companies
-
హైరింగ్ ప్రణాళికల్లో కంపెనీలు...
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున కంపెనీలు నియామకాలు చేపట్టే యోచనలో ఉన్నాయి. 45 శాతం సంస్థలు కొత్తగా పర్మనెంట్ ఉద్యోగులను తీసుకునే ప్రణాళికల్లో ఉన్నాయి. వర్క్ఫోర్స్ సొల్యూషన్స్, హెచ్ఆర్ సేవల సంస్థ జీనియస్ కన్సల్టెంట్స్ నిర్వహించిన ’హైరింగ్, కాంపన్సేషన్, అట్రిషన్ మేనేజ్మెంట్ అవుట్లుక్ సర్వే 2025–26’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వివిధ పరిశ్రమలవ్యాప్తంగా 1,520 మంది సీఎక్స్వోలు, సీనియర్ అధికారులు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఈ నివేదిక ప్రకారం 45 శాతం సంస్థలు కొత్తగా పర్మనెంట్ ఉద్యోగులను తీసుకువాలని భావిస్తుండగా 13 శాతం కంపెనీలు ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులు లేక ఖాళీ కాబోతున్న పోస్టులను భర్తీ చేసుకునే ప్రణాళికల్లో ఉన్నాయి. కానీ మరికొన్ని సంస్థలు హైరింగ్ విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హైరింగ్ ప్రణాళికలేమీ లేవని 16 శాతం సంస్థలు తెలిపాయి. తాత్కాలిక స్టాఫింగ్ వైపు మొగ్గు.. తాత్కాలిక కొలువులకు కూడా డిమాండ్ పెరుగుతోంది. 26 శాతం కంపెనీలు టెంపొరరీ, కాంట్రాక్ట్ లేదా ప్రాజెక్ట్ ఆధారిత పనుల కోసం ఉద్యోగులను తీసుకునే యోచనలో ఉన్నాయి. గిగ్ వర్కర్లు, కాంట్రాక్ట్ అధారిత ఉద్యోగులు, అడ్వైజరీ సేవలందించే వారిని హైరింగ్ చేసుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. పర్మనెంట్ ఉద్యోగులకు బదులుగా తాత్కాలిక సిబ్బందిని తీసుకునే ధోరణి పెరుగుతోందనడానికి ఇది నిదర్శనమని సర్వే పేర్కొంది. సర్వేలో పాల్గొన్న సంస్థల్లో 37 శాతం కంపెనీలు మిడ్–లెవెల్ నిపుణులను నియమించుకోనున్నట్లు తెలిపాయి. మరోవైపు, 19 శాతం కంపెనీలు ఎంట్రీ లెవెల్ ఉద్యోగులను తీసుకోవాలని భావిస్తుండగా, 18 శాతం సంస్థలు సీనియర్ లీడర్షిప్ స్థానాల్లోకి సిబ్బందిని నియమించుకునే యోచనలో ఉన్నాయి. ‘ఆర్థిక అనిశ్చితులను దాటుకుంటూ కంపెనీలు ముందుకెళ్తున్న క్రమంలో ప్రతిభావంతులైన నిపుణులకు డిమాండ్ నెలకొంది. మిడ్–సీనియర్ ప్రొఫెషనల్స్కి భారీగా డిమాండ్ ఉండటంతో అట్రిషన్ (ఉద్యోగుల వలసలు) రిసు్కలను అధిగమించి, సిబ్బందిని అట్టే పెట్టుకోవడంపై కంపెనీలు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. 2025–26లో కంపెనీలు సమర్ధవంతమైన విధంగా హైరింగ్ ప్రణాళికలను వేసుకునేందుకు ఈ విశేషాలు ఉపయోగపడతాయి‘ అని జీనియస్ కన్సల్టెంట్స్ చైర్మన్ ఆర్పీ యాదవ్ చెప్పారు. మరిన్ని విశేషాలు.. → 53 శాతం కంపెనీలు హైరింగ్ వృద్ధి ఒక మోస్తరుగా 5–10 శాతం స్థాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నాయి. మరోవైపు 33 శాతం కంపెనీలు 10–15 శాతం అధికంగా నియామకాలు చేపట్టాలని భావిస్తున్నాయి. → పరిశ్రమలవారీగా చూస్తే రిటైల్, క్యూ–కామర్స్లో అత్యధికంగా 21 శాతం కంపెనీలు నియామకాలు చేపట్టనున్నాయి. లాజిస్టిక్స్, వేర్హౌసింగ్ విభాగాల్లోనూ సుమారు 9 శాతం సంస్థలు సిబ్బందిని తీసుకోనున్నాయి. → ఆటోమొబైల్స్, ఎలక్ట్రిక్ వాహనాల విభాగాల్లో రిక్రూట్మెంట్ అధికంగా ఉంటుందని 15 శాతం కంపెనీలు భావిస్తున్నాయి. రెన్యూవబుల్స్, ఎనర్జీ, ఇంజినీరింగ్ ప్రాజెక్టుల విభాగాల్లో 11 శాతం కంపెనీలు రిక్రూట్మెంట్ చేపట్టనున్నాయి. → ఐటీ సర్వీసులు, టెలికం, టెక్నాలజీ విభాగాల్లో 13 శాతం, తయారీ, ఇంజినీరింగ్లో 11 శాతం, ఇన్ఫ్రా, రవాణా, రియల్ ఎస్టేట్లో 10 శాతం, బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా)లో 9 శాతం సంస్థలు హైరింగ్ యోచనలో ఉన్నాయి. → ఇక, ఎఫ్ఎంసీజీ, హెల్త్కేర్, హాస్పిటాలిటీ, మీడియా..ఎంటర్టైన్మెంట్, విద్య తదితర రంగాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం హైరింగ్ ఒక మోస్తరుగానే ఉండవచ్చని అంచనా. -
దివ్యాంగులకు కంపెనీల రెడ్ కార్పెట్..
కోల్కతా: సామాజిక బాధ్యత, వ్యాపార వ్యూహాల్లో భాగంగా దేశీ కంపెనీలు దివ్యాంగులకు (పీడబ్ల్యూడీ) ఉద్యోగావకాశాలు కల్పించడంపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. దీంతో ఉక్కు, మైనింగ్ రంగాల నుంచి బీమా రంగం వరకు వివిధ సెగ్మెంట్లలో ఈ విషయంలో సానుకూల ధోరణులు నెలకొన్నాయని విశ్లేషకులు, పరిశ్రమ వర్గాలు తెలిపాయి. గత మూడేళ్లుగా ఈ తరహా ఉద్యోగాలకు చెందిన పోస్టింగ్స్ 30–40 శాతం పెరగడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాయి.తమ మొత్తం ఉద్యోగుల్లో కనీసం ఒక్క శాతం స్థాయిలోనైనా పీడబ్ల్యూడీలను నియమించుకోవాలన్న లక్ష్యాన్ని సాధించినట్లు ఫ్యూచర్ జనరాలీ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఎండీ అనూప్ రావు తెలిపారు. పాలసీని ఏదో నామమాత్రంగా కాకుండా అర్థవంతంగా, బాధ్యతాయుతంగా అమలు చేయాలనేది తమ ఉద్దేశమని ఆయన వివరించారు. గత ఏడాది కాలంగా కంపెనీ పీడబ్ల్యూడీ సిబ్బంది సంఖ్య 16 ప్రాంతీయ శాఖల్లో 16 నుంచి 41కి పెరిగింది.ఇందులో 22 శాతం మంది మహిళలు ఉన్నట్లు రావు చెప్పారు. 2023 ఆర్థిక సంవత్సరంలో నిఫ్టీ 50 కంపెనీల్లో కేవలం ఏడు సంస్థల్లో మాత్రమే ఒక్క శాతం మేర పీడబ్ల్యూడీ ఉద్యోగులున్నారని గణాంకాలు చెబుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఏడు కంపెనీలలోనూ నాలుగు సంస్థలు ప్రభుత్వ రంగానికే చెందినవై ఉండటాన్ని చూస్తే సమ్మిళితత్వ లక్ష్య సాధనలో కార్పొరేట్లు మరింతగా పాలు పంచుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తోందని రావు చెప్పారు. మరోవైపు, తమ సంస్థలో 50 మంది పైగా పీడబ్ల్యూడీ సిబ్బంది ఫ్రంట్ ఎండ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని వేదాంత చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ మధు శ్రీవాస్తవ చెప్పారు. పలువురు దివ్యాంగ ఇంటర్న్లకు కూడా అవకాశాలు క ల్పిస్తున్నట్లు వివరించారు. అలాగే, దివ్యాంగులకు అనువైన పరిస్థితులను కూడా క ల్పిస్తున్నట్లు శ్రీవాస్తవ చెప్పారు. ఇందులో భాగంగా వారి కోసం ర్యాంప్లు, ప్రత్యేకంగా దారులు, బ్రెయిలీ ఆధారిత ఎలివేటర్లు, టెక్ట్స్–టు–స్పీచ్ సాఫ్ట్వేర్ మొదలైనవి అందుబాటులో ఉంచుతున్నామని శ్రీవాస్తవ పేర్కొన్నారు.ప్రధానంగా మైనింగ్, స్పెల్లింగ్ తదితర కార్యకలాపాలు నిర్వహించే తమ సంస్థలో పీడబ్ల్యూడీలను టెక్నికల్ విధుల్లోకి తీసుకోవడంలో సవాళ్లు ఉన్నప్పటికీ, నైపుణ్యాల్లో శిక్షణనిచ్చి వారికి కూడా వీలైన విభాగాల్లో చోటు క ల్పించడంపై దృష్టి పెడుతున్నట్లు వివరించారు. ఇక, ఉక్కు దిగ్గజం టాటా స్టీల్లో 100 మంది పైగా దివ్యాంగ ఉద్యోగులు ఉన్నట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. గత 2–3 సంవత్సరాలుగా వీరి సంఖ్య క్రమంగా పెరిగిందని వివరించారు.మరింత సమ్మిళిత వాతావరణాన్ని సృష్టించే దిశగా తమ హైరింగ్ విధానాల్లో గణనీయంగా మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. సృజనాత్మకత, కొత్త ఆలోచనలకు పెద్ద పీట వేస్తూ వ్యాపారాలను పటిష్టం చేసుకునేందుకు కూడా ఇలాంటి ప్రయత్నాలు దోహదపడగలవని ప్రతినిధి వివరించారు.జూనియర్, మధ్య స్థాయికే పరిమితం..దివ్యాంగుల నియామకాలు పెరుగుతున్నప్పటికీ వారి హైరింగ్ ప్రధానంగా జూనియర్, మధ్య స్థాయి ఉద్యోగాల్లోనే ఉంటోందని మానవ వనరుల సర్వీసుల సంస్థ ర్యాండ్స్టాడ్ ఇండియా ఓ నివేదికలో తెలిపింది. సీనియర్, మేనేజ్మెంట్ బాధ్యతల్లో వారికి ప్రాతినిధ్యం తక్కువగానే లభిస్తోందని వివరించింది. ప్రస్తుతం ఉద్యోగాల్లో పీడబ్ల్యూడీల వాటా అంచనాలకు తగ్గట్లుగా లేకపోయినా కంపెనీల ప్రాధాన్యతలు మారే కొద్దీ భవిష్యత్తులో దివ్యాంగులకు అవకాశాలు మరింతగా లభించగలవని సంస్థ ఎండీ పి.ఎస్. విశ్వనాథ్ తెలిపారు. డీఈఐ విధానాల అమలు పెరుగుతుండటంతో ప్రతిభావంతులైన పీడబ్ల్యూడీలను నియమించుకోవడంపై కంపెనీలు మరింతగా దృష్టి పెడుతున్నాయని వివరించారు.డీఈఐ విధానాల దన్ను ..పర్యావరణ, సామాజిక, గవర్నెన్స్ (ఈఎస్జీ) అంశాల ఆధారిత హైరింగ్ పెరుగుతుండటం, పీడబ్ల్యూడీ ఉద్యోగాలు క ల్పించే సంస్థలకు ప్రభుత్వం నుంచి పన్నుపరమైన ప్రయోజనాల్లాంటి ప్రోత్సాహకాలు లభిస్తుండటం తదితర పరిణామాలతో 2030 నాటికి ఉద్యోగుల్లో దివ్యాంగుల వాటా మరింతగా పెరగనుందని మానవ వనరుల సంస్థ ఫస్ట్ మెరీడియన్ గ్లోబల్ సర్వీసెస్ సీఈవో మన్మీత్ సింగ్ తెలిపారు. బడా కార్పొరేషన్లు మొదలుకుని స్టార్టప్ల వరకు అన్ని సంస్థలూ వైవిధ్యానికి పెద్ద పీట వేస్తున్నట్లు వివరించారు.ఐటీ, రిటైల్, బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) తదితర రంగాల్లో రిమోట్, హైబ్రీడ్ వర్క్ విధానాలకు ఆస్కారం ఉండటంతో ఆయా సెగ్మెంట్లలో పీడబ్ల్యూడీలకు మరిన్ని అవకాశాలు లభించవచ్చని పేర్కొన్నారు. దేశీయంగా 7 కోట్ల మంది పైగా దివ్యాంగులు ఉన్నట్లుగా నివేదికలు చెబుతున్నప్పటికీ వారి ఉద్యోగిత రేటు కేవలం 0.4 శాతంగానే ఉంటోందని సింగ్ చెప్పారు.నియంత్రణ సంస్థల నిబంధనలతో పాటు వైవిధ్యం, సమానత్వం, సమ్మిళితత్వ (డీఈఐ) విధానాలను కార్పొరేట్లు అమలు చేస్తుండటంతో పీడబ్ల్యూడీల నియామకాలు పెరుగుతాయని వివరించారు. కంపెనీలు పాటించే సంస్కృతే .. భాగస్వాములు, కస్టమర్లు, ఉద్యోగులు, మొత్తం వ్యాపార వర్గాల్లో వాటికి గుర్తింపుగా ఉంటోందని అంతర్జాతీయ టెక్నాలజీ, డిజిటల్ టాలెంట్ సొల్యూషన్స్ సేవల సంస్థ ఎన్ఎల్బీ సర్విసెస్ సీఈవో సచిన్ అలగ్ చెప్పారు. -
ఉద్యోగులకు ఈ మార్చి ఇంత దారుణంగా ఉంటుందా?
ఈ మార్చి (March 2025) నెల ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల పాలిట దారుణంగా ఉండబోతోంది. ఈనెలలో దాదాపు 100 కంపెనీలు ఉద్యోగుల తొలగింపును (Lay Off) ప్రకటించే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం.. ఈ తొలగింపులు వివిధ పరిశ్రమలలో విస్తరించి ఉన్నాయి. ఇది మహమ్మారి అనంతరం వ్యాపారాలు ఎదుర్కొంటున్న విస్తృత ఆర్థిక సవాళ్లను ప్రతిబింబిస్తుంది.వార్నింగ్ నోటీసులుఈ మేరకు ప్రభావిత ఉద్యోగులకు ఇప్పటికే యాజమాన్యాలు వార్న్ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. యూఎస్లోని వర్కర్ అడ్జస్ట్ మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్ (వార్న్) చట్టం ప్రకారం జాబ్స్ రిస్క్లో ఉంటే ఆయా కంపెనీలు ఉద్యోగులకు ముందస్తు నోటీసు ఇవ్వాలి. పెద్ద ఎత్తున తొలగింపులు, మూసివేతలకు ఉద్యోగులు, యాజమాన్యాలు, కమ్యూనిటీలు సిద్ధం కావడానికి ఈ చట్టపరమైన ఆవశ్యకత సహాయపడుతుంది. ఈ తొలగింపుల వల్ల ప్రభావితమైన ఉద్యోగుల సంఖ్య ఒక్కో కంపెనీకి 10 నుంచి 500 వరకు ఉంటుంది.కొన్ని ప్రముఖ కంపెనీలు ఇవే..టెక్ లేఆఫ్స్ పతాక శీర్షికల్లో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, తొలగింపులు టెక్ రంగానికి మాత్రమే పరిమితం కాలేదు. జోన్ ఫ్యాబ్రిక్స్, వాల్గ్రీన్స్ వంటి రిటైలర్లు ఉద్యోగులను తగ్గించే అవకాశం ఉంది. ఇంటెల్, ఫెడెక్స్, నీమన్ మార్కస్, జాన్ డీర్ ఈ జాబితాలోని ఇతర గుర్తించదగిన కంపెనీలుగా ఉన్నాయి.వచ్చే మూడేళ్లలో 150 స్టోర్లను మూసివేసే బృహత్తర వ్యూహంలో భాగంగా 66 స్టోర్లను మూసివేసే యోచనలో ఉన్నట్లు మాకీస్ ప్రకటించింది. రిటైల్ పరిశ్రమలో మార్పులకు అనుగుణంగా కాలిఫోర్నియా, ఇతర రాష్ట్రాల్లోని ఉద్యోగులను కూడా వాల్గ్రీన్స్ వదులుకుంటోంది.ఇది చదివారా? ఈసారి బ్యాడ్ న్యూస్ కాగ్నిజెంట్ ఉద్యోగులకు..ఆర్థిక కారకాలుఈ విస్తృతమైన తొలగింపులకు అనేక అంశాలు దోహదం చేస్తాయి. పెరుగుతున్న వడ్డీ రేట్లు రుణాలను మరింత ఖరీదైనవిగా మార్చాయి. కంపెనీలపై ఆర్థిక ఒత్తిడిని పెంచాయి. అదనంగా, ద్రవ్యోల్బణం నిర్వహణ ఖర్చులను పెంచింది. వ్యాపారాలు లాభదాయకంగా ఉండటం సవాలుగా మారింది. వినియోగదారుల ప్రవర్తన, డిమాండ్ లో మార్పులు కూడా అనేక కంపెనీల ఆర్థిక కష్టాలకు కారణమయ్యాయి.ఆటోమేషన్.. పునర్నిర్మాణంఆటోమేషన్కు ఊతమివ్వడమే ఈ ఉద్యోగుల తొలగింపునకు ప్రధాన కారణమని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, ఖర్చులను తగ్గించడానికి కంపెనీలు ఉద్యోగాలను ఆటోమేటెడ్ సొల్యూషన్లతో భర్తీ చేయాలని చూస్తున్నాయి. ఆర్థిక ఒత్తిళ్లకు ప్రతిస్పందనగా కంపెనీలు తమ కార్యకలాపాలను పునర్నిర్మించడానికి ప్రయత్నిస్తున్నందున ఈ ధోరణి కొనసాగుతుందని భావిస్తున్నారు. -
భారత గ్రాడ్యుయేట్ల కోసం...గోల్డ్ కార్డు కొనండి
వాషింగ్టన్: హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ వంటి అత్యుత్తమ యూనివర్సిటీల్లో చదివే ప్రతిభావంతులైన భారత పట్టభద్రులకు ఉద్యోగాలిచ్చేందుకు గోల్డ్ కార్డ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అమెరికా కంపెనీలకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. 50 లక్షల డాలర్లు (రూ.43.67 కోట్లు) చెల్లించి గోల్డ్ కార్డు కొనుగోలు చేస్తే అమెరికా పౌరసత్వమిస్తామని ఆయన తాజాగా ప్రకటించడం తెలిసిందే. ‘‘అమెరికాలోని అత్యున్నత వర్సిటీల్లో చదివే భారత్, చైనా, జపాన్ విద్యార్థులకు ఇక్కడి కంపెనీలు ఆకర్షణీయమైన జాబ్ ఆఫర్లు ఇచ్చి నిలుపుకునే అవకాశం ప్రస్తుత ఇమిగ్రేషన్ వ్యవస్థలో లేదు. దాంతో వారు స్వదేశాలకు వెళ్లి వ్యాపారాలు ప్రారంభించి బిలియనీర్లుగా ఎదుగుతున్నారు. వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్నారు. అలాంటి వారి కోసం అమెరికా కంపెనీలే ఇకపై గోల్డ్ కార్డు కొనుగోలు చేయొచ్చు. తద్వారా వారికి ఉపాధి కల్పించి అట్టిపెట్టుకోవచ్చు’’ అని పేర్కొన్నారు. గోల్డ్ కార్డు పథకం రెండు వారాల్లో అమల్లోకి రానుంది. -
ఆ కంపెనీల ఆదాయం పెరిగింది: ఆర్బీఐ
ముంబై: ప్రైవేట్ రంగంలో ఉన్న ఆర్థికేతర లిస్టెడ్ కంపెనీల ఆదాయం 2024-25 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో 8 శాతం పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 5.5 శాతంగా ఉందని తెలిపింది. జూలై–సెప్టెంబర్ కాలంలో అమ్మకాల వృద్ధి 5.4 శాతం నమోదైంది.డిసెంబర్ త్రైమాసికంలో ప్రైవేట్ కార్పొరేట్ రంగం పనితీరుపై 2,924 ఆర్థికేతర లిస్టెడ్ కంపెనీల సంక్షిప్త త్రైమాసిక ఆర్థిక ఫలితాల ఆధారంగా ఆర్బీఐ నివేదిక రూపొందించింది. ఆటోమొబైల్స్, రసాయనాలు, ఆహార ఉత్పత్తులు, విద్యుత్ యంత్రాల పరిశ్రమలలో అధిక అమ్మకాల జోరు కారణంగా 1,675 లిస్టెడ్ ప్రైవేట్ తయారీ కంపెనీల ఆదాయ వృద్ధి 7.7 శాతానికి మెరుగుపడింది.పెట్రోలియం, ఇనుము, ఉక్కు, సిమెంట్ పరిశ్రమల ఆదాయం వార్షిక ప్రాతిపదికన తగ్గింది. ఐటీ కంపెనీల టర్నోవర్ 6.8 శాతం ఎగిసింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 3.2 శాతంగా ఉంది. ముడి పదార్థాలపై తయారీ కంపెనీల ఖర్చులు 6.3 శాతం దూసుకెళ్లాయి. వేతనాల ఖర్చు అధికంగా 9.5 శాతం పెరిగింది. ఇది ఐటీలో 5 శాతం, ఐటీయేతర సేవల కంపెనీల్లో 12.4 శాతం అధికమైంది. 2024 అక్టోబర్–డిసెంబర్లో లిస్టెడ్ నాన్–ఫైనాన్షియల్ కంపెనీల ప్రాఫిట్ మార్జిన్ వరుసగా 50 బేసిస్ పాయింట్లు వృద్ధి చెంది 16.2 శాతానికి చేరుకుందని ఆర్బీఐ తెలిపింది. -
యాక్టివ్గా ఉన్న కంపెనీలు 65 శాతమే
న్యూఢిల్లీ: దేశీయంగా రిజిస్టరయిన సంస్థలు 28 లక్షల పైచిలుకు ఉండగా, వాటిలో 65 శాతం సంస్థలు (దాదాపు 18.1 లక్షలు) మాత్రమే చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 9,43,934 సంస్థలు మూతబడ్డాయి. కంపెనీల చట్టం 2013 కింద నమోదు చేసుకున్న విదేశీ సంస్థలు 5,216 ఉండగా జనవరి నాటికి వాటిలో 3,281 సంస్థలు మాత్రమే యాక్టివ్గా ఉన్నాయి. కార్పొరేట్ వ్యవహారాల శాఖ విడుదల చేసిన నెలవారీ బులెటిన్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. రంగాలవారీగా చూస్తే అత్యధికంగా బిజినెస్ సర్వీసుల విభాగంలో 27 శాతం కంపెనీలు, తయారీ రంగంలో 20 శాతం, పర్సనల్..సోషల్ సర్వీసులు వంటి విభాగాల్లో 13 శాతం సంస్థలు పని చేస్తున్నాయి. ఢిల్లీ, ఉత్తర్ప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో యాక్టివ్ కంపెనీలు భారీ సంఖ్యలో ఉన్నాయి.ఇదీ చదవండి: పాలసీ జారీ తర్వాతే ప్రీమియం వసూలునిరుద్యోగం రేటు తగ్గుముఖందేశవ్యాప్తంగా నిరుద్యోగిత రేటు తగ్గింది. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్ఓ) ప్రకారం.. 2024–25 అక్టోబర్–డిసెంబర్ కాలంలో పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో నిరుద్యోగిత రేటు 6.4 శాతానికి వచ్చి చేరింది. జూలై–సెపె్టంబర్లోనూ ఇదే స్థాయిలో నమోదైంది. 2023–24 డిసెంబర్ త్రైమాసికంలో నిరుద్యోగిత రేటు 6.5 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లోని 15 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న స్త్రీలలో నిరుద్యోగిత రేటు 2024 అక్టోబర్–డిసెంబర్లో 8.1 శాతానికి తగ్గింది. అంత క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో 8.6 శాతంగా ఉంది. 2024 జూలై–సెపె్టంబర్లో ఈ రేటు 8.4 శాతం. ఇక పురుషుల్లో నిరుద్యోగిత రేటు అంత క్రితం ఏడాది మాదిరిగానే 2024 అక్టోబర్–డిసెంబర్లో 5.8 శాతం వద్ద స్థిరంగా ఉంది. 2024 జులై–సెప్టెంబర్లో ఇది 5.7 శాతం నమోదైంది. -
అప్పుడు 90 గంటలు.. ఇప్పుడు మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు
''ఇంట్లో కూర్చుని ఎంతసేపని భార్యని చూస్తూ ఉంటారు?.. ఇంట్లో కంటే ఆఫీసులో ఎక్కువ సమయం ఉంటామని మీ భార్యకు చెప్పండి. వారానికి 90 గంటలు పనిచేయండి. నేను ఆదివారాలు కూడా పనిచేస్తున్నా.. ఆరోజు మీతో పని చేయించలేక పోతున్నందుకు బాధపడుతున్నా. అలా చేయించగలిగితే నాకు చాలా హ్యాపీ'' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన లార్సెన్ & టూబ్రో చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ (SN Subrahmanyan).. మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు.మంగళవారం చెన్నైలో జరిగిన CII మిస్టిక్ సౌత్ గ్లోబల్ లింకేజెస్ సమ్మిట్ 2025లో సుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ.. సౌకర్యాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నిర్మాణ పరిశ్రమకు కార్మికుల కొరత ఏర్పడుతోంది. భారతదేశంలో కార్మికులు పనిచేయడానికి ఇష్టపడటం లేదు. ప్రభుత్వం అందించే కొన్ని పథకాల కారణంగా.. కార్మికుల ఆర్ధిక వ్యవస్థ బాగానే ఉందని, బహుశా ఈ కారణంగానే వారు పనిచేయడానికి ఇష్టపడటం లేదని అన్నారు.కార్మికుల కొరత భారతదేశ మౌలిక సదుపాయాల నిర్మాణంపై ప్రభావం చూపుతోంది. ఎల్ అండ్ టీ సంస్థకు 4 లక్షల మంది కార్మికులు అవసరం. కానీ అవసరమైన మేర కార్మికులు లభించడం లేదు. అంతే కాకుండా ద్రవ్యోల్బణం కారణంగా.. కార్మికుల వేతనాలను కూడా సవరించాల్సిన అవసరం ఉందని సుబ్రహ్మణ్యన్ పేర్కొన్నారు.కార్మికులలో మాత్రమే కాకుండా.. ఉద్యోగులలో కూడా అదే ధోరణి ఉందని సుబ్రమణ్యన్ అన్నారు. నేను ఎల్ అండ్ టీ కంపెనీలో ఇంజినీర్గా ఉద్యోగంలో చేరినప్పుడు.. మా బాస్ ఢిల్లీలో పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. దానికి నేను ఒకే చెప్పాను. కానీ ఇప్పుడు ఎవరికైనా ఢిల్లీలో ఉద్యోగం చేయాల్సి ఉంటుందని చెబితే ఉద్యోగాన్నే వదిలేసి వెళ్ళిపోతారు అని అన్నారు.90 గంటల పనిపై చర్చవారానికి 90 గంటలు, ఆదివారాలు కూడా పనిచేయాలని చెప్పిన సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలు గతంలో చర్చకు దారితీశాయి. దీనిపై ఆదార్ పూనవాలా, ఆనంద్ మహీంద్రా, ఐటీసీ సంజీవ్ పూరి వంటి దిగ్గజ పారిశ్రామిక వేత్తలు స్పందిస్తూ.. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి వివరించారు.గరిష్ట పని గంటలను వారానికి 70 లేదా 90 గంటలకు పెంచే ప్రతిపాదనను పార్లమెంటుకు కూడా చేరింది. బడ్జెట్కు ముందు ఆర్థిక సర్వేలో వారానికి 60 గంటలకు పైగా పని చేయడం వల్ల.. ఆరోగ్యం దెబ్బ తింటుందని, ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయని వెల్లడించారు. రోజుకు 12 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సేపు పనిచేస్తే.. శారీరక, మానసిక సమస్యలు ఎదురవుతాయని ఒక సర్వేలో కూడా తెలిసింది. -
టాటా బోయింగ్ అరుదైన ఘనత: 300వ AH-64 అపాచీ ఫ్యూజ్లేజ్
టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (TBAL) హైదరాబాద్లోని.. దాని తయారీ కేంద్రం నుంచి 300వ ఏహెచ్-64 అపాచీ ఫ్యూజ్లేజ్ డెలివరీ చేసింది. ఈ ఫ్యూజ్లేజ్లను ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల కోసం తయారు చేస్తారు.సుమారు 14,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఉత్పత్తి కేంద్రంలో కంపెనీ AH-64 అపాచీ హెలీకాఫ్టర్ ఫ్యూజ్లేజ్లతో పాటు.. సెకెండరీ స్ట్రక్చర్లను కూడా తయారు చేస్తోంది. భారతదేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి, స్వదేశీ తయారీ నైపుణ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి TBAL నిరంతర అంకితభావాన్ని ఇది నిదర్శనం.భారత వైమానిక దళం వద్ద ప్రస్తుతం 22 AH-64 అపాచీ హెలికాఫ్టర్లు ఉన్నాయి. బోయింగ్ అండ్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) మధ్య ఉమ్మడి వెంచర్ 900 మందికి పైగా ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను నియమించింది. ఏరో స్ట్రక్చర్లను అసెంబుల్ చేయడానికి ఉపయోగపడే విడి భాగాల్లో దాదాపు 90 శాతం వరకు దేశీయంగానే తయారవుతాయి. -
టెస్లా బాస్ చేతికి టిక్టాక్?: మస్క్ ఏం చెప్పారంటే..
ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో అధిక ప్రజాదరణ పొందిన చైనా షార్ట్ వీడియో యాప్ టిక్టాక్ (TikTok)ను ఇప్పటికే భారత్తో సహా చాలా దేశాలు నిషేధించాయి. అమెరికా కూడా ఈ యాప్ను నిషేదించనున్నట్లు సమాచారం. కానీ దీనిని (టిక్టాక్) ఇలాన్ మస్క్ (Elon Musk) కొనుగోలు చేయనున్నట్లు కొన్ని వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంత?.. దీనిపై మస్క్ అభిప్రాయం ఏంటనేది ఇక్కడ చూసేద్దాం.భద్రతా కారణాల దృష్ట్యా.. టిక్టాక్ యాప్ను అమెరికా నిషేధించాలని యోచిస్తోంది. ఈ నిషేధం నుంచి తప్పించుకోవడానికి.. టిక్టాక్ మాతృ సంస్థ బైట్డ్యాన్స్ (ByteDance) ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత మస్క్కు విక్రయించాలని ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. దీనిపై మస్క్ స్పందించారు.నేను టిక్టాక్ కొనుగోలుకు బిడ్డింగ్ వేయలేదు. దానిని కొనుగోలు చేయాలనే ఆసక్తి నాకు లేదు. ఒకవేళా ఆ యాప్ కొనుగోలు చేస్తే దానిని ఏమి చేయాలో తెలియదు. కంపెనీలను కొనుగోలు చేయడం కంటే.. కొత్త కంపెనీలను నెలకొల్పడమే నాకు ఇష్టం అని మస్క్ స్పష్టం చేశారు.2017లో ప్రారంభమైన టిక్టాక్, అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయింది. ఎంత వేగంగా ప్రజాదరణ పొందిందో.. అంతే వేగంగా ఈ యాప్ను పలు దేశాలు రద్దు చేశాయి. అమెరికా కూడా ఈ యాప్పై ఆంక్షలు విధించింది. చైనా యాజమాన్యాన్ని వదులుకోకపోతే టిక్టాక్ నిషేధాన్ని ఎదుర్కోక తప్పదనే బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఇటీవల ఆమోదం తెలిపింది.ఇదీ చదవండి: యూట్యూబర్పై సెబీ కన్నెర్ర: ఎవరీ అస్మితా పటేల్?అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం.. తరువాత అమెరికా సుప్రీంకోర్టు కూడా టిక్టాక్ మాతృసంస్థ బైట్డ్యాన్స్కు ఓ డెడ్లైన్ ఇచ్చింది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన 75 రోజుల్లో టిక్టాక్ను విక్రయించాలని సూచించింది. అయితే కంపెనీ జాయింట్ వెంచర్లో అమెరికాకు 50 శాతం వాటా ఇస్తే.. టిక్టాక్కు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు. దీంతో సంస్థ టిక్టాక్ను మస్క్కు విక్రయించనున్నట్లు వార్తలు వచ్చాయి. -
ఐపీవోకు 7 కంపెనీలు రెడీ
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ(Sebi) తాజాగా 7 కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ జాబితాలో డిఫెన్స్ తయారీ కంపెనీ ఏఎంపీపీసహా.. ఆదిత్య ఇన్పోటెక్, బ్రిగేడ్ హోటల్, కుమార్ ఆర్క్ టెక్, సోలార్ వరల్డ్ ఎనర్జీ సొల్యూషన్స్, ఇండోగల్ఫ్ క్రాప్ సైన్సెస్, గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్, ప్రోస్టార్ ఇన్ఫోసిస్టమ్స్ చేరాయి. అయితే ఆటో విడిభాగాల సంస్థ వినే కార్పొరేషన్ ముసాయిదా పేపర్స్ను ఇటీవలే వెనక్కి తీసుకుంది. మర్చంట్ బ్యాంకర్ల వివరాల ప్రకారం ఇవన్నీ ఉమ్మడిగా రూ. 7,800 కోట్లు సమీకరించనున్నాయి. రూ. 4,000 కోట్లపై కన్ను ఐపీవో ద్వారా ఎస్ఎంపీపీ లిమిటెడ్ రూ. 4,000 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. దీనిలో భాగంగా రూ. 580 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుండగా.. మరో రూ. 3,420 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ శివ్ చంద్ కన్సల్ విక్రయానికి ఉంచనున్నారు. ప్రస్తుతం ప్రమోటర్గా కన్సల్ 50 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 437 కోట్లు అనుబంధ కంపెనీ ద్వారా పెట్టుబడి వ్యయాలపై వెచ్చించనుంది. రూ. 1,300 కోట్ల సమీకరణ ఆదిత్య ఇన్ఫోటెక్ ఐపీవో ద్వారా రూ. 1,300 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. దీనిలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుండగా.. మరో రూ. 800 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ నిధుల్లో రూ. 375 కోట్లు రుణాల చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. రూ. 900 కోట్లకు సై ఆతిథ్య రంగ కంపెనీ బ్రిగేడ్ హోటల్ వెంచర్స్ ఐపీవోలో భాగంగా రూ. 900 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా పెట్టుబడులను సమీకరించాలని ఆశిస్తోంది. వీటిలో రూ. 481 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 59 కోట్లు మెటీరియల్ అనుబంధ సంస్థ ఎస్ఆర్పీ ప్రోస్పరిటా హోటల్ వెంచర్స్కు కేటాయించనుంది. మరో రూ. 108 కోట్లు భూమి కొనుగోలుకి వెచ్చించనుంది. రూ. 740 కోట్లపై దృష్టి పీవీసీ బ్లెండ్ ఆధారిత బిల్డింగ్ మెటీరియల్ తయారీ కంపెనీ కుమార్ ఆర్క్ టెక్ ఐపీవో ద్వారా రూ. 740 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. రూ. 500 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనుండగా.. మరో రూ. 240 కోట్ల విలువైన ఈక్విటీని కంపెనీ తాజాగా జారీ చేయనుంది. ఈ నిధుల్లో రూ. 182 కోట్లు అనుబంధ సంస్థ టేలియస్ ఇండస్ట్రీలో పెట్టుబడికి వెచ్చించనుంది. రూ. 600 కోట్లకు రెడీ సోలార్వరల్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ ఐపీవోలో భాగంగా రూ. 600 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. దీనిలో రూ. 550 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. మరో రూ. 50 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. రూ. 200 కోట్లతోపాటు.. ఐపీవోలో భాగంగా ఇండోగల్ఫ్ క్రాప్సైన్సెస్ రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 38.55 లక్షల షేర్లను ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. 1.9 కోట్ల షేర్ల జారీ గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్ ఐపీవోలో భాగంగా 1.9 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. నిధులను పరికరాల కొనుగోలు, వర్కింగ్ క్యాపిటల్, సాధరణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. పబ్లిక్ ఇష్యూకు ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్ ఐపీవోలో భాగంగా పవర్ సొల్యూషన్లు, ప్రొడక్టుల తయారీ కంపెనీ ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్ 1.6 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. నిధులను రుణ చెల్లింపులు, అనుబంధ సంస్థలో వాటా కొనుగోలు, వర్కింగ్ క్యాపిటల్, సాధరణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. సెబీకి ఉయ్వర్క్ ఇండియా ప్రాస్పెక్టస్వర్క్స్పేస్ సేవల సంస్థ ఉయ్వర్క్ తమ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) సంబంధించి ముసాయిదా ప్రాస్పెక్టస్ని (డీఆర్హెచ్పీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమరి్పంచింది. ఈ ఇష్యూలో భాగంగా కంపెనీ 4,37,53,952 షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయించనుంది. ఐపీవో పూర్తిగా ఓఎఫ్ఎస్ రూపంలో ఉంటుంది కాబట్టి ఇష్యూ ద్వారా వచ్చే నిధులు కంపెనీకి లభించవు. వ్యక్తులు, చిన్నా .. పెద్ద వ్యాపార సంస్థలు, అంకురాలు మొదలైన కస్టమర్లకు నాణ్యమైన వర్క్స్పేస్లను అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. -
రెండేళ్లలో 1,000 ఐపీవోలు
న్యూఢిల్లీ: రానున్న రెండేళ్లలో మొత్తం 1,000 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలు చేపట్టే వీలున్నట్లు దేశీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ల అసోసియేషన్(ఏఐబీఐ) తాజాగా అంచనా వేసింది. ఇందుకు ప్రధానంగా ఆర్థిక వృద్ధి, సానుకూల స్టాక్ మార్కెట్లు, మెరుగుపడనున్న నియంత్రణా సంబంధ నిబంధనలు తోడ్పాటు నివ్వగలవని పేర్కొంది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం(2025–26)లో అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా కంపెనీల నిధుల సమీ కరణ రూ. 3 లక్షల కోట్లను అధిగమించవచ్చునని అభిప్రాయపడింది. రానున్న రెండేళ్ల(2026, 2027)లో దేశీ క్యాపిటల్ మార్కెట్లు భారీ ప్రగతిని సాధించనున్నట్లు ఏఐబీఐ తెలియజేసింది. గత ఆరేళ్లలో 851 కంపెనీలు ఐపీవోలు చేపట్టడం ద్వారా మొత్తం రూ. 4.58 లక్షల కోట్లు సమీకరించినట్లు వెల్లడించింది. వీటిలో 281 కంపెనీలు మెయిన్ బోర్డు నుంచి లిస్ట్కాగా.. 570 సంస్థలు ఎస్ఎంఈ విభాగానికి చెందినవిగా తెలియజేసింది. గతేడాదిలో గత ఆర్థిక సంవత్సరం(2023–24) స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ ద్వారా దేశీ కంపెనీలు ఉమ్మడిగా రూ. 67,955 కోట్లు సమకూర్చుకున్నట్లు ఏఐబీఐ పేర్కొంది. వీటిలో ప్రధాన కంపెనీలు రూ. 61,860 కోట్లు అందుకోగా.. ఎస్ఎంఈలు రూ. 6,095 కోట్ల పెట్టుబడులు సమీకరించాయి. మరోవైపు క్విప్ ద్వారా 61 కంపెనీలు రూ. 68,972 కోట్ల నిధులను సమీకరించాయి. ఐపీవోల పరిమాణంరీత్యా గతేడా ది భారత్ ప్రపంచవ్యాప్తంగా తొలి స్థానంలో నిలిచినట్లు ఏఐబీఐ చైర్మన్ మహావీర్ లునావట్ తెలియజేశారు. మొత్తం 335 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వచ్చినట్లు వెల్లడించారు. తద్వారా యూఎస్, యూ రప్లను భారత్ అధిగమించినట్లు పేర్కొన్నారు. గత రెండేళ్ల బాటలో వచ్చే ఏడాదిలోనూ ఐపీవోలు రికార్డ్ సృష్టించనున్నట్లు అంచనా వేశారు. వెరసి క్విప్లు, ఐపీవోల ద్వా రా రూ. 3 లక్షల కోట్ల ను మించి పెట్టుబడుల సమీకరణకు వీలున్నట్లు అభిప్రాయపడ్డారు.ల్యూమినో ఇండస్ట్రీస్ లిస్టింగ్ బాట సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు కండక్టర్స్, పవర్ కేబుళ్ల తయారీ కంపెనీ ల్యూమినో ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 400 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 1,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 420 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 15 కోట్లు పరికరాల కొనుగోలుకి వెచ్చించనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా ప్రొడక్ట్ ఆధారిత ఈపీసీ సేవలు అందిస్తోంది. కండక్టర్స్, పవర్ కేబుళ్లు, ఎలక్ట్రికల్ వైర్లతోపాటు విద్యుత్ ప్రసారం, పంపిణీకి చెందిన ఇతర ప్రత్యేక విడిభాగాలను సైతం రూపొందిస్తోంది. కంపెనీ క్లయింట్లలో కల్పతరు ప్రాజెక్ట్స్, మాంటె కార్లో, జాక్సన్ లిమిటెడ్, వరోరా కర్నూల్ ట్రాన్స్మిషన్ తదితరాలున్నాయి. అంతేకాకుండా దేశ, విదేశీ ప్రభుత్వ విద్యుత్ బోర్డులు సైతం కస్టమర్ల జాబితాలో ఉన్నాయి. 2024 సెప్టెంబర్కల్లా కంపెనీ ఆర్డర్ బుక్ విలువ రూ. 1,804 కోట్లకు చేరింది. గతేడాది(2023–24) ఆదాయం 85% జంప్చేసి రూ. 1,407 కోట్లను తాకగా.. నికర లా భం రూ. 19 కోట్ల నుంచి రూ. 87 కోట్లకు ఎగసింది. ఐపీవో గ్రే మార్కెట్పై సెబీ కన్నుప్రీలిస్టింగ్ ట్రేడింగ్ను అనుమతించే యోచనపబ్లిక్ ఇష్యూల అనధికార క్రయవిక్రయాల(గ్రే మార్కెట్)కు చెక్ పెట్టే యోచనలో ఉన్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పేర్కొంది. ఇందుకు ఒక వ్యవస్థను ప్రవేవపెట్టే ప్రణాళికల్లో ఉన్నట్లు సెబీ చైర్పర్శన్ మాధవీ పురీ బచ్ పేర్కొన్నారు. తద్వారా ఐపీవోలో షేర్లను పొందగల ఇన్వెస్టర్లు ముందుగానే వీటిని విక్రయించేందుకు వీలు కల్పించనున్నట్లు తెలియజేశారు. ఇటీవల కాలంలో పలు ఐపీవోలకు భారీస్థాయిలో స్పందన లభించడంతోపాటు.. అధిక లాభాలతో లిస్టవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొద్దికాలంగా గ్రే మార్కెట్ లావాదేవీలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇన్వెస్టర్లు ఇలాంటి లావాదేవీలను కోరుకుంటుంటే నియంత్రణల పరిధిలో వీటిని ఎందుకు అనుమతించకూడదంటూ వ్యాఖ్యానించారు. దేశీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ల అసోసియేషన్ ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో బచ్ ఇంకా పలు అంశాలపై స్పందించారు. నిజానికి గ్రే మార్కెట్ లావాదేవీలు సరికాదని, ఆర్గనైజ్డ్ మార్కెట్ ద్వారానే క్రయవిక్రయాలు చేపట్టడం శ్రేయస్కరమని బచ్ తెలియజేశారు. ఇందుకు రెండు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు చర్చలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మార్గదర్శకాలు సిద్ధమయ్యాక ఐపీవో షేర్లకు లిస్టింగ్కంటే మూడు రోజులు ముందుగా లావా దేవీలకు తెరతీయనున్నట్లు వివరించారు. షేర్ల కేటాయింపులు, లిస్టింగ్ మధ్యలో ఇందుకు వీలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. నిధుల దుర్వినియోగం కొన్ని కంపెనీలు ఐపీవోల ద్వారా సమీకరించిన నిధులను దురి్వనియోగపరుస్తున్నట్లు గుర్తించామని బచ్ తెలియజేశారు. క్యాపిటల్ మార్కెట్లలో ఇలాంటి సంస్థలు కార్యకలాపాలు నిర్వహించకుండా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు అడ్డుకోవాలని సూచించారు. ఐపీవో డాక్యుమెంట్లను వేగంగా పరిశీలించి అనుమతులిచ్చేందుకు వీలుగా ఒక సాధనాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. ఐబ్యాంకర్లకు ఇలాంటి కంపెనీలగురించి తెలుస్తుందని, ఇలాంటి వాటికి సహకరించవద్దని సలహా ఇచ్చారు. ఎస్ఎంఈ విభాగంలో ఇలాంటి ఐపీవోలు వెలువడితే అధిక సబ్ర్స్కిప్షన్ నమోదవుతున్నదని చెప్పారు. ఆపై షేరు ధర భారీగా పెరుగుతూపోవడం ద్వారా ప్రమోటర్లు త్వరితగతిన లాభపడుతున్నట్లు వివరించారు. సంబంధిత పార్టీ లావాదేవీల ద్వారా ఐపీవో నిధులను కొన్ని కంపెనీలు ప్రమోటర్ సంబంధ సంస్థలలోకి చేర్చడం లేదా రక్షణాత్మక ప్రాంతాలకు మళ్లించడం చేస్తున్నట్లు బచ్ తెలియజేశారు. ఈ నిధులను విదేశీ మార్కెట్లలో ఇతర సంస్థలు లేదా సాఫ్ట్వేర్ వంటి ప్రొడక్టుల కొనుగోలుకి వినియోగిస్తున్నాయని వివరించారు. -
సరికొత్త ప్రచారం!
సాక్షి, అమరావతి : వాట్సాప్ లేదా మెసేజ్లు తెరవగానే ప్రెస్టేజ్ నుంచి ప్రత్యేక ఆఫర్లు.. తనిష్క్ మీ కోసం ప్రత్యేకమైన ఆఫర్లు.. అంటూ పలు కంపెనీల మెసేజ్లు వస్తున్నాయి. ఇప్పుడు ఇటువంటి బిజినెస్ మెసేజింగ్పై కంపెనీలు పెద్ద ఎత్తున దృష్టి సారిస్తున్నాయి. సాధారణ మెసేజ్లతో పోలిస్తే బిజినెస్ మెసేజ్లు 90 శాతంపైగా చదువుతుండటంతో వ్యాపార సంస్థలు తమ ప్రచారం కోసం బిజినెస్ మెసేజింగ్ను ఎంచుకుంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో బిజినెస్ మెసేజింగ్ రూపు రేఖలు వేగంగా మారిపోతున్నాయి. వినియోగదారుల వ్యక్తిగత అభిరుచికి అనుగుణంగా ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వ్యాపార ప్రకటనలు జారీ చేస్తున్నాయి. ఇందుకోసం రిచ్ కమ్యూనికేషన్స్ సర్విసెస్ (ఆర్సీఎస్), జెనరేటివ్ ఏఐ, చాట్బోట్ వంటి సాధనాలపై దృష్టి సారిస్తున్నాయి. సాధారణ స్పామ్ మెసేజ్లు, ఇతర మెసేజ్లతో పోలిస్తే ఈ బిజినెస్ మెసేజ్లు ఎటువంటి మోసాలకు ఆస్కారం లేకుండా సెక్యూరిటీ ఉండటం, చూడగానే ఆకర్షించే విధంగా విజువల్ ఆడియోతో ఉంటుండటంతో కంపెనీలు వీటిపై ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. ప్రతి కంపెనీ తమ ఉత్పత్తుల ప్రచారం, లేదా సమాచారం ఎప్పటికప్పుడు అందించడం కోసం గూగుల్, యాపిల్ వంటి సంస్థలు అందిస్తున్న సర్విసు సేవలను వినియోగించుకుంటున్నాయి. రూ.26 వేల కోట్ల మార్కెట్దేశీయ బిజినెస్ మెసేజింగ్ మార్కెట్ పరిమాణం 2024లో రూ.6,885 కోట్లుగా ఉండగా, 2025లో బిలియన్ డాలర్లు అంటే రూ.8,500 కోట్ల మార్కును అధిగమిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2030 నాటికి ఈ మార్కెట్ పరిమాణం మూడు రెట్లు పెరిగి రూ.26,000 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కంపెనీలు అందిస్తున్న వాయిస్ బోట్స్ సర్విసులు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో 4 శాతం కంపెనీలు ఈ బిజినెస్ మెసేజింగ్ సేవలు వినియోగించుకుంటుండగా, మరో 30 శాతం కంపెనీలు జనరేటివ్ ఏఐపై ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. దేశీయ బిజినెస్ మెసేజింగ్ మార్కెట్లో 50 శాతం వాటాను వాట్సాప్ అందిస్తున్న ఆర్సీఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉందంటున్నారు. 2029 నాటికి దేశవ్యాప్తంగా ఆర్సీఎస్ లావాదేవీల సంఖ్య 2.54 కోట్లు దాటడంతోపాటు ఈ వ్యాపార పరిమాణం ఒక్కటే రూ.4,624 కోట్లు దాటుందని అంచనా వేస్తున్నారు. -
జీరో కార్బన్ ఉద్గారాల వైపు ప్యూర్ ఈవీ
జీరో కార్బన్ ఉద్గారాల వైపు అడుగులు వేస్తూ.. ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ 'ప్యూర్ ఈవీ' (Pure EV) పునరుత్పత్పాదక శక్తి ద్వారా విద్యుత్ బిల్లులను గణనీయంగా తగ్గించుకుంది. తెలంగాణలోని కంపెనీ సదుపాయంతో డీజీ అండ్ గ్రిడ్తో కూడిన 500 కిలోవాట్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్.. 125 కిలోవాట్ సిస్టం వంటి వాటిని ఏకీకృతం చేయడం ద్వారా.. ఎనర్జీ ఎఫిషియన్సీలలో సరికొత్త మైలురాయిని సాధించింది. మునుపటి ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే.. విద్యుత్ బిల్లులకు సంబంధించిన ఖర్చులలో 60 శాతం, డీజీ ఇంధన బిల్లులలో 65 శాతం తగ్గింపును నమోదు చేసింది.సోలార్ ఇన్స్టాలేషన్ అనేది కంపెనీ కార్యకలాపాలను శక్తివంతం చేయడానికి.. పునరుత్పాదక శక్తిని వినియోగించుకోవడానికి మాత్రమే కాకుండా గ్రిడ్ నుంచి విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించడానికి సహాయం చేస్తుంది. 500 KWh పూర్తిగా కొత్త బ్యాటరీలను కలిగి ఉంటుంది. అంటే పాత బ్యాటరీల స్థానంలో లేటెస్ట్ జనరేషన్ బ్యాటరీలను అమర్చింది. ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. పూర్తిగా ఎలక్రిక్, సోలార్ వంటి వాటిని ఉపయోగించడం వల్ల కాలుష్య తీవ్రతను తగ్గించవచ్చు.పునరుత్పాదక శక్తిని ఉపయోగించుకునే శక్తిని కంపెనీ పొందినందుకు చాలా సంతోషిస్తున్నాము. ఇది పర్యావరణానికి అనుకూలంగా ఉండటమే కాకుండా.. ఖర్చులను కూడా గణనీయంగా తగ్గించడంలో సహాయపడుతుందని ప్యూర్ వ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్ డా. నిశాంత్ దొంగరి అన్నారు. లేటెస్ట్ పవర్ స్టోరేజ్ టెక్నాలజీతో కలిసి సోలార్ పవర్ (Solar Power) ఉపయోగించడం ద్వారా.. మేము భవిష్యత్తులో గొప్ప పురోగతిని సాధించవచ్చని ఆయన అన్నారు. అంతే కాకుండా జీరో కార్బన్ ఉద్గారాలు మా లక్ష్యం అని అన్నారు. -
ప్లాస్టిక్ బాటిల్ వాటర్తో హై రిస్క్: ఇండస్ట్రీ ఇవి కచ్చితంగా పాటించాల్సిందే!
ఎన్ని హెచ్చరికలు, సూచనలు జారీ చేస్తున్నా, ఏ మాత్రం లక్ష్య పెట్టకుండా ఇబ్బడి ముబ్బడిగా ప్లాస్టిక్ బాటిల్స్లో నీళ్లు తాగుతున్న మనందరికి భారతదేశ ఆహార నియంత్రణ సంస్థ ఒక హెచ్చరిక లాంటి వార్తను అందించింది. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ , మినరల్ వాటర్ను "హై-రిస్క్ ఫుడ్" కేటగిరీలో చేర్చింది. అంతేకాదు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ధృవీకరణను తొలగించాలనే ఆదేశాలు జారీ చేసింది. అలాగే కఠినమైన భద్రతా ప్రోటోకాల్ను ఆయా కంపెనీలు కచ్చితంగా పాటించాలని పేర్కొందిఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నోటిఫికేషన్ ప్రకారం, కొత్త మార్గదర్శకాలకనుగుణంగా ప్రకారం, తయారీదారులు , ప్రాసెసర్లు లైసెన్స్లు లేదా రిజిస్ట్రేషన్లను మంజూరు చేయడానికి ముందు తప్పనిసరిగా తనిఖీలు చేయించుకోవాలి. అక్టోబరులో, ప్యాకేజ్డ్ వాటర్కి సంబంధించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ అవసరాన్ని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సవరించిన నిబంధనల ప్రకారం, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ మరియు మినరల్ వాటర్ తయారీ దారులందరూ ఇప్పుడు లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ పొందేందుకు తప్పనిసరిగా వార్షిక, రిస్క్ ఆధారిత తనిఖీలు చేయించుకోవాలి.గతంలో, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ పరిశ్రమ BIS , FSSAI రెండింటి ద్వారా ద్వంద్వ ధృవీకరణ అవసరాల తొలగించాలి డిమాండ్ చేసింది. కానీ ఈ వాదనలను తోసిపుచ్చిన సంస్థలు తప్పని సరిగా తనిఖీలు చేయించాలని, సంబంధిత ధృవీకరణ పత్రాలను పొందాలనిస్పష్టం చేశాయి. దీనికి ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ వంటి హై-రిస్క్ ఫుడ్ కేటగిరీలలో వ్యాపారం చేస్తున్నవారు, FSSAI-గుర్తింపు పొందిన మూడవ-పక్ష (థర్డ్పార్టీ) ఆహార భద్రతా ఏజెన్సీల వార్షిక ఆడిట్లను పొందాల్సి ఉంటుంది.హై-రిస్క్ ఫుడ్ కేటగిరీల క్రింద వచ్చే ఇతర ఉత్పత్తులు:పాల ఉత్పత్తులు, అనలాగ్స్పౌల్ట్రీతో సహా మాంసం , మాంసం ఉత్పత్తులు,మొలస్క్లు, క్రస్టేసియన్లు , ఎచినోడెర్మ్లతో సహా చేపలు , చేప ఉత్పత్తులుగుడ్లు , గుడ్డు ఉత్పత్తులునిర్దిష్ట పోషక అవసరాల కోసం ఉద్దేశించిన ఆహార ఉత్పత్తులుతయారుచేసిన ఆహారాలు (ప్రిపేర్డ్ ఫుడ్)భారతీయ స్వీట్లుపోషకాలు, వాటి ఉత్పత్తులు (ఫోర్టిఫైడ్ బియ్యం మాత్రమే)కాగా ప్లాస్టిక్ బాటిల్స్ లోని నీళ్లు తాగడం చాలా ప్రమాదమని ఇప్పటికే చాలామంది నిపుణులు హెచ్చరించారు. ప్లాస్టిక్ పర్యావరణానికి ముప్పు కలిగించటమే కాదు, మానవ ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుందని పేర్కొన్నారు. అనేక రసాయనాలతో తయారైన ప్లాస్టిక్ బాటిల్స్ లోని నీరు తాగటం వల్ల ఒక్కోసారి కేన్సర్ లాంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
ఎనిమిది కంపెనీలకు రూ.7300 కోట్ల పెనాల్టీ!.. కారణం ఇదే..
హ్యుందాయ్ మోటార్, మహీంద్రా, కియా, హోండాతో సహా మొత్తం 8 దిగ్గజ కార్ల తయారీదారులు కేంద్రం గట్టి షాకివ్వనుంది. ఈ కంపెనీలు 2022-23 ఆర్ధిక సంవత్సరంలో ఉద్గార ప్రమాణాలను పాటించనందుకు అధిక పెనాల్టీని ఎదుర్కోవలసి ఉంటుంది.2022లో అమలులోకి వచ్చిన కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ కెపాసిటీ (CAFE) ప్రమాణాల ప్రకారం.. కంపెనీలు విక్రయించే అన్ని కార్లు 100 కిలోమీటర్లకు 4.78 లీటర్ల కంటే ఎక్కువ ఇంధన వినియోగం జగగకూడదు. అంతే కాకుండా కర్బన ఉద్గారాలు కూడా కిలోమీటరుకు 113 గ్రాముల కంటే ఎక్కువ ఉండకూడదు. అయితే కంపెనీలు ఈ నియమాలను పెడచెవిన పెట్టినట్లు సమాచారం. ఈ కారణంగానే కేంద్రం ఈ సంస్థలకు రూ.7,300 కోట్లు పెనాల్టీ విధించనుంది.కేంద్రం విధించనున్న ఫెనాల్టీలో అత్యధికంగా హ్యుందాయ్ మోటార్కు (రూ. 2837.8కోట్లు) పడే అవకాశం ఉంది. ఆ తరువాత స్థానంలో మహీంద్రా (రూ.1788.4 కోట్లు), కియా (రూ.1346.2 కోట్లు), హోండా (రూ.457.7 కోట్లు), రెనాల్ట్ (రూ.438.3 కోట్లు), స్కోడా (రూ.248.3 కోట్లు), నిస్సాన్ (రూ. 172.3 కోట్లు), ఫోర్డ్ (రూ.1.8 కోట్లు) ఉన్నాయి.ఈ విషయం మీద ఆటోమొబైల్ కంపెనీనీలు.. కేంద్రంతో చర్చలు జరుపుతున్నాయి. తాము 2023 జనవరి 1నుంచి ఉద్గార ప్రమాణాలకు సంబంధించిన అన్ని నియమాలను కఠినంగా పాటిస్తున్నామని సంస్థలు పేర్కొన్నాయి. కాబట్టి ఆ ఆర్థిక సంవత్సరం మొత్తానికి కలిపి పెనాల్టీ విధించడం సరికాదని చెబుతున్నాయి. దీనిపైన కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. -
ఎలాంటి తప్పులకు పాల్పడలేదు
న్యూఢిల్లీ: అదానీ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ గౌతమ్ అదానీపై యూఎస్లో నమోదైన లంచంఅభియోగంపై గ్రూప్ సీఎఫ్వో జుగేశిందర్ రాబీ సింగ్ ఎక్స్ వేదికగా స్పందించారు. 11 లిస్టెడ్ సంస్థలతో కూడిన అదానీ గ్రూప్ పోర్ట్ఫోలియో కంపెనీల్లో ఏ ఒక్కటీ ఎలాంటి తప్పులకు పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు. న్యాయపరమైన ఆమోదాలు పొందిన తర్వాత యూఎస్లో నేరారోపణపై అదానీ గ్రూప్ వివరణాత్మక వ్యాఖ్యను చేస్తుందని సింగ్ చెప్పారు. ‘సంబంధం లేని అంశాలను ఎంచుకుని, శీర్షిక సృష్టించడానికి ప్రయత్నించే వార్తలు, నివేదికలు చాలా ఉన్నాయి. లీగల్ ఫైల్లో సమర్పించిన విషయాన్ని మేము వివరంగా సమీక్షించిన తర్వాత పూర్తి సమయంలో ప్రతిస్పందిస్తాం. నేరారోపణపై ఏ న్యాయస్థానం ఇంకా తీర్పు ఇవ్వలేదు. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ యొక్క న్యాయవాదులు వివరించినట్లుగా ఇవి ఆరోపణలు మరియు నిందితులు నిర్దోషిగా భావించబడతారు. నేరారోపణ అదానీ గ్రీన్ యొక్క ఒక ఒప్పందానికి సంబంధించినది. ఇది అదానీ గ్రీన్ యొక్క మొత్తం వ్యాపారంలో దాదాపు 10 శాతం. దీని గురించి చాలా ఖచ్చితమైన, సమగ్రమైన వివరాలు ఉన్నాయి. మేము తగిన వేదికలో విశదీకరిస్తాము’ అని జుగేశిందర్ రాబీ సింగ్ వివరించారు. అదానీ చైర్మన్కు సమన్లున్యూయార్క్: యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ కమీషన్ (ఎస్ఈసీ) చేసిన లంచం ఆరోపణలపై తమ వైఖరిని వివరించాల్సిందిగా అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ గౌతమ్ అదానీ మరియు అతని మేనల్లుడు, అదానీ గ్రీన్ ఎనర్జీ డైరెక్టర్ సాగర్లకు సమన్లు అందాయి. 21 రోజుల్లోగా ఎస్ఈసీకి సమాధానం ఇవ్వాలని న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి అహ్మదాబాద్లోని అదానీ శాంతివన్ ఫామ్ నివాసానికి, అదే నగరంలోని అతని మేనల్లుడు సాగర్ నివాసానికి సమన్లు జారీ అయ్యాయి.కెన్యాలో విమానాశ్రయ నిర్వహణ ఒప్పందం కుదుర్చుకోలేదుకెన్యా ప్రధాన విమానాశ్రయాన్ని నిర్వహించడానికి తాము ఎటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకోలేదని అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. యూఎస్లో లంచం ఆరోపణల నేపథ్యంలో 2.5 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఒప్పందాలను కెన్యా రద్దు చేసిందనే వార్తలపై బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ శనివారం స్పందించింది. కెన్యా అధ్యక్షుడు విలియం రూటో ఆ దేశ ప్రధాన విమానాశ్రయ ప్రాజెక్టు రద్దుకు ఆదేశించినట్లు వచ్చిన నివేదికలను ధృవీకరించుకోవడానికి స్టాక్ ఎక్సే్ఛంజీలు పంపిన నోటీసులకు అదానీ గ్రూప్ ప్రతిస్పందించింది. విమానాశ్రయ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్.. ఈ ఏడాది ఆగస్టులో కెన్యాలో విమానాశ్రయాలను అప్గ్రేడ్ చేయడానికి, ఆధునీకరణకు, నిర్వహణకై ఒక అనుబంధ సంస్థను ఏర్పాటు చేసినట్లు ఒక ఫైలింగ్లో తెలిపింది. ఈ రోజు వరకు కంపెనీకి లేదా దాని అనుబంధ సంస్థలకు కెన్యాలో ఏ విమానాశ్రయ ప్రాజెక్ట్ను అప్పగించలేదని, ఏ విమానాశ్రయానికి సంబంధించి ఏదైనా కట్టుబడి లేదా ఖచ్చితమైన ఒప్పందాన్ని కుదుర్చుకోలేదని సంస్థ తెలిపింది.పవర్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టుపై.. కెన్యాలో 30 ఏళ్లపాటు కీలకమైన విద్యుత్ పంపిణీ వ్యవస్థ నిర్మించి, నిర్వహించడానికి గత నెలలో సంతకం చేసిన ఒప్పందంపై మాట్లాడుతూ.. సవరించిన సెబీ లిస్టింగ్ నిబంధనల ప్రకారం సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్) రెగ్యులేషన్స్ 2015 యొక్క షెడ్యూల్–3, పార్ట్ ఏ, ప్యారా–బీ ఐటెం 4 పరిధిలోకి ప్రాజెక్ట్ రాదని కంపెనీ తెలిపింది. దీని ప్రకారం దక్కించుకున్న, సవరించిన లేదా రద్దు అయిన కాంట్రాక్టుల గురించి ఎలాంటి బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని గ్రూప్ పేర్కొంది. రద్దును నిర్ధారించడానికి లేదా తిరస్కరించడానికి గ్రూప్ నిరాకరించింది. పవర్ ట్రాన్స్మిషన్ లైన్లను నిర్వహించే అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ కెన్యాలో ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ను దక్కించుకున్నట్టు అక్టోబర్ 9న ప్రత్యేక ఫైలింగ్లో తెలిపింది. దీనికి అనుగుణంగా కెన్యాలో అనుబంధ సంస్థను నెలకొల్పినట్టు వివరించింది. -
మీటింగ్కు రాలేదని 90 శాతం ఉద్యోగులను తొలగించిన సీఈఓ
సంస్థ నిర్వహించిన సమావేశానికి హాజరుకాలేదని.. దాదాపు ఉద్యోగులందరినీ సీఈఓ తొలగించిన ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికాకు చెందిన మ్యూజిక్ కంపెనీలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.ఉదయం ఉద్యోగులందరీ సమావేశానికి హాజరుకావాలని కంపెనీ సీఈఓ వెల్లడించారు. కానీ ఈ సమావేశానికి 99 మంది హాజరుకాలేదు. దీంతో కోపంతో ఊగిపోయిన సీఈఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వీరందరిని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి ఆ కంపెనీలో పనిచేసే మొత్తం ఉద్యోగుల సంఖ్య 110 మంది మాత్రమే. 99 మందిని తీసేస్తూ సీఈఓ నిర్ణయం వల్ల ఆ సంస్థలో 11 మంది మాత్రమే మిగిలారు.ఉద్యోగులను తొలగించడం మాత్రమే కాకుండా.. కంపెనీకి సంబంధించిన వస్తువులు మీ దగ్గర ఏవైనా ఉంటే తిరిగి ఇచ్చేయండి. అన్ని అకౌంట్స్ నుంచి లాగ్ అవుట్ అవ్వండి అంటూ సీఈఓ పేర్కొన్నారు. సమావేశానికి హాజరుకాలేదనే కారణంతో జాబ్ నుంచి తొలగించిన సీఈఓపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పని పూర్తి చేయడంలో నిమగ్నం కావడం వల్లనే, సమావేశానికి హాజరు కాలేదని ఉద్యోగులు చెబుతున్నారు.ఇదీ చదవండి: భర్తకు తెలియకుండా చేసిన పని.. బెంజ్ కంపెనీ బతికేలా చేసిందిఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఒక్క సమావేశానికి హాజరు కాలేదని సుమారు 90 శాతం మందిని తొలగించడం ఎంతవరకు న్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి కొందరు మిగిలిన 11 మంది ఉద్యోగులను సీఈఓ పీల్చి పిప్పి చేస్తాడు అని అన్నారు. ఇంకొందరు.. ఇలాన్ మస్క్ నుంచి ఆయన పాఠాలు నేర్చుకున్నట్లు చెప్పుకొచ్చారు. -
అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం.. వందలాది మందికి నోటీసులు
అమెరికన్ దిగ్గజ విమాన తయారీ సంస్థ 'బోయింగ్'.. 438మంది ఉద్యోగులకు లేఆఫ్ నోటీసులు జారీ చేసింది. గతంలోనే ఈ సంస్థ ఉద్యోగుల తొలగింపులకు సంబంధించిన విషయాన్ని వెల్లడించినప్పటికీ.. ఎట్టకేలకు లేఆఫ్ నోటీసులను జారీ చేసింది. యూఎస్లోని సియాటెల్ ప్రాంతంలో కంపెనీకి చెందిన 33వేల మంది ఉద్యోగులు సమ్మె చేయడం వల్ల వచ్చిన నష్టాన్ని భర్తీ చేయడంలో భాగంగా ఉద్యోగుల తొలగింపులు చేపట్టింది.ఆర్ధిక పరమైన సమస్యలను రూపుమాపుకోవడానికి మాత్రమే కాకుండా.. ఉత్పత్తిలో జరిగిన ఆలస్యాలను దృష్టిలో ఉంచుకుని బోయింగ్ 438 మందికి లేఆఫ్ నోటీసులు అందించింది. ఇందులో 218 మంది ఇంజనీర్లు, సొసైటీ ఆఫ్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్ ఎంప్లాయీస్ ఇన్ ఏరోస్పేస్ (SPEEA) యూనిట్లోని సభ్యులు, మిగిలినవారు టెక్నీకల్ విభాగానికి చెందిన ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. కంపెనీ తన ఉద్యోగులను తొలగించినప్పటికీ.. అర్హత కలిగిన వారికి మూడు నెలల వరకు కెరీర్ ట్రాన్సిషన్ సేవలు, ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు అందించనున్నట్లు సమాచారం.సమ్మె ఎఫెక్ట్సియాటెల్ ప్రాంతంలో బోయింగ్ ఉద్యోగులు సుమారు 33,000 మంది నెల రోజులు సమ్మె చేయడం వల్ల.. 737 మ్యాక్స్, 767, 777 జెట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో కంపెనీ భారీ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి, ఉద్యోగులను తొలగించడానికి సంస్థ సిద్ధమైంది. బోయింగ్ ఉన్న పరిస్థితుల్లో కఠినమైన నిర్ణయాలు చాలా అవసరమని కంపెనీ సీఈఓ గత నెలలోనే పేర్కొన్నారు. -
ఇషా అంబానీ సారథ్యంలోని ఏడు కంపెనీలు ఇవే..
ముకేశ్ అంబానీ గారాల తనయ 'ఇషా అంబానీ' రిలయన్స్ గ్రూపుకు చెందిన వివిధ రంగాల్లో కీలక బాధ్యతలను నిర్వహిస్తోంది. రిలయన్స్ రిటైల్ మేనేజింగ్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తూనే.. ఇతర సంస్థలను కూడా పర్యవేక్షిస్తోంది. ఈ కథనంలో ఇషా సారథ్యంలో ముందుకు సాగుతున్న సంస్థల గురించి తెలుసుకుందాం.తీరా బ్యూటీ (Tira Beauty)ఇషా అంబానీ సారథ్యంలోని ప్రముఖ వెంచర్లలో తీరా బ్యూటీ ఒకటి. ఇది ఏప్రిల్ 2023లో ప్రారంభమైన ఓమ్ని ఛానల్ బ్యూటీ రిటైల్ ప్లాట్ఫామ్. దీని ద్వారా వెర్సేస్, మోస్చినో, డోల్స్ & గబ్బానా వంటి లగ్జరీ ఉత్పత్తులను విక్రయిస్తోంది. ప్రీమియం షాపింగ్ అనుభవాన్ని కస్టమర్లకు అందించడం ఈ ప్లాట్ఫామ్ లక్ష్యం.హామ్లేస్ (Hamleys)రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ 2019లో సుమారు రూ. 620 కోట్లతో టాయ్ రిటైలర్ హామ్లేస్ను కొనుగోలు చేసింది. ఇది కూడా ఇషా అంబానీ పర్యవేక్షణలో ఉంది. హామ్లేస్ అనేది ప్రపంచ మార్కెట్లోని పురాతనమైన, అతిపెద్ద బొమ్మల రిటైలర్లలో ఒకటి. ఇషా అంబానీ ఈ సంస్థను విస్తరించడంలో కీలక పాత్ర పోషించింది.అజియో (Ajio)ఇషా అంబానీ పర్యవేక్షణలో ఉన్న మరో సంస్థ అజియో. లాక్మే ఫ్యాషన్ వీక్ ఎస్ఎస్16 సందర్భంగా ప్రారంభమైన అజియో.. అతి తక్కువ కాలంలోనే ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్గా అవతరించింది. ప్రస్తుతం ఈ కంపెనీ అధిక లాభాలను గడిస్తూ ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తూ దూసుకెళ్తోంది.కవర్ స్టోరీ (Cover Story)ఇషా దర్శకత్వంలో మరో కీలకమైన బ్రాండ్ 'కవర్ స్టోరీ'. ఇది భారతీయ వినియోగదారులకు అంతర్జాతీయ కాస్మొటిక్స్ అందించే మొట్టమొదటి ఫ్యాషన్ బ్రాండ్గా గుర్తింపు పొందింది. ఇతర దేశాల సౌందర్య ఉత్పత్తులను భారతీయులకు పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో దీనిని ప్రారభించారు.ఫ్రెష్పిక్ (Freshpik)2021లో ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్లో.. ఫ్రెష్పిక్ పేరుతో ఇషా అంబానీ ఫుడ్ రిటైల్ కంపెనీని ప్రారంభించింది. ఇందులో అంతర్జాతీయ పదార్థాలు అందుబాటులో ఉంటాయి. ఇది ఆహార ప్రియులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఇది కూడా ఇషా అంబానీ సారథ్యంలో చాలా వేగంగా అభివృద్ధి చెందింది.నెట్మెడ్స్ (Netmeds)ఇషా అంబానీ ఆన్లైన్, ఆఫ్లైన్ కస్టమర్ అవసరాలను తీర్చే లక్ష్యంతో.. చెన్నైలో ఈ-ఫార్మసీ నెట్మెడ్స్ను కూడా పర్యవేక్షిస్తుంది. 2020లో నెట్మెడ్స్ను రిలయన్స్ రిటైల్ కొనుగోలు చేయడం ద్వారా ఔషధ రంగంలోకి ప్రవేశించింది. ఇది కూడా మంచి లాభాలను ఆర్జిస్తూ ముందుకు సాగుతోంది.ఇదీ చదవండి: లేటు వయసులో రెండో పెళ్లికి రెడీ అయిన ప్రపంచ కుబేరుడు.. ఆరేళ్లుగా!7-ఎలెవెన్ (7-Eleven)రిలయన్స్ రిటైల్తో భాగస్వామ్యం ద్వారా ప్రపంచంలోని ప్రముఖ కన్వీనియన్స్ స్టోర్ చైన్ 7-ఎలెవెన్ను భారతదేశానికి తీసుకురావడంలో ఇషా అంబానీ కీలక పాత్ర పోషించింది. భారతీయ వినియోగదారులకు ఐకానిక్ 24/7 కన్వీనియన్స్ స్టోర్ పరిచయం చేసి.. మెరుగైన షాపింగ్ అనుభూతిని అందిస్తోంది. -
18వేల కంపెనీలు.. రూ.25వేల కోట్ల ఎగవేత
న్యూఢిల్లీ: జీఎస్టీ కింద నమోదైన 18,000 కంపెనీలు 25,000 కోట్ల పన్ను ఎగవేత వ్యవహారం వెలుగు చూసింది. ఇటీవలే జీఎస్టీ అధికారులు దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఇది తెలిసింది.కేవలం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) కోసమే 73,000 కంపెనీలు ఏర్పాటైనట్టు పన్ను అధికారులు అనుమానిస్తున్నారు. ‘‘ఎందుకంటే ఈ సంస్థలకు ఎలాంటి అమ్మకాలు లేకపోవడం గమనార్హం. వీటిల్లో 18వేల కంపెనీలు మనుగడలో లేవు. అవి రూ.24,550 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడ్డాయి’’అని ఓ పన్ను అధికారి తెలిపారు. గతేడాది నిర్వహించిన తొలి డ్రైవ్లోనూ.. 21,791 కంపెనీలు రూ.24,010 కోట్లు ఎగవేసినట్టు గుర్తించడం గమనార్హం. -
కొత్త హోదాలతోనే ఉద్యోగాలు.. ఇదే సరికొత్త ట్రెండ్
టెక్నాలజీ ఎంత వేగంగా మారుతుందో.. దానికి తగ్గట్లే వ్యాపార ధోరణి మారుతోంది. ముఖ్యంగా ఉత్పత్తి, సేవా రంగాల్లో పుట్టగొడుగుల్లా కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. అలాగే.. ఉద్యోగాలలోనూ విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2024లో పలు ఉద్యోగాలలో నియామకాలు పొందిన ప్రతి 10 మందిలో ఒకరు.. గత పాతికేళ్లలో వినిఎరుగని కొత్త హోదాలతో ఉద్యోగాలు పొందినట్లు లింక్డ్ఇన్ సర్వే వెల్లడించింది. గత 25 ఏళ్లలో ఏనాడూ వినని పొజిషన్లను పలువురు ఉద్యోగులకు ఆ కంపెనీలు అప్పగించాయని, వాటిల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇంజనీర్, సస్టైనబిలిటీ మేనేజర్.. లాంటివి ఉన్నాయని లింక్డ్ఇన్ విభాగం ‘వర్క్ చేంజ్ స్నాప్షాట్’ తెలిపింది.‘‘ఉద్యోగాలలో మార్పులు వేగంగా పెరుగుతున్నాయని యూకేకు చెందిన పలువురు వ్యాపారవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కొత్త పొజిషన్లు, నైపుణ్యాలు, సాంకేతికతలకు ఎక్కువ డిమాండ్ ఉందని.. ప్రతీ నలుగురిలో ముగ్గురు ఉద్యోగులు నమ్ముతున్నారు. అలాగే కంపెనీలు సైతం ఆ కొత్త హోదా ఉద్యోగులపైనే అధికంగా అంచనాలు పెంచుకుంటున్నాయి’’ అని ఆ నివేదిక తెలిపింది. ఇందుకోసం చేపట్టిన అధ్యయనంలో.. సుమారు 51 శాతం మంది హెచ్ఆర్ నిపుణులు ఈ అభిప్రాయం వెల్లడించారట. ఇక ఏఐతో సహా కొత్త టెక్నాలజీల వేగంగా అభివృద్ధి చెందటంతో.. యూకే ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు 2016 నుంచి 2030 వరకు 65 శాతం వరకు మారవచ్చని లింక్డ్ఇన్ సర్వే డేటా తెలియజేస్తోంది. ఏఐని ఉపయోగిస్తూ బిజినెస్ చేయడానికి సిద్ధమైనవారికి భారీ అవకాశాలు ఉన్నాయని చెప్పింది. తమ సర్వేలో పాల్గొన్న యూకే వ్యాపారవేత్తల్లో అత్యధికులు (80 శాతం) మంది టీం పనితీరును మెరుగుపరచటంలో ఏఐ సామర్థ్యాన్ని గుర్తించారని తెలిపింది. అయితే.. కేవలం 8 శాతం కంపెనీలను మాత్రామే ఏఐ తమను ముందువరసలో ఉంచుతోందని అభిప్రాయపడినట్లు పేర్కొంది. మరోవైపు.. హెచ్ఆర్ నిపుణులపై ఒత్తిడి మేరకు ప్రతి ముగ్గురిలో ఒకరి కంటే ఎక్కువ మంది ఉద్యోగస్తులు ప్రతిరోజూ వారు తీసుకోవలసిన నిర్ణయాల పట్ల నిరుత్సాహంగా ఉన్నారని తెలిపింది. 15శాతం మంది.. వారంలో పావు వంతు వరకు అవసరమైన తమ పని చేస్తున్నారని వెల్లడించింది.‘‘ప్రస్తుతం సమయంలో వర్క్ ప్లేస్లో మార్పులు వస్తున్నాయి.నిరంతరం అభివృద్ధి చెందుతోంది. ఏఐ వంటి కొత్త సాంకేతికతలు మన రోజువారీ వర్క్ను మెరుగుపరచడానికి గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఏఐ సామర్థ్యాన్ని వాడుకోవటం ఎలా పెంచుకోవాలో కొన్ని బిజినెస్లు పరిశీలన చేస్తున్నాయి’ అని లింక్డ్ఇన్ (యూకే) మేనేజర్ జానైన్ చాంబర్లిన్ అభిప్రాయడ్డారు. -
కార్పొరేట్ జపం!
ఆల్ఫాబెట్స్లో చిట్టచివరి అక్షరమే అయినా.. కొత్తగా పుట్టుకొచ్చే కంపెనీలకిపుడు ‘జెడ్’ తొలి ప్రాధాన్యంగా మారుతోంది. జెన్ జెడ్ ఎఫెక్ట్ కావచ్చు... మరేదైనా కారణం కావచ్చు.. ‘జె’వ్రీథింగ్ ‘జెడ్’ అనేలా బ్రాండ్ బా‘జా’ మోగుతోంది. దశాబ్దకాలంగా జెడ్ కంపెనీల జోరు ఓ రేంజ్లో పెరుగుతూ వస్తోంది! కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2023లో 1,608 కంపెనీలు జెడ్ అక్షరంతో పురుడు పోసుకున్నాయి. 2018తో పోలిస్తే ఈ సంఖ్య ఏకంగా 70 శాతం ‘జూ’మ్ అయ్యింది. మొత్తంమీద ఏర్పాటవుతున్న కొత్త కంపెనీల సంఖ్య ఏటా 9 శాతం పెరుగుతుండగా.. జెడ్ కంపెనీల జోరు 11 శాతంగా ఉంది. ఇక ఈ ఏడాది ఆగస్ట్ నాటికే 1,493 కంపెనీలు జెడ్ అక్షరంతో ఆవిర్భవించడం గమనార్హం. పేరులో ‘జో’ష్ ఉంది... మన దేశంలో ఎవరికైనా.. దేనికైనా పేరు పెట్టడం అంటే పెద్ద ప్రహసనమే. వ్యక్తిగత అంశాల నుంచి, ఆచారాలు, మతాలు, జ్యోతిష్యం, సంఖ్యా శాస్త్రం ఇలా చాలా విషయాలు ప్రభావం చూపుతుంటాయి. అయితే, కంపెనీలు పేర్లు ఖాయం చేయడంలో ఈ అంశాలకు తోడు బ్రాండింగ్, మార్కెటింగ్ టెక్నిక్లు ఇతరత్రా బోలెడన్ని విషయాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ‘మేము ఆట బొమ్మలు, పుస్తకాలు, స్టేషనరీ వ్యాపారాన్ని ప్రారంభించేటప్పడు ఏదైనా సరదాగా ఉండే పేరు కోసం బుర్రబద్దలు కొట్టుకున్నాం. చివరకు జనాల నోళ్లలో నానేలా జిగ్మ్యాగ్ ఎంటర్ప్రైజెస్ అనే పేరును నిర్ణయించాం’ అని ముంబైకి చెందిన హేతల్ సంగానీ చెబుతున్నారు. వాస్తవానికి జిగ్జాగ్ అని పెడదామనుకున్నా.. అది అప్పటికే వేరొకరు రిజిస్టర్ చేసుకోవడంతో జిగ్మ్యాగ్ను ఎంచుకోవాల్సి వచి్చందని ఆయన పేర్కొన్నారు. బ్రాండ్ పేరు పలికేటప్పుడు ఒకరకమైన జోష్ ఉండాలని కొత్తతరం ఎంట్రప్రెన్యూర్స్ కోరుకుంటున్నారు. బోరింగ్గా, పాత వాసనలతో ఉండకూడదనేది వారి అభిప్రాయం. ‘ఈ రోజుల్లో ప్రమోటర్లు పేర్లను ఎంచుకునేటప్పుడు క్యాచీగా, ప్రత్యేకంగా, ట్రెండీగా ఉండేలా చూసుకుంటున్నారు. అంతర్జాతీయంగానూ గుర్తింపు పొందడం చాలా ముఖ్యం. ఆ్రస్టాలజీ, న్యూమరాలజీ కూడా కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఆల్ఫాబెట్స్లో ‘ఏ’ అక్షరంతో కంపెనీలకు కొదవలేదు. దీంతో చివరిదైన జడ్కు ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది’ అని కంపెనీ సెక్రటరీ ఎస్ఎస్ విశ్వనాథన్ తెలిపారు. 1992లో మీడియా మొఘల్ సుభాష్ చంద్ర నెలకొల్పిన ‘జీ టీవీ’ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు! ఇక కొత్తగా నెలకొలి్పన ‘జీ5’ ఓటీటీ కూడా బంపర్ హిట్టే!!‘జెడ్’ ఫ్యాక్టర్!డిస్కౌంట్ బ్రోకరేజీగా ఆరంభమైన ‘జెరోధా’ ఇప్పుడు దేశంలో టాప్ బ్రోకింగ్ కంపెనీగా ఎదగడంలో జెడ్ ఫ్యాక్టర్ కూడా బాగానే పని చేసిందని చెప్పొచ్చు. క్విక్ కామర్స్ సంచలనం జెప్టో పేరు కూడా మార్మోగుతోంది. జీలక్స్ ఫ్యాషన్స్, జెనెర్జీ ఫుడ్స్, జోల్డ్ అకాడమీ, జోబుల్ ఈస్టోర్, జాయిడ్ ఏఐ, జెలో టెక్నాలజీస్, జిమన్స్ టూర్స్, జోఫర్స్, జింబర్ ఇండియా, జూజూ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ, జప్నోసిస్, జెన్నెక్ట్స్ ఇండియా ఇవన్నీ ఇటీవలి జెడ్ మేనియాలో జస్ట్ చిన్న లిస్ట్ మాత్రమే! ‘ఆల్ఫాబెట్స్లో కొన్ని పలికేందుకే కాదు.. వినేందుకు కూడా చాలా సొగసుగా ఉంటాయి. అలాంటి వాటిలో జెడ్ లేదా జీ కూడా ఒకటి. అంతేకాదు, నవతరం జెన్ జెడ్కు కూడా ఇది భలే కనెక్ట్ అవుతోంది. మరీ పెద్దగా కాకుండా నాలుగు అక్షరాలలోపు ఉండేవి పంచింగ్గా ఉంటాయి’ అంటున్నారు బ్రాండ్ స్ట్రాటజీ స్పెషలిస్ట్ హరీష్ బిజూర్. జాప్, జారా, జీల్, జీబ్రా, జీ, జెన్, జెనిత్, జెస్ట్, జెటా, జియస్, జిలియన్, జింగ్, జియాన్, జూమ్ వంటివి వీటిలో కొన్ని.జెడ్ = 8ఇక న్యూమరాలజీ (సంఖ్యా శాస్త్రం) పరంగా కూడా జెడ్ అక్షరానికి విశిష్టత ఉందంటున్నారు నిపుణులు. జెడ్ అనేది 8 అంకెను సూచిస్తుందని... భౌతిక శక్తి, స్థిరత్వం, పరివర్తనను ఇది చాటిచెబుతుందనేది న్యూమరాలజిస్టుల మాట! దీని ఆకారం విషయానికొస్తే.. జిగ్జాగ్ షేపు అనేది వినూత్నత, ఆధునికతకు చిహ్నంగా ఉంటుందని.. నవతరానికి, బ్రాండింగ్, సోషల్ మీడియాలో గుర్తింపునకు కూడా ప్రాతినిథ్యం వహిస్తుందని బ్రాండింగ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. జ్యోతిష్య శాస్త్రం (ఆ్రస్టాలజీ) సంగతి చూస్తే... జెడ్ అక్షరంపై గురుడు లేదా బృహస్పతి గ్రహ బలం అధికంగా ఉంటుందని గుజరాత్కు చెందిన ఆ్రస్టాలజర్ మనీష్ భట్ చెబుతున్నారు. ‘ప్రస్తుతం గ్రహాల కదలికలు... జెడ్ అక్షరం వాడకంపై చాలా సానుకూల ప్రభావం చూపుతున్నాయి’ అని భట్ వ్యాఖ్యానించారు!జెరోధా... జోహో.. జొమాటో.. జూడియో.. జెప్టో... జాగిల్ ప్రీపెయిడ్.. ఇంకా చాలా పెద్ద లిస్టే ఉంది! అయితే ఏంటంటరా? జెన్ జెడ్ మేనియాతో జెడ్ (జీ) నామజపం జోరందుకుంది. జెడ్ అక్షరంతో మొదలయ్యే బ్రాండ్లు, కంపెనీల సంఖ్య ఏటికేడు ఎగబాకుతుండటమే దీనికి నిదర్శనం. పలకడానికి ఈజీగా, వినసొంపుగా... బ్రాండ్ నేమ్ కూడా ఎఫెక్టివ్గా ఉండటంతో వీటికి ప్రాచుర్యం పెరుగుతోంది. అంతేకాదు.. ఇటీవల జెడ్ అక్షరంతో వచ్చిన పలు బ్రాండ్లు బిజినెస్ హిట్ కొట్టి.. ఆయా రంగాల్లో జనాలకు చిరపరిచితంగా కూడా మారిపోవడం విశేషం!! -
మానసిక ఆరోగ్యంతోనే అభివృద్ధి
మానవ సమాజంలో పని అనేది ఒక అంత ర్భాగం. మానవుడు ఆహా రం కోసం చేసే వెదుకు లాట/ వేట మొట్టమొదటి పనిగా చెప్తారు. 18వ శతాబ్దంలో వచ్చిన పారిశ్రామిక విప్లవం పని గంటలు, పని ‘సంస్కృతి’లో అనేక మార్పులు తీసుకువచ్చింది. పరిశ్రమలు, కార్మికులు కలసి ఒక సంస్థాగత వ్యవస్థగా ఏర్ప డ్డారు. టెక్నాలజీ అభివృద్ధి చెందడం, ఇంటర్నెట్ ప్రవేశంతో కొత్తకొత్త ఉద్యోగాల రూపకల్పన జరగడం ప్రారంభమయింది. యాంత్రికీకరణ, కృత్రిమ మేధ అభివృద్ధితో ఇది మరింత కొత్త పుంతలు తొక్కుతోంది. ఒక మనిషి తన జీవిత కాలంలో సుమారుగా తొంభైవేల నుండి ఒక లక్ష గంటల పాటు పని ప్రదేశంలోఉంటాడని అంచనా. అంటే యుక్త వయసు నుండి రిటైరయ్యే వరకు ఉన్న జీవిత కాలంలో ఇది సుమారు మూడు వంతుల సమయం. ఒక ఉద్యోగస్థుడు తన సహ చరులతో ఇంతకాలం గడపడం వలన వారితో ప్రత్యేక అనుబంధం ఏర్పరుచుకుంటాడు. ఈ బంధాలు, పనిచేసే వాతావరణం, యాజమాన్యంతో ఉండే సంబంధం... ఇవన్నీ ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యాన్ని చాలావరకు ప్రభావితం చేస్తాయి. కనుకనే ప్రపంచ మానసిక ఆరోగ్య సంస్థ ‘పని చేసే ప్రదేశంలో మానసిక ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి’ అనే నినాదంతో ఈ సంవత్సరం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపు కుంటోంది. పని ప్రదేశాల్లో ఒత్తిడి అనేది అత్యంత సహజ మైన విషయం. అయితే ఈ ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలియకపోతే పలు రకాల శారీరక, మానసిక సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది. ఒక సర్వే ప్రకారం ప్రతీ పదిమందిలో ఎనిమిది మంది ఏదో ఒక రకమైన ఒత్తిడిని ఎదు ర్కొంటున్నట్లు తేలింది. ప్రతి నలుగురిలో ఒకరు చికిత్స అవసరం అయిన మానసిక సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలా బాధపడే వారిలో కేవలం నలభై శాతం మంది మాత్రమే సరైన వైద్య సహాయం పొందుతున్నారు. అయితే ఇది ఉద్యోగి ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడం ద్వారా ఉత్పాదకతను కూడా తగ్గిస్తుంది. ఇది మిగిలిన ఉద్యోగుల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. కనుక ఉద్యోగితో పాటుగా యాజమాన్యాలు / సంస్థలు తమ ఉద్యోగుల మానసిక ఆరోగ్యం మీద తగిన జాగ్రత్తలు తీసు కోవలసిన అవసరం ఉంది. సరైన సమయపాలన పాటించడం, ఒత్తిడికి గురైనపుడు సహచరుల, యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్ళి సహాయం పొందడం; పనికి, వ్యక్తిగత జీవితానికి హద్దులు పెట్టుకొని కొంత సమయం తనకోసం మాత్రమే కేటాయించుకోవడం, వారాంతాల్లో కుటుంబ సభ్యులతో సమయం గడపడం, పనిలో అప్పుడప్పుడు కొంత విరామం తీసుకోవడం లాంటివి చేయడం ద్వారా ఉద్యోగి ఒత్తిడిని కొంత వరకు తగ్గించవచ్చు. విభిన్న షిఫ్ట్ సిస్టవ్ులో పనిచేసే దంపతులు కలిసి ఉండే సమయం తక్కువ అవడంవల్ల కలిసి క్వాలిటీ టైవ్ు గడిపే అవకాశాలు సన్నగిల్లి వీరి మధ్య కొన్ని మనస్పర్థలు, అనుమా నాలు తలెత్తే అవకాశముంది. సమర్థంగా పనిచేసే వారిని యాజమాన్యం ఎప్పటికప్పుడు ప్రోత్సహించి తగిన ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల వీరిలో మానసిక స్థైర్యం పెంపొందుతుంది. మహిళా ఉద్యోగులు, ఒకవైపు ఇంటి బాధ్యతలు, పిల్లల సంరక్షణ; మరోవైపు ఉద్యోగ బాధ్యతల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంది. అలాంటి వారి ఎడల సంస్థలు కొన్ని వెసులుబాట్లు ఇస్తే, వీరు ఒత్తిడికి లోను కాకుండా ఉండగలరు. కంపెనీలు కూడా ఈ మధ్య కాలంలో ‘వర్క్ ఫ్రమ్ హోవ్ు’ను ప్రోత్సహించడం వలన ఉద్యో గుల్లో ఉత్పాదకత పెరిగినట్లు గణాంకాలు చెబు తున్నాయి. ప్రతి సంస్థ అర్హత కలిగిన మానసిక వైద్యులు లేదా క్లినికల్ సైకాలజిస్టుల సేవలు తమ ఉద్యోగులకు కల్పించాలి. యోగా, ధ్యానం, ఒత్తిడి గురించి వర్క్షాప్స్ వంటి కార్యక్రమాలు తరచుగా తమ సంస్థల్లో జరిగేలా ఏర్పాట్లు చేయాలి. ఒక క్రమ పద్ధతిలో నైపుణ్య పరీక్షలు జరిపి అర్హులైన వారికి ఇంక్రిమెంట్లు, పదోన్న తులు, ఇతర వసతులు కల్పించడం ద్వారా ఉద్యోగస్థుల్లో సంతృప్తి శాతాన్ని పెంచవచ్చు. ఎప్పుడైతే ఉద్యోగస్థులు తమ పనిపట్ల తృప్తితో ఉంటారో వారు మరింత పాజిటివ్ ధృక్పథంతో, సంస్థ అభివృద్ధికి కృషిచేస్తారు. వారు మిగిలిన వారికి ఒక మంచి ఉదాహరణగా నిలిచి, ఒక చక్కని పని సంస్కృతి అనేది సంస్థలో అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని అన్ని సంస్థలు పని ప్రదేశాల్లో ఉద్యోగుల, కార్మికుల మానసిక ఆరోగ్యానికి అత్యంత ప్రాముఖ్యాన్ని ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. జీవితంలోగాని,వృత్తిలో గాని విజయం సాధించాలంటే మనసును స్థిరంగా, ప్రశాంతంగా ఉంచుకోవడమనేది చాలా ముఖ్యమని అందరూ గుర్తించాలి. డా‘‘ ఇండ్ల రామసుబ్బారెడ్డి వ్యాసకర్త ప్రముఖ మానసిక వైద్యనిపుణులు(రేపు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం) -
పండుగల ఆఫర్లు షురూ
న్యూఢిల్లీ: పండుగల సీజన్లో మెరుగైన అమ్మకాల కోసం కంపెనీలు ఆఫర్ల బాట పట్టాయి. ఇప్పటికే కార్ల కంపెనీలు, ఎల్రక్టానిక్స్ ఉత్పత్తుల అమ్మకాలు గణేశ చతురి్థ, ఓనమ్ పండుగల సందర్భంగా ఆఫర్లతో అమ్మకాలు పెంచుకున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు డిమాండ్ స్తబ్దుగా ఉండడంతో, ప్రస్తుత పండుగల సమయంలో మెరుగైన అమ్మకాలపై కంపెనీలు కోటి ఆశలు పెట్టుకున్నాయి. కేరళలో ఓనమ్ పండుగకు ముందే మారుతి 10 శాతం అధిక బుకింగ్లను సాధించింది. వినాయక చవితి రోజు అయితే మహారాష్ట్ర, కర్ణాటకలో అధిక కార్ల డెలివరీలను నమోదు చేసినట్టు మారుతి సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పార్థో బెనర్జీ తెలిపారు. ఇక ఓనమ్ సమయంలో (సెపె్టంబర్ 6 నుంచి 15 వరకు) ద్విచక్ర వాహన అమ్మకాలు 15–16 శాతం పెరిగాయి. కేరళలో కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ ఉత్పత్తుల అమ్మకాలు గతేడాది ఇదే కాలంలో పోల్చి చూస్తే 7–8 శాతం అధికంగా నమోదయ్యాయి. గతేడాది ఓనమ్ సమయంలో విక్రయాలు తగ్గడాన్ని పరిశ్రమ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. కార్లు, ప్రీమియం కన్జ్యూమర్ ఉత్పత్తుల పరంగా డిమాండ్ కొనసాగుతూనే ఉంది. ‘‘ఓనమ్ సమయంలో మాస్ విభాగంలో అమ్మకాల పెరంగా పెద్ద వృద్ధి లేదు. ప్రీమియం ఉత్పత్తుల విభాగంలోనే ఎక్కువ అమ్మకాలు కొనసాగాయి. మాస్ విభాగం అమ్మకాలు అవసరాల ఆధారంగానే ఉన్నాయి. వేసవిలో అధిక వేడి కారణంగా కూలింగ్ ఉత్పత్తులు పెరగడం ఇందుకు నిదర్శనం’’అని గోద్రేజ్ అప్లయన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది తెలిపారు. ఓనమ్ సందర్భంగా విక్రయాలు గతేడాదితో పోలి్చతే పెరిగాయి కానీ, ఆశించిన స్థాయిలో లేవని వెల్లడించారు. వీటికి డిమాండ్..ఫాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు ఓనమ్ పండుగ సమయంలో 15 శాతం అధికంగా నమోదయ్యాయి. ఆరంభ స్థాయిలోని సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ల విక్రయాలు 6–7 శాతం పెరిగాయి. వాషింగ్ మెషిన్లలో అధిక ఫీచర్లతో కూడిన పూర్తి ఆటోమేటిక్ ఉత్పత్తుల విక్రయాలు 12–13 శాతం వృద్ధి చెందాయి. ఇక సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ల అమ్మకాలు కేవలం 4–5 శాతమే పెరిగాయి. యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ బుకింగ్లను శుక్రవారం ప్రారంభించగా, మొదటి రోజే కస్టమర్ల నుంచి వచి్చన స్పందన గతేడాది కంటే మెరుగ్గా ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సాధారణంగా పండుగల సీజన్ మెరుగ్గా ఉంటే 12–15 శాతం మేర అధిక అమ్మకాలు కొనసాగుతాయని, కార్ల విక్రయాల్లో వృద్ధి 20 శాతం మేర ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. దీపావళి వరకు కొనసాగే పండుగల సీజన్కు అమ్మకాలు తీరు ఎలా ఉంటాయన్నది ఓనమ్ సమయంలో డిమాండ్ తెలియజేస్తుంటుంది. గతేడాది ఆటో అమ్మకాల బేస్ అధిక స్థాయిలో ఉండడంతో, ఈ ఏడాది విక్రయాలు తక్కువగా ఉండొచ్చన్న అంచనా సైతం నెలకొంది. గడిచిన కొన్ని నెలలుగా స్తబ్దుగా ఉన్న డిమాండ్కు ప్రస్తుత పండుగల సీజన్ అమ్మకాలు సానుకూల సంకేతాలిస్తున్నట్టు మారుతి సుజుకీ పార్థా బెనర్జీ పేర్కొన్నారు. ఈ పండుగల సీజన్ స్కూటర్లు, మోటారు సైకిళ్లకు ఉత్తమంగా నిలిచి పోతుందని హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్ డైరెక్టర్ యోగేష్ మాథుర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ ఇంకా పుంజుకోవాల్సి ఉందంటూ, ఇప్పటి వరకు కనిపిస్తున్న సంకేతాలు సానుకూలంగా ఉన్నట్టు చెప్పారు. ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో నెలవారీ సగటున 3.30 లక్షల యూనిట్ల విక్రయాలు నమోదు కాగా, పండగుల సీజన్లో 15 శాతం మేర అమ్మకాలు పెరుగుతాయని ఆటోమొబైల్ పరిశ్రమ అంచనాతో ఉంది. ఎల్రక్టానిక్స్, ఆటోమొబైల్ తదితర పరిశ్రమలకు ఏటా పండగుల సీజన్ అమ్మకాల పరంగా ఎంతో కీలకం కావడం తెలిసిందే. -
చట్టాలను ఉల్లంఘించిన స్మార్ట్ఫోన్ కంపెనీలు
శామ్సంగ్, షియోమీ,మోటోరోలా, రియల్మీ, వన్ప్లస్ వంటి స్మార్ట్ఫోన్ కంపెనీలు అమెజాన్.. ఫ్లిప్కార్ట్తో కుమ్మక్కై ఈ-కామర్స్ సంస్థల భారతీయ వెబ్సైట్లలో యాంటీట్రస్ట్ చట్టాలను ఉల్లంఘిస్తూ ప్రత్యేకంగా ఉత్పత్తులను లాంచ్ చేశాయని రాయిటర్స్ ఒక నివేదికలో వెల్లడించింది.కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నిర్వహించిన యాంటీట్రస్ట్ పరిశోధనలలో అమెజాన్, ఫ్లిప్కార్ట్ చట్టాలను ఉల్లంఘించాయని, ఎంపిక చేసిన విక్రేతలకు ప్రాధాన్యత ఇవ్వడం, నిర్దిష్ట జాబితాలకు ప్రాధాన్యత ఇవ్వడం, ఉత్పత్తులను బాగా తగ్గించడం, ఇతర కంపెనీలను దెబ్బతీసినట్లు రాయిటర్స్ నివేదికలో వెల్లడించింది.ఇదీ చదవండి: తమిళనాడుకు దిగ్గజ కంపెనీలు.. రూ.7618 కోట్ల పెట్టుబడులు రాయిటర్స్ నివేదికపై స్మార్ట్ఫోన్ తయారీదారులు స్పందించలేదు. అంతే కాకుండా అమెజాన్, ఫ్లిప్కార్ట్ కంపెనీలు కూడా ఇప్పటివరకు వ్యాఖ్యానించలేదు. అయితే రెండు సీసీఐ నివేదికల పరిశోధనల సమయంలో అమెజాన్ & ఫ్లిప్కార్ట్లు ప్రత్యేకమైన లాంచ్ల ఆరోపణలను వ్యతిరేకించాయి. నివేదిక వెల్లడైన తరువాత స్పందించలేదు. -
మూడు నెలల్లో భారీగా ఉద్యోగాలు.. ఈ రంగాల్లోనే అధికం
న్యూఢిల్లీ: భారత కంపెనీలు నియామకాల పట్ల బలమైన ధోరణితో ఉన్నట్టు మ్యాన్పవర్ గ్రూప్ ‘ఎంప్లాయిమెంట్ అవుట్లుక్ సర్వే క్యూ4, 2024’ నివేదిక వెల్లడించింది. 37 శాతం భారత కంపెనీలు వచ్చే మూడు నెలల్లో (అక్టోబర్–డిసెంబర్) నికరంగా తమ సిబ్బందిని పెంచుకోనున్నట్టు ఈ సర్వేలో తెలిపాయి. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ కాలంలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 7 శాతం అధికం. క్రితం ఏడాది అక్టోబర్ - డిసెంబర్తో పోల్చి చూస్తే తటస్థంగా ఉంది.వివిధ రంగాల్లోని 3,150 కంపెనీల అభిప్రాయాలను సర్వేలో భాగంగా మ్యాన్పవర్ గ్రూప్ తెలుసుకుంది. భారత్ తర్వాత కోస్టారికాలో అత్యధికంగా 36 శాతం కంపెనీలు, ఆ తర్వాత యూఎస్లో 34 శాతం కంపెనీలు నియామకాల పట్ల సానుకూలంగా ఉన్నాయి. సిబ్బందిని తగ్గించుకునే కంపెనీలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నికర నియామకాల గణాంకాలను ఈ సంస్థ రూపొందించింది.‘‘నియామకాల ఉద్దేశ్యం భారత ఆర్థిక వ్యవస్థ పట్ల సానుకూల ధోరణిని తెలియజేస్తోంది. విదేశీ విధానాలు, పెద్ద ఎత్తున మౌలిక వసతుల అభివృద్ధికి తోడు మనకున్న అధిక యువ జనాభా సానుకూలతలు అంతర్జాతీయ మార్కెట్లో భారత పోటీతత్వాన్ని పెంచుతాయి’’అని మ్యాన్పవర్ గ్రూప్ ఇండియా ఎండీ సందీప్ గులాటి పేర్కొన్నారు. రంగాల వారీగా..మ్యానపవర్ గ్రూప్ సర్వే ప్రకారం.. దాదాపు అన్ని రంగాల్లోనూ నియామకాల పట్ల సానుకూలత వ్యక్తమైంది. ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్ రంగాల్లో వచ్చే మూడు నెలల్లో 47 శాతం కంపెనీలు నియామకాల పట్ల సానుకూలంగా ఉంటే, ఐటీలో 46 శాతం, ఇండ్రస్టియల్స్, మెటీరియల్స్రంగాల్లో 36 శాతం, కన్జ్యూమర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ రంగాల్లో 35 శాతం కంపెనీలు సిబ్బందిని పెంచుకోవాలని అనుకుంటున్నాయి. అతి తక్కువగా కమ్యూనికేషన్ సర్వీసెస్ రంగాలో 28 శాతం కంపెనీలే వచ్చే మూడు నెలల్లోనియామకాల పట్ల సానుకూలంగా ఉన్నాయి.ఇదీ చదవండి: 6జీ టెక్నాలజీపై కేంద్రం దృష్టి: జ్యోతిరాదిత్య సింధియా ఉత్తరాదిలో ఉద్యోగాల డిమాండ్ 41 శాతంగా ఉంటే, పశ్చిమాదిన 39 శాతంగా ఉంది. అధిక దేశీయ వినియోగం, ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే పథకాలు, ఔట్సోర్స్ సేవల డిమాండ్ పెంచడం, తయారీపై భారత్ దృష్టి సారిస్తుందని అంచనా వేస్తున్నట్టు గులాటి తెలిపారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం చూస్తుంటే.. భారత్ నిరుద్యోగాన్ని తగ్గించి, కొత్త తరహా పరిశ్రమల అవసరాలు తీర్చే మానవ వనరుల అభివృద్ధి ద్వారా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయొచ్చని గులాటీ వివరించారు. -
యూఎస్ కంపెనీ కీలక నిర్ణయం: ఉద్యోగుల్లో మొదలైన భయం
ప్రైస్వాటర్హౌస్కూపర్స్ (PwC) యునైటెడ్ స్టేట్స్లో దాదాపు 1,800 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. 2009 తరువాత కంపెనీ ఇంత పెద్ద లేఆఫ్స్కు సిద్దమవ్వడం ఇదే మొదటిసారి. ఈ లేఆప్స్ ప్రభావం అసోసియేట్స్, మేనేజింగ్ డైరెక్టర్లు, బిజినెస్ సర్వీసులు, ఆడిట్, పన్ను విభాగాల్లో పనిచేసే ఉద్యోగులపై పడే అవకాశం ఉంది.కంపెనీ తొలగించనున్న ఉద్యోగుల్లో సగం కంటే ఎక్కువమంది అమెరికా బయట పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక పరిస్థితుల కారణంగానే సంస్థ ఈ లేఆప్స్ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. అంతే కాకుండా కంపెనీ భవిష్యత్తు కూడా దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులను తొలగించాల్సి వస్తున్నట్లు సంస్థ ఒక మెమోలో వెల్లడించింది.కరోనా సమయంలో అనేక దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను దొలఁగించినప్పటికీ.. ప్రైస్వాటర్హౌస్కూపర్స్ మాత్రం లేఆప్స్ ప్రకటించలేదు. కానీ కరోనా మొత్తం తగ్గుముఖం పట్టిన తరువాత దాదాపు రెండువేల మందిని ఇంటికి పంపే యోచన చేస్తోంది. ఈ విషయం తెలిసిన ఉద్యోగులలో ఇప్పటికే భయం మొదలైంది. అయితే ఏ విభాగంలో ఎంతమంది ఉద్యోగులను తొలగించారనేది త్వరలోనే తెలుస్తుంది. -
సెలవుల విషయంలో కొత్త రూల్: ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్
సిక్ లీవ్, పేరెంటల్ లీవ్ వంటి లీవ్స్ అన్నీ కూడా కంపెనీ విధివిధానాలు లేదా నియమాల మీద ఆధారపడి ఉంటాయి. లీవ్స్ విషయంలో కొన్ని కంపెనీలు కఠినంగా వ్యవహరిస్తే.. మరికొన్ని కంపెనీలు ఉదారంగా ఉంటాయి. ఇటీవల ఓ కంపెనీ లీవ్స్ విషయంలో ఓ కొత్త రూల్ పాస్ చేస్తూ మెమో రూపొందించింది. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.సోషల్ మీడియాలో వైరల్ అయిన మెమోలో ''పిల్లల అనారోగ్యం'' ఉద్యోగి సెలవు తీసుకోవడానికి సరైన కారణం కాదని పేర్కొన్నారు. మీ పిల్లలకు ఆరోగ్యం బాగాలేనప్పుడు కాల్ చేసి లీవ్ తీసుకోవడం కుదరదు. ఎందుకంటే మేము మీ పిల్లలను పనిలో పెట్టుకోవడం లేదు. మీరే పనిచేయాలి. కాబట్టి ఈ కారణంతో లీవ్ తీసుకోవడానికి అవకాశం లేదు.ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంలో నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఉద్యోగుల విషయంలో కంపెనీ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని అన్నారు. అనారోగ్యంతో ఉన్న బిడ్డను ఆఫీసుకు తీసుకురావాలా? అంటూ కొందరు ప్రశ్నించారు. ఈ రూల్ ఏ కంపెనీ పెట్టిందో చెప్పండి అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఇదీ చదవండి: వైకల్యాన్ని జయించి.. బిలియనీర్గా నిలిచి: జీవితాన్ని మార్చే స్టోరీఉద్యోగులను పనిలో పెట్టుకునే ముందు.. వారికి తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, బంధువులు ఎవరూ లేకుండా ఉండేలా చూసుకోండి. ముందు వెనుక ఎవరూ లేని అనాథలను మీ కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వండి. అప్పుడు సరిపోతుంది అంటూ ఓ యూజర్ తీవ్రంగా విమర్శించారు. -
మొన్న గూగుల్.. నేడు విస్టన్: తమిళనాడుకు దిగ్గజ కంపెనీలు
గూగుల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న తరువాత తమిళనాడు ప్రభుత్వం.. ఇప్పుడు అమెరికాకు చెందిన లింకన్ ఎలక్ట్రిక్, విషయ్ ప్రెసిషన్, విస్టన్లతో రూ.850 కోట్ల విలువైన ఎంవోయూలు కుదుర్చుకున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా సీఎం తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.గురువారం రోజు కూడా స్టాలిన్ ప్రభుత్వం ట్రిలియంట్తో రూ. 2000 కోట్ల అవగాహనా ఒప్పందం (MOU) కుదుర్చుకుంది. ఈ కంపెనీ రాష్ట్రంలో తయారీ యూనిట్ను మాత్రమే కాకుండా.. డెవలప్మెంట్ అండ్ గ్లోబల్ సపోర్ట్ సెంటర్ను ప్రారభించనుంది. చెన్నైలో పాదరక్షల ఉత్పత్తి, విస్తరణ గురించి నైక్తో కూడా చర్చలు జరిపినట్లు సీఎం స్టాలిన్ పేర్కొన్నారు.In the land of opportunities, every new dawn ignites fresh hopes.We’ve secured MoUs worth ₹850 crores with Lincoln Electric, Vishay Precision, and Visteon, bringing us one step closer to realising our vision.Through relentless effort and determination, we continue to turn… pic.twitter.com/Evj0qu8IPt— M.K.Stalin (@mkstalin) September 6, 2024అంతకుముందు బుధవారం, స్టాలిన్ చెన్నైలోని రూ. 200 కోట్ల ఆర్&డీ ఇంజనీరింగ్ సెంటర్ విస్తరణ కోసం బహుళజాతి పవర్ మేనేజ్మెంట్ కంపెనీ అయిన ఈటన్తో కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం రాష్ట్రంలో ఉద్యోగాల సంఖ్యను పెంచుతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి: కొత్త ధరలు ఇవే..రాష్ట్ర శ్రేయస్సును పెంపొందించే లక్ష్యంతో విదేశీ పెట్టుబడులను పొందేందుకు స్టాలిన్ ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్లో అధికారిక పర్యటనలో ఉన్నట్లు సమాచారం. 2024 ఆగష్టు 31న చెంగల్పట్టు జిల్లాలో ఎలక్ట్రోలైజర్లు మరియు గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేయడానికి ఓహ్మియంతో కొత్త ఫ్యాక్టరీ స్థాపనకు ఒప్పందం జరిగింది. దీని ద్వారా 500 ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.Exciting developments in Chicago!Secured a ₹2000 crore MoU with Trilliant to establish a manufacturing unit as well as their Development & Global Support Centre in Tamil Nadu.Thanks to Trilliant for this valuable partnership!Had productive talks with Nike on expanding its… pic.twitter.com/KjsZ2iFkHP— M.K.Stalin (@mkstalin) September 5, 2024 -
భారత్లో హెడ్ ఆఫీస్ అమ్మేస్తున్న అమెరికన్ కంపెనీ
ప్రముఖ టెక్ కంపెనీలన్నీ ఉద్యోగులను తొలగిస్తుంటే.. అమెరికాకు చెందిన 'కాగ్నిజెంట్' మాత్రం ఏకంగా భారతదేశంలోని ఆఫీసునే అమ్మకానికి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఇందులో నిజమెంత? ఆఫీసును విక్రయిస్తే.. ఉద్యోగుల పరిస్థితి ఏమిటి? అనే వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.భారతదేశంలో సుమారు 20 సంవత్సరాలుగా ప్రధాన కార్యాలయంగా కలిగిన ఉన్న ఆఫీసును డిసెంబర్ నాటికి విక్రయించే అవకాశం ఉందని సమాచారం. ఈ విక్రయానికి సంబంధించిన బాధ్యతను అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ సంస్థ 'జేఎల్ఎల్'కు అప్పగించినట్లు చెబుతున్నారు.కాగ్నిజెంట్ విక్రయించనున్న ఈ ఆఫీసు చెన్నైలోని ఐటీ కారిడార్లో ఉంది. ఇది సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దీని విలువ సుమారు రూ. 750 కోట్ల నుంచి రూ. 800 కోట్ల వరకు ఉండొచ్చని సమాచారం. దీనిని కొనుగోలు చేయడానికి భాష్యం గ్రూప్, కాసాగ్రాండ్ సంస్థలు సుముఖత చూపుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం మీద ఆ రెండు సంస్థలు ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు.ఇదీ చదవండి: 30 నెలలు వెయింట్ చేయించి.. షాకిచ్చిన విప్రో!: మండిపడుతున్న ఫ్రెషర్స్2024 డిసెంబర్ నాటికి ఆఫీసును విక్రయించి.. చెన్నైలోని జీఎస్టీ రోడ్డులోని తాంబరం సమీపంలో కొత్త హెడ్ ఆఫీసు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కాబట్టి బహుశా ఉద్యోగులంతా ఆ కొత్త ఆఫీసు నుంచి పనిచేయాల్సి ఉంటుందని భావిస్తున్నాము. కొత్త భవనం అందుబాటులోకి రావడంతో.. కంపెనీ తన పాత భవనాన్ని విక్రయించడానికి సన్నద్ధమైంది. -
టాప్ కంపెనీల్లో ఇంటర్న్షిప్కు మార్గం! (ఫోటోలు)
-
ఫ్రిజ్.. ఏసీ.. మైక్రోవేవ్.. దీర్ఘాయుష్మాన్భవ!
ఏసీలు, ఫ్రిజ్లు, వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, డిష్ వాషర్లు తదితర ఎల్రక్టానిక్స్ గృహోపకరణాలపై ఇప్పుడు వారంటీ వార్ నడుస్తోంది. వైట్ గూడ్స్ కంపెనీలు తమ ఉత్పత్తులకు పోటీ పడి మరీ ఏళ్లకు ఏళ్లు రక్షణ కలి్పస్తున్నాయి. ముఖ్యంగా ఖరీదైన ఉత్పత్తులపై 10–20 ఏళ్ల పాటు బ్రాండ్ వారంటీని అందిస్తున్నాయి. ఈ వ్యూహంతో డిమాండ్ కూడా పెరుగుతోందనేది పరిశ్రమ వర్గాల మాట! – సాక్షి, బిజినెస్ డెస్క్కన్జూమర్ డ్యూరబుల్స్ తయారీ సంస్థలు సేల్స్ పెంచుకోవడానికి కొత్త రూట్లో వెళ్తున్నాయి. ఎల్జీ, శాంసంగ్, హయర్, గోద్రెజ్, వోల్టాస్, పానాసోనిక్ వంటి దిగ్గజ బ్రాండ్లన్నీ తమ ఉత్పత్తుల్లో ప్రధానమైన విడిభాగాలకు 10 ఏళ్ల వరకు వారంటీ ఇస్తున్నాయి. ఏసీ, రిఫ్రిజిరేటర్ల కంప్రెషర్ల వంటి వాటికి ఇవి వర్తిస్తాయి. ఇక వాషింగ్ మెషీన్, డిష్ వాషర్ మోటార్లపై ఏకంగా 20 ఏళ్ల వరకూ వారంటీ లభిస్తోంది. కొన్ని కంపెనీలైతే ఈ ఆఫర్లను ‘లైఫ్ టైమ్’ వారంటీగా కూడా పేర్కొంటుండటం విశేషం. ముఖ్యంగా 35 ఏళ్లు పైబడిన వినియోగదారులు అధిక వారంటీ ఆఫర్లకు బాగా ఆకర్షితులవుతున్నారని, దీంతో అమ్మకాలు కూడా పుంజుకుంటున్నట్లు ఎలక్ట్రానిక్స్ రిటైలర్లు చెబుతున్నారు.రేటు ఎంత ఎక్కువైతే.... వారంటీ విషయంలో ఉత్పత్తుల రేటు కీలకంగా నిలుస్తోంది. ఎంత ప్రీమియం లేదా ఖరీదైన ఉత్పత్తి అయితే వారంటీ అంత ఎక్కువ కాలం ఆఫర్ చేస్తున్నాయి కంపెనీలు. కొన్ని బ్రాండ్లైతే మార్కెట్ వాటాను పెంచుకోవడం కోసం పరిశ్రమ ప్రమాణాలకు మించి ఒకట్రెండు సంవత్సరాలు అధికంగా కూడా వారంటీని అందిస్తుండటం గమనార్హం. ఉదాహరణకు, హయర్, వోల్టాస్ బెకో రిఫ్రిజిరేటర్ కంప్రెషర్లపై 12 ఏళ్లు వారంటీ లభిస్తోంది.ఎల్జీ వారంటీ వ్యవధి 10 ఏళ్లు మాత్రమే. ఇక వాషింగ్ మెషీన్ ఇన్వర్టర్ మోటార్పై శాంసంగ్, హయర్ 20 ఏళ్ల వారంటీని ఆఫర్ చేస్తుండగా... వోల్టాస్ బెకో, గోద్రెజ్ విషయంలో ఈ వ్యవధి 10 ఏళ్లు ఉంటోంది. అయితే, మొత్తం ఉత్పత్తిపై, అలాగే అన్ని విడిభాగాలపై పూర్తిస్థాయి వారంటీని మాత్రం దాదాపు అన్ని ప్రోడక్టులపై కంపెనీలన్నీ ఒకేలా ఇస్తున్నాయి. ఒక ఏడాది లేదంటే గరిష్టంగా మూడేళ్ల వరకు మాత్రమే పరిమితం చేస్తున్నాయి. ప్రధాన విడిభాగాలపైనే... చాలా కంపెనీలు ఎల్రక్టానిక్స్ గృహోపకరణాల్లో ప్రధాన విడిభాగంపైనే ఎక్కువ కాలం వారంటీని ఇవ్వడానికి ప్రధాన కారణం.. దానికి మన్నిక అధికంగా ఉండటమే. అయితే, సుదీర్ఘ వ్యవధి పాటు వారంటీ ఇచ్చేందుకు కంపెనీలు కొంత ఎక్కువ మొత్తాన్ని పక్కనబెట్టాల్సి వస్తోందని పరిశ్రమ ఎగ్జిక్యూటివ్లు చెబుతున్నారు. పోటీ తీవ్రంగా ఉండటంతో ఈ వ్యయాల భారాన్ని కస్టమర్లపై మోపేందుకు కంపెనీలు వెనకాడుతున్నాయి. ఉదాహరణకు, ఫ్లాట్ ప్యానెల్ టీవీ సెట్లపై చాలా బ్రాండ్లు మూడేళ్ల వారంటీ ఇచ్చేందుకు భారీగా వెచ్చించాయి. మరోపక్క, ఈ రోజుల్లో టీవీ ప్యానెల్స్ 12–18 నెలల్లోనే పాడవుతున్న పరిస్థితి. దీంతో వారంటీ మేరకు కొత్త టీవీ ఇవ్వడం కోసం కంపెనీలకు తడిసిమోపెడైనట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.⇒ అధిక వారంటీ వ్యవధి వల్ల అప్గ్రేడ్ కొనుగోళ్లపై ప్రభావం లేదంటున్న పరిశ్రమ వర్గాలు. ⇒ యువ కస్టమర్లు తమ కొనుగోలు నిర్ణయంలో వారంటీ అంశాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం విశేషం.వారంటీ తీరకుండానే మార్చేస్తున్నారు... వాస్తవానికి వారంటీ అనేది కొనుగోళ్ల విషయంలో కీలకమైనప్పటికీ... యువ కస్టమర్లు దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. వారు వినూత్న ఫీచర్లకే ఎక్కువ ప్రాధాన్యమిస్తుండటం విశేషం. పాత ప్రోడక్ట్ స్థానంలో కొత్తది కొనే వినియోగదారులపై కూడా సుదీర్ఘ వారంటీ పెద్దగా ప్రభావం చూపడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ‘బ్రాండ్లు ఏటా కొంగొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి. కొత్త టెక్నాలజీ పేరుతో పాత ప్రోడక్టులను మార్చేసేలా ప్రోత్సహిస్తున్నాయి. మరోపక్క, ఎక్కువ ఏళ్ల పాటు వారంటీ ఇవ్వడం విచిత్రం. అధిక వారంటీకి కస్టమర్లు ప్రాధాన్యం ఇస్తున్నా, వాస్తవ వాడకంలో పెద్దగా ఉపయోగం లేకుండా పోతోంది’ అని ఒక రిటైల్ స్టోర్ డైరెక్టర్ అభిప్రాయపడ్డారు. -
తక్కువ ఖర్చుతో ఉత్పత్తులు రావాలి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/శ్రీసిటీ (వరదయ్యపాళెం): వివిధ పరిశ్రమలకు వేదికగా ఉన్న శ్రీసిటీ నుంచి తక్కువ ఖర్చుతో ఉత్పత్తులు రావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపుగా పారిశ్రామిక రంగం వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు ఇప్పుడు సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. తిరుపతి జిల్లా శ్రీసిటీలో సోమవారం వివిధ పరిశ్రమలకు చంద్రబాబు సోమవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు.శ్రీసిటీలో 15 సంస్థల కార్యకలాపాలు ప్రారంభించి మరో 7 పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. అదే విధంగా 5 కంపెనీలతో రూ.1,213 కోట్ల పెట్టుబడికి కొత్తగా ఒప్పందాలు చేసుకున్నారు. మొత్తంగా 15,280 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. దీంతోపాటు ఫైర్ స్టేషన్ను ప్రారంభించి, పోలీస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం శ్రీసిటీ బిజినెస్ సెంటర్లో పలు కంపెనీల సీఈవోలతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులపై చర్చించారు. అత్యుత్తమ ఎకనమిక్ జోన్గా శ్రీసిటీ.. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ఈరోజు ఒకేచోట 30 కంపెనీల ప్రతినిధులతో భేటీ కావడం గొప్ప విషయం. శ్రీసిటీలో 220 కంపెనీల ఏర్పాటుకు అవకాశం ఉంది. శ్రీసిటీలో 4.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించడం, 4 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు సాధించడం గొప్ప విషయం. శ్రీసిటీని స్పెషల్ ఎకనమిక్ జోన్గా గుర్తించాం. 30 దేశాలు శ్రీసిటీలో పరిశ్రమల ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. సంపద çసృష్టి.. సంక్షేమం, సాధికారతకు దోహదపడుతుంది.చెన్నై, కృష్ణపట్నం, తిరుపతికి శ్రీసిటీ దగ్గరగా ఉంది. శ్రీసిటీని అత్యుత్తమ ఎకనమిక్ జో¯Œన్గా తీర్చిదిద్దాలనేదే నా ఆలోచన. నేను 1995లో ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక సంస్కరణలను ప్రారంభించాను. అప్పట్లోనే విజన్ 2020కి రూపకల్పన చేసి అమలు చేశా. పెట్టుబడులు రాబట్టేందుకు పలు దేశాల్లో పర్యటించా. భారత్ను ఐటీ ప్రపంచపటంలో నిలిచేలా చేస్తుందని ఆనాడే చెప్పా. ఈరోజు దాని ఫలితాలు అందరూ చూస్తున్నారు’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు టి.జి.భరత్, వంగలపూడి అనిత, డీజీపీ, పలు కంపెనీల ప్రతినిధులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సోమశిల ప్రాజెక్టుకు పరిరక్షణకు చర్యలు.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సోమవారం సోమశిల ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించారు. రాష్ట్రంలో రైతులకు సాగు ఖర్చులు తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుతామన్నారు. రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏటా రూ.20 వేల సాయం అందిస్తామని తెలిపారు. సోమశిల ప్రాజెక్టును సద్వినియోగం చేసుకునేలా దాని పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సోమశిల జలాశయం 1988–89లోనే అప్పటి సీఎం ఎన్టీ రామారావు 75 టీఎంసీలు చేశారని చంద్రబాబు మాట్లాడడం చూసి ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. వైఎస్సార్ హయాంలోనే 72 టీఎంసీలకు సోమశిల చేరింది. -
అంతా ఆర్భాటం.. ప్రచార కండూతి!
సాక్షి, అమరావతి/శ్రీసిటీ (వరదయ్యపాళెం): గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైన కంపెనీలను ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం తిరుపతి జిల్లా శ్రీ సిటీలో మళ్లీ లాంఛనంగా ప్రారంభించారు. రూ.1,570 కోట్ల విలువైన ఈ 16 కంపెనీల్లో ఇప్పటికే చాలా సంస్థలు వాణిజ్యపరంగా ఎప్పుడో ఉత్పత్తిని మొదలుపెట్టేశాయి. మరికొన్ని నిర్మాణాలను పూర్తి చేసే స్థితిలో ఉన్నాయి. అయినప్పటికీ తన హయాంలోనే ఈ కంపెనీలు వచ్చినట్టు.. వీటి ద్వారా 8,480 మందికి ఉపాధి కల్పించినట్లు చంద్రబాబు చెప్పుకోవడం గమనార్హం. ఈప్యాక్ డ్యూరబుల్స్, ఓజీ ఇండియా, ఎల్జీ పాలిమర్స్ వంటి కంపెనీలుఎప్పుడో వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించాయి.కానీ సీఎం చంద్రబాబు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా తాము అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే 16 కంపెనీలను ఏర్పాటు చేసి ఉత్పత్తిని కూడా ప్రారంభించామంటూ చెప్పుకున్నారు. వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలో పారిశ్రామిక రంగం ఏ విధంగా పరుగులు తీసిందో.. విశాఖలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో కుదిరిన ఒప్పందాలు ఎంత తొందరగా వాస్తవ రూపంలోకి వచ్చాయో పరోక్షంగా ప్రజలకు చాటిచెప్పారు. తద్వారా రాష్ట్రంలో గత ప్రభుత్వమే పారిశ్రామికాభివృద్ధికి బాటలు పరిచిందని.. దానికి తాము రాజముద్ర వేశామని చెప్పుకున్నట్టైంది. వాస్తవంలోకి జీఐఎస్ ఒప్పందాలు2023లో విశాఖ వేదికగా జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (జీఐఎస్)లో గత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న బెల్ ప్లేవర్స్ అండ్ ఫ్రాగ్నెసెస్ ఇండియా లిమిటెడ్, జెన్ లినెన్, డైకిన్, ఏజీపీ సిటీ గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థలు ఇప్పుడు వాస్తవరూపంలోకి వచ్చినట్లు చంద్రబాబు శ్రీసిటీ వేదికగా ఒప్పుకున్నారు. ఇందులో ఏజీపీ గ్యాస్ రూ.10,000 కోట్లతో పెట్టుబడులు పెట్టడానికి గత ప్రభుత్వ హయాంలోనే ఒప్పందం కుదుర్చుకుంది. అదే విధంగా డైకిన్ రూ.3,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఒప్పందం చేసుకోవడమే కాకుండా ఇప్పటికే రూ.500 కోట్లతో తొలి దశను పూర్తి చేసింది.వాస్తవం ఇదయితే చంద్రబాబు మాత్రం ఆ సంస్థ ఇప్పుడు రూ.1,000 కోట్లతో విస్తరణకు కొత్తగా ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారానికి దిగారు. రూ.1,213 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి కొత్తగా చేసుకున్న ఒప్పందాలు, అదే విధంగా రూ.900 కోట్లకు సంబంధించి చేపట్టిన శంకుస్థాపన ప్రాజెక్టుల్లో అత్యధికం వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో వచ్చి ఉత్పత్తిని ప్రారంభించి విస్తరణ కార్యక్రమాలు చేపట్టినవే. ఎన్జీసీ ట్రాన్స్మిషన్స్, టీఐఎల్ హెల్త్కేర్, డైకిన్, ఎక్స్లెంట్ ఫార్మా ఇవన్నీ గత ప్రభుత్వ హయాంలో వచ్చినవే.గత ప్రభుత్వ ఘనతలు బాబు ఖాతాలోకే.. 2020లో విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన జరగడంతో అప్పటి ప్రభుత్వం హుటాహుటిన స్పందించింది. జనావాసాల మధ్య ఉన్న కంపెనీని మూసివేయించి శ్రీసిటీలోని రెడ్జోన్ పరిధిలోకి తరలించింది. గత ప్రభుత్వం అన్ని అనుమతులు ఇవ్వడంతో ఎల్జీ పాలిమర్స్ వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసుకొని వాణిజ్యపరంగా ఉత్పత్తిని కూడా ప్రారంభించింది.అలాగే కోవిడ్ తర్వాత చైనా నుంచి దిగుమతులు తగ్గించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్ఐ) పథకం కింద శ్రీసిటీలో బ్లూస్టార్, డైకిన్, ఈప్యాక్, హావెల్స్, పానాసోనిక్ వంటి అనేక ఏసీ తయారీ కంపెనీలు ఏర్పాటయ్యాయి. అంతేకాకుండా అవి భారీ విస్తరణ కార్యక్రమాలను కూడా గతంలోనే ప్రకటించాయి. అనేక ఏసీ తయారీ కంపెనీలు రావడంతో వీటికి అనుబంధంగా విడిభాగాలు తయారు చేసే సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు రూ.10 కోట్లు, రూ.20 కోట్లతో ఏర్పాటయ్యాయి. వాటిని కూడా చంద్రబాబు తన ఖాతాలోనే వేసుకోవడం పట్ల పరిశ్రమల వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.గతేడాది శ్రీసిటీలో రూ.9 వేల కోట్లు పెట్టుబడులు..శ్రీసిటీ యాజమాన్యం ఏటా శ్రీసిటీకి వచ్చే పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేస్తోంది. ఈ క్రమంలో 2023లో రూ.9 వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ప్రకటించింది. తద్వారా 21,500 ఉద్యోగాల కల్పన జరుగుతుందని పేర్కొంది. ఈ పెట్టుబడుల ద్వారా 18 కొత్త పరిశ్రమల స్థాపన, 7 పరిశ్రమల విస్తరణ జరిగినట్లు తెలిపింది. గతేడాది మార్చి 5న విశాఖ పెట్టుబడుల సదస్సులో బ్లూస్టార్ ఏసీ పరిశ్రమను సీఎం వైఎస్ జగన్ వర్చువల్గా ప్రారంభించారు. నేడు అదే బ్లూస్టార్ పరిశ్రమకు సీఎం చంద్రబాబు భూమిపూజ చేపట్టడం గమనార్హం. అలాగే గతేడాది నవంబర్ 23న డైకిన్ ఏసీ పరిశ్రమ ప్రతినిధులు ఆ సంస్థ ఉత్పత్తులను లాంఛనంగా ప్రారంభించారు. అదే పరిశ్రమకు సీఎం చంద్రబాబు తాజాగా ఎంవోయూ కుదుర్చుకున్నారు. అలాగే 2023లోనే ఉత్పత్తులు ప్రారంభమైన ఎక్స్లెంట్ ఫార్మా పరిశ్రమ విషయంలోనూ ఇలాగే చేశారు. గతేడాదే ఉత్పత్తులు ప్రారంభించిన ఎన్జీసీ, ఆర్ఎస్బీ ట్రాన్స్మిషన్ పరిశ్రమలకు సైతం చంద్రబాబు భూమిపూజ చేయడం పట్ల పరిశ్రమ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ఇదే కోవలో ఈప్యాక్ డ్యురబుల్స్, బెల్ ప్లేవర్స్ అండ్ ఫ్రాగ్నెసెస్, జేజీఎల్ మెటల్ కన్వర్టర్స్, ఈఎస్ఎస్కే కాంపొనెంట్స్, జెన్లెనిన్ ఇంటర్నేషనల్ పరిశ్రమలకు కూడా ప్రారంభోత్సవాలు చేపట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
రూ.1,000 కోట్ల ట్యాక్స్ స్కాం
సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పన్నుల శాఖకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఐజీఎస్టీ, సెస్ల చెల్లింపు వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగినట్లు బయటపడింది. వివిధ సంస్థలు దాదాపు రూ. 1,000 కోట్ల మేర ప్రభుత్వానికి పన్ను ఎగవేసినట్లు నిగ్గుతేలింది. ఆయా సంస్థల అక్రమాలకు కొందరు ప్రస్తుత, మాజీ ఉన్నతాధికారులే సహకరించినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది.అక్రమంగా లబ్ధి పొందిన సంస్థల్లో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ సైతం నిలవడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. దీనిపై వాణిజ్య పన్నుల శాఖ ఫిర్యాదుతో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఐఐటీ–హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ శోభన్ బాబు తదితరులను నిందితులుగా పేర్కొన్నారు. సోమేశ్ మౌఖిక ఆదేశాలతో.. వాణిజ్య పన్నుల శాఖ సాఫ్ట్వేర్ను ఐఐటీ హైదరాబాద్ నిర్వహిస్తోంది. స్రూ్కటినీ మాడ్యూల్లో పనిచేస్తూ వివిధ సంస్థలు దాఖలు చేసే ట్యాక్స్ రిటర్న్లలో లోపాలను గుర్తించి వాణిజ్య పన్నుల శాఖను అప్రమత్తం చేస్తోంది. ఈ సంస్థ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంశాన్నీ పర్యవేక్షించాలి. కానీ సోమేశ్ కుమార్ ఆదేశాల మేరకు ఐఐటీ–హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ శోభన్బాబు స్రూటినీ మాడ్యూల్లో మార్పుచేర్పులు చేశారు.ఈ కార్యకలాపాల కోసం సోమేశ్ కుమార్, శోభన్బాబులతోపాటు వాణిజ్య పన్నుల శాఖలో అదనపు కమిషనర్ ఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ ఎ.శివరాంప్రసాద్ తదితరులతో వాట్సాప్లో ‘స్పెషల్ ఇనీíÙయేటివ్స్’ పేరుతో వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేశారు. దీని ద్వారానే సోమేశ్ అటు వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు, ఇటు ఐఐటీ–హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్కు మౌఖికంగా ఆదేశాలు జారీ చేస్తూ పోయారు. ఆయన స్పెషల్ చీఫ్ సెక్రటరీగా (రెవెన్యూ) ఉన్నప్పుడు మొదలైన ఈ వ్యవహారం ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసినప్పుడూ కొనసాగింది.వాట్సాప్ గ్రూప్ ద్వారా శోభన్ బాబుకు ఆదేశాలు ఇచి్చన సోమేశ్ తాము చెప్పిన సంస్థలకు సంబంధించిన రిటర్న్లలో ఐజీఎస్టీ, సెస్లో ఉన్న లోపాలు బయటపడకుండా చేయాలని స్పష్టం చేశారు. స్రూ్కటినీ మాడ్యూల్లో మార్పులు చేసిన శోభన్బాబు కొన్ని సంస్థలు చేసిన స్కామ్లు బయటపడకుండా చేశారు. తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ సహా అనేక సంస్థలు రూ.1000 కోట్ల వరకు స్కామ్కు పాల్పడ్డా బయటపెట్టలేదు. ఎట్టకేలకు బట్టబయలు.. ఇటీవల బిగ్ లీప్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు సంబంధించి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంశంలో భారీ అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఆ సంస్థ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేరుతో రూ. 25.51 కోట్లు స్వాహా చేసినట్లు తేల్చారు. దీంతో వాణిజ్య పన్నుల శాఖ.. సెంటర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ–డాక్) సహకారం కోరింది. డేటాను ఫోరెన్సిక్ ఆడిట్ చేసిన సీ–డాక్... జరిగిన గోల్మాల్ను గుర్తించింది.దీని ఆధారంగా అధికారులు సైతం అంతర్గత విచారణ చేపట్టారు. ఐఐటీ–హైదరాబాద్ సహా వివిధ సంస్థల నుంచి వివరాలు కోరారు. సోమేశ్ కుమార్తోపాటు వాణిజ్య పన్నుల శాఖ అధికారుల అభ్యర్థన మేరకే తాము స్రూ్కటినీ మాడ్యూ ల్లో మార్పులు చేశామన్న ఐఐటీ–హైదరా బాద్.. ఆ మేరకు వివరాలను సమరి్పంచింది. బయటి సిబ్బందితోనే ఐఐటీ–హైదరాబాద్ పర్యవేక్షణ సీ–డాక్ నివేదిక ప్రకారం దాదాపు 75 సంస్థలకు సంబం«ధించిన రిటర్న్లు పూర్తిస్థాయిలో స్క్రూటినీ కాకుండా సాఫ్ట్వేర్లో మార్పుచేర్పులు జరిగినట్లు వెలుగులోకి వచి్చంది. వాణిజ్య పన్నుల శాఖ డేటాబేస్లో మార్పులు చేసేందుకు వాడిన ఐపీ అడ్రస్లలో ఒకటి ఏపీలోని హిందూపూర్ నుంచి పనిచేసిందని, ఈ డేటాను యాక్సెస్ చేసిన వ్యక్తులు.. వారి పాస్వర్డ్గా పిలాంటో అనే పేరును వినియోగించినట్లు కూడా సీ–డాక్ బయటపెట్టింది. వాణిజ్య పన్నుల శాఖ డేటాబేస్ను నిర్వహించే బాధ్యతలు చేపట్టిన ఐఐటీ–హైదరాబాద్ దీనికోసం కనీసం ఒక్క ఉద్యోగిని కూడా నియమించుకోలేదని బయటపడింది.సంగారెడ్డి జిల్లా కందిలో ఉన్న ఐఐటీ–హైదరాబాద్ చిరునామాతోనే రిజిస్టరై ఉన్న పిలాంటో టెక్నాలజీస్లో పనిచేసే వారినే ఈ పని కోసం వినియోగించుకుంది. సీ–డాక్ నివేదికతోపాటు అంతర్గత విచారణ నేపథ్యంలో కేవలం 11 సంస్థలు చేసిన స్కామ్ విలువే రూ. 400 కోట్ల వరకు ఉన్నట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తేల్చారు. మొత్తమ్మీద దాదాపు 75 సంస్థలు రూ. 1,000 కో ట్ల గోల్మాల్కు పాల్పడినట్లు ఆధారాలు సేకరించారు. దీంతో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీని ఆధారంగా కేసు నమోదు చేసిన అధి కారులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో సోమేశ్ కుమార్తోపాటు వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ ఎ.శివరామ ప్రసాద్, ఐఐటీ–హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ శోభన్బాబు, పి లాంటో టెక్నాలజీస్ తదితరులను నిందితులుగా చేర్చారు. -
బోయింగ్ భారీ డీల్.. స్పిరిట్ ఏరోసిస్టమ్స్ కొనుగోలుకు సిద్ధం
స్పిరిట్ ఏరోసిస్టమ్స్ను.. బోయింగ్ సంస్థ సుమారు రూ.39 వేలకోట్లకు కొనుగోలు చేయనుంది. దీనికోసం సంస్థ నెల రోజులుగా చర్చలు జరుపుతోంది. ఈ చర్చలు ముగిసిన తరువాత.. రెండు కంపెనీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. దీంతో బోయింగ్ సంస్థ స్పిరిట్ ఏరోసిస్టమ్స్ కొనుగోలును ధ్రువీకరించింది.బోయింగ్ సంస్థ కొనుగోలు చేసిన ఈక్విటీ వాల్యూ 4.7 బిలియన్ డాలర్లు కాగా.. ఒక్కో షేరుకు 37.25 డాలర్లు. డీల్ మొత్తం విలువ సుమారు 8.3 బిలియన్ డాలర్లు అని తెలుస్తోంది. ఇందులో ఇందులో స్పిరిట్ చివరిగా నివేదించిన నికర రుణం కూడా ఉందని ఏరోస్పేస్ పేర్కొంది. షేర్ వాల్యూ అనేది డీల్ ముగిసే ముందు షేర్ ధర సగటుపై ఆధారపడి ఉంటుంది.కొనసాగుతున్న భద్రతా సంక్షోభాన్ని పరిష్కరించడానికి బోయింగ్ స్పిరిట్ ఏరోసిస్టమ్స్ను కొనుగోలు చేయడానికి సన్నద్దమైందని తెలుస్తోంది. కాన్సాస్లోని విచితాలో ఉన్న స్పిరిట్, బోయింగ్ విమానాలకు సంబంధించిన కీలక భాగాలను తయారు చేస్తుంది. రెండు కంపెనీల మధ్య జరిగిన ఒప్పందం మా ఎయిర్లైన్ కస్టమర్లకు, స్పిరిట్, బోయింగ్ ఉద్యోగులకు, మా షేర్హోల్డర్లకు, దేశానికి ఉపయోగకరంగా ఉంటుందని బోయింగ్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ డేవ్ కాల్హౌన్ ఒక ప్రకటనలో తెలిపారు. -
ఎవరీ వడిలాల్ గాంధీ?.. రోడ్డుపక్కన ప్రారంభమై వేల కోట్ల సామ్రాజ్యాన్ని..
ఇప్పుడు ప్రముఖ బ్రాండ్లుగా ప్రసిద్ధి చెందిన సంస్థలన్నీ ఒకప్పుడు చిన్న కంపెనీలుగా ప్రారంభమైనవే. ఈ కోవకు చెందిన వాటిలో ఒకటి 'వడిలాల్ ఐస్క్రీమ్' కంపెనీ. ఈ కంపెనీ ఫౌండర్ 'వడిలాల్ గాంధీ'. ఇంతకీ ఈయన కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ప్రస్తుతం ఈ కంపెనీ విలువ ఎంత? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.మధ్యతరగతి కుటుంబానికి చెందిన 'వడిలాల్ గాంధీ' 1907లో అహ్మదాబాద్లోని ఒక చిన్న ఫౌంటెన్ సోడా దుకాణం ప్రారంభించారు. ఆ తరువాత సోడా విక్రయించడం ప్రారంభించారు. క్రమక్రమంగా.. గుజరాత్లో ఈయన దుకాణానికి ఆదరణ పెరిగింది. ఆ తరువాత సోడాతో పాటు ఐస్క్రీమ్ విక్రయించడం ప్రారంభించారు.వడిలాల్ గాంధీ ప్రారంభించిన ఐస్క్రీమ్ షాప్ బాగా అభివృద్ధి చెందింది. 1926లో ఈయన దేశంలోనే మొట్టమొదటి ఐస్క్రీమ్ అవుట్లెట్ స్థాపించారు. ఐస్క్రీమ్ వ్యాపారాన్ని విస్తరించడానికి అప్పట్లో జర్మనీ నుంచి యంత్రాలను దిగుమతి చేసుకున్నారు. ఆ తరువాత వడిలాల్ గాంధీ కుమారుడు రాంచోడ్ లాల్ గాంధీ వ్యాపార బాధ్యతలు చేపట్టారు.1970 నాటికి అహ్మదాబాద్లో మొత్తం 10 వడిలాల్ అవుట్లెట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని అప్పట్లో రాంచోడ్ లాల్ కుమారులు రామచంద్ర, లక్ష్మణ్ గాంధీలు నిర్వహించారు. నేడు ఈ కంపెనీ భారతదేశంలోని అతిపెద్ద ఐస్క్రీమ్ బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. గతంలో ఈ కంపెనీ వండిన కూరలు, రొట్టెలు మొదలైన ప్రాసెస్ చేసిన ఆహారాన్ని విక్రయించింది.ప్రస్తుతం వడిలాల్ కుటుంబానికి చెందిన ఐదవ తరం వ్యక్తి 'కల్పిత్ గాంధీ' కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ కంపెనీ కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా అమెరికాలో కూడా ఐస్క్రీమ్ విక్రయిస్తూ ప్రజాదరణ పొందుతోంది.1907లో ఓ వీధి దుకాణంగా ప్రారంభమైన వడిలాల్ కంపెనీ నేడు ప్రముఖ ఐస్క్రీమ్ బ్రాండ్ అయిపోయింది. ప్రస్తుతం వడిలాల్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ. 30,00,00,00,000. దీన్నిబట్టి చూస్తే.. వీధి పక్కన ఓ చిన్న షాపుగా ప్రారంభమై నేడు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ.. వ్యాపార రంగంలో దూసుకెళ్తోంది. -
విత్తన కంపెనీల టార్గెట్పై విజిలెన్స్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలోని విత్తన కంపెనీలు విత్తనాలను సరఫరా చేయాల్సిందేనని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. విత్తన కంపెనీలకు నిర్దేశించిన లక్ష్యాల సాధనను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. శనివారం మంత్రి చాంబర్లో వ్యవసాయ, సహకార శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ విత్తన ప్యాకెట్లు కంపెనీ నుంచి రైతులకు చేరే వరకు నిఘా వ్యవస్థ కట్టుదిట్టంగా పనిచేయాలని సూచించారు.పచ్చిరొట్ట విత్తనాల పంపిణీపై వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హరిత వివరిస్తూ రూ.61.15 కోట్లు విలువగల 1,09,937 క్వింటాళ్ళ విత్తనాలను రైతులకు అందచేశామని వివరించారు. గతేడాది జూన్15 నాటికి 64,34,215 పత్తి ప్యాకెట్లు రైతులకు అందుబాటులో ఉంచగా, ఈసారి 1,02,45,888 ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని, రైతులు ఇప్పటికే 62 లక్షల ప్యాకెట్లు కొనుగోలు చేశారని తెలిపారు. రాష్ట్రంలో 7,97,194 మెట్రిక్ టన్నుల యూరియా, 75,278 మెట్రిక్ టన్నుల డీఏపీ, 4,27,057 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 26,396 మెట్రిక్ టన్నుల మ్యూరెట్ ఆఫ్ పొటాష్ ఎరువులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు వివరించారు. పంటల నమోదు పారదర్శకంగా ఉండాలి రాష్ట్రంలో పంటల నమోదు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని, ఎలాంటి లోపాలకు తావులేకుండా సజావుగా జరపాలని మంత్రి తుమ్మల సంబంధింత అధికారులను ఆదేశించారు. నిర్దేశిత లక్ష్యాల మేర ఫలితాలు చూపని ఆయిల్ పామ్ కంపెనీలకు నోటీసులు ఇవ్వాలని ఉద్యానవన శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. డ్రిప్, స్ప్రింక్లర్స్ సౌకర్యం కేవలం ఆయిల్ పామ్ పంటలకే కాకుండా ఇతర పంటలకూ వర్తింపజేయాలని సూచించారు. -
అనిల్ అంబానీ కంపెనీలు.. వ్యాపార సామ్రాజ్యం ఇదే..
అంబానీ సోదరులు అనగానే అందరికీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీయే గుర్తొస్తారు. ఒకప్పుడు అత్యంత ధనవంతుల్లొ ఒకడైన అనిల్ అంబానీ (Anil Ambani ) గురించి, ఆయనకున్న కంపెనీలు, వ్యాపార సామ్రాజ్యం గురించి తక్కువ మందికి తెలిసి ఉంటుంది.ఎప్పుడూ నష్టాలతో వార్తల్లో నిలిచే అనిల్ అంబానీ ఇటీవల రిలయన్స్ పవర్తో బలమైన పునరాగమనం చేశారు. షేర్ మార్కెట్లో కంపెనీ మెరుగైన పనితీరు కొనసాగుతుండటంతో స్టాండలోన్ ప్రాతిపదికన రుణ రహితంగా మారింది. రిలయన్స్ పవర్ సుమారు రూ .800 కోట్ల రుణాన్ని తీర్చేసింది.అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ టెలికమ్యూనికేషన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంటర్టైన్మెంట్, పవర్ జనరేషన్ వంటి రంగాల్లో వైవిధ్యమైన వ్యాపారాలను కలిగి ఉంది. 2006లో రిలయన్స్ గ్రూప్ విడిపోయిన తర్వాత ఈ గ్రూప్ ఏర్పాటైంది. 2002 జూలై 6న ధీరూభాయ్ అంబానీ మరణించిన తరువాత, అప్పటి 15 బిలియన్ డాలర్ల సమ్మేళనం ఇద్దరు సోదరులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ మధ్య విడిపోయింది.అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ లిస్టెడ్ స్టాక్స్ ఇవే..» రిలయన్స్ కమ్యూనికేషన్స్: మార్కెట్ క్యాప్ రూ.335 కోట్లు. షేరు 52 వారాల కదలిక రూ.2.49 గరిష్టాన్ని, రూ.1.01 కనిష్టాన్ని సూచిస్తుంది. షేరు ప్రస్తుత ధర రూ.1.93.» రిలయన్స్ హోమ్ ఫైనాన్స్: మార్కెట్ క్యాప్ రూ.132 కోట్లు. ప్రస్తుతం ఈ షేరు ధర రూ.4.05గా ఉంది. 52 వారాల కదలిక రూ .5.80 గరిష్టాన్ని, రూ .1.70 కనిష్టాన్ని సూచిస్తుంది.» రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్: మార్కెట్ క్యాప్ రూ.4,876 కోట్లుగా ఉంది. రిలయన్స్ ఇన్ఫ్రా షేరు ప్రస్తుత ధర రూ.202.99. షేరు 52 వారాల కదలికలు రూ.308 గరిష్టాన్ని, రూ.134 కనిష్టాన్ని సూచిస్తున్నాయి.» రిలయన్స్ నేవల్ అండ్ ఇంజినీరింగ్: మార్కెట్ క్యాప్ రూ.155 కోట్లు. కంపెనీ నౌకా నిర్మాణంలో నిమగ్నమైంది. ప్రస్తుతం ఈ షేరు ధర రూ.2.3గా ఉంది.» రిలయన్స్ పవర్: మార్కెట్ క్యాప్ రూ.4,520 కోట్లు. రిలయన్స్ పవర్ ప్రస్తుత ధర రూ.31.08గా ఉంది. షేరు 52 వారాల కదలికలు రూ.34.45 గరిష్టాన్ని, రూ.13.80 కనిష్టాన్ని సూచిస్తున్నాయి.ఇదీ చదవండి: ‘పవర్’ చూపించిన అనిల్ అంబానీ.. తొలగిన చీకట్లు! -
వరల్డ్ టాప్ 100 బ్రాండ్లలో ఇండియన్ కంపెనీలు
ప్రపంచంలోని అత్యంత విలువైన 100 బ్రాండ్లలో ఇండియా నుంచి నాలుగు కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. దీనికి సంబంధించిన డేటాను బ్రాండ్జెడ్ మోస్ట్ వాల్యూబుల్ గ్లోబల్ బ్రాండ్స్ రిపోర్ట్లో ప్రముఖ మార్కెటింగ్ డేటా అండ్ అనలిటిక్స్ బిజినెస్ కాంటార్ వెల్లడించింది.ప్రపంచంలోని అత్యంత విలువైన 100 కంపెనీల జాబితాలో టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) 46వ ర్యాంక్ పొందగా.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 47 ర్యాంక్ పొందింది. టెలికాం కంపెనీ ఎయిర్టెల్ కూడా ఈ జాబితాలో 73 ర్యాంక్ సొంతం చేసుకుంది. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ 74 ర్యాంక్ కైవసం చేసుకుంది.ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీల జాబితాలో ఇన్ఫోసిస్ సంస్థ స్థానం పొందటం ఇది వరుసగా మూడోసారి. బిజినెస్-టు-బిజినెస్ టెక్నాలజీ బ్రాండ్గా ఇన్ఫోసిస్ 20వ ర్యాంక్ పొందింది.ఇండియాలో మాత్రమే కాకుండా అమెరికాలో కూడా అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్లలో ఇన్ఫోసిస్ టాప్ 6 శాతంలో ఉందని కాంటార్ బ్రాండ్జెడ్ డేటా వెల్లడించింది. రెండు మార్కెట్లలో ఇన్ఫోసిస్ విశ్వసనీయ భాగస్వామిగా దాని స్థానాన్ని సుస్థిరం చేయడం ద్వారా దాని వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉందని కాంటార్ బ్రాండ్జెడ్ అధిపతి మార్టిన్ గెరియేరియా అన్నారు.Infosys featured as a Top 100 global brand by Kantar! Thank you to every Infoscion, for making this happen for the 3rd consecutive year! https://t.co/MSaxBOIy1x#NavigateYourNext #KantarBrandzTop100 #InfyNews pic.twitter.com/zGe99AWfeI— Infosys (@Infosys) June 12, 2024 -
ప్రపంచంలో 7000 ‘జాంబీ కంపెనీలు’.. ఏంటివి?
అప్పుల ఊబిలో కూరుకుపోయి మనుగడ అంచున కొట్టుమిట్టాడుతూ రుణాలపై వడ్డీని కూడా చెల్లించలేని స్థితిలో ఉన్న కంపెనీలను జాంబీ కంపెనీలుగా వ్యవహరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి జాంబీ కంపెనీల సంఖ్య గత పదేళ్లలో గణనీయంగా పెరిగింది.అసోసియేటెడ్ ప్రెస్ విశ్లేషణలో జాంబీ కంపెనీల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7,000 పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీలకు పెరిగింది. ఒక్క యునైటెడ్ స్టేట్స్లోనే ఇలాంటి కంపెనీలు 2,000 లకు చేరాయి. ఏళ్ల తరబడి చౌక రుణాలు పేరుకుపోవడం, మొండి ద్రవ్యోల్బణం రుణ వ్యయాలను దశాబ్ద గరిష్టాలకు నెట్టింది.వీటిలో అనేక చిన్న, మధ్య తరహా కంపెనీలు త్వరలోనే తమ లెక్కల రోజును ఎదుర్కోవలసి రావచ్చు. వందల బిలియన్ డాలర్ల రుణాలను వారు తిరిగి చెల్లించలేకపోవచ్చు. గత మూడేళ్లలో కార్యకలాపాల ద్వారా తమ రుణాలపై వడ్డీని కూడా చెల్లించడానికి తగినంత డబ్బు సంపాదించడంలో విఫలమైన కంపెనీలను సాధారణంగా జాంబీలుగా నిర్వచిస్తారు.కార్నివాల్ క్రూయిజ్ లైన్, జెట్ బ్లూ ఎయిర్ వేస్, వేఫేర్, పెలోటన్, ఇటలీకి చెందిన టెలికాం ఇటాలియా, బ్రిటిష్ సాకర్ దిగ్గజం మాంచెస్టర్ యునైటెడ్ లను నడుపుతున్న కంపెనీలతో సహా ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్డమ్, యూఎస్లలో గత దశాబ్దంలో ఇలాంటి కంపెనీల సంఖ్య 30 శాతం పెరిగిందని అసోసియేటెడ్ ప్రెస్ విశ్లేషణలో తేలింది.మార్చిలో ఫెడరల్ రిజర్వ్ కోత ప్రారంభిస్తుందనే అంచనాతో రుణదాతలు తమ వాలెట్లను తెరవడంతో ఈ ఏడాది మొదటి కొన్ని నెలల్లో వందలాది జాంబీ కంపెనీలు తమ రుణాలను రీఫైనాన్స్ చేసుకున్నాయి. దీంతో గత ఆరు నెలల్లో 1,000 కి పైగా జాంబీ కంపెనీల స్టాక్స్ 20 శాతానికి పైగా పెరగడానికి సహాయపడింది. కానీ చాలా కంపెనీలు రీఫైనాన్స్ పొందలేకపోయాయి. ఇప్పుడు ఈ సంవత్సరం మొదటి, ఏకైక ఫెడ్ కోతను ఆశిస్తున్న నేపథ్యంలో జాంబీ కంపెనీలు 1.1 ట్రిలియన్ డాలర్ల రుణాలను చెల్లించాల్సి ఉంది. -
ఇన్ఫోసిస్పై కంప్లైంట్.. ఆఫర్ లెటర్ ఇచ్చి రెండేళ్లయినా..
ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మీద ఐటీ యూనియన్ ''నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్'' (NITES) కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. దాదాపు 2,000 మంది క్యాంపస్ రిక్రూట్లకు సంబంధించిన ఆన్బోర్డింగ్ ప్రక్రియను కంపెనీ పదేపదే ఆలస్యం చేస్తోందని ఆరోపించింది.ఆన్బోర్డింగ్ ప్రక్రియలో రెండేళ్లకు పైగా జాప్యం జరుగుతోంది. దీనివల్ల బాధిత ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. దీనిపై విచారణ జరిపించాలని యూనియన్ మంత్రిత్వ శాఖను కోరింది. దీనిపైన ఇన్ఫోసిస్ ఇంకా స్పందించలేదు.చాలా మంది ఇన్ఫోసిస్ ఆఫర్ లెటర్లపై నమ్మకంతో ఇతర జాబ్ ఆఫర్లను తిరస్కరించారు. దీనివల్ల ఆదాయం లేకపోవడం మాత్రమే కాకుండా.. ఉద్యోగంలో ఎప్పుడు జాయిన్ చేసుకుంటారనే విషయం మీద స్పష్టత లేకుండా ఉన్నారు. చాలామంది తమ కెరీర్ సాఫీగా ముందుకు సాగటానికి ఇన్ఫోసిస్ను ఎంచుకుంటున్నారు. అయితే ఇన్ఫోసిస్ ఆలస్యం వల్ల ఉద్యోగమే ప్రశ్నార్థకంగా మారిందని నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ అధ్యక్షుడు హర్ప్రీత్ సింగ్ తెలిపారు.ఇన్ఫోసిస్ ఆన్బోర్డింగ్ ఆలస్యానికి.. కంపెనీ రిక్రూట్లకు జీతం చెల్లించాలని యూనియన్ కోరింది. ఆలస్యం కారణంగా ఏర్పడిన మానసిక, భావోద్వేగ ఒత్తిడిని పరిష్కరించడానికి ఇన్ఫోసిస్ బాధితులకు సహాయం అందించాలని ఐటీ యూనియన్ కోరింది.ఐటీ సంస్థల ఆన్బోర్డింగ్ ఆలస్యం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా టీసీఎస్ 200 రిక్రూట్ల ఆన్బోర్డింగ్ను ఆలస్యం చేసింది. ఈ కారణంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కు మహారాష్ట్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నోటీసు జారీ చేసింది. ఇప్పుడు అదే సమస్య మళ్ళీ వెలుగులోకి వచ్చింది. దీనిపైన ఇన్ఫోసిస్ స్పందించాల్సి ఉంది. -
ఫ్రెషర్లకు పిడుగులాంటి వార్త!.. కొత్త ఉద్యోగాల్లో..
2024-25లో రిక్రూట్మెంట్ కార్యకలాపాలలో కొత్త పొజిషన్లను దాఖలు చేయడంపై దృష్టి పెట్టాలని సర్వేలు చెబుతున్నాయి. కొత్త ఉగ్యగాల భర్తీ కోసం అనుభవం, ప్రతిభ ఉన్న వారికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని స్టాఫింగ్ సొల్యూషన్స్ అండ్ హెచ్ఆర్ సర్వీసెస్ ప్రొవైడర్ జీనియస్ కన్సల్టెంట్స్ హైరింగ్, కాంపెన్సేషన్ & అట్రిషన్ మేనేజ్మెంట్ రిపోర్ట్ వెల్లడించింది.పరిశ్రమల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్త పాత్రలను సృష్టించడం ద్వారా వృద్ధి, ఆవిష్కరణలను అభివృద్ధి చేయడం ప్రాథమిక లక్ష్యం.. అని జీనియస్ కన్సల్టెంట్స్ సీఎండీ ఆర్పీ యాదవ్ పేర్కొన్నారు. నియామకాలలో 4 నుంచి 8 సంవత్సరాలు అనుభవం ఉన్నవారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. 32 శాతం అనుభవం ఉన్నవారికే కొత్త ఉద్యోగాల్లో అవకాశాలు ఉంటాయి.1 నుంచి 4 సంవత్సరాలు అనుభవం ఉన్న వారిని 26 శాతం, ఫ్రెషర్లను కేవలం 15 శాతం మాత్రమే రిక్రూట్ చేసుకునే అవకాశం ఉందని సమాచారం. తాత్కాలిక నియమాలు 27 శాతం, 25 శాతంతో ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్టు నియామకం, 24 శాతం గిగ్ స్టాఫ్ నియామకాలు ఉంటాయని తెలుస్తోంది. -
అమెరికాలో సూర్య గ్రహణం సందడి
ఉత్తర అమెరికా ఆకాశంలో సోమవారం (ఏప్రిల్ 8) నాడు కనిపించే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూసేందుకు అక్కడి జనం విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. మెక్సికోలోని పసిఫిక్ తీరంలో ఈ సూర్యగ్రహణం కనిపించనుంది. ఇది కెనడా నుండి నిష్క్రమించే ముందు టెక్సాస్తో పాటు 14 ఇతర అమెరికా రాష్ట్రాలను దాటనుంది. ఇది 2017లో సంభవించిన సంపూర్ణ సూర్యగ్రహణం కంటే ఇది దాదాపు రెండు రెట్లు ఎక్కువ కాలం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికాలోని పలు మార్కెట్లతో పాటు టూరిజం విభాగం గ్రహణ వీక్షకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. సౌత్వెస్ట్, డెల్టా వంటి విమానయాన సంస్థలు సూర్యగ్రహణాన్ని వీక్షించడానికి విమాన మార్గాలను ప్రకటించాయి. అలాగే పలు మార్కెట్లలో పెద్ద సంఖ్యలో ప్రత్యేక ఎక్లిప్స్ సేఫ్టీ గ్లాసెస్ అమ్మకానికి అందుబాటులో ఉంచారు. అలాగే వివిధ రంగురంగుల టీ షర్టులు, ఖగోళ సావనీర్లు విక్రయిస్తున్నారు. 2017లో అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు పలు కంపెనీలు దానిని ఆదాయమార్గంగా మార్చుకున్నాయి. వాటిలో క్రిస్పీ క్రీమ్ కూడా ఉంది. షార్లెట్, నార్త్ కరోలినాకు చెందిన ఈ సంస్థ 2017 సూర్య గ్రహణం సందర్భంగా పరిమిత-ఎడిషన్ చాక్లెట్ గ్లేజ్డ్ డోనట్లను విడుదల చేసింది. -
ఆఫీస్లో నోటీసులు.. షాక్లో ఉద్యోగులు
ప్రపంచ వ్యాప్తంగా పలు కంపెనీలు ఆర్ధిక మాంద్యం దెబ్బకు పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. ఖర్చుల్ని తగ్గించుకునేందుకు వీలైనన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓ వైపు ఉద్యోగుల్ని తొలగిస్తూనే.. ఆఫీస్లో పనిచేసే ఉద్యోగుల టైం విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. అలా ఓ ఆఫీస్ మేనేజ్మెంట్ ‘టైమ్ క్లాక్ ఫ్రాడ్’ పేరుతో ఓ మెమోను జారీ చేసింది. ఇప్పుడు ఆ మెమో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఓ రెడ్డిట్ యూజర్ హెచ్ఆర్ విభాగం జారీ చేసిన మెమోని షేర్ చేశారు. ఆ మెమోలో ఇలా ఉంది. టైమ్ క్లాక్ మోసాన్ని అరికట్టేందుకు ఉద్యోగులు ఐదు నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఈ నియమాలలో భాగంగా ఆఫీస్ వర్క్ ప్రారంభించే ముందు ఉద్యోగులు వ్యక్తిగత కార్యకలాపాలు, బ్యాగ్, ఇతర వస్తువులను సర్ధడం లాంటి పనులు చేసుకోవాలి. ప్రతి ఉద్యోగి తప్పని సరిగా మెమోలోని అంశాలను పాటించాలని, లేదంటే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరిస్తున్నట్లు మెమోలో హైలెట్ చేసింది. దీంతో పాటు 10 మంది ఉద్యోగులు రోజుకు 10నిమిషాలు వృధా చేస్తే... అంటే రోజుకు వంద గంటలు నెలకు మూడు వేలగంటలు.. అలా 50 గంటల పేరోల్ లాస్ అవుతుందని తెలిపింది. దీంతో మెమోలో పేర్కొన్న నిబంధనలపై నెటిజన్లు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంటే మరికొంతమంది తమ అఫీస్లో ఎదురవుతున్న అనుభవాల్ని గుర్తు చేసుకుంటూ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. -
ఖజానాకు అంచనాలను మించి డివిడెండ్లు
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల (సీపీఎస్ఈ) నుంచి ఖజానాకు బడ్జెట్ అంచనాలను మించిన స్థాయిలో డివిడెండ్లు అందాయి. 2023–24లో కోల్ ఇండియా, ఓఎన్జీసీ, పవర్గ్రిడ్, గెయిల్ వంటి దిగ్గజాలు ఏకంగా రూ. 63,000 కోట్లు చెల్లించాయి. సవరించిన బడ్జెట్ అంచనాలకన్నా ఇది 26 శాతం అధికం. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం 2023–24లో సీపీఎస్ఈల నుంచి రూ. 50,000 కోట్ల డివిడెండ్లు రావొచ్చని అంచనాలను సవరించారు. అయితే, పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం దీపమ్ వెబ్సైటు ప్రకారం కేంద్రానికి మొత్తం రూ. 62,929.27 కోట్లు వచ్చాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో (2022–23)లో డివిడెండ్ వసూళ్లు రూ. 59,952.84 కోట్లకు పరిమితమయ్యాయి. మార్చి నెలలో ఓఎన్జీసీ రూ. 2,964 కోట్లు, కోల్ ఇండియా రూ. 2,043 కోట్లు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూ. 2,149 కోట్లు, ఎన్ఎండీసీ రూ. 1,024 కోట్లు, హెచ్ఏఎల్ రూ. 1,054 కోట్లు, గెయిల్ రూ. 1,863 కోట్లు చెల్లించాయి. సీపీఎస్ఈలు అధిక మొత్తంలో డివిడెండ్ల చెల్లించడమనేది వాటి పటిష్టమైన పనితీరును ప్రతిబింబిస్తుంది. ఇది రిటైల్, సంస్థాగత వాటాదారులకు లబ్ధి చేకూర్చడంతో పాటు ఆయా సంస్థల షేర్లపై ఆసక్తిని పెంచేందుకు కూడా ఉపయోగపడగలదు. -
AP: ఎలక్ట్రానిక్స్ రంగంలో 36,205 మందికి ఉద్యోగాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత ఐదేళ్లలో ఓవైపు భారీ ఎత్తున పెట్టుబడులు, మరోవైపు యువతకు ఉద్యోగాల వెల్లువ కొనసాగింది. ముఖ్యంగా రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ రంగం రికార్డు స్థాయి పెట్టుబడులను ఆకర్షించింది. 2019 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో రూ.10,705 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చాయి. అంతేకాకుండా మరో రూ.15,711 కోట్ల విలువైన కొత్త పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. ఈ ఐదేళ్ల కాలంలో ఎలక్ట్రానిక్స్ రంగంలో బ్లూస్టార్, డైకిన్, పానాసోనిక్, డిక్సన్, హావెల్స్, సన్సీఆప్టెక్స్ వంటి అనేక దిగ్గజ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రారంభించడంతోపాటు భారీ ఎత్తున విస్తరణ కార్యక్రమాలను చేపట్టాయి. అంతేకాకుండా పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాయి. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక 2019 మే నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 24 కంపెనీల ద్వారా రూ.10,705 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవం రూపంలోకి రావడంతో ఏకంగా 36,205 మందికి ఉపాధి లభించింది. మరో 55,140 మందికి ఉపాధి గతేడాది మార్చిలో విశాఖపట్నంలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 23 ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటి ద్వారా మరో రూ.15,711 కోట్ల పెట్టుబడులతోపాటు 55,140 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా ఎయిర్ కండీషనర్లు, సెల్ఫోన్ కెమెరాలు, సీసీ కెమెరాలు, మొబైల్ ఫోన్ల తయారీ రంగంలో అనేక దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. కోవిడ్ తర్వాత ఎలక్ట్రానిక్స్ రంగంలో చైనా దిగుమతులను తగ్గించుకోవాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం (పీఎల్ఐ) స్కీమ్ను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అందిపుచ్చుకుంది. ఈ పథకం కింద పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన అనేక కంపెనీలను స్వాగతించింది. అంతేకాకుండా వీటికి వేగంగా అనుమతులు మంజూరు చేయడంతో కంపెనీలు ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి. శ్రీసిటీలో భారీగా తయారీ యూనిట్లు కాగా దేశంలో అమ్ముడయ్యే ప్రతి రెండు ఎయిర్ కండీషనర్లలో ఒకటి మనం రాష్ట్రంలోనే తయారవుతుండటం విశేషం. తిరుపతి జిల్లా శ్రీసిటీలో జపాన్ ఏసీ తయారీ సంస్థ డైకిన్, బ్లూస్టార్, హావెల్స్, పానాసోనిక్, యాంబర్, ఈపాక్ వంటి సంస్థలు భారీ తయారీ యూనిట్లను ఏర్పాటు చేశాయి. ఇందులో ఒక్క డైకినే తొలి దశలో ఏటా 10 లక్షల యూనిట్లను తయారుచేస్తోంది. అంతేకాకుండా రెండో దశలో మరో 15 లక్షలు తయారుచేసేలా విస్తరణ చేపట్టనుంది. ఇందుకోసం రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులను ఈ జపాన్ సంస్థ పెట్టింది. అలాగే, బ్లూస్టార్ ఏటా 12 లక్షల యూనిట్లను తయారుచేసే విధంగా యూనిట్ను ఏర్పాటు చేస్తోంది. కొప్పర్తి ఈఎంసీతో మరో 28,250 మందికి ఉపాధి ప్రస్తుతం ఏటా దేశవ్యాప్తంగా 75 లక్షల గృహ వినియోగ ఏసీలు అమ్ముడవుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఈ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం 50 లక్షలకుపైనే ఉంటుందని అంచనా. ఒక్క ఏసీ తయారీ రంగంలోనే రాష్ట్రం రూ.3,755 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా 10,000 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇవి కాకుండా రూ.749 కోట్లతో కొప్పర్తిలో వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)ను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రూ.8,910 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా 28,250 మందికి ఉపాధి లభించనుంది. ఇప్పటికే డిక్సన్ వంటి కంపెనీలు కొప్పర్తిలో ఉత్పత్తిని ప్రారంభించడం విశేషం. -
జాబ్ మార్కెట్లో ఇప్పుడిదే ట్రెండ్.. ఉద్యోగుల్ని మోసం చేస్తున్న కంపెనీలు
ప్రపంచ వ్యాప్తంగా ఓ వైపు కొనసాగుతున్న ఉద్యోగుల తొలగింపు. మరోవైపు పెరిగిపోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వినియోగం. ఫలితంగా జాబ్ మార్కెట్ కఠిన పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఈ తరుణంలో అదే జాబ్ మార్కెట్లో ‘గోస్ట్ జాబ్స్’ ట్రెండ్ మొదలైనట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ఫారమ్ థ్రెడ్ యూజర్, హెచ్ఆర్ విభాగంలో పనిచేసే మౌరీన్ క్లాఫ్ అనే మహిళా ఉద్యోగి జాబ్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్ గురించి షేర్ చేశారు. ఇంతకీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న గోస్ట్ జాబ్స్ ఏంటో తెలుసా? గోస్ట్ జాబ్స్ ట్రెండ్ గోస్ట్ జాబ్స్ ట్రెండ్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే..ఓ టెక్ కంపెనీలో సంబంధిత విభాగాల్లో పనిచేసేందుకు ఉద్యోగులు కావాలి. ఇందుకోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాం. అప్లయ్ చేసుకోవచ్చంటూ సదరు కంపెనీ హైరింగ్ కేటగిరిలో సమాచారం ఇస్తుంది. పనిలో పనిగా అందులో ఓపెన్ అనే ఆప్షన్ ఉంచుతుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసి కంపెనీకి కావాల్సిన అర్హతులు ఉన్న అభ్యర్ధులు జాబ్స్ కోసం అప్లయ్ చేస్తుంటారు. అసలు కథ అక్కడే మొదలవుతుంది. రోజులు, నెలలు గడుస్తున్నా ఉద్యోగాలకు అప్లయ్ చేస్తున్నా ఇంటర్వ్యూ కాల్ రాదు. కానీ కంపెనీ వెబ్సైట్ హైరింగ్ కేటగిరిలో ఉద్యోగులు కావాలనే సంకేతం ఇస్తూ ఓపెన్ అనే ఆప్షన్ను అలాగే ఉంచుతుంది. ఇదిగో ఇప్పుడు ఇదే ట్రెండ్ను ఫాలో అవుతున్నాయి ఆయా కంపెనీలు. దీన్ని గోస్ట్ జాబ్స్ అని పిలుస్తున్నారు. ఘోస్ట్ జాబ్ అంటే ఏమిటి? ఘోస్ట్ జాబ్స్ అంటే తమ సంస్థలో ఖాళీలు ఉన్నాయి. జాబ్స్ కోసం అప్లయ్ చేసుకోవచ్చంటూ ప్రకటనలు ఇస్తాయి. కానీ ఉద్యోగుల్ని నియమించుకోవు. దీనికి కారణం కంపెనీని బట్టి ఉంటుంది. అయితే ఎక్కువ శాతం కంపెనీలు ఉద్యోగుల్ని నియమించుకునేందుకు తమ వద్ద నిధులు లేకపోవడం, టాలెంట్ ఉన్న అభ్యర్ధుల్ని గుర్తించేందుకు ఇలా చేస్తాయి. లేదంటే ఈ ఓపెన్ జాబ్లు త్వరలో ఖాళీ అవుతున్న ఉద్యోగాలకు ముందుగానే కొత్త వారిని ఎంపిక చేసుకునేందుకు ఇలా చేసేందుకు అవకాశం ఉందంటూ పలు నివేదికలు చెబుతున్నాయి. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ఏం చెబుతోంది హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అధ్యయనం ప్రకారం.. కరోనా కష్టాలంలో చేస్తున్న ఉద్యోగులకు రాజీనామాలు చేసే సంఖ్య పెరగడం, ఆర్ధిక అనిశ్చితి కారణంగా ఘోస్ట్ జాబ్స్ ఉద్యోగాల సంఖ్య పెరిగినట్లు అంచనా. అంతేకాదు భవిష్యత్పై స్పష్టత లేని కంపెనీలు ఇలా ఘోస్ట్ జాబ్స్లో ఉద్యోగుల్ని నియమించుకోవడం ఓ కారణమని అధ్యయనం తెలిపింది. ఉద్యోగం నిజమా? కాదా? అని తేల్చేదెలా? ఓ కంపెనీ ఉద్యోగాలకు ప్రకటన ఇచ్చినప్పుడు అవి నిజమా? కాదా? అని తెలుసుకునేందుకు పలు అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఘోస్ట్ జాబ్స్లో ఉద్యోగులు చేయాల్సి విధులు, ఇతర జీతభత్యాల గురించి అస్పష్టంగా ఉంటుంది. ఒక అభ్యర్థి ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో వారాలు లేదా నెలల తరబడి ఎలాంటి స్పందన ఉండదు. దీన్ని ఘోస్ట్ జాబ్స్ అని అర్ధం చేసుకోవాలి. లేదంటే తమ కంపెనీలో ఉద్యోగం ఉందని, అదే జాబ్స్ రోల్ ఎక్కువ కాలం ఉంచితే దాన్ని ఘోస్ట్ జాబ్గా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. -
అధిక రేటింగ్ కంపెనీ బోర్డుల్లో మహిళలు
న్యూఢిల్లీ: అధిక రేటింగ్ కలిగిన కంపెనీలు.. బోర్డు సభ్యులుగా మహిళలను ఎంపిక చేసుకుంటున్నట్లు రేటింగ్ దిగ్గజం మూడీస్ ఇన్వెస్టర్ సరీ్వస్ తాజాగా పేర్కొంది. తక్కువస్థాయి రేటింగ్ కలిగిన కంపెనీలతో పోలిస్తే వీటిలో బోర్డు సభ్యులుగా స్త్రీలకు అధికంగా చోటు కలి్పస్తున్నట్లు తెలియజేసింది. సంస్థ రేటింగ్ ఇచి్చన 3,138 కంపెనీలను విశ్లేషించినట్లు వెల్లడించింది. విశ్లేషణ ప్రకారం ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్(బీఏఏ, అంతకంటే అధిక రేటింగ్) కలిగిన కంపెనీల బోర్డు సీట్లలో సగటున 29 శాతం మంది మహిళలకు చోటు లభించింది. 2023తో పోలిస్తే 1 శాతం పెరిగినట్లు వెల్లడించింది. ఇక స్పెక్యులేటివ్ గ్రేడ్(బీఏ, అంతకంటే తక్కువ రేటింగ్) కంపెనీలలో సగటున 24 % బోర్డు సీట్లను మహిళలు పొందారు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య యథాతథమే. అభివృద్ధిచెందిన ఆర్థిక వ్యవస్థల్లో బోర్డు సభ్యుల లింగభేదం, క్రెడిట్ రేటింగ్స్ మధ్య పరస్పర సంబంధమున్నప్పటికీ వర్ధమాన మార్కెట్లలో ఇది లేనట్లు మూడీస్ పేర్కొంది. విశ్లేషణకు పరిగణనలోకి తీసుకున్న కంపెనీలలో 24 ఏఏఏ, 146 ఏఏ, 728 ఏ, 1165 బీఏఏ, 582 బీఏ, 394 బీ, 90 సీఏఏ, 9 సీఏ రేటింగ్ కలిగినవి ఉన్నట్లు వెల్లడించింది. -
తుది దశకు చైనా రుణ యాప్లపై దర్యాప్తు
న్యూఢిల్లీ: నిబంధనల ఉల్లంఘనల ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు చైనా కంపెనీలపై, ముఖ్యంగా రుణ యాప్లతో లింకులున్న సంస్థలపై కార్పొరేట్ వ్యవహారాల శాఖ విచారణ జరుపుతోంది. వీటిలో కొన్ని కేసుల్లో దర్యాప్తు తుది దశలో ఉందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆయా కంపెనీల్లో మోసాలేమైనా జరిగాయా అనే కోణంపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. కొన్నింటిపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో) విచారణ జరుపుతున్నట్లు వివరించారు. అక్రమంగా రుణ యాప్లను నిర్వహిస్తున్న కంపెనీలపై, అసలైన లబ్ధిదారు వివరాలను దాచి పెట్టే వ్యక్తులు, సంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర ఎల్రక్టానిక్స్ .. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ, ఆర్బీఐ మొదలైన వాటి నుంచి వచ్చిన ఫిర్యాదులపై సదరు సంస్థలపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారి చెప్పారు. కొన్ని కంపెనీల నిధుల మూలాలను కనుగొనడం కష్టమే అయినప్పటికీ, నిర్థిష్టంగా లబ్ధి పొందే యాజమాన్య సంస్థను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. -
Indian Origin CEOs: టాప్ కంపెనీలు.. మనవాళ్లే సీఈవోలు (ఫొటోలు)
-
టైమ్కు వచ్చి కూర్చుంటే సరిపోదు!.. అదే ఇంపార్టెంట్
చాలామంది ఉద్యోగులు.. కంపెనీ రూల్స్ ప్రకారం ఆఫీసులకు వచ్చామా.. ఏదో పని చేసి వెళ్లిపోయామా అన్నట్టు ఉంటారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి, అలాంటి కాలక్షేపాలకు సంస్థలు చరమగీతం పాడుతున్నాయి. దీంతో కొత్త రూల్స్ పుట్టుకొచ్చాయి. ఆఫీసుకు సమయానికి వస్తే సరిపోదు, ఉన్నంత సేపు ఎంత క్వాలిటీ వర్క్ చేసావు అనేది ప్రధానమని 10 సంస్థల్లో 7 చెబుతున్నట్లు.. ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ 'అప్నా.కామ్' అధ్యయనంలో వెల్లడించింది. యాజమాన్యం మెప్పు కోసం, గుర్తింపు కోసం మాత్రం కాకుండా చేస్తున్న పనిలో ఎంత వరకు నాణ్యత ఉందనేది ఇక్కడ ప్రధానమని స్పష్టమవుతోంది. సమయానికి ఆఫీసులకు వచ్చి పనిచేయకపోతే ఎవరికీ లాభం ఉండదు. కాబట్టి సంస్థలో కొంత వెనుకబడిన వారిని గుర్తించి వారికి శిక్షణ ఇప్పంచడం లేదా వారి పనిలో నాణ్యతను పెంచడానికి కావలసిన సదుపాయాలను అందించడం వంటికి సంస్థలు చేపట్టాయి. ఉద్యోగి నుంచి ఏమి రాబట్టుకోవాలనేది సంస్థకు తెలిసి ఉండటం ప్రధానమని అప్నా.కామ్ సర్వే ద్వారా తెలుసుకున్నట్లు వెల్లడించింది. కంపెనీలు తమ ఉద్యోగులను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ.. పని చేసిన వారికి మంచి ప్రోత్సాహాలను అందిస్తే.. తప్పకుండా మరింత అద్భుతమైన ఫలితాలను పొందవచ్చని 77 శాతం యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇదీ చదవండి: 'హనూమన్' ఏఐ గురించి ఆసక్తికర విషయాలు.. రోజూ సమయానికి ఆఫీసులకు వచ్చి, విరామం తీసుకోకుండా, సెలవులు పెట్టకుండా పనిచేయాలనే సంస్థలు మంచి ఫలితాలను పొందవని, దీనికి భిన్నమైన సంస్కృతిని పెంపొందించడానికి సంస్థలకు కూడా పాటుపడాలని సర్వేలో తెలుసుకున్నట్లు అప్నా కో ఫౌండర్ అండ్ సీఈఓ సీఈవో నిర్మిత్ పరీఖ్ తెలిపారు. -
ఈ ఏడాది శాలరీ హైక్.. వారికే ఎక్కువ!.. సర్వే
2024 ప్రారంభమైనా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో అంతర్జాతీయ వృత్తి నిపుణుల సేవా సంస్థ 'ఎయాన్' (Aon) సర్వే మాత్రం ఉద్యోగులకు ఊరట కల్పిస్తూ ఓ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది భారతీయ ఉద్యోగుల సగటు జీతం 9.5 శాతం పెరిగే అవకాశం ఉందని సర్వే ద్వారా ఎయాన్ వెల్లడించింది. ఇది 2023 కంపెనీలు అందించిన జీతాల పెంపు కంటే (2023 జీతాల పెంపు 9.7 శాతం) కొంత తక్కువగా ఉందని స్పష్టం చేసింది. ఈ సర్వే కోసం ఎయాన్ సుమారు 45 రంగాలకు చెందిన 1414 కంపెనీల డేటా విశ్లేషించింది. ఇందులో తయారీ రంగం 10.1 శాతం జీతాల పెంపుతో ముందు వరుసలో ఉన్నట్లు, ఆర్థిక సంస్థలు, లైఫ్ సైన్సెస్ రంగాలు 9.9 శాతం జీతాల పెంపుతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు అంచనా వేసింది. ఈ కామర్స్ సంస్థలు సగటున 9.2 శాతం పెంపును ఇచ్చే అవకాశం ఉంది. ఇక FMCG, కన్స్యూమర్ డ్యూరబుల్ ప్లేయర్స్ జీతాలను 9.6 శాతం, రిటైల్ రంగంలో 8.4 శాతం పెంచే అవకాశం ఉందని సమాచారం. ప్రొఫెషనల్ సర్వీసెస్ అండ్ కెమికల్స్ రంగాల జీతాల పెంపు 9.7 శాతంగా అంచనా. టెక్నాలజీ ప్లాట్ఫామ్, ఉత్పత్తుల రంగం జీతాలను 9.5 శాతం పెంచే అవకాశం ఉంది. ఈ సమయంలో టెక్ కన్సల్టింగ్ విభాగంలో ఉద్యోగుల వేతనాలు 8.2 శాతం మాత్రమే పెరిగే అవకాశం ఉంది. భారతదేశంలో మొత్తం అట్రిషన్ రేట్లు 2022లో 21.4 శాతం నుంచి 2023లో 18.7 శాతానికి పడిపోయినట్లు సర్వేలో తెలిసింది. 2023లో కొన్ని సంస్థలు కొంత అనిశ్చితి వాతావరణం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ఏడాది ప్ర్రాభం నుంచి కంపెనీల పురోగతి కొత్త కొత్త వ్యూహాలను రచిస్తున్నాయి. దీంతో ఉద్యోగుల జీతాలు గత ఏడాది కంటే మెరుగ్గా ఉండొచ్చని పలువురు భావిస్తున్నారు. ఇదీ చదవండి: నేనింకా అప్డేట్ కాలేదేమో! ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్.. జీతాల పెంపు విషయంలో భారత్ అగ్రగామిగా నిలువగా.. బంగ్లాదేశ్, ఇండోనేషియా వంటి దేశాలు తరువాత స్థానాల్లో ఉన్నాయి. ఈ ఏడాది బంగ్లాదేశ్, ఇండోనేషియా దేశాల్లో జీతాలు పెంపు 7.3 శాతం, 6.5 శాతంగా ఉండనున్నట్లు సమాచారం. -
ఆ కంపెనీలకు ‘ఇంకా డిగ్రీ’లే కొలమానం!
సాధారణంగా పెద్ద పెద్ద కంపెనీలు డిగ్రీలు పూర్తి చేసిన అభ్యర్థులను నియమించుకుంటాయి. అయితే ఆ ధోరణికి స్వస్తి పలుకుతామని కొన్ని కంపెనీలు గతంలో వాగ్దానాలు చేశాయి. డిగ్రీలతో సంబంధం లేకుండా నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగులను నియమించుకుంటామని ప్రకటించాయి. కానీ వాస్తవ పరిస్థితి మరోలా ఉంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా, అమెజాన్, లాక్హీడ్ మార్టిన్ లాంటి పెద్ద కంపెనీలు కూడా అభ్యర్థులకు కళాశాల డిగ్రీలు ఉండాలనే నిబంధనను వదులుకుంటామని వాగ్దానం చేసిన కంపెనీలలో ఉన్నాయి. అయితే హార్వర్డ్ బిజినెస్ స్కూల్, బర్నింగ్ గ్లాస్ ఇన్స్టిట్యూట్ నుండి వచ్చిన తాజా అధ్యయనం ప్రకారం.. వారి నియామక పద్ధతులు ఇప్పటికీ పాత ధోరణినే అనుసరిస్తున్నాయి. ఆయా కంపెనీలు ఇప్పటికీ కళాశాల గ్రాడ్యుయేట్లను నియమించుకుంటున్నాయి. ఆయా కంపెనీల్లో డిగ్రీలతో సంబంధం లేకుండా నైపుణ్యాల ఆధారంగా నియమించుకుంటామని చెప్పిన సుమారు 11,300 ఉద్యోగాలను 2014 తర్వాత నుంచి అధ్యయనం పరిశీలించింది. గత సంవత్సరం జరిగిన 700 మంది నియామకాలను పరిశీలించగా డిగ్రీలతో సంబంధం లేకుండా నైపుణ్యాల ఆధారంగా నియమించుకున్న ఉద్యోగం ఒక్కటీ లేదని అధ్యయనం తేల్చింది. ఈ అధ్యయనంలో కంపెనీలను మూడు వర్గాలుగా విభజించారు. వాల్మార్ట్, యాపిల్, టార్గెట్తో సహా 37 శాతం కంపెనీలు నైపుణ్యాల ఆధారిత నియామకంలో పురోగతి సాధించారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా, అమెజాన్, లాక్హీడ్ మార్టిన్లతో సహా 45 శాతం కంపెనీలు డిగ్రీలతో సంబంధం లేకుండా నైపుణ్యాల ఆధారంగా నియామకాలు చేపట్టడంలో విఫలమయ్యాయి. ఇక మూడవ వర్గం కంపెనీలను "బ్యాక్స్లైడర్స్" అని పిలుస్తారు. వాటిలో నైక్, ఉబెర్, డెల్టా ఉన్నాయి. నివేదికలో 18 శాతంగా ఉన్న ఈ కంపెనీలు నైపుణ్యాల ఆధారిత నియామకాల విషయంలో మొదట్లో పురోగతిని సాధించాయి. కానీ తర్వాత పాత పద్ధతికే వచ్చేశాయి. -
ఆ జీతమే శాపమైందా.. దిక్కుతోచని పేటీఎం ఉద్యోగులు
ఆర్బీఐ ఆంక్షలు విధించినప్పటి నుంచి ప్రముఖ ఫిన్టెక్ సంస్థ పేటీఎం (Paytm) ఏదో ఒక అంశంలో రోజూ వార్తల్లో నిలుస్తోంది. దీని షేరు విలువ రెండు రోజుల్లో 15 శాతం పడిపోయింది. పేటీఎం భవిష్యత్తు ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో ఆ సంస్థ ఉద్యోగులు బయటి అవకాశాల కోసం చూస్తున్నారు. కానీ వారికో చిక్కు వచ్చిపడింది. డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్లలో అనతి కాలంలోనే అతిపెద్ద సంస్థగా ఎదిగిన పేటీఎం.. ఉద్యోగులకు మంచి జీతాలు చెల్లించడంలో ప్రసిద్ధి చెందింది. పరిశ్రమ సగటు కంటే ఎక్కువ జీతాలు చెల్లిస్తోంది. అయితే ప్రస్తుత సంక్షోభ సమయంలో ఉద్యోగులు ఆ సంస్థను వీడి ఇతర కంపెనీల వైపు చూస్తున్నారు. ప్రత్యర్థి కంపెనీలు, ఇతర స్టార్టప్లు పేటీఎం ఉద్యోగులపై దృష్టి పెట్టాయి. కానీ వారికి జీతాలే సమస్యగా మారాయి. వెనకాడుతున్న స్టార్టప్లు రిక్రూట్మెంట్ సర్వీసెస్, జాబ్ సెర్చ్ సంస్థల వర్గాల ప్రకారం, పేటీఎం ఉద్యోగులు పరిశ్రమ ప్రమాణాల కంటే 20-30 శాతం ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇదే పేటీఎం ఉద్యోగుల పాలిట శాపమైందని, దీని కారణంగానే చాలా స్టార్టప్లు పేటీఎం ఉద్యోగులను నియమించుకోవడానికి వెనుకాడుతున్నారని ఎకనామిక్స్ టైమ్స్ కథనం పేర్కొంది. పేటీఎం ప్రస్తుతం తమ కార్యకలాపాలపై నియంత్రణాపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో అందులోని చాలా మంది ఉద్యోగులు తక్కువ జీతమైన పర్వాలేదని ఉద్యోగాలు మారడానికి సిద్ధంగా ఉన్నారని నివేదిక వివరిస్తోంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఫిబ్రవరి 29 తర్వాత ఎటువంటి కస్టమర్ ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, కార్డ్లపై తదుపరి డిపాజిట్లు తీసుకోవద్దని, క్రెడిట్ లావాదేవీలు, టాప్-అప్లను నిర్వహించవద్దని ఆర్బీఐ జనవరి 31న ఆదేశించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) పేటీఎం బ్రాండ్ అయిన One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్కి అనుబంధ సంస్థ. -
క్యాంపస్ రిక్రూట్మెంట్లపై ఫ్రెషర్స్లో కంగారు
-
దేశీ ఎల్రక్టానిక్ కంపెనీలకు మెరుగైన రేటింగ్స్
న్యూఢిల్లీ: బ్రాండ్ల ఆమోదయోగ్యతకు సంబంధించి గ్లోబల్ కంపెనీలకు దీటుగా దేశీ ఎల్రక్టానిక్స్ కంపెనీలు ఉంటున్నాయి. లావా, క్యూబో వంటి సంస్థలకు మెరుగైన రేటింగ్స్ లభిస్తున్నాయి. మార్కెట్ అనాలిసిస్ సంస్థ టెక్ఆర్క్ డిసెంబరులో నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ–కామర్స్ ప్లాట్ఫాంలు అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో 35 ఉత్పత్తుల కేటగిరీలవ్యాప్తంగా 25 బ్రాండ్లపై దీన్ని నిర్వహించారు. ‘రియల్మీ, రెడ్మీ వంటి గ్లోబల్ బ్రాండ్స్కి ఈ–కామర్స్ ప్లాట్ఫామ్లలో 4.3 రేటింగ్ ఉన్నట్లు మా విశ్లేషణలో వెల్లడైంది. వాటితో పోలిస్తే పరిశ్రమ ప్రమాణాలకు దాదాపు సమానస్థాయిలో లావా మొదలైన సంస్థలకు 4.2 రేటింగ్ ఉంది‘ అని నివేదిక పేర్కొంది. లావాకు 90.2 శాతం మంది అత్యధిక రేటింగ్స్ (4, 5 స్థాయిలో) ఇవ్వగా, గ్లోబల్ బ్రాండ్స్కి వచి్చన 4, 5 స్థాయి రేటింగ్స్ 75.8 శాతమే ఉన్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కేటగిరీలో హీరో గ్రూప్ సంస్థ క్యూబో ఏకంగా పరిశ్రమ సగటు 4 రేటింగ్స్ను కూడా దాటేసి 4.1 రేటింగ్స్ దక్కించుకుంది. అయితే, అంతర్జాతీయ సంస్థలకు అత్యధిక స్థాయిలో 4, 5 రేటింగ్స్ ఉన్నాయి. వేరబుల్ కేటగిరీల్లో మాత్రం రియల్మీ, రెడ్మీ, ఒప్పో, వన్ప్లస్ నార్డ్ వంటి అంతర్జాతీయ బ్రాండ్స్తో పోలిస్తే భారతీయ బ్రాండ్స్కి పరిశ్రమ బెంచ్మార్క్ కన్నా తక్కువ రేటింగ్స్ ఉన్నాయి. పరిశ్రమ బెంచ్మార్క్ రేటింగ్స్ 4.2గా ఉండగా .. భారతీయ బ్రాండ్స్ అయిన నాయిస్, బోల్ట్ ఆడియోకి 4.1, ఆ తర్వాత బోట్..పీట్రాన్కు 4.0 రేటింగ్స్ లభించాయి. మివి, గిజ్మోర్, నంబర్కి సగటున 3.9 రేటింగ్ ఉంది. యాపిల్, శాంసంగ్ల టార్గెట్ యూజర్ల సెగ్మెంట్ భిన్నమైనది కావడంతో వాటిని ఈ అధ్యయనంలో పరిగణనలోకి తీసుకోలేదు. -
టెక్ ఉద్యోగులపై లేఆఫ్ కత్తి!
కరోనా ముగిసింది.. ఉద్యోగాలకు ఏం భయం లేదనుకుని 2024లో అడుగుపెట్టిన టెకీలకు ఈ ఏడాది కూడా చుక్కెదురవుతోంది. 2024 ప్రారంభమైన మొదటి నెల కావొస్తున్నా.. ఉద్యోగుల్లో లేఆప్స్ భయం పోవడం లేదు. ఎందుకంటే జనవరిలో ఇప్పటికి ఏకంగా 24,564 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోవడమే. మొదటి నెలలో లేఆఫ్స్.ఎఫ్వైఐ రిపోర్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం, సుమారు 91 టెక్ కంపెనీలు 24,564 మందిని తొలగించినట్లు తెలుస్తోంది. ప్రముఖ టెక్ దిగ్గజం సేల్స్ ఫోర్స్ కంపెనీ గత శుక్రవారమే తమ కంపెనీ సిబ్బందిలో 700 మందిని తొలగిస్తున్నట్ల ప్రకటించిన సంగతి అందరికి తెలుసు. 2023లో మొత్తం 1187 టెక్ కంపెనీల నుంచి 2,62,595 మంది ఉయోగాలను కోల్పోయినట్లు లేఆఫ్-ట్రాకింగ్ వెబ్సైట్ Layoffs.fyi నుంచి వచ్చిన డేటా ఆధారంగా తెలిసింది. 2024 ప్రారంభంలోనే ఆన్లైన్ రెంటల్ ప్లాట్ఫారమ్ ఫ్రంట్డెస్క్ రెండు నిమిషాల గూగుల్ మీట్ కాల్ ద్వారా ఏకంగా 200 మంది ఉద్యోగులను తొలగించేసింది. గేమింగ్ కంపెనీ యూనిటీ కూడా ఉన్న ఉద్యోగుల్లో సుమారు 25 శాతం మందిని లేదా 1800 మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. హార్డ్వేర్, కోర్ ఇంజనీరింగ్ అండ్ గూగుల్ అసిస్టెంట్ టీమ్లలో అనేక వందల ఉద్యోగాలను తగ్గించినట్లు గూగుల్ కూడా ధృవీకరించింది. అంతే కాకుండా రానున్న రోజుల్లో మరింత మంది ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఒక మెమోలో వెల్లడించింది. ఇదీ చదవండి: ఫిబ్రవరి 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం! అమెజాన్ యాజమాన్యంలోని ఆడియోబుక్ అండ్ పాడ్కాస్ట్ డివిజన్ ఆడిబుల్ ఈ-కామర్స్ దిగ్గజంలో మొత్తం ఉద్యోగాల కోతలో భాగంగా తన సిబ్బందిలో 5 శాతం లేదా 100 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. మెటా యాజమాన్యంలోని ఇన్స్టాగ్రామ్ కూడా నూతన సంవత్సరంలోనే కొంతమంది టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్లను తొలగించింది. ఇవన్నీ చూస్తుంటే టెక్ ఉద్యోగులకు 2024 కూడా కలిసి రాదేమో అనే భావన చాలామందిలో మొదలైపోయింది. -
అంకురాల అభివృద్ధిలో మనమెక్కడ..?
భారత ఆర్థిక వ్యవస్థకు అంకుర సంస్థలు కొత్త ఊపు తెస్తున్నాయి. స్టార్లప్ల రూపంలో కొత్తదనాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రాయితీలు అందిస్తున్నాయి. అందుకు అనువుగా ఒడుదొడుకులను తట్టుకొని ముందుకు సాగేలా వాటి వ్యవస్థాపకులను ప్రోత్సహిస్తున్నాయి. యువ జనాభా అధికంగా ఉన్న భారతదేశ ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చి, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో అంకుర సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయి. వాటికి రూ.10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు బ్యాంకు రుణాలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్టాండప్ ఇండియా కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా పరిశ్రమలు-అంతర్గత వాణిజ్య అభివృద్ధి విభాగం (డీపీఐఐటీ) గుర్తింపు పొందిన అంకుర సంస్థలకు పన్ను రాయితీలు, ఆర్థిక సహాయంతో పాటు మేధాహక్కులూ వేగంగా మంజూరు అవుతున్నాయి. భారత్లో దాదాపు 110 యూనికార్న్ కంపెనీలు.. ప్రపంచంలో అంకురాల సంఖ్యలో భారత్ మూడో స్థానాన్ని ఆక్రమిస్తోంది. 2023 అక్టోబరు నాటికి దేశంలోని 763 జిల్లాల్లో డీపీఐఐటీ గుర్తింపు పొందిన 1,12,718 అంకురాలు వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ప్రపంచంలో నవీకరణ, నాణ్యత పరంగా చూస్తే మన స్టార్టప్లు రెండో స్థానంలో నిలుస్తున్నాయి. 100 కోట్ల డాలర్ల విలువ సాధించిన అంకురాలను యూనికార్న్లుగా వ్యవహరిస్తారు. అలాంటివి భారత్లో 110 వరకు ఉన్నాయి. అమెరికా, చైనాల తరవాత ఇంత పెద్ద సంఖ్యలో యూనికార్న్లు ఉన్నది భారత్లోనే. ఒక్క 2022లోనే భారత్లో 42 టెక్నాలజీ అంకురాలు పుట్టుకొచ్చాయి. ప్రభుత్వ వెన్నుదన్నుతో ఇవి సాధిస్తున్న విజయాలు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఐదు విభాగాల్లో డీపీఐఐటీ ర్యాంకింగ్లు.. స్టార్టప్ల వృద్ధికి అనుకూలమైన ఎకోసిస్టమ్ను నిర్మించడానికి 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేస్తున్న ప్రయత్నాలను పరిశీలించిన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ఇటీవల ఐదు రకాల ర్యాంకులను ఇచ్చింది. ఇందులో బెస్ట్ పర్ఫార్మర్స్, టాప్ పర్ఫార్మర్స్, లీడర్స్, ఆస్పైరింగ్ లీడర్స్, ఎమర్జింజ్ స్టార్టప్ ఎకోసిస్టమ్ విభాగాల్లో గుర్తింపు ఇస్తున్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను వాటి జనాభా ఆధారంగా రెండు విభాగాలుగా విభజించారు. కోటి జనాభా కంటే ఎక్కువ ఉన్నవి, కోటి కంటే తక్కువ ఉన్నవిగా వర్గీకరించారు. ‘లీడర్స్’ కేటగిరీలో ఏపీ టాప్.. దేశంలోని ఎనిమిది రాష్ట్రాలను 'లీడర్స్' కేటగిరీలో చేర్చారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, అస్సాం, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, త్రిపుర వరుస స్థానాల్లో ఉన్నాయి. ఆంత్రప్రెన్యూర్ల కోసం బలమైన స్టార్టప్ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేయడంలో గుజరాత్, కర్ణాటకలు బెస్ట్ పర్ఫార్మర్లుగా ర్యాంకులు తెచ్చుకున్నాయి. ఇదే లిస్టులో కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ తరువాత స్థానాల్లో నిలిచాయి. గుజరాత్ వరుసగా నాలుగోసారి బెస్ట్ స్టేట్గా నిలిచింది. కర్ణాటక ఈ విభాగంలో రెండో ర్యాంకు సాధించింది. మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయలు టాప్ పర్ఫార్మర్స్గా ఎంపికయ్యాయి. బిహార్, హరియాణా, అండమాన్ నికోబార్ దీవులు, నాగాలాండ్లు ఆస్పైరింగ్ లీడర్స్ విభాగంలో వరుస స్థానాల్లో ఉన్నాయి. ఛత్తీస్గఢ్, దిల్లీ, జమ్మూకాశ్మీర్, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, లద్ధాఖ్, మిజోరాం, పుదుచ్చేరి , సిక్కింలు ఎమర్జింగ్ స్టార్టప్ ఎకోసిస్టమ్స్ విభాగంలోకి చోటుసాధించాయి. ఇదీ చదవండి: తీరనున్న ఎగిరే ట్యాక్సీ కల! వీటి ఆధారంగానే ర్యాంకింగ్లు.. ఇన్నోవేషన్లను ప్రోత్సహించడం, మార్కెట్ యాక్సెస్, ఇంక్యుబేషన్ ఫండింగ్ సపోర్ట్ వంటి 25 యాక్షన్ పాయింట్ల ఆధారంగా ఈ ర్యాంకులను ఇచ్చామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన స్టార్టప్లకు ఎలాంటి సాయం అవసరమో తెలుసుకోవాలని అధికారులను కోరారు. స్టార్టప్లు పేటెంట్లు, ట్రేడ్మార్క్ల వంటి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ (ఐపీఆర్లు) నమోదు కోసం డీపీఐఐటీ సాయం తీసుకోవాలని అన్నారు. -
3000 మంది ఉద్యోగులకు 'టాటా' బైబై..!
ఈ ఏడాది ప్రారంభం నుంచే గూగుల్, అమెజాన్ కంపెనీలు లేఆప్స్ ప్రారంభించాయి. ఈ జాబితాలోకి తాజాగా టాటా స్టీల్ చేరనున్నట్లు సమాచారం. ఈ కంపెనీ వేల్స్లోని ప్లాంట్లో సుమారు 3,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలిసింది. పోర్ట్ టాల్బోట్ స్టీల్వర్క్స్లోని రెండు బ్లాస్ట్ ఫర్నేస్లను కంపెనీ మూసివేసినట్లు.. ఇదే జరిగితే సుమారు మూడు వేలమంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ధ్రువీకరించలేదు. లేఆప్స్ గురించి కూడా ప్రస్తావించలేదు. టాటా స్టీల్ తన రెండు బ్లాస్ట్ ఫర్నేస్లను మూసివేయాలని నిర్ణయించే ముందు వర్కర్స్ యూనియన్తో సమావేశం నిర్వహించినట్లు, గ్రీన్ మెటల్ ఉత్పత్తికి నిధులు సమకూర్చడానికి ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. ఇప్పుడు పరిస్థితులు కొంత తీవ్రతరం కావడంతో ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి: యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా.. జర భద్రం! పోర్ట్ టాల్బోట్ స్టీల్వర్క్స్ అనేది యూకేలోని అతిపెద్ద సంస్థల్లో ఒకటి. కంపెనీ ఇబ్బందులను ఎదుర్కుంటున్న సమయంలో బ్రిటన్ ప్రభుత్వం గత ఏడాది చివర్లో సంస్థకు 500 మిలియన్స్ ఫౌండ్స్ (రూ. 5300 కోట్లు) సహాయం చేసింది. ఆ సమయంలోనే కంపెనీ నష్టాలు ఉద్యోగులపైన ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. -
పాలీక్యాబ్ లాభం రూ.416 కోట్లు
న్యూఢిల్లీ: కేబుళ్లు, వైర్ల తయారీ సంస్థ పాలీక్యాబ్ ఇండియా డిసెంబర్ త్రైమాసికంలో పనితీరు పరంగా ఫర్వాలేదనిపించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చి చూసినప్పుడు 15 శాతం వృద్ధితో రూ.416 కోట్లకు చేరింది. త్రైమాసిక వారీ లాభంలో ఇది మూడో గరిష్ట స్థాయి కావడం గమనార్హం. పన్ను అనంతర లాభాల మార్జిన్ 9.6 శాతంగా ఉంది. ఆదాయం 17 శాతం పెరిగి రూ.4,340 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.361 కోట్లు, ఆదాయం రూ.3,715 కోట్ల చొప్పున ఉన్నాయి. మొత్తం వ్యయాలు 18 శాతం పెరిగి రూ.3,865 కోట్లకు చేరాయి. వైర్లు, కేబుళ్ల విభాగం ఆదాయం 17 శాతం వృద్ధితో రూ.3,904 కోట్లుగా ఉంది. ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రిక్ గూడ్స్ అమ్మకాల ఆదాయం 13.4 శాతం పెరిగి రూ.296 కోట్లుగా ఉంది. ఈపీసీ విభాగం ఆదాయం రెట్టింపై రూ.247 కోట్లకు చేరింది. గత నెల కంపెనీకి చెందిన పలు ప్రాంగణాలు, ప్లాంట్లు, కొందరు ఉద్యోగుల నివాసాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారని, ఆ సమయంలో పూర్తి సహకారం అందించినట్టు కంపెనీ ప్రకటించింది. ఈ సోదాలకు సంబంధించి ఇప్పటి వరకు ఆదాయపన్ను శాఖ నుంచి తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేసింది. బీఎస్ఈలో పాలీక్యాబ్ షేరు పెద్దగా మార్పు లేకుండా రూ.4,431 వద్ద క్లోజ్ అయింది. -
2024 ప్రారంభంలోనే పరేషాన్.. ఐటీ ఉద్యోగుల్లో మళ్ళీ మొదలైన కలవరం!
2023 ముగిసింది, కొత్త సంవత్సరం 2024 అయినా కలిసొస్తుందేమో అనుకున్న ఐటీ ఉద్యోగులకు మొదటి రెండు వారాల్లోనే చుక్కెదురైంది. ఇప్పటికి 46 ఐటీ అండ్ టెక్ కంపెనీలు సుమారు 7500 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం. గత ఏడాది చివరి వరకు ఉద్యోగాల తొలగింపులను చేపట్టిన చాలా కంపెనీలు.. ఈ ఏడాది ప్రారంభంలో కూడా అదే ఫాలో అవుతున్నాయి. ఇందులో భాగంగానే 46 కంపెనీలు జనవరి 14 వరకు 7,528 మంది ఉద్యోగాల ఉద్యోగాలను తొలగించినట్లు layoff.fyi అందించిన లేటెస్ట్ డేటాలో తెలిసింది. 2024 ప్రారంభంలోనే ఆన్లైన్ రెంటల్ ప్లాట్ఫారమ్ ఫ్రంట్డెస్క్ రెండు నిమిషాల గూగుల్ మీట్ కాల్ ద్వారా ఏకంగా 200 మంది ఉద్యోగులను తొలగించేసింది. గేమింగ్ కంపెనీ యూనిటీ కూడా ఉన్న ఉద్యోగుల్లో సుమారు 25 శాతం మందిని లేదా 1800 మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. హార్డ్వేర్, కోర్ ఇంజనీరింగ్ అండ్ గూగుల్ అసిస్టెంట్ టీమ్లలో అనేక వందల ఉద్యోగాలను తగ్గించినట్లు గూగుల్ గత వారం ధృవీకరించింది. అమెజాన్ యాజమాన్యంలోని ఆడియోబుక్ అండ్ పాడ్కాస్ట్ డివిజన్ ఆడిబుల్ ఈ-కామర్స్ దిగ్గజంలో మొత్తం ఉద్యోగాల కోతలో భాగంగా తన సిబ్బందిలో 5 శాతం లేదా 100 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. మెటా యాజమాన్యంలోని ఇన్స్టాగ్రామ్ కూడా నూతన సంవత్సరంలోనే కొంతమంది టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్లను తొలగించింది. డిస్నీ యాజమాన్యంలోని యానిమేషన్ స్టూడియో పిక్సర్ కూడా ఈ ఏడాది ఉద్యోగాలను తగ్గించబోతున్నట్లు ఇప్పటికే వెల్లడించింది. -
చైనాతో లింకులు.. భారత్ కంపెనీలపై కేంద్రం కొరడా
న్యూఢిల్లీ: చైనాతో లింకులున్న భారతీయ సంస్థలపై ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా చైనా గ్రూప్తో గల సంబంధాలను దాచిపెట్టినందుకు గాను మెటెక్ ఎలక్ట్రానిక్స్కు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) రూ. 21 లక్షల జరిమానా విధించింది. అలాగే, చైనా, హాంకాంగ్కు చెందిన మెటెక్ గ్రూప్తో కొత్తగా ఎటువంటి ఒప్పందాలు కుదుర్చుకోవద్దని ఆదేశించింది. ఇద్దరు విదేశీయులు, ఒక భారతీయుడు షేర్హోల్డర్లుగా ఒక స్టాండెలోన్ సంస్థలాగా మెటెక్ ఎలక్ట్రానిక్స్ నమోదు చేసుకుంది. ఉత్పత్తుల కొనుగోలు కోసం తప్ప చైనాకు చెందిన మెటెక్ గ్రూప్తో తమకు ఎటువంటి సంబంధాలు లేవని చెబుతోంది. అయితే, వాస్తవానికి మెటెక్ గ్రూప్లో భాగంగానే అది పని చేస్తున్నట్లు వెల్లడైందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో కంపెనీతో పాటు సంబంధిత వ్యక్తులకు ఆర్వోసీ జరిమానా విధించింది. -
కోట్లు సంపాదించేలా చేసిన ఒక్క ఆలోచన - ఎవరీ నీరజ్ కక్కర్!
అనుకోకుండా.. అప్పుడప్పుడు వచ్చే ఆలోచనలు కూడా గొప్పవాళ్లను చేసే సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'నీరజ్ కక్కర్' (Neeraj Kakkar). ఇంతకీ ఈయనెవరు? ఈయనకొచ్చిన అలాంటి ఆలోచన ఏంటి? అనే మరిన్ని వివరాలు ఇక్కడ చూద్దాం.. నీరజ్ కక్కర్ అమెరికాలోని వార్టన్ స్కూల్లో ఎంబీఏ పూర్తి చేసిన తరువాత, 2009లో పేపర్ బోట్ కంపెనీని స్థాపించారు. అంతకంటే ముందు ఈయన కోకాకోలా కంపెనీలో జనరల్ మేనేజర్గా పని చేశాడు. ప్రస్తుతం మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన పేపర్ బోట్ కంపెనీ పుట్టడానికి కారణం ఓ ఉద్యోగి వాళ్ళ అమ్మ చేసిన జ్యూస్ తాగడమే అని తెలిపాడు. ఆఫీసులో లంచ్ చేసే సమయంలో ఒక ఉద్యోగి కోసం వాళ్ళ అమ్మ జ్యూస్ తీసుకువచ్చిందని, దాన్ని తాగిన కక్కర్కు ఓ ఆలోచన తట్టింది. ఇలాంటి రుచితోనే జ్యూస్ చేస్తే బాగుంటుందని భావించి కంపెనీ పెట్టాలని.. పేపర్ బోట్ డ్రింక్స్ పేరుతో సంస్థ ప్రారంభించాడు. నేడు ఆ కంపెనీ వందల కోట్లు ఆర్జిస్తోంది. ఇదీ చదవండి: గుజరాత్ సమ్మిట్లో కనిపించని 'ఇలాన్ మస్క్'.. టెస్లా ఫ్యూచర్ ఏంటి? పేపర్ బోట్స్ అనగానే ఓ ప్రత్యేకమైన భారతీయ అభిరుచికి పేరుగాంచిన కంపెనీగా పేరు పొందింది. గత ఏడాది సంస్థ 50 మిలియన్ డాలర్లు సేకరించింది. బిజినెస్ చేయడానికి ఆహారమే అత్యుత్తమ రంగమని కక్కర్ వెల్లడించారు. అయితే ఏ రంగంలో అడుగుపెట్టినా కృషి, పట్టుదల ఉంటేనే సక్సెస్ వస్తుందని తెలిపాడు. -
గూగుల్ బాటలో డిస్కార్డ్.. మళ్ళీ 170 మంది
2023లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కున్న ఉద్యోగులకు.. 2024 కూడా కలిసి రాదేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఏడాది ప్రారంభంలో కూడా కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించడం మొదలెట్టేశాయి. ఈ వరుసలో తాజాగా ప్రముఖ సోషల్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ 'డిస్కార్డ్' (Discord) చేరింది. డిస్కార్డ్ కంపెనీ 2023 ఆగష్టులో 40 మంది ఉద్యోగులను తొలగించిన తరువాత.. 2024లో తమ ఎంప్లాయిస్ను తొలగించడం ఇదే మొదటి సారి. ఇప్పడూ కంపెనీ 170 మంది (17 శాతం) ఉద్యోగులను తీసివేసినట్లు వెల్లడించింది. ప్రస్తుతం కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 700 మందికి చేరుకున్నట్లు తెలుస్తోంది. డిస్కార్డ్ సీఈఓ జాసన్ సిట్రాన్ ప్రకారం.. 2020లో నియామకాలు పెరిగిన తరువాత కరోనా ప్రభావం వల్ల కంపెనీ ఆర్థిక పరిస్థితులు తారుమారయ్యాయి. దీంతో కంపెనీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, ఉద్యోగులను తొలగించాల్సిన అవసరం ఉందని భావించినట్లు.. ఈ కారణంగానే కంపెనీ ఎప్పటికప్పుడు ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: పసిడి ప్రియులకు షాక్.. ఊహకందని రీతిలో పెరిగిన బంగారం ధరలు గూగుల్ & అమెజాన్ కూడా.. 2024 ప్రారంభంలో కేవలం డిస్కార్డ్ కంపెనీ మాత్రమే కాకుండా అమెజాన్, గూగుల్ కంపెనీలు కూడా ఇప్పటికే ఉద్యోగులను తొలగించాయి. ఖర్చులను తగ్గించుకోవడానికి వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వందలాది మంది సిబ్బందిని గూగుల్ ఇంటికి పంపింది. -
మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఈ కంపెనీలకు కొత్త రూల్స్!
ఇండియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఈ సంవత్సరం కొత్త తయారీ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, కంపెనీల ఉత్పత్తులను పరీక్షించి అవన్నీ సంతృప్తికరమైన ఫలితాలను పొందిన తరువాత మాత్రమే ప్రొడక్షన్, మార్కెట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఫార్మా కంపెనీల మెటీరియల్స్, మెషీన్లు, ప్రాసెస్ వంటివన్నీ కూడా తప్పకుండా కొత్త ప్రమాణాలను అనుకూలంగానే ఉండాలని భారత ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. ఇందులో ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల నాణ్యతకు తయారీదారు బాధ్యత వహించాలని పేర్కొంది. 50 బిలియన్ల పరిశ్రమ ప్రతిష్టతను కాపాడటానికి కర్మాగారాల పరిశీలనను మోదీ ప్రభుత్వం వేగవంతం చేసింది. కంపెనీల ఉత్పత్తులు నాణ్యమైనవిగా ఉన్నప్పుడు రోగులు ప్రమాదంలో పడే అవకాశం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని సంస్థల ఉత్పత్తులను నిశితంగా పరీక్షించి, సంతృప్తికరమైన ఫలితాలను పొందినప్పుడే మార్కెట్ చేసుకోవాలని ఆదేశించారు. 2022 డిసెంబర్ నుంచి సుమారు 162 ఫార్మా కంపెనీలలో ఇన్కమింగ్ ముడి పదార్థాల టెస్టింగ్ లేకపోవడాన్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గుర్తించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్దేశించిన అంతర్జాతీయ ఔషధాల తయారీ ప్రమాణాలను కలిగి ఉన్న కంపెనీలు భారతదేశంలో చాలా తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇదీ చదవండి: 17 బ్యాంకుల లైసెన్స్ క్యాన్సిల్ చేసిన ఆర్బీఐ పెద్ద ఔషధ తయారీదారులు ఆరు నెలల్లోగా, చిన్న పరిశ్రమలు 12 నెలల్లోగా కొత్త ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా వెల్లడించింది. అయితే ఈ గడువు పెంచాలని, ఇప్పటికే భారీ అప్పుల్లో ఉన్న కంపెనీలు ఈ కొత్త నిబంధనలను అనుసరించాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఖర్చు తీవ్రత ఎక్కువైతే దాదాపు సగం కంపెనీలు క్లోజ్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. -
కొత్త కార్ల పరుగు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2023లో ప్యాసింజర్ వాహన విక్రయాలు 41.08 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. 2022తో పోలిస్తే ఇది 8.3 శాతం అధికం. గతేడాది నమోదైన రికార్డుతో 2024లోనూ అదే ఊపును కొనసాగించాలని ప్యాసింజర్ వాహన తయారీ సంస్థలు ఉవి్వళ్లూరుతున్నాయి. ఈ ఏడాది 100కుపైగా కొత్త మోడళ్లు, వేరియంట్లు రోడ్డెక్కనున్నట్టు మార్కెట్ వర్గాల సమాచారం. వీటిలో అత్యధికంగా ఎస్యూవీలు ఉండనున్నాయి. దీనికి కారణం ఏమంటే 2023లో అమ్ముడైన మొత్తం ప్యాసింజర్ వాహనాల్లో ఎస్యూవీల వాటా ఏకంగా 49 శాతం ఉండడమే. అంతకుముందు ఏడాది వీటి వాటా 42 శాతం నమోదు కావడం గమనార్హం. 2024 కోసం తయారీ కంపెనీలు పోటాపోటీగా కొత్త మోడళ్ల రూపకల్పనలో ఇప్పటికే నిమగ్నమయ్యాయి. మరోవైపు దేశీయ మార్కెట్లో విజయవంతం అయిన మోడళ్లకు మరిన్ని హంగులు జోడించి ఫేస్లిఫ్ట్ వేరియంట్ల విడుదలకు సన్నాహాలు చేస్తున్నాయి. మెర్సిడెస్తో బోణీ.. ఈ ఏడాది మెర్సిడెస్ బెంజ్ తొలుత బోణీ చేయబోతోంది. జనవరి 8న ఈ కంపెనీ జీఎల్ఎస్ లగ్జరీ ఎస్యూవీని ప్రవేశపెడుతోంది. కియా ఇండియా నుంచి నూతన సోనెట్ కాంపాక్ట్ ఎస్యూవీ జనవరి 15న రాబోతోంది. ఆధునీకరించిన క్రెటా వేరియంట్ను జనవరి 16న విడుదలకు హ్యుందాయ్ రెడీ అయింది. మారుతీ సుజుకీ నుంచి కొత్త తరం స్విఫ్ట్ ఫిబ్రవరిలో అడుగుపెడుతోంది. మార్చిలో స్విఫ్ట్ డిజైర్ రోడ్డెక్కనుంది. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ కాంపాక్ట్ ఎస్యూవీ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఏడు సీట్ల ఎస్యూవీ టైసర్ మోడల్ను ప్రవేశపెట్టేందుకు టయోటా కసరత్తు ప్రారంభించింది. కొత్త ఫార్చూనర్ సైతం దూసుకుపోనుంది. హ్యుందాయ్ నుంచి క్రెటా ఎన్ లైన్, ఫేస్లిఫ్ట్ టక్సన్, ఆల్కజార్ సైతం రానున్నాయి. కొత్తతరం అమేజ్ విడుదలకు హోండా కార్స్ సన్నద్ధం అయింది. ఫోక్స్వేగన్, స్కోడా, నిస్సాన్, రెనో, సిట్రోయెన్ ఫేస్లిఫ్ట్ మోడళ్లను తేనున్నాయి. ఈవీలు సైతం మార్కెట్లోకి.. ఎలక్ట్రిక్ కార్లకు క్రమంగా ఆదరణ పెరుగుతుండడంతో కొన్ని కంపెనీలు ఈ విభాగంలో నూతన మోడళ్లను తెచ్చే పనిలో ఉన్నాయి. హ్యారియర్ ఈవీని ఏప్రిల్లో తీసుకొచ్చేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక చేస్తోంది. 2024 చివరికల్లా టాటా కర్వ్ ఈవీ రానుంది. అలాగే టాటా పంచ్ ఈవీ సైతం పరుగుతీయనుంది. మారుతీ సుజుకీ నుంచి తొలి ఈవీ ఈ ఏడాది భారత రోడ్లపై అడుగు పెట్టేందుకు సిద్ధం అవుతోంది. కియా ఈవీ9 పండుగల సీజన్లో రానుందని సమాచారం. -
స్టార్టప్లూ వదిలిపెట్టలేదు! ఈ ఏడాది ఎంతమందిని తొలగించాయంటే..
2023 ఏ రంగాలకు ఎలా ఉన్నా.. టెక్ కంపెనీలకు, స్టార్టప్లకు మాత్రం కొంత నష్టమే వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఈ కథనంలో భారతదేశంలో ఎన్ని స్టార్టప్ కంపెనీలు ఎంతమంది ఉద్యోగులను తొలగించాయి, ఎందుకు తొలగించాయనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. Layoffs.fyi డేటా ప్రకారం.. 2023లో సుమారు 100 ఇండియన్ స్టార్టప్ కంపెనీలు 15000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. ఆర్థిక పరిస్థితుల కారణంగా బైజు సంస్థ రెండు విడతల్లో 2,500 మంది ఉద్యోగులను తొలగించింది. ఇటీవల ఉద్యోగుల వేతనాలు చెల్లించేందుకు బైజూ వ్యవస్థాపకుడు రవీంద్రన్ తన ఆస్తులను తాకట్టుపెట్టడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ ఏడాది 100 మందికి పైగా ఉద్యోగులకు పింక్ స్లిప్లను అందజేసిన స్టార్టప్ కంపెనీలలో ఓలా (200), కెప్టెన్ ఫ్రెష్ (120), షేర్చాట్ (500), స్విగ్గీ (380), మెడిబడ్డీ (200), డీల్షేర్ (100), మైగేట్ (200), బహుభుజి (100), SAP ల్యాబ్స్ (300), అప్గ్రాడ్ (120), ప్రిస్టిన్ కేర్ (300), 1k కిరానా (600), Dunzo (300), జెస్ట్ మనీ (100), సింప్ల్ (150), స్కిల్ లింక్ (400), ఎక్స్ట్రామార్క్లు (300), వాహ్ వాహ్! (150), మీషో (251), క్యూమత్ (100), హప్పే (160), గ్లామియో హెల్త్ (160), మోజోకేర్ (170), వేకూల్ (300), నవీ టెక్నాలజీస్ (200), మిల్క్బాస్కెట్ (400), టెకియోన్ (300), స్పిన్నీ (300), MPL (350) మొదలైనవి ఉన్నాయి. ఇదీ చదవండి: రూ. 700లకే మహీంద్రా థార్! ఆనంద్ మహీంద్రా రిప్లై ఇలా.. ప్రపంచవ్యాప్తంగా 1160 కంటే ఎక్కువ టెక్ కంపెనీలు ఈ ఏడాది ఏకంగా 26,02,238 మంది ఉద్యోగులను తొలగించాయి. 2022లో 1064 కంపెనీలు 1,64,969 మంది సిబ్బందిని తొలగించాయి. ఆర్థిక పరిస్థితుల కారణంగా, మార్కెటింగ్ ఖర్చులను తగ్గించుకోవడం, వ్యయ నిర్మాణాలను సరిచేయడం వంటి వాటిలో భాగంగా ఉద్యోగులను తొలగించాల్సి వచ్చినట్లు కంపెనీలు స్పష్టం చేశాయి. -
న్యూ ఇయర్ రాకముందే ఉద్యోగులకు షాకిచ్చిన కంపెనీ..
2023 ప్రారంభం నుంచి మొదలైన లేఆప్స్ ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల తాజాగా బెంగళూరుకు చెందిన స్టార్టప్ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ 'షేర్చాట్' (ShareChat) తన ఉద్యుగులలో సుమారు 15 శాతం మందిని తొలగించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2023లో కంపెనీ నష్టాలను చవి చూడటం వల్ల ఖర్చులను క్రమబద్ధీకరించడానికి, ప్రస్తుతం 15 శాతం లేదా 200 మంది ఉద్యోగులను తొలగించినట్లు అధికారికంగా వెల్లడించింది. గత ఏడాది 4.9 బిలియన్స్ ఉన్న కంపెనీ విలువ ఈ సంవత్సరం 1.5 బిలియన్స్ తగ్గినట్లు సమాచారం. షేర్చాట్ తన కార్యకలాపాలను, ఉత్పాదకతను మెరుగుపరచడం, స్థిరమైన వృద్ధికి స్థానం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుందని, 2024 వార్షిక ప్రణాళికలో భాగంగా.. కంపెనీ వ్యూహాత్మక పునర్నిర్మాణాన్ని వివరిస్తూ షేర్చాట్ ప్రతినిధి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉద్యోగులను తొలగించడానికి ఇదే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇదీ చదవండి: టెక్ దిగ్గజం ఒక్క నిర్ణయం.. చెత్తలోకి 24 కోట్ల కంప్యూటర్లు! ఇండియన్ స్టార్టప్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ షేర్చాట్ ఈ ఆర్థిక సంవత్సరంలో దాని వాల్యుయేషన్ సగానికి పైగా తగ్గడంతో నష్టాల్లో సాగింది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో కూడా సుమారు 600 మంది ఉద్యోగులను తొలగించింది. మళ్ళీ ఇప్పుడు సంవత్సరాంతంలో కూడా ఉద్యోగులను తొలగించి వారికి పెద్ద షాక్ ఇచ్చింది. -
నాలుగు సంస్థల ఏర్పాటులో అదానీ గ్రీన్ ఎనర్జీ
న్యూఢిల్లీ: అదానీ గ్రీన్ ఎనర్జీ తాజాగా నాలుగు అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసింది. అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ సిక్స్టీ, అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ సిక్స్టీ టూ, అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ సిక్స్టీ త్రీ, అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ సిక్స్టీ ఫోర్ వీటిలో ఉన్నాయి. పవన, సౌర, ఇతరత్రా పునరుత్పాదక వనరుల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం, పంపిణీ చేయడం, విక్రయించడం తదితర లావాదేవీల కోసం ఈ అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసినట్లు సంస్థ తెలిపింది. -
IPO: పబ్లిక్ ఇష్యూల జోరు! 5 కంపెనీలు.. రూ. 4,200 కోట్లు
న్యూఢిల్లీ: మార్కెట్లో సానుకూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూ బాట పట్టాయి. ఈ వారం ఏకంగా ఐదు కంపెనీలు ఇన్షీయల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు వస్తున్నాయి. ఈ జాబితాలో ఇండియా షెల్టర్ ఫైనాన్స్, డోమ్స్ ఇండస్ట్రీస్, ఐనాక్స్ ఇండియా, మోతిసన్స్ జ్యుయలర్స్, సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిసి సుమారు రూ. 4,200 కోట్ల పైచిలుకు సమీకరించనున్నాయి. గత నెల 10 కంపెనీల పబ్లిక్ ఇష్యూలు విజయవంతమైన నేపథ్యంలో తాజా ఐపీవోలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. టాటా గ్రూప్ నుంచి 2004 తర్వాత (టీసీఎస్) దాదాపు ఇరవై ఏళ్లకు వచ్చిన టాటా టెక్నాలజీస్ ఇష్యూకు భారీ స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్ ఆఖరు వరకు మొత్తం మీద 44 ఇష్యూల ద్వారా కంపెనీలు రూ. 35,000 కోట్లు సమీకరించాయి. స్థూల ఆర్థిక పరిస్థితులు, లిస్టింగ్ లాభాలు పటిష్టంగా ఉండటం వంటి అంశాల కారణంగా గత కొద్ది వారాలుగా ఐపీవో మార్కెట్ బాగా సందడిగా ఉందని ఆనంద్ రాఠీ అడ్వైజర్స్ డైరెక్టర్ వి. ప్రశాంత్ రావు చెప్పారు. ఇటీవల కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం కూడా పాలనపరమైన స్థిరత్వాన్ని కోరుకునే ఇన్వెస్టర్లకు, తద్వారా మార్కెట్కు ఉత్సాహాన్ని ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఐపీవోలు ఇవీ.. ఇండియా షెల్టర్ ఫైనాన్స్ (ఐఎస్ఎఫ్), డోమ్స్ ఇండస్ట్రీస్ ఇష్యూలు డిసెంబర్ 13–15 మధ్య ఉండనున్నాయి. ఇవి రెండూ చెరి రూ. 1,200 కోట్లు సమీకరించనున్నాయి. ఇండియా షెల్టర్ ఫైనాన్స్ కొత్తగా రూ. 800 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయనుండగా, ఇన్వెస్టర్ షేర్హోల్డర్లు రూ. 400 కోట్ల విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయించనున్నారు. షేరు ధర శ్రేణి రూ. 469–493గా ఉండనుంది. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను భవిష్యత్తు వ్యాపార కార్యకలాపాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. మరోవైపు, పెన్సిళ్ల తయారీ సంస్థ డోమ్స్ ఇండస్ట్రీస్ రూ. 350 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, రూ. 850 కోట్ల విలువ చేసే షేర్లను ఓఎఫ్ఎస్ ద్వారా విక్రయించనుంది. ఐపీవో ధర శ్రేణి రూ. 750–790గా ఉంటుంది. క్రయోజెనిక్ స్టోరేజ్ ట్యాంకుల తయారీ సంస్థ ఐనాక్స్ సీవీఏ పూర్తిగా ఓఎఫ్ఎస్ కింద 2.21 కోట్ల షేర్లను విక్రయించి రూ. 1,459 కోట్లు సమీకరించనుంది. షేరు ధర శ్రేణి రూ. 627– 660గా ఉంటుంది. నిధులను కంపెనీతో పాటు అనుబంధ సంస్థలైన ఎకార్డ్ ఎస్టేట్స్, ఐకానిక్ ప్రాపర్టీ డెవలపర్స్, స్కైలైన్ రియల్టీ రుణాల చెల్లింపునకు, స్థల సమీకరణ మొదలైన అవసరాలకు వినియోగించుకోనుంది. ఐనాక్స్ ఇ ష్యూ డిసెంబర్ 14న ప్రారంభమై 18న ముగుస్తుంది. 17 ఏళ్ల క్రితం ఐనాక్స్ లీజర్ (మలీ్టప్లెక్స్ విభాగం) ఐపీవోకి వచ్చాక ఐనాక్స్ గ్రూ ప్ నుంచి మరో కంపెనీ పబ్లిక్ ఇష్యూకు రా వడం ఇదే ప్రథమం. ప్రస్తుతం ఐనాక్స్ లీజర్.. పీవీఆర్ గ్రూప్లో భాగంగా ఉంది. 1992లో ఏ ర్పాటైన కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలోరూ. 980 కోట్ల ఆదాయంపై రూ. 152 కోట్ల నికర మార్జిన్ నమోదు చేసింది. మూడు ప్లాంట్లు ఉండగా, నాలుగో ప్లాంటు ఏర్పాటు చేస్తోంది. మోతీసన్స్ జ్యుయలర్స్ 2.74 కోట్ల షేర్లను కొత్తగా జారీ చేయనుంది. సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ రూ. 400 కోట్ల విలువ చేసే షేర్లను జారీ కొత్తగా జారీ చేయనుంది. ఈ రెండు ఇష్యూలు డిసెంబర్ 18న ప్రారంభమై 20న ముగుస్తాయి. ఐపీవోల ద్వారా సేకరించిన నిధులను వ్యాపార విస్తరణ, పెట్టుబడులు, రుణాల చెల్లింపు మొదలైన అవసరాల కోసం ఈ సంస్థలు వినియోగించుకోనున్నాయి. -
13 రాష్ట్రాల్లో వీరిదే హవా..! ఆదాయం రూ. కోట్లలోనే..
Sahakar Group Limited (SGL): దేశంలో రోడ్డు వ్యవస్థ మునుపటి కంటే మెరుగుపడింది. హైవేలు, అండర్ పాస్, ఫ్లైఓవర్ వంటి మార్గాలు ఎక్కువయ్యాయి, తద్వారా ప్రయాణం కూడా ఇప్పుడు సులభతరం అయిపోయింది. అయితే ఇప్పుడు ఏ ప్రధాన రహదారి ఎక్కినా ఎక్కడికక్కడ టోల్ ప్లాజాలు ఎదురవుతూనే ఉంటాయి. టోల్ ప్లాజా దాటాలంటే కచ్చితంగా టోల్ పీజు చెలించాల్సి ఉంటుంది. మనదేశంలో ఎక్కువ టోల్ ప్లాజాలు కలిగిన సంస్థ ఏది? దాని ఆదాయం ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతదేశంలో అత్యధిక టోల్ ప్లాజాలు తమ అధీనంలో ఉంచుకున్న అగ్రగామి సంస్థ 'సహకార్ గ్రూప్ లిమిటెడ్' (SGL). దేశవ్యాప్తంగా సుమారు 13 రాష్ట్రాల్లో తమ ఉనికిని చాటుకుంటున్న ఈ కంపెనీ 200 కంటే ఎక్కువ టోల్ ప్లాజాలను తమ పరిధిలో ఉంచుకుంది. 1996లో 'కిషోర్ అగర్వాల్' స్థాపించిన సహకార్ గ్రూప్ లిమిటెడ్, అతి తక్కువ కాలంలోనే మంచి పురోగతిని సాధించింది. 2011 - 12 ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ. 30 కోట్లు కాగా.. 2022 - 23 నాటికి రూ. 2700 కోట్లు కంటే ఎక్కువ ఆదాయం పొందగలిగింది. దీన్ని బట్టి చూస్తే టోల్ ప్లాజా రంగంలో ఎంత అభివృద్ధి సాదించించనే విషయం ఇట్టే అర్థమైపోతుంది. సహకార్ గ్రూప్ లిమిటెడ్ కంపెనీ స్వంత కంప్యూటరైజ్డ్ సిస్టమ్లను, స్వంత యాజమాన్య కంప్యూటరైజ్డ్ టోల్ రెవెన్యూ ఆడిటింగ్ సిస్టమ్ను అభివృద్ధి చేయడంతో సహా టోల్లను వసూలు చేయడానికి అప్పటికప్పుడు కొత్త విధానాలు అలవరిస్తోంది. 1996 సమయంలో ఈ సంస్థ కేవలం ముంబై చుట్టూ ఉన్న మున్సిపల్ కౌన్సిల్ల కోసం ఆక్ట్రాయ్ సేకరణతో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఆ తరువాత మహారాష్ట్ర రాష్ట్రంలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లకు క్రమంగా విస్తరించింది. ప్రస్తుతం దేశంలో ఎక్కువ టోల్ ప్లాజాలు కలిగిన సంస్థగా అవతరించింది. ఇదీ చదవండి: మరింత తగ్గిన బంగారం, వెండి - నేటి కొత్త ధరలు ఇవే.. సహకార్ గ్రూప్ లిమిటెడ్ సంస్థలో సుమారు 4000 కంటే ఎక్కువ మంది పనిచేస్తున్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతే కాకుండా టోల్ ప్లాజాల సంఖ్య కూడా తప్పకుండా పెరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
ఇదే అదను.. చైనా నుంచి తరలిపోయే కంపెనీలు భారత్కే..!
న్యూఢిల్లీ: రానున్న రెండు మూడేళ్లలో చైనా నుంచి తరలిపోయే కంపెనీలను భారత్ ఆకట్టుకుంటుందని నీతి ఆయోగ్ సీఈవో సుబ్రహ్మణ్యం తాజాగా పేర్కొన్నారు. ఈ కాలంలో రిస్కులను తగ్గించుకునే బాటలో చైనాను వీడుతున్న ప్రపంచ కంపెనీల వ్యూహాలను భారత్ అందిపుచ్చుకోవలసి ఉన్నట్లు తెలియజేశారు. ఇందుకు ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుందన్నారు. బిజినెస్లు తరలివచ్చేందుకు ఆకట్టుకునే విధానాల రూపకల్పనకు తెరతీయవలసి ఉన్నదని అభిప్రాయపడ్డారు. పరిశ్రమలు సులభంగా తరలివచ్చేందుకు చర్యలు చేపట్టవలసి ఉన్నట్లు తెలియజేశారు. సీఐఐ నిర్వహించిన 2023 ప్రపంచ ఆర్థిక విధాన వేదికలో సుబ్రహ్మణ్యన్ ఇంకా పలు అంశాలను ప్రస్తావించారు. రాజకీయ, భౌగోళిక పరిస్థితులు, భారీ యువశక్తి భారత్ను ఆకర్షణీయంగా నిలుపుతున్నట్లు పేర్కొన్నారు. వెరసి రానున్న 15–20 ఏళ్ల కాలంలో తయారీలో భారత్కు అవకాశాలు వెల్తువెత్తనున్నట్లు అంచనా వేశారు. అయితే రానున్న రెండు మూడేళ్ల కాలం ఇందుకు అత్యంత అనువైనదని అభిప్రాయపడ్డారు. సప్లై చైన్ వ్యవస్థలు మూతపడుతుండటం, కొత్త ప్రాంతాల కోసం చూస్తుండటం తదితర అంశాలు ఇందుకు కారణమని వివరించారు. ఇది చైనాయేతర కంపెనీలకే పరిమితంకాదని, కార్మిక కొరతతో చైనా కంపెనీలు సైతం తరలివెళ్లే ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించారు. -
మొన్న విప్రో.. నేడు హెచ్సీఎల్ - ఎందుకిలా?
భారతదేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీలలో ఒకటైన 'హెచ్సీఎల్ టెక్నాలజీ' (HCL Technology) బెంగళూరులోని తన కార్యాలయం ఆస్తులను విక్రయించడానికి సిద్దమైనట్లు సమాచారం. కంపెనీ ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? అనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. హెచ్సీఎల్ కంపెనీ, బెంగళూరు జిగానీ పారిశ్రామిక ప్రాంతంలోని సుమారు 27 ఎకరాల స్పెషల్ ఎకనామిక్ జోన్ క్యాంపస్ విక్రయించాలని చూస్తోంది. ఈ ప్రాపర్టీ విలువ సుమారు రూ. 550 కోట్లు వరకు ఉంటుందని అంచనా. అనవసర ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగానే హెచ్సీఎల్ తన ఆస్తులను విక్రయించాలనుకుంటున్నట్లు కొందరు చెబుతున్నారు. నాన్ కోర్ రియల్ ఎస్టేట్ అసెట్స్ మానిటైజే చేసేందుకు, కార్యకలాపాల్ని క్రమబద్ధీకరించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: వేగానికి చెక్ పెట్టే గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ - ఎలా పనిచేస్తుందంటే? హెచ్సీఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోషిణీ నాడార్, కంపెనీని వేగంగా అభివృద్ధి చేయడానికి కావలసిన ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే కొత్త రంగాల్లో అడుగుపెట్టడానికి కూడా యోచిస్తున్నట్లు సమాచారం. కర్ణాటకలో సెమీకండక్టర్ చిప్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఏకంగా 400 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు సమాచారం. -
‘సెల్ఫ్–మేడ్’ కంపెనీలకు కేరాఫ్గా బెంగళూరు
ముంబై: స్వయం శక్తితో ఎదిగిన ఎంట్రప్రెన్యూర్ల (సెల్ఫ్–మేడ్) కంపెనీలు అత్యధికంగా బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఏకంగా 129 అత్యంత విలువైన దిగ్గజాలకు దేశీ సిలికాన్ వేలీ .. హబ్గా నిలుస్తోంది. ఈ విషయంలో ముంబై (78), గురుగ్రామ్ .. న్యూఢిల్లీ (49) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 200 సంస్థలతో హురున్ ఇండియా రపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం వ్యాపార దిగ్గజం రాధాకిషన్ దవనీ ముంబైలో నెలకొల్పిన అవెన్యూ సూపర్మార్కెట్స్ (డీమార్ట్ మాతృ సంస్థ) రూ. 2.38 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్తో అగ్రస్థానంలో ఉంది. బిన్నీ బన్సల్, సచిన్ బన్సల్.. బెంగళరులో నెలకొల్పిన ఫ్లిప్కార్ట్ రూ. 1.19 లక్షల కోట్ల విలువతో రెండో స్థానంలో ఉండగా, గురుగ్రామ్ కేంద్రంగా పని చేస్తున్న జొమాటో (వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్) రూ. 86,835 కోట్ల మార్కెట్ క్యాప్తో మూడో స్థానంలో నిల్చింది. లిస్టెడ్, అన్లిస్టెడ్ కంపెనీలకూ ఈ జాబితాలో చోటు కల్పించామని, వాటి వేల్యుయేషన్లను ఇన్వెస్టర్లు తగ్గించిన పక్షంలో ఆ వివరాలను కూడా పరిగణనలోకి తీసుకున్నామని హురున్ ఇండియా వ్యవస్థాపకుడు అనాస్ రెహ్మాన్ జునైద్ తెలిపారు. మరిన్ని విశేషాలు.. లిస్టులో చోటు దక్కించుకున్న 200 కంపెనీలకు 405 మంది వ్యవస్థాపకులు ఉన్నారు. ఇవన్నీ 2000 సంవత్సరం తర్వాత ప్రారంభించినవే. వీటి మొత్తం విలువ రూ. 30 లక్షల కోట్లు. అత్యధిక సంఖ్యలో సంస్థలు (45) ఆర్థిక సేవల రంగంలో ఉన్నాయి. 30 కంపెనీలతో రిటైల్ రంగం, 26 సంస్థలతో హెల్త్కేర్ రంగం తర్వాత స్థానాల్లో ఉన్నాయి. సొంత నిధులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన నిధులతో (బూట్స్ట్రాప్) ఏర్పాటు చేసిన సంస్థలు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. ఆ కోవకి చెందిన డిస్కౌంట్ బ్రోకింగ్ సంస్థ జిరోధా 10వ స్థానంలో నిల్చింది. జాబితాలో ఇరవై మంది మహిళా ఎంట్రప్రెన్యూర్లు ఉన్నారు. నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణి నయ్యర్ అగ్రస్థానంలో నిల్చారు. వయస్సురీత్యా చూస్తే హ్యాపీయెస్ట్ మైండ్స్ వ్యవస్థాపకుడైన 80 ఏళ్ల అశోక్ సూతా అత్యంత సీనియర్గా ఉండగా, జెప్టోకి చెందిన 21 సంవత్సరాల కైవల్య వోహ్రా అత్యంత పిన్న వయస్కుడిగా ఉన్నారు. -
దిగ్గజ కంపెనీల నిర్ణయంపై 'ఎలాన్ మస్క్' ఘాటు వ్యాఖ్యలు
ఎలాన్ మస్క్ (Elon Musk) ఆధ్వర్యంలో ఉన్న ఎక్స్ (ట్విటర్)లో వాణిజ్య ప్రకటనలు నిలిపివేస్తున్నట్లు అమెరికన్ సంస్థలు ఇటీవలే ప్రకటించాయి. దీనిపైన తాజాగా మస్క్ స్పందించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. అమెరికన్ కంపెనీలైన యాపిల్, డిస్నీ, ఐబీఎం, ఒరాకిల్, లయన్స్ గేట్ ఎంటర్టైన్మెంట్ కార్పొరేషన్, వార్నర్ బ్రోస్ డిస్కవరీ, పారామౌంట్ గ్లోబల్, బ్రావో టెలివిజన్ నెట్వర్క్, కామ్కాస్ట్ ఇక మీద ఎలాంటి ప్రకటనలు ఇవ్వబోమని గత వారంలో వెల్లడించాయి. ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధ సమయంలో ఎక్స్(ట్విటర్)లో యూదు వ్యతిరేఖ పోస్టులు వెల్లువెత్తాయి. వీటికి మస్క్ మద్దతు పలకడంతో అగ్రరాజ్యం మండిపడింది. ఇది యూదు కమ్యూనిటినీ ప్రమాదంలో పడేస్తుందని మస్క్ తీరుపైన మండిపడ్డారు. ఈ కారణంగానే దిగ్గజ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇదీ చదవండి: రతన్ టాటా మేనేజర్ కొత్త కారు ఇదే.. చూసారా! ప్రకటనలు నిలిపివేస్తామన్న కంపెనీలపై ఎలాన్ మస్క్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తాను చేసిన కొన్ని వ్యాఖ్యలను సాకుగా తీసుకుని, బెదిరించాలనుకున్నట్లు, అలాంటి ప్రకటనలు తమకు అవసరం లేదని.. వెళ్లాలనుకునే వారి వెళ్లిపోవచ్చని కఠినంగా వ్యాఖ్యానించారు. మస్క్ వ్యాఖ్యలపై సదరు కంపెనీలు ఎలా స్పందిస్తాయనేది తెలియాల్సిన విషయం. -
మస్క్ చేసిన పనికి మండిపడ్డ అమెరికా.. గుణపాఠం చెప్పిన దిగ్గజ కంపెనీలు!
ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' (Elon Musk) ఎప్పుడు ఏమి చేసినా సంచలనమే.. దీని వల్ల అప్పుడప్పుడు కొన్ని విపరీతాలు కూడా జరుగుతాయి. ఇటీవల ఆయన చేసిన ఒక తప్పిదం మీద అమెరికా విరుచుకుపడుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధ సమయంలో ఎక్స్(ట్విటర్)లో యూదు వ్యతిరేఖ పోస్టులు వెల్లువెత్తాయి. వీటికి మస్క్ మద్దతు పలకడంతో అగ్రరాజ్యం మండిపడింది. దీంతో అమెరికా కంపెనీలైన యాపిల్, డిస్నీ వంటివి ఎక్స్లో యాడ్స్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. యుద్ధ సమయంలో ఎక్స్లో వచ్చిన ఒక పోస్టుకు మస్క్ స్పందించిన విధానం అమెరికన్లకు నచ్చలేదు, ఇది యూదు కమ్యూనిటినీ ప్రమాదంలో పడేస్తుందని మస్క్ తీరుపైన మండిపడ్డారు. దీంతో దిగ్గజ కంపెనీలు ఎక్స్లో యాడ్స్ నిలిపివేయడానికి సిద్ధమయ్యాయి. కేవలం యాపిల్, డిస్నీ మాత్రమే కాకుండా.. ఐబీఎం, ఒరాకిల్, లయన్స్ గేట్ ఎంటర్టైన్మెంట్ కార్పొరేషన్, వార్నర్ బ్రోస్ డిస్కవరీ, పారామౌంట్ గ్లోబల్, బ్రావో టెలివిజన్ నెట్వర్క్, కామ్కాస్ట్ మొదలైన కంపెనీలు తమ యాడ్స్ నిలిపివేయాలని ఉమ్మడిగా నిర్ణయించుకున్నాయి. ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడం.. అమెరికన్ కంపెనీలు తీసుకున్న ఈ నిర్ణయం మస్క్కు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఇప్పటికే నష్టాల్లో సాగుతున్న కంపెనీ మరింత కిందికి వెళ్లే సూచనలు కనిపిస్తున్నారు. ఇదంతా మస్క్ చేసిన ఓ తప్పిదం వల్లే అని పలువులు నెటిజన్లు చెబుతున్నారు. -
టీసీఎస్ కంపెనీకి బాంబ్ బెదిరింపు కాల్.. చేసిందెవరో తెలిసి అవాక్కయిన పోలీసులు!
బెంగళూరు టీసీఎస్ ఆఫీసుకు ఈ రోజు (మంగళవారం) ఉదయం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. కాల్ వచ్చిన వెంటనే అక్కడున్న ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఉద్యోగం నుంచి తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ ఉద్యోగి బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ క్యాంపస్కు బాంబు బెదిరింపు కాల్ చేసింది. క్యాంపస్లోని బి బ్లాక్కు బాంబు బెదిరింపు వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్తో ఆఫీసుకు చేరుకున్నారు. ఆఫీసు మొత్తం వెతికినప్పటికీ అక్కడ బాంబు వంటివి లేదని నిర్థారించారు. ఈ చర్యకు పాల్పడిన వ్యక్తి హుబ్లీకి చెందిన కంపెనీ మాజీ మహిళా ఉద్యోగి అని తెలిసింది. ఆమె కోసం పోలీసులు వెతుకుతున్నట్లు సమాచారం. కంపెనీ గతంలో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించడం వల్ల ఈ పని చేసి ఉంటుందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: రెండు హోటల్స్ నుంచి ఏడు దేశాలకు.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించిన ఒబెరాయ్ ఈ ఏడాది మేలో ఒకసారి గుర్తుతెలియని వ్యక్తి హైదరాబాద్లోని టిసిఎస్ కొండాపూర్ క్యాంపస్కి ఫోన్ చేసి బాంబ్ పెట్టినట్లు బెదిరించాడు. దీంతో అక్కడ పనిచేసే సుమారు 1500 మంది ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. కానీ ఇది ఫేక్ కాల్ అని తెలుసుకున్న తరువాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ సంఘటన తరువాత మళ్ళీ ఇప్పుడు బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. -
ప్రపంచ టాప్ 10 కంపెనీలు ఇవే..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కంపెనీల మార్కెట్ క్యాపిటల్ ఆధారంగా వాటి విలువ మారుతుంది. 2023 సంవత్సరానికిగాను సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ను బట్టి ప్రపంచంలో టాప్ 10 కంపెనీలను సూచిస్తూ ఫోర్బ్స్ కథనం ప్రచురించింది. కంపెనీల ర్యాంకును అనుసరించి కిందివిధంగా ఉన్నాయి. 1. యాపిల్ సెక్టార్: టెక్నాలజీ మార్కెట్ క్యాపిటల్: రూ.230 లక్షల కోట్లు. సీఈఓ: టిమ్కుక్ కంపెనీ ప్రారంభం: 1976 ప్రధాన కార్యాలయం: యూఎస్ఏ 2. మైక్రోసాఫ్ట్ సెక్టార్: టెక్నాలజీ మార్కెట్ క్యాపిటల్: రూ.214 లక్షల కోట్లు. సీఈఓ: సత్యనాదెళ్ల కంపెనీ ప్రారంభం: 1975 ప్రధాన కార్యాలయం: యూఎస్ఏ 3. సౌదీ అరమ్కో సెక్టార్: ఆయిల్ అండ్ గ్యాస్ మార్కెట్ క్యాపిటల్: రూ.177 లక్షల కోట్లు. సీఈఓ: అమిన్ హెచ్.నజెర్ కంపెనీ ప్రారంభం: 1933 ప్రధాన కార్యాలయం: సౌదీ అరేబియా ఇదీ చదవండి: పండగ ఆఫర్లు.. ఇవి పాటిస్తే డబ్బు ఆదా! 4. ఆల్ఫాబెట్(గూగుల్) సెక్టార్: టెక్నాలజీ మార్కెట్ క్యాపిటల్: రూ.133 లక్షల కోట్లు. సీఈఓ: సుందర్ పిచాయ్ కంపెనీ ప్రారంభం: 1998 ప్రధాన కార్యాలయం: యూఎస్ఏ 5. అమెజాన్ సెక్టార్: ఈ కామర్స్ మార్కెట్ క్యాపిటల్: రూ.116 లక్షల కోట్లు. సీఈఓ: యాండీ జెస్సీ ఫౌండర్: జెఫ్బెజోస్ కంపెనీ ప్రారంభం: 1994 ప్రధాన కార్యాలయం: యూఎస్ఏ 6. ఎన్విడియా సెక్టార్: టెక్నాలజీ మార్కెట్ క్యాపిటల్: రూ.83 లక్షల కోట్లు. సీఈఓ: జెన్సన్ హువాంగ్ కంపెనీ ప్రారంభం: 1993 ప్రధాన కార్యాలయం: యూఎస్ఏ 7. మెటా ప్లాట్ఫామ్స్(పేస్బుక్) సెక్టార్: సోషల్ మీడియా మార్కెట్ క్యాపిటల్: రూ.65 లక్షల కోట్లు. సీఈఓ: మార్క్ జూకర్బర్గ్ కంపెనీ ప్రారంభం: 2004 ప్రధాన కార్యాలయం: యూఎస్ఏ ఇదీ చదవండి: ఆ ఫోన్ నంబర్లు మళ్లీ మూడు నెలలకే యాక్టివేట్ 8. బెర్క్షైర్ హాత్వే సెక్టార్: ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ క్యాపిటల్: రూ.63 లక్షల కోట్లు. సీఈఓ: వారెన్బఫెట్ కంపెనీ ప్రారంభం: 1839 ప్రధాన కార్యాలయం: యూఎస్ఏ 9. టెస్లా సెక్టార్: ఆటోమోటివ్ మార్కెట్ క్యాపిటల్: రూ.57 లక్షల కోట్లు. సీఈఓ: ఎలాన్మస్క్ కంపెనీ ప్రారంభం: 2003 ప్రధాన కార్యాలయం: యూఎస్ఏ 10. ఎలి లిల్లి సెక్టార్: ఫార్మాసూటికల్స్ మార్కెట్ క్యాపిటల్: రూ.45 లక్షల కోట్లు. సీఈఓ: డేవిడ్ ఏ.రిక్స్ కంపెనీ ప్రారంభం: 1876 ప్రధాన కార్యాలయం: యూఎస్ఏ -
‘కర్ణాటక’ కుట్రపై అధికారుల అలర్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాద్లోని పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలను బెంగళూరుకు తరలించుకెళ్లేందుకు కర్ణాటక ప్రభుత్వం కుట్రలకు తెరతీసిందన్న ప్రచారంపై రాష్ట్ర అధికారులు దృష్టి పెట్టి తెలిసింది. సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరును తలదన్నేలా హైదరాబాద్ దూసుకెళ్తుండటం, ఐటీ రంగంలో అవకాశాలు సన్నగిల్లుతుండటం, పారిశ్రామికంగానూ దెబ్బతిన్న క్రమంలో కర్నాటక ప్రభుత్వం ఈ వ్యవహారానికి తెరలేపిందన్న ప్రచారంపై ఫోకస్ చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించి కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్ ఇటీవల ఫాక్స్కాన్ సహా పలు ప్రముఖ కంపెనీలకు లేఖ రాసినట్టుగా ఆ రాష్ట్రంలోని పలు ఆంగ్ల, స్థానిక పత్రికల్లో కథనాలు రావడం, ఈ అంశాలు సోషల్ మీడియాలోనూ వైరల్ కావడాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఎన్నికల సమయమే అదనుగా.. బెంగళూరులో మౌలిక వసతుల కల్పనలో పురోగతి లేకపోవడం, ట్రాఫిక్, సరైన మంచినీటి సౌకర్యం లేకపోవడం, రహదారులు అస్తవ్యస్తంగా మారడం, తీవ్ర కరెంటు సంక్షోభంపై బడా పారిశ్రామికవేత్తలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కర్ణాటక స్థానిక పత్రికలు పేర్కొంటున్నాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. బయోకాన్ చైర్మన్ కిరణ్ మజుందార్షా, ఖాతాబుక్ స్టార్టప్ సీఈవో రవీశ్ నరేశ్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన మోహన్దాస్ తదితరులు బెంగళూరు మౌలిక వసతులపై పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారని.. ఇదే సమయంలో హైదరాబాద్లోని వసతులను ప్రశంసించారని అంటున్నాయి. ఈ క్రమంలోనే కర్నాటక ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన కీన్స్ కంపెనీ సీఈవో రాజేశ్ శర్మ.. బెంగళూరులో ఏర్పాటు చేయతలపెట్టిన తమ కంపెనీని హైదరాబాద్ను మార్చాలని నిర్ణయించుకున్నారని పేర్కొంటున్నాయి. ఇదే సమయంలో ఐటీ ఉద్యోగులు కూడా హైదరాబాద్–బెంగళూరు వసతులను పోలుస్తూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తున్నారని అంటున్నాయి. గతంలోని అంశాలను ప్రస్తావిస్తూ.. గతంలోనూ కర్ణాటక ప్రభుత్వం హైదరాబాద్ నుంచి కంపెనీలను తమ వైపు తిప్పుకొనేలా ప్రయతి్నంచిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని అధికారులు చెప్తున్నారు. ఈ ఏడాది మార్చి 1న టీ–వర్క్స్ ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంగా సీఎం కేసీఆర్తో భేటీ అయిన ఫాక్స్కాన్ సీఈవో యంగ్లీ యూ.. త్వరలో తెలంగాణలో రూ.3వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని, తద్వారా ఇక్కడ లక్ష ఉద్యోగాల కల్పన జరుగుతుందని ప్రకటించారని గుర్తు చేస్తున్నారు. ఆ మరునాడే ఫాక్స్కాన్ తెలంగాణలో కాకుండా బెంగళూరులో పెట్టుబడులు పెట్టబోతోందంటూ సోష ల్ మీడియాలో వైరల్ చేశారని పేర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై.. ఫాక్స్కాన్తో సీఈవోతో మాట్లాడటంతో, తెలంగాణలోనే పెట్టుబడులు పెడుతున్నామంటూ మార్చి 6న ఫాక్స్కాన్ సీఈవో లేఖ రాశారని గుర్తు చేస్తున్నాయి. కోడై కూస్తున్న కన్నడ పత్రికలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రెండు నెలలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంతోపాటు రాజకీయ పారీ్టలు కూడా ఎన్నికలపైనే దృష్టి సారించాయని.. దీన్ని సావకాశంగా తీసుకుని పరిశ్రమలను బెంగళూరుకు తరలించుకునేందుకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయతి్నస్తోందని కన్నడ పత్రికల్లో కథనాలు వస్తున్నాయని అంటున్నారు. బెంగళూరు కోల్పోయిన ప్రభను తెచ్చేందుకు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రి ఎంబీ పాటిల్ ఇటీవల జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు లేఖలు రాశారని సదరు పత్రికలు పేర్కొంటున్నాయని చెప్తున్నారు. బెంగళూరుకు వస్తే అనేక ప్రోత్సాహకాలు ఇస్తామంటూ ఆశచూపుతున్నా రని.. తెరపై ఫాక్స్కాన్కు రాసిన లేఖ కనిపిస్తు న్నా, ఇలా మరెన్ని కంపెనీలకు లేఖలు రాశారన్నది తెలియాల్సి ఉందని సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతోందని అంటున్నారు. ఊహకందని రీతిలో పురోగతితో.. హైదరాబాద్ గత పదేళ్లలో ఐటీ, ఐటీఈఎస్తోపాటు పారిశ్రామికంగానూ ఊహించని రీతిలో పురోగతి సాధిస్తోందని.. టీఎస్ ఐపాస్తో పరిశ్రమల ఏర్పాటు సరళీకృతమై బడా కంపెనీలు వస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. మౌలిక వసతుల కల్పన, 24 గంటల కరెంటు, పుష్కలమైన నీటి సరఫరా, రవాణా వ్యవస్థ, తెలంగాణ ప్రభుత్వ ప్రగతిశీల చర్యలతో అంతర్జాతీయ ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లు ఇక్కడ కొలువుదీరాయని అంటున్నారు. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, గూగుల్, మైక్రాన్ వంటి దిగ్గజ కంపెనీలు ఇక్కడ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్యాంపస్లను ఏర్పాటు చేసుకున్నాయని.. తెలంగాణ ప్రభుత్వ చొరవతో హైదరాబాద్ ఐటీ రంగం గణనీయ వృద్ధి సాధించిందని వివరిస్తున్నారు. పదేళ్లలో ఐటీ ఎగుమతులు సుమారు రూ.53 వేల కోట్ల నుంచి ఏకంగా రూ.2.41 లక్షల కోట్లకు.. ఐటీ ఉద్యోగుల సంఖ్య మూడు లక్షల నుంచి దాదాపు పది లక్షలకు చేరాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కర్నాటక తాజా కుట్రలకు తెరతీసినట్టు ప్రచారం జరుగుతోందని పేర్కొంటున్నారు. -
ఇలాంటి కష్టం ఎవరికీ రాకూడదు! 18 ఏళ్ల అనుభవం.. అయినా..
2023 ప్రారంభం నుంచి ఐటీ సంస్థల ఆదాయం తగ్గడంతో.. ఖర్చులను తగ్గించుకోవడానికి వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం మొదలుపెట్టాయి, ఇప్పటికీ తొలగిస్తూనే ఉన్నాయి. ఒక వైపు ఆర్ధిక మందగమనం.. మరోవైపు ఊడిపోతున్న ఉద్యోగాల మధ్య టెక్ ఉద్యోగులు చాలా ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు . ఐటీ కంపెనీలు ఇప్పటికి లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి. ఇందులో కేవలం ఫ్రెషర్స్ మాత్రమే కాకుండా కొన్ని ఏళ్లుగా సంస్థలకు సేవలందిస్తున్న ఉద్యోగులు కూడా ఉన్నారు. సెప్టెంబర్లో గ్లోబల్ రిక్రూటింగ్ టీమ్ నుంచి వందలాది మంది ఉద్యోగుల్ని గూగుల్ తొలగించింది. ఇందులో ఏకంగా 18 సంవత్సరాలు కంపెనీలో పనిచేసిన 'రీటా' కూడా ఉండటం గమనార్హం. గూగుల్లో మేనేజర్గా పనిచేసిన రీటా 18 ఏళ్లుగా గూగుల్ సంస్థకు సేవలందించినట్లు, ఇటీవలే ఉద్యోగం పోయినట్లు లింక్డ్ఇన్లో షేర్ చేసింది. అంతే కాకుండా హెచ్ఆర్, టాలెంట్ అక్విజిషన్, కెరీర్ డెవలప్మెంట్ రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: వచ్చే ఏడాది ఈ రంగాల్లో 9.8 శాతం జీతాలు పెరగనున్నాయ్.. ప్రముఖ దిగ్గజ సంస్థలు ఉద్యోగులను తొలగించడం, వారు సోషల్ మీడియాలో భావోద్వేగాలను పంచుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది ఉద్యోగులను తొలగించిన కంపెనీల జాబితాలో గూగుల్ మాత్రమే కాకుండా అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా, ట్విట్టర్ ఇలా ప్రముఖ ఐటీ దిగ్గజాలు కూడా ఉన్నాయి. -
వచ్చే ఏడాది ఈ రంగాల్లో 9.8 శాతం జీతాలు పెరగనున్నాయ్..
2024లో భారతీయ ఉద్యోగుల జీతాలు పెరగనున్నట్లు 'డబ్ల్యుటీడబ్ల్యు శాలరీ బడ్జెట్ ప్లానింగ్ రిపోర్ట్' (WTW Salary Budget Planning Report) వెల్లడించింది. వచ్చే ఏడాది ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అధికంగా జీతాల పెంపు భారతదేశంలోనే జరగబోతోందని కూడా నివేదికలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతీయ ఉద్యోగుల జీతం 2024లో 9.8 శాతం పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ 2024లో భారతీయ కంపెనీలు ఉద్యోగుల జీతాలను పెంచడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. భారతీయ సంస్థలు టెక్నాలజీ వైపు వేగంగా అడుగులు వేస్తున్న క్రమంలో, ఉద్యోగుల ప్రతిభకు తీవ్రమైన పోటీ ఏర్పడుతుంది, తద్వారా జీతాల పెరుగుదల జరుగుతుంది. 2024లో ఉద్యోగుల జీతం వియత్నాంలో 8%, చైనా 6%, ఫిలిప్పీన్స్ 5.7%, థాయిలాండ్ 5% వరకు పెరగనుంది. ఈ దేశాలతో పోల్చితే భారత్ (9.8%) ముందు వరుసలో ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఇదీ చదవండి: 81.5 కోట్ల భారతీయుల ఆధార్ వివరాలు లీక్ - అమ్మడానికి సిద్దమైన హ్యాకర్! రాబోయే రోజుల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (61%), ఇంజనీరింగ్ (59.8%), సేల్స్ (42.9%), టెక్నికల్ స్కిల్స్ ట్రేడ్ (38.6%), ఫైనాన్స్ (11.8%) ), మార్కెటింగ్ (10.6%), హ్యూమన్ రీసోర్స్ (3.1%) విభాగాల్లో ఉద్యోగాలు, జీతాలు పెరగనున్నాయి. అంతే కాకుండా టెక్నాలజీ, మీడియా, గేమింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, రిటైల్ రంగాల్లో కూడా జీతాలు పెరుగుదల ఉంటుంది. -
విదేశాల్లో డైరెక్ట్ లిస్టింగ్కు గ్రీన్ సిగ్నల్..
న్యూఢిల్లీ: భారతీయ కంపెనీలు విదేశీ ఎక్స్చెంజీలలో నేరుగా లిస్టయ్యేందుకు మార్గం సుగమం చేస్తూ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం కంపెనీల చట్టంలో సంబంధిత సెక్షన్ 5ని నోటిఫై చేసింది. దీని ప్రకారం నిర్దిష్ట తరగతులకు చెందిన పబ్లిక్ కంపెనీలు .. ఆమోదయోగ్యమైన కొన్ని విదేశీ స్టాక్ ఎక్స్చెంజీలలో తమ షేర్లను లిస్ట్ చేసుకోవచ్చు. అయితే, ఈ సెక్షన్కు సంబంధించిన నిబంధనలను ఇంకా నోటిఫై చేయాల్సి ఉంది. విదేశాల్లో లిస్టింగ్ కోసం విదేశీ మారక నిర్వహణ చట్టం మొదలైన వాటిని కూడా సవరించాల్సి ఉంటుందని న్యాయ సేవల సంస్థ సిరిల్ అమర్చంద్ మంగళ్దాస్ పార్ట్నర్ యష్ అషర్ తెలిపారు. తాజా పరిణామంతో పెట్టుబడుల సమీకరణకు దేశీ కంపెనీలకు మరో మాధ్యమం అందుబాటులోకి వచ్చినట్లవుతుందని పేర్కొన్నారు. అయితే, వ్యాల్యుయేషన్లను అంతర్జాతీయ ఇన్వెస్టర్లు లెక్కగట్టే విధానం, విదేశాల్లో లిస్టింగ్ వల్ల వాణిజ్యపరంగా ఒనగూరే ప్రయోజనాలు మొదలైన వాటన్నింటినీ కంపెనీలు మదింపు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం దేశీ కంపెనీలు అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ (ఏడీఆర్), గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్ (జీడీఆర్) రూపంలో విదేశాల్లో లిస్టవుతున్నాయి. 2020 మే నెలలో కోవిడ్ ఉపశమన ప్యాకేజీలో భాగంగా భారతీయ సంస్థలు విదేశాల్లో నేరుగా లిస్టయ్యేందుకు అనుమతించే ప్రతిపాదనను కేంద్రం తెరపైకి తెచ్చింది. సదరు సంస్థలు ప్రపంచ మార్కెట్ల నుంచి పెట్టుబడులను సమీకరించుకునేందుకు తోడ్పా టు అందించేలా దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు జూలై 28న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. పటిష్టమైన మనీలాండరింగ్ నిబంధనలు అమలయ్యే ఎన్వైఎస్ఈ, నాస్డాక్, ఎల్ఎస్ఈ మొదలైన పది ఎక్సే్చంజీలను పరిశీలించవచ్చని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రతిపాదించింది. -
ఐపీవోకు మూడు కంపెనీలు రెడీ
న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా కళకళలాడుతున్న ప్రైమరీ మార్కెట్లు పలు అన్లిస్టెడ్ కంపెనీలకు జోష్నిస్తున్నాయి. దీంతో తాజాగా మూడు కంపెనీలు పబ్లిక్ ఇష్యూ బాట పట్టాయి. ఇండో ఫామ్ ఎక్విప్మెంట్, విభోర్ స్టీల్ ట్యూబ్స్, సరస్వతీ శారీ డిపో.. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్లను దాఖలు చేశాయి. తద్వారా నిధుల సమీకరణ ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్కు అనుమతిని కోరుతున్నాయి. ఇండో ఫామ్ ఐపీవోలో భాగంగా ఇండో ఫామ్ ఎక్విప్మెంట్ 1.05 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. వీటితోపాటు మరో 35 లక్షల షేర్లను సైతం కంపెనీ ప్రమోటర్ రణ్బీర్ సింగ్ ఖడ్వాలియా విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను పిక్ అండ్ క్యారీ క్రేన్ల తయారీ సామర్థ్యాన్ని విస్తరించేందుకు పెట్టుబడులుగా వినియోగించనుంది. అంతేకాకుండా రుణ చెల్లింపులు, ఎన్బీఎఫ్సీ అనుబంధ సంస్థ బరోటా ఫైనాన్స్కు మూలధనాన్ని సమకూర్చేందుకు సైతం వెచ్చించనుంది. కంపెనీ ప్రధానంగా ట్రాక్టర్లు, పిక్ అండ్ క్యారీ క్రేన్లతోపాటు ఇతర వ్యవసాయ సంబంధ పరికరాలను తయారు చేస్తోంది. విభోర్ స్టీల్ వివిధ భారీ ఇంజినీరింగ్ పరిశ్రమల్లో వినియోగించే స్టీల్ పైపులు, ట్యూబుల తయారీ, ఎగుమతుల కంపెనీ విభోర్ స్టీల్ ట్యూబ్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 66.47 కోట్ల విలువైన ఈక్విటీని జారీ చేయనుంది. నిధులను వర్కింగ్ క్యాపిటల్సహా.. సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. సరస్వతీ శారీ మహిళా దుస్తుల టోకు మార్కెట్ కార్యకలాపాలు నిర్వహించే సరస్వతీ శారీ డిపో ఐపీవోలో భాగంగా 72.45 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. వీటికి జతగా మరో 35.55 లక్షల షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. చీరలతోపాటు కుర్తీ, డ్రెస్ మెటీరియల్స్, లెహంగాలు తదితర మహిళా దుస్తుల హోల్సేల్ బిజినెస్నూ కంపెనీ నిర్వహిస్తోంది. -
వాహన స్క్రాపేజీ పాలసీ: కంపెనీలకు నితిన్ గడ్కరీ కీలక సూచనలు
న్యూఢిల్లీ: కాలం చెల్లిన పాత వాహనాలను తుక్కుగా మార్చే (వాహన స్క్రాపేజీ) విధానానికి మద్దుతగా నిలవాలని ఆటోమొబైల్ పరిశ్రమ, భాగస్వాములు అందరికీ కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు. ఇది అందరి విజయానికి దారితీసే విధానమని పేర్కొన్నారు. పరిశ్రమ భాగస్వాములతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. 15-20 ఏళ్ల జీవిత కాలం ముగిసిన వాహనాలను తొలగించి, కొత్త వాటి కొనుగోలును ప్రోత్సహించడమే ఈ విధానం లక్ష్యమని తెలిపారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన రహదారుల నిర్మాణం, వాహనాల విద్యుదీకరణ, వాహనాల ఫిట్నెస్ టెస్టింగ్ను తప్పనిసరి చేయడం తదితర చర్యలతో వాహనాలకు స్థిరమైన బలమైన డిమాండ్ను నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్టు గడ్కరీ పేర్కొన్నారు. ఆటోమొబైల్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులు (ఓఈఎంలు) తయారీని పెంచుకోవడం ద్వారా ప్రపంచంలో అతిపెద్ద ఆటోపరిశ్రమగా అవతరించేందుకు కృషి చేయాలని కోరారు. వాహన స్కాప్రేజీతో పరిశ్రమే ఎక్కువ ప్రయోజనం పొందుతుందని గుర్తు చేశారు. కనుక మూడు స్తంభాలను నిర్మించేందుకు పరిశ్రమ ముందుకు రావాలన్నారు. ఆటోమేటెడ్ టెస్టింగ్ కేంద్రాలు, వాహన తుక్కు కేంద్రాల ఏర్పాటుపై పెట్టుబడులు పెట్టాలని పరిశ్రమను కోరారు. నూతన విధానంతో కలిగే ప్రయోజనాలపై పౌరుల్లో అవగాహన పెంచేందుకు తమ డీలర్ నెట్వర్క్ను ఉపయోగించుకోవాలని సూచించారు. వాహనాన్ని తుక్కుగా మార్చుకునేందుకు ముందుకు వచ్చే వినియోగదారులకు డిస్కౌంట్ ఇవ్వాలని కోరారు. -
అతి నియంత్రణ అనర్ధదాయకం..
న్యూఢిల్లీ: ఓవర్–ది–టాప్ (ఓటీటీ) సర్విసులని, మరొకటని ఇంటర్నెట్ సేవలను వేర్వేరుగా వర్గీకరిస్తూ ’అతిగా నియంత్రించడం’ అనర్ధదాయకంగా మారే ప్రమాదముందని స్టార్టప్లు ఆందోళన వ్యక్తం చేశాయి. దీనివల్ల వివిధ రకాల సేవలు అందించే సంస్థలు వివక్షకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చైర్మన్ పీడీ వాఘేలాకు 129 అంకుర సంస్థల వ్యవస్థాపకులు ఈ మేరకు సంయుక్త లేఖ రాశారు. జిరోధాకు చెందిన నితిన్ కామత్, పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తదితరులు వీరిలో ఉన్నారు. ఓటీటీలు భారీగా డేటాను వినియోగిస్తుండటం వల్ల తమ నెట్వర్క్లపై భారం పెరిగిపోతోందని, వ్యయాలను భర్తీ చేసుకునేందుకు సదరు ఓటీటీ సంస్థల లాభాల్లో కొంత వాటా తమకూ ఇప్పించాలని టెల్కోలు కోరుతున్న నేపథ్యంలో స్టార్టప్ల లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. స్పీడ్, లభ్యత, వ్యయాలపరంగా ఏ యాప్పైనా టెలికం, ఇంటర్నెట్ సేవల ప్రొవైడర్లు వివక్ష చూపకుండా తటస్థంగా వ్యవహరించే నెట్ న్యూట్రాలిటీ విధానానికే తమ మద్దతని లేఖలో స్టార్టప్ల వ్యవస్థాపకులు తెలిపారు. ఓటీటీ వంటి సర్విసులు అందించే సంస్థలను టెలికమ్యూనికేషన్స్ సర్వీస్ ప్రొవైడర్స్ (టీఎస్పీ) నియంత్రణ వ్యవస్థ పరిధిలోకి తేవడానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఇంటర్నెట్ యాప్స్, సర్విసులకు టెలికం లైసెన్సింగ్ నిబంధనలను వర్తించేస్తే దేశీ స్టార్టప్ వ్యవస్థకు తీవ్ర హాని జరుగుతుందని వివరించాయి. ఇవన్నీ కూడా బడా బహుళజాతి సంస్థలకే లబ్ధి చేకూరుస్తాయని అంకుర సంస్థల వ్యవస్థాపకులు లేఖలో తెలిపారు. -
రామోజీ సృష్టించిన మాయా ప్రపంచమే మార్గదర్శి
అతిపెద్ద కార్పొరేట్ మోసం మార్గదర్శి చిట్ఫండ్స్ దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ మోసానికి పాల్పడిందని సీఐడీ తేల్చింది. మార్గదర్శి చిట్ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో ఏ–1గా ఉన్న చెరుకూరి రామోజీరావు, ఏ–2 శైలజా కిరణ్లపై ఇప్పటికే కేసు నమోదు చేసింది. చిట్ఫండ్ చట్టానికి విరుద్ధంగా చందాదారుల డబ్బులను మళ్లించి అనుబంధ సంస్థల్లో పెట్టిన పెట్టుబడులపై కొరడా ఝళిపించింది. ప్రధానంగా మార్గదర్శి చిట్ఫండ్స్కు ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయా ఎంటర్ ప్రైజస్లో ఉన్న వాటాలను అటాచ్ చేసింది. రామోజీరావు వ్యాపార సామ్రాజ్యంలో ఇవే ప్రధాన విభాగాలు కావడం గమనార్హం. మార్గదర్శిలో ఏ ఏ అవకతవకలు.? - ఆదాయపు పన్ను శాఖ చట్టానికి వ్యతిరేకంగా అక్రమ నగదు లావాదేవీలు - మార్గదర్శి పేరిట చట్ట వ్యతిరేక ఆర్థిక లావాదేవీలు - ఖాతాదారులకు రూ.కోట్లలో బకాయిలు - బ్యాంకు అకౌంట్ల నిర్వహణలో అక్రమాలు - చిట్ ఫండ్ ఖాతాదారుల నుంచి అక్రమ డిపాజిట్లు (డిపాజిట్లకు అనుమతి లేదు) - ఖాతాదారులకు తెలియకుండానే చిట్ నుంచి డిపాజిట్లుగా మార్పు మ్యూచువల్ ఫండ్స్, ఇతర సంస్థల్లో పెట్టుబడులు మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా మళ్లించింది రామోజీ సంస్థ. మార్గదర్శి చిట్ఫండ్స్ వివిధ మ్యూచువల్ ఫండ్స్, ఇతర ఆర్థిక సంస్థల్లో పెట్టిన పెట్టుబడులు రూ.1,035 కోట్లను ఇప్పటికే అటాచ్ చేసింది. ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్లో ఉన్న 88.50 శాతం వాటాతోపాటు ఉషోదయ ఎంటర్ ప్రైజెస్లో 44.55 శాతం వాటా అటాచ్ అయింది. చదవండి: Nara Lokesh: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14 రెండు కేసుల్లో చార్జ్షీట్లు దాఖలు చిట్ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘించిన మార్గదర్శి చిట్ఫండ్స్పై సీఐడీ ఏడు కేసులు నమోదు చేసింది. వాటిలో రెండు కేసుల్లో న్యాయస్థానంలో చార్జ్షీట్లు కూడా దాఖలు చేసింది. ఏ–1 చెరుకూరి రామోజీరావు, ఏ–2 శైలజా కిరణ్, ఏ–3 మార్గదర్శి చిట్ఫండ్స్ మేనేజర్లు (ఫోర్మెన్)తోపాటు మొత్తం 15 మందిపై క్రిమినల్ కుట్ర, మోసం, నిధుల దుర్వినియోగం, విశ్వాస ఘాతుకానికి పాల్పడటం, రికార్డులను తారుమారు చేయడం తదితర నేరాలతోపాటు ఏపీ డిపాజిట్దారుల హక్కుల పరిరక్షణ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. చందాదారులకు తెలియకుండా.. న్యాయస్థానం కళ్లుగప్పి మార్గదర్శి చిట్ఫండ్స్కు చెందిన 23 చిట్టీ గ్రూపుల మూసివేతకు సంబంధించి రాష్ట్ర చిట్ రిజిస్ట్రార్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొందరు పిటిషన్లు దాఖలు చేయడం వెనుక లోగుట్టు బయటపడింది. న్యాయస్థానంలో పిటిషన్లు వేసిన కొందరు చందాదారులకు అసలు తమ పేరుతో అవి దాఖలైన విషయమే తెలియదని వెల్లడైంది. కొన్ని పత్రాలపై చందాదారుల సంతకాలు తీసుకుని రామోజీ తరపు మనుషులే పిటిషన్లు దాఖలు చేసినట్టు తేలింది. తమ పేరిట పిటిషన్లు దాఖలైన విషయమే తెలియదని పలువురు ఇప్పటికే వెల్లడించారు. అది న్యాయస్థానాన్ని మోసం చేయడం కిందకే వస్తుందని CID స్పష్టం చేసింది. దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఎవరైనా పత్రాలు అందచేసి సంతకాలు చేయాలని కోరితే మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారులు క్షుణ్నంగా చదవాలన్నారు. పూర్తిగా చదవకుండా సంతకాలు చేయవద్దని సూచించారు. చదవండి: Live: చంద్రబాబు కేసు అప్డేట్స్.. ఎస్టేట్ను కాపాడుకునేందుకు ఫోర్త్ ఎస్టేట్ ‘చిట్ఫండ్ చట్ట నిబంధనల అమలులో భాగంగా విజయవాడ, గుంటూరు, అనంతపురం, నర్సరావుపేట, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నంలలోని చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు మార్గదర్శి కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. పలు ఉల్లంఘనలను, అక్రమాలను గుర్తించారు. దీంతో మార్గదర్శి.. చిట్ మొత్తాలను నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్ ఖాతాలకు బదిలీ చేసింది. సెక్యూరిటీ ముసుగులో డిపాజిట్లు ఆమోదించింది. బ్యాలెన్స్ షీట్లను కూడా సమర్పించలేదు. దీంతో రిజిస్ట్రార్లు సీఐడీ అదనపు డీజీకి ఫిర్యాదులు ఇచ్చారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా మార్గదర్శి చిట్ఫండ్స్, రామోజీరావు, కిరణ్, శైలజా కిరణ్ తదితరులపై కేసులు నమోదు చేశారు. దీన్ని భరించలేని రామోజీరావు తదితరులు మీడియా ముసుగులో ఈనాడులో తప్పుడు కథనాలతో సీఐడీపై విషం చిమ్మారు. తమ ఎస్టేట్ను కాపాడుకునేందుకు ఫోర్త్ ఎస్టేట్ను వాడుకుంటున్నారు. వారి అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయన్న దుగ్దతోనే ఇదంతా చేశారు. కర్త, కర్మ, క్రియ రామోజీరావే ‘మార్గదర్శి చిట్ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్తో పాటు ఉషోదయ ఎంటర్ప్రైజెస్, ఉషాకిరణ్ మూవీస్, కలోరమా ప్రింటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తదితరాలకు రామోజీరావే కర్త, కర్మ, క్రియ. ప్రజల నాడిని, మనస్సులను ఆయనకు కావాల్సిన విధంగా మార్చగలనని రామోజీరావు భావిస్తుంటారు. వ్యవస్థల మనోస్థైర్యాన్ని దెబ్బతీసి, దాని పేరు ప్రతిష్టలను మంటగలపడాన్ని రామోజీరావు తదితరులు పిల్లాటగా భావిస్తుంటారు. వారి ప్రయోజనాలకు అతికేలా, ప్రతిష్టాత్మక సంస్థ సీఐడీపై తప్పుడు, పరువు నష్టం కలిగించే ఈనాడులో కథనాన్ని ప్రచురించారు. సీఐడీపై యుద్ధం ప్రకటించారు. రామోజీరావు, ఆయన కుమారుడు, కోడలిని రక్షించేందుకు మిగిలిన నిందితులు సాయం చేశారు. -
ఫీడ్ ధరలకు ముకుతాడు
సాక్షి, అమరావతి: రొయ్య రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అండగా నిలుస్తోంది. తాజాగా రొయ్యల మేత (ఫీడ్) ధరలు పెంచేందుకు కంపెనీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) రంగంలోకి దిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఫీడ్ ధర టన్నుకు రూ.103 నుంచి రూ.256 వరకు పెంచుతూ సీపీఎఫ్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలను తక్షణమే అమలు చేయాలంటూ డిస్ట్రిబ్యూటర్లకు ఆదేశాలు సైతం జారీ చేసింది. సీపీఎఫ్ బాటలోనే మిగిలిన కంపెనీలు కూడా ధరల పెంచేందుకు సిద్ధమయ్యాయి. ఈ విషయాన్ని రొయ్య రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అప్సడా సీపీఎఫ్ కంపెనీ ప్రతినిధులతో చర్చించింది. పెంచిన ధరలను ఉపసంహరించుకునేలా చర్యలు చేపట్టింది. ప్రభుత్వంతో చర్చించకుండా ధరలు పెంచొద్దని ఫీడ్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మిగిలిన అన్ని కంపెనీలు ధరల పెంపుదల నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాయి. తాజాగా ధరల పెంపు ఉపసంహరణ ఫలితంగా కిలో రొయ్యల ఉత్పత్తిపై రూ.4.50 చొప్పున భారం తగ్గింది. గతంలోనూ ధరల పెంపును అడ్డుకున్న ప్రభుత్వం ప్రస్తుతం మేత కోసం ప్రతి రైతు కిలో రొయ్యల ఉత్పత్తికి రూ.90 వరకు ఖర్చు చేస్తున్నారు. ఏటా ఫీడ్ అమ్మకాల ద్వారా రూ.12,600 కోట్ల టర్నోవర్ జరుగుతోంది. గతంలో ఏటా కనీసం రెండు, మూడుసార్లు ఫీడ్ కంపెనీలు ధరలు పెంచేవి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీడ్ తయారీ, అమ్మకాలను సైతం అప్సడా చట్టం పరిధిలోకి తీసుకురావడంతో ఇష్టానుసారంగా ధరల పెంపునకు కళ్లెం పడింది. ప్రభుత్వ అనుమతి లేకుండా 2022 మే 19న టన్నుకు రూ.256 చొప్పున పెంచేందుకు కంపెనీలు ప్రయత్నించాయి. అంతర్జాతీయ ఒడిదుడుకులతో ఆశించిన ధర లేక సతమతమవుతున్న అప్పటి తరుణంలో రైతులపై పైసా భారం మోపడానికి వీల్లేదని ప్రభుత్వం తేల్చిచెప్పడంతో కంపెనీలు పెంపు ప్రతిపాదనలను పూర్తిగా వెనక్కి తీసుకున్నాయి. అదే రీతిలో 2022 అక్టోబర్ 13న టన్నుకు రూ.260 చొప్పున పెంచాయి. ప్రభుత్వ ఆదేశాలతో పెంచిన నాలుగు రోజులకే కంపెనీలు వెనక్కి తీసుకున్నాయి. ఇలా రెండేళ్లలో మూడుసార్లు పెంచిన ధరలను వెనక్కి తీసుకోవడంతో సగటున కిలోకు రూ.8.60 చొప్పున మేత ఖర్చుల భారం రైతులకు తగ్గింది. సీఎం జగన్ ఆదేశాలతో.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అప్సడా ఆధ్వర్యంలో సీపీఎఫ్ కంపెనీ ప్రెసిడెంట్ సహా ఇతర ఉన్నతాధికారులను పిలిపించి సమావేశం నిర్వహించాం. ధరల పెంపు ప్రతిపాదనను ఉపసంహరింప చేసుకునేలా ఆదేశాలిచ్చాం. ప్రభుత్వాదేశాలతో సీపీఎఫ్తో సహా ఇతర కంపెనీలు కూడా ధరల పెంపు ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నాయి. – వడ్డి రఘురాం, కో–వైస్ చైర్మన్, అప్సడా -
ఈ కంపెనీల్లో సంతోషంగా ఉద్యోగులు.. టాప్ 20 లిస్ట్!
Top 20 companies with happiest employees: ఏదైనా కంపెనీలో ఉద్యోగులు ఎప్నుడు సంతోషంగా ఉంటారు? పనికి తగిన జీతం, గుర్తింపు, ప్రోత్సాహం, మంచి పని వాతావరణం.. ఇవన్నీ ఉంటే ఆ కంపెనీని మంచి కంపెనీగా ఉద్యోగులు భావిస్తారు. ఇదిగో అమెరికాలో అలాంటి కంపెనీల టాప్ 20 లిస్ట్ను ప్రముఖ జాబ్ సెర్చ్ సైట్ ‘ఇన్డీడ్’ (Indeed) తాజాగా విడుదల చేసింది. అమెరికాకు చెందిన ట్రక్ స్టాప్, కన్వీనియన్స్ స్టోర్ చైన్ ‘లవ్స్ ట్రావెల్ స్టాప్స్ & కంట్రీ స్టోర్స్’ ఈ లిస్ట్లో నంబర్ 1 కంపెనీగా నిలిచింది. ఉద్యోగులు సంతోషకరంగా భావిస్తున్న టాప్ 20 కంపెనీలను ఎంపిక చేయడానికి 2022 జూలై నుంచి 2023 జులై మధ్య కాలంలో అనేక మంది ఉద్యోగుల రివ్యూలను తీసుకుంది. సంతోషం, ప్రయోజనం, సంతృప్తి, ఒత్తిడి అనే నాలుగు అంశాల్లో ఆయా కంపెనీలపై ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించింది. (Tech Jobs: టెక్ ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. ఇక రానున్నవి మంచి రోజులే..!) లవ్స్ ట్రావెల్ స్టాప్స్ & కంట్రీ స్టోర్స్ ఉద్యోగుల సంతోషం విషయంలో 100కు 80 శాతం రేటింగ్ను సాధించి టాప్ 1 కంపెనీగా నిలిచింది. ఇతర అంశాల్లోనూ సగటు స్కోర్ 69 నుంచి 71 కంటే చాలా ఎక్కువగానే సాధించింది. ఈ టాప్ 20 లిస్ట్లో అత్యధికంగా ఐటీ కంపెనీలే ఉండటం విశేషం. లిస్ట్లో ఇండియన్ కంపెనీలు అమెరికాలో ఉద్యోగులు మెచ్చిన ఇన్డీడ్ టాప్ 20 కంపెనీల లిస్ట్లో మూడు భారతీయ కంపెనీలు ఉండటం గమనార్హం. అవి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నాలుగో స్థానంలో, విప్రో (Wipro) 8వ స్థానంలో, ఇన్ఫోసిస్ (Infosys) 9వ స్థానంలో నిలిచాయి. టాప్ 20 లిస్ట్ ఇదే.. 1. లవ్స్ ట్రావెల్ స్టాప్స్ & కంట్రీ స్టోర్స్ 2. H&R బ్లాక్ 3. డెల్టా ఎయిర్ లైన్స్ 4. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 5. యాక్సెంచర్ 6. IBM 7. L3 హారిస్ 8. విప్రో 9. ఇన్ఫోసిస్ 10. నైక్ 11. వ్యాన్స్ 12. ఇన్-ఎన్-అవుట్ బర్గర్ 13. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ 14. హాల్ మార్క్ 15. మైక్రోసాఫ్ట్ 16. నార్త్రోప్ గ్రుమ్మన్ 17. FedEx ఫ్రైట్ 18. డచ్ బ్రదర్స్ కాఫీ 19. వాల్ట్ డిస్నీ కంపెనీ 20. యాపిల్ Proud to be named one of the Top 20 Companies for Work Wellbeing in the U.S. by @indeed. This award is a true testament to IBMers and our culture of openness, collaboration, and trust. https://t.co/MQfriOfKjq pic.twitter.com/FYN50lLPeo — IBM (@IBM) September 21, 2023 -
విప్రో సీఎఫ్ఓ జతిన్ దలాల్ రాజీనామా - ఆ స్థానంలో అపర్ణ అయ్యర్
విప్రో (Wipro) కంపెనీలో దాదాపు 20 సంవత్సరాలుగా ఫైనాన్సియల్ చీఫ్ ఆఫీసర్గా (CFO) సేవలందించిన జతిన్ దలాల్ గురువారం రాజీనామా చేసినట్లు తెలిసింది. ఈ స్థానంలోకి కంపెనీలో రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న 'అపర్ణ అయ్యర్'ను నియమిస్తున్నట్లు.. సెప్టెంబర్ 22నుంచి పదవి బాధ్యతలు స్వీకరించనున్నట్లు కంపెనీ తెలిపింది. గత కొన్ని సంవత్సరాలుగా ఫైనాన్స్ ట్రాన్స్ఫర్మేషన్ అపర్ణ ఇప్పుడు కొత్త బాధ్యతలు చేపట్టనుంది. గత రెండు దశాబ్దాలుగా నాకు కంపెనీలో అవకాశం కల్పించినందుకు విప్రోకు కృతజ్ఞతలు తెలుపుతూ.. నా వృత్తిపరమైన లక్ష్యాలను కొనసాగించడానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించాడు. ఇదీ చదవండి: ప్రపంచం భారత్ వైపు చూసేలా.. హ్యాపీనెస్ ర్యాంకింగ్లో ఇండియన్ ఎంప్లాయిస్.. 2022లో ట్రెజరీ మేనేజర్గా చేరిన దలాల్ అప్పటి నుంచి సీనియర్ మేనేజర్, ఇన్వెస్టర్ రిలేషన్స్, CFO - యూరప్, గ్లోబల్ హెడ్ ఆఫ్ ఫైనాన్స్, IT ఫైనాన్స్ మేనేజర్ అండ్ హెడ్ వంటి అనేక పదవుల్లో కొనసాగారు. కంపెనీ ఉన్నతిలో జతిన్ దలాల్ పాత్ర ఆమోఘనీయం అని పలువురు అభినందించారు. -
ఎంఅండ్ఎం అనుబంధ కెనడియన్ సంస్థ మూసివేత
న్యూఢిల్లీ: కెనడాలోని తమ అనుబంధ సంస్థ రెసాన్ ఏరోస్పేస్ కార్పొరేషన్ మూతబడిందని మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) వెల్లడించింది. రెసాన్ స్వచ్ఛందంగా మూసివేతకు దరఖాస్తు చేసుకోగా కార్పొరేషన్స్ కెనడా నుంచి అనుమతులు లభించినట్లు తెలిపింది. కంపెనీ లిక్విడేషన్తో అందులో తమకున్న 11.18 శాతం వాటా ప్రకారం 4.7 మిలియన్ కెనడియన్ డాలర్లు (సుమారు రూ. 28.7 కోట్లు) లభించగలవని ఎంఅండ్ఎం తెలిపింది. -
కంపెనీలు తేవడం ఆషామాషీ కాదు
సాక్షి, హైదరాబాద్ / శామీర్పేట / మర్కూక్ (గజ్వేల్): రాష్ట్రానికి కొత్త కంపెనీలు తీసుకురావడం అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కొన్నేళ్లుగా తెలంగాణకు అనేక దేశ, విదేశీ కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయంటే, దానివెనుక రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, మంత్రులు పడే శ్రమ చాలా ఎక్కువని ఆయన అన్నారు. హైదరాబాద్లోని జినోమ్ వ్యాలీలో గురువారం ఫార్మా కంపెనీ భారత్ సిరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ కర్మాగారానికి శంకుస్థాపన చేసిన మంత్రి మాట్లాడుతూ జీవశాస్త్ర రంగ అభివృద్ధికి, ప్రోత్సాహానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్న ఫలితమే కొత్త కొత్త కంపెనీల రాక అని చెప్పారు. పది ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటవుతున్న బీఎస్వీ కర్మాగారం ద్వారా మహిళల ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే ఉత్పత్తులు తయారు కానుండటం హర్షణీయమైన అంశమన్నారు. జినోమ్ వ్యాలీలో అంచనాలకు మించి వృద్ధి చెందుతోందని, ఈ నేపథ్యంలో దీనిని మరింత విస్తరించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఇప్పటికే 130 ఎకరాల భూమి అదనంగా సేకరించగా, 250 ఎకరాలతో మలిదశ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ ఉపాధ్యక్షుడు ఈవీ నరసింహారెడ్డి, తెలంగాణ లైఫ్ సైన్సెస్ సీఈఓ శక్తి నాగప్పన్, బీఎస్వీ ఎండీ, సీఈఓ సంజీవ్ నవన్గుల్ పాల్గొన్నారు. యూరోఫిన్స్ కేంద్రం ప్రారంభం బెల్జియం కేంద్రంగా పనిచేస్తున్న యూరోఫిన్స్ బయో ఫార్మా సర్విసెస్ హైదరాబాద్లోని జినోమ్ వ్యాలీలో తన కేంద్రాన్ని గురువారం ప్రారంభించింది.వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులతో సిద్ధమైన ఈ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. అంతర్జాతీయ స్థాయి ఫార్మా కంపెనీలకు బయో అనలిటికల్ సర్విసెస్, ఫార్ములేషన్ డెవలప్మెంట్, సేఫ్టీ టాక్సికాలజీ, డిస్కవరీ కెమిస్ట్రీ అండ్ డిస్కవరీ బయాలజీ వంటి సేవలు అందించే యూరోఫిన్స్ కేంద్రం 15 ఎకరాల్లో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యూరోఫిన్స్ కేంద్రం ద్వారా రానున్న కాలంలో రెండు వేల మందికిపైగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా 33 శాతం వ్యాక్సిన్లు హైదరాబాద్ జినోమ్ వ్యాలీలోనే తయారు అవుతున్నాయని, ప్రపంచానికి వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ మారిందని ఎక్కడికెళ్లినా ధైర్యంగా చెబుతానన్నారు. ఇక్కడ ఏడాదికి 900 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతున్నాయని, వచ్చే ఏడాది నుంచి 1400 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతాయని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో యూరోఫిన్స్ రీజనల్ డైరెక్టర్ నీరజ్ గార్గ్, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. -
డేటా భద్రత నిబంధనలు: తేడా వస్తే రూ. 250 కోట్ల వరకు జరిమానా
న్యూఢిల్లీ: డిజిటల్ వ్యక్తిగత డేటా భద్రత చట్ట నిబంధనలకు అనుగుణంగా తమ సిస్టమ్స్ను సరిచేసు కునేందుకు వ్యాపార సంస్థలకు కొంత సమయం ఇచ్చే అవకాశం ఉందని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఇది సుమారు ఏడాది పాటు ఉండొచ్చని పరిశ్రమ వర్గాలతో సమావేశం సందర్భంగా ఆయన విలేకరులకు చెప్పారు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఫిర్యాదుల పరిష్కారానికి అప్పీలేట్ అథారిటీ అయిన డేటా ప్రొటెక్షన్ బోర్డు (డీపీబీ)ని వచ్చే 30 రోజుల్లోగా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి తెలిపారు. డేటా భద్రత బోర్డుతో పాటు మార్గదర్శకాలు మొదలైనవన్నీ నెల రోజుల్లోగా సిద్ధం కాగలవని మంత్రి తెలిపారు. మెటా, లెనొవొ, డెల్, నెట్ఫ్లిక్స్ సహా పలు కంపెనీలకు చెందిన 125 మంది పైగా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పౌరుల వ్యక్తిగత డేటాను ఆన్లైన్ వేదికలు దుర్వినియోగం చేయకుండా కట్టడి చేసే దిశగా డేటా భద్రత చట్టాన్ని రూపొందించారు. దీనికవసరమైన 25 నియమాలలో చాలా వరకు ముసాయిదా రూపొందించబడి సిద్ధంగా ఉన్నాయని మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారి ఒకరు గతంలో చెప్పారు. సమ్మతి ఆధారిత యంత్రాంగం ద్వారా వినియోగదారుల డేటాను సేకరించడం కంపెనీలకు చట్టం తప్పనిసరి చేసింది, అయితే కొన్ని చట్టబద్ధమైన ఉపయోగాల కోసం, చట్టం కొన్ని సడలింపులను అందిస్తుంది. అమల్లో విఫలమైన సంస్థలకు రూ. 250 కోట్ల వరకు జరిమానా విధించవచ్చని చట్టంలో ప్రతిపాదనలు ఉన్నాయి. అంతేకాదు 500 కోట్లకు పెంచవచ్చని కూడా పేర్కొన్నారు. -
తొలి భారతీయ కంపెనీగా ఇన్ఫోసిస్ ఘనత: దిగ్గజ కంపెనీల ప్లేస్ ఎక్కడ?
TIME World100 Best Companies List Infosys ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ లిమిటెడ్ టైమ్ ప్రపంచంలోని 100 అత్యుత్తమ కంపెనీల లిస్ట్లో చోటు సంపాదించుకుంది. అంతేకాదు ఈ జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ సంస్థ ఇన్ఫోసిస్ మాత్రమే కావడం విశేషం. ప్రపంచ దిగ్గజ కంపెనీలకు ధీటుగా 64 వ స్థానంలో ఇన్ఫీ తనప్రత్యేకతను చాటుకుంది. అలాగే ప్రపంచంలోని తొలి మూడు ప్రొఫెషనల్ సేవల కంపెనీలలో ఒకటిగా కూడా ఇన్ఫోసి నిలిచింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తున్న కంపెనీల ర్యాంకింగ్లో మొత్తం 750 కంపెనీలను పేర్కొన్నాయి. అయితే ఇన్ఫోసిస్తో పాటు, మరో ఏడు భారతీయ కంపెనీలు 750 కంపెనీలున్న టైమ్ జాబితాలో ప్లేస్ దక్కించుకున్నాయి. టైమ్ మ్యాగజైన్ , ఆన్లైన్ డేటా ప్లాట్ఫారమ్ స్టాటిస్టా సంకలనం చేసిన 2023 ప్రపంచ అత్యుత్తమ కంపెనీల టాప్ 100 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ కంపెనీ ఇన్ఫోసిస్. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్, యాపిల్, ఆల్ఫాబెట్ (గూగుల్ మాతృసంస్థ) మెటా లాంటి టెక్ కంపెనీలు టాప్లో ఉన్నాయి. రాబడి వృద్ధి, ఉద్యోగుల సంతృప్తి సర్వేలు , పర్యావరణ హిత విధానాలు, సామాజిక , కార్పొరేట్ గవర్నెన్స్ (ESG, లేదా సుస్థిరత) డేటా ఆధారంగా ఆ ర్యాంకింగ్లను కేటాయించారు. ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపించిన తయారీదారులు, వినియోగ వస్తువుల కంపెలు, ఫాస్ట్ మూవింగ్ టెక్ ర్యాంకింగ్లున్నాయి. Infosys has been featured in TIME World’s Best Companies 2023 list. We are among the top 3 global professional services firm and the only brand from India in the Top 100 global rankings: https://t.co/Mvg9lRFxDV pic.twitter.com/dN6n0p76ZA — Infosys (@Infosys) September 14, 2023 టెక్ కంపెనీలు బాగా పనిచేశాయి. ఎందుకంటే వాటి కార్బన్ ఉద్గారాలు విమానయాన సంస్థలు, హోటళ్లు లేదా పెద్ద తయారీదారులు వంటి ముఖ్యమైన భౌతిక పాదముద్రలు కలిగిన ఇతర రకాల కంపెనీల కంటే చాలా తక్కువగా ఉన్నాయని టైమ్ పేర్కొంది. వారి ఉద్యోగులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇది కూడా వారు కూడా మంచి ర్యాంక్ను పొందడానికి కారణం. ఉద్యోగుల ర్యాంకింగ్లలో తొలి నాలుగు కంపెనీలు అత్యధిక మార్కులు పొందాయి. గత మూడేళ్లలో గణనీయ మైన లాభాలను పోస్ట్ చేసారు. వారు సామాజిక పాలన సూత్రాలకు కట్టుబడి ఉన్నారు. అలాగే ఉద్గారాలను తగ్గించడంతో కృషి, వారి వారి బోర్డులలో ఎక్కువ మంది మహిళలను నియమించడం వంటివి దోహద పడ్డాయని తెలిపింది. ఇక ఈ జాబితాలో విప్రో లిమిటెడ్ 174వ స్థానంలో, మహీంద్రా గ్రూప్ 210వ స్థానంలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 248వ స్థానంలో, హెచ్సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ 262వ స్థానంలో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 418వ స్థానంలో, WNS గ్లోబల్ సర్వీసెస్ 596వ స్థానంలో, ఐటీసీ లిమిటెడ్ 596వ స్థానంలో నిలిచాయి. -
కోవిడ్ తర్వాత కొత్త నగరాలకు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ ఢిల్లీ, ముంబై, పుణే, కోల్కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఒకప్పుడు ఇవే దేశంలో ప్రధాన ఐటీ హబ్లు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. ఐటీ కంపెనీలు రూటు మారు స్తున్నాయి. చండీగఢ్, మంగళూరు, అహ్మదా బాద్, కాన్పూర్, తిరువనంతపురం, భోపా ల్, జైపూర్, వరంగల్, విశాఖపట్నం,విజయ వాడ లాంటి నగరాలు తెరపైకి వస్తున్నాయి. కోవిడ్కు దేశంలోని కేవలం ఏడు ప్రధాన నగరాలకే పరిమితమైన సమాచార సాంకేతిక రంగం.. కోవిడ్ తదనంతర పరిణా మాల నేపథ్యంలో దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బహుళజాతి సంస్థలు నిర్వహణ వ్యయాలను గణనీయంగా తగ్గించుకోవాలని భావి స్తుండటమే ఇందుకు కారణమని ఐటీ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నగరాల్లోనే 11–15% నైపుణ్యం ఉన్న యువత ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనే 11–15 శాతం సాంకేతిక నైపుణ్యం ఉన్న యువత ఉన్నట్లు ఐటీ కంపెనీలు గుర్తించాయి. దాదాపు 60 శాతం పట్టభద్రులు ఈ పట్టణాల నుంచే ఉత్తీర్ణులు అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇలా ఉత్తీర్ణులయ్యే వారిలో 30 శాతం మేరకు ఉద్యోగాల కోసం ప్రథమ శ్రేణి నగరాలకు తరలి రావాల్సిన పరిస్థితులు ఉన్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కంపెనీలు ద్వితీయ శ్రేణి నగరాల వైపు దృష్టి సారిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. స్టార్టప్లు ఎక్కువగా ఇక్కడే.. 2022లో దాదాపు 7 వేల (39%) స్టార్టప్లు ఈ కొత్త నగరాల నుంచే ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. ఈ ఏడాదిలో 13 శాతం స్టార్టప్ కంపె నీల ఫండింగ్ ఈ ద్వితీయ శ్రేణి నగరాలకే వెళ్లినట్లు తెలిపింది. పెట్టుబ డిదారులు కూడా ప్రథమ శ్రేణి నగరాల్లోని వాటికంటే ఈ ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని సంస్థల్లో పెట్టుబడులు పెట్టడానికే ముందుకు వస్తున్నట్లుగా అధ్యయనంలో తేలినట్లు నివేదిక పేర్కొంది. కొత్త హబ్లు ఎక్కడెక్కడ? దేశంలోని ద్వితీ య, తృతీయ శ్రేణి నగరాలైన టువంటి చండీగఢ్, నాగ్పూర్, అహ్మదా బాద్, మంగళూరు, కాన్పూర్, తిరువనంతపుర, లఖ్నవూ, గౌహతి, రాంచీ, భోపాల్, జైపూర్, ఇండోర్, నాసిక్, భువనేశ్వర్, రాయ్పూర్, వరంగల్, కరీంనగర్, విశాఖపట్నం, హుబ్బళి, విజయవాడ, తిరు పతి, మైసూరు, వెల్లూరు, మధురై, తిరుచిరా పల్లి, కొచ్చి నగరాలపై ఐటీ సంస్థలు దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. తెలంగాణలోని పలు నగరాల్లో హబ్లు ఐటీ రంగాన్ని తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలకు తీసుకెళ్లాలని 2015–16 నుంచే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, మహబూబ్నగర్లలో ఐటీ హబ్లు నిర్మించారు. కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్లలో ఐటీ సంస్థలు ఇప్పటికే తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రభు త్వం చర్యలు చేపడుతోంది. త్వరలోనే నల్లగొండ, రామగుండంలోనూ ఐటీ హబ్లు ఏర్పాటు చేయ బోతున్నారు. మొత్తం మీద 2026 నాటికి 20 వేల మందికి నేరుగా ఈ పట్టణాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వికేంద్రీకరణతో సానుకూల మార్పులు ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. కేవలం ప్రధాన నగరాలు, పట్టణాలకు పరిమితం కాకుండా రెండో, మూడో శ్రేణి నగరాలు, ఇతర ప్రాంతాలకు ఐటీ పరిశ్రమ వికేంద్రీకరణ వల్ల చాలా సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. కోవిడ్ తర్వాత చాలావరకు ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేస్తున్నా మంచి ఉత్పాదకత వస్తుండటంతో కంపెనీల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. నిర్వహణ వ్యయం మరింత తగ్గించుకోవడంపై దృష్టి పెడుతున్నాయి మరోవైపు వికేంద్రీకరణ కారణంగా ఉద్యోగులకు కూడా ఇళ్ల అద్దెలు, ప్రయాణ ఖర్చులు, ఇతరత్రా ఖర్చులు తగ్గుతాయి. రాబోయే రోజుల్లో వికేంద్రీకరణ మరింత జరిగి శాటిలైట్ సెంటర్ల ద్వారా చిన్న చిన్న హబ్లు కూడా ఏర్పడబోతున్నాయి. ఇంటర్నెట్ స్పీడ్, నిరంతర కరెంట్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించగలిగితే గ్రామస్థాయి వరకు కూడా తీసుకెళ్లే అవకాశాలుంటాయి. – వెంకారెడ్డి, వైస్ ప్రెసిడెంట్, సీనియర్ హెచ్ఆర్ లీడర్, కో ఫోర్జ్ ప్రత్యామ్నాయ హబ్లు అత్యంత ఆవశ్యకం దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు ఏ విధంగా ఐటీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయన్న అంశంపై డెలాయిట్, నాస్కామ్ సంయుక్తంగా ఓ అధ్యయనం నిర్వహించి నివేదికను తయారు చేశాయి. ‘ఎమర్జింగ్ టెక్నాలజీ హబ్స్ ఇన్ ఇండియా’ పేరిట ఇది రూపొందింది. ఇప్పటివరకు ప్రధాన నగరాలకే పరిమితమైన ఐటీ రంగం ప్రస్తుతం మరో 26 నగరాలకు విస్తరించిందని ఆ నివేదిక వెల్లడించింది. ఒక్క భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు నాస్కామ్ అధిపతి సుకన్యరాయ్ తెలిపారు.కాగా ఆయా ప్రాంతాల్లో విస్తరించడానికి గల కారణాలను, అక్కడ ఉన్న అవకాశాలను, ఇతర అంశాలను వివరించింది. ఏడు ప్రధాన నగరాల్లో విస్తరించిన ఐటీ రంగంలో దాదాపు 54 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు ఆ నివేదిక స్పష్టం చేసింది. అయితే నైపుణ్యం, నిర్వహణ వ్యయం, కొత్త నైపుణ్యం ఉన్న యువతను గుర్తించి వారు ఉన్నచోటే ఉపాధి కల్పించేలా ఆ ప్రాంతాల్లోనే కార్యకలాపాలను ప్రారంభించడం ద్వారా ఎక్కువ లాభం పొందవచ్చని ఐటీ సంస్థలు భావిస్తున్నాయని నివేదిక చెబుతోంది. కోవిడ్ తరువాత ఈ వికేంద్రీకరణ వేగం పుంజుకుందని తెలిపింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాలకు ప్రత్యామ్నాయంగా ఐటీ హబ్ల ఏర్పాటు అత్యంత ఆవశ్యకమని తమ అధ్యయనంలో వెల్లడైనట్లు నాస్కామ్, డెలాయిట్ స్పష్టం చేశాయి. 2030 నాటికి నైపుణ్యం మిగులు.. దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐటీ నిపుణుల కంటే డిమాండ్ ఎక్కువగా ఉందని అంచనా వేశారు. అయితే 2030 నాటికి ఈ పరిస్థితి మారుతుందని, డిమాండ్ కంటే అధికంగా ఐటీ నిపుణులు ఉంటారని సుకన్యరాయ్ చెప్పారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఐటీ హబ్ల ఏర్పాటు వల్ల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు కూడా ఈ రంగం వైపు మళ్లే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక పలు రాష్ట్ర ప్రభుత్వాలు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఐటీ రంగం వేళ్లూనుకునేలా తగిన మౌలిక వసతుల కల్పనకు ముందుకు రావడం ఐటీ రంగానికి కలిసివచ్చే అంశమని ఐటీ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. మౌలిక వసతుల కల్పనతో నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గుతుందని, మరోవైపు భవనాల కోసం చెల్లించే అద్దె కానీ, సొంత భవనాల నిర్మాణ వ్యయం కానీ ప్రధాన నగరాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఎమర్జింగ్ సిటీస్ (కొత్త నగరాలు)లో 25 నుంచి 30 శాతం వరకు తక్కువ వేతనాలకే నిపుణులు లభిస్తుండటం, 50 శాతం వరకు తక్కువకు అద్దెకు భవనాలు లభించడం వంటి అనుకూల పరిణామాలు ఐటీ రంగం వికేంద్రీకరణకు దోహదపడుతున్నాయని నివేదిక వివరించింది. -
యూరియా కావాలా?.. ఇతర ఎరువులు కొనాల్సిందే.. కంపెనీల దోపిడి..
ఒకటి కొంటే మరొకటి ఉచితమంటూ వస్త్ర,వస్తు తయారీ కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఇది సాధారణంగా జరిగేదే. కానీ ఎరువుల కంపెనీలు మాత్రం ఇది కొంటేనే అదిస్తామంటూ షరతులు పెడుతున్నాయి. యూరియా కావాలంటే పురుగు మందులు, జింక్, కాల్షియం వంటివి కొనాలని డీలర్లపై ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో డీలర్లు రైతులపై ఇదే పద్ధతిలో ఒత్తిడి తెస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో రైతులు తమకు అవసరం లేకపోయినా యూరియాతో పాటు ఇతర ఎరువులు కొనాల్సి వస్తోంది. దీనివల్ల సాగు ఖర్చు పెరిగి రైతులు నష్టాలపాలయ్యే పరిస్థితి ఏర్పడుతోందని, ముఖ్యంగా యథేచ్ఛగా ఎరువుల వినియోగంతో ఆహార పంటలు విషతుల్యమై ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టార్గెట్లతో రూ.కోట్ల అక్రమార్జన యూరియా అందుబాటులో ఉన్నా కృత్రిమ కొరత సృష్టిస్తూ కంపెనీలు ఇతర ఎరువులను రైతులకు అంటగడుతున్నాయి. కంపెనీలు వాటి సేల్స్ మేనేజర్లకు ఇతర ఎరువులను విక్రయించే టార్గెట్లు పెట్టి మరీ యూరియాయేతర ఎరువుల అమ్మకాలు చేయిస్తున్నాయి. టార్గెట్లు పూర్తి చేసిన సేల్స్ మేనేజర్లకు నగదు ప్రోత్సాహకం ఇస్తున్నాయి. దాంతో పాటు హైదరాబాద్లో విలాసవంతమైన రిసార్టుల్లో విందులు, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాయి. కొన్నిసార్లు విదేశీ పర్యటనలకు కూడా అవకాశం కల్పిస్తున్నాయి. దీంతో వారంతా ఎరువుల డీలర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. రూ.1.10 లక్షల విలువ చేసే 445 బస్తాల యూరియా ఇవ్వాలంటే రూ.4.40 లక్షల విలువ చేసే 400 బస్తాల 20/20/013 రకం కాంప్లెక్స్ ఎరువులు కొనాలనే నిబంధన విధిస్తున్నారు. దీంతో డీలర్లు యూరియా కోసం మార్కెట్లో రైతులకు అంతగా అవసరం లేని కాంప్లెక్స్ ఎరువుల బస్తాలను కూడా కొంటున్నారు. ఇలా కంపెనీలు ఏడాదికి వందల కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం చేస్తున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. కొందరు డీలర్లు ఇందుకు నిరాకరించడంతో ఆయా ప్రాంతాల్లో రైతులు యూరియా సక్రమంగా లభించక ఇబ్బందులకు గురవుతున్నారు. రైతులను మభ్యపెడుతూ.. యూరియాతో పాటు ఫలానా ఎరువు, పురుగుమందు వాడితే ప్రయోజనం ఉంటుందని కంపెనీలు, డీలర్లు మభ్యపెడుతుండటంతో రైతులు అమాయకంగా వాటిని కొంటున్నారు. వాస్తవానికి యూరియాను ఇతర ఎరువులు, పురుగు మందులకు లింక్ పెట్టి విక్రయించకూడదన్న ఉత్తర్వులు ఉన్నాయి. జిల్లా వ్యవసాయాధికారి ఆదేశం మేరకే యూరియా కేటాయింపులు జరగాలి. కానీ డీలర్లు ఈ విధంగా లింక్ పెడుతూ ఇతర ఎరువులను బలవంతంగా అంటగడుతున్నారని తెలిసినా అధికారులు మిన్నకుంటున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. పైగా మండల వ్యవసాయాధికారి ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఎరువులను, పురుగుమందులను విక్రయించాలన్న నిబంధన ఉన్నా అది కూడా పట్టించుకోవడం లేదని అంటున్నాయి. మరోవైపు ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలను కూడా కంపెనీలు వదలడంలేదు. యూరియాలో 20 శాతం ఈ సేవా కేంద్రాలకు కేటాయించాలని ప్రభుత్వం స్పష్టం చేసినా, ఈ ఆదేశాలను తుంగలో తొక్కుతున్న కొన్ని యూరియా కంపెనీలు 20/20/013 ఎరువుల్ని తీసుకుంటేనే యూరియా ఇస్తామని చెబుతున్నాయి. ఇప్పటికైనా వ్యవసాయాధికారులు తగు చర్యలు తీసుకుని డీలర్లు ఒక ఎరువుతో మరొక ఎరువుకు లింకు పెట్టకుండా చూడాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. – సాక్షి, హైదరాబాద్ -
ఆర్టీసీకి 910 కొత్త బస్సులు
సాక్షి, హైదరాబాద్: మూడునెలల్లో ఆర్టీసీకి 910 కొత్త బస్సులు సమకూరబోతున్నాయి. చాలా కాలంగా పాతబడ్డ బస్సులతో లాక్కొస్తుండగా, వాటిల్లోంచి కొన్నింటిని తుక్కుగా మార్చేసి.. కొత్త బస్సులు అందుబాటులోకి తేవాలని సంస్థ నిర్ణయించింది. ఇప్పటికే టెండర్లు పిలవగా టాటా, అశోక్ లేలాండ్ కంపెనీలు తక్కువ కొటే షన్తో ముందుకొచ్చాయి. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి నెగోషియేషన్స్ ద్వారా వాటి కొటేషన్ మొత్తాన్ని కొంతమేర తగ్గించేందుకు ఆర్టీసీ అధి కారులు చర్చలు జరుపుతున్నారు. మరికొద్ది రో జుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి, రెండు కంపెనీలు ఒకే ధరకు ముందుకొచ్చేలా చేసి, వాటికే ఆర్డర్ ఇవ్వాలని చూస్తున్నారు. ఈ నెలలోనే కంపెనీ లకు బస్సులు ఆర్డర్ ఇస్తే...బస్ బాడీల నిర్మా ణానికి మూడు నెలల సమయం పడుతుంది. ఎక్స్ప్రెస్ బస్సులు 540 ఆర్టీసీలో బాగా డిమాండ్ ఉన్న ఎక్స్ప్రెస్ కేటగిరీని బలోపేతం చేయాలని సంస్థ నిర్ణయించింది. ప్రస్తుతం అద్దె బస్సులుపోను సొంతంగా 1,800 వరకు ఎక్స్ప్రెస్ బస్సులున్నాయి. ఇవి ఎక్కువ ఆక్యుపెన్సీ రేషియోతో నడుస్తూ ఆర్టీసీకి మంచి ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి. దూర ప్రాంత పట్టణాల మధ్య ఇవి తిరుగుతున్నాయి. కొన్ని ఇతర రాష్ట్రాలకు కూడా వెళుతున్నాయి. ఈ నేపథ్యంలో 540 కొత్త ఎక్స్ప్రెస్ బస్సులు సమకూర్చుకోవాలని ఆర్టీసీ అనుకుంటోంది. వాటి రాకతో డొక్కు ఎక్స్ప్రెస్ బస్సులు అదే సంఖ్యలో తొలగిస్తారు. వాటిల్లో కొన్నింటిని సిటీ బస్సులుగా, మరికొన్నింటిని పల్లెవెలుగు బస్సులుగా కన్వర్ట్ చేస్తారు. అంతమేర సిటీ, పల్లెవెలుగు పాత డొక్కు బస్సులను తుక్కుగా మారుస్తారు. స్లీపర్ కమ్ సీటర్ రాజధాని బస్సులు 50 లేదా 60 ఇక దూరప్రాంత పట్టణాల మధ్య తిరుగుతున్న రాజధాని (ఏసీ) బస్సులకు కూడా మంచి ఆదరణ ఉంది. ప్రస్తుతం ఉన్న బస్సులు బాగా పాతబడిపోయాయి. వాటిల్లోంచి మరీ పాత బస్సులను తొలగించి కొన్ని కొత్తవి సమకూ ర్చాలన్న ఉద్దేశంతో 50 లేదా 60 బస్సులు కొంటున్నారు. ప్రస్తుతం రాజధాని కేటగిరీ బస్సు లన్నీ సీటర్ బస్సులే. తొలిసారి ఆ కేటగిరీలో స్లీపర్ బస్సులు సమకూర్చనున్నారు. పైన కొన్ని బెర్తులు, దిగువ సీట్లు ఉండే స్లీపర్ కమ్ సీటర్ బస్సులు తీసుకోవాలని నిర్ణయించారు. ఎట్టకేలకు పల్లెవెలుగుకు కొత్త బస్సులు సాధారణంగా ఎక్స్ప్రెస్, రాజధాని బస్సులు పాతబడ్డాక వాటిని తొలగించి సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు బస్సులుగా కన్వర్ట్ చేస్తారు. దీంతో ఆ బస్సులు చాలా పాతబడి ఉంటున్నాయి. అయితే కొత్తగా ఇప్పుడు 100 నుంచి 120 మధ్యలో కొత్త బస్సులు సమకూర్చాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం చాలా ఊళ్లకు అద్దె బస్సులే నడుస్తున్నాయి. మరో 200 కొత్త బస్సులు హైదరాబాద్ సిటీకి కేటాయిస్తారు. -
ఇదే జరిగితే ఉద్యోగుల పంట పండినట్లే.. వర్క్ ఫ్లెక్సిబిలిటీ గురూ!
కరోనా వైరల్ అధికంగా విజృంచిన సమయంలో ఉద్యోగులంతా దాదాపు 'వర్క్ ఫ్రమ్ హోమ్' (Work From Home)కి పరిమితమయ్యారు. అయితే ఇప్పుడు పరిస్థితి సాధారణ స్థితి వచ్చింది. కానీ ఆఫీసులకు రావడానికి ఎంప్లాయిస్ ససేమిరా అంటున్నారు. సంస్థలేమో ఆఫీసులకు రమ్మంటుంటే.. ఉద్యోగులేమో ఇంటి నుంచి పనిచేస్తామని పట్టుపడుతున్నారు. ఈ సమస్యకు హైబ్రిడ్ వర్క్ కల్చర్ ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రస్తుతం దిగ్గజ కంపెనీలు సైతం తప్పకుండా ఉద్యోగులు ఆఫీసులకు రావాలని, ఈ నిర్ణయం కాదంటే ఉద్యోగానికి రాజీనామా చేయొచ్చని తేల్చి చెబుతున్నాయి. కానీ ఉద్యోగులు ఫ్లెక్సిబిలిటీ కోరుకుంటున్నారు. దీనికోసం హైబ్రిడ్ వర్క్ కొనసాగించాలని భావిస్తున్నారు. ఇది తప్పకుండా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తుందని చెబుతున్నారు. నివేదికల ప్రకారం.. వివిధ రంగాల్లోని సుమారు 3800 ఉద్యోగుల్లో 76 శాతం మంది హైబ్రిడ్ లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇష్టపడుతున్నట్లు తెలిసింది. ఈ విధానం కాదంటే కొత్త ఉద్యోగాలను అన్వేషించుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే ఉద్యోగులు తప్పనిసరిగా ఆఫీసు నుంచి పనిచేయాల్సిన రోజుల సంఖ్యను పెంచాలనే యజమానులు నిర్ణయాన్ని 35 శాతం మంది ఆహ్వానిస్తున్నారు. జేపీ మోర్గాన్ చేజ్, గోల్డ్మన్ సాచ్స్, మెటా, టీసీఎస్ కంపెనీలు సైతం తప్పకుండ ఆఫీసులకు రావాలని తమ ఉద్యోగులను హెచ్చరిస్తున్నాయి. అంతే కాకుండా జూమ్ సంస్థ కూడా 50 కిమీ దూరంలో ఉన్న ఎంప్లాయిస్ వారానికి రెండు రోజులు కార్యాలయాలకు రావాలని ఆదేశించింది. ఇదీ చదవండి: గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా.. ఆయన గ్యారేజీలో ఉండే కార్లు, బైకుల లిస్ట్ ఇదిగో! ఉద్యోగులకు, కంపెనీలకు సామరస్యంగా ఉండాలంటే హైబ్రిడ్ విధానం పాటించడం మంచిది. వేగంగా పరుగులు పెడుతున్న ప్రపంచంతో పోటీపడాలంటే అనుభవజ్ఞులైన ఉద్యోగులు చాలా అవసరమని సీఐఈఎల్ హెచ్ఆర్ సత్యనారాయణ అన్నారు. కొన్ని కంపెనీలు ఉద్యోగుల ఫ్లెక్సిబిలిటీకి ప్రాధాన్యత ఇస్తున్నాయి. -
హైదరాబాద్: బ్రైట్ కామ్ కంపెనీలో ఈడీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బ్రైడ్ కామ్ కంపెనీలో ఈడీ సోదాలు చేపట్టింది. సెబి ఫిర్యాదుతో బ్రైట్ కామ్ గ్రూప్ కంపెనీ ప్రమోటర్లు, డైరెక్టర్ల ఇళ్లలో ఈడీ అధికారులు తనిఖీలు జరిపారు. డైరెక్టర్ మురళీమోహన్ ఇంట్లో రూ.3 కోట్లకు పైగా నగదు సీజ్ చేశారు. సురేష్కుమార్రెడ్డి, నరేష్ ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. స్టాక్ ఎక్ఛ్సేంజ్లో అనధికారికరంగా కొనుగోళ్లు, అమ్మకాలు జరిపినట్లు ఈడీ గుర్తించింది. -
మూన్ మూడ్: చంద్రయాన్–3 షేర్లు జిగేల్
చంద్రయాన్–3 చంద్రుడిపై విజయవంతం నేపథ్యంలో అంతరిక్షం, రక్షణ రంగ కంపెనీల కౌంటర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. బీఎస్ఈలో సెంటమ్ ఎలక్ట్రానిక్స్ 15 శాతం దూసుకెళ్లగా.. స్పేస్ టెక్నాలజీస్, ఎంటార్ టెక్నాలజీస్, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ 5.5–3.6 శాతం మధ్య జంప్చేశాయి. చంద్రయాన్–3 మిషన్కు సెంటమ్ 200కుపైగా కీలక మాడ్యూల్స్ను సరఫరా చేసింది. ఇక ఈ బాటలో భారత్ ఫోర్జ్, ఆస్ట్రా మైక్రోవేవ్, ఎల్అండ్టీ 3–1.5 శాతం మధ్య ఎగశాయి. వీటిలో కొన్ని కౌంటర్లు ఏడాది గరిష్టాలకు చేరడం గమనార్హం! చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండింగ్ విజయవంతమైంది. శాస్త్రవేత్తల అంచనా మేరకే చంద్రుడి ఉపరితలం వైపు ల్యాండర్ ప్రయాణించింది. చంద్రుడిపైకి విక్రమ్ ల్యాండర్ చేరుకుంది. ఒకవైపు ఇస్రో సైంటిస్టులతో పాటు యావత్ భారత్ క్షణక్షణం ఉత్కంఠంగా ఎదురు చూసిన అద్భుత ఘట్టం ఆవిషృతమైంది. ఈ విజయంతో భారత్.. అంతరిక్ష రంగంలో చైనా, రష్యా, అమెరికా సరసన చేరింది. ఇదీ చదవండి: చంద్రయాన్-3 విజయం: ఈ కంపెనీలకు భాగస్వామ్యం -
ఈ రూల్ కాదంటే ఇంటికే.. ఉద్యోగులకు మెటా హెచ్చరిక!
కరోనా భూతం అధికంగా విజృంభించిన సమయంలో 'వర్క్ ఫ్రమ్ హోమ్' విధానం అమలులోకి వచ్చింది. అయితే మహమ్మారి దాదాపు అంతరించిపోయినప్పటికీ.. ఈ రోజుకి కూడా చాలా మంది ఇంటి నుంచి పనిచేయదానికి అలవాటు పడి ఆఫీసులకు రావడానికి ససేమిరా అంటున్నారు. ఈ తరుణంలో ప్రముఖ కంపనీ గట్టి వార్ణింగ్ ఇచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మెటా కంపెనీ ఉద్యోగులు తప్పకుండా ఆఫీసులకు రావాలని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ నియమం ఉల్లంగిస్తే ఉద్యోగం వదిలి ఇంటికి వెళ్లిపోవచ్చని కూడా స్పష్టం చేసింది. వచ్చే నెల 05 నుంచి (సెప్టెంబర్ 05) వారానికి మూడు రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేయాల్సిందే అంటూ ఉద్యోగులకు నోటీసులు కూడా జారీ చేసినట్లు సమాచారం. సెప్టెంబర్ 5 నుంచి ఉద్యోగులు ఆఫీసుకు వస్తున్నారా? లేదా? తనిఖీ చేయాలని సంస్థ మేనేజర్లను సూచించింది. ఆఫీస్లో సమయం గడపడం వల్ల మెరుగైన పనితీరును సాధించవచ్చని జుకర్బర్గ్ గతంలో సూచించారు. అంతే కాకుండా ఉద్యోగుల మధ్య మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి, టీమ్ వర్క్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. ఇదీ చదవండి: టమాటా ధరలు తగ్గింపుపై కేంద్ర కీలక ప్రకటన! మరింత.. ఇప్పటికే చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి పూర్తిగా స్వస్తి పలికాయి. కావున ఉద్యోగులందరూ తప్పకుండా ఆఫీసులకు రావాలని.. అక్కడ నుంచే వర్క్ చేయాలనీ వెల్లడించారు. దీంతో చేసేదేమీ లేక చాలామంది ఆఫీసుల బాట పట్టారు. ఇక త్వరలో మెటా ఉద్యోగులు కూడా ఆఫీసుల నుంచి పనిచేయాల్సిందే అంటూ స్పష్టమవుతోంది. -
గుడ్ న్యూస్.. ఆ రంగాల్లో 50వేల కొత్త ఉద్యోగాలు!
Jobs In Festival Season: త్వరలో పండుగ సీజన్ ప్రారంభం కానుంది. ఈ తరుణంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI) రంగాలు ఇప్పటికే క్రెడిట్-కార్డ్ అమ్మకాలు, పర్సనల్ ఫైనాన్స్ అండ్ రిటైల్ బీమాలలో పెరుగుదలను ఆశిస్తున్నాయి. దీంతో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని నివేదికలు చెబుతున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 50వేల ఉద్యోగాలు.. నివేదికల ప్రకారం, ఈ ఏడాది ద్వితీయార్థంలో దాదాపు 50వేల తాత్కాలిక ఉద్యోగాలు రానున్నట్లు అంచనా వేస్తున్నారు. సంస్థలు కూడా కొత్త ఉద్యోగులను చేర్చుకోవడాయికి ఆసక్తి చూపుతున్నాయి. మునుపటి ఏడాదికంటే కూడా ఈ సారి ఈ రంగాల్లో ఉద్యోగాలు 15 శాతం పెరగనున్నట్లు తెలుస్తోంది. క్రెడిట్ కార్డ్ లావాదేవీలు పెరగడం, పర్సనల్ ఫైనాన్స్ అప్లికేషన్లు పెరగటమే కాకుండా రాబోయే 5 లేదా 6 నెలల్లో డైనమిక్ జాబ్ మార్కెట్కు సిద్ధంగా ఉన్నామని టీమ్లీజ్ సర్వీస్ వైస్ ప్రెసిడెంట్ అండ్ బిజినెస్ హెడ్-BFSI కృష్ణేందు ఛటర్జీ తెలిపారు. ఇదీ చదవండి: అందులోని వాహనాల ఖరీదే వేలకోట్లు.. ఆ ప్యాలెస్ గురించి తెలిస్తే షాకవుతారు! పండుగ సీజన్లో తాత్కాలిక ఉద్యోగుల డిమాండ్ అహ్మదాబాద్, పూణే, బెంగళూరు, కోల్కతా వంటి టైర్ 1 నగరాల్లో మాత్రమే కాకుండా టైర్ 2 అండ్ టైర్ 3 నగరాలైన కొచ్చి, వైజాగ్, మధురై.. లక్నో, చండీగఢ్, అమృత్సర్, భోపాల్, రాయ్పూర్లలో కూడా ఎక్కువగా ఉండనుంది. ఇదీ చదవండి: ఇదో చెత్త కారు.. రూ. 4 కోట్ల మసెరటిపై గౌతమ్ సింఘానియా ట్వీట్ వేతనం వివరాలు.. నిజానికి ఈ టెంపరరీ ఉద్యోగుల ఆదాయం మునుపటి ఏడాదికంటే కూడా 7 నుంచి 10 శాతం పెరిగాయి. కావున ప్రధాన మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగుళూరులో జీతాలు నెలకు రూ. 20,000 నుంచి రూ. 22,000 వరకు.. అదే సమయంలో చెన్నైలో రూ. 15వేల నుంచి రూ. 17వేల వరకు & కలకత్తాలో రూ. 13వేల నుంచి రూ. 15వేల వరకు ఉండనున్నాయి. దీన్ని బట్టి చూస్తే జీతాలు కూడా ఓ రకంగా బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. -
2023 భారతదేశంలో టాప్ 10 బెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్
-
ఆ విషయంలో దిగ్గజ కంపెనీలకు దీటుగా చిన్న సంస్థలు.. అదేమిటంటే?
ఎక్కువ వేతనాలు ఇచ్చే విభాగం ఏది అంటే వెంటనే గుర్తొచ్చేది.. 'ఐటీ' ఫీల్డ్. అయితే గత కొంతకాలంగా ఐటీ సంస్థల ఆదాయం తగ్గుముఖం పట్టింది. దీంతో కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు శాలరీలు హైక్ చేయకపోగా.. మరి కొన్ని కంపనీలు ఉద్యోగులను తొలగించాయి. తాజాగా దిగ్గజ కంపెనీల కంటే చిన్న కంపెనీలే ఉద్యోగులకు ఎక్కువ జీతాలు ఇస్తున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, దిగ్గజ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా సీఈఓల కంటే కూడా చిన్న కంపెనీల సీఈఓలకు ఎక్కువ శాలరీలు లభిస్తున్నట్లు తెలుస్తోంది. పెర్సిస్టెంట్ సిస్టమ్స్ సీఈఓ 'సందీప్ కల్రా' వేతనం ఏడాదికి రూ. 61.7 కోట్లు, కాగా.. ఎంఫాసిస్ (Mphasis) సీఈఓ జీతం రూ. 59.2 కోట్లు కావడం విశేషం. పెద్ద కంపెనీల జాబితాలో విప్రో సీఈఓ మాత్రమే రూ. 82.4 కోట్లు జీతం తీసుకుంటూ అధిక వేతనం పొందుతున్న వ్యక్తిగా మొదటిస్థానంలో నిలిచాడు. ఇదీ చదవండి: మాటలకు అందని దేశీయ ఆటోమొబైల్ చరిత్ర! తొలిసారి కారు వాడకం ఎప్పుడంటే? విప్రో, ఇన్ఫోసిస్ కంపెనీలు మినహా నిఫ్టీ కంపెనీలను మించిన వేతనాలు అందుకుంటున్న సీఈఓలలో కోఫోర్ట్ సీఈఓ సుధీర్ సింగ్ ఉన్నారు. ఇక టీసీఎస్ సీఈఓ రాజేష్ గోపీనాథన్ వేతనం రూ. 30 కోట్లు కావడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో చాలామంది వేతనాలు భారీగా తగ్గినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. -
సుందర్ పిచాయ్,సత్య నాదెళ్ల మాత్రమేకాదు, ఈ టాప్ సీఈవోల గురించి తెలుసా?
-
పెరిగిన రొయ్యల ధరలు.. 20 కౌంట్ కేజీ ధర రూ.610
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలితంగా రొయ్యల కౌంట్ ధరలు పెంచేందుకు ప్రాసెసింగ్ కంపెనీలు ముందుకొచ్చాయి. గత నెలాఖరులో జరిగిన ఆక్వా సాధికారత కమిటీ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రకటించిన ధరలను మరోసారి పెంచేందుకు కంపెనీలు అంగీకరించాయి. 20 నుంచి 55 కౌంట్ వరకు కేజీకి రూ.10 చొప్పున, 56 నుంచి 100 కౌంట్ వరకు కేజీకి రూ.5 చొప్పున ధర పెంచుతున్నట్టు ప్రకటించాయి. దేశంలోని మరే రాష్ట్రంలో లేనివిధంగా.. తమ పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధిపై ఆక్వా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా రైతులు ఏ దశలోనూ నష్టపోకూడదన్న లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మంత్రుల సారథ్యంలో సమావేశమైన రైతు సాధికారత కమిటీ రొయ్యల ధరలను పెంచేందుకు కృషి చేస్తోంది. ఆక్వా రైతుల సమక్షంలో ప్రాసెసింగ్ కంపెనీలు, ఎగుమతిదారులతో ప్రభుత్వం ఎప్పటికప్పుడు జరుపుతున్న చర్చలు మంచి ఫలితమిస్తున్నాయి. గత నెలాఖరులో ప్రకటించిన ధరలు ఈ నెల 8వ తేదీ వరకు కొనసాగగా, మంగళవారం మరోసారి పునఃసమీక్షించి.. కేజీకి రూ.5 నుంచి రూ.10 చొప్పున పెంచేందుకు కంపెనీలు అంగీకరించాయి. ఈ నెల 9వ తేదీ నుంచి రానున్న పది రోజుల పాటు కొత్త ధరలు అమలులో ఉంటాయి. కోత పెడితే చర్యలు ప్రభుత్వం నిర్దేశించిన ధరల చెల్లింపులో ఏజెంట్లు, షెడ్ల నిర్వాహకులు కోత పెడుతున్నట్టుగా ప్రభుత్వం దృష్టికి రావడంతో ఎగుమతిదారులతో పాటు షెడ్ల యజమానులు, ఏజెంట్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇకనుండి రైతుల నుంచి కొనుగోలు చేసే వారెవరైనా కచ్చితమైన బిల్లులు ఇచ్చి కొనుగోలు చేసి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. లేకుంటే అప్సడా చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని, అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించింది. ఇతర రాష్ట్రాలకంటే మిన్నగా.. దేశంలో ఒక్క ఏపీలో మాత్రమే కౌంట్ల వారీగా ధరలను ప్రకటిస్తున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో పూర్వం నుంచి కొనసాగుతున్నట్టుగా ప్రతి 10 కౌంట్లకు ఒక ధర చొప్పున నిర్ణయిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రకటించిన కౌంట్ ధరలు పొరుగు రాష్ట్రాలతో కంటే మెరుగ్గా ఉన్నాయి. తమిళనాడు, ఒడిశా, గుజరాత్, పశి్చమ బెంగాల్, మహరాష్ట్రలో ప్రధాన కౌంట్లకు మన కంటే కేజీకి రూ.5 నుంచి రూ.25 వరకు తక్కువగానే చెల్లిస్తున్నారు. -
వ్యాపార సామ్రాజ్యంలో మహిళా సారధులు - ఏం చదువుకున్నారో తెలుసా?
బిజినెస్ అనగానే సాధారణంగా పురుషులే గుర్తుకు వస్తారు. కానీ వ్యాపార రంగంలో మహిళలు కూడా తమదైన రీతిలో ముందుకు దూసుకెట్లున్నారన్న సంగతి చాలామంది విస్మరించి ఉండవచ్చు. మనం ఈ కథనంలో కోట్ల రూపాయల వ్యాపారాలకు నాయకత్వం వహిస్తున్న భారతీయ మహిళల గురించి, వారు ఏం చదువుకున్నారు? ఏ కంపెనీలకు సారథ్యం వహిస్తున్నారనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సుధా మూర్తి (Sudhamurthy) భారతదేశంలో ఎంతో మందికి ఆదర్శప్రాయమైన 'సుధా మూర్తి' ప్రముఖ టెక్ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ చైర్పర్సన్. ఈమె నారాయణ మూర్తిని వివాహం చేసుకోవడానికి ముందు బీవీబీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఆ తరువాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. 2023లో పద్మశ్రీ పొందిన ఈమె నికర సంపద విలువ సుమారు రూ. 775 కోట్లు అని సమాచారం. రోష్ని నాడార్ (Roshni Nadar) శివ నాడార్ కుమార్తె 'రోష్ని నాడార్' ప్రస్తుతం హెచ్సిఎల్ కంపెనీ సీఈఓ. ఈమె వసంత్ వ్యాలీ స్కూల్లో పాఠశాల విద్యను, ఆ తరువాత నార్త్వెస్టర్న్ యూనివర్శిటీ రేడియో/టీవీ/ఫిల్మ్ వంటి వాటి మీద దృష్టి సారించి కమ్యూనికేషన్లో ప్రావీణ్యం సంపాదించింది. కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పూర్తి చేసింది. 2022 నాటికి ఆమె నికర సంపద విలువ రూ. 84,330 కోట్లని సమాచారం. నీతా అంబానీ (Nita Ambani) భారతదేశంలో అత్యంత సంపన్నుడైన ముకేష్ అంబానీ భార్య 'నీతా అంబానీ' ముంబైలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. ఈమె ప్రస్తుతం రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్పర్సన్. 2022 నాటికి ఈమె సంపద విలువ రూ. 84,330 కోట్లు అని తెలుస్తోంది. కిరణ్ మజుందార్-షా (Kiran Mazumdar-Shaw) కిరణ్ మజుందార్-షా బయోకాన్ లిమిటెడ్ అండ్ బయోకాన్ బయోలాజిక్స్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు & ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కూడా. ఈమె బెంగళూరు ఐఐఎం మాజీ చైర్మన్గా కూడా పనిచేసింది. మజుందార్-షా బెంగుళూరులోని బిషప్ కాటన్ గర్ల్స్ హైస్కూల్లో పాఠశాల విద్యను, ఆ తరువాత బెంగుళూరు యూనివర్శిటీలో జువాలజీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. ఈమె నికర ఆస్తుల విలువ 18779 కోట్లు అని సమాచారం. ఇదీ చదవండి: భారత్లో టెస్లా ఫస్ట్ ఆఫీస్ అక్కడే? అద్దె ఎంతో తెలిస్తే అవాక్కవుతారు! స్మితా కృష్ణ-గోద్రెజ్ (Smita Crishna-Godrej) నావల్ గోద్రెజ్ కుమార్తె అయిన స్మితా కృష్ణ-గోద్రెజ్ ముంబైలో హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్ పూర్తి చేసింది. ఈమె థియేటర్ యాక్టర్ విజయ్ కృష్ణను వివాహం చేసుకుంది. ఈమె సంపద విలువ సుమారు 2.9 బిలియన్ డాలర్లు. ఇదీ చదవండి: 2030 నాటికి 10 కోట్ల ఉద్యోగాలు.. ఈ రంగంలోని వారికి తిరుగులేదండోయ్! రేష్మా కేవల్రమణి (Reshma Kewalramani) డాక్టరుగా జీవితం మొదలుపెట్టిన రేష్మా కేవల్రమణి తరువాత కాలంలో వ్యాపారంలోకి అడుగుపెట్టి వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్తో కొత్త శిఖరాలకు అధిరోహించింది. ఈమె అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ నుంచి లిబరల్ ఆర్ట్స్/మెడికల్ సైన్స్లో ఏడేళ్ల కోర్సు చేసి ఆ తరువాత 2015లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి జనరల్ మేనేజ్మెంట్లో డిగ్రీ పొందింది. -
శ్రీసిటీలో అమెరికన్ కంపెనీల అద్భుత వృద్ధి
వరదయ్యపాళెం(తిరుపతి జిల్లా): శ్రీసిటీలోని అమెరికన్ కంపెనీలు అద్భుత వృద్ధిని సాధిస్తున్నాయని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాన్సుల్ జనరల్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా) జెన్నీఫర్ లారెన్స్ అన్నారు. జెన్నీఫర్ లారెన్స్తోపాటు వైస్ కాన్సుల్ జనరల్ అఖిల్ బెరీ, ఆర్థిక వ్యవహారాల నిపుణుడు సిబా ప్రసాద్త్రిపాఠి, యూఎస్ ఫారిన్ కమర్షియల్ సర్విస్ కమర్షియల్ అడ్వైజర్ సునీల్కుమార్ గురువారం శ్రీసిటీని సందర్శించారు. వారికి శ్రీసిటీ చైర్మన్ శ్రీనిరాజు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికారు. శ్రీసిటీలోని వీఆర్వీ పరిశ్రమలో నూతన ఆక్సిజన్ క్లీనింగ్ ప్లాంట్ను లాంఛనంగా జెన్నీఫర్ లారెన్స్ ప్రారంభించారు. శ్రీసిటీలోని అన్ని అమెరికన్ కంపెనీల సీఈవోలు, సీఎక్స్వోలతో ఆమె ప్రత్యేకంగా సమావేశమయ్యారు. -
రూ. వేల కోట్లు ట్యాక్స్ కట్టిన టాప్ 10 కంపెనీలు ఇవే.. (ఫొటోలు)
-
అవాక్కయ్యే నిజం.. ఆరు నెలల్లో అంతమంది ఉద్యోగులా?
Job Cuts 2023 First Six Months: కరోనా మహమ్మారి భారతదేశంలో ప్రవేశించినప్పటి నుంచి ఐటీ కంపెనీలు నష్టాల బాట పట్టాయి. ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు, ఆ ప్రభావం ఇప్పటికి కూడా ఉందనటంలో ఎటువంటి సందేహం లేదు. 2023లో కూడా కొన్ని కంపెనీలు లేఆప్స్ ప్రకటిస్తున్నాయి.. ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. ఈ ఏడాది అర్ధభాగంలో కొన్ని స్టార్టప్ కంపెనీలు లెక్కకు మించిన ఉద్యోగులను తొలగించాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, 2023 మొదటి ఆరు నెలల కాలంలో ఏకంగా 70 కంపెనీలు 17,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. పెట్టుబడిదారుల నిధుల క్షీణత కారణంగా సంస్థలు ఖర్చులను తగ్గించుకోవడానికి.. నగదును ఆదా చేయడానికి కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఉద్యోగులను తొలగించిన స్టార్టప్ల జాబితాలో.. ఈ-కామర్స్, ఫిన్-టెక్, ఎడ్టెక్, లాజిస్టిక్స్ టెక్ అండ్ హెల్త్-టెక్ కంపెనీలు ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు మీషో, అనాకాడెమీ, స్విగ్గీ, షేర్చాట్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించాయి. లేఆఫ్స్కి ప్రధాన కారణం కంపెనీలు లాభాలను పొందకపోవడమే అని స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: విడుదలకు సిద్దమవుతున్న స్మార్ట్ఫోన్స్ - షావోమి నుంచి రెడ్మీ వరకు.. పెరుగుతున్న మూలధన వ్యయం, వడ్డీ రేట్లు, టెక్నాలజీ స్టాక్ల విలువ క్షీణత కారణంగా స్థిరమైన స్టార్టప్ ఫండింగ్పై ప్రభావం కొనసాగుతోందని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికి కూడా కొన్ని కంపెనీలు మునుపటి వైభవం పొందలేకపోతున్నాయి. ఈ కారణంగానే 2023లో కూడా ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. రానున్న రోజుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగితే ఉద్యోగులు మరిన్ని కష్టాలు పడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. -
పేరు మార్చుకున్న ఈ టాప్ కంపెనీల గురించి తెలుసా?
-
భారీగా తగ్గిన ఐటీ ఉద్యోగులు! టాప్ 10 దిగ్గజ కంపెనీల్లో..
భారతదేశంలో ఎక్కువమందికి ఉపాధి కల్పించే రంగాల్లో ఒకటి 'ఐటీ' అని అందరికి తెలుసు. ప్రతి సంవత్సరం లెక్కకు మించిన ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తోంది. అలాంటి ఐటీ రంగం ఇప్పుడు రిక్రూట్మెంట్స్ జరపకపోగా.. ఉన్న ఉద్యోగులను కూడా తొలగిస్తుంది. కొన్ని నివేదికల ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మన దేశంలోని టాప్ 10 దిగ్గజ కంపెనీల ఉద్యోగుల సంఖ్య 21,327కి పడిపోయినట్లు సమాచారం. గత సంవత్సరం ఇదే సమయంలో ఈ కంపెనీలలోని ఉద్యోగుల సంఖ్య 69,634 కావడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే ఎంతమంది తగ్గారో స్పష్టంగా తెలుస్తోంది. టాప్ 10 కంపెనీలలో ఆరు కంపెనీల ఉద్యోగుల సంఖ్య తగ్గింది, కాగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ (LTTS), పెర్సిస్టెంట్, కోపోర్ట్ వంటి నాలుగు కంపెనీలు మాత్రం కొంతవరకు నియామకాలను చేపట్టి ఉద్యోగుల సంఖ్యను పెంచింది. మొత్తం మీద చాలా కంపెనీలు కొత్త వారిని చేర్చుకోవడం కంటే కూడా ఉన్న వారి నైపుణ్యాలనే మెరుగుపరిచేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: ఇది విడ్డూరం కాదు.. అంతకు మించి.. తెల్లగా ఉందని జాబ్ ఇవ్వలేదు! ఎక్కడంటే?) కరోనా మహమ్మారి భారతదేశంలో విజృంభించినప్పటి నుంచి ఉద్యోగుల జీవితాలు తలకిందులైపోయాయి. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అందించగా.. మరి కొన్ని కంపెనీలు ఉద్యోగులనే తొలగించింది. ఆ ప్రభావం ఇప్పటికి కూడా చాలా వరకు ఉద్యోగుల మీద ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. (ఇదీ చదవండి: సీఏ చదివి ఈ పని చేస్తావా? అని చీవాట్లు.. నేడు నెలకు రూ.4.5 కోట్లు టర్నోవర్!) తొలగింపు & నియామకాలు అలా ఉంచితే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగుల పాలిట మరో గండంగా మారింది. ఇప్పటికే చాలా కంపెనీలు కృత్రిమ మేధను ఉపయోగిస్తూ.. ఎంప్లాయిస్ సంఖ్యను తగ్గిస్తోంది. భవిష్యత్తులో కూడా క్రమంగా ఇదే జరిగితే ఉద్యోగుల సంఖ్య భారీగా క్షిణించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. -
అమెరికా కంపెనీలకు మహీంద్రా సాయం
న్యూఢిల్లీ: వాహన రంగంలో ఉన్న కంపెనీలకు సాయం చేసేందుకు మహీంద్రా గ్రూప్ ఒక ప్రత్యేక వేదికను యూఎస్లో ఏర్పాటు చేసింది. యూఎస్ కంపెనీలు భారత్లో తయారీని విస్తరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు మహీంద్రా గ్రూప్ ఎండీ, సీఈవో అనీష్ షా సోమవారం తెలిపారు. నియంత్రణ, విధానపర అంశాల్లో తమకు అపార అనుభవం ఉందని ఆయన చెప్పారు. అమెరికన్ కంపెనీలు భారత్లో తయారీ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు.. సంస్థకు చెందిన నిపుణుల బృందం తయారీ మౌలిక వసతులు, సరఫరా వ్యవస్థ, సాంకేతిక వంటి అంశాల్లో తమ నైపుణ్యాన్ని అందజేస్తారని మహీంద్రా వెల్లడించింది. -
ఆడిటర్లు చట్టబద్ధంగా వ్యవహరించాలి
న్యూఢిల్లీ: ఆడిటర్లు నిపుణుల అభిప్రాయాలపై ఆధారపడకుండా, విధానపరమైన ప్రక్రియను అనుసరించాలని నేషనల్ ఫైనాన్షియల్ రిపోరి్టంగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ) చైర్పర్సన్ అజయ్ భూషణ్ ప్రసాద్ పాండే సూచించారు. ఆడిటింగ్ అన్నది కేవలం టిక్ కొట్టే పని మాత్రం కాదన్నారు. పలు కంపెనీల్లో ఆడిటింగ్ లోపాలు బయటపడుతుండడం, ఈ విషయంలో ఆడిటర్లపై నియంత్రణ సంస్థ చర్యలు తీసుకుంటుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై పాండే తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆడిట్ డాక్యుమెంట్లు అన్నవి సరైన విధి విధానాలను అసరించారనే దానికి సాక్ష్యాలుగా పేర్కొన్నారు. ‘‘మేము విలన్గా ఇక్కడ లేమని ఆడిటర్ల సమాజానికి నేను హామీ ఇవ్వాలనుకుంటున్నాను. మీకు సాయం చేయడానికి, వ్యవస్థను మరింత మెరుగుపరచడానికే మేము ఇక్కడ ఉన్నామని తెలియజేస్తున్నాను’’అంటూ పాండే చెప్పారు. ఫైనాన్షియల్ రిపోరి్టంగ్ (ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలను వెల్లడించడం) వ్యవస్థ అనేది ఎంతో ముఖ్యమైనదిగా పేర్కొన్నారు. ఎన్ఎఫ్ఆర్ఏ కిందకు సుమారు 7,000 కంపెనీలు వస్తాయి. అన్లిస్టెడ్ కంపెనీలపైనా నియంత్రణ కలిగి ఉంది. యాజమాన్యం లేదా న్యాయ సలహాలపై ఆడిటర్లు ఎక్కువగా ఆధారపడుతున్నట్టు గుర్తించామని చెప్పారు. ‘‘నిపుణుల అభిప్రాయాలపై ఆధారపడడం, అవసరమైన విశ్లేషణ చేయకపోవడం అన్నది సరికాదు. నిపుణులు చెప్పిన అభిప్రాయానికే మీరు కూడా మొగ్గు చూపించొచ్చు. కానీ, మీరు ప్రామాణిక ఆడిట్ చేసినట్టు అక్కడ పత్రాలు చెప్పాలి. అది ముఖ్యమైనది’’అని సూచించారు. ఆడిట్తో మోసాలు వెలుగులోకి చట్టబద్ధమైన ఆడిటింగ్ ప్రక్రియను అనుసరించినప్పుడు మోసాలను గుర్తించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పాండే అన్నారు. ‘‘ఆడిటర్లు మోసాలను అన్ని వేళలా గుర్తిస్తారని ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. కానీ, మీరు తగిన విధంగా వ్యవహరిస్తే బయట పడేందుకు మంచి అవకాశాలు ఉంటాయి’’అని చెప్పారు. కంపెనీలు సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు అవి తమ ఆడిట్ కమిటీలను బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇండిపెండెంట్ డైరెక్టర్లకు సాధికారత కలి్పంచాలన్నారు. -
ఐపీవో లైన్లో 80 సంస్థలు
న్యూఢిల్లీ: దాదాపు 80 కంపెనీలు వరుసగా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు రానున్నాయని బ్రోకరేజీ సంస్థ ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ నిపుణ్ గోయల్ తెలిపారు. ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్, స్నాప్డీల్, టాటా టెక్నాలజీస్, నెట్వెబ్ టెక్నాలజీస్, గో డిజిట్ ఇన్సూరెన్స్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నారు. మ్యాన్కైండ్ ఫార్మా రూ. 4,326 కోట్ల ఇష్యూతో మొదలై గత మూడు నెలలుగా ఐపీవో మార్కెట్ చాలా సందడిగా ఉన్నట్లు గోయల్ చెప్పారు. అప్పటి నుంచి మరో ఐదు పబ్లిక్ ఇష్యూలు విజయవంతంగా పూర్తయ్యాయని, వచ్చే 4–8 వారాల్లో మరిన్ని సంస్థలు ఐపీవోకు రానున్నాయని వివరించారు. -
డేటా లోకలైజేషన్ వివాదంపై.. పేటీఎం సీఈవో ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారత్లో కార్యకలాపాలు సాగించే కంపెనీలు ఇక్కడి చట్టాలను పాటించి తీరాల్సిందేనని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ వ్యాఖ్యానించారు. పౌరుల డేటాను కాపాడాల్సిన బాధ్యత వాటికి ఉంటుందని స్పష్టం చేశారు. స్టార్టప్20 శిఖర్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా డేటా లోకలైజేషన్ వివాదంపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారీ సంఖ్యలో యూజర్లున్న భారత మార్కెట్లో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని శర్మ చెప్పారు. భారతీయ పౌరుల డేటాను పొందే టెక్ కంపెనీలు.. ఇక్కడి నియమ నిబంధనలను పాటించబోమనేందుకు ఆస్కారం ఉండబోదని ఆయన తెలిపారు. భారత యూజర్ల డేటాను దేశీయంగానే భద్రపర్చాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర దిగ్గజాలు వాదిస్తుండగా.. విదేశీ కంపెనీలు మాత్రం ఇతర దేశాల్లో భద్రపర్చే స్వేచ్ఛ కావాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో శర్మ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, అంకుర సంస్థల్లో కార్పొరేట్ గవర్నెన్స్పరమైన లోపాలపై స్పందిస్తూ.. ఇది స్టార్టప్లకు మాత్రమే పరిమితం కాదని ప్రతి రంగంలోనూ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని ఆయన చెప్పారు. స్టార్టప్లలోకి పెట్టుబడుల ప్రవాహం తగ్గిపోవడంపై మాట్లాడుతూ.. వాస్తవ సమస్యలను పరిష్కరించేందుకు వినూత్న ఆవిష్కరణలు చేసే సంస్థలకు నిధుల కొరత లేదన్నారు. -
ఎల్జీబీటీక్యూ సిబ్బందికి మరిన్ని సదుపాయాలు
ముంబై: పని ప్రదేశాల్లో లింగ సమానత్వం పాటించే దిశగా ఎల్జీబీటీక్యూ (లెస్బియన్, గే తదితరులు) ఉద్యోగులకు బాసటనివ్వడంపై కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. ఇందులో భాగంగా తమ సిబ్బంది, వారి భాగస్వాములకు ఆరోగ్య బీమాను అందుబాటులోకి తెచ్చినట్లు 24/7డాట్ఏఐ సంస్థ వెల్లడించింది. అలాగే, పేటర్నిటీ, మెటర్నిటీ లీవుల సదుపాయాన్ని కూడా అందిస్తున్నట్లు పేర్కొంది. సంస్థ అంతర్గతంగా ఏర్పాటు చేసిన కమిటీకి మిగతా ఉద్యోగుల తరహాలోనే వారు తమ సమస్యలను తెలియజేసి, అవసరమైన సహాయాన్ని పొందేలా చర్యలు తీసుకున్నట్లు వివరించింది. మరోవైపు, ఆర్పీజీ గ్రూప్ కూడా ప్రైడ్మంత్ సందర్భంగా తమ సంస్థలో ఉద్యోగుల కోసం ఎల్జీబీటీక్యూఏఐప్లస్ అండ్ పార్ట్నర్స్ బెనిఫిట్స్ పాలసీని ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. అటు ఆర్–షీల్డ్ పేరిట ప్రత్యేక హెల్ట్లైన్ను కూడా ఏర్పాటు చేసినట్లు సంస్థ చైర్మన్ హర్ష్ గోయెంకా తెలిపారు. -
సంచలనం సృష్టించి కనుమరుగైపోయిన భారతీయ బడా కంపెనీలు ఇవే!
ప్రపంచం మార్కెట్లో ఎన్నో కంపెనీలు ఆవిర్భవించి కొన్ని దశాబ్దాలు తిరుగులేని సంస్థలుగా అవతరించి కాల గర్భంలో కలిసిపోయాయి. అలాంటి కోవకు చెందిన టాప్ 5 ఇండియన్ కంపెనీలను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రీమియర్ ఆటోమొబైల్ (Premier Automobiles) 19వ దశకంలో భారతదేశంలో ఒక మెరుపు మెరిసిన ప్రీమియర్ ఆటోమొబైల్ కంపెనీ మొదటి కార్ రిపేర్ వర్స్క్ షాప్ మాదిరిగా ముంబైలో ప్రారంభమైంది. ఆ తరువాత ఆటో మొబైల్ రంగంలోకి అడుగు పెట్టింది. ఇందులో భాగంగానే కంపెనీ 1970లో 'ప్రీమియర్ పద్మిని' అనే అద్భుతమైన కారుని పరిచయం చేసింది. ఇది 2004 వరకు మార్కెట్లో విస్తృతమైన అమ్మకాలను పొందింది. మార్కెట్లో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమైన ఈ కంపెనీ కొత్త కార్లను పరిచయం చేయడంలో కూడా సక్సెస్ కాలేక పోయింది. ఆ తరువాత ప్రీమియర్ పద్మిని ఉత్పత్తి 1980లోనే నిలిచిపోయింది. కాగా కంపెనీ ఆటోమొబైల్ రంగం నుంచి పూర్తిగా 2004కి బయటకు వచ్చేసింది. గోల్డ్ స్పాట్ (Gold Spot) భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొంది, ప్రత్యర్థులను ఎదుర్కోలేక నిలిచిపోయిన కంపెనీలలో ఒకటి ఈ గోల్డ్ స్పాట్. 1950లోనే యూత్ ఫెవరెట్ బ్రాండ్గా మారిన ఈ సాఫ్ట్ డ్రింక్ 'పార్లే' (Parle) కంపెనీకి చెందినది కావడం గమనార్హం. 1960 & 70లలో బాగా పాపులర్ అయినప్పటికీ.. కోక్ అండ్ పెప్సీ కంపెనీ సాఫ్ట్ డ్రింకులతో పోటీ పడలేక 2000 ప్రారంభంలో కంపెనీ ఈ ఉత్పత్తిని నిలిపివేసింది. హెచ్ఎమ్టి (HMT) ఆధునిక కాలంలోనే హెచ్ఎమ్టి వాచ్ల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు ఈ బ్రాండ్కు పెద్ద ఫాలోయింగ్ ఉండేది. నిజానికి 1953లో ఇండియన్ గవర్నమెంట్ ఆధ్వరంలో మన దేశంలో ఈ కంపెనీ ప్రారంభమై 2016 వరకు కొనసాగింది. ఇందులో హెచ్ఎమ్టి జనతా అనే వాచ్ చాలా మందికి ఇష్టమైనదని చెబుతారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా కంపెనీ మారలేక.. కొత్త ఉత్పత్తులకు సరైన పోటీ ఇవ్వలేక 2016లో కనుమరుగైపోయింది. రాజ్దూత్ మోటార్సైకిల్స్ (Rajdoot MotorCycles) ఆటో మొబైల్ మార్కెట్లో చరిత్ర సృష్టించిన రాజ్దూత్ మోటార్ సైకిల్స్ 1960 నుంచి 2005 వరకు కుర్రకారుని ఎంతగానో ఆకర్శించింది. ఈ బైకులు ప్రముఖ ఇంజినీరింగ్ కంపెనీ ద్వారా రూపుదిద్దుకున్నాయి. కావున చాలా వరకు అప్పట్లోనే అడ్వాన్స్డ్ ఫీచర్స్ కలిగి ఉండేది. 1973లో విడుదలైన బాబీ అనే చిత్రం ద్వారా ఈ బైక్ మరింత పాపులర్ అయింది. అయితే మార్కెట్లో జరిగుతున్న ఆధునీకరణకు, ఇతరత్రా కారణాల వల్ల కంపెనీ రాజ్దూత్ ఉత్పత్తిని నిలిపివేసింది. అప్పుడప్పుడు వింటేజ్ బైకుల మాదిరిగా అక్కడక్కడా దర్శనమిస్తూ ఉంటాయి. (ఇదీ చదవండి: ఎంత మిలియనీర్ అయినా.. ఇండియాలో ఇలాగే ఉంటది!) అంబాసిడర్ (Ambassador) ఇక భారతదేశ ఆటో మోటివ్ ఇండస్ట్రీ సింబల్ మాదిరిగా ప్రజాదరణ పొంది సాధారణ ప్రజల దగ్గర నుంచి గవర్నమెంట్ ఉద్యోగుల వరకు విరివిగా ఉపయోగించిన కార్లలో అంబాసిడర్ ఒకటి. ఇప్పటికి కూడా అక్కడక్కడా కనిపించే ఈ కార్లు ఒకప్పుడు తిరుగులేని అమ్మకాలను పొందాయి. డిజైన్, ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉండే ఈ కారు ఇండియన్ రోడ్ కండిషన్కి అనుకూలంగా ఉండేది. అయితే కాలక్రమంలో ఏర్పడిన పోటీ, ఆధునికతను తట్టుకోలేక 2014లో వీటి ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. (ఇదీ చదవండి: ఒక ఒప్పందం.. వేల కోట్లు ఇన్వెస్ట్ - గోగోరో ప్లాన్ ఏంటంటే?) కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ (Kingfisher Airlines) భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని పొందగలిగిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ విజయ్ మాల్యా ద్వారా 2005లో ముంబై హెడ్ క్వార్టర్గా ప్రారంభమైంది. ప్రయాణికులకు సౌకర్యవంతమైన సదుపాయాలను అందిస్తూ ముందుకు సాగిన ఈ కంపెనీ ఎయిర్లైన్స్లో ఒక రికార్డ్ సృష్టించింది. ఆ తరువాత ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొలేకే 2012లో తన కార్య కలాపాలను నిలిపివేసింది. ఆ తరువాత 2013లో కంపెనీ పూర్తిగా దివాళా తీసినట్లు ప్రకటించింది. -
మాకిచ్చే జీతానికి ఈ మాత్రం పని చేస్తే చాల్లే..!: సర్వే
ఆఫీసులో ఎంత కష్టపడ్డా... శాలరీ పెరిగేది మాత్రం అత్తెసరుగానే.. ఎంత గొడ్డు చాకిరీ చేసినా... లభించే గుర్తింపు అంతంతే.. వేతనంతో పాటు ఇంకేదైనా అలవెన్స్ రూపంలో నగదు ఇస్తే బాగుంటుంది.. రోజూ ఆఫీసుకు రావాలా? వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ రోజులుంటే బాగుండు.. మీకు ఈ మధ్యకాలంలో ఇలాగే అనిపిస్తోందా? పైన చెప్పుకున్న నాలుగు అంశాల్లో ఏదో ఒకటి మీకు వర్తిస్తుందా? అలాగైతే మీరు ఒంటరి వారేమీ కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులు ఇదే విధమైన భావనలతో ఉన్నారు. కోవిడ్ భయం ముగిసి అన్నిరకాల ఉద్యోగులు మళ్లీ పూర్తిస్థాయిలో అఫీసులకు వెళ్లాల్సి వస్తున్న ఈ సమయంలో వారి మనోభావాలు తెలుసుకునేందుకు అంతర్జాతీయ సర్వే సంస్థ ‘గాలప్’ఓ అధ్యయనం నిర్వహించింది. (వైట్హౌస్ స్టేట్ డిన్నర్: నీతా అంబానీ చీరల విశేషాలేంటో తెలుసా?) కంపెనీలు, ఉద్యోగుల మధ్య సంబంధాలేమైనా బలపడ్డాయా? ఉద్యోగుల సంక్షేమానికి ఏం చేస్తున్నారు? పనిచేసే చోట ఒత్తిడి ఏ స్థాయిలో ఉంది? వంటి అనేక అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. వర్క్ ఫ్రమ్ హోమ్ వదిలిపెట్టి ఆఫీసులకు వస్తున్నవారిలో వివిధ కారణాలతో నెలకొన్న ఆందోళన, ఒత్తిడి తగ్గించడంపై కంపెనీలు దృష్టి పెట్టాయని తేల్చింది. ఉద్యోగుల్లో కోవిడ్ భయాలు ఇంకా కొనసాగుతున్న సమయంలో కంపెనీలు వారిని ఆఫీసులకు రమ్మనడం మాత్రమే కాకుండా, వారి యోగక్షేమాలు కనుక్కునేందుకు, అవసరమైన సాయం చేసేందుకూ ముందుకొచ్చాయని గాలప్ అధ్యయనం పేర్కొంది. (టీసీఎస్లో రూ.100 కోట్ల స్కాం: ఇదిగో క్లారిటీ ) ఉద్యోగుల బాగోగులపై కంపెనీల దృష్టి మూడేళ్ల క్రితం 2020 జనవరిలో మొదలైన కోవిడ్ మహమ్మారి రెండేళ్ల పాటు ప్రపంచాన్ని అట్టుడికించిందంటే అతిశయోక్తి కాదు. ఆఫీసులు మాత్రమే కాదు కరోనాతో సామాన్యుడి జీవితం దాదాపుగా స్తంభించిపోయింది. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్కు పరిమితమయ్యారు. అయితే టీకాలు వేయడం మొదలైన తరువాత 2021 ఆఖరుకు పరిస్థితిలో కొంత మెరుగుదల కనిపించి, 2022 మార్చికల్లా పరిస్థితులు సాధారణమయ్యాయి. ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ తగ్గించే ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే ఉద్యోగుల్లో ఆందోళన మునుపెన్నడూ లేనంత ఉచ్ఛస్థితిలో ఉందని, కోవిడ్ భయాలు తొలగినా ద్రవ్యోల్బణం, అర్థ వ్యవస్థ మందగమనం, భవిష్యత్తుపై చింత వంటి అంశాలు ఇందుకు కారణమయ్యాయని గాలప్ అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలోనే కంపెనీలు గత ఏడాదిలో ఉద్యోగుల ఆందోళనను, వారిలో ఒత్తిడిని తగ్గించేందుకు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చాయి. కంపెనీలు ఉద్యోగుల బాగోగులు చూసుకునే ప్రయత్నం చేయడం గత ఏడాది పతాక స్థాయిలో ఉన్నట్టు గాలప్ చెబుతోంది. 2009 నుంచి తాము ఈ ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ సమాచారాన్ని నమోదు చేస్తున్నామని, 2022లో అది రికార్డు స్థాయిలో 23 శాతానికి చేరిందని తెలిపింది. కోవిడ్ ముందునాటి పరిస్థితితో పోలిస్తే భారత్ సహా దక్షిణాసియా దేశాల్లో ఉద్యోగుల బాగోగులు చూసుకునే అంశం 33 శాతానికి చేరింది. (ఉద్యోగులతో సంప్రదింపులు జరపడం ఆధారంగా ఈ అంచనాకొచ్చారు) (ఇటలీలో లగ్జరీ విల్లా: రూ.40 లక్షల అద్దె సంపాదన, ఎవరీ సూపర్స్టార్?) కొనసాగుతున్న క్వైట్.. లౌడ్ క్విట్టింగ్.. మీరెలా ఉన్నారని కంపెనీ తరచూ అడుగుతూంటే ఉద్యోగులు సంతోషంగా మరింత కష్టపడతారని అనుకుంటాం కానీ, గాలప్ సర్వే ఫలితాలు దీనికి భిన్నంగానే కనిపించాయి. ఎందుకంటే చాలామంది ఉద్యోగులు క్వైట్ క్విట్టింగ్... అంటే ఆఫీసుకు రావడం.. అప్పగించిన పనిని పూర్తి చేయడం. ఎప్పుడు టైమ్ అవుతుందా.. అని కాచుకు కూర్చొని ఇంటికెళ్లిపోవడం చేస్తున్నారని సర్వే తెలిపింది. వీరు తాము పనిచేస్తున కంపెనీతో ఎలాంటి మానసికమైన సంబంధాన్ని కూడా కలిగిలేరని తెలిపింది. నామ్ కే వాస్తే పని మాత్రం చేస్తున్నారు. అంతే. ఇలా క్వైట్ క్విట్టింగ్ చేస్తున్న ఉద్యోగులు ఎక్కువగా ఉండగా.. కొంతమంది లౌడ్ క్విట్టింగ్కు పాల్పడుతున్నారు. అంటే.. తరచూ గ్రూప్ లీడర్లు లేదా సెక్షన్ హెడ్లతో విభేదించడం, కంపెనీ ప్రయోజనాలకు భిన్నంగా పనిచేయడం చేస్తున్నారు. తమకు తగ్గ పని చేయనందుకు కంపెనీ పట్టించుకోవడం లేదని వీరు భావిస్తున్నారు. క్వైట్ క్విట్టర్లు సరిగా పనిచేస్తే.. క్వైట్ క్విట్టర్లు.. తమకు అప్పగించిన పనికి మించి వీసమెత్తు ఎక్కువ చేసేందుకు ఇష్టపడరు. మాకిచ్చే జీతానికి ఈ మాత్రం చేస్తే చాల్లే అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. దీనర్థం.. వారు మరింత ఎక్కువ ఉత్పాదకత సాధించగల సామర్థ్యం ఉన్నవారే. కానీ.. వేతనం, సౌకర్యాలు, నైతిక మద్దతు వంటి అనేక కారణాల వల్ల నిరాసక్తంగా వ్యవహరిస్తున్నారని ఈ సర్వే తేల్చింది. ఒకవేళ వీరు కూడా ఉత్సాహంగా పనిచేస్తే... అది ఉత్పాదకతపై ప్రభావం చూపుతుంది. గాలప్ అంచనాల ప్రకారం క్వైట్ క్విట్టర్లు మనసుపెట్టి పూర్తిస్థాయిలో పనిచేయకపోవడం వల్ల ఏటా దాదాపు 8.8 లక్షల కోట్ల డాలర్ల నష్టం జరుగుతోంది. ఇది ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో దాదాపుగా తొమ్మిది శాతం. ఒత్తిడి...పైపైకి! కోవిడ్ భయాలు తొలగిపోయినప్పటికీ గత ఏడాది ఉద్యోగులు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొన్నారని గాలప్ సర్వే తెలిపింది. కోవిడ్ తీవ్రస్థాయిలో ఉన్నప్పటి మాదిరిగానే 2022లోనూ ఉద్యోగుల్లో సుమారు 44 శాతం మంది తాము తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నట్లు ఈ సర్వేలో తెలిపారు. చైనా, అమెరికా, కెనడాల్లో ఇది మరింత తీవ్రంగా ఉన్నట్లు స్పష్టమైంది. తూర్పు ఆసియా ప్రాంతంలో ఆఫీసులకు దూరంగా ఉంటూ పనిచేస్తున్న వారు, యువకులు 60 నుంచి 61 శాతం మంది రోజూ ఒత్తిడికి గురైనట్లు సర్వే వివరించింది. ఈ ఒత్తిడి పనికి సంబంధించింది మాత్రమే కాకుండా.. కుటుంబ ఆరోగ్య సమస్యలు, ద్రవ్యోల్బణం వంటి వాటివల్ల కూడా కావచ్చునని అంచనా. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే. ఉద్యోగుల యోగక్షేమాలు కనుక్కునేందుకు ప్రయత్నించిన కంపెనీల్లో ఈ ఒత్తిడి తక్కువగా ఉండటం!. ఉద్యోగులకు స్వేచ్ఛ ఇవ్వడమే మంచిది.. కోవిడ్ తదనంతర పరిస్థితుల్లో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ మేలా? లేక ఆఫీసుకు రావాలా? ఈ రెండూ కాకుండా హైబ్రిడ్ పద్ధతుల్లో పనిచేయించుకోవాలా? అన్న అంశాలపై ఇప్పటికే చర్చ చాలానే జరిగింది కానీ.. ఈ విషయాల్లో ఉద్యోగులకు స్వేచ్ఛనివ్వడం అన్నింటి కంటే మేలైన పద్ధతని గాలప్ చెబుతోంది. అంతేకాదు... తరచూ మాట్లాడుతుండటం, వారికి అవసరమైన పనులు సులువుగా చేసి పెట్టగలగడం వంటివి ఉద్యోగులకు కంపెనీపై ఉన్న అభిప్రాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేయగలవని ఈ సర్వే తెలిపింది. పనిచేసే చోటుకు కాకుండా... పరిస్థితులు, వాతావరణానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా ఉద్యోగుల్లో ఒత్తిడిని తగ్గించవచ్చునని గాలప్ సూచిస్తోంది. మెరుగైన ఉద్యోగానికి మంచి సమయం 2022లో కొత్త ఉద్యోగం చూసుకునేందుకు లేదా ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి మెరుగైంది చూసుకునేందుకు మంచి సమయం ఇదే అని గాలప్ సర్వేలో పాల్గొన్న వారిలో 53 శాతం మంది అభిప్రాయ పడ్డారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది గణనీయమైన వృద్ధి కాగా.. 2019 నాటి స్థాయికి దగ్గరగా ఉండటం గమనార్హం. అయితే అమెరికా, కెనడాల్లో మాత్రం ఈ పరిస్థితి లేదని సర్వే తెలిపింది. చేసే ఉద్యోగం పట్ల అసంతృప్తిగా ఉన్న వారు స్వేచ్ఛగా ఉద్యోగాలు వదులుకునే పరిస్థితి 2022లో కనిపించిందని, ఇది కాస్తా ఉద్యోగాల లభ్యతను అధికం చేసిందని గాలప్ విశ్లేషించింది. ఆసక్తికరంగా... సర్వే చేసిన ఉద్యోగుల్లో యాభై శాతం మంది ఉద్యోగం మానేసే ఆలోచన చేశారు. కంపెనీలు ఉద్యోగులను కోల్పోకూడదని అనుకుంటే వారి బాగోగులు మరింత మెరుగ్గా చూసుకోవాల్సిన అవసరముందని గాలప్ తెలిపింది. ఇలా చేసిన కంపెనీల్లో ఉద్యోగం మానేసే ఆలోచన చేసిన వారు గణనీయంగా తక్కువగా ఉండటాన్ని ఇందుకు సాక్ష్యంగా చూపుతోంది. సమస్య వేతనం ఒక్కటే కాదు... ఒత్తిడి, పనిచేసే వాతావరణం లేకపోవడం వంటి అనేక కారణాలతో ఉద్యోగాలు మానేయాలని అనుకున్న వారికి గాలప్ ఒక ప్రశ్న వేసింది. ‘‘పరిస్థితులు మెరుగవ్వాలంటే మీ ఆఫీసులో లేదా మీ కంపెనీలో ఏ చర్యలు తీసుకోవాలి?’’అన్న ప్రశ్నకు వచ్చిన సమాధానాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. దాదాపు 85 శాతం మంది కేవలం వేతనాలు, ఆర్థిక లాభాలు కాకుండా.. వర్క్/లైఫ్ బ్యాలెన్స్, ఎంగేజ్మెంట్ లేదా ఆఫీసు కల్చర్ వంటి విషయాలను ప్రస్తావించారు. మిగిలిన 15 శాతం మంది సమాధానాలు ఏ కోవకూ చెందనివి కావడం గమనార్హం. ఎంగేజ్మెంట్ లేదా ఆఫీస్ కల్చర్ వర్గంలో మేనేజర్లు మరీ కఠినంగా ఉండరాదని, స్వేచ్ఛగా మాట్లాడే అవకాశమివ్వాలని కొందరు అభిప్రాయపడ్డారు. సొంతంగా పనిచేసుకునేందుకు అవకాశముండాలని, కొత్త విషయాలు నేర్చుకునే సౌకర్యం, తగిన గౌరవం లభించాలని, ప్రమోషన్లలో అందరికీ సమాన అవకాశాలుండాలని మరికొందరు భావించారు. దాదాపు 28 శాతం మంది వేతనాలు, ఇతర లాభాలను ప్రస్తావిస్తే.. ఆఫీసులో మంచి క్యాంటీన్/కేఫటేరియా ఉండాలని కొందరు, పిల్లల సంరక్షణ ఖర్చుల గురించి కొందరు, కంపెనీ ఫలితాలకు తగ్గట్టుగా ఉద్యోగులందరికీ సమానంగా ప్రతిఫలాలు దక్కాలని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. ఆఫీసు వాళ్లు హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేయాలని, భోజన సమయం మరింత పెంచాలని పని మధ్యలో సేద తీరేందుకు తగిన ప్రాంతం లేదని ఇంకొందరు భావించారు. - కంచర్ల యాదగిరిరెడ్డి -
చైనా మొబైల్ కంపెనీలకు భారత్ షాక్
-
ఉద్యోగులకు అధిక జీతాలు ఇస్తున్న టాప్ కంపెనీలు ఇవే
-
మార్కెట్ విలువ ప్రకారం టాప్ 10 భారతీయ కంపెనీలు
-
భారత్ వైపు మళ్లిన దిగ్గజాల చూపు.. కారణం ఇదేనా..!!
న్యూఢిల్లీ: కోవిడ్ అనంతరం లగ్జరీ ఉత్పత్తుల వినియోగం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో అంతర్జాతీయ దిగ్గజాలు భారత్ వైపు దృష్టి సారిస్తున్నాయి. ఈ ఏడాది దాదాపు రెండు డజన్ల సంస్థలు ఎంట్రీ ఇవ్వనున్నాయి. దశాబ్దకాలంలో ఇది గరిష్ట స్థాయి కాగలదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 2020లో ఒక అంతర్జాతీయ బ్రాండ్ రాగా, 2021లో మూడు, 2022లో 11 సంస్థలు వచ్చాయి. కోవిడ్ మహమ్మారికి ముందు ఏటా దాదాపు 12–15 బ్రాండ్స్ భారత్కు వచ్చేవి. కోవిడ్ తర్వాత లగ్జరీ ఉత్పత్తులకు డిమాండ్తో గత కొద్ది నెలల్లో వాలెంటినో, మెక్లారెన్, బాలెన్షియాగా తదితర బ్రాండ్స్ వచ్చాయి. తాజాగా గ్లోబల్ బ్రాండ్స్ను తీసుకురావడంలో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ (ఏబీఎఫ్ఆర్ఎల్), రిలయన్స్ రిటైల్ తదితర సంస్థలు కీలకంగా ఉంటున్నాయి. దేశీయంగా లగ్జరీ డిపార్ట్మెంటల్ స్టోర్స్ను, ప్రత్యేకంగా ఈ–కామర్స్ ప్లాట్ఫాంను ప్రారంభించే దిశగా ఫ్రెంచ్ దిగ్గజం గ్యాలెరీస్ లాఫేట్తో ఏబీఎఫ్ఆర్ఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. అటు చైనీస్ దిగ్గజం షీన్ను తిరిగి తీసుకొచ్చేందుకు రిలయన్స్ రిటైల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఫుడ్.. ఎంటర్టైన్మెంట్ బ్రాండ్స్ ఆసక్తి.. ఈ ఏడాది దేశీ మార్కెట్లోకి ఎక్కువగా ఫుడ్ .. బేవరేజెస్, కొన్ని వినోద రంగ బ్రాండ్స్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ రాబర్టో కావలీ, బ్రిటిష్ లగ్జరీ గూడ్స్ బ్రాండ్ డన్హిల్, అమెరికాకు చెందిన స్పోర్ట్స్వేర్..ఫుట్వేర్ రిటైలర్ ఫుట్ లాకర్ మొదలైనవి కూడా భారత మార్కెట్లో కాలుపెట్టే ప్రయత్నాల్లో ఉన్నాయి. (ఇదీ చదవండి: విడుదలకు సిద్దమవుతున్న మారుతి సుజుకి కొత్త ఎమ్పీవీ - వివరాలు) వీటికి తోడు ఇటలీకి చెందిన లవాజా..అర్మానీ కెఫె, అమెరికన్ సంస్థ జాంబా, ఆస్ట్రేలియన్ బ్రాండ్ ది కాఫీ క్లబ్ కూడా ఈ ఏడాది ఎంట్రీ ఇచ్చేందుకు చర్చలు జరుపుతున్నాయి. రిటైల్ కార్యకలాపాలకు సంబంధించి భారత్ ప్రపంచంలోనే 5వ అతి పెద్ద మార్కెట్గా ఉంది. పలు బ్రాండ్ల రాకతో రిటైల్ స్థలం లీజింగ్ 5.5 – 6 మిలియన్ చ.అ.ల మేర ఉండొచ్చని ప్రాపర్టీ కన్సల్టెన్సీలు అంచనా వేస్తున్నాయి. 2019లో నమోదైన 6.8 మిలియన్ చ.అ. గరిష్ట స్థాయి తర్వాత ఇదే అత్యధికం. -
క్లియరింగ్ సంస్థలకు క్లయింట్ల నిధులు
న్యూఢిల్లీ: క్లయింట్ల నిధులను పరిరక్షించే బాటలో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజా మార్గదర్శకాలను తీసుకువచ్చింది. దీంతో అన్నిరకాల క్లయింట్ల నిధులను ఇకపై స్టాక్ బ్రోకర్లు క్లయరింగ్ కార్పొరేషన్ల(సీసీలు)కు బదిలీ చేయవలసి ఉంటుంది. రోజువారీ ప్రాతిపదికన క్లయింట్ల ఎలాంటి నిధులనూ కలిగి ఉండేందుకు వీలుండదు. వెరసి నగదు, ఫిక్స్డ్ డిపాజిట్ రసీదు లేదా మ్యూచువల్ ఫండ్స్ ఓవర్నైట్ పథకాల యూనిట్ల తనఖా రూపేణా స్టాక్ బ్రోకర్లు, క్లియరింగ్ సభ్యులు క్లయింట్ల నిధులను సీసీలకు చేర్చవలసి ఉంటుంది. పైన ప్రస్తావించినవి కాకుండా ఇతరత్రా క్లయింట్ల నిధులుంటే కటాఫ్ సమయంలోగా సీసీకి బదిలీ చేయవలసి ఉంటుంది. తాజా మార్గదర్శకాలు 2023 జులై 1 నుంచి అమల్లోకి రానున్నట్లు ఒక సర్క్యులర్ ద్వారా సెబీ తెలియజేసింది. కాగా.. సీసీ నిబంధనలు కలిగిన బ్యాంకుల ద్వారా మాత్రమే ఎఫ్డీఆర్లకు అనుమతి ఉంటుంది. ఇక క్లయింట్ల నిధులకు సంబంధించి ఎంఎఫ్ ఓవర్నైట్ పథకాల ద్వారా స్టాక్ బ్రోకర్లకు సరికొత్త అవకాశాలను కల్పిస్తున్నట్లు సర్క్యులర్లో సెబీ పేర్కొంది. -
మేలో నియామకాల్లో క్షీణత
ముంబై: ఉద్యోగ నియామకాల పట్ల కంపెనీలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో మే నెలలో నియామకాలు క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలతో పోల్చినప్పుడు 7 శాతం తగ్గాయి. ఆర్థిక మందగమనం పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలు వ్యయాలు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాయి. ఫౌండిట్ (మాన్స్టర్ ఏపీఏసీ అండ్ ఎంఈ) ‘ఫౌండిట్ ఇన్సైట్స్ ట్రాకర్’ పేరుతో నెలవారీ నియామకాల ధోరణులపై నివేదికను విడుదల చేసింది. అహ్మదాబాద్, జైపూర్ వంటి ద్వితీయ శ్రేణి పట్టణాల్లో మాత్రం నియామకాల పరంగా సానుకూల ధోరణులు కనిపిస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. దాదాపు అన్ని రంగాల్లో నియామకాల క్షీణత కనిపిస్తోందని, నెలవారీగా చూస్తే మేలో 4 శాతం తక్కువగా ఉన్నట్టు పేర్కొంది. ఆర్థిక వృద్ధి నిదానించడంతో వ్యయాలు తగ్గించుకోవడంపై కంపెనీలు దృష్టి పెట్టడం నియామకాలు తగ్గడానికి కారణమని ఈ నివేదిక అభిప్రాయపడింది. నైపుణ్యాల అంతరం ఉండడంతో, అర్హత కలిగిన ఉద్యోగులను గుర్తించడం కంపెనీలకు సవాలుగా మారినట్టు పేర్కొంది. విప్లవాత్మక టెక్నాలజీల పాత్రను కూడా ప్రస్తావించింది. ఇవి పరిశ్రమలు, ఉద్యోగ స్వరూపాలను మార్చివేస్తున్నట్టు తెలిపింది. ఆటోమేషన్ తదితర టెక్నాలజీల ప్రభావం ఉద్యోగ నియామకాలపై పడుతున్నట్టు వివరించింది. కొత్త నైపుణ్యాలతోనే రాణింపు..: ‘‘ప్రస్తుత నియామక ధోరణలు భారత ఉద్యోగ మార్కెట్ ఎదుర్కొంటున్న సవాళ్లకు నిదర్శనం. ఈ సవాళ్ల మధ్య ఉద్యోగార్థులకు అవకాశాలను అందించే వృద్ధి విభాగాలు కూడా ఉన్నాయి. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో షిప్పింగ్/మెరైన్, ప్రకటనలు, ప్రజా సంబంధాలు, రిటైల్, రవాణా, పర్యాటక విభాగాల్లో నియామకాలు పెరిగాయి. సమీప కాలానికి సవాళ్లతో కనిపిస్తున్నా, ఆర్థిక వృద్ధి బలపడితే అన్ని రంగాల్లోనూ నియామకాలు తిరిగి పుంజుకుంటాయి. నేడు డిమాండ్ ఉన్న నైపుణ్యాలు, భవిష్యత్తులోనూ రాణిస్తాయని చెప్పలేం. కనుక ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ, నూతన నైపుణ్యాలను అలవరుచుకోవాల్సిన అవసరం ఉంది’’అని ఫౌండిట్ సీఈవో శేఖర్ గరీశ తెలిపారు. ఆన్లైన్లో వివిధ ని యామక పోర్టళ్లలోని వివరాల ఆధారంగా నెలవారీగా ఈ నివేదికను ఫౌండిట్ విడుదల చేస్తుంటుంది. హైదరాబాద్లోనూ డౌన్ హైదరాబాద్, పుణె, ముంబై, ఢిల్లీ/ఎన్సీఆర్ పట్టణాల్లో మే నెలలో నియామకాలు, క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు 9 –16 శాతం తక్కువగా నమోదైనట్టు ఫౌండిట్ తెలిపింది. అహ్మదాబాద్లో 8 శాతం పెరగ్గా, బెంగళూరులో 24 శాతం తగ్గాయి. -
Top Car Companies In India: భారత్లో టాప్ 10 కార్ కంపెనీ ఇవే (ఫోటోలు)
-
ప్యాకెట్ సైజ్ పెంచి ధరలు తగ్గించి.. వృద్ధిపై ఎఫ్ఎంసీజీ పరిశ్రమ ఆశలు
న్యూఢిల్లీ: పరిస్థితులు తిరిగి గాడిన పడుతుండడంతో ఎఫ్ఎంసీజీ పరిశ్రమ వృద్ధి పట్ల ఆశావహ అంచనాలతో ఉంది. ప్రకటనలు, మార్కెటింగ్పై వ్యయాలను పెంచడంతోపాటు, పెట్టుబడులను కూడా ఇతోధికం చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కొన్ని త్రైమాసికాల విరామం తర్వాత అవి తిరిగి అమ్మకాల్లో వృద్ధిని చూస్తున్నాయి. ద్రవ్యోల్బణం, ముడి సరకుల ధరలు తగ్గడం వాటికి అనుకూలిస్తోంది. దీంతో ప్యాకెట్లలో గ్రాములు పెంచడం, ధరల తగ్గింపు వంటి నిర్ణయాలతో వినియోగదారులను ఆకర్షించే చర్యలు తీసుకుంటున్నాయి. మార్చి త్రైమాసికంలో ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీల పనితీరును పరిశీలిస్తే.. హిందుస్తాన్ యూనిలీవర్, డాబర్, మారికో, గోద్రేజ్ కన్జ్యూమర్, ఐటీసీ, టాటా కన్జ్యూమర్, నెస్లే అమ్మకాల్లో వృద్ధిని నమోదు చేశాయి. 2023–24లో ఎఫ్ఎంసీజీ వినియోగం క్రమంగా పుంజుకుంటుందన్న అంచనాను వ్యక్తం చేశాయి. ‘‘స్థిరమైన వృద్ధి అవకాశాలు బలపడ్డాయి. ఐదు త్రైమాసికాలుగా విక్రయాల్లో క్షీణత అనంతరం ఈ రంగం అమ్మకాల్లో వృద్ధిని చూసింది. పట్టణ వినియోగం స్థిరంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ క్షీణత ముగిసినట్టేనని సంకేతాలు కనిపిస్తున్నాయి’’అని మారికో ఎండీ, సీఈవో సౌగతగుప్తా తెలిపారు. ముఖ్యంగా ఆహార ఉత్పత్తులు ఎఫ్ఎంసీజీ వృద్ధిని నడిపిస్తున్నాయని చెప్పుకోవాలి. హోమ్, పర్సనల్ కేర్ ఉత్పత్తుల అమ్మకాలు కూడా సానుకూల శ్రేణిలోకి వచ్చేశాయి. సఫోలా, పారాచ్యూట్ తదితర ప్రముఖ బాండ్లతో ఉత్పత్తులను విక్రయించే మారికో లాభం మార్చి త్రైమాసికంలో 19 శాతం పెరిగి రూ.305 కోట్లుగా ఉండడం గమనార్హం. అమ్మకాలు 4 శాతం పెరిగాయి. మందగమనం ముగిసినట్టే.. ‘‘ఎఫ్ఎంసీజీ మార్కెట్లో మందగమనం ముగిసింది. అమ్మకాలతో మెరుగైన వాతావ రణం నెలకొంది. డిసెంబర్ క్వార్టర్లో సింగిల్ డిజిట్ క్షీణత ఉంటే, మార్చి త్రైమాసికంలో ఫ్లాట్గా విక్రయాలు ఉన్నాయి’’అని హెచ్యూఎల్ సీఎఫ్వో రితేష్ తివారీ తెలిపారు. ఇప్పటికీ ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలోనే ఉన్నందున అమ్మకాలు క్రమంగా పుంజుకుంటాయని అంచనా వేస్తున్నట్టు చెప్పా రు. మార్చి త్రైమాసికంలో హెచ్యూఎల్ నికర అమ్మకాలు 11 శాతం పెరిగితే, నిరక లాభం సైతం 13 శాతం మేర పెరిగింది. అంతర్జాతీయంగా మందగమనం, ఎల్నినో కారణంగా వర్షాలపై నెలకొన్న అనిశ్చితులతో సమీప కాలంలో నిర్వహణ వాతావరణం ఆటుపోట్లను ఎదుర్కోవచ్చని హెచ్యూఎల్ భావిస్తోంది. 2023–24 సంవత్సరంలో ఎఫ్ఎంసీజీ పరిశ్రమ భవిష్యత్ సానుకూలంగా ఉంటుందని, అమ్మకాలతోపాటు మార్జిన్లలోనూ మెరుగుదల ఉంటుందని నువమా గ్రూప్ ఈడీ అబ్నీష్రాయ్ అంచనా వేశారు. ‘‘ముడి సరుకుల ధరలు తగ్గాయి. దీంతో కంపెనీలు క్రమంగా ధరలను తగ్గించొచ్చు. లేదంటే గ్రాములను పెంచొచ్చు. అమ్మకాలు పెరిగితే ధరలపై ఒత్తిడి తగ్గుతుంది’’అని రాయ్ చెప్పారు. అయితే, ఎల్నినో, ఎఫ్ఎంసీజీ విభాగంలో పెద్ద సంస్థగా అవతరించాలని రిలయన్స్ లక్ష్యం విధించుకోవడం వంటి సవాళ్లు ఉన్నట్టు పేర్కొన్నారు. మరోవైపు గోద్రేజ్ కన్జ్యూమర్ మార్చి త్రైమాసికంలో అమ్మకాల్లో 11 శాతం వృద్ధిని చూసింది. ప్రస్తుత సానుకూల వాతావర ణం మరింత బలపడుతుందని, అమ్మకాల్లో వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నట్టు గోద్రేజ్ కన్జ్యూమర్ ఎండీ, సీఈవో సుధీర్ సీతాపతి తెలిపారు. ఇదీ చదవండి: బ్లాక్స్టోన్ చేతికి ఐజీఐ.. బెల్జియం డైమెండ్స్ సర్టిఫికేషన్ సంస్థ -
ప్రైవేటు ఉద్యోగాల కల్పనలో అమెరికా కంపెనీలదే హవా
ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు కల్పిస్తున్న కంపెనీలలో అమెరికా కంపెనీలు ముందు వరుసలో ఉన్నాయి. అత్యధికంగా ఉద్యోగాలు కల్పిస్తున్న టాప్–10 కంపెనీల్లో 5 అమెరికా కంపెనీలే ఉన్నాయి. అమెరికా రిటైల్ స్టోర్ దిగ్గజ సంస్థ వాల్మార్ట్, అమెజాన్, యునైటెడ్ పార్సిల్ సర్వీసెస్, కొరేగర్, హోమ్ డిపో సంçస్థలు అత్యధిక మందికి ఉద్యోగాలు కల్పించడం ద్వారా టాప్–10లో చోటు దక్కించుకున్నాయి. వాల్మార్ట్ కంపెనీ ఒకటే ఏకంగా 23 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా మొదటి స్థానంలో ఉన్నట్టు వరల్డ్ స్టాటస్టిక్స్ ఓఆర్జీ సంస్థ తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడించింది. 15.41 లక్షల మందికి ఉపాధి కల్పించడం ద్వారా ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థ అమెజాన్ రెండో స్థానంలో, తైవాన్కు చెందిన ఫాక్స్ కాన్ 8,26,608 మందికి ఉద్యోగాలు కల్పించడం ద్వారా మూడో స్థానంలో నిలిచాయి. - సాక్షి , అమరావతి 6వ స్థానంలో టీసీఎస్ టాప్–10లో ఇండియాకు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఒక్కటే చోటు దక్కించుకుంది. టీసీఎస్ 6,16,171 మందికి ఉపాధి కల్పించడం ద్వారా 6వ స్థానంలో నిలిచింది. దేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తూ టాప్–100లో చోటు దక్కించుకున్న మరో మూడు భారతీయ కంపెనీలు ఉన్నాయి. ఇన్ఫోసిస్ 3,46,845 ఉద్యోగాల కల్పనతో 34వ స్థానంలో నిలవగా.. 2.60 లక్షల ఉద్యోగాల కల్పనతో మహీంద్రా 61వ స్థానం, 2.36 లక్షల ఉద్యోగాలిచ్చి రిలయన్స్ ఇండస్ట్రీస్ 74వ స్థానంలో నిలిచాయి. -
ఐటీ లేఆఫ్స్: కొత్త ఉద్యోగాల కోసం బ్రహ్మాండమైన ఏఐ టూల్స్ ఇవిగో!
సాక్షి,ముంబై: ప్రపంచ ఆర్థికమాంద్యం ఆందోళనల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలు వేలాది ఉద్యోగాలకు ఉద్వాసన పలుకుతున్నాయి.మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎంట్రీతో మరిన్ని ఉద్యోగాలకు ముప్పు తప్పదనే భయాలు వెంటాడుతున్నాయి. దీనికి తోడు ఇప్పటికే పలు టెక్ దిగ్గజాలుఏఐ వైపు మొగ్గు చూపుతున్నాయి. (ONDC తక్కువ రేట్లతో దూకుడు: స్విగ్గీ, జొమాటోకు దబిడి దిబిడే!) 1956లో జాన్ మెక్కార్తీ ఈ అంశంపై మొదటి విద్యాసంబంధ సమావేశాన్ని నిర్వహించినప్పుడు ఇది వెలుగులోకి వచ్చింది. 2022లో శరవేగంగా ముందుకు దూసుకొచ్చింది. కృత్రిమ మేధస్సు అనేది మనిషి తరహాలోనే ఆలోచించడం, నేర్చుకోవడం, నిర్ణయాలు తీసుకోగలదు కూడా. వ్యాపార సామర్థ్యాన్ని పెంచడంలో, నిర్ణయం తీసుకోవడంలో ఖర్చులను తగ్గించడంలో కూడా ఏఐ సాయపడుతుందనేది ప్రధాన ఆలోచన. అలాగే మార్కెటింగ్లో, కస్టమర్ డేటాను విశ్లేషించడం, ట్రెండ్లను గుర్తించడంతో పాటు, కస్టమర్ల ఆసక్తులు, అవసరాలకు అనుగుణంగా మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించేందుకు ఉపయోగ పడుతుంది.తద్వారా ప్రత్యర్థులతో పోలిస్తే మరింత ముందుగా వ్యూహ రచనలో దూసుకుపోవచ్చని బిజినెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో కొత్త ఉద్యోగాలకుపయోగపడే కొన్నిముఖ్యమైన ఏఐ టూల్స్గురించి తెలుసుకుందాం. టాప్ ఏఐ టూల్స్ చాట్ జీపీటీ ( AI సంచలనం) క్విల్బాట్: ఇన్స్టంట్ పారాఫ్రేజర్ అప్వర్డ్: ఇన్నోవేటివ్ సమ్మరైజర్ కెరీర్దేఖో ఏఐ నెట్వర్క్ ఏఐ అప్లికెంట్ ఏఐ కిక్ రెస్యూమ్ ల్యాంగ్వేజ్ప్రొ అడాప్టివ్ ఎకాడమీ రెస్యూమ్ చెక్ ఫింగర్ పప్రింట్ సక్సెస్ అన్స్కూలర్ రెస్యూమ్ ఏఐ పాయిజ్డ్ ప్రాడిజీ ఏఐ లాంగోటాక్ -
తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానం
సాక్షి, హైదరాబాద్: భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే స్వీడన్ కంపెనీలకు తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానం అని పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. తెలంగాణలో పెట్టుబడి పెట్టే స్వీడన్ కంపెనీలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. భారత్లోని స్వీడన్ రాయబారి జాన్ తెస్లెఫ్ ఆధ్వర్యంలో ఆ దేశ వ్యాపార, వాణిజ్య ప్రతినిధులు, పలు కంపెనీల అధిపతులతో బుధవారం సచివాలయంలో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. రాష్ట్ర పారిశ్రామిక విధానాలు, ప్రభుత్వ ఆలోచన విధానాన్ని తెలియజేశారు. పెట్టుబడి అవకాశాల గురించి వివరించారు. టెక్నాలజీ, తయారీ రంగాల్లో స్వీడన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని కోరారు. దేశంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉన్న కంపెనీలను తెలంగాణకు కేటీఆర్ ఆహ్వానించారు. స్వీడన్ రాయబారితో కలిసి వచ్చిన ఆ దేశానికి చెందిన కంపెనీల ప్రతినిధులు హైదరాబాద్లో తమ సంస్థల కార్యకలాపాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా పారిశ్రామిక అనుకూల ప్రభుత్వ విధానాలను ప్రశంసించారు. ఎనిమిదేళ్ల కాలంలో హైదరాబాద్ నగరం రూపురేఖలు సంపూర్ణంగా మార్చేలా తీసుకువచ్చిన మౌలిక వసతుల కల్పన విధానాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. హైదరాబాద్ నగరంలో ఉన్న వ్యాపార అనుకూల వాతావరణం ఆధారంగా తెలంగాణకు మరిన్ని పెట్టుబడులను రప్పించేందుకు ప్రయత్నం చేస్తానని స్వీడన్ రాయబారి జాన్ తెస్లెఫ్ హామీ ఇచ్చారు. భారత్లో పెట్టుబడులకు ముందుకొచ్చే కంపెనీల బృందంతో కలిసి పనిచేసేందుకు ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ మెకానిజం పేరుతో తాము ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. ఇది స్వీడన్ వ్యాపార వాణిజ్య సంస్థలతో పాటు పలు కంపెనీలతోనూ కలిసి పని చేస్తుందన్నారు. తెలంగాణలో పెట్టుబడి అవకాశాలను తమ కార్యాలయం పరిశీలిస్తుందని తెలిపారు. -
లింక్డ్ఇన్ టాప్ కంపెనీలు: ఉద్యోగులకు ఆకర్షణీయ సంస్థగా విటెస్కో టెక్నాలజీస్
న్యూఢిల్లీ: పవర్ ట్రెయిన్ టెక్నాలజీస్ కంపెనీ ‘విటెస్కో టెక్నాలజీస్’ లింక్డ్ఇన్ 2023 అగ్రగామి కంపెనీల జాబితాలో చోటు సంపాదించుకుంది. ఈ విషయాన్ని విటెస్కో టెక్నాలజీస్ ప్రకటించింది. భారత్తో పాటు, ఫ్రాన్స్, అమెరికాలోనూ ఏక కాలంలో ఉత్తమ కంపెనీగా నిలిచినట్టు తెలిపింది. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 38 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. మూడు ఖండాల్లోనూ ఎక్కువ మంది ఉద్యోగులకు ఆకర్షణీయ కంపెనీగా ఉన్నట్టు పేర్కొంది. ‘‘ఈ అవార్డు రావడం పట్ల గర్విస్తున్నాం. ఉద్యోగుల వృత్తిపరమైన, వ్యక్తిగత అభివృద్ధి పట్ల మా అంకిత భావానికి ఇది నిదర్శనం’’అని విటెస్కో టెక్నాలజీస్ సీహెచ్ఆర్వో ఇంగో హోల్స్టీన్ ప్రకటించారు. ఇదీ చదవండి: ఫ్రెషర్లకు గుడ్ న్యూస్ చెప్పిన టీసీఎస్.. 44 వేల జాబ్ ఆఫర్లు.. అందరికీ ఉద్యోగాలు! ఉద్యోగులకు అత్యుత్తమ కెరీర్ అవకాశాలను కల్పించి ప్రోత్సహించే కంపెనీలను లింక్డ్ఇన్ గుర్తించి టాప్ కంపెనీస్ ర్యాంకింగ్ ఇస్తుంది. ఇందుకు వృత్తిపరమైన అభివృద్ధితో పాటు పని-జీవిత సమతుల్యత, అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించే, నిలుపుకునే సామర్థ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఇదీ చదవండి: 23 దేశాల్లో జీతాలు రూ.లక్షకుపైనే.. మరి భారత్లో...? -
కంపెనీలు ఎదుర్కొంటున్న రిస్క్లేంటో తెలుసా?
న్యూఢిల్లీ: మేధోపరమైన హక్కులు (ఐపీ), సమాచారం, సైబర్ దాడులు, ప్రమాదాలు అనేవి భారత కంపెనీలు ఎదుర్కొంటున్న ప్రధాన రిస్క్లు అని ఫిక్కీ సర్వే తెలిపింది. మహిళల భద్రతా ముప్పు 2021లో 12వ స్థానంలో ఉంటే, 2022లో 5వ స్థానానికి వచ్చినట్టు పేర్కొంది. దీంతో కంపెనీలు తమ మహిళా ఉద్యోగుల భద్రతకు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ సర్వే ఎత్తి చూపింది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! లాజిస్టిక్స్, నిర్మాణ రంగ కంపెనీలు ప్రమాదాలు, ఐపీ హక్కుల చోరీని ప్రధానంగా ప్రస్తావించాయి. ముఖ్యంగా లాజిస్టిక్స్ కంపెనీలకు రోడ్డు ప్రమాదాలు రెండో అత్యంత ఆందోళకరమైన అంశంగా ఉంది. ఐపీ హక్కుల చోరీ మొదటి స్థానంలో ఉంది. నిర్మాణ రంగ కంపెనీలు ప్రమాదాల రూపంలో ఎక్కువ రిస్క్ను చూస్తున్నాయి. రిటైల్ పరిశ్రమ ప్రమాదాలు, ఐపీ హక్కుల చోరీ, విపత్తులను రిస్క్లుగా తెలిపాయి. మీడియా, వినోద పరిశ్రమ సమాచారం, సైబర్ సెక్యూరిటీ రిస్క్లను ప్రస్తావించాయి. ఐటీ, తయారీ రంగంలో ఐపీ హక్కుల చోరీ ప్రథమ రిస్క్గా ఉంది. మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఎదురయ్యే రిస్క్లను తెలుసుకునేందుకు ఫిక్కీ ఈ వార్షిక సర్వే నిర్వహించింది. ఇదీ చదవండి: వాహన ఇన్సూరెన్స్ చేయిస్తున్నారా? వీటితో భలే బెనిఫిట్స్! -
కొరియన్ కంపెనీలతో వేదాంత గ్రూప్ ఒప్పందం
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా గ్రూప్ తాజాగా 20 కొరియన్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. డిస్ప్లే గ్లాస్ తయారీ పరిశ్రమకు మద్దతుగా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వేదాంతా పేర్కొంది. తద్వారా దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రం అభివృద్ధికి తెరతీయనున్నట్లు తెలియజేసింది. కొరియా ప్రభుత్వ నిధులతో అక్కడ ఇటీవల ఏర్పాటైన 2023 కొరియా వాణిజ్య షోకు వేదాంతా హాజరైంది. వాణిజ్యం, పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ కోట్రా ఏర్పాటు చేసిన ట్రేడ్ షోలో భాగంగా కొరియన్ డిస్ప్లే గ్లాస్ కంపెనీలతో అవగాహనా ఒప్పందాలు(ఎంవోయూలు) కుదుర్చుకున్నట్లు వేదాంతా సెమీకండక్టర్ విభాగం గ్లోబల్ ఎండీ ఆకర్ష్ కె.హెబ్బర్ తెలియజేశారు. 50 కంపెనీలకుపైగా తమతో భాగస్వామ్యానికి ఆసక్తి చూపినట్లు వెల్లడించారు. ఇవి ఎలక్ట్రానిక్ మ్యాన్యుఫాక్చరింగ్ వేల్యూ చైన్కు ఉపకరించనున్నట్లు వివరించారు. -
ఓఆర్ఆర్ 30 ఏళ్ల లీజుకి రూ. 8వేల కోట్లు: రేసులో ఆ నాలుగు కంపెనీలు
హైదరాబాద్: నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డును 30 ఏళ్ల లాంగ్ లీజుకు ఇవ్వడానికి 'హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ' (HMDA) ఆలోచిస్తోంది. ఇందులో భాగంగానే ఈ కాంట్రాక్టును కైవసం చేసుకునేందుకు నాలుగు కంపెనీలు పోటీ పడుతున్నాయి. దీని కోసం బిడ్డింగ్ సుమారు రూ. 8,000 కోట్లు వరకు ఉంటుంది. ఈ రేసులో ఈగల్ ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్, IRB ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్, దినేష్ చంద్ర ఆర్ అగర్వాల్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్, గవార్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ ఉన్నాయి. ఈ కంపెనీలు తమ బిడ్లను ఇప్పటికే హెచ్ఎండీఏకి సమర్పించాయి. ఈ బిడ్డింగ్లో పాల్గొనేందుకు అదానీ రోడ్ ట్రాన్స్పోర్ట్, ఎల్అండ్టి, క్యూబ్ హైవేస్ వంటి సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం, కానీ బిడ్లలో ఈ సంస్థలు పాల్గొనలేదు. బిడ్డింగ్లో పాల్గొనడానికి అంతర్జాతీయ ఏజెన్సీల నుంచి టోలింగ్, ఆపరేషన్, మెయింటెనెన్స్, ట్రాన్స్పోర్ట్ కోసం హెచ్ఎండీఏ టెండర్లను పిలిచింది. ఇందులో ఎక్కువ సంస్థలు పాల్గొనటానికి గడువు కూడా రెండు రోజులు పొడిగించింది. కొంతమంది వెంచర్ క్యాపిటలిస్టులు కూడా ప్రీ-బిడ్ సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పటికే టెక్నీకల్ కమిటీ మంగళవారం నుంచి టెక్నికల్ బిడ్లను మూల్యాంకనం (Evaluating) చేయడం ప్రారంభించింది. త్వరలోనే ఫైనాన్సియల్ బిడ్ ప్రారంభమవుతుంది. దీనికోసం పోటీ గట్టిగానే ఉంటుందని భావిస్తున్నారు. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి & ఓఆర్ఆర్ టోల్ డిమాండ్పై ఉన్న సందేహాల వల్ల ఇప్పటికి కేవలం నాలుగు కంపెనీలు మాత్రమే బిడ్డింగ్లో పాల్గొనటానికి ఆసక్తి చూపాయి. అయితే ఈ బీడ్ సొంతం చేసుకునే కంపెనీ నాలుగు నెలల్లో మొత్తం డబ్బుని ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. బిడ్లలో అవసరమైన మొత్తం రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ రీ-టెండర్ ప్రకటించే అవకాశం ఉంటుందని కొందరు హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి హెచ్ఎండీఏ ఈగిల్ ఇన్ఫ్రా సంస్థ నుంచి టోల్ ఫీజు సంవత్సరానికి రూ. 415 కోట్లు వసూలు చేస్తోంది. ఓఆర్ఆర్ ని టోల్ ఆపరేట్ ట్రాన్స్పర్పై 30 సంవత్సరాల పాటు లీజుకు తీసుకున్నట్లయితే, బిడ్డర్ నుంచి మొత్తం డబ్బుని పొందుతుంది. అయితే ORRని నిర్వహించడానికి హెచ్ఎండీఏపై ఎటువంటి భారం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం తమ రోడ్లు, ఇతర ఎక్స్ప్రెస్వేల కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా లాంగ్ లీజుపై 'టోల్ ఆపరేట్ ట్రాన్స్పోర్ట్' (TOT)ని స్వీకరించింది. -
కార్పొరేట్ రంగంలో సాహో భారత్! గ్లోబల్ కంపెనీలను ఏలుతోంది మనోళ్లే..
మైక్రోసాఫ్ట్.. గూగుల్.. అడోబ్.. ఐబీఎం.. నోవార్టిస్.. డెలాయిట్.. స్టార్బక్స్.. బాటా.. యూట్యూబ్.. గోడాడీ.. మైక్రాన్.. ఫెడ్ఎక్స్.. డీబీఎస్.. ఇలా చెప్పుకుంటూ పోతే కొండవీటి చాంతాడంత అవుతుంది లిస్ట్! ఇంతకీ ఏంటీ లిస్ట్ అంటారా? వీటన్నింటిలోనూ కామన్ విషయం ఒకటుంది. అదేనండీ ప్రపంచవ్యాప్తంగా ఆయా రంగాల్లో దుమ్మురేపుతున్న ఈ గ్లోబల్ కంపెనీలన్నింటినీ ఏలుతున్నది మనోళ్లే! మనదేశంలో పుట్టి.. సప్తసముద్రాలను దాటి కార్పొరేట్ రారాజులుగా తమ సత్తా ఏంటో చాటిచెబుతున్నారు భారతీయులు. టెక్నాలజీ.. ఫార్మా.. ఫ్యాషన్.. బ్యాంకింగ్.. రిటైల్.. తయారీ.. ఐటీ.. ఏ రంగంలోనైనా మనోళ్లు సరైనోళ్లు అనిపించుకుంటున్నారు. అందుకే ప్రపంచం ఇప్పుడు భారత్ లీడర్స్ వెంటపడుతోంది. ఫార్చూన్-500 టాప్ కంపెనీల్లో దాదాపు 60 కంపెనీల డ్రైవింగ్ సీట్లో ఉన్నది భారత సంతతికి చెందినవారే కావడం గమనార్హం. ఆయా కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 6 లక్షల కోట్ల డాలర్ల పైమాటే!! అంటే మన కరెన్సీలో 492 లక్షల కోట్ల రూపాయలన్న మాట! మనదేశ ఎకానమీ (జీడీపీ) దాదాపు 3.2 లక్షలకోట్లడాలర్లతో పోలిస్తే రెట్టింపు విలువ వీటి సొంతం. ఇతర రంగాల్లోనూ భారత సారథులు దూసుకుపోతున్నారు. అమెరికా వైస్ప్రెసిడెంట్ కమలా హ్యారిస్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఐఎంఎఫ్ డిప్యుటీ ఎండీ గీతా గోపీనాథ్తో పాటు తాజాగా ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ కాబోతున్న అజయ్ బంగా దీనికి నిదర్శనం. అసలు కార్పొరేట్ ప్రపంచమంతా సారథ్యం కోసం భారత్ వైపు ఎందుకు చూస్తోంది? మనోళ్లకున్న ప్రత్యేకతేంటి? ఈ కథేంటో చూద్దాం రండి మరి!! అమెరికా సిలికాన్ వ్యాలీలో భారతీయులదే హవా. ఎందుకంటే అక్కడున్న అనేక టెక్నాలజీ, ఐటీ కంపెనీల్లో మన ఇంజినీర్లు లక్షల సంఖ్యలో (దాదాపు మూడో వంతు) పని చేస్తుండటమే కాదు.. ఏకంగా చాలా దిగ్గజ కంపెనీల్లో టాప్ పొజిషన్లను చేరుకుని భారత్ పేరును ప్రపంచవ్యాప్తంగా మార్మోగేలా చేస్తున్నారు. శంతను నారాయణ్ దాదాపు 15 ఏళ్లుగా అడోబ్ సీఈఓ స్థానంలో పాతుకుపోయారు. ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని శాసిస్తున్న అనేక కంపెనీలు భారత సంతతికి చెందిన వారి వెంటపడి మరీ సారథ్యాన్ని అప్పగిస్తుండటం వారి ప్రతిభాపాటవాలను చాటిచెబుతోంది. 2004లో గూగుల్లో చేరిన సుందర్ పిచాయ్ దాదాపు పదేళ్లలోనే కంపెనీ టాప్ పొజిషన్కు చేరుకోవడం దీనికి నిదర్శనం. గూగుల్ క్రోమ్ బ్రౌజర్, క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్, గూగుల్ డ్రైవ్, జీ మెయిల్, గూగుల్ మ్యాప్స్, ఆండ్రాయిడ్ వంటి ప్రాజెక్టుల సక్సెస్కు సుందర్ పిచాయ్ దూరదృష్టి అపారమైన నైపుణ్యాలే కారణం. అంతేకాదు, 2015లో సీఈఓగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చూస్తే గూగుల్ షేర్ ధర ఏకంగా 76 శాతం ఎగబాకడం విశేషం. ఆయన హయాంలోనే ఆల్ఫాబెట్ (గూగుల్ మాతృ సంస్థ) తొలిసారిగా 2020 జనవరిలో ట్రిలియన్ (లక్షకోట్ల) డాలర్ల మైలురాయిని చేరుకోగా, 2021 నవంబర్లో 2 ట్రిలియన్ డాలర్లను సైతం తాకింది. ఇక మన తెలుగు తేజం సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ను పోటీదారులకు అందనంత ఎత్తులో నిలబెట్టి ప్రపంచ కార్పొరేట్లలో తన రూటే సెపరేటు అని చూపించారు. ఎందుకంటే 2014లో మైక్రోసాఫ్ట్ పగ్గాలు చేపట్టిన నాదెళ్ల.. 2019లో కంపెనీని తొలిసారి ట్రిలియన్ డాలర్ల విలువను అధిగమించేలా చేశారు. అజూర్క్లౌడ్ బిజినెస్తో భవిష్యత్తు దిశగా కంపెనీని నడిపించడమే కాదు.. 2021లో ఏకంగా 2 ట్రిలియన్ డాలర్లకు మైక్రోసాఫ్ట్ దూసుకెళ్లేలా చేసిన ఘనత నాదెళ్లదే. తన హయాంలో 45 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసిన కంపెనీలు ఇప్పుడు మైక్రోసాఫ్ట్కు కనకవర్షం కురిపిస్తున్నాయి. వీటిలో లింక్డ్ఇన్, మోజాంగ్ (మైన్క్రాఫ్ట్ వీడియో గేమ్), న్యూయన్స్, గిట్ హబ్ వంటివి ఉన్నాయి. గత సీఈఓ, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ బామర్ 14 ఏళ్ల సారథ్యంలో కంపెనీ షేరు 32 శాతం పడిపోగా, ఆయన కొనుగోలు చేసిన అక్వాంటివ్, నోకియా మొబైల్ బిజినెస్ వంటివి కంపెనీకి నష్టాలు మిగల్చడం గమనార్హం. ఇక ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఐటీ కంపెనీగా, టాప్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీల్లో ఒకటిగా నిలుస్తున్న ఐబీఎం సారథిగా కూడా భారత్కు చెందిన అరవింద్ కృష్ణను నియమించడం విశేషం. తాజాగా గూగుల్ అనుబంధ సంస్థ యూట్యూబ్ సీఈఓగా పగ్గాలు చేపట్టిన నీల్మోహన్ కూడా ఈ జాబితాలో చేరారు. లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువ.. ఫార్చూన్-500 ప్రపంచ టాప్ కంపెనీల్లో దాదాపు 60 కంపెనీలకు భారత సంతతికి చెందిన వారే సీఈఓలు. మనోళ్లు సారథ్యం వహిస్తున్న ఈ కార్పొరేట్ దిగ్గజాల మార్కెట్ విలువ ఏకంగా 6 లక్షలకోట్ల (ట్రిలియన్) డాలర్లకు పైగానే ఉంటుంది. మన కరెన్సీలో చూస్తే ఈ విలువ దాదాపు రూ. 492 లక్షలకోట్లు. మన దేశ ప్రస్తుత జీడీపీ (స్థూలదేశీయోత్పత్తి) విలువ దాదాపు 3.2 ట్రిలియన్ డాలర్లు కాగా, అంతర్జాతీయంగా భారతీయ గ్లోబల్ సీఈఓల నేతృత్వంలోని కంపెనీల మార్కెట్ విలువ దీనికి రెట్టింపు కావడం విశేషం. అంతేకాదు మొత్తం ఆఫ్రికా ఖండంలోని దేశాల జీడీపీ (3.1 ట్రిలియన్ డాలర్లు)తో లెక్కగట్టినా ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ దాదాపు డబుల్ అన్నమాట. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లోని ఎస్ అండ్ పీ-500 ఇండెక్స్ మొత్తం మార్కెట్ విలువలో 13 శాతం వాటా భారతీయ సీఈఓల నిర్వహణలో ఉన్న కంపెనీలదే. మనోళ్ల సత్తా అది మరి! ఇక ఆయా కంపెనీల ఆదాయాలు, లాభాలదీ అదిరిపోయే రేంజే. నాదెళ్ల నేతృత్వంలోని మైక్రోసాఫ్ట్ 2022లో 202 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. నికర లాభం 72 బిలియన్ డాలర్లు (రూ. 5 లక్షల కోట్లు). సుందర్ పిచాయ్ నాయకత్వం వహిస్తున్న ఆల్ఫాబెట్ (గూగుల్ మాతృ సంస్థ) గతేడాది 282 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని, 60 బిలియన్ డాలర్ల నికరలాభాన్ని సంపాదించింది. ఇక మిగతా 60 కంపెనీల ఏడాది లాభాలను కూడా లెక్కేస్తే ప్రపంచంలోని అనేక దేశాల జీడీపీని మించి పోతుంది. ప్రస్తుతం ప్రపంచంలో ట్రిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ విలువ ఉన్న కంపెనీలు 4 మాత్రమే ఉండగా (యాపిల్, సౌదీ ఆరామ్కో, మైక్రోసాఫ్ట్, గూగుల్) వీటిలో రెండింటి పగ్గాలు మనోళ్ల చేతిలోనే ఉన్నాయి. ఇక టాప్-100 ప్రపంచ కంపెనీల్లో మన రిలయన్స్ ఇండస్ట్రీస్ (మార్కెట్ విలువ 196 బిలియన్ డాలర్లు, ర్యాంక్ 47), టీసీఎస్ (149 బిలియన్ డాలర్లు, ర్యాంక్ 74), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (126 బిలియన్ డాలర్లు, ర్యాంక్ 96) మాత్రమే ఉన్నాయి. ఏ రంగమైనా సై.. ఇందు గలరందు లేరని సందేహము వలదు, ఎందెందు వెదకి చూసినా భారతీయ సీఈఓలు అందందే గలరు అన్న చందాన.. మనోళ్లుఅన్ని రంగాల్లోనూ తమకు తిరుగులేదని నిరూపించుకుంటున్నారు. టెక్నాలజీలో చేయి తిరిగిన భారతీయులు ఇతర రంగాలకు చెందిన అనేక గ్లోబల్ దిగ్గజాల సీఈఓలుగానూ దూసుకెళ్తున్నారు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఫార్మా అగ్రగామి నోవార్టిస్. అమ్మకాలపరంగా ఫైజర్ తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఫార్మా కంపెనీగా నిలుస్తున్న ఈ కంపెనీకి సారథిగా ఉన్నది కూడా భారత్కు చెందిన వసంత్ నరసింహన్. ఇక ప్రపంచంలోనే నంబర్వన్ కాఫీ రిటైల్ బ్రాండ్గా నిలుస్తున్న స్టార్బక్స్ ఘుమఘుమలు దశదిశలా వ్యాపించేలా చేస్తున్నది లక్ష్మణ్ నరసింహన్. గతంలో ఆయన బ్రిటిష్ కన్జూమర్ గూడ్స్ దిగ్గజం రెకిట్ బెన్కిసర్ సీఈఓగా కూడా పనిచేశారు. ప్రపంచ స్కాచ్ విస్కీ రారాజుగా వెలుగొందుతున్న బ్రిటిష్ కంపెనీ డియాజియో పగ్గాలు సైతం మన ఇవాన్మెనెజెస్ చేతిలోనే ఉన్నాయి. ప్రపంచంలో అమ్ముడవుతున్న ప్రతి 5 స్కాచ్ విస్కీ బాటిల్స్లో ఒకటి డియాజియోకు చెందిన ‘జానీవాకర్’ బ్రాండ్దే కావడం విశేషం. గ్లోబల్ మల్టీనేషనల్ కెమికల్ కంపెనీ.. లిండే సీఈఓగా గత ఏడాది సంజీవ్ లాంబా బాధ్యతలు చేపట్టారు. ఆదాయం, మార్కెట్ వాటా పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ గ్యాస్ కంపెనీగా వెలుగొందుతోంది. గ్లోబల్ కన్సల్టింగ్ వ్యాపార రంగంలో వరుసగా ఐదో ఏడాది కూడా నంబర్ 1 స్థానాన్ని చేజిక్కించుకున్న డెలాయిట్ను నడిపిస్తోంది భారతీయ సంతతికి చెందిన పునీత్ రంజన్. బిగ్ అంతర్జాతీయ అకౌంటింగ్ కంపెనీల్లో సైతం డెలాయిట్దే పైచేయి. ఇక మరో గ్లోబల్ ఫార్మాదిగ్గజం వెర్టెక్స్ సీఈఓ రేష్మా కేవలరమణి, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద లాజిస్టిక్స్ కంపెనీగా నిలుస్తున్న ఫెడెక్స్ చీఫ్ రాజ్ సుబ్రమణ్యం, మల్టీనేషనల్ ఇంజినీరింగ్ దిగ్గజం ఎమర్సన్ ఎలక్ట్రిక్ కంపెనీ చీఫ్ సురేంద్రలాల్ కర్సన్ భాయ్, గ్లోబల్ టాప్-10 ఇన్సూరెన్స్ కంపెనీల్లోఒకటైన ప్రుడెన్షియల్ సారథి అనిల్ వాధ్వానీ, కంప్యూటర్ నెట్వర్కింగ్ దిగ్గజం అరిస్టా నెట్వర్క్స్ సీఈఓ జయశ్రీ ఉల్లాల్, సింగపూర్ బ్యాంకింగ్ అగ్రగామి డీబీఎస్ గ్రూప్సీ ఈఓ పియూష్ గుప్తా, బ్రిటిష్ మల్టీనేషనల్ బ్యాంక్ బార్క్లేస్ గ్రూప్ సీఈఓ సీఎస్ వెంకట కృష్ణన్, ప్రపంచ ఫుట్వేర్ దిగ్గజం బాటా కార్పొరేషన్ సీఈఓ సందీప్ కటారియా, డొమైన్ నేమ్ సర్వీసుల రంగంలో ప్రపంచ నంబర్ వన్ గోడాడీ సీఈఓ అమన్ భూటానీ సైతం తమ ప్రతిభాపాటవాలతో భారతీయ లీడర్స్గా అవతరించారు. ఇక బ్రిటిష్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ‘చానెల్’ను నడిపిస్తున్నది భారతీయ సంతితికి చెందిన లీనా నాయర్ కావడం మరో విశేషం. ప్రపంచ టాప్-5 లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్స్లో లూయీ విటోన్ను వెనక్కి నెట్టి ఈ ఏడాది ‘చానెల్’ మూడో ర్యాంకును చేజిక్కించుకుందంటే అదంతా నాయర్ ఘనతే! ఇలా ఒకటేంటి కార్పొరేట్ ప్రపంచంలో దాదాపు అన్ని రంగాలకు చెందిన అగ్రస్థాయి కంపెనీలు ఇప్పుడు తమకు భారతీయ లీడర్లే కావాలంటూ వెంట పడుతున్నారు!! మాజీ గ్లోబల్ సీఈఓలు పెప్సీకో ఇంద్రానూయీ, వొడాఫోన్ అరుణ్ శరీన్, నోకియా రాజీవ్ సూరి, సన్ మైక్రోసిస్టమ్స్ వినోద్ ఖోస్లా, హార్మన్ ఇంటర్నేషనల్ దినేష్ పలివాల్, సిటీ బ్యాంక్ విక్రమ్ పండిట్, ట్విటర్ పరాగ్ అగర్వాల్ కూడా ఈ కోవకు చెందినవారే. మన మూలాలే బలం.. భారతీయులు గ్లోబల్ కంపెనీల్లో లీడర్షిష్ స్థానాలకు చేరుకోవడానికి కారణం మన మూలాలే. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మన విద్యా వ్యవస్థ. ప్రస్తుతం సారథ్యం వహిస్తున్న వారిలో చాలామంది దాదాపు భారత్లోనే గ్రాడ్యుయేషన్ వరకు చదువుకోవడం.. ముఖ్యంగా ఐఐటీలు, ఇతర అత్యున్నత కాలేజీల్లో ఇంజినీరింగ్ చేయడం గమనార్హం. మనకున్న ఐఐటీలు, ఐఐఎంలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ కోర్సులు చేసి, అమెరికా, యూరప్ తదితర దేశాల్లో మరింత ఉన్నత చదువులు చదవడం కూడా వారి ఎంపికకు దోహదం చేస్తోంది. అంటే ప్రాథమికస్థాయిలో వారికి బలమైన నాయకత్వ పునాదులు ఇక్కడే పడ్డాయని చెప్పుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంగ్లిష్ భాషపై మనోళ్లకున్న పట్టు కూడా అవకాశాలను అందిపుచ్చుకోవడంలో కీలకపాత్ర పోషిస్తోందని సింగపూర్ బ్యాంకింగ్ దిగ్గజం డీబీఎస్ గ్రూప్ సీఈఓ పియూష్ గుప్తా విశ్లేషించారు. చాలా వరకు మధ్యతరగతి బ్యాగ్రౌండ్ నుంచి రావడం కూడా సాధించాలన్న పట్టుదలకు ప్రధాన కారణమనేది ఆయన అభిప్రాయం. చొచ్చుకుపోయే తత్వం, ఎలాంటి సవాళ్లనైనా అధిగమించ గల ఆత్మవిశ్వాసం, నిర్వహణ సామర్థ్యం, పరిస్థితులకు అనువుగా మారగల నైజం, కుటుంబ విలువలు, తోటివారికి చేయూతనందించడం ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా భారతీయులు అన్నిరంగాల్లోనూ అగ్రస్థానాలకు చేరుకునేలా చేస్తున్నాయని అంటున్నారు ఫైర్ ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ ప్రేమ్ వత్స. భారతీయులు సహజంగానే పొదుపరులు. కంపెనీ చీఫ్లుగా అనవసర వ్యయాలను తగ్గించి, లాభాలను పెంచడంలో తమకు సాటిలేదని నిరూపించుకుంటున్నారు. ఇది కూడా వారికి సారథ్యాన్ని కట్టబెట్టడంలో కీలకపాత్ర పోషిస్తోంది. అంతేకాదు, మన ఆర్థికవ్యవస్థ పురోగతి సైతం భారతీయుల నాయకత్వానికి దన్నుగా నిలుస్తోంది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్ ఆవిర్భవించింది. ప్రస్తుతం 3.2 ట్రిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న జీడీపీ 2028 కల్లా 5 ట్రిలియన్ డాలర్లకు, 2036 నాటికి 10 ట్రిలియన్ డాలర్లకు, 2045 నాటికి 20 ట్రిలియన్ డాలర్లను అధిగమించనుందని ఎర్నెస్ట్ అండ్ యంగ్ తాజా నివేదికలో అంచనా వేయడం గమనార్హం. అంతేకాదు స్టార్టప్ ఎకోసిస్టమ్లో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలుస్తూ నవకల్పనలకు పెద్దపీట వేస్తుండటం కూడా ఎంట్రప్రెన్యూర్స్, నాయకత్వలక్షణాలకు దోహదం చేస్తోందనేది పరిశ్రమ నిపుణుల మాట. దేశంలో యూనికార్న్లుగా (బిలియన్ డాలర్ల విలువను అధిగమించినవి) ఆవిర్భవించిన స్టార్టప్స్ సంఖ్య ఇప్పటికే 100కు చేరింది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ స్టార్టప్స్లో కూడా 25 శాతం సంస్థల సారథ్యం భారతీయుల చేతిలోనే ఉండటం భవిష్యత్తులో మనోళ్ల జోరుకు అద్దం పడుతోంది. దక్షిణాది దూకుడు.. తెలుగు వెలుగులు! అమెరికా, యూరప్, ఆసియాలోని అనేక గ్లోబల్ మల్టీనేషనల్ కంపెనీలకు సారథ్యం వహిస్తున్న మెజారిటీ భారత సంతతి సీఈఓలు దక్షిణ భారతావనికి చెందిన వారే కావడం మరో విశేషం. సందర్ పిచాయ్, వసంత్ నరసింహన్, లక్ష్మణ్ నరసింహన్, రాజేష్ సుబ్రమణ్యం, రంగరాజన్ రఘురామ్, గణేష్ మూర్తి, రవి కుమార్, సీఎస్ వెంకట కృష్ణన్ ఇంకా చాలా మంది ఈ జాబితాలో ఉన్నారు. అంతేకాదు, మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల, అడోబ్ శంతను నారాయణ్, ఐబీఎం అరవింద్ కృష్ణ, కేవియం సీఈఓ సయ్యద్ అష్రాఫ్ అలీ, కెనడా ఆటోమొబైల్ కాంపొనెంట్ దిగ్గజం మ్యాగ్నా కార్పొరేషన్ సీఈఓ సీతారామ (స్వామి) కోటగిరి వీళ్లంతా తెలుగు రాష్ట్రాల్లో జన్మించారు. సత్య నాదెళ్ల, శంతను నారాయణ్, ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ కాబోతున్న అజయ్పాల్ సింగ్ బంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్పీఎస్) పూర్వ విద్యార్థులు. కెనడా ఆర్థిక సేవల దిగ్గజం ఫెయిర్ ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ ప్రేమ్ వత్స సైతం హెచ్పీఎస్లోనే హైస్కూల్ చదువు పూర్తి చేశారు. ఈ కంపెనీ ప్రస్తుత మార్కెట్ విలువ 18 బిలియన్ డాలర్లు. ఏడాదికి రూ. 2,300 కోట్లు! ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ శాలరీ ప్యాకేజీ చూస్తే కళ్లు బైర్లు గమ్మాల్సిందే! 2022లో ప్రపంచంలోకెల్లా అత్యధిక వార్షిక వేతన ప్యాకేజీలు అందుకున్న టాప్-10 సీఈఓల్లో సుందర్ కూడా ఒకరు. ఆయన ఏకంగా 28 కోట్ల డాలర్ల ప్యాకేజీ అందుకున్నారు. అంటే మన కరెన్సీలో అక్షరాలా రూ. 2,300 కోట్లు. ఏంటీ ఈ సొమ్ముతో ఏకంగా ఒక కంపెనీయే పెట్టేయొచ్చు అనుకుంటున్నారా.. అట్లుంటది మరి మన సుందర్తోని! అంతేకాదు ప్రస్తుతం సుందర్ ఆస్తుల విలువ దాదాపు 150 కోట్లడాలర్ల (రూ.12,300 కోట్లు) పైనే అని అంచనా. ఒక మిడిల్క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన సుందర్ పిచాయ్ తన కలలను సాకారం చేసుకున్న తీరు, ఆయన లైఫ్ జర్నీ భారతీయ యువతకు నిజంగా గొప్ప స్ఫూర్తిదాయక పాఠం. చిన్నప్పుడు తామంతా హాల్లో ఒకే చోట కిందే పడుకునేవారిమని.. మొదటిసారి ఇంట్లోకి ఫ్రిజ్ వచ్చినప్పుడు కలిగిన ఆనందం ఇంకా తన కళ్లముందే కదలాడుతోందంటూ పిచాయ్ ఒక ఇంటర్వ్యూలో నెమరువేసుకున్న తీపిగుర్తులు ఆయన ఏ స్థాయి నుంచి టెక్నాలజీ ఎవరెస్ట్ను అధిరోహించారనేందుకు చిన్న ఉదాహరణ మాత్రమే! మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈఓ సత్య నాదెళ్లదీ దాదాపు ఇలాంటి సక్సెస్ జర్నీయే. ఆయన 2022లో అందుకున్న మొత్తం ప్యాకేజీ 5.5 కోట్లడాలర్లు (రూ. 451 కోట్లు). నాదెళ్ల నెట్వర్త్ సుమారు 81 కోట్ల డాలర్లు (రూ.6,700 కోట్లు)గా అంచనా. ఐబీఎం చీఫ్ అరవింద్ కృష్ణ, పాలో ఆట్లో సీఈఓ నికేష్ అరోరా, స్టార్బక్స్ సీఈఓ లక్ష్మణ్ నరసింహన్ ఇలా భారత సంతతికి చెందిన గ్లోబల్ సీఈఓలు అందరూ ఏటా రూ.150 నుంచి రూ.300 కోట్ల స్థాయిలో వార్షిక వేతన ప్యాకేజీలను అందుకుంటుండటం వారి ప్రతిభకు దక్కుతున్న ప్రతిఫలానికి నిదర్శనం. అపూర్వసహోదరులు.. ప్రపంచ బ్యాంక్ అత్యున్నత పదవి సైతం భారతీయుడినే వరిస్తోంది. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా అజయ్ బంగాను అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఇటీవలే నామినేట్ చేశారు. దీంతో ఈ పదవిని చేపట్టనున్న తొలి భారతీయుడిగా బంగా రికార్డ్ సృష్టించారు. మాస్టర్కార్డ్ సీఈఓగా 12 ఏళ్ల పాటు పని చేసిన అజయ్ బంగా కోవిడ్ సమయంలో కూడా కంపెనీలో ఉద్యోగాల కోత అనేది లేకుండా చూశారు. 50 కోట్లమంది డిజిటల్ ఎకానమీలో భాగస్వామ్యం అయ్యేలా తోడ్పాటు అందించారు. ప్రస్తుతం బంగా పీఈ సంస్థ జనరల్ అట్లాంటిక్ వైస్చైర్మన్గా ఉన్నారు. అంతేకాదు, అజయ్ సోదరుడు ఎంఎస్ బంగా సైతం ప్రపంచ ఎఫ్ఎంసీజీ దిగ్గజం యూనిలీవర్లో టాప్ పొజిషన్లలో పని చేశారు. అంతక్రితం ఆయన హిందుస్థాన్ యూనిలీవర్ సీఈఓగా ఉన్నారు. అంతేకాదు, నోవార్టిస్ సీఈఓ వసంత్ నరసింహన్, కాఫీ కింగ్ స్టార్బక్స్ సీఈఓ లక్ష్మణ్ నరసింహన్ కూడా స్వయానా అన్నదమ్ములే. మరో సోదరుల జంట కూడా గ్లోబల్ సీఈఓలుగా ‘మా ఆట సూడు నాటు.. నాటు.. నాటు’ అంటూ దుమ్ము రేపుతున్నారు. హైబ్రీడ్ క్లౌడ్ డేటా సర్వీసుల గ్లోబల్ కంపెనీ నెట్యాప్ సీఈఓ జార్జ్ కురియన్, గూగుల్క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ ఇద్దరూ ఒకే రంగంలోని రెండు దిగ్గజాలకు సారథ్యం వహిస్తున్నారు. ఈ అపూర్వసహోదరులు... ప్రపంచ కార్పొరేట్రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకుంటూ భారత్కు గర్వకారణంగా నిలుస్తున్నారు. -శివరామకృష్ణ మిర్తిపాటి -
సమ్మర్ రష్: కన్జ్యూమర్ ఉత్పత్తుల తయారీ జోరు
న్యూఢిల్లీ: దేశంలో కన్జ్యూమర్ ఉత్పత్తుల తయారీ సంస్థలు వేసవి సీజన్ కోసం పూర్తి సన్నద్ధమయ్యాయి. ఏటా వేసవిలో సహజంగానే రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, కూలర్లు ఇతర ఉత్పత్తులకు డిమాండ్ గణనీయంగా ఉంటుంది. దీంతో రానున్న మూడు నెలల్లో డిమాండ్ను కంపెనీలు ముందే అంచనా వేస్తున్నాయి. కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీలు తమ ఉత్పత్తిని గడిచిన 18 నెలల్లోనే గరిష్ట స్థాయికి తీసుకెళ్లాయి. ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు ఇప్పటికే అసాధారణంగా నమోదవుతున్నాయి. దీంతో వేసవి ఉత్పత్తులకు డిమాండ్ అనూహ్యంగా ఉండొచ్చన్నది కంపెనీల అంచనా. ఇదీ చదవండి: ‘నాటు నాటు’ జోష్ పీక్స్: పలు బ్రాండ్స్ స్టెప్స్ వైరల్, ఫ్యాన్స్ ఫుల్ ఫిదా! వైట్గూడ్స్ తయారీ సంస్థలు ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, కూలర్లు, చెస్ట్ ఫ్రీజర్లను 90-100 శాతం సామర్థ్యం మేర ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో వీటి ఉత్పత్తి 60-70 శాతం పరిధిలోనే ఉండడం గమనించాలి. అంతేకాదు వేసవి డిమాండ్కు ఎఫ్ఎంసీజీ కంపెనీలు, బీర్ కంపెనీలు కూడా పూర్తి సామర్థ్యం మేరపనిచేస్తున్నాయి. ‘‘చాలాకాలం తర్వాత మా ప్లాంట్లు పూర్తి సామర్థ్యం మేర పనిచేస్తున్నాయి. అంతకుముందు మార్చి నెలతో పోలిస్తే ప్రస్తుతం విక్రయాలు ఇప్పటికే 20 శాతం అధికంగా నమోదవుతున్నాయి’’అని గోద్రేజ్ అప్లయన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది తెలిపారు. (లగ్జరీ ఫ్లాట్లకు ఇంత డిమాండా? మూడు రోజుల్లో రూ. 8 వేల కోట్లతో కొనేశారు!) -
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్ల ఆసక్తి
-
హైదరాబాద్ కంపెనీలకు ‘హిండెన్బర్గ్ బూచి’
సాక్షి, హైదరాబాద్: ‘హిండెన్బర్గ్–అదానీ గ్రూప్’ ఎపిసోడ్ దాదాపు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో ఇటీవల సైబర్ నేరగాళ్లు ఈ తరహా కార్పొరేట్ బెదిరింపులకు దిగుతున్నారు. బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ సంస్థ శుక్రవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. బంజారాహిల్స్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఈ సంస్థకు రూ.వేల కోట్ల టర్నోవర్, దేశ వ్యాప్తంగా క్లయింట్స్ ఉన్నారు. దీని అధికారిక ఐడీకి ఈ నెల మొదటి వారంలో ఓ ఈ–మెయిల్ వచ్చింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఆడిట్ కంపెనీ పంపినట్లు అందులో ఉంది. అందులో అనేక అవకతవకలకు పాల్పడుతూ, రికార్డులను తారుమారు చేయడంతోనే మీ సంస్థకు ఇంత మొత్తం టర్నోవర్ ఉన్నట్లు తమకు తెలిసిందని బెదిరించారు. ఈ విషయం తాము సుదీర్ఘ పరిశోధన తర్వాత గుర్తించామని రాశారు. కొన్ని సందేహాలు తీర్చుకోవడానికి కంపెనీ నిర్వాహకుల వివరాలతో పాటు ఫైనాన్స్ స్టేట్మెంట్స్ తమకు పంపాలని మెయిల్లో కోరారు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండాలంటే తక్షణం తమకు 75 వేల డాలర్లు బిట్ కాయిన్స్ రూపంలో బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. తమ సంస్థకు సంబంధించిన సమస్త సమాచారం పబ్లిక్ డొమైన్లోనే ఉండటం, ప్రముఖ ఆడిటింగ్ కంపెనీగా చెప్తున్న వారికి ఈ విషయం తెలియకపోవడంతో అనుమానించారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. మరో పక్షం రోజుల తర్వాత అదే ఐడీ నుంచి వీరికి మరో ఈ–మెయిల్ వచ్చింది. అందులో డిమాండ్ చేసిన మొత్తం లక్ష డాలర్లు పెరిగిపోయింది. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న నిర్వాహకులు సొంత ఐటీ టీమ్తో ప్రాథమిక దర్యాప్తు చేయించారు. ఈ నేపథ్యంలో దాన్ని బెంగళూరుకు చెందిన సైబర్ నేరగాళ్లు అమెరికా సర్వర్ను వాడి పంపినట్లు తేల్చారు. దీంతో సదరు సంస్థ జనరల్ మేనేజర్ శుక్రవారం సిటీ సైబర్ కైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. -
HYD: ఔటర్ లీజుపై డౌట్!. ‘ఆశించిన ఆదాయం ఉండదేమో’
సాక్షి, హైదరాబాద్: ఔటర్రింగ్ రోడ్డును లీజుకు ఇవ్వడం ద్వారా రూ.వేల కోట్ల ఆదాయాన్ని ఆశిస్తున్న ప్రభుత్వానికి నిర్మాణ సంస్థల నుంచి నిరాసక్తత వ్యక్తమవుతోంది.158 కిలోమీటర్ల ఓఆర్ఆర్ మార్గాన్ని 30 ఏళ్లు పాటు లీజుకు ఇచ్చేందుకు హెచ్ఎండీఏ కార్యాచరణ చేపట్టిన విషయం విదితమే. టోల్–ఆపరేట్– ట్రాన్స్ఫర్ (టీఓటీ)పద్ధతిలో లీజుకు ఇచ్చేందుకు టెండర్లను ఆహ్వానించింది. సుమారు రూ.8 వేల కోట్ల ఆదాయమే లక్ష్యంగా లీజు ప్రక్రియలో భాగంగా గత నెలలో హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రీబిడ్ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో సుమారు 12 దిగ్గజ సంస్థలు పాల్గొన్నాయి. వివిధ అంశాలపై కొన్ని సంస్థలు తమ సందేహాలను వ్యక్తం చేశాయి. సమీప భవిష్యత్తులో అందుబాటులోకి రానున్న రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)తో ఔటర్పై వాహనాల రాకపోకలు తగ్గుముఖం పట్టవచ్చని పలు సంస్థలు సందేహం వ్యక్తం చేశాయి. దీనివల్ల తమ పెట్టుబడులకు తగిన ఆదాయం లభించకపోవచ్చని పేర్కొన్నాయి. ప్రస్తుతం సుమారు 80 శాతం వాణిజ్య వాహనాలు ఔటర్ మీదుగానే రాకపోకలు సాగిస్తున్నాయి. పెరిగిన వాహనాల రాకపోకలు... వివిధ ప్రాంతాల నుంచి వచ్చే లారీలు, ట్రక్కులు వంటి వాణిజ్య వాహనాలతో పాటు వ్యక్తిగత వాహనాలు కూడా ఔటర్ నుంచి పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నాయి. శంషాబాద్, నానక్రాంగూడ, నార్సింగి, పటాన్చెరు, కండ్లకోయ, శామీర్పేట్, కీసర, ఘట్కేసర్, పెద్దఅంబర్పేట్ల మీదుగా మొత్తం 158 కిలోమీటర్లు ఉన్న ఔటర్ మార్గంలో ప్రతి రోజు లక్షకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రస్తుతం ఈగిల్ ఇన్ఫ్రా సంస్థ టోల్ నిర్వహణ చేపట్టింది. దీనిద్వారా ప్రభుత్వానికి ఏటా కొంత మొత్తంలో ఆదాయం లభిస్తోంది. రహదారులు, విద్యుత్, పచ్చదనం తదితర నిర్వహణ బాధ్యతలను హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ పర్యవేక్షిస్తోంది. ఔటర్ మార్గాన్ని లీజుకు ఇవ్వడం వల్ల భారీ ఎత్తున ఆదాయం లభిస్తుందని ప్రభుత్వ అంచనా. ఈ మేరకు ప్రణాళికలను రూపొందించి కార్యాచరణ చేపట్టారు. ఇదీ రీజినల్ రోడ్డు మార్గం.. ►ప్రతిపాదిత రీజినల్ రింగ్రోడ్డు ఉత్తరం దిశలో సంగారెడ్డి, కంది, తూప్రాన్, గజ్వేల్, ప్రజ్ఞాపూర్, యాదాద్రి, చౌటుప్పల్ మీదుగా చేపట్టనున్నారు. దక్షిణం దిశలో ఇబ్రహీంపట్నం, కందుకూరు, చేవెళ్ల, శంకర్పల్లి మీదుగా సంగారెడ్డికి చేరుకుంటుంది. రీజినల్ రింగ్ రోడ్డు మొత్తం 340 కి.మీ. ప్రభుత్వం ఇప్పటికే భూసేకరణ చేపట్టింది. మొదట ఉత్తరం వైపు ఆర్ఆర్ఆర్ పూర్తి చేసి అనంతరం దక్షిణం వైపు చేపట్టనున్నారు. ఆర్ఆర్ఆర్తో నగరంలోనూ, ఔటర్పై ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని అంచనా . ►ఆర్ఆర్ఆర్ ప్రత్యామ్నాయం.. ►ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తయితే బెంగళూరు జాతీయ రహదారి మీదుగా అంతర్రాష్ట్ర వాహనాలు షాద్నగర్ వద్ద ఆర్ఆర్ఆర్ మీదుగా కంది మార్గంలో ముంబైకి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ వాహనాలు శంషాబాద్ వద్ద ఔటర్పైకి ప్రవేశించి పటాన్చెరు నుంచి ముంబై రూట్లో వెళ్తున్నాయి. ఆర్ఆర్ఆర్ అందుబాటులోకి వస్తే బెంగళూరు– ముంబై మధ్య నడిచే వాహనాలకు చాలా వరకు దూరం తగ్గడమే కాకుండా సమయం కూడా కలిసి వస్తుంది. ►బెంగళూరు జాతీయ రహదారి నుంచి విజయవాడకు వెళ్లే వాహనాలు చౌటుప్పల్ వద్ద ఆర్ఆర్ఆర్పైకి ప్రవేశించి షాద్నగర్ వరకు వెళ్లవచ్చు. ప్రస్తుతం ఈ వాహనాలు ఔటర్పై పెద్దఅంబర్పేట్–శంషాబాద్ మార్గంలో వెళ్తున్నాయి. ప్రస్తుతం ఓఆర్ఆర్పై 80 శాతం ఆదాయం భారీ కమర్షియల్ వాహనాల నుంచే లభిస్తోంది. కంటైనర్లు, లారీలు, ట్రక్కులు వంటివి సుమారు 1.06 లక్షల వాహనాలు నడుస్తున్నాయి. ఈ వాహనాలు భవిష్యత్తులో ఆర్ఆర్ఆర్ వైపు మళ్లే అవకాశం ఉంది. -
మాజీ మంత్రి నారాయణకు చెందిన సంస్థల్లో ఉద్యోగులను ప్రశ్నిస్తున్న CID
-
మాజీ మంత్రి నారాయణకు చెందిన సంస్థల్లో తనిఖీలు
-
అమెరికా సంస్థలను దాటేసిన భారత కంపెనీలు
భారత కంపెనీలు మొదటిసారి ఆఫీసు స్పేస్ లీజింగ్ పరిమాణంలో అమెరికా సంస్థలను అధిగమించాయి. దేశ ఆఫీసు లీజు మొత్తం డిమాండ్లో 50 శాతం వాటాను ఆక్రమించాయి. ఈ మేరకు సీబీఆర్ఈ ఇండియా ఓ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం.. 2022లో భారత్లోని తొమ్మిది ప్రధాన పట్టణాల్లో స్థూల ఆఫీసు స్పేస్ లీజు పరిమాణం 40 శాతం పెరిగి 56.6 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ఇది అంతకుముందు సంవత్సరంలో 40.5 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. 2022లో మొత్తం ఆఫీసు లీజులో 27.73 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని భారత కంపెనీలే తీసుకున్నాయి. 20.37 మిలియన్ చదరపు అడుగులను అమెరికా కంపెనీలు లీజుకు తీసుకున్నాయి. టెక్నాలజీ కంపెనీలు, బీఎఫ్ఎస్ఐలు, ఫ్లెక్సిబుల్ స్పేస్ ఆపరేట్లు గతేడాది లీజులో ఎక్కువ భాగాన్ని ఆక్రమించాయి. ఇందులో టెక్నాలజీ సంస్థలు 29 శాతం, ఫ్లెక్సిబుల్ ఆపరేటర్లు 14 శాతం, ఇంజనీరింగ్, తయారీ కంపెనీలు 13 శాతం, బీఎఫ్ఎస్ఐ సంస్థలు 13 శాతం, పరిశోధన, కన్సల్టింగ్, అనలైటిక్స్ కంపెనీలు 7 శాతం చొప్పున లీజింగ్ తీసుకున్నాయి. బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై పట్టణాల్లో దేశీ కంపెనీలు ఎక్కువగా ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. కరోనా నిబంధనలను సడలించడం, అప్పటి వరకు నిలిచిన డిమాండ్ తోడవడం, తిరిగి ఆఫీసుకు వచ్చి పనిచేసే విధానాలు ఆఫీసు స్పేస్ లీజును నడిపించిన అంశాలుగా ఉన్నాయి. ‘‘అభివృద్ధి చెందిన దేశాల్లో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ రిస్క్లకు సంబంధించి పూర్తి ప్రభావం కార్పొరేట్ల లీజింగ్ నిర్ణయాలపై ఇంకా ప్రతిఫలించాల్సి ఉంది’’అని సీబీఆర్ఈ ఇండియా చైర్మన్, సీఈవో అన్షుమన్ మేగజిన్ తెలిపారు. నిపుణుల లభ్యత, తక్కువ వ్యయాలతో భారత్ ఇక ముందూ ఆకర్షణీయంగా ఉంటుందన్నారు. అంతర్జాతీయ సంస్థలు తమ కార్యకలాపాలను ఆప్టిమైజ్ చేసుకునేందుకు భారత్ వైపు చూడొచ్చని చెప్పారు. చదవండి: కొత్త చిక్కుల్లో ఎలాన్ మస్క్.. ఈ సారి పెద్ద తలనొప్పే వచ్చింది! -
తయారీ రంగంలో ఉద్యోగాల జోరు!
ముంబై: తయారీ రంగంలోని అధిక శాతం కంపెనీలు ఈ ఏడాది(2022–23) చివరి త్రైమాసికంలో ఉద్యోగ కల్పనా ప్రణాళికల్లో ఉన్నట్లు ఒక సర్వే పేర్కొంది. జనవరి–మార్చి(క్యూ4)లో మరింత మందికి ఉపాధి కల్పించనున్నట్లు ఎంప్లాయ్మెంట్ ఔట్లుక్ రిపోర్ట్ పేరిట టీమ్లీజ్ విడుదల చేసిన సర్వే తెలియజేసింది. భారీస్థాయి కంపెనీలు 69 శాతం, మధ్యస్థాయి సంస్థలు 44 శాతం, చిన్నతరహా బిజినెస్లు 39 శాతం ఆసక్తిని వ్యక్తం చేసినట్లు వివరించింది. సర్వేకు దేశవ్యాప్తంగా 14 నగరాల నుంచి తయారీ రంగంలోని 301 కంపెనీలను పరిగణించినట్లు తెలియజేసింది. 60 శాతానికిపైగా యాజమాన్యాలు తమ మానవ వనరులను విస్తరించే యోచనలో ఉన్నట్లు సర్వే పేర్కొంది. ఇక తయారీ, సర్వీసుల రంగాల ఉపాధి ప్రణాళికలు సంయుక్తంగా 68 శాతానికి బలపడినట్లు తెలియజేసింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో ఇది 65 శాతమేనని ప్రస్తావించింది. ఉపాధి కల్పనా ప్రణాళికల జాబితాలో ముంబై(97 శాతం), బెంగళూరు(94 శాతం), చెన్నై(89 శాతం), ఢిల్లీ(84 శాతం), పుణే(73 శాతం) ముందున్నట్లు పేర్కొంది. -
మహిళలకు బంపరాఫర్.. పిలిచి మరి ఉద్యోగాలిస్తున్న దిగ్గజ కంపెనీలు!
న్యూఢిల్లీ: కార్పొరేట్ సంస్థలు మరింత మంది మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని అనుకుంటున్నాయి. కాగ్నిజంట్, ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ, కేపీఎంజీ, యాక్సిస్ బ్యాంకు, ష్నీడర్ ఎలక్ట్రిక్, సిప్లా, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ తదితర ఎన్నో సంస్థలు తమ ఉద్యోగుల్లో స్త్రీ/పురుషుల నిష్పత్తి మరింత మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నాయి. ఇప్పటి వరకు మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండగా, మరింత పెంచాలని భావిస్తున్నాయి. ఇందుకు సంబంధించి చర్యలను కొన్ని సంస్థలు ఇప్పటికే అమలు చేస్తున్నాయి. సౌకర్యవంతంగా పనిచేసే ఏర్పాట్లు చేయడం, ట్రైనీలుగా, ఫ్రెషర్లుగా క్యాంపస్ల నుంచి తీసుకోవడం, సీనియర్ స్థాయిలో మార్గదర్శకులుగా నియమించుకోవడం, టీమ్ లీడ్ బాధ్యతల్లోకి మహిళలను తీసుకోవడం వంటివి సంస్థలు అమలు చేస్తున్నాయి. సెకండర్ కెరీర్ (విరామం తర్వాత మళ్లీ చేరడం) మహిలకు సైతం ప్రాధాన్యత ఇస్తున్నాయి. మంచి ఐడియాలకు నాంది ఉద్యోగుల్లో స్త్రీ/పురుషుల పరంగా మంచి వైవిధ్యం ఉంటే మెరుగైన ఆలోచనలు, ఆవిష్కరణలకు అవకాశం ఉంటుందని ఎల్అండ్టీ కార్పొరేట్ హ్యుమన్ రీసెర్సెస్ హెడ్ సి.జయకుమార్ తెలిపారు. వైవిధ్యంతో కూడిన బృందం ఇతరులతో పోలిస్తే ఎంత మెరుగైన ఫలితాలు ఇస్తుందనే దానిపై అధ్యయనాలు కూడా ఉన్నట్టు చెప్పారు. మంచి నైపుణ్యాలు కలిగిన మహిళా ఉద్యోగులను తాము కోల్పోకూడదనే ఉద్దేశ్యంతో ఉన్నట్టు పేర్కొన్నారు. మహిళలను ఆకర్షించేందుకు పనిలో సౌకర్యంపై దృష్టి పెట్టాలని చాలా కంపెనీల అభిప్రాయపడుతున్నాయి. ఐటీసీ అయితే మహిళా ఉద్యోగుల విధుల నిర్వహణలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. చంటి పిల్లలు ఉన్న ఉద్యోగినులకు సంరక్షకుల సేవలు, ప్రత్యేక రవాణా వసతులను సైతం సమకూరుస్తోంది. యాక్సిస్ బ్యాంకు అయితే ప్రత్యామ్నాయ పని నమూనాలతో నైపుణ్యాలు కలిగిన మహిళలను ఆకర్షిస్తోంది. ‘గిగ్–ఏ’ అవకాశాల పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమం కింద 44 శాతం అధికంగా మహిళలను నియమించుకున్నట్టు బ్యాంక్ హెచ్ హెడ్ రాజ్కమల్ వెంపటి తెలిపారు. పోటీతత్వం.. ఎల్అండ్టీ మహిళల డిమాండ్లను సానుకూల దృక్పథంతో పరిశీలిస్తోంది. ఎవరైనా వేరే పట్టణానికి బదిలీ చేయాలని కోరితే, సాధ్యమైన మేర వారు కోరిన ప్రాంతంలో సర్దుబాటుకు ప్రయత్నిస్తోంది. వైవిధ్యమైన మానవ వనరులతో పోటీతత్వం పెరుగుతుందని ఐటీసీ కార్పొరేట్ హ్యూమన్ రీసోర్సెస్ హెడ్ అమితవ్ ముఖర్జి పేర్కొన్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో లింగ నిష్పత్తి ప్రస్తుతం 23.3 శాతంగా ఉంది. అంటే ప్రతి 100 మందికి గాను 23 మంది మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వైవిధ్యాన్ని పెంచడం కోసం గత కొన్ని త్రైమాసికాలుగా బ్యాంక్ తీసుకుంటున్న చర్యలతో ఇది పెరుగుతూ వస్తోంది. ఇందుకోసం ఓ నిర్మాణాత్మక విధానాన్ని అనుసరిస్తోంది. క్యాంపస్ నియామకాలకు ఇచ్చినంత ప్రాధాన్యాన్ని, సెకండ్ కెరీర్ మహిళల విషయంలోనూ కంపెనీలు చూపిస్తుండడం సానుకూలం. అధిక నైపుణ్యాలు, సామర్థ్యాలు ఉన్న మహిళలు తిరిగి చేరేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆహ్వానం పలుకుతోంది. ఇందుకు రెండు విధానాలను అనుసరిస్తోంది. పిల్లల కోసం కెరీర్ బ్రేక్ తీసుకున్న వారిని తిరిగి నియమించుకోవడం, గత ఐదేళ్లలో సంస్థను వీడిని వారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం చేస్తోంది. ఉన్న మహిళా ఉద్యోగులను కాపాడుకోవడం, కొత్త వారికి అవకాశాలు ఇవ్వడాన్ని కాగ్నిజంట్ అనుసరిస్తోంది. 2020 నుంచి డైరెక్టర్, ఆ పై స్థాయి వారికి ఇందుకోసం ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించింది. చదవండి👉 ఐటీ జాబ్ పొందడమే మీ లక్ష్యమా? రెజ్యూమ్లో ఈ తప్పులు చేయకండి! -
ఎఫ్ఎంసీజీ కంపెనీలకు ద్రవ్యోల్బణం షాక్! అక్కడ డిమాండ్ ఢమాల్!
ముంబై: ఎఫ్ఎంసీజీ కంపెనీలు వ్యాపారంలో స్తబ్దతను చూస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ సన్నగిల్లడం, అధిక ద్రవ్యోల్బణం పరిస్థితుల నేపథ్యంలో ఎఫ్ఎంసీజీ ఆదాయాల్లో పెద్దగా వృద్ధి కనిపించదని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికే పరిమితం కాకుండా, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే పరిస్థితి కొనసాగొచ్చని పేర్కొంది. 2022-23లో 7-9 శాతం మధ్య ఆదాయంలో వృద్ధి నమోదు కావచ్చన్న అంచనాను వెల్లడించింది. (బడా టెక్ కంపెనీల నియంత్రణలో వైఫల్యం: కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు) గత ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఎంసీజీ పరిశ్రమ ఆదాయం 8.5 శాతం వృద్ధిని చూడడం గమనార్హం. ‘‘రూ.4.7 లక్షల కోట్ల మొత్తం ఆదాయంలో 40 శాతం గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తోంది. ఇప్పుడు ఈ ప్రాంతాల్లో అధిక ద్రవ్యోల్బణం, తగ్గిన వేతనాలు, కరోనాతో ఉపాధి నష్టం పరిస్థితులు నెలకొన్నట్టు’’ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఎఫ్ఎంసీజీ రంగంపై ఓ నివేదికను విడుదల చేసింది. తయారీ వ్యయాలు పెరగడంతో, మార్జిన్లను కాపాడుకునేందుకు కరోనా అనంతరం విడతల వారీగా రేట్లను ఎఫ్ఎంసీజీ కంపెనీలు పెంచాయి. దీని ప్రభావం కూడా వృద్ధిపై ఉన్నట్టు ఈ నివేదిక వివరించింది. (టెల్కోలకు భారీ ఊరట, 4జీ యూజర్లకు గుడ్ న్యూస్) ధరలు తగ్గితే అనుకూలం.. ద్రవ్యోల్బణం ఇప్పటికీ గరిష్ట స్థాయిల్లోనే ఉన్నందున వచ్చే ఆర్థిక సంవత్సరం సైతం ఆదాయంలో వృద్ధి ఇప్పటి మాదిరే ఉండొచ్చని, ఒకవేళ ధరలు దిగొస్తే పరిస్థితి మెరుగుపడొచ్చన్నది క్రిసిల్ విశ్లేషణ. కంపెనీల నిర్వహణ మార్జిన్లు 1-1.5 శాతం తగ్గి 18-19 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. తయారీ వ్యయాలు (గోధుమ, పాలు, మొక్కజొన్న, బియ్యం, చమురు), మార్కెటింగ్ వ్యయాలు అధికంగా ఉండడాన్ని ప్రస్తావించింది. ఇవి గత నాలుగైదు త్రైమాసికాలుగా పెంచిన ధరల అనుకూలతను తగ్గించినట్టు వివరించింది. ఇక వంట నూనెలు, చక్కెర ధరలు తగ్గినందున కొంత అనుకూలిస్తుందని పేర్కొంది. రూ.4.7 లక్షల కోట్ల ఎఫ్ఎంసీజీ పరిశ్రమలో 35 శాతం వాటా కలిగిన 76 కంపెనీల వివరాలను క్రిసిల్ విశ్లేషించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ మార్జిన్లు 0.50–0.70 శాతం మేర పెరగొచ్చని అంచనా వేసింది. ధరల ప్రభావం.. పట్టణ వినియోగంపై ద్రవ్యోల్బణం (రేట్ల పెరుగుదల) ప్రభావం తక్కువగానే ఉందని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేతి తెలిపారు. 2020-2021లో మాదిరే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ స్తబ్ధుగానే ఉంటుందన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంత్లాలో చిన్న ప్యాకెట్లకు డిమాండ్ పెరగడాన్ని క్రిసిల్ ప్రస్తావించింది. పంటలకు అధిక కనీస మద్దతు ధరలు, సాగు దిగుబడి మెరుగ్గా ఉండడం గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ వచ్చే ఆర్థిక సంత్సరంలో పుంజుకుంటుందని చెప్పడానికి సంకేతాలుగా తెలియజేసింది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం పట్టణాల్లో డిమాండ్ స్థిరంగా ఉంటుందని క్రిసిల్ అంచనా వేసింది. ఇక ఫుడ్ అండ్ బెవరేజెస్ అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరంలో 8-10 శాతం పెరగొచ్చని పేర్కొంది. గృహ సంరక్షణ, వ్యక్తిగత సంరక్షణ అమ్మకాల్లో 6-8 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. -
ఉద్యోగాలు ఊడుతున్న వేళ.. గుడ్ న్యూస్ చెబుతున్న కంపెనీలు
ప్రపంచ దేశాల్లో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండడం, ఇంధన ధరలు పెరిగిపోవడం, ఉక్రెయిన్పై రష్యా యుద్ధం, కోవిడ్-19 వంటి కారణాలతో వచ్చే ఏడాది ఆర్ధిక మాంద్యం అతలా కుతలం చేస్తుందంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ సర్వేలో 63 శాతం మంది ఆర్ధిక వేత్తలు హెచ్చరించారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా చిన్నా చితకా,పెద్ద, మధ్య తరగతి ఇలా కంపెనీ ఏదైనా సరే ఎంప్లయూస్ను వదిలించుకునేందుకు రెడీ అవుతున్నాయి.అదే సమయంలో వందలాది కంపెనీలు ఉద్యోగులకు ఊరట కల్పిస్తూ నిర్ణయాలు తీసుకోవడం చర్చాంశనీయంగా మారింది. సాఫ్ట్వేర్ మొదలు ఈ కామర్స్ కంపెనీల దాకా..చిన్నా పెద్దా అనే తేడాలేదు. అన్నీ కంపెనీలదీ అదే బాట. అదే మాట. ఉద్యోగుల్ని ఇంటికి పంపేందుకే నిర్ణయించుకుంటున్నాయి. మొన్న ట్విటర్ ఆ తర్వాత మెటా, ఇప్పుడు జొమాటో, అమెజాన్ ఇలా వరుసపెట్టి ప్రముఖ కంపెనీలన్నీ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి. అయితే ఈ నేపథ్యంలో యూకేకి చెందిన కంపెనీలు వేతనాల్ని తగ్గించకుండా ఉద్యోగులందరు వారానికి నాలుగురోజులు పనిచేసేందుకు అంగీకరిస్తున్నాయి. 100 కంపెనీల్లో విధులు నిర్వహిస్తున్న 2,600 మంది పనిదినాల్ని తగ్గించాయి. రానున్న రోజుల్లో యూకే దేశానికి చెందిన మొత్తం కంపెనీలు ఈ తరహా పని విధానాన్ని అమలు చేసే అవకాశం ఉందని అంతర్జాతీయ హెచ్ఆర్ విభాగం నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రొడక్టివిటీ పెరుగుతోంది 5 రోజుల పనిదినాల్ని 4రోజులకు తగ్గించడం వల్ల సంస్థల్లో సిబ్బంది పనితీరు మెరుగుపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే పనిని తక్కువ గంటల్లో పూర్తి చేసేలా సంస్థల్ని ప్రోత్సహిస్తుందని వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ పని విధానాన్ని ముందుగా అమలు చేసిన సంస్థల్లో ఉద్యోగులు రిజైన్ చేయడం కానీ లేదంటే ఆఫర్ పేరతో మరో సంస్థలో చేరే సాహాసం చేయరని తెలుస్తోంది. కొత్త వర్కింగ్ ప్యాటర్న్పై కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్, బోస్టన్ యూనివర్సిటీల సైంటిస్ట్లు పరిశోధనలు నిర్వహించారు. వారి రీసెర్చ్లో సైతం ఆయా సంస్థలు 88 శాతం వారానికి 4రోజుల పని కారణంగా రోజూవారీ కార్యకలాపాలు చురుగ్గా సాగుతున్నట్లు తేలింది. చదవండి👉 ఉద్యోగం పోయిందా?.. అయితే ఇది మీ కోసమే! -
సాఫ్ట్వేర్ ఉద్యోగులకు భారీ షాక్!, వచ్చే ఏడాది మిగిలిన రంగాల్లో..
మరో నెల రోజుల్లో 2022 గుడ్ బై చెప్పి న్యూఇయర్ని ఆహ్వానించబోతున్నాం. ఈ కొత్త సంవత్సరంలో మార్చి నెల ముగిసే సమయానికి (ఆర్ధిక సంవత్సరం) అన్నీ రంగాల్లో పనిచేస్తున్న ప్రైవేట్ ఉద్యోగుల శాలరీలు పెరుగుతాయని ఆశగా ఎదురు చూస్తుంటారు. కానీ వచ్చే ఏడాది వారి ఆశలు అడియాశలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదితో పోలిస్తే జీతాల పెంపు 2023 తక్కువగా ఉండనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. డెలాయిట్ ఇండియా మన దేశానికి చెందిన సుమారు 300 కంపెనీల నుండి డేటా సేకరించింది. ఆ డేటా ప్రకారం..వచ్చే ఏడాది ఏ విభాగంలో శాలరీ హైక్స్ ఎక్కువగా ఉంటాయి. ఏయే రంగాల్లో జీతాలు పెంపు తక్కువగా ఉంటుందో తెలిపింది. ఆ రిపోర్ట్ ఆధారంగా ఫైనాన్షియల్ ఇయర్ - 2022లో జనవరి-డిసెంబర్ సంస్థల పనితీరు కారణంగా 2023 ఆర్ధిక సంవత్సరంలో వేతన పెంపు తక్కువగా ఉంటాయని అంచనా. పెరిగే రంగాలు? ముఖ్యంగా భారత ఎకానమీకి ఆర్ధికంగా వెన్నదన్నుగా నిలిచే రంగాలైన హాస్పిటాలిటీ, ట్రావెల్, టూరిజం, కన్స్యూమర్/ఎఫ్ఎంసీజీ, పవర్ వంటి రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ ఏడాది కంటే వచ్చే ఏడాది శాలరీ హైకులు ఎక్కువగా ఉంటాయని ఎకనామిక్ టైమ్స్కు డెలాయిట్ ఇండియా తెలిపింది. మరి టెక్ కంపెనీల్లో? ఇక ముంచుకొస్తున్న ఆర్ధిక మాంద్యం భయాల కారణంగా టెక్ కంపెనీలు ఖర్చుల్ని తగ్గించుకుంటున్నాయి. తద్వారా టెక్ కంపెనీల్లో శాలరీల పెంపు తక్కువగా ఉంటాయని తెలుస్తోంది. దీనికి తోడు ప్రస్తుత పరిస్థితుల్లో రెసిషన్ భయాలు వణికించడంతో టెక్నాలజీ రంగం గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటుందని, అందుకు మెటా, అమెజాన్, ట్విటర్, మైక్రోసాఫ్ట్ కంపెనీలతో పాటు ఇతర టెక్ కంపెనీల పనితీరే నిదర్శనమని డెలాయిట్ నివేదిక హైలెట్ చేస్తుంది. వచ్చే ఏడాది సైతం ఐటీ రంగం ఈ తరహా ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలు ఎక్కుగా కనిపిస్తున్నాయని ఆ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వేతన పెంపు , నిలిచి పోనున్న నియామకాలు! ఐటీ ప్రొడక్ట్ కంపెనీల్లో శాలరీల పెంపు 2022 ఆర్థిక సంవత్సరంలో 12 శాతంగా ఉండగా.. 2023 ఆర్థిక సంవత్సరంలో 11.3 శాతం పెరుగుతాయని అంచనా. ఐటి సర్వీసెస్ లో వేతన పెంపు 2022 ఆర్థిక సంవత్సరంలో 9.4 శాతంతో పోలిస్తే 2023లో 8.8 శాతంగా ఉండనుంది. థర్డ్ పార్టీ ఐటి సేవలు 2022 ఆర్థిక సంవత్సరంలో 8.7 శాతం నుండి 2023 ఆర్థిక సంవత్సరంలో 7.8 శాతం వద్ద ఉంటాయని అంచనా వేయగా..క్యాప్టివ్ సేవలు (ఔట్ సోర్సింగ్) 2022 ఆర్థిక సంవత్సరంలో 10.5 శాతం నుండి 2023 ఆర్థిక సంవత్సరంలో 10.4 శాతానికి తగ్గుతాయని భావిస్తున్నారు. వేతనాల పెంపు ఇలా ఉంటే కొత్త నియామకాలు కాస్త తగ్గుముఖం పట్టొచ్చని అంచనా. జోరుమీదున్న సర్వీస్ సెక్టార్ సర్వీస్ సెక్టార్లో అప్రైజల్ అంచనాలు 2023 ఆర్థిక సంవత్సరంలో 9.4 శాతంగా ఉన్నాయి. ఇది 2022 ఆర్థిక సంవత్సరంలో 8.9 శాతంగా ఉంది. అదేవిధంగా, హాస్పిటాలిటీ, ట్రావెల్ అండ్ టూరిజం రంగంలోని ఉద్యోగులు ఈ ఆర్థిక సంవత్సరంలో 9.6 శాతం వేతన పెంపును పొందవచ్చు, ఇది 2022 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం నుండి పెరిగింది. రిటైల్ విభాగంలో శాలరీల పెరుగుదల స్థూలంగా 8.0 శాతం వద్ద ఫ్లాట్ గా ఉంటుందని భావిస్తున్నారు. కన్స్యూమర్/ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) విభాగంలో ఇంక్రిమెంట్లు 9.8 శాతం ఉండనున్నాయి. పవర్, పునరుత్పాదక శక్తిని(రెన్యూవబుల్ ) వంటి విభాగాల్లో శాలరీలు పెరగనున్నాయని భావిస్తున్నారు. పునరుత్పాదక ఉద్యోగులు 9.6 శాతం నుండి 11 శాతం పెరుగుదలను చూస్తున్నారు. సంప్రదాయ విద్యుత్ రంగంలోని కార్మికులు 2022 ఆర్థిక సంవత్సరంలో 9 శాతం నుండి 9.5 శాతం ఇంక్రిమెంట్లను చూడవచ్చు. ఫార్మాలో 8.9 శాతం వద్ద ఫ్లాట్గా ఉంటాయని భావిస్తున్నారు. -
ED Raids Telangana: గ్రానైట్ కంపెనీల్లో సోదాలపై ఈడీ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: గ్రానైట్ కంపెనీల్లో సోదాలపై ఈడీ కీలక ప్రకటన చేసింది. శ్వేత గ్రానైట్స్, శ్వేత ఏజెన్సీస్, శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్, పీఎస్ఆర్ గ్రానైట్స్, అరవింద్ గ్రానైట్స్, గిరిరాజ్ షిప్పింగ్ ఏజెన్సీస్లో రెండు రోజులు సోదాలు జరిపినట్లు వెల్లడించింది. హైదరాబాద్, కరీంనగర్లోని పలుచోట్ల సోదాలు చేసినట్లు పేర్కొంది. ఫెమా నిబంధనల ఉల్లంఘనపై ఈడీ సోదాలు నిర్వహించింది. రాయల్టీ చెల్లించిన దానికంటే ఎక్కువ గ్రానైట్ను విదేశాలకు ఎగుమతి చేసినట్టు ఈడీ గుర్తించింది. సోదాల్లో రూ.1.8 కోట్ల నగదు ఈడీ సీజ్ చేసింది. ఉద్యోగులతో బినామీ అకౌంట్లు తెరిచినట్లు అధికారులు గుర్తించారు. పదేళ్లుగా భారీగా హవాలా లావాదేవీలు జరిపినట్లు తేలింది. చైనా, హాంకాంగ్కు చెందిన కంపెనీల పాత్రపై ఈడీ ఆరాతీసింది. ఎలాంటి పత్రాలు లేకుండా చైనా సంస్థల నుంచి నగదు మళ్లించడాన్ని గుర్తించినట్టు ఈడీ వెల్లడించింది. చదవండి: మంత్రి గంగులపై ఫిర్యాదు చేసింది నేనే -
క్యూ కడుతున్న టాప్ కంపెనీలు: అయ్యయ్యో ఎలాన్ మస్క్!
న్యూఢిల్లీ: ట్విటర్ టేకోవర్ తరువాత ఎలాన్ మస్క్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మైక్రో బ్లాకింగ్ సైట్లో ప్రకటనలు నిలిపివేస్తున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ఫోక్స్వ్యాగన్ ట్విటర్లో చెల్లింపు ప్రకటనలను నిలిపివేయగా, తాజాగా మరిన్ని కంపెనీలు ఈ రేస్లో దూసు కొస్తున్నాయి. ఆదాయాన్ని పెంచుకునే వ్యూహంలో భాగంగా బ్లూటిక్ ఫీజు, ఖర్చులను తగ్గించుకునే పనిలో సగంమంది ఉద్యోగులను ఇంటికి పంపిన ట్విటర్కు తాజా పరిణామాలు భారీ షాకిస్తున్నాయి. ఇదీ చదవండి: ElonMusk సంచలన ప్రకటన: ఎడ్వర్టైజర్లకు బూస్ట్? ట్విటర్ టేకోవర్ తరువాత యూజర్ల సంఖ్య భారీగా పెరిగిందని మస్క్ బూస్ట్ ఇస్తున్నప్పటికీ ఓరియోస్, ఆడి కూడా ప్రకటనలను ఆపివేస్తున్నట్టు ప్రకటించాయి. సీఈఓ డిర్క్ వాన్ డి పుట్ మంగళవారం రాయిటర్స్ న్యూస్మేకర్ ఇంటర్వ్యూలో ఓరియోస్ తయారీదారు మోండెలెజ్ ట్విటర్లో తన ప్రకటనలను ఆపివేసినట్లు తెలిపారు. మస్క్ సొంతమైన తరువాత ట్విటర్లో ఇటీవల ద్వేషపూరిత ప్రసంగాల పరిమాణం గణనీయంగా పెరిగిందని పుట్ వ్యాఖ్యానించారు. ఈ ప్రభావం తమ ప్రకటనలపై చూపనుందనీ, ఈ ప్రమాదం తగ్గేంతవరకూ బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. (రూ.2 వేల నోట్లు: షాకింగ్ ఆర్టీఐ రిప్లై) గత వారం, కంటెంట్ ఫిల్టరింగ్పై ఆందోళనల కారణంగా ప్రకటనదారులు ట్విటర్ యాడ్స్నుంచి వెనక్కి తగ్గుతున్నారు. ముఖ్యంగా యునైటెడ్ ఎయిర్లైన్స్, జనరల్ మిల్స్, లగ్జరీ ఆటోమేకర్ ఆడి ఆఫ్ అమెరికా, జనరల్ మోటార్స్ లాంటి అనేక ముఖ్యమైన కంపెనీలు ప్రకటనలను నిలిపి వేశాయి. గిలియడ్ సైన్సెస్, దాని విభాగం కైట్ కూడా ఇదే ప్రాసెస్లో ఉన్నట్ట ప్రకటించింది. -
అక్కడ ఐటీ ఎంప్లాయిస్ కి గోల్డెన్ వీసా... ఇంకెన్నో ఫేసిలిటీస్