరుతో బాబు మోసం చంద్రబాబు పాలన చూశారు.. మన పాలన చూస్తున్నారు. తేడా ఒక్కసారి గమనించాలని కోరుతున్నా. చంద్రబాబు హయాంలో రుణమాఫీ చేస్తామని మోసం చేశారు. దీంతో రైతులు బ్యాంకు గడప ఎక్కలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రైతులు వడ్డీ వ్యాపారుల నుంచి కాకుండా తిరిగి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోగలుగుతున్నారు. చంద్రబాబు పాలనలో ఐదేళ్లలో వడ్డీలేని రుణాల కింద చెల్లించింది రూ.685 కోట్లు మాత్రమే. 2016 అక్టోబర్ నుంచి ఆ పథకాన్ని రద్దు చేశారు. మీ బిడ్డ తిరిగి ఆ పథకాన్ని తీసుకొచ్చాడు. ఈ మూడేళ్ల నాలుగు నెలల్లో రూ.1,282 కోట్లు చెల్లించామని సగర్వంగా చెబుతున్నా. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో వ్యవసాయ రంగంలో రూ.3,64,624 కోట్లు అందితే ఇప్పుడు మూడేళ్ల నాలుగు నెలల పాలనలోనే రూ.5,48,518 కోట్లు అందచేశాం. తేడా గమనించాలని కోరుతున్నా. చంద్రబాబు హయాంలో పంటల బీమా ప్రీమియంలో రైతులు, ప్రభుత్వం వాటాలు చెల్లించాలి. ఈ రెండూ సక్రమంగా జరగకపోవడంతో రైతులకు ఇన్సూరెన్స్లో నష్టం వాటిల్లింది. ఆ ఐదేళ్లలో 30.80 లక్షల మందికి రూ.3,412 కోట్లు మాత్రమే బీమా పరిహారంగా దక్కితే ఈ మూడేళ్ల నాలుగు నెలల్లో 44.28 లక్షల మంది రైతులకు రూ.6,684 కోట్ల బీమా సొమ్ము రైతుల ఖాతాల్లోకి జమ అయింది. తేడా మీరే గమనించండి. రైతన్నల నుంచి బీమా సొమ్ము ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు. ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తోంది. పంట నష్టపోతే అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ చంద్రబాబు హయాంలో ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం జరిగితే పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇన్ఫుట్ సబ్సిడీ పేరుకే ఉండేది. ఎప్పుడు వస్తుందో? ఎవరికి వస్తుందో? తెలియదు. చివరకు 2017–18, 2018–19 కాలానికి రూ.2,558 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని పూర్తిగా ఎగ్గొట్టారు. ఇప్పుడు మూడేళ్ల నాలుగు నెలల్లో 20.85 లక్షల మంది రైతులకు రూ.1,800 కోట్లు ఇన్పుట్ సబ్సిడీగా అందచేశాం. ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసే లోపే డబ్బులు జమ అవుతున్నాయి. ఈ – క్రాప్ డేటాతో సహా సోషల్ ఆడిట్తో పారదర్శకంగా ప్రతీ రైతన్నకు తోడుగా నిలుస్తున్నాం. ఇవాళ ఇన్ఫుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ రైతులకు క్రమం తప్పకుండా అందుతోంది. గొప్ప మార్పు కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 10,778 ఆర్బీకేలు ప్రతీ గ్రామంలో రైతులను చేయి పట్టుకుని నడిపిస్తున్నాయి. విత్తనం మొదలు పంట విక్రయం వరకూ వారికి తోడుగా నిలుస్తున్నాయి. ఈ – క్రాపింగ్ ప్రతీ గ్రామంలో నమోదవుతోంది. ఈ– డేటా ఆధారంగా ప్రతీ రైతుకు, ప్రతీ పథకం వివక్ష, లంచం లేకుండా నేరుగా అందుతోంది. పరిహారం అందని కుటుంబం ఒక్కటీ లేదు రైతన్నలు ఎవరైనా దురదృష్టవశాత్తూ ఆత్మహత్య చేసుకుంటే గతంలో సానుభూతి కూడా చూపలేదు. అసలు ఆత్మహత్య చేసుకున్నవారు రైతులే కాదనే మాటలు వినిపించేవి. ఇప్పుడు పట్టాదారు పాసు పుస్తకాలు కలిగి ఉంటే వెంటనే ప్రభుత్వం స్పందిస్తోంది. పాసు పుస్తకాలున్న అన్నదాతలు ఆత్మహత్యకు పాల్పడితే పరిహారం అందని రైతన్నలు ఒక్కరంటే ఒక్కరూ లేరు. సీసీఆర్టీ కార్డులున్న కౌలు రైతులు దురదృష్టవశాత్తూ ఆత్మహత్య చేసుకుంటే వారికీ పరిహారం అందించాం. వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు ఆర్బీకేలను యూనిట్గా తీసుకుని అర్హులెవరూ మిగిలిపోకుండా సంతృప్త స్థాయిలో మంచి చేస్తున్నాం. పగటిపూట 9 గంటల ఉచిత కరెంటు, కనీస మద్దతు ధరతో పంటల కొనుగోలు, ఆక్వా రైతులను ఆదుకోవడం, రైతులను భాగస్వాములుగా చేసి ఆర్బీకే స్థాయిలో సలహా మండళ్ల ఏర్పాటు, వ్యవసాయ ఉపకరణాలను కమ్యూనిటీ సెంటర్ల ద్వారా అందించడం, పాడి రైతులకు సైతం గిట్టుబాటు ధర లభించేలా అమూల్ సంస్థను తేవడం లాంటి విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. హాజరైన మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్బాషా, వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీలు గంగుల ప్రభాకర్రెడ్డి, చల్లా భగీరథరెడ్డి, ఇషాక్బాషా, ఎమ్మెల్యేలు బిజేంద్రారెడ్డి, కాటసాని రాంభూపాల్రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రామిరెడ్డి, ఆర్థర్, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి పాల్గొన్నారు. మన ఖర్మ ఏమిటంటే.. మన ఖర్మ ఏమిటంటే గొప్ప మార్పులు జరుగుతున్నా, పండ్లు కాసే చెట్టుకే రాళ్లు పడతాయి అన్నట్లు రాష్ట్రంలో ఏం జరుగుతోందో మీకు తెలుసు. ఇన్ని మంచి విషయాలు జరుగుతున్నా ఎల్లో మీడియా.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, చంద్రబాబు ఒక దత్తపుత్రుడు రాష్ట్రంలో ఏం చేస్తున్నారో మీకు తెలిసిందే. వారి చేతిలో మీడియా ఉంది. వారు రాసిందే రాత. వారు ఏం చూపిస్తే అదే జరుగుతుందనే భ్రమలో ఉన్నారు. గర్వం పెరిగిపోయింది. వారికి చెందిన వ్యక్తి సీఎం స్థానంలో లేరు కాబట్టి ఆయన్ను తెచ్చేందుకు కుతంత్రాలు పన్నుతున్నారు. ఆనాటికి, ఇప్పటికి తేడా గమనించాలని అడుగుతున్నా. ఆ రోజు కంటే ఈ రోజు మన బతుకులు బాగున్నాయా? లేదా? అనేది మీరు గుండెలపై చేతులు వేసుకుని ఆలోచించాలని కోరుతున్నా. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలిసిందే. పరిపాలన ఎలా సాగిందో మీరంతా చూసిన వారే. కేవలం రైతుల కోసం మీ బిడ్డ రూ.1,33,527 కోట్లు ఖర్చు చేశాడు. ఇది మీ ప్రభుత్వం. మీ బిడ్డ బటన్ నొక్కి మూడున్నరేళ్లలో అక్షరాలా రూ.1,74,931 కోట్లు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లో జమ చేశాడు. ఎక్కడా లంచాలు లేవు. వివక్ష లేకుండా పారదర్శకంగా బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు వెళ్లింది. ఇలాంటి మంచి పనులు చేస్తున్న మీ బిడ్డను ఆశీర్వదించాలని కోరుతున్నా. నాడు ఏటా కరువే.. నేడు తావే లేదు దేవుడి దయ, మీ అందరి దీవెనలతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్ల నాలుగు నెలల్లో ఒక్కటంటే ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదు. చంద్రబాబు ఐదేళ్ల పాలనను గమనిస్తే 2014లో 238 కరువు మండలాలు, 2015లో 359 మండలాలు, 2016లో 301 మండలాలు, 2017లో 121 మండలాలు, 2018 ఖరీఫ్లో 347, రబీలో మరో 257 కరువు మండలాలు ప్రకటించారు. చంద్రబాబు, కరువు రెండూ కవల పిల్లలే అన్నట్లుగా పాలన సాగింది. మంచి చేస్తున్న మన ప్రభుత్వానికి దేవుడి ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉన్నాయి. మంచి వర్షాలు కురుస్తున్నాయి. అక్టోబర్ వరకూ సాధారణ వర్షపాతం 668 మిల్లీమీటర్లు కాగా ఈ సీజన్లో ఇప్పటికే 695 మిల్లీమీటర్లు నమోదైంది. సాధారణం కంటే 4 శాతం అధికంగా వర్షాలు కురిసి రాష్ట్రం కళకళలాడుతోంది. 21 జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైతే ఐదు జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ కురిసింది. గతంలో 13 జిల్లాలు, ఇప్పుడు 26 జిల్లాలను తీసుకున్నా మూడేళ్ల నాలుగు నెలల్లో ఏ ఒక్క ఏడాదీ ఒక్క కరువు మండలం కూడా ప్రకటించాల్సిన అవసరం లేకుండా రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తున్నాయి. చంద్రబాబు పాలనతో పోల్చితే పంటల విస్తీర్ణంతో పాటు ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా పెరిగింది. నాడు ఐదేళ్లలో సగటున 154 లక్షల టన్నులు ఉత్పత్తి కాగా మన ప్రభుత్వంలో 167.24 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి అవుతున్నాయి. అంటే 13.24 టన్నుల ఉత్పత్తి పెరిగింది. ప్రతీ గ్రామంలో రైతన్నలు సంతోషంగా ఉన్నారని ఈ దిగుబడులే చెబుతున్నాయి. దీంతోపాటు వ్యవసాయంపై ఆధారపడ్డ రైతు కార్మికులకు కూడా మంచి జరిగిందని లెక్కలు చెబుతున్నాయి. మూడేళ్ల నాలుగు నెలల్లో ప్రతీ రిజర్వాయర్లో నీరు పుష్కలంగా ఉంది. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలో కూడా భూగర్భ జలాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. దివ్యాంగురాలికి ముఖ్యమంత్రి భరోసా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి తక్షణ సాయం నంద్యాల: అనారోగ్యంతో బాధపడుతూ తనను కలిసిన ఓ దివ్యాంగురాలికి నేనున్నానంటూ సీఎం జగన్ భరోసా కల్పించారు. నంద్యాల జగజ్జననీనగర్కు చెందిన హేమపావని మెదడు సంబంధిత వ్యాధితో బాధ పడుతోంది. వైద్యం చేయించుకునే స్థోమత ఆ కుటుంబానికి లేదు. సీఎం జగన్ సోమవారం ఆళ్లగడ్డ వస్తున్న విషయం తెలుసుకొని బాధితురాలు తండ్రి శ్రీనివాసులుతో కలిసి హెలిపాడ్ వద్దకు వచ్చింది. సీఎంను కలసి తన సమస్యను మొరపెట్టుకుంది. దీనిపై వెంటనే స్పందించిన సీఎం జగన్ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్రెడ్డిని పిలిచి బాధితురాలి వైద్యానికి ఎంత ఖర్చు అవుతుందో తనకు వివరాలు ఇవ్వాలని సూచించారు. అంతేగాకుండా తక్షణమే ఆ బాలికకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.లక్ష మంజూరు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. భయం పోయింది.. నాకు ఏడెకరాల పొలం ఉంది. గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయం చేసేందుకు ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయం అంటే పండుగ అయింది. భయం పోయింది. రైతు భరోసా ద్వారా ఏటా రూ.13,500 బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నాయి. ఇప్పటిదాకా రూ.48 వేలు వచ్చాయి. ఇప్పుడు మరో రూ.4 వేలు జమ కానున్నాయి. అంతేకాకుండా పంట నష్టం కింద రూ.30 వేలు వచ్చిందన్నా. రైతులంతా సీహెచ్ఎస్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని సబ్సిడీపై ట్రాక్టర్, టిల్లర్, కంకుల మిషన్ తీసుకున్నాం. దీనికి రూ.13.50 లక్షలు కాగా సబ్సిడీ కింద రూ.5.40 లక్షలు ఖాతాలో జమ అయ్యాయి. గతంలో మందు మూటెలు (ఎరువులు) కావాలంటే మండల కేంద్రం శిరివెళ్లకు వెళ్లి క్యూలైన్లలో నిలుచుని అనేక ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు గ్రామంలోని ఆర్బీకేలో మందు బస్తాలు అందచేస్తూ అటు నుంచి అటే పొలానికి వెళ్లి చల్లుకునేలా చేశావన్నా. రెతుల కోసం ఇన్ని సంక్షేమ పథకాలు చేపట్టిన సీఎం రుణం ఏమిచ్చి తీర్చుకోగలం? – గుర్రప్ప ,రైతు, కోటపాడు నిన్ను చూడాలని.. గతంలో రెండు సార్లు వరి పంట నష్టపోవడంతో బాధపడ్డా. మళ్లీ పంట వేయకముందే పంట నష్టం కింద రూ.40 వేలు జమ చేశారు. బ్యాంకులో రూ.20 వేలు తీసుకుంటే సున్నా వడ్డీ కింద రూ.3 వేలిచ్చారు. అధికారులే మా దగ్గరకు వచ్చి వివరించి ప్రయోజనం చేకూరుస్తున్నారు. మీరు సీఎం అయ్యాకే మా నాన్నకు పింఛన్ వచ్చిందన్నా. నాన్నకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా గుండె జబ్బుకు, కంటి వెలుగు కింద అమ్మకు కంటి ఆపరేషన్ చేశారు. వాళ్లిద్దరూ నిన్ను చూడాలని మీటింగ్కు వచ్చి జనంలో కూర్చున్నారన్నా. మానాన్న బతికారంటే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ చలువే కారణం. రైతుల కోసం మీరు చేపడుతున్న పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. – కృష్ణ నాయక్, రైతు, బాచేపల్లె తాండ ఆర్బీకేలతో రైతన్నలకు అండగా ఆర్బీకేల ద్వారా ఈ క్రాపింగ్, ఇన్సూరెన్స్ చేస్తున్నాం. రైతన్నకు తోడుగా నిలిచి ప్రతి పథకం అందిస్తూ నష్టపోకుండా చూస్తున్నాం. చంద్రబాబు హయాంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అంతా కల్తీనే. వీటితో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కల్తీని అరికట్టేందుకు రాష్ట్రంలో కేవలం 12 ల్యాబ్లు మాత్రమే చంద్రబాబు పాలనలో ఉండగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 147 ల్యాబ్లు నియోజకవర్గ స్థాయిలో కనిపిస్తున్నాయి. 70 ల్యాబ్లు ఇప్పటికే పూర్తై రైతులకు సేవలు అందిస్తున్నాయి. తక్కిన 77 నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. జిల్లా స్థాయిలో రెండు ల్యాబ్లు, 4 ప్రాంతీయ సెంటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. -
వైఎస్సార్ రైతు భరోసాతో ఎంతో మేలు జరుగుతోంది
-
సీఎం వైఎస్ జగన్ రైతులకు పెద్దదిక్కుగా ఉన్నారు
-
‘మీ వల్లే నాన్న బతికారు.. మిమ్మల్ని చూడాలని వచ్చారు’
సాక్షి, నంద్యాల జిల్లా: రైతు భరోసా సాయాన్ని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ, వైఎస్సార్ రైతు భరోసాతో ఎంతో మేలు జరుగుతోందన్నారు. ఆర్బీకే కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. ఎరువులు కోసం గతంలో రోజుల తరబడి క్యూ ఉండేది. ఇప్పుడు విత్తనం నుంచి విక్రయం దాకా ఆర్బీకేలు అండగా ఉన్నాయి. సీఎం వైఎస్ జగన్ రైతులకు పెద్దదిక్కుగా ఉన్నారన్నారు. ఇంకా లబ్ధిదారులు ఏమన్నారంటే వారి మాటల్లోనే.. చదవండి: గజ దొంగల ముఠా మంచి చెప్పదు.. ఎల్లో మీడియాకు సీఎం జగన్ కౌంటర్ మీ వల్లే ఆయన బతికారు: భూక్యే క్రిష్ణానాయక్, గిరిజన రైతు జగనన్నా నేను నిరుపేద గిరిజన రైతును, నాలుగేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను. మా నాన్న పొలం ఇచ్చాడు కానీ పంట పెట్టుబడికి డబ్బు ఇవ్వలేదు. జగనన్న వచ్చిన తర్వాత పంట పెట్టుబడి సాయం ఇవ్వడంతో నేను వ్యవసాయం మొదలుపెట్టాను. సాగు చేస్తున్నాను. నాకు ఆర్బీకేల ద్వారా పొలంబడిలో అవగాహన కల్పించారు. నేను వరి వేస్తే ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయాను. కానీ జగనన్న ప్రవేశపెట్టిన పంటల బీమా, ఈ కేవైసీ ద్వారా సీజన్ ముగిసేలోగా నాకు రూ. 40 వేలు వచ్చాయి. బ్యాంకు నుంచి లోన్ తీసుకుని సకాలంలో కట్టడం వలన దానికి సున్నావడ్డీ కింద రూ.3 వేలు వచ్చాయి. గతంలో ఎన్నడూ పంట నష్టం, ఇన్పుట్ సబ్సిడీ రాలేదు. ఇప్పుడు అన్నీ వస్తున్నాయి. మా నాన్నకు పింఛన్ వస్తుంది, మా అమ్మ, నాన్నకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సలు జరిగాయి. మీ వల్లే ఆయన బతికారు. ఈ రోజు ఈ సభకు కూడా మిమ్మల్ని చూడాలని వచ్చారు. తెలుగుగంగ ప్రాజెక్ట్ కెనాల్కు పిల్ల కాలువలు డాక్టర్ వైఎస్ఆర్ తవ్వించి ఈ నియోజకవర్గానికి సాగు, తాగు నీరు ఇచ్చారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకాన్ని ప్రారంభించినందుకు మా గిరిజనుల తరపున మీకు ధన్యవాదాలు, అందరికీ ధన్యవాదాలు. అమ్మ సంతోషపడింది: దూదేకుల గుర్రప్ప, రైతు జగనన్నా నమస్కారం, అన్నా నేను ఏడు ఎకరాల సాగు చేస్తున్నాను, గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా సాయం అందింది. మూడేళ్ళ పాటు ఏటా రూ. 13,500 చొప్పున తీసుకున్నాను. మీరు వేశారు నా అకౌంట్లో వచ్చాయి. నాకు పంట నష్టం సాయం కూడా అందింది, దానికింద అక్షరాలా రూ. 30 వేలు సాయం అందింది, పంటల బీమా కూడా అందుతుంది. ప్రతి రైతు ఈ కేవైసీ చేయించుకోవాలి. పంటల బీమా చేయించుకోవాలి. నేను 20 ఏళ్ళుగా వ్యవసాయం చేస్తున్నాం. గతంలో ఎరువుల కోసం క్యూలైన్లో నిలబడి ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళం కానీ ఈరోజు మన గ్రామంలో ఆర్బీకేలో మనకు అందుతున్నాయి. అన్నీ ఇక్కడే అందుతున్నాయి, జగనన్నా మేం గ్రూప్గా ఏర్పడి ట్రాక్టర్, కంకుల కటింగ్ మిషన్, ఇతర సామాగ్రి తీసుకున్నాం, మాకు సబ్సిడీ అందింది, మేం రైతులకు తక్కువ రేట్లకే వ్యవసాయ పనులకు పనిముట్లను ఇస్తున్నాం. మా అమ్మకు క్యాన్సర్ ఆపరేషన్ జరిగితే సీఎంఆర్ఎఫ్ కింద రూ. 60 వేలు వచ్చాయి. కొడుకుగా నా బాధ్యత జగన్ తీసుకున్నారని అమ్మ సంతోషపడింది. మా కుటుంబ సభ్యుడివి అన్నా, ఇన్పుట్ సబ్సిడీ కూడా అందింది. మన జగనన్నను మనం 175 కి 175 సీట్లతో గెలిపించాలి. మన రైతులు, మన అక్కచెల్లెల్లు మనం గెలిపించుకోవాలి, ధన్యవాదాలు.