Sri Sathya Sai District Latest News
-
రంపం.. తీసింది ప్రాణం
● రోడ్డు ప్రమాద మృతి కేసులో వీడిన మిస్టరీ ధర్మవరం అర్బన్: ద్విచక్రవాహనంపై అజాగ్రత్తగా తీసుకొస్తున్న రంపం మరో ద్విచక్రవాహనదారుడి ప్రాణం తీసింది. రోడ్డు ప్రమాదంగా తొలుత నమోదైన ఈ కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివరాలిలా ఉన్నాయి. ధర్మవరం పట్టణంలోని మహాత్మాగాంధీ కాలనీకి చెందిన బేల్దారి ఎం.ఆంజనేయులు (50) ఈ నెల 19న రాత్రి లక్ష్మీచెన్నకేశవపురం వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆంజనేయులు మృతికి కారణం ఒక రంపమని పోలీసులు గుర్తించారు. లక్ష్మీచెన్నకేశవపురం సమీపంలోని భవనాలకు ఉన్న సీసీ కెమెరాలోని ఫుటేజీలో రాత్రి ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై పెద్ద పెద్ద చెట్లు కోసే రంపాన్ని తీసుకుని వెళుతున్నారు. ఆ సమయంలో ద్విచక్రవాహనంలో వెళుతున్న ఆంజనేయులు మెడకు పక్కనే ద్విచక్రవాహనంలో తీసుకెళుతున్న రంపం తగిలింది. దీంతో ఆంజనేయులు మెడ తెగి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ హఠాత్పరిణామంతో రంపం తీసుకెళుతున్న ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి ఉడాయించారు. సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజీ ఆధారంగా పోలీసులు రంపం తీసుకెళుతున్న ఇద్దరు వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. నేడు ‘పది’ ఫలితాలు పుట్టపర్తి: పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పరీక్షలు రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, బంధువుల్లో ఉత్తీర్ణతపై ఆందోళన నెలకొనగా... రాష్ట్రస్థాయిలో జిల్లా స్థానంపై విద్యాశాఖ అధికారులు కలవరపడుతున్నారు. మార్చి 17 నుంచి ప్రారంభమైన పది పరీక్షలు ఈనెల 1తో ముగిశాయి. జిల్లాలో రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు 22,087 మంది పరీక్షలకు హాజరయ్యారు. -
విప్ ధిక్కరిస్తే అనర్హత వేటు
కదిరి అర్బన్/ కదిరి టౌన్/ ప్రశాంతి నిలయం: కదిరి మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచిన 30 మంది కౌన్సిలర్లకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్ జారీ చేశారు. విప్ను ధిక్కరించిన వారిని పార్టీ నుంచి బహిష్కరించి అనర్హత వేటు వేయనున్నారు. ఈ మేరకు విప్ కాపీని మంగళవారం పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ ప్రణీత్రెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు కలెక్టర్ చేతన్, ఆర్డీఓ వీవీఎస్ శర్మలకు వేర్వేరుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమ మార్గంలో మున్సిపల్ చైర్పర్సన్ పీఠం చేజిక్కించుకోవడానికి టీడీపీ కుయుక్తులు పన్నుతోందన్నారు. ఇందు కోసం వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేస్తోందన్నారు. లొంగని వారిని బెదిరింపులకు గురి చేస్తోందని తెలిపారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి, నిబంధనల మేరకు అవిశ్వాస తీర్మాన కార్యక్రమం నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. కార్యక్రమంలో చైర్పర్సన్ పరికి నజీమున్నీసా భర్త సాధిక్, కౌన్సిలర్లు రాంప్రసాద్, ఆవుల స్వామి, మహ్మద్, నాయకులు షబ్బీర్, నూరుల్లా, షాను తదితరులు పాల్గొన్నారు. నేడు అవిశ్వాస తీర్మానం.. కదిరి మున్సిపల్ కార్యాలయంలో బుధవారం చైర్పర్సన్ పరికి నజీమున్నీసాతో పాటు వైస్చైర్పర్సన్లు కొమ్ము గంగాదేవి, రాజశేఖరరెడ్డిలపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఆర్డీఓ వెంకట సన్యాసి శర్మ వ్యవహరించనున్నారు. మున్సిపాలిటిలో 36 వార్డులు ఉన్నాయి. ఇందులో వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచిన కౌన్సిలర్లు 30 మంది, టీడీపీ నుంచి ఐదుగురు, టీడీపీ రెబల్గా గెలిచిన ఇండిపెండెంట్ ఒకరున్నారు. సార్వత్రిక ఎన్నికల సమ యంలో వైఎస్సార్సీపీ నుంచి ఆరుగురు కౌన్సిలర్లు టీడీపీలోకి చేరారు. సంఖ్యా బలం తక్కువ ఉన్నప్పటికీ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకునేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. బెదిరింపులు, ప్రలోభాలతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను తమవైపు లాక్కుని బెంగళూరు క్యాంపునకు తీసుకెళ్లింది. వీరంతా బుధవారం బెంగళూరు నుంచి నేరుగా కదిరి మున్సిపల్ కార్యాలయానికి చేరుకుంటారు. కలెక్టర్, ఆర్డీఓకు కదిరి మున్సిపల్ కౌన్సిలర్లు, వైఎస్సార్సీపీ నేతల వినతి -
భువనేశ్వర్–యశ్వంత్పూర్ మధ్య ప్రత్యేక రైళ్లు
గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా భువనేశ్వర్–యశ్వంత్పూర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఏ.శ్రీధర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మే 24 నుంచి జాన్ 28 వరకు ప్రతి శనివారం భువనేశ్వర్ (02811) జంక్షన్ నుంచి యశ్వంత్పూర్కు రైలు బయలుదేరుతుందన్నారు. అదేవిధంగా మే 26 నుంచి జూన్ 30 తేదీ వరకు ప్రతి సోమవారం యశ్వంత్పూర్ జంక్షన్ నుంచి బయలుదేరుతుందన్నారు. విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నరసరావుపేట, మార్కాపురం రోడ్డు, గిద్దలూరు, నంద్యాల, డోన్, ధర్మవరం జంక్షన్, ఎస్ఎస్ఎస్పీ నిలయం, హిందూపురం రైల్వేస్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుందన్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 3 రోజుల సంతాప దినాలు ప్రశాంతి నిలయం: పోప్ ఫ్రాన్సిస్ మృతికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22 నుంచి మూడు రోజులపాటు సంతాప దినాలు ప్రకటించిందని కలెక్టర్ చేతన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంతాప దినాల సమయంలో ఆంధ్రప్రదేశ్ అంతటా జాతీయ జెండా సగం వరకు ఎగురవేయనున్నట్లు పేర్కొన్నారు. సివిల్స్లో కదిరి వాసికి 918వ ర్యాంకు కదిరి అర్బన్: యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో కదిరి పట్టణానికి చెందిన జి.సాయి షణ్ముఖకు 918వ ర్యాంకు వచ్చింది. అడపాలవీధిలో నివాసం ఉంటున్న రిటైర్డు ఏఎస్ఐ నరసింహులు, విజయభారతి దంపతుల కుమారుడు సాయి షణ్ముఖ సివిల్స్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని ఢిల్లీలో ఆరేళ్లుగా ప్రిపేరవుతున్నాడు. ఐదవ ప్రయత్నంలో విజయం సాధించాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తానీ స్థాయికి చేరుకున్నానని సాయి షణ్ముఖ తెలిపాడు. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో ధర్మవరం విద్యార్థుల సత్తా ధర్మవరం అర్బన్: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో ధర్మవరం విద్యార్థులు సత్తా చాటారు. మంగళవారం ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. ధర్మవరం పట్టణంలోని దుర్గానగర్లో నివసిస్తున్న హోంగార్డు కేఎస్ మహేష్, శ్యామల దంపతుల కూతురు హేమనందిని హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ఎంపీసీ చదువుతోంది. ఇంటర్ ఫస్టియర్, ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో 1000 మార్కులకు 990 మార్కులు సాధించింది. ధర్మవరం పేరు నిలబెట్టింది. స్టేట్ సెకండ్ ర్యాంకు.. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో ధర్మవరం పట్టణంలోని కేశవనగర్కు చెందిన అచ్యుత శ్రీనివాసులు, ఉమామహేశ్వరి దంపతుల రెండో కుమారుడు అచ్యుత భానుప్రకాష్ ఎంఈసీలో 500 మార్కులకు 495 మార్కులతో తెలంగాణ రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచాడు. కాగా హేమనందిని, భానుప్రకాష్ ధర్మవరంలోని పీసీఎంఆర్ పాఠశాలలో పదో తరగతి చదివారు. -
పేదోడి బండి మరోసారి రద్దు
ముదిగుబ్బ: పేదలకు రైలు ప్రయాణం మరోమారు దూరం అయ్యింది. ధర్మవరం – తిరుపతి మార్గంలో తక్కువ టికెట్ ధరకే రాకపోకలు సాగించేవారు. ఇటీవల కుంభమేళా సందర్భంగా మూడు నెలలపాటు ప్యాసింజర్ రైళ్లు తాత్కాలికంగా రద్దు చేశారు. పునరుద్ధరణ తర్వాత నెల రోజులకే మరోమారు ప్యాసింజర్ రైళ్ల రాకపోకలకు బ్రేక్ పడింది. ఈ మార్గంలో ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. కానీ ప్యాసింజర్ రైళ్లను మాత్రమే తాత్కాలికంగా రద్దు చేశారు. దీంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. ● అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల మీదుగా గుంతకల్లు–తిరుపతి– గుంతకల్లు (రైలు నంబర్ 57403– 57404), తిరుపతి–కదిరిదేవరపల్లి– తిరుపతి (రైలు నంబర్ 57405–57406) ప్యాసింజర్ రైళ్లను ధర్మవరంలోని రైల్వే జంక్షన్లో ఫేజ్–2 యార్డ్లో ఎన్ఐ పనుల కోసం ఈ నెల 15 నుంచి నెల రోజుల పాటు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా ధర్మవరం –నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రైలు (రైలు నెంబర్ 17247–17248 రైలు నర్సాపూర్ నుంచి కదిరి వరకు మాత్రమే నడుస్తుంది. ఈ రైళ్ల రద్దు కారణంగా ముదిగుబ్బ నుంచి ప్రయాణించే సాధారణ ఉద్యోగులు, పేద మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్యాసింజర్ రైళ్లే ఎందుకు రద్దంటే.. ధర్మవరం జంక్షన్లో యార్డ్ సవరణ పనుల కోసం ప్యాసింజర్ రైళ్లు మాత్రమే రద్దు చేశారు. అయితే అదే లైనుపై నడుస్తున్న పద్మావతి, సెవెన్హిల్స్, అమరావతి, అకోలా, అరుణాచలం వెళ్లే ఈ ఎక్స్ప్రెస్ రైళ్లు మాత్రం నడుస్తున్నాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజల కోసం ప్యాసింజర్ రైళ్లు రద్దు చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్కువ ధరకే సౌకర్యవంతమైన ప్రయాణం.. ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణించే సామాన్య, మధ్య తరగతి ప్రజలకు రైలు టికెట్ ధర అతి తక్కువగా వుంది. ముదిగుబ్బ నుంచి తిరుపతికి టికెట్ ధర రూ.50 మాత్రమే. తిరుమలకు ముదిగుబ్బ నుంచి వందలాది మంది భక్తులు వెళ్తుంటారు. అదే విధంగా అనారోగ్యంతో బాధపడే పేద ప్రజలు తిరుపతిలోని ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్తుంటారు. అనంతపురం, ధర్మవరం, కదిరి నుంచి చాలా మంది ఉద్యోగస్తులు ప్యాసింజర్ రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. బస్సులో టికెట్ ధర ఎక్కువ కావడంతో రైలు ప్రయాణాన్నే చాలామంది ఎంచుకుంటున్నారు. భారీగా తగ్గిన రైలు చార్జీలు.. ముదిగుబ్బ నుంచి తిరుపతికి ప్యాసింజర్ రైలులో వెళ్లే వారికి టికెట్ ధర రూ.50 మాత్రమే. స్లీపర్ టికెట్ ధర రూ.120 మాత్రమే. గతంలో ఇదే రిజర్వేషన్ టికెట్ ధర రూ.330 ఉండేది. సిట్టింగ్ కోసం రిజర్వేషన్ చేసుకునే టికెట్ ధర ముదిగుబ్బ నుంచి తిరుపతికి రూ.65 మాత్రమే. ఇదే టికెట్ ధర గతంలో రూ.120 ఉండేది. నాడు కుంభమేళా పేరిట 3 నెలలు బంద్ నేడు ధర్మవరం జంక్షన్లో పనుల నేపథ్యంలో రద్దు ప్యాసింజర్ రైళ్ల తాత్కాలిక రద్దుతో తప్పని ఇబ్బందులు -
ఖాకీ డ్రెస్సు వేసుకుని డ్యూటీ చేయాల్సిన పోలీసులు... టీడీపీ నేతలకు వంగి వంగి సలాములు చేస్తున్న ఘటనలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్.. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె కుమారుడు శ్రీరామ్ల పనిమనిషిలా మారారంటూ విమర్
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఇప్పటివరకూ పని చేసిన ప్రతి చోటా విజయకుమార్పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. గతంలో అనంతపురం ఎస్పీగా అంజనా సిన్హా ఉన్నప్పుడు ఈయన చెన్నేకొత్తపల్లి ఎస్ఐగా పనిచేశారు. ఆ సమయంలో స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆ మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేయగా, పోలీసు ఉన్నతాధికారులు అప్పట్లో కర్నూలుకు బదిలీ చేసి వీఆర్లో పెట్టారు. మైదుకూరులో డీఎస్పీగా పనిచేసినప్పుడు కూడా అవినీతి ఆరోపణలు రావడంతో శ్రీకాకుళం జిల్లాకు బదిలీ చేసి వీఆర్లో ఉంచారు. గార్లదిన్నెలో పదెకరాల భూమి! విజయకుమార్ పోలీసు ఉద్యోగంలో చేరిన తర్వాత అనంతపురం జిల్లాలోని గార్లదిన్నెలో హైదరాబాద్– బెంగళూరు జాతీయ రహదారికి దగ్గరగా పదెకరాల భూమి కొన్నట్టు ఇప్పటికీ పోలీసు వర్గాలు కథలు కథలుగా చెప్పుకుంటున్నాయి. ఇంత పెద్ద ఎత్తున భూమి కొనడంపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కరపత్రాల కలకలం గతంలో అనంతపురంలో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) డీఎస్పీగా విజయకుమార్ ఉన్న సమయంలో స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) డీఎస్పీగా గంగయ్య ఉండేవారు. అప్పట్లో గంగయ్యకు, విజయమార్కు మధ్య తీవ్ర స్థాయిలో వివాదాలు చోటు చేసుకున్నాయి.ఈ క్రమంలోనే గంగయ్యపై కొన్ని కరపత్రాలు బయటకు వచ్చాయి. వీటిని విజయకుమార్ వేయించారనే విమర్శలున్నాయి. ఆ తర్వాత విజయకుమార్ బండారాలన్నీ బయటపెడుతూ బయటకు వచ్చిన కరపత్రాలు కలకలం రేపాయి. ప్రబోదానంద కేసులో సస్పెండ్.. తనకు నచ్చినవారి కోసం పరిధి దాటి ప్రవర్తిస్తారని విజయకుమార్కు పేరుంది. గతంలో జేసీ అనుచరులు ప్రబోదానంద ఆశ్రమంపై దాడి చేసిన సమయంలో విజయకుమార్ ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీగా ఉండేవారు. అయినా సరే తాడిపత్రి ఇన్చార్జ్ డీఎస్పీగా వెళ్లి ఆ కేసును డీల్ చేశారు. ఆ కేసులో తీవ్ర ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఉన్నతాధికారులు విజయకుమార్ను సస్పెండ్ చేశారు. మహిళా సీఐపై పరుషంగా.. ప్రస్తుతం పుట్టపర్తి డీఎస్పీగా ఉన్న విజయకుమార్ ఇప్పటికీ తన వివాదాస్పద తీరు మార్చుకోలేదని తెలిసింది. కొన్ని రోజుల క్రితం ఓ మహిళా సీఐపై ఇష్టారాజ్యంగా నోరుపారేసుకున్నారు. దీంతో మహిళా సీఐ తీవ్ర మనస్తాపం చెంది విజయకుమార్పై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అయితే, మహిళా సీఐకి న్యాయం చేయాల్సిన ఉన్నతాధికారులు.. బాధిత సీఐనే వీఆర్కు పంపించడం శ్రీసత్యసాయి జిల్లా పోలీసుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రామగిరి హెలిప్యాడ్ ఘటనలో ఘోర వైఫల్యం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ఇటీవల విజయకుమార్ను రామగిరి మండలం కుంటిమద్ది సమీపంలో హెలిప్యాడ్ వద్ద సెక్యూరిటీ ఇన్చార్జ్గా వేశారు. ఒక మాజీ సీఎం వస్తున్న నేపథ్యంలో నిక్కచ్చిగా బందోబస్తు చేపట్టాల్సిన డీఎస్పీ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో హెలికాప్టర్ వద్దకు వేలాదిగా జనం వెళ్లడంతో విండ్షీల్డ్ విరిగింది. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తప్పనిసరి పరిసితుల్లో రోడ్డుమార్గంలో బెంగళూరుకు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఖాకీ డ్రెస్సు వేసు కున్న ఈ పోలీసు అధికారి ‘పచ్చ’చొక్కాల అడుగులకు మడుగులొత్తుతుండటం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.టీడీపీ ఎమ్మెల్యేలు ఆడినట్టే ఆట.. పాడినట్టే పాట పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్ వ్యవహార శైలిపై సర్వత్రా తీవ్ర చర్చ పల్లె రఘునాథరెడ్డి గీత గీస్తే దాటిపోకుండా డ్యూటీ గతంలోనూ పలు అవినీతి ఆరోపణలు ఇప్పటికీ తీరు మార్చుకోని వైనం -
ముందస్తు ప్రణాళికలు రూపొందించండి
ప్రశాంతి నిలయం: సత్యసాయి బాబా శతజయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం తరఫున ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సత్యసాయి శతజయంతి వేడుకల నిర్వహణపై ప్రభుత్వ అధికారులలో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సత్యసాయి శతజయంతి వేడుకలు ఈ ఏడాది నవంబర్లో జరగనున్నాయని, ప్రపంచ నలుమూలల నుంచి భక్తులతోపాటు ప్రముఖులు తరలిరానున్నారన్నారు. ప్రధాన మంత్రితోపాటు అత్యున్నత స్థాయి ప్రముఖులు హాజరవుతారని పేర్కొన్నారు. భక్తులకు, ప్రముఖులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. పుట్టపర్తి విమానాశ్రయంలో ప్రత్యేక హెలిప్యాడ్ల ఏర్పాటుతోపాటు ఇంకా అవసరం అయితే అదనపు హెలిప్యాడ్ల ఏర్పాటుకు స్థలాల గుర్తింపు, భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. ట్రాఫిక్, పోలీస్ బందోబస్తు, రవాణా సేవలు, నిరంతర విద్యుత్, తాగునీరు, పట్టణ సుందరీకరణ పనులు, భక్తుల కోసం తాత్కాలిక బస్సు ష్టేషన్ల ఏర్పాటు, తాత్కాలిక వసతి, మొబైల్ టాయిలెట్స్, చిత్రావతి నది సుందరీకరణ, భద్రతా చర్యలు, తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్ఓ విజయసారథి, పుట్టపర్తి ఆర్డీవో సువర్ణ, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రతినిధులు చలం, రోమెల్, డీఆర్డీఎ పీడీ నరసయ్య, డీపీఓ సమత తదితరులు పాల్గొన్నారు. సత్యసాయి శతజయంతి ఉత్సవాలపై సమీక్షలో కలెక్టర్ -
సమస్యల పరిష్కారమే ధ్యేయం
జిల్లా పరిధిలో సోమవారం పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. వేసవితాపం కొనసాగింది. నైరుతి దిశగా గంటకు 8 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి. ధర్మవరంలో ముస్లింల భారీ ర్యాలీ మున్సిపల్ కార్యాలయంలో అవినీతి అనకొండ పాలబావిలో గంగ పూజ బిందెడు నీటికి బండెడు కష్టాలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న 727 గ్రామాల ప్రజల దాహార్తి తీర్చే శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. చీనీ టన్ను రూ.23,800 అనంతపురం మార్కెట్యార్డులో సోమవారం చీనీకాయలు టన్ను గరిష్ట ధర రూ.23,800 పలికాయి. మంగళవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్ ప్రశాంతి నిలయం: అనంతపురంలోని జిల్లా కోర్టులో సోమవారం సాయంత్రం నూతన జిల్లా జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన భీమారావును కలెక్టర్ టీఎస్ చేతన్ మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు. తగ్గుతున్న చింత పండు ధరలు హిందూపురం అర్బన్: హిందూపురం వ్యవసాయ మార్కెట్లో గత మూడు వారాలుగా చింత పండు ధరలు పడిపోతున్నాయి. సోమవారం 881.70 క్వింటాళ్ల చింత పండు వచ్చింది. మార్కెట్లో ఈ నామ్ పద్ధతిలో వేలం పాటలు సాగాయి. కరిపులి రకం క్వింటా గరిష్ట ధర రూ.19,500, కనిష్ట ధర రూ.8 వేలు , సగటు ధర రూ.15 వేలు పలికింది. అలాగే ప్లవర్ రకం క్వింటా గరిష్ట ధర రూ.12,500, కనిష్ట ధర రూ.4,420, సగటు ధర రూ.8 వేలు పలికింది. గత వారంతో పోలిస్తే కరిపులి రకం క్వింటాపై రూ.1000 తగ్గుదల కనిపించింది. వాతావరణ మార్పులు, చల్లదనంతో ధరలు తగ్గుముఖం పట్టినట్లు మార్కెట్ కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. దొంగతనం కేసులో ముద్దాయికి మూడేళ్ల జైలు పుట్టపర్తి టౌన్: కొత్తచెరువులో జరిగిన రెండు దొంగతనాల కేసులో ముద్దాయి అమర్నాథ్నాయుడుకు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ పుట్టపర్తి జేఎఫ్సీఎమ్ కోర్టు జడ్జి రాకేష్ సోమవారం తీర్పు వెల్లడించారు. కొత్తచెరువులో జరిగిన రెండు దొంగతనాలపై విచారణ జరిపి అమర్నాథనాయుడుపై 2012లో కేసును నమోదు చేసి విచారణ జరిపి రిమాండ్కు తరలించారు. ఏపీపీ మైలాబాబు, రాజేంద్రప్రసాద్ తమ వాదనలు వినిపించారు. వాదనలు విన్న జడ్జి రాకేష్ ముద్దాయిపై అభియోగాలు రుజువు కావడంతో మూడు సంవత్సరాలు జైలు శిక్ష, వెయ్యి రూపాయలు జరిమానా విధించారు. చిలమత్తూరు సమీపంలోని బైరేకుంట చెరువులో మట్టి తవ్వుతున్న దృశ్యంచిలమత్తూరు: బాలయ్య ఇలాకాలో దందాలు పెచ్చుమీరాయి. సినిమా షూటింగులతో బాలకృష్ణ బిజీగా ఉంటే.. ఆయన పీఏలతో పాటు అనుచర గణం నియోజకవర్గంలోని సహజ సంపదను దోచేసే పనిలో నిమగ్నమయ్యారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నదులు, చెరువులలో మట్టి, ఇసుకను విచ్చలవిడిగా తరలిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఎవరైనా అడిగితే మాత్రం పీఏలు చెప్పారంటూ తమ అక్రమ వ్యాపారాలను సాగించేస్తున్నారు. మట్టి మాఫియాకు కేరాఫ్గా చిలమత్తూరు.. రాష్ట్ర సరిహద్దు అయిన చిలమత్తూరు మండలం మట్టి మాఫియాకు కేంద్ర బిందువుగా మారింది. ఇక్కడ 44వ నంబరు జాతీయ రహదారి, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, 544ఈ జాతీయ రహదారి, పుట్టపర్తి వరకూ నాలుగు లేన్ల రహదారులు ఉండటంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములు కొనుగోలు చేసి అగ్రి లేఔట్లను జోరుగా అభివృద్ధి చేసుకుంటున్నారు. అయితే భూములు ఎత్తుపల్లాలు ఉండటంతో వాటిని లెవలింగ్ చేసుకోవడానికి ఇష్టానుసారంగా మట్టిని చెరువుల నుంచి తరలిస్తున్నారు. నేరుగా పీఏలతోనే బేరం ! రియల్టర్లు నేరుగా ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలతోనే స్థానిక టీడీపీ నేతల ద్వారా టచ్లోకి వెళ్లిపోయి మట్టి దందాను సాగిస్తున్నారన్న విమర్శలున్నాయి. అభివృద్ధి మాట పక్కనపెట్టి వారి స్వలాభాలకే ప్రాధాన్యం ఇస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఇటీవల హిందూపురానికి చెందిన ఓ టీడీపీ నేత .. 44వ నంబరు జాతీయ రహదారి దగ్గర ఉన్న రియల్టర్కు చెందిన భూమి లెవలింగ్ కోసం వందలాది లోడ్ల మట్టిని అక్రమంగా లేపాక్షి నాలెడ్జి హబ్ భూముల నుంచి తరలించారు. ఇందుకోసం మండలస్థాయి టీడీపీ నేత అనుచరుడి అకౌంట్లోకి రోజుకు రూ.50 వేల చొప్పున రియల్టర్ చెల్లించినట్లు సమాచారం. ఇదంతా పురంలో ఉన్న ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలకు చేర్చారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. అన్నీ అధికారులకు తెలిసే.. హిందూపురం నియోజకవర్గంలో మట్టి దందా విషయం ఇరిగేషన్ , మైనింగ్శాఖ అధికారులకు తెలిసినా ఏమీ చేయలేకపోతున్నారన్న విమర్శలున్నాయి. కేవలం పీఏల భయంతో మిన్నకుండిపోతున్నట్లు చెబుతున్నారు. మండలంలో కొడికొండ – మొరసలపల్లి ప్రధాన రహదారి పక్కనే ఇటుక బట్టీల కోసం ఓ టీడీపీ నేత వందలాది లోడ్ల మట్టిని డంప్ చేశారు. దీనికి ఎలాంటి అనుమతి లేదు. రైతులకు మట్టి తోలుకునేందుకు వంద నిబంధనలు పెట్టే అధికారులు ఇలాంటి అక్రమార్కులపై చర్యలు ఎందుకు తీసుకోరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కళావిహీనంగా నదులు.. మట్టి దందాతో పాటు అక్రమంగా ఇసుక తరలింపు ద్వారా తమ్ముళ్ల ఆదాయం మూడు పువ్వులు, ఆరు కాయలుగా మారింది. నదుల్లోని సహజ వనరుల సొమ్మంతా టీడీపీ నేతల ఇళ్లకు చేరుతోంది. యథేచ్ఛగా ఇసుక దోపిడీ ద్వారా నదులన్నీ కళావిహీనంగా కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని పెన్నా, చిత్రావతి, కుషావతి నదులు ఇసుక దిబ్బలతో నీటితో కళకళలాడేవి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవి కళావిహీనంగా మారాయి. ఇసుక దోపిడీ కారణంగా వేసవిలో నదుల్లో ఉన్న నీరంతా ఆవిరైపోయింది. సహజ వనరులు ఇలాగే ఖాళీ చేస్తే కరువు సంభవించడం ఖాయమని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలు స్థానికంగా ఉండే నేతలను బినామీలుగా అడ్డుపెట్టుకొని సహజ వనరులను దోచుకుంటూ నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా మార్చేందుకు కుట్ర చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. ధర్మవరం: వక్ఫ్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకునే వరకూ పోరాటం చేస్తామని ముస్లిం నాయకులు స్పష్టం చేశారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలంటూ ధర్మవరం పట్టణంలో ముస్లింలు, సంయుక్త మస్జీద్ కమిటీల ఆధ్వర్యంలో సోమవారం భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. జామియా మస్జీద్ నుంచి పీఆర్టీ సర్కిల్, గాంధీ సర్కిల్ మీదుగా కళాజ్యోతి, కాలేజ్ సర్కిల్ వరకూ నిరసన ర్యాలీ చేపట్టారు. సీపీఐ, సీపీఎం, వైఎస్సార్సీపీ, క్రైస్తవ సంఘాలు, బీఎస్పీ, ఎమ్మార్పీఎస్, సీఐటీయూ, ఏఐటీయూసీ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. అనంతరం కాలేజ్ సర్కిల్ వద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా? ముస్లిం మతపెద్దలు తాహీర్ మౌలానా తాహీర్, తాయూబ్ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ చట్టం అమలు చేయడం ద్వారా వక్ఫ్ ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందన్నారు. ఏళ్ల నాటి వక్ఫ్ ఆస్తులకు ఇప్పుడు రికార్డులను చూపించి హక్కులను పొందాలనడం సమంజసం కాదని తెలిపారు. వక్ఫ్ ఆస్తులతో రియల్ ఎస్టేట్ చేసేందుకు కొంత మంది స్వార్థ పరులు ప్రయత్నిస్తున్నారన్నారు. సవరణ చట్టంలోని లోపాలను సర్వోన్నత న్యాయస్థానం ఎత్తిచూపినా ఇంకా మొండి పట్టు పట్టడం మంచిది కాదన్నారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేసేవరకు ఆందోళనలు చేస్తామని అవసరమైతే ఆమరణ దీక్ష చేసేందుకు వెనుకాడబోమన్నారు. రాజకీయ లబ్ధికోసమే.. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని పరిహాసం చేసేవిధంగా నల్ల చట్టాలను తెచ్చి అమలు చేసేందుకు యత్నిస్తోందని సీపీఐ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ముసుగు మధు, సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న, వైఎస్సార్సీపీ మైనార్టీ నాయకులు షేక్ చాంద్బాషా, కాంట్రాక్టర్ వలి, సాధిక్, పాస్టర్లు మోసేజ్ గ్రేసయ్య, సుందర్సింగ్ విమర్శించారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని కేవలం రాజకీయ లబ్ధికోసమే కేంద్రం ప్రవేశపెట్టిందన్నారు. ఇలాంటి చట్టాలకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మద్దతు తెలపడం దారుణమన్నారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రశాంతి నిలయం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన అర్జీలను అధికారులు శ్రద్ధతో పరిష్కరించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. పింఛన్లు, ఇంటి పట్టాలు, ఇల్లు, భూ సమస్యలు తదితర వాటిపై 304 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ నిర్ణీత గడువులోపు నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలని అధికారులను ఆదేశించారు. లక్ష్యాలను సాధించడంలో ఏవైనా సమస్యలు ఉంటే విజయవాడలోని ఆయా శాఖల ఉన్నతాధికారులకు తెలియజేస్తే సమస్యలకు పరిష్కారం చూపిస్తారన్నారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదీలోపు నమోదు డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటనల్లో ఇచ్చిన హామీల సమగ్ర నివేదికలు మంగళవారంలోపు సిద్ధం చేయాలన్నారు. అర్హులకే ఎస్సీ కార్పొరేషన్ రుణాలు.. జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ లబ్ధిదారులకు 604 యూనిట్లు పంపిణీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో బ్యాంక్ అధికారులు, వివిధ శాఖల అధికారులతో కలసి డీసీసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రూ.25.14 కోట్ల విలువతో 604 యూనిట్లను ఎస్సీ లబ్ధిదారులకు అందించేందుకు ఆమోదం తెలిపామన్నారు. అర్హులకు మాత్రమే అవి అందేలా చూడాలన్నారు. రొద్దం, తనకల్లులను కరువు మండలాలుగా గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు. ఆ రెండు మండలాల్లో రుణాలు రీ షెడ్యూల్ చేయాలని ఆదేశించారు. అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి.. జిల్లాలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. 2025–26లో జిల్లాలో మొత్తం 33,749 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు పేర్కొన్నారు. లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేయాలన్నారు. మే 5వ తేదీ నుంచి సెప్టెంబర్ వరకూ నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్ఓ విజయసారథి, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, డీఆర్డీఏ పీడీ నరసయ్య, అడల్ట్ ఎడ్యూకేషన్ డీడీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 8లోన్యూస్రీల్హిందూపురం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. సహజ వనరులను దోచేస్తూ అడ్డదిడ్డంగా సంపాదిస్తోంది. ముఖ్యంగా కొందరు టీడీపీ నాయకులు చెరువుల్లో మట్టిని యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నేరుగా ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏల పేర్లతోనే దందా చేస్తుండటంతో అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. బాలయ్య ఇలాకాలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా నేరుగా ఎమ్మెల్యే పీఏలతో డీల్ ! బినామీలుగా టీడీపీ నాయకులు రియల్టర్ల నుంచి రోజువారీగా వసూళ్లు చోద్యం చూస్తున్న ఇరిగేషన్, మైనింగ్శాఖ అధికారులు కలెక్టర్ టీఎస్ చేతన్ వక్ఫ్ సవరణ చట్టం రద్దు చేసే దాకా పోరాటం చేస్తామని ముస్లిం పెద్దల స్పష్టీకరణకేసులు నమోదు చేస్తాం హిందూపురం నియోజకవర్గంలోని చెరువుల్లో మట్టిని కేవలం రైతులు పొలాల్లోకి తోలుకునేందుకు మాత్రమే అనుమతి ఇస్తున్నాం. ఇప్పటి వరకూ వెంచర్లు, కమర్షియల్ వ్యాపారులకు ఎక్కడా మట్టి తవ్వుకునేందుకు అనుమతులు ఇవ్వలేదు. ఎవరైనా మట్టి తవ్వకాలు చేపట్టినట్లు తమ దృష్టికి తీసుకొస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. కేసులు కూడా నమోదు చేస్తాం. – యోగానంద, ఇరిగేషన్, డీఈ, హిందూపురం -
విధుల్లో ఉన్న కానిస్టేబుల్పై
ధర్మవరం అర్బన్: విధుల్లో ఉన్న కానిస్టేబుల్పై ఐదుగురు యువకులు దాడికి పాల్పడ్డారు. ధర్మవరం రెండో పట్టణ సీఐ రెడ్డప్ప తెలిపిన మేరకు.. ఆదివారం రాత్రి 10.30 గంటలకు బీట్లో భాగంగా స్థానిక కదిరి గేటు వద్దకు కానిస్టేబుల్ విశ్వనాథ్ వెళ్లారు. ఆ సమయంలో అక్కడ రాజు అనే వ్యక్తి ఎగ్రైస్ బండి నిర్వహిస్తుండడం గమనించి, సమయం మించి పోయిందని, వ్యాపారాన్ని ఆపి ఇంటికెళ్లాలని సూచించారు. దీంతో రాజు వాగ్వాదానికి దిగాడు. ఎంత సర్ది చెప్పినా వినకుండా తన స్నేహితులను పిలిపించుకుని కానిస్టేబుల్ విశ్వనాథ్పై దాడికి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రాజు, అతని స్నేహితులు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.వ్యక్తి ఆత్మహత్య● 20 రోజుల తర్వాత వెలుగు చూసిన ఘటనబత్తలపల్లి: మండలంలోని యర్రాయపల్లి ఓబులేసుని కొండలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఓ వ్యక్తి మృతదేహాన్ని గొర్రెల కాపరులు సోమవారం గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. లభ్యమైన ఆధారాలను బట్టి మృతుడిని తాడిమర్రి మండలం పూలఓబయ్యపల్లికి చెందిన శెట్టిపల్లి శివారెడ్డి(43)గా గుర్తించారు. విషయాన్ని తెలుసుకున్న కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని పరిశీలించి మృతుడిని శివారెడ్డిగా నిర్ధారించి, బోరున విలపించారు. ధర్మవరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఓ ఫర్టిలైజర్ షాపులో పని చేస్తున్నట్లు తెలిపారు. ఉగాది పండుగ నుంచి కనిపించకుండా పోయాడని.. ఘటనపై అప్పట్లోనే ధర్మవరం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. కాగా, ఆయన ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.యువకుడి దుర్మరణంచెన్నేకొత్తపల్లి: ద్విచక్ర వాహనాలు కారు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు.. రామగిరి మండలం శ్రీహరిపురం గ్రామానికి చెందిన సాయితేజ (24) సోమవారం ఉదయం ద్విచక్ర వాహనంపై ధర్మవరానికి బయలుదేరాడు. ప్యాదిండి గ్రామానికి అదే గ్రామానికి చెందిన రమేష్ మరో ద్విచక్ర వాహనంపై ధర్మవరానికి వెళుతూ సాయితేజ వాహనం వెనుకనే అనుసరించసాగాడు. ఈ క్రమంలో గ్రామ శివారులోకి చేరుకోగానే ధర్మవరం వైపు నుంచి ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన కారు తొలుత సాయితేజ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని, తర్వాత వెనుకనే ఉన్న రమేష్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఘటనలో సాయితేజ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన రమేష్ను స్థానికులు ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రఽథమ చికిత్స అనంతరం మెరుగైన వెద్యం కోసం అనంతపురానికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. ఘటనపై సీకే పల్లి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
డ్రిప్ మంజూరులో జిల్లాకు నాలుగో స్థానం
అనంతపురం సెంట్రల్: డ్రిప్, స్పింక్లర్ల మంజూరులో రాష్ట్రంలో అనంతపురం జిల్లా మొదటి స్థానం, జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలిచిందని ఏపీఎంఐపీ రాష్ట్ర ప్రాజెక్టు ఆఫీసర్ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం నగరంలో ప్రాంతీయ ఉద్యాన శిక్షణా సంస్థ కార్యాలయంలో మైక్రో ఇరిగేషన్ ఇంజినీర్లు, కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అధికారుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీసత్యసాయి జిల్లా రాష్ట్రంలో నాలుగు, జాతీయ స్థాయిలో ఐదో స్థానంలో ఉందని అభినందించారు. రైతుల పొలాల్లో పరికరాలను త్వరితగతిన అమర్చి సకాలంలో పంటలు సాగు చేసుకునేందుకు సహకరించాలని సూచించారు. ఎస్సీ,ఎస్టీ రైతులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వంద శాతం రైతులు డ్రిప్ వాడేలా చూడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపీఎంఐపీ అనంతపురం జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లు రఘునాథరెడ్డి, సత్యసాయి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్, ఏపీఎంఐపీ ఇంజనీర్లు పాల్గొన్నారు. ద్విచక్రవాహనం అదుపుతప్పి యువకుడి మృతి పరిగి: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... పరికి మండలంవిట్టాపల్లికి చెందిన రవికుమార్ (33).. రొద్దం మండలం ఎం.కొత్తపల్లిలోని అత్తారింటికి వెళ్లాడు. ఆదివారం సాయంత్రం తిరిగి తనస్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరిన ఆయన.. పైడేటి సమీపంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ సమీపంలోకి చేరుకోగానే నియంత్రణ కోల్పోవడంతో వాహనం అదుపు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సోమవారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి ● ఎస్టీయూ నాయకుల డిమాండ్ పుట్టపర్తి అర్బన్: జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్న 2008 డీఎస్సీ ఉపాధ్యాయుల నియామక తేదీని అందరికీ ఒకేలా ఉండేలా చూడాలని ఎస్టీయూ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు డీఈఓ కృష్ణప్పను సోమవారం కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాదరెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. 2008 డీఎస్సీ ఉపాధ్యాయులకు నియామక పత్రాలను 2010, నవంబర్ 6న ఇచ్చారన్నారు. అయితే కొందరు ఎంఈఓలు నవంబర్ 4, 5, 8 తేదీల్లో జాయినింగ్ డేట్ ఇవ్వడంతో ట్రాన్స్ఫర్ సీనియారిటీలో మెరిట్ ఉపాధ్యాయులకు నష్టం వాటిల్లుతోందన్నారు. దీంతో 2008 డీఎస్సీ ఉపాధ్యాయులకు కామన్ జాయినింగ్ తేదీని ఇవ్వాలన్నారు. అలాగే 2009లో పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులకు సైతం జాయినింగ్ తేదీల సమస్యలు నెలకొన్నాయని, వీటిని కూడా పరిష్కరించాలన్నారు. ఎల్ఎఫ్ఎల్ టూల్ ఇండక్షన్ ట్రైనింగ్, పదోతరగతి స్పాట్ వాల్యూయేషన్ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా కార్యదర్శి రవిచంద్ర, వెంగమనాయుడు, పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు మండలాల అద్యక్షులు శివయ్య, శ్రీనివాసులు, శంకర్ నాయుడు, షెక్షావలి, సురేష్, కృష్ణప్ప, అనిల్కుమార్, శ్రీనివాసులు పాల్గొన్నారు. ‘పురం’ వాసికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు హిందూపురం: స్థానిక మిషన్ కాంపౌండ్ పాస్టర్ రెవరెండ్ డాక్టర్ స్టీఫెన్రాజ్ కుమారుడు పి.ఇమ్మానుయేల్ రాజ్కు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కింది. 2024, డిసెంబర్ 1న గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు కోసం హల్లెల్ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో 1,046 మంది సంగీత కళాకారులు కీబోర్డు వాయించి ఇన్స్ట్రాగామ్లో అప్లోడ్ చేశారు. దీనిని రికార్డుగా గుర్తిస్తూ ఇటీవల హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో ఇమ్మానుయేల్ రాజుకు సర్టిఫికెట్, గోల్డ్ మెడల్ను గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు అందజేశారు. -
ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం
శ్రీరామిరెడ్డి పథకం తాగునీరే మాకు దిక్కు. ఊర్లో బోర్లలో నీరు ఉప్పుగా ఉంటున్నాయి. వాటిని తాగలేక పోతున్నాం. ఎండకాలంలో ఇంతటి కష్టం వస్తోందని అనుకోలేదు. – మారెక్క, గోనబావి, గుమ్మఘట్ట మండలం రెండు రోజుల్లో పరిష్కారం కార్మికులతో చర్చలకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. సమస్యకు ఒకట్రెండు రోజుల్లో పరిష్కారం దక్కుతుంది. రూ.8 కోట్ల వేతన బకాయిలు చెల్లించేలా నివేదికలు సమర్పించారు. త్వరలో కార్మికుల ఖాతాల్లో వేతనాలు జమ అవుతాయి. లీకేజీలు తాత్కలికంగా అరికట్టేలా చర్యలు తీసుకుంటాం. కొత్త లైన్ ఏర్పాటుకు ప్రణాళికలు చేపట్టాం. – శిరీష, శ్రీరామిరెడ్డి పథకం డీఈ, అనంతపురం -
లేని భూమిని విక్రయించారు
పుట్టపర్తి టౌన్: భూమి లేకున్నా... రికార్డుల్లో ఉన్నట్లు చూపించి తనకు విక్రయించి మోసం చేశారని, దీనిపై తనకు న్యాయం చేయాలటూ డీఎస్పీ ఆదినారాయణకు బాధితుడు రవీంద్రనాథ్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీని అందజేసి తన గోడు వెల్లబోసుకున్నాడు. హిందూపురం సమీపంలోని మోతుకపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 67–3లో ఉన్న మూడు ఎకరాల భూమిలో ఒక ఎకరా విస్తీర్ణాన్ని అదే గ్రామానికి చెందిన బోయ తిమ్మయ్య 2023లో హిందూపురానికి చెందిన రవీంద్రనాథ్కు రూ..20లక్షలకు విక్రయించేలా రూ. 3 లక్షల టోకన్ అడ్వాన్స్తో ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకున్నాడు. ఈ నేపథ్యంలో రవీంద్రనాథ్కు ఇప్పటి వరకూ భూమిని చూపలేదు. ఈ రోజు.. రేపు అంటూ కాలయాపన చేస్తూ వచ్చాడు. దీంతో అనుమానం వచ్చిన రవీంద్రనాథ్ లోతుగా విచారణ చేయడంతో సదరు సర్వే నంబర్లో భూమి లేదని, మొత్తం మూడు ఎకరాలను ఇతరులకు విక్రయించినట్లుగా నిర్ధారణ కావడంతో తాను చెల్లించిన అడ్వాన్స్ వెనక్కు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ విషయంగా ఇద్దరి మధ్య వాగ్వాదం చేసుకోవడంతో రవ్రీంనాథ్పై తిమ్మయ్య వర్గీయులు దాడిచేశారు. ఘటనపై హిందూపురం ఒకటో పట్టణ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. దీనిపై న్యాయం చేకూరకపోవడంతో సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ అందజేశారు. దీనిపై స్పందించిన డీఎస్పీ ఆదినారాయణ... వెంటనే హిందూపురం డీఎస్పీ మహేష్తో ఫోన్లో మాట్లాడారు. సమస్య వివరించి, పరిష్కారానికి చొరవ తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలి.. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందజేసే ఫిర్యాదులపై సత్వరమే స్పందించి సరైన పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను ఎస్పీ రత్న ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 70 వినతులు అందాయి. ఎస్పీ రత్న స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీలు ఆదినారాయణ, విజయకుమార్, లీగల్ అడ్వైజర్ సాయినాథ్రెడ్డి పాల్గొన్నారు. న్యాయం చేయాలంటూ బాధితుడి వేడుకోలు ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 70 వినతులు -
బిందెడు నీటికి బండెడు కష్టాలు
రాయదుర్గం: ఉమ్మడి జిల్లాల్లోని రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, హిందూపురం, మడకశిర నియోజకవర్గాల పరిధిలో ఉన్న 727 గ్రామాల ప్రజల దాహార్తి తీర్చే శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. కూటమి సర్కార్ ఘోర వైఫల్యాల కారణంగా పల్లెలన్నీ గొంతెండుతున్నాయి. గుక్కెడు నీటి కోసం గ్రామస్తులు పొలాల వెంబడి పరుగు తీస్తున్నారు. 16 రోజులుగా నిలిచిపోయిన తాగునీటి సరఫరా లక్షలాది మంది గొంతు తడిపే అతిపెద్ద శ్రీరామరెడ్డి తాగునీటి పథకాన్ని అధికారం చేపట్టి పట్టుమని పది నెలల కాకనే చంద్రబాబు సర్కార్ అటకెక్కించింది. నిర్వహణ చేతకాక చేతులెత్తేసింది. నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడంతో 16 రోజులుగా కార్మికులు సమ్మె బాటపట్టారు. దీంతో తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా శ్రీరామరెడ్డి తాగునీటి పథకం లబ్ధి పొందుతున్న గ్రామాల్లో ప్రజలు కన్నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ బోర్లే దిక్కు ఉమ్మడి జిల్లాల్లోని చాలా గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తున్నారు. విద్యుత్ సరఫరా ప్రారంభం కాగానే పొలాల్లోకి పరుగులు తీస్తున్నారు. రైతుల నుంచి ఎదురయ్యే ఛీత్కారాలను మౌనంగా భరిస్తూ తమ నీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. నీటి కష్టాలు చూసిన ట్యాంకర్ల నిర్వాహకులు ధర అమాంతం పెంచేశారు. పట్టణాల్లో ఒక్కో ట్యాంకర్కు రూ.800 నుంచి రూ. వెయ్యి వరకు వసూలు చేస్తున్నారు. అది కూడా అర్ధరాత్రి సమయంలో ట్యాంకర్లు వస్తుండడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. సమ్మె విరమిస్తేనే ప్రయోజనం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శ్రీరామిరెడ్డి తాగునీటి పథకంలో 800 మంది కార్మికులు పనిచేస్తుండగా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక వివిధ కారణాలతో ఆ సంఖ్య 630కి కుదించారు. సూపర్వైజర్లు మరో 20 మంది ఉన్నారు. నిత్యం 47 ఎంల్డీ నీటిని ఉరవకొండ నియోజకవర్గం పీఏబీఆర్ పంప్హౌస్ నుంచి పంపింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కార్మికులకు కొన్ని నెలలుగా జీతాలు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వచ్చింది. దీంతో కార్మికుల వేతన బకాయిలు రూ.8 కోట్లకు చేరుకుంది. పలు దఫాలుగా నిరసనలు వ్యక్తం చేసినా... చర్చల పేరుతో కార్మికులను మభ్య పెట్టారు తప్ప సమస్యకు పరిష్కారం చూపలేకపోయారు. దీంతో గత్యంతరం లేని స్థితిలో కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. నిండు వేసవిలో 16 రోజులుగా తాగునీటి పథకం ద్వారా నీరందక పోవడంతో ప్రజల ఇక్కట్లు నానాటికీ జటిలమవుతున్నాయి. కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరితేగాని సమస్యకు పరిష్కారం కనిపించడం లేదు. కూటమి అధికారంలోకి వచ్చాక శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం నిర్వీర్యం వేతనాలు అందించలేని దుస్థితిలో ‘బాబు’ సర్కార్ ఈ నెల 6 నుంచి సమ్మెలో కార్మికులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 727 గ్రామాలకు నిలిచిన తాగునీటి సరఫరా -
కర్ణాటక మద్యం పట్టివేత
హిందూపురం టౌన్: స్థానిక ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో ముగ్గురిని సోమవారం అరెస్ట్ చేసి, 240 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ లక్ష్మీదుర్గయ్య తెలిపారు. సోమవారం తనిఖీలు చేపట్టిన సమయంలో కర్ణాటక మద్యం అక్రమంగా తరలిస్తూ నంది సర్కిల్ వద్ద ఎకై ్సజ్ సిబ్బందికి అంబేడ్కర్ నగర్కు చెందిన మారుతి, నారాయణ, రాజు పట్టుబడ్డారన్నారు. నిందితులపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. గంజాయి విక్రేతల అరెస్ట్ బత్తలపల్లి: మండల కేంద్రంలో సోమవారం గంజాయి విక్రయిస్తూ ఇద్దరు పట్టుబడినట్లు ఎస్ఐ సోమశేఖర్ తెలిపారు. పట్టుబడిన వారిలో జ్వాలాపురం గ్రామానికి చెందిన లోక్నాథరెడ్డి, వెంకటరమణ ఉన్నారన్నారు. వీరిద్దరూ బత్తలపల్లిలోని తాడిపత్రి రోడ్డులో ఉన్న జగనన్న కాలనీ వద్ద గంజాయి విక్రయిస్తుండగా రెడ్హ్యాండెడ్గా అరెస్ట్ చేసి, 190 గ్రాముల గంజాయిని స్వాధీని చేసుకున్నట్లు వివరించారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించామన్నారు. -
ఒంగోలు నివాసి మృతి
కదిరి టౌన్: స్థానిక తాయి గ్రాండ్ లాడ్జ్ మెట్లు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడిన ఒంగోలుకు చెందిన కోటేశ్వరరావు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒంగోలుకు చెందిన శ్రీనివాసులు తన కారు డ్రైవర్ కోటేశ్వరరావుతో కలసి అనంతపురంలో బంధువుల ఇంట జరిగిన శుభకార్యానికి వచ్చారు. ఈ క్రమంలో కదిరిలోని తన స్నేహితుడు రమణను మాట్లాడేందుకు సోమవారం సాయంత్రం వచ్చి తాయిగ్రాండ్ లాడ్జ్లో గదిని అద్దెకు తీసుకున్నాడు. టిఫెన్ కోసం వచ్చిన కోటేశ్వరరావు తిరిగి లాడ్జ్ మెట్లు ఎక్కుతుండగా అదుపు తప్పి కిందపడడంతో తలకు బలమైన గాయమైంది. కదిరి ఏరియా ఆస్పత్రిలో చికిత్స నిర్వహిస్తుండగా పరిస్థితి విషమించి ఆయన మృతి చెందాడు. ఘటనపై కదిరి పోలీసులు కేసు నమోదు చేశారు. -
మేధస్సును కదిలించేది ‘శ్రమ కావ్యం’
అనంతపురం: మేధస్సును కదిలించేది ‘శ్రమ కావ్య గానం’ అని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక తేజ అన్నారు. ఆయన రచించిన శ్రమ కావ్యం గానం పుస్తక పరిచయ కార్యక్రమం అనంతపురంలోని జెడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో సీఐటీయూ, ఐద్వా, యూటీఎఫ్, ఎస్ఎఫ్ఐ, సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది. కేంద్ర సాహితీ అకాడమీ అవార్డు గ్రహీత రాచపాలెం చంద్రశేఖర్రెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సాహితీ స్రవంతి నాయకురాలు డాక్టర్ ప్రగతి మాట్లాడుతూ... సుద్దాల అశోక్ తేజ సాహితీ ప్రస్థానాన్ని వివరించారు. రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. సుద్దాల అశోక్ తేజ రచనలు శ్రమ శక్తిని చాటేలా ఉంటాయన్నారు. అనంతరం సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ.. శ్రమ కావ్యం గానం గురించి వివరించారు. శ్రమ అన్నది మేథో శ్రమ, శారీరక శ్రమ రెండు రకాలుగా ఉంటుందన్నారు. ఈ రెండు కలగలిసి ప్రయాణం సాగిస్తుంటాయని వివరించారు. శ్రమ ద్వారానే సామాజిక గమనం ఉంటుందనే అంశాన్ని శ్రమ కావ్యం గానం ద్వారా వివరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి, సీఐటీయూ ఆర్వీ నాయుడు, యూటీఎఫ్ లింగన్న, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పరమేష్, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఓ.నల్లప్ప, సీఐటీయూ రాష్ట్ర నాయకులు వి.రాంభూపాల్, మానవ హక్కుల వేదిక నాయకులు ఎస్ఎం బాష, సామాజిక వేత్త బోస్, మానవతా రక్తదాత తరిమెల అమర్నాథ్ రెడ్డి, సీఐటీయూ జిల్లా నాయకుడు రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సుద్దాల అశోక తేజ -
ఇక చాలు.. దయ చేయండి!
అనంతపురం: ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కూటమి ప్రభుత్వం మాట తప్పింది. పైగా ఇప్పటివరకూ ఉన్న ఉద్యోగాలనూ తొలగిస్తోంది. జేఎన్టీయూ (ఏ) పరిధిలో పనిచేస్తున్న 150 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సర్వం సిద్ధం చేయడమే ఇందుకు నిదర్శనం. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2008లో జేఎన్టీయూ (ఏ) వర్సిటీ ఏర్పాటైంది. వర్సిటీలో కార్యకలాపాల నిర్వహణకు అప్పట్లోనే అవుట్ సోర్సింగ్ కింద ఉద్యోగులను నియమించారు. ప్రస్తుతం వర్సిటీ పరిధిలో మొత్తం 650 మంది ఉన్నారు. కలికిరి ఇంజినీరింగ్ కళాశాలలో 120 మంది, పులివెందుల ఇంజినీరింగ్ కళాశాల 150, క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల 80, ఓటీఆర్ఐ 26, జేఎన్టీయూ (అనంతపురం నగరంలో)లో 274 మంది పనిచేస్తున్నారు. అంతలోనే ఎంత తేడా.. చిరుద్యోగులకు దన్నుగా నిలిచేలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంది. ‘ఆప్కాస్’ ఏర్పాటు చేసి ప్రతి నెలా క్రమం తప్పకుండా జీతం చెల్లించింది. ఉద్యోగాలను ఇష్టానుసారం తొలగించే పరిస్థితి లేకుండా భద్రత కల్పించింది. పీఎఫ్ సౌకర్యం ఉండేది. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. ‘ఆప్కాస్’ నుంచి జీతాలు చెల్లించలేమంటూ చేతులెత్తేసింది. దీంతో జేఎన్టీయూ అంతర్గత వనరుల నుంచి జీతాలు ఇవ్వాల్సి రావడంతో ఆ మేరకు ఆర్థిక వనరులు లేక ఉద్యోగులను తొలగించాలనే నిర్ణయానికి ఉన్నతాధికారులు వచ్చారు. మూడు రోజుల క్రితం జరిగిన పాలకమండలి సమావేశంలో దాదాపు 150 మంది ఉద్యోగులను తొలగించాలని తీర్మానించినట్లు తెలిసింది. ఈ విషయం బయటకు పొక్కడంతో ఉద్యోగుల్లో భయాందోళన నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో జేఎన్టీయూ(ఏ)లో ఇద్దరు, కలికిరిలో ఐదుగురిని మాత్రమే ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. మిగిలిన 643 మంది చాలా ఏళ్లనుంచి కొనసాగుతున్న వారే. ఈ క్రమంలో వర్సిటీ ఏర్పడినప్పటి నుంచి ఉన్న ఉద్యోగులకూ ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. జేఎన్టీయూ (ఏ) పరిధిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపునకు కసరత్తు రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ఉద్యోగులను తొలగించే ప్రక్రియను జేఎన్టీయూ యాజమాన్యం మానుకోవాలి. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ వ్యవస్థలో దళారుల ప్రమేయం అధికంగా ఉండేది. సక్రమంగా జీతాలు చెల్లించేవారు కాదు. ‘ఆప్కాస్’ ద్వారా సక్రమంగా జీతాలు అందేవి. ఇటీవల ‘ఆప్కాస్’ నుంచి జీతాలు చెల్లించలేమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉన్న ఉద్యోగులను తొలగించేలా నిర్ణయం తీసుకోవడం సరికాదు. – కే.విజయ్, ఉమ్మడి జిల్లా కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ -
హ్యాండ్ బాల్ జిల్లా జట్ల ఎంపిక
కదిరి అర్బన్: జిల్లా హ్యాండ్బాల్ పురుషులు, మహిళల జట్ల ఎంపికను స్థానిక ఎస్టీఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన దాదాపు 150 మంది క్రీడాకారులు హాజరయ్యారు. వీరిలో ప్రతిభ చూపిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. ఎంపికై న మహిళల జట్టులో మాధవి, నక్షత్ర, సభ, ఝాన్సీరాణి, స్వప్న, సమీరా, చాందిని, లేఖన, షబ్రీన్, ఫర్హానా, ఓం శ్రీ, పవిత్ర, సమిత, దివ్య, చందన, హాసిని, శ్రావణి ఉన్నారు. అలాగే పురుషుల జట్టుకు యాసిర్సిధ్దిఖీ, డానియల్రాజన్, భరత్, జస్వంత్నాయక్, సాదిక్బాషా, మహమ్మద్ అనీఫ్, ఫైజాన్, విశ్వనాథ్, సాయికుమార్, తనయ్, కుమార్, నారాయణస్వామినాయక్, ప్రవీణ్నాయక్, అరుణ్కుమార్, మల్లికార్జున, నాగరాజు ఎంపికయ్యారు. ఈ ప్రక్రియను జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్షకార్యదర్శులు విజయ్కుమార్, మహేష్ పర్యవేక్షించారు. కండక్టర్పై ఖాకీ దౌర్జన్యం గుత్తి: టికెట్ తీసుకుని ప్రయాణం చేయాలని సూచించిన ఆర్టీసీ బస్సు కండక్టర్పై ఓ హెడ్ కానిస్టేబుల్ బూతులతో రెచ్చిపోయారు. వివరాలు.. ఆదివారం తెల్లవారుజామున గుత్తి ఆర్టీసీ డిపో నుంచి ప్రయాణికులతో బయలుదేరిన బస్సు గార్లదిన్నె మండలం కల్లూరుకు చేరుకోగానే ఓ హెడ్ కానిస్టేబుల్ ఎక్కారు. టికెట్ తీసుకోవాలని కండక్టర్ గంగేశ్వర్ అడగడంతో తాను హెడ్ కానిస్టేబుల్నని, టికెట్ తీసుకునేది లేదని తెలిపారు. ‘అలా కాదు సార్.. వారెంట్ ఏదైనా ఉంటే చెప్పండి ఫ్రీ గా ప్రయాణం చేయవచ్చు. అలా కాదంటే టికెట్ తీసుకోవాల్సిందే’ అంటూ కండక్టర్ చెప్పగానే హెడ్ కానిస్టేబుల్ రెచ్చిపోయి బూతులతో విరుచుకు పడారు. ‘ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో.. అవసరమైతే కోర్డుకు పోతావా? పో’ అంటూ బెదిరింపులకు దిగారు. తాను లేకుండా బస్సు అక్కడి నుంచి ఎలా ముందుకెళుతుందో చూస్తానంటూ భీష్మించారు. దీంతో సహనం కోల్పోయిన కండక్టర్ టికెట్ తీసుకోవాల్సిందేనంటూ గట్టిగా పట్టుపట్టారు. హెడ్ కానిస్టేబుల్ నిర్వాకంతో బస్సు అక్కడే నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ క్రమంలో కొందరు ప్రయాణికులు కల్పించుకోవడంతో చివరకు హెడ్ కానిస్టేబుల్ టికెట్ తీసుకున్నారు. ఘటనపై పోలీసులతో పాటు ఆర్టీసీ డీఎంకు ఫిర్యాదు చేయనున్నట్లు కండక్టర్ గంగేశ్వర్ తెలిపారు. కాగా, వివాదస్పదమైన సదరు హెడ్ కానిస్టేబుల్ పేరు లక్ష్మీనారాయణ అని ప్రయాణికులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఎక్కడ పనిచేస్తున్నది తెలియదన్నారు. పోలీసు శాఖ ప్రతిష్టను దిగజారుస్తున్న ఇలాంటి వారిపై ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోనంత వరకూ ఇలాంటి ఘటనలు తరచూ చూడాల్సి వస్తుందని పేర్కొన్నారు. -
ప్రమాదంలో చిన్నారి మృతి
కొలిమిగుండ్ల: నంద్యాల జిల్లాలో కారు, బొలెరో పరస్పరం ఢీకొన్న ఘటనలో అనంతపురం జిల్లాకు చెందిన ఓ చిన్నారి మృతి చెందింది. మరో ఆరుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. తాడిపత్రి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన చంద్రమోహన్రెడ్డి తన కుమార్తె జోష్యహర్షిణిరెడ్డి(6)ని నంద్యాలలోని మేనమామ ఇంట్లో ఉంచి చదివిస్తున్నాడు. ఈ క్రమంలో అమ్మవారికి మొక్కుబడి చెల్లించాల్సి ఉండడంతో తాత, విశ్రాంత ఉపాధ్యాయుడు రామసుబ్బారెడ్డి, బంధువులు వెంకటసుబ్బారెడ్డి, ఏటూరి శ్రీనివాసరెడ్డి, లక్ష్మీదేవితో కలసి కారులో నంద్యాల స్వగ్రామానికి జోష్యహర్షిణిరెడ్డి బయలుదేరింది. కొలిమిగుండ్ల మండలం రాఘవరాజుపల్లి శివారులోకి చేరుకోగానే అంకిరెడ్డిపల్లి నుంచి కొలిమిగుండ్లకు వస్తున్న బొలెరో వాహనం ఢీకొంది. ప్రమాద తీవ్రతకు కారు ఎగిరి రోడ్డు పక్కన బోల్తాపడింది. కారులో ఉన్న వారందరూ అందులో చిక్కుకుపోయారు. బొలెరో వాహనంలో ఉన్న అంకిరెడ్డిపల్లికి చెందిన యువకులు రాజకుళ్లాయి, బాలుకు గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు కారులో చిక్కుకుపోయిన వారిని అతి కష్టంపై వెలికితీసి, తాడిపత్రిలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న జోష్యహర్షిణిరెడ్డిని మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. విషయం తెలుసుకున్న సీఐ రమేష్బాబు అక్కడకు చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రుడు ఏటూరి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
వైభవంగా కొల్హాపురి మహాలక్ష్మి ఉత్సవాలు
రొళ్ల: రత్నగిరి కొల్హాపురి మహాలక్ష్మీదేవి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం ‘పోతులరాజు పుష్పాలంకారణ మహోత్సవం’లో భాగంగా మహాకాళి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా రాజవంశీకుల ఇంటి నుంచి పోతులరాజులు ప్రత్యేకంగా అలంకరించుకుని పురవీధుల గుండా నృత్యం చేస్తూ మంగళవాయిద్యాల నడుమ ఆలయం వద్దకు చేరుకుని ప్రదక్షిణలు చేసి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పాలబావి సమీపంలో పోతులరాజు పుష్పాలంకరణ మహోత్సవాన్ని అశేష భక్తజనం మధ్య వైభవంగా నిర్వహించారు. మహిళలు దేవాలయ సమీపంలోని పాలబావిలో గంగపూజ కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు చేశారు. ఇలా చేయడం వల్ల సంతాన భాగ్యం లేని వారికి సంతాన ప్రాప్తి, దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని భక్తుల విశ్వాసం. జాతరలో తినుబండారాల అంగళ్లు కిటకిటలాడాయి. భక్తులకు దాతల సహకారంతో అన్నదానం చేశారు. కార్యక్రమంలో రాజవంశీకుల కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోతులరాజు పుష్పాలంకరణ మహోత్సవ వేడుకల్లో జెడ్పీటీసీ సభ్యుడు అనంతరాజు పాల్గొన్నారు. ఉత్సవాల్లో సోమవారం పాలబావిలో గంగపూజతో పాటు రాత్రికి పోతులరాజు బండారు మహోత్సవం నిర్వహించనున్నట్లు రాజవంశీకుడు దొర రంగప్పరాజు, గ్రామ పెద్దలు తదితరులు తెలిపారు. భక్తిశ్రద్ధలో పోతులరాజు పుష్పాలంకరణ -
క్షతగాత్రుడి ప్రాణాలు కాపాడిన డీఎస్పీ వెంకటేశులు
రాప్తాడు: ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అసహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రుడిని అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశులు సకాలంలో తన వాహనంలో ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. వివరాలు.. రాప్తాడుకు చెందిన యువకుడు చెడిపోతుల కుళ్లాయప్ప ఆదివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై వెళుతూ జేఎన్టీయూ మార్గంలోని భారత్ గ్యాస్ కార్యాలయం ఎదుట డివైడర్ను ఢీకొని తీవ్ర గాయాలతో పడిపోయాడు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి 108కు సమాచారం అందించారు. అయితే ఎంతకూ 108 వాహనం రాలేదు. ఈ లోపు కుళ్లాయప్ప పరిస్థితి విషమిస్తుండడంతో తన సిబ్బంది ద్వారా విషయం తెలుసుకున్న డీఎస్పీ వెంకటేశులు అప్రమత్తయ్యారు. అప్పటికే ఇంటికి వాహనంలో బయలుదేరిన ఆయన వెంటనే ప్రమాదస్థలానికి చేరుకుని తీవ్ర గాయాలతో పడి ఉన్న కుళ్లాయప్పను స్థానికుల సాయంతో తానే పైకి లేపి తన వాహనంలో సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. యువకుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో స్థానికంగానే తొలుత ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అటు నుంచి బెంగళూరుకు కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. కాగా, క్షతగాత్రుడిని తన వాహనంలో ఆస్పత్రికి చేర్చిన డీఎస్పీ చొరవను స్థానికులు అభినందిచారు. ‘ఈ సార్ చాలా మంచోడు’ అంటూ కితాబునిచ్చారు. పేకాటరాయుళ్ల అరెస్ట్ రొళ్ల: మండలంలోని చర్లోపల్లి గ్రామ పొలిమేరలో పేకాట ఆడుతూ పది మంది పట్టుబడ్డారు. ఎస్ఐ వీరాంజనేయులు తెలిపిన మేరకు... అందిన సమాచారంతో ఆదివారం సాయంత్రం మడకశిర రూరల్ సీఐ రాజ్కుమార్ నేతృత్వంలో చర్లోపల్లి గ్రామ పరిసరాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో పేకాట ఆడుతూ పది మంది పట్టుబడ్డారు. వీరి నుంచి రూ.72,800 నగదు స్వాధీనం చేసుకున్నారు. జూదరులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సూపర్ మార్ట్లో యువతిపై దాడి అనంతపురం: నగరంలోని శాంతినగర్ వద్ద ఉన్న వియాన్సీ ఫ్యామిలీ మార్ట్లో ఓ యువతిపై దాడి జరిగింది. అనంతపురం మూడో పట్టణ సీఐ కె.శాంతిలాల్ తెలిపిన మేరకు... అనంతపురంలో నివాసముంటున్న గుంటూరు హరిత తల్లిదండ్రులిద్దరూ మృతి చెందడంతో తన చిన్నాన్న పర్యవేక్షణలో ఉంటూ ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు తన చిన్నాన్న నిర్వహిస్తున్న వియాన్సీ ఫ్యామిలీ మార్ట్లోని నగదు కౌంటర్ వద్ద వ్యాపార లావాదేవీలను చూస్తుంటారు. ఈ క్రమంలో శనివారం ఉదయం 10:30 గంటలకు స్కార్పియో వాహనంలో మార్ట్కు చేరుకున్న సాకే నాగమణి, పయ్యావుల లోకనాథ్, డ్రైవర్ దుర్గాప్రసాద్ ఓ బాస్కెట్ తీసుకుని అందులో తమకు కావాల్సిన సరుకులు వేసుకుని బిల్లింగ్ కౌంటర్ వద్దకు చేరుకున్నారు. వాటికి బిల్ వేయడంతో రూ.200 అయింది. వారి వద్ద ఉన్న క్లాత్ బ్యాగ్లో వేసుకున్న వస్తువులు కూడా బయటకు తీయాలని అక్కడున్న అనిల్ తెలిపాడు. తాము ఎలా కనిపిస్తున్నామంటూ వారు దబాయించారు. దీంతో షాపింగ్ చేస్తున్న సమయంలో తాము సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, అందులో వారు కొన్ని వస్తువులు బ్యాగ్లో వేసుకోవడం స్పష్టంగా గమనించినట్లు తెలపడంతో సాకే నాగమణి రెచ్చిపోయి హరిత జట్టు పట్టి లాగి కొట్టారు. అదే సమయంలో హరితపై పయ్యావుల లోక్నాథ్, డ్రైవర్ దుర్గాప్రసాద్ దాడి చేయబోతుండగా తప్పించుకునినే ఉన్న గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నారు. తలుపులు బద్దలుగొట్టేందుకు లోకనాథ్, దుర్గాప్రసాద్ ప్రయత్నిస్తుండడంతో అక్కడున్న సిబ్బంది అడ్డుకుని సర్దిచెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసినట్లు సీఐ శాంతిలాల్ తెలిపారు. -
అందరూ ఆయనకే వత్తాసు
పేదలపై ఎందుకు కక్ష? మా పొలాలకు దారి కావాలని పదేళ్లుగా పోరాడుతున్నాం. ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చాం. తహసీల్దార్ సారు వాళ్లు ఒకసారి వచ్చి చూసి వెళ్లారు. దారి ఉందని చెప్పారు. అయితే రెడ్డెప్పశెట్టి దారి ఇవ్వడం లేదు. ఏమైనా మాట్లాడితే కేసులు పెట్టిస్తాడు. మాకా వయసైపోతోంది. పైగా పేదవాళ్లం. కోర్టుల చుట్టూ తిరిగే ఓపిక, ఆర్థిక స్తోమత రెండూ లేక న్యాయం కోసం ఎదురుచూస్తున్నాం. – చలపతి, రైతు, దోరణాలపల్లి మాకు రెండెకరాల పొలం ఉంది. ఆ స్వామి(రెడ్డప్పశెట్టి)ని మేము అడిగింది పొలాలకు వెళ్లేందుకు దారి ఇవ్వండి అని. పంటలు సాగుచేసుకొని జీవనం సాగిస్తున్న మాలాంటి వారిపై దేనికి అంత కక్ష? మా భూములూ ఇచ్చేస్తాం.. ఆయనే ఏలుకోమని చెప్పండి. అంత దూరం నడవలేక, పంటలను సరిగా చూసుకోలేక దిగుబడులు రావడం లేదు. మాకు న్యాయం చేయండి.. దారి ఇప్పించండి. – మునీశ్వరమ్మ, దోరణాలపల్లి -
పిడుగుపాటుకు గుడిసె దగ్ధం
పెనుకొండ రూరల్: దుద్దేబండలో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. రాత్రి 7.30 గంటల సమయంలో రైతు నారాయణప్ప పొలంలోని గుడిసైపె పిడుగు పడింది. పిడుగు ధాటికి గుడిసె దగ్ధమై పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. గుడిసెలోని బియ్యం, బీరువాలోని దుస్తులు, నగదు కాలిపోయినట్లు బాధితులు తెలిపారు. నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రశాంతి నిలయం: కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ చేతన్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించే కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అందజేయాలని సూచించారు. ఎస్పీ కార్యాలయంలో... పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ వి.రత్న తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అందజేస్తే.. పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సూచించారు. నవ వరుడి ఆత్మహత్యాయత్నం పామిడి: పైళ్లెన రెండు నెలలకే జీవితంపై విరక్తితో ఓ నవ వరుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పామిడి మండలం కోనేపల్లికి చెందిన పుంజా హరీష్ సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 21న యాడికి మండలం వెంకటాంపల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ చంద్ర ప్రభావతితో పెద్దల సమక్షంలో పామిడిలోని రహమత్ ఫంక్షన్ హాల్లో పెళ్లి అయింది. దంపతుల మధ్య ఏమి జరిగిందో? ఏమో తెలియదు కానీ ఆదివారం హరీష్ పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతణ్ని కుటుంబసభ్యులు వెంటనే పామిడిలోని సీహెచ్సీకి తీసుకువచ్చారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరుకు తరలించినట్లు సమాచారం. ఘటనపై పామిడి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
భక్తులపై తేనెటీగల దాడి
ఉరవకొండ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి వచ్చిన భక్తులపై ఆదివారం తేనెటీగలు దాడి చేశాయి. వివరాలు.. మండల పరిధిలోని వెలిగొండ గ్రామానికి చెందిన రాజశేఖర్, భాగ్యమ్మ, శ్రీలేఖ, రామాంజినేయులు, జయలక్ష్మి, రాజేశ్వరి, యుగంధర్, మల్లికార్జున, ప్రతాప్, ప్రభాస్, జనార్దన్ తదితర 20 మంది ఆదివారం పెన్నహోబిలం వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం పొట్టేలు బలి ఇచ్చి ఆలయం కింది భాగంలో వంట చేసుకుని విందు భోజనాలకు కూర్చున్నారు. ఈ క్రమంలోనే అక్కడే చెట్టు మీద ఉన్న పెద్ద తేనెతుట్టె నుంచి ఒక్కసారిగా తేనెటీగలు లేచి దాడి చేశాయి. హఠాత్పరిణామంతో ఆందోళనకు గురైన వారు కేకలు వేస్తూ పిల్లాపాపలతో కలిసి పరుగు తీశారు. స్థానికులు 108 సాయంతో గాయపడ్డ వారిని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 20 మందికి గాయాలు -
పొలాలకు వెళ్లే దారేదీ..?
ఇద్దరు రైతులపై కేసులు పొలాలకు దారి ఎందుకు వదలరంటూ దోరణాలపల్లికి చెందిన రైతులు నంజిరెడ్డి, నారాయణరెడ్డి రియల్టర్ రెడ్డెప్పశెట్టిని ప్రశ్నించారు. మీరు దారి ఇవ్వకపోతే.. మేమూ తిరగనివ్వం అని అంటే ఆగ్రహించిన రెడ్డప్పశెట్టి సదరు రైతులపై కేసులు పెట్టించి కోర్టుల చుట్టూ తిప్పుతున్నాడు. ఆయనకొక న్యాయం.. మాకొక న్యాయమా అంటూ బాధిత రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. రాజ్యాంగేతర శక్తిగా మారి ఇంతటి దాష్టీకానికి పాల్పడుతున్నా ప్రభుత్వాలు, అధికారులు ఎందుకు స్పందించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురి దుర్మరణం
ఉరవకొండ: స్థానిక నియోజకవర్గ పరిధిలో చోటు చేసుకున్న వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన మేరకు... వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి తండాకు చెందిన వెంకటేష్ నాయక్ (51) ఆదివారం వ్యక్తిగత పనిపై ద్విచక్ర వాహనంలో ఉరవకొండకు బయలుదేరాడు. మార్గమధ్యంలో పీసీ ప్యాపిలి వద్దకు చేరుకోగానే బస్సు కోసం వేచి ఉన్న అదే గ్రామానికి చెందిన శాంతమ్మ(33) అభ్యర్థన మేరకు ఆమెను తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని బయలుదేరాడు. ఉరవకొండ సమీపంలోని హంద్రీ–నీవా కాలువ వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఆర్టీసీ బస్పు ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, వెంకటేష్నాయక్ భార్య ఏడాది క్రితమే చెందింది. ఇద్దరు కుమారులు ఉన్నారు. పీసీ ప్యాపిలికి చెందిన శాంతమ్మ భర్త వన్నూరు స్వామి ఉరవకొండలోని ఓ హోటల్లో సప్లయిర్గా పనిచేస్తున్నాడు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. తమ్ముడి నిశ్చితార్థానికి వెళుతూ.. అనంతపురంలోని సర్వజనాస్పత్రిలో స్టాఫ్నర్సుగా పనిచేస్తున్న ప్రవల్లిక.. ఉరవకొండలో భర్త మల్లికార్జునతో పాటు కలసి నివాసముంటుంది. ఈ క్రమంలో రోజూ బస్సులో విధులకు వెళ్లి వచ్చేవారు. వజ్రకరూరు మండలం చాబాలలో ఉన్న తన తమ్ముడి వివాహ నిశ్చితార్థం ఉండడంతో ఆదివారం భర్తతో కలసి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా వేగంగా వచ్చిన ఆటో ఢీకొంది. ఘటనలో ప్రవల్లిక అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన మల్లి కార్జునకు స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తీసుకెళ్లారు. ఈ రెండు ఘటలపై సీఐ మహనంది కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
దివ్యాంగులకు వరం.. యూడీఐడీ
దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్న యూడీఐడీ (యూనిక్ డిసబిలిటీ ఐడెంటిటీ) కార్డు ఓ వరం కానుంది. ఈ కార్డు ద్వారా వారు తమ వైకల్య శాతాన్ని రుజువు చేయవచ్చు. అంతేకాక ఇతర రాష్ట్రాల్లోనూ సులభంగా సదుపాయాలను పొందవచ్చు. ప్రశాంతి నిలయం: సమాజంలో దివ్యాంగులు తమ సంరక్షణకు పడే పాట్లు అన్నిఇన్నీ కావు. ఈ క్రమంలో వారు తమకు అవసరమైన సేవలను సులువుగా పొందేందుకు వీలుగా యూనిక్ డిసబిలిటీ ఐడెంటిటీ (యూడీఐడీ) కార్డును కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తోంది. రాబోవు రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలంటే ఈ కార్డులు తప్పనిసరిగా కానున్నాయి. సేవలను సులభతరం చేయడమే లక్ష్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగులకు అందించే ప్రయోజనాల కోసం ఇప్పటి వరకూ సదరం సర్టిఫికెట్ తప్పని సరి అయింది. దీని కోసం దివ్యాంగులు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల ద్వారా ముందుగా సదరం స్లాట్ బుక్ చేసుకుంటే ప్రభుత్వం నిర్దేశించిన వైద్య శిబిరంలో వైద్యులు వైకల్య ధ్రువీకరణ అనంతరం సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు నెలల తరబడి సమయం పడుతోంది. ఇలాంటి తరుణంలో సదరం సర్టిఫికెట్లకు స్వస్తి పలుకుతూ ఆ స్థానంలో యూడీఐడీలను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు యూడీఐడీ కార్డు పొందాలంటే https://www. swavlambancard.gov.in/ వెబ్సైట్ ద్వారా స్వయంగా లేదా మీ సేవా కేంద్రాల నుంచి కూడా దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత గతంలో మాదిరిగానే జిల్లా ఆస్పత్రిలో నిర్వహించే క్యాంప్లకు హాజరైతే అక్కడ వారికి స్లాట్ కేటాయించి, మెడికల్ క్యాంప్ ఎప్పుడు ఉండేదనేది ఫోన్ ద్వారా సమాచారం అందజేస్తారు. వారు చెప్పిన రోజున క్యాంప్నకు హాజరైతే సంబంధిత డాక్టర్లు పరీక్షలు నిర్వహించి వైకల్య శాతాన్ని ధ్రువీకరిస్తూ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. దీని ప్రకారం యూడీఐడీ జనరేట్ అయి కార్డు నేరుగా ఇంటికే చేరుతుంది. ఇప్పటి వరకు కేవలం 7 రకాల వైకల్యం ఉన్న వారికే మాత్రమే మీ సేవ ద్వారా సదరం శిబిరాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇకపై 21 రకాల వైకల్యాలకు సంబంధించిన సేవలను పొందేలా సులభతరం చేశారు. ఈ కార్డుల ద్వారా సామాజిక భద్రత పింఛన్లతో పాటు ఇతర సంక్షేమ పథకాలను దేశ వ్యాప్తంగా ఎక్కడైనా పొందే వెసులుబాటు ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి యూడీఐడీ ప్రాజెక్ట్ ప్రతి సారీ అర్హత పత్రాలతో తిరిగే అవసరం లేదు వివరాలన్నీ కార్డుపై క్యూఆర్ కోడ్ రూపంలో నిక్షిప్తం 21 రకాల వైకల్యాలకు యూడీఐడీ ద్వారా గుర్తింపు జిల్లా వ్యాప్తంగా 54,600 మంది దివ్యాంగులకు లబ్ధి తప్పని సరిగా యూడీఐడీ కార్డు పొందాలి జిల్లాలో సుమారు 54,600 మంది దివ్యాంగులు ఉన్నారు. వీరిలో 35,078 మంది దివ్యాంగుల పింఛన్లు పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యూడీఐడీ కార్డును ప్రతి ఒక్కరూ పొందాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి లబ్ధి పొందాలన్నా ఈ కార్డు తప్పనిసరి. పూర్తి వివరాల కోసం 94400 33130లో సంప్రదించవచ్చు. – వినోద్, అసిస్టెంట్ డైరెక్టర్, జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ -
గుర్తుపెట్టుకుంటాం.. వడ్డీతో కలిపి చెల్లిస్తాం
పరిగి: ‘‘అధికారం ఎవరికీ శాశ్వతం కాదు...ఇప్పుడు మీరు చేస్తున్న దౌర్జన్యాలన్నీ గుర్తుపెట్టుకుంటాం.. త్వరలోనే వడ్డీతో కలిపి చెల్లిస్తాం’’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ కూటమి నేతలను హెచ్చరించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా...ఏ రాజకీయ పార్టీ అన్యాయం చేసినా ప్రజల పక్షాన నిలబడి న్యాయపోరాటం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని, అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. శనివారం ఆమె పరిగి మండలం పైడేటిలో విలేకరులతో మాట్లాడారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కిందన్నారు. కానీ నేటి కూటమి ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క హామీ నెరవేర్చలేకపోయిందని ధ్వజమెత్తారు. ఎన్నికల వేళ అలవిగాని హామీలిచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు అన్ని వర్గాలనూ మోసం చేశారన్నారు. పైగా అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలతో అమాయకులను వేధిస్తున్నారన్నారు. అందుకే కూటమి సర్కార్ దేశంలోనే అత్యంత దుర్మార్గమైన ప్రభుత్వంగా పేరు తెచ్చుకుందన్నారు. బీసీ, ఎస్సీ కార్పొరేషన్ రుణాల మంజూరులో కేవలం టీడీపీ నాయకులకు మాత్రమే వర్తింపజేసేందుకు కూటమి నేతలు అధికారులపై ఒత్తిడి చేస్తున్నారన్నారు. వక్ఫ్బోర్డు సవరణపై ప్రభుత్వ వైఖరి సరికాదు ముస్లింలకు తీరని నష్టం కలిగించే వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ఉషశ్రీచరణ్ డిమాండ్ చేశారు. ముస్లిం, మైనార్టీలు కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లేసిన పాపానికి పశ్చాతాప పడుతున్నారన్నారు. సిద్దాంతాలను తాకట్టు పెట్టి, కేంద్ర ప్రభుత్వంతో కలిసి మైనార్టీల గొంతుకోసిన చంద్రబాబును ముస్లింలు ఎప్పటికీ క్షమించబోరన్నారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. కూటమి నేతలను హెచ్చరించిన ఉషశ్రీచరణ్ ఎల్లకాలం అవినీతి రాజ్యం సాగదని వెల్లడి -
పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి
పుట్టపర్తి టౌన్: ప్రతి ఒక్కరూ మన ఇంటితో పాటు పరిసరాలు, కార్యాలయాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎస్పీ రత్న పిలుపునిచ్చారు. స్వచ్ఛ ఆంధ్ర– స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ, పోలీస్ అధికారులు, డీపీఓ సిబ్బంది, ఏఆర్ పోలీసులు కార్యాలయ ఆవరణాన్ని శుభ్రం చేశారు. ఎస్పీ మాట్లాడుతూ మన చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే అందరూ ఆరోగ్యంగా ఉండడంతో పాటు ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందన్నారు. కార్యక్రమంలో ఏఓ సుజాత, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్బీ సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి, డీసీఆర్బీ సీఐ శ్రీనివాసులు, డీటీఆర్బీ సీఐ సతీష్, ఆర్ఐలు మహేష్, వలి, ఎస్బీ ఎస్ఐ ప్రదీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సీహెచ్ఓల డిమాండ్లు నెరవేర్చాలి
పుట్టపర్తి అర్బన్: నేషనల్ హెల్త్ మిషన్ కింద పని చేస్తున్న సీహెచ్ఓల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ఏపీ ఎంపీసీఏ నాయకులు కోరారు. శనివారం సాయంత్రం ఏపీ ఎంపీసీఏ ఆధ్వర్యంలో ఉద్యోగులు డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజాబేగంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎంపీసీఏ జిల్లా అధ్యక్షుడు కార్తీక్రెడ్డి జనరల్ సెక్రటరీ నందీశ్వరరెడ్డి మాట్లాడుతూ జీత భత్యాల విషయంలో సీహెచ్ఓలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. ఆరేళ్లు దాటిన సీహెచ్ఓలను క్రమబద్ధీకరించాలని, నేషనల్ హెల్త్ స్కీంలో ఇతర ఉద్యోగులతో సమానంగా 23 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని, ప్రతి నెలా జీతంతో పాటు ఇన్సెంటివ్ ఇవ్వాలని, ఏటా 5 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని, ఆర్థికమైన, ఆర్థికేతర సమస్యలను తీర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు చందన, వేణుగోపాల్, సీహెచ్ఓలు పాల్గొన్నారు. -
కొబ్బరిచెట్టుపై పిడుగు
చిలమత్తూరు: కనిశెట్టిపల్లిలో శుక్రవారం రాత్రి ఓ ఇంటి సమీపాన కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. భారీ శబ్దానికి గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. గ్రామంలో పలువురు స్పృహ కోల్పోయారు. కులం పేరుతో దూషించిన వ్యక్తిపై కేసు ధర్మవరం అర్బన్: జూనియర్ లైన్మెన్ను కులం పేరుతో దూషించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణంలోని జగ్జీవన్ రామ్నగర్కు చెందిన సాకే దినేష్ జూనియర్ లైన్మెన్గా పనిచేస్తున్నారు. శనివారం ఇందిరమ్మ కాలనికి చెందిన నిట్టూరు సుబాన్ అనే వ్యక్తికి ఫోన్ చేసి కరెంటు బిల్లు కట్టాలని కోరాడు. ఇందుకు ఆగ్రహించిన సుబాన్ జూనియర్ లైన్మెన్ను కులం పేరుతో దూషించాడు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన జూనియర్ లైన్మెన్ టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సుబాన్పై కేసు నమోదు చేసినట్లు సీఐ రెడ్డప్ప తెలిపారు. గుర్తుతెలియని యువకుడి మృతి ధర్మవరం అర్బన్: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో శనివారం గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడని వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. మృతుడి వయసు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. ఆచూకీ తెలిసిన వారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లేదా 94407 96831, 94405 52808, 94407 32538 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
జిల్లా జడ్జి బాధ్యతల స్వీకరణ
అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లా జడ్జిగా ఈ. భీమా రావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు ఉన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీనివాస్ నెల్లూరు జిల్లాకు బదిలీ అయిన సంగతి విదితమే. చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న ఈ. భీమా రావును అనంతపురం కోర్టుకు బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన భీమారావును బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గురుప్రసాద్, జనరల్ సెక్రటరీ వెంకటరాముడు, వైస్ ప్రెసిడెంట్ ధర్మసింగ్ నాయక్, ట్రెజరర్ వెంకట రఘుకుమార్ తదితరులు సత్కరించారు. 22న ‘పురం’లో మెగా జాబ్మేళా ప్రశాంతి నిలయం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 22న హిందూపురంలోని శ్రీ బాలాజీ విద్యా విహార్ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్మేళా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ తెలిపారు. జిల్లాలోని యువతీ, యువకులు జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శనివారం ఆయన తన చాంబర్లో జాబ్మేళా పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జాబ్మేళాలో 20 మల్టీనేషనల్ కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. పదో తరగతి, ఐటీఐ, డిప్లొమో, బీటెక్, బీ.ఫార్మసీ, ఎం.ఫార్మసీ, పీజీ కోర్సులు చదివిన వారు జాబ్మేళాలో పాల్గొనవచ్చన్నారు. ఆయా కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారన్నారు. పూర్తి వివరాల కోసం 9676706976, 9966682246 నంబర్లలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ నరసయ్య, స్కిల్ డెవలప్మెంట్ ట్ అధికారి హరికృష్ణ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ–కేవైసీ చేయించుకోండి ప్రశాంతి నిలయం: జిల్లాలోని రేషన్ కార్డుదారులందరూ ఏప్రిల్ 30వ తేదీలోపు ఈ–కేవైసీ చేయించుకోవాలని, లేకపోతే రేషన్ సరుకులు ఇవ్వబోరని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో కార్డుదారులు ఈ–కేవైసీ చేయించుకోకపోయినా రేషన్ సరుకులు ఇచ్చేవారని, ఏప్రిల్ 30 నుంచి అలాంటి పరిస్థితి ఉండదన్నారు. ఈ–కేవైసీ చేయించుకోని వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనం చేకూరదన్నారు. జిల్లాలో 16,89,531 రేషన్ కార్డుదారులుండగా, ఇప్పటి వరకు 15,48,523 మంది ఈ–కేవైసీ చేయించుకున్నారని, ఇంకా 1,11,673 మంది ఈ–కేవైసీ చేయించుకోవాల్సి ఉందన్నారు. వారంతా వెంటనే ఆయా గ్రామ సచివాలయాలు, రేషన్ షాపుల్లో ఈ–పాస్ యంత్రాల ద్వారా ఈ– కేవైసీ నమోదు చేసుకోవాలని సూచించారు. 5 ఏళ్లలోపు, 80 ఏళ్లు పైబడి వయస్సు కలిగిన వారికి ఈ–కేవైసీ నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. జేఈఈ మెయిన్స్లో ర్యాంకుల పంట కదిరి అర్బన్: జేఈఈ మెయిన్స్ రెండోసెషన్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన ఎన్ఐటీ, త్రిపుల్ ఐటీల్లో బీటెక్, బీఈ కోర్సుల ప్రవేశాలకు నేషనల్ టెస్ట్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. రెండు విడతల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులు కేటాయించారు. ఈ పరీక్షల్లో జిల్లా నుంచి పలువురు విద్యార్థులు జాతీయ స్థాయి ర్యాంకులు సాధించారు. కదిరికి చెందిన చంద్రమోహన్రెడ్డి కుమార్తె కనిష్క 99.78 శాతం పర్సంటైల్తో ఆల్ ఇండియా స్థాయిలో 3411 ర్యాంకు సాధించింది. అలాగే పట్టణానికి చెందిన ఓబులపతి కుమారుడు ఓం కిరణ్ 99.91 శాతం పర్సంటైల్తో ఓబీసీ కేటగిరీలో 252 ర్యాంకు, జనరల్ కేటగిరీలో 1462 ర్యాంకు దక్కించుకున్నాడు. అలాగే రమణారెడ్డి కుమారుడు అనీష్రెడ్డి 2460 ర్యాంక్ సాధించాడు. -
విత్తన వేరుశనగ నాణ్యతపై దృష్టి
అనంతపురం అగ్రికల్చర్: వచ్చే ఖరీఫ్లో రైతులకు పంపిణీ చేయడానికి నాణ్యమైన విత్తన వేరుశనగ అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. ఈ నెల 22న విత్తన వేరుశనగ సేకరణ, సరఫరాకు సంబంధించి టెండర్లు ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో కమిషనరేట్ నుంచి వచ్చిన ఏడీఏ రమణమూర్తి, ఏవో సుకుమార్ గత రెండు రోజులుగా అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో పర్యటించారు. రెండు జిల్లాల పరిధిలో ఉన్న 10 ప్రాసెసింగ్ ప్లాంట్లను సందర్శించి అక్కడున్న వేరుశనగ కాయల నాణ్యతను పరిశీలించారు. టెండర్లు ఖరారు కాగానే నిబంధనల మేరకు నాణ్యమైన విత్తన వేరుశనగను సరఫరా చేయాల్సి ఉంటుందని నిర్వాహకులకు సూచించారు. ఏపీ సీడ్స్ ద్వారా సరఫరా, పంపిణీ ఉంటుందని, నెలాఖరు నాటికి సేకరణ ధరలు ఖరారు కానున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాలు (గ్రీన్ మెన్యూర్స్) కింద జనుము, జీలుగ, పిల్లిపెసర విత్తన కేటాయింపులు, 50 శాతం సబ్సిడీ ప్రకటించినట్లు తెలిపారు. వివాహిత ఆత్మహత్య చిలమత్తూరు: వడ్డిచెన్నంపల్లికి చెందిన పవిత్ర (24) అనే వివాహిత శనివారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారంతో డీటీ జగన్నాథ, పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, పంచనామా నిర్వహించారు. అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈమెకు 15 నెలల కుమారుడు ఉన్నాడు. కలుపు తొలగించబోయి.. కానరాని లోకాలకు అమరాపురం: కాచికుంట గ్రామానికి చెందిన మంజునాథ (31) శనివారం ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ కిందపడి మృతి చెందాడు. బంధువులు తెలిపిన వివరాల మేరకు... గ్రామానికి చెందిన రైతు ఈరన్న పొలంలో వక్క చెట్ల నడుమ పిచ్చి మొక్కలు తొలగించడానికి ట్రాక్టర్తో పాటు రోటావేటర్ తీసుకెళ్లాడు. కలుపు మొక్కలను తొలగిస్తుండగా అకస్మాత్తుగా కిందపడగానే ట్రాక్టర్ టైరు ఎక్కింది. దీంతో మంజునాథ అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ ఇషాక్బాషా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని మడకశిర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
అగ్గిపడితే.. బుగ్గే
ధర్మవరం: వేసవిలో వరుస అగ్ని ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో నిత్యం ఏదో ఒకచోట అగ్ని ప్రమాదం జరుగుతోంది. ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ స్టేషన్కు ఫోన్ చేద్దామంటే సమయానికి వచ్చే అవకాశమే లేకుండా పోయింది. ఎందుకంటే ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లోని ఆరు మండలాలకు ఒకే ఫైర్ ఇంజిన్, ఒకే ఫైర్స్టేషన్ ఉండటమే కారణం. ధర్మవరంలోని మాధవనగర్లోని అగ్నిమాపకశాఖ కార్యాలయం ఉంది. ఈ కార్యాలయ పరిధిలోకి బత్తలపల్లి, తాడిమర్రి, ధర్మవరం మండలాలతోపాటు చెన్నేకొత్తపల్లి, రామగిరి, కనగానపల్లి మండలాలు వస్తాయి. ఈ ఆరు మండలాల్లోని ఏ ప్రాంతంలో ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా ఇక్కడినుంచే ఫైరింజన్ వెళ్లాల్సి ఉంది. రామగిరి మండలం ధర్మవరానికి దాదాపు 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదేవిధంగా తాడిమర్రి మండలంలో చివరి గ్రామం పట్టణానికి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రమాదం జరిగినపుడు ఆ ప్రాంతాల్లోకి ఫైరింజన్ చేరుకోవాలంటే గంటపైనే సమయం పడుతుండడంతో ఫైర్ సిబ్బంది స్థానికుల ఆగ్రహానికి గురవుతున్నారు. దీనికితోడు ఇతర ప్రాంతాల్లో విపత్తులు సంభవించినపుడు ఇక్కడి సిబ్బంది అక్కడ విధుల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ముందుకు కదలని కొత్త ఫైర్స్టేషన్ ఏర్పాటు.. అగ్ని మాపకశాఖ అధికారులు సీకేపల్లి మండలంలో కొత్త ఫైర్స్టేషన్ ఏర్పాటు చేసేలా గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. తద్వారా ధర్మవరంలో ఉన్న ఫైర్స్టేషన్కు పనిభారం తగ్గడంతో పాటు రాప్తాడులోని సీకేపల్లి, కనగానపల్లి, రామగిరి మండలాలకు సత్వరం ఫైర్ సేవలు అందించే వీలుంటుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. మంత్రి సత్యకుమార్ ఈ విషయంపై దష్టిసారించి కొత్త ఫైర్స్టేషన్ ఏర్పాటుతో పాటు ధర్మవరంలో ఉన్న ఫైర్స్టేషన్కు రెండు ఫైర్ ఇంజిన్లు అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. ● ఈ విషయమై సాక్షి జిల్లా అగ్ని మాపక అధికారి హేమంత్రెడ్డిని వివరణ కోరగా ఫైర్స్టేషన్ అప్గ్రేడ్ చేయడం మా చేతుల్లో లేదని, అది ప్రభుత్వం చేయాల్సిన పని అని, తమను అడగకండి అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. వేసవి సీజన్లో వరుస అగ్ని ప్రమాదాలు ఆరు మండలాలకు ఒకే ఫైర్ స్టేషన్ ఫైర్సేవలు సత్వరం అందడం ప్రశ్నార్థకమే తీవ్రంగా నష్టపోతున్న అగ్ని ప్రమాద బాధితులు -
ఏడు నెలలు.. మద్యం ఏరులు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: కూటమి సర్కారు పుణ్యమా అని ఉమ్మడి అనంతపురం జిల్లా మద్యం మత్తులో ఊగిపోతోంది. పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా మద్యం దుకాణాల వద్ద మందు బాబులతో జాతర వాతావరణం తలపిస్తోంది. రోడ్డుమీదే తాగుతూ చిందులేస్తున్నారు. పట్టణాల్లో పర్మిట్ రూములు, పల్లెటూళ్లలో బెల్టుషాపులు.. ఇదీ దుస్థితి. నాలుగు వందల జనాభా ఉన్న గ్రామంలో కూడా రెండు, మూడు బెల్టుషాపులు పెట్టి రేషన్ బియ్యం తరహాలో ఇంటింటికీ మద్యం అమ్ముతున్నారు. టీడీపీ నేతల ఆధ్వర్యంలో అడ్డూ అదుపు లేకుండా జరుగుతున్న మద్యం వ్యాపారంతో వేల కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఏడు నెలల్లో 1.16 కోట్ల లీటర్ల మద్యం.. కూటమి ప్రభుత్వం వచ్చాక గతంలో ఎప్పుడూ లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. గత ఏడాది సెప్టెంబర్ 15 నుంచి 2025 ఏప్రిల్ 15 వరకూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో 1.16 కోట్ల లీటర్ల మద్యం తాగించేశారు. దీన్ని ఐదు వేల లీటర్ల నీటి ట్యాంకర్లతో పోలిస్తే 2,337 ట్యాంకర్ల మద్యం తాగినట్టు లెక్క కావడం గమనార్హం. రోజుకు సగటున రెండు జిల్లాల్లో 55,658 లీటర్ల మద్యం వినియోగమవుతోంది. ఇదికాకుండా ఏడు నెలల్లో 39 లక్షల లీటర్ల బీరు తాగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. రోజు రోజుకూ మద్యానికి అలవాటు పడుతున్న యువకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నేతల షాపులపై కన్నెత్తి చూడరు.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 230 వరకూ మద్యం షాపులున్నాయి. వీటిలో మెజారిటీ షాపులు టీడీపీ ఎమ్మెల్యేలవే. ఈ దుకాణాలకు అనుబంధంగా బెల్టుషాపులు కూడా నిర్వహిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎకై ్సజ్ అధికారులు వాటి వైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి. ఎవరైనా అటువైపు వెళితే బదిలీ చేస్తామని ఎకై ్సజ్ అధికారులను ‘పచ్చ’ నేతలు బెదిరిస్తున్నారు. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకే మద్యం షాపులు పనిచేయాలి. కానీ రాప్తాడు, రాయదుర్గం లాంటి కొన్ని నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకే షాపులు తెరుస్తున్నారు. అనంతపురం లాంటి చోట్ల టీడీపీ ఎమ్మెల్యే మద్యం దుకాణాల పక్కనే పర్మిట్ రూములు ఏ సమయంలో చూసినా జనం కిక్కిరిసి ఉంటున్నాయి. అయినా ఎవరూ పట్టించుకునే దిక్కులేదు. అడ్డూ అదుపు లేని ఈ మద్యం అమ్మకాలతో సామాన్య కుటుంబాలు అప్పులపాలవుతున్నాయి. విచ్చలవిడిగా లభిస్తున్న మద్యం కారణంగా కుటుంబ తగాదాలు ఎక్కువగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. 1.16 కోట్ల లీటర్ల మద్యం తాగేశారు రోజుకు సగటున 55 వేల లీటర్లకు పైగా వినియోగం మరో 39 లక్షల లీటర్ల బీర్లు కూడా.. పల్లెటూళ్లలో బెల్టుషాపులు.. పట్టణాల్లో పర్మిట్ రూములు ఇప్పటివరకూ ఉమ్మడి అనంతలో మద్యం కోసం రూ. 925 కోట్ల వ్యయం -
వరాల తల్లికి జ్యోతుల హారతి
రొళ్ల: రత్నగిరిలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవి వార్షిక ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం జ్యోతుల ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారి మూల విరాట్తో పాటు ఉత్సవ విగ్రహానికి భక్తులు కానుక రూపంలో తీసుకొచ్చిన పట్టువస్త్రాలు, వెండి, బంగారు ఆభరణాలతో పాటు వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పూజలు చేశారు. అనంతరం వేప, తమలపాకులతో అందంగా అలంకరించారు. సాయంత్రం రత్నగిరి ఎస్సీ కాలనీ వాసులు మేళతాళాలతో జ్యోతులను మోసుకువచ్చి ఆలయం చుట్ట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం అమ్మవారికి సమర్పించి హారతులు ఇచ్చారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భారీగా తరలివచ్చిన భక్తులు.. కొల్హాపురి మహాలక్ష్మీదేవిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తండోప తండాలుగా తరలివచ్చారు. దీంతో శనివారం దేవాలయ ఆవరణ భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారి దర్శనానికి భారీగా తరలివచ్చిన మహిళలు సమీపాన ఉన్న పాలబావి వద్దకు చేరుకుని గంగ పూజ నిర్వహించారు. ఆలయ అర్చకులు దాతల సహకారంతో భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో రాజవంశీకుడు దొర రంగప్పరాజు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నేడు పోతులరాజు పూజ.. మహాలక్ష్మీదేవి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం పోతులరాజు పూజ, పుష్పాలంకరణ మహోత్సవం నిర్వహించనున్నట్లు రాజవంశీకుడు దొర రంగప్పరాజు, గ్రామ పెద్దలు తెలిపారు. వైభవంగా కొల్హాపురి మహాలక్ష్మీదేవి జ్యోతుల ఉత్సవం భారీగా తరలివచ్చిన భక్తజనం -
ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో మానవాళికి ముప్పు
పుట్టపర్తి టౌన్: ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో మానవాళికి ముప్పు ఉందని, అందువల్ల గృహాలు, కార్యాలయాలు, వాణిజ్య, వ్యాపార సంస్థల్లో పాడైన ఎలక్ట్రానిక్ పరికరాలు, వస్తువులు శాసీ్త్రయ పద్ధతిలో తొలగించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పిలుపునిచ్చారు. ‘స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం పంచాయతీ రాజ్, పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఈ – వ్యర్థాల అనర్థాలను వివరిస్తూ పుట్టపర్తిలో విద్యార్థులు, మహిళలు ర్యాలీ నిర్వహించారు. సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వద్ద ర్యాలీకి కలెక్టర్ చేతన్ జెండా ఊపి ప్రారంభించగా, వైజంక్షన్ వరకూ కొనసాగింది. అక్కడ విద్యార్థులు, మహిళలు మానవహారంగా ఏర్పడి ‘స్వర్ణాంధ్ర,–స్వచ్చాంధ్ర’ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రపంచ వ్యాప్తంగా 2022 నాటికి 8 కోట్ల టన్నుల ఈ– వ్యర్థాలు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో పేర్కొందన్నారు. ఇందులో ఇరవై మిలియన్ల టన్నులు మాత్రమే రీసైక్లింగ్ జరిగినట్లు వెల్లడించిందన్నారు. మిగిలిన ఈ–వ్యర్థాలను అశాసీ్త్రయ విధానంలో తొలగిస్తున్నారని, ఇది మానవాళి మనుగడకు ప్రమాదకరమన్నారు. ప్రజలు తమ ఇళ్లల్లో పాడైన ఎలక్ట్రానిక్ పరికరాలు, నగర పాలక సంస్థ ఏర్పాటు చేసిన ఈ–వ్యర్థ చెత్త సేకరణ కేంద్రంలో అందజేస్తే వాటిని సరైన రీతిలో రీసైక్లింగ్ చేసి ముప్పు లేకుండా చూస్తారన్నారు. ఈ–వ్యర్థాలను శాసీ్త్రయ పద్ధతిలో తొలగిస్తే వాటినుంచి బంగారు, వెండి, ప్లాటీనం వంటి లోహాలు వెలికి తీయవచ్చన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుంగా ఓబుళపతి, కమిషనర్ ప్రహ్లాద, డీఆర్డీఏ పీడీ నరసయ్య, డీఈఓ కృష్టప్పతో పాటు విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు. శాసీ్త్రయంగా తొలగించడం అందరి బాధ్యత స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ చేతన్ -
తప్పుల్లేని ఓటరు జాబితాకు సహకరించాలి
ప్రశాంతి నిలయం: తప్పుల్లేని ఓటరు జాబితా తయారీకి అందరూ సహకరించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. శనివారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భగా కలెక్టర్ మాట్లాడుతూ....తప్పుల్లేని ఓటరు జాబితా రూపకల్పన, మార్పులు, చేర్పులు పోలింగ్ శాతం పెంచేందుకు రాజకీయ పార్టీల నేతలూ తగిన సలహాలు, సూచనలు ఇవ్వవచ్చన్నారు. ఓటరు జాబితాలో పేరు నమోదు, తొలగింపు, సవరణ, ఇతర క్లైయిమ్లకు సంబంధించిన అంశాలపై చేసిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవచ్చన్నారు. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్, ఓటర్ల రేషనలైజేషన్ ప్రక్రియలో రాజకీయ పార్టీలు భాగస్వాములు కావాలని కోరారు. దీనికోసం ముందుగానే ఆయా పార్టీలు తమ ఏజెంట్ల ద్వారా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి వివరాలను సేకరించి సన్నద్ధంగా ఉంటే ప్రక్రియను సులువుగా పూర్తి చేయవచ్చన్నారు. సమావేశంలో డీఆర్ఓ విజయసారథి, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ జాకీర్ హుస్సేన్, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరిన కలెక్టర్ టీఎస్ చేతన్ -
వైఎస్ జగన్ చొరవతోనే..
వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు మడకశిర నియోజకవర్గానికి 5 విద్యుత్ సబ్స్టేషన్లు మంజూరు చేశారు. కొన్ని సాంకేతిక కారణాలతో నాడు విద్యుత్ సబ్ స్టేషన్లు ప్రారంభానికి నోచుకోలేదు. అవే విద్యుత్ సబ్ స్టేషన్లను శుక్రవారం మంత్రులు ప్రారంభించనున్నారు. అయినా ఈ క్రెడిట్ మొత్తం వైఎస్ జగన్దేనని రైతులు అంటున్నారు. ఈ విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణంలో కూటమి ప్రభుత్వ పాత్ర ఎంత మాత్రం లేదని బహిరంగంగానే చెబుతున్నారు. – ఈరలక్కప్ప. వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మడకశిర -
త్యాగానికి ప్రతీక గుడ్ ఫ్రైడే
హిందూపురం/పుట్టపర్తి టౌన్: క్రైస్తవ సమాజంలో అత్యంత ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడే గుడ్ ఫ్రైడే రానే వచ్చింది. క్రైస్తవ విశ్వాసం ప్రకారం సమాజంలో నెలకొన్న చెడును తొలగించడానికి ఈ రోజున తన జీవితాన్ని యేసు క్రీస్తు త్యాగం చేశాడు. ఆ త్యాగాలను మననం చేసుకుంటూ ప్రత్యేక ప్రార్థనలతో యేసుక్రీస్తుపై విశ్వాసం ప్రకటించేందుకు క్రైస్తవులు సిద్ధమయ్యారు. క్షమ, కరుణకు ప్రతిరూపంగా నిలిచిన యేసు క్రీస్తు.. లోకంలో పాపులను పరిశుద్ధులను చేసే క్రమంలో సిలువపై రక్తం చిందించిన దైవ కుమారుడిగా మరణించి కూడా పునరుత్థానుడై లేచిన సంఘటన ప్రపంచ చరిత్రలో మరెక్కడా కనిపించదు. ఆ ఘట్టాలను వివరించే గుడ్ ఫ్రైడే నుంచి ఆదివారం వచ్చే ఈస్టర్ పర్వదినం వరకు సాగే వేడుకలకు జిల్లాలోని ప్రతి ప్రార్థనామందిరాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ప్రాణ త్యాగ సమయంలోనూ క్రీస్తు తన మరణ శిక్షను అమలు చేస్తున్న రోమన్ సైనికుల కోసం లోక రక్షకుడైన తన తండ్రితో ‘తండ్రీ వీరు ఏమి చేస్తున్నారో ఎరుగరు.. వీరిని క్షమింపుము’ అని ప్రార్థించి తనలోని దయ, కరుణ తత్వాలను లోకానికి చాటారు. సిలువపై క్రీస్తు చెప్పిన ఏడు సూక్తులు లోకానికి ఆరాధ్యాలయ్యాయి. మూడు రోజుల పాటు ప్రత్యేక ప్రార్థనలు.. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా కేవలం దేవుడికి మన హృదయాన్ని సమర్పించుకునేలా శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు హిందూపురంలోని సీ అండ్ ఐజీ చర్చ్, సీ అండ్ ఐజీ కాంపౌండ్ మీషన్ చర్చి, జెరూసెలం చర్చి, బైబిల్ మిషన్ చర్చి, సీఎస్ఐ చర్చి, జియాన్ చర్చిలతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. శుక్రవారం గుడ్ప్రై డే ప్రార్థనలు, శనివారం రన్ ఫర్ జీసెస్, ఆదివారం ఈస్టర్ వేడుకలు నిర్వహించనున్నారు. ఆదివారంతో ముగియనున్న శోకదినాలు గుడ్ఫ్రైడేను పురస్కరించుకుని క్రైస్తవులు పాటించిన 40 రోజుల శోక దినాలు ఆదివారంతో ముగియనున్నాయి. ఈ 40 రోజుల పాటు శుభకార్యాలకు దూరంగా ఉంటారు. కనీసం నూతన దుస్తులు కూడా ధరించరు. పొరపాటున కూడా ఇతరులకు కీడు కలిగించే పనులు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక ప్రార్థనల్లోనే గడపడం ఆనవాయితీ. శుభ శుక్రవారం తర్వాత యేసు క్రీస్తు పునరుత్థానుడై లేచిన సందర్భంగా ఆదివారం పండుగను నిర్వహించేందుకు క్రైస్తవులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.పుట్టపర్తిలో విద్యుద్దీపాలంకరణలో వెలుగులీనుతున్న కింగ్స్ చర్చ్ సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న చర్చిలు ప్రత్యేక ప్రార్థనలతో యేసుక్రీస్తుపై విశ్వాసం ప్రకటించనున్న క్రైస్తవులు -
రూ.10 లక్షల విలువైన బైక్ల స్వాధీనం
బత్తలపల్లి: ద్విచక్ర వాహనాలను అపహరించుకెళ్లే యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.10 లక్షల విలువైన 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బత్తలపల్లి పీఎస్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను సీఐ ప్రభాకర్, ఎస్ఐ సోమశేఖర్ వెల్లడించారు. అనంతపురం నగరానికి చెందిన ప్రణయ్, ధనూష్, సిద్ది వినయ్ వ్యసనాలకు బానిసలుగా మారి జులాయిగా తిరుగుతూ తమ జల్సాలకు అవసరమైన డబ్బు కోసం ద్విచక్ర వాహనాలను అపహరించడాన్ని పనిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో ముగ్గురు మైనర్లను కలుపుకున్నారు. వీరంతా కలసి ఓ ముఠాగా ఏర్పడి ద్విచక్ర వాహనాలను అపహరించుకెళ్లి తక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకునేవారు. అనంతరం ఇతర రాష్ట్రాలకు చేరుకుని జల్సాలు చేసేవారు. ఈ క్రమంలో బత్తలపల్లిలోని జాతీయ రహదారి కూడలిలో గురువారం ఉదయం వాహన తనిఖీలు చేపట్టిన సమయంలో రెండు ద్విచక్ర వాహనాలపై ఆరుగురు వెళుతుండగా స్థానిక పోలీసులు అడ్డుకుని విచారణ జరిపారు. ఆ సమయంలో వారు పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో అనుమానంతో అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. బత్తలపల్లి, ధర్మవరం, అనంతపురం నగర పరిధిలో అపహరించిన 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.10 లక్షలుగా ఉంటుందని నిర్ధారించారు. వీరిపై బత్తలపల్లిలో రెండు, ధర్మవరం టూ టౌన్ పరిధిలో మూడు కేసులు, అనంతపురంలో ఐదు కేసులున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మైనర్లను బాలుర పరివర్తన కేంద్రానికి తరలించారు. నిందితుల అరెస్ట్లో చొరవ చూపిన ఎస్ఐ సోమశేఖర్, సిబ్బందిని సీఐ ప్రభాకర్ అభినందిస్తూ రివార్డులను అందజేశారు. ద్విచక్ర వాహనాల చోరీ కేసులో ఆరుగురి అరెస్ట్ -
దౌర్జన్యంగా కూల్చేశారు
రొద్దం: హైకోర్టు పరిధిలో నడుస్తున్న స్థల వివాదంలోని షెడ్డును పోలీసులను అడ్డుపెట్టుకుని రెవెన్యూ అధికారులు దౌర్జన్యంగా కూల్చివేశారంటూ రొద్దం మండలం ఎల్జీబీనగర్ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ మద్దతుదారుడు ఈడిగ ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 2021లో తన భార్య ఈడిగ రమాదేవి పేరున సర్వే నంబర్ 311లో ఇంటి స్థలానికి పట్టా ఇచ్చిందని గుర్తు చేశారు. అందులో ఓ షెడ్డు ఏర్పాటు చేసుకుని 2016 నుంచి అందులో నివాసముంటున్నామన్నారు. ఈ క్రమంలో షెడ్డును తొలగించాలంటూ అధికారిక ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో దీనిపై హైకోర్టును ఆశ్రయించినట్లు వివరించారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా గురువారం ఉదయం ఉన్నఫళంగా పెద్ద సంఖ్యలో పోలీసులను వెంటబెట్టుకొచ్చిన రెవెన్యూ అధికారులు.. జేసీబీ సాయంతో షెడ్డును నేలమట్టం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆ సమయంలో అడ్డుకోబోయిన తన భార్య రమాదేవిని బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలించారన్నారు. విషయం తెలుసుకున్న స్తానిక వైఎస్సార్ నాయకులు ఎన్.నారాయణరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, ఎల్జీబీనగర్ మారుతీరెడ్డి, ప్రసాదరెడ్డి, తదితరులు బాధితుడిని పరామర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. కూల్చివేతపై హైకోర్టును ఆశ్రయించనున్నట్లు వైఎస్సార్సీపీ నేత రాజారెడ్డి తెలిపారు. అది రోడ్డు పొరంబోకు స్థలం : తహసీల్దార్ కూల్చివేతపై తహసీల్దార్ ఉదయశంకరరాజు మాట్లాడుతూ.. పెనుకొండ – పావగడ ప్రధాన మార్గంలోని రోడ్డు పోరం బోకు స్థలంలో రేకుల షెడ్డును నిర్మించుకున్నట్లుగా గుర్తించామన్నారు. వారికి పట్టా ఇచ్చింది ఓ చోట అయితే మరో చోట రేకుల షెడ్డును నిర్మించుకున్నారని వివరించారు. ఈ స్థలంపై హైకోర్టులో వేసిన పిటిషన్ డిస్మిస్ అయిందన్నారు. దీంతో ఇంటి పట్టాను జాయింట్ కలెక్టర్ రద్దు చేశారని తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశంతో రోడ్డు పోరం బోకు స్థలంలో ఏర్పాటు చేసుకున్న షెడ్డును తొలగించినట్లుగా పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ మద్దతుదారుడి ఆవేదన -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
పెనుకొండ: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖామాత్యులు సవిత పేర్కొన్నారు. స్థానిక వివేకానంద జూనియర్ కళాశాలలో గురువారం మహిళలకు ఉచిత కుట్టు శిక్షణను మంత్రి ప్రారంభించి, మాట్లాడారు. మహిళల స్వయం ఉపాధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేలా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కార్పొరేషన్ ద్వారా ఉచితంగా కుట్టు శిక్షణను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 3 నెలల పాటు శిక్షణ ఉంటుందని, 75 శాతం హాజరు కలిగిన వారికి శిక్షణ చివరి రోజున కుట్టు మిషన్తో పాటు ధ్రువీకరణ పత్రాన్ని అందజేస్తామన్నారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ● ఉత్సాహంగా ఉరకలెత్తిన దున్నలు కణేకల్లు: స్థానిక చిక్కణ్ణేశ్వరస్వామి ఉత్సవాల సందర్భంగా గురువారం నిర్వహించిన దున్నపోతుల రాతిదూలం పోటీలు ఆసక్తిగా సాగాయి. స్థానిక జెడ్పీఉన్నత పాఠశాల క్రీడా మైదానం వేదిగా పోటీలు నిర్వహించారు. హోరాహోరీగా సాగిన పోటీల్లో రాతి దూలాన్ని లాగుతూ దున్నపోతులు ఉరకలేయడాన్ని చూసి ప్రజలు కేకలు, ఈలలతో హోరెత్తించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోటీలు సాయంత్రం 4 గంటలకు ముగిసాయి. రైతు కె.ముజ్జుకు చెందిన దున్నపోతులు 15 నిమిషాల వ్యవధిలో 2,608.10 అడుగుల మేర దూరాన్ని రాతిదూలాన్ని లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. మరో రైతు తిప్పేష్కు చెందిన దున్నపోతులు ద్వితీయ స్థానంలో, రైతు జి.రిజ్వంత్కు చెందిన దున్నపోతులు మూడో స్థానంలో నిలిచాయి. విజేత దున్నల యజమానులను అభినందిస్తూ సర్పంచ్ దంపతులు నిర్మల, డాక్టర్ సోమన్నతో నగదు పురస్కారాలతో సత్కరించారు. కార్యక్రమంలో కణేకల్లు మేజర్ పంచాయతీ ఈఓ ప్రసాద్, కణేకల్లు చెరువు సంఘం అధ్యక్షుడు బీటీ రమేష్, స్థానికులు లాలెప్ప, అనిల్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సస్పెన్షన్కు గురైన ఉపాధ్యాయులపై విచారణ కదిరి అర్బన్: పదో తరగతి ఇన్విజిలేషన్ విధుల్లో అలసత్వం వహించడంతో సస్పెండ్ అయిన కదిరి మండలానికి చెందిన ఇద్దరు ఉపాధ్యాయులపై విచారణ జరిగింది. పెనుకొండ డిప్యూటీ డీఈఓ పద్మప్రియ గురువారం స్థానిక జెడ్పీ హైస్కూల్లో విచారణ నిర్వహించారు. నడింపల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు రుద్రంరెడ్డి, సైదాపురం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు కిష్టప్ప సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. వారిద్దరి నుంచి రాతపూర్వకంగా సంజాయిషీ తీసుకున్నారు. నివేదికను డీఈఓకు పంపనున్నట్లు తెలిపారు. -
ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్లో ఇద్దరికి చోటు
అనంతపురం అర్బన్: అఖిల భాతర కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ కౌన్సిల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరికి చోటు దక్కింది. తమిళనాడులోని నాగపట్నంలో మూడు రోజులుగా ఏఐకేఎస్ జాతీయ మహాసభలు జరుగుతున్నాయి. చివరి రోజు గురువారం కౌన్సిల్ జాతీయ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇందులో సభ్యులుగా రైతు సంఘం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు అన్నగిరి కాటమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జునకు చోటు దక్కింది. యువకుడి ఆత్మహత్య రొద్దం: జీవితంపై విరక్తితో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. రొద్దం మండలం ఆర్.కొట్టాల గ్రామానికి చెందిన కాకర్ల వరలక్ష్మి, బుగ్గ రంగయ్య దంపతుల కుమారుడు రవితేజ (35) కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందినా నయం కాలేదు. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున నొప్పి తీవ్రత తాళతేక ఓ పొలం వద్ద విషపు గుళికలు మింగాడు. కాసేపటి తర్వాత బంధువులకు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా తెలిపాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు గాలింపు చేపట్టి పొలంలో అపస్మారక స్థితిలో పడి ఉన్న రవితేజను గుర్తించి, వెంటనే తుమకూరులోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక ఆయన మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ‘హంద్రీ–నీవా’కు శాశ్వతంగా సమాధి కడతారా? ● జలసాధన సమితి సభ్యుల ధ్వజం ● కాలువ వెడల్పుపై ఎమ్మెల్యేలు మాట్లాడాలి హిందూపురం: రాష్ట్రంలోని కొన్ని ప్రాజెక్ట్లకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న కూటమి ప్రభుత్వం.. రాయలసీమకు జీవనాడిగా ఉన్న హంద్రీ–నీవా ప్రాజెక్ట్కు శాశ్వత సమాధి కట్టేందుకు సిద్ధమైందని జలసాధన సమితి సభ్యులు మండిపడ్డారు. ఈ మేరకు జలసాధన సమితి సభ్యులు చైతన్య గంగిరెడ్డి, శ్రీనివాసులు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్కుల నుంచి 38వేల క్యూసెక్కులకు పెంచడానికి చంద్రబాబు కూటమి ప్రభుత్వం పూనుకుందన్నారు. అలాగే 3 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే గాలేరు–నగరి ప్రాజెక్టు కాలువ సామర్థ్యం 30 వేల క్యూసెక్కులతో కాలువ నిర్మాణం చేస్తున్నారన్నారు. అయితే ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే హంద్రీ–నీవా ప్రాజెక్టు కాలువ సామర్థ్యం కేవలం 3,850 క్యూసెక్కులకు పరిమితం చేస్తూ, భవిష్యత్తులో కాలువను వెడల్పు చేసేందుకు లేకుండా లైనింగ్ పనులు చేపట్టి రాయలసీమ ఆశయాలకు శాశ్వతంగా గండి కొట్టేందుకు సిద్ధమైందని మండిపడ్డారు. ఈ అన్యాయంపై జిల్లా ఎమ్మెల్యేలు నోరు విప్పకపోవడం సిగ్గుచేటన్నారు. ఇకనైనా ముందు చూపుతో ఎమ్మెల్యేలు ఆలోచించి అప్రతిష్ట పాలుకాకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకెళ్లి హంద్రీ–నీవా ప్రయోజకాలను కాపాడాలని హితవు పలికారు. చేనేత కార్మికుడి ఆత్మహత్య ధర్మవరం అర్బన్: స్థానిక రాజేంద్రనగర్లో నివాసముంటున్న చేనేత కార్మికుడు బాలకృష్ణ (42) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... రాజేంద్రకుమార్కు భార్య ప్రమీల, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. మగ్గం పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ రెడ్డప్ప తెలిపారు. -
తల్లిదండ్రులు ఆలోచించాలి
● ఓ యువకుడు.. ఇద్దరు బాలికల వివాహ పత్రిక సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నెల 9న గోరంట్లలో జరగాల్సిన వివాహం చర్చకు దారి తీయడంతో బాలల సంరక్షణ అధికారులు పరిశీలించారు. సదరు యువతులకు 18 ఏళ్లు నిండకపోవడంతో వివాహాలను అడ్డుకున్నారు. బాల్య వివాహం నేరమని కాదూ కూడదు అని ముందుకెళ్తే కటకటాలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ● ఇంటర్ చదువుతోన్న ఓ బాలికను 20 ఏళ్ల యువకుడు ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపి వివాహం చేసుకుంటానని నమ్మబలికాడు. పెళ్లి చేసుకునే తమకు రక్షణ కావాలంటూ తొలుత అమ్మాయి పోలీసులను ఆశ్రయించింది. అయితే బాలిక వయసు 17 ఏళ్లు కావడంతో కుటుంబ సభ్యులను పిలిచారు. అప్పటికే యువకుడు పరారయ్యాడు. బాలిక తల్లిదండ్రులు కేసు వద్దని చెప్పడంతో ఇరు కుటుంబాలకు సర్దిచెప్పి పంపించారు. ఈ ఘటన పుట్టపర్తిలో వెలుగు చూసింది. ● గోరంట్లకు చెందిన ఓ యువకుడు బెంగళూరులో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ ఓ బాలికతో ప్రేమలో పడ్డాడు. ఎవరికీ తెలియకుండా రహస్య వివాహం చేసుకుని పరారై వచ్చారు. బాలిక బంధువులు పోలీసులను ఆశ్రయించగా.. కొన్ని నెలల తర్వాత ధర్మవరంలో పట్టుబడ్డారు. అప్పటికే బాలిక గర్భం దాల్చింది. పైగా 18 ఏళ్లు దాటి పది రోజులు పూర్తి కావడంతో ఇరు కుటుంబాలకు సర్దిజెప్పి పంపించారు. బడికి పోవాల్సిన వయసులోనే కొందరు బాలికలు బాధ్యతలు మోయాల్సి వస్తోంది. చదువుకోవాల్సిన వయసులోనే గర్భం దాల్చి అనారోగ్యాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. బాల్య వివాహాలు ఏ రకంగానూ మంచిది కాదని అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా పెద్దగా మార్పు కనిపించడం లేదు. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం నేరం. అమ్మా యిలకు 18 ఏళ్లు నిండిన తర్వాతనే వివాహం చేయాలి. అంతకుముందే వివా హం చేయాలని చూస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు. చిన్న వయసులో పెళ్లి, గర్భం దాల్చడం బాలికల ఆరోగ్యానికి ప్రమాదకరం. చదివే వయసులోనే ఇంటి బాధ్యతలు మోయాల్సిన అవసరం లేదు. చదివితే ఉన్నత స్థాయికి వెళ్లి మంచి ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు ఆలోచించాలి. – శ్రీదేవి, ఐసీడీఎస్ పీడీ సాక్షి, పుట్టపర్తి: జీవితమంటే ఏమిటో తెలియని పసి వయసులోనే ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేయడం, అంతలోనే గర్భం దాల్చడం వంటి ఘటనలు జిల్లాలో పెరిగిపోతున్నాయి. బాల్య వివాహాలతో పాటు ప్రేమ వివాహాలు కూడా తెలిసీ తెలియని వయసులోనే జరిగిపోతున్నాయి. అధికారులు అప్రమత్తం కావడంతో గత 12 నెలల వ్యవధిలో 118 బాల్య వివాహాలు ఆగిపోయాయి. జిల్లా బాలల సంరక్షణ శాఖ ఆధ్వర్యంలో విద్యాసంస్థలు, గ్రామాల్లో అధికారులు బాల్య వివాహాలతో కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పిస్తున్నారు. అయినా గుట్టుచప్పుడు కాకుండా బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. చిన్న వయసులోనే గర్భం.. బాల్య వివాహాల కారణంగా చిన్న వయసులోనే బాలికలు గర్భం దాలుస్తున్నారు. ఫలితంగా శారీరకంగా ఎదుగుదల లోపించడంతో పాటు పలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా.. గుట్టుగా పిల్లలకు మూడుముళ్ల తంతు సాగిస్తున్నారు. ఆర్థిక సమస్యల కారణంగా ఆడబిడ్డల తల్లిదండ్రులు చిన్న వయసులోనే బాలికలను ఇల్లు దాటించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రేమ వ్యవహారాలు కూడా చిన్న వయసులోనే బాలికలను ఇల్లాలిని చేస్తున్నాయి. ప్రేమించిన వారు మోసగించి పరారవుతుండటంతో చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలను మోస్తున్నారు. అధికారులు అవగాహన కల్పిస్తున్నా ఆగని బాల్య వివాహాలు గుట్టుచప్పుడుకాకుండా పెళ్లిళ్లు చేస్తున్న వైనం ఆర్థిక సమస్యలే ప్రధాన కారణం గ్రామీణ ప్రాంతాల్లోనే అధికంగా వెలుగులోకి.. ఏడాదిలో 118 బాల్య వివాహాలకు చెక్ -
వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలి
ప్రశాంతి నిలయం: ప్రభుత్వ పథకాల ప్రగతి సాధనలో వందశాతం లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఏపీ సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఉచిత ఇసుక సరఫరా, సోలార్ ప్రాజెక్టులకు భూసేకరణ, సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల ఫిల్లింగ్ యాక్షన్ ప్లాన్, తాగునీటి సరఫరా, సానుకూల ప్రజా అవగాహన, ఎంఎస్ఎంఈ సర్వే , ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు, స్వర్ణాంధ్ర–స్వచ్చాంధ్ర తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 19న మూడో శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్చాంధ్ర కార్యక్రమాలను పక్కాగా నిర్వహించాలన్నారు. వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్యల తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులతో సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను నింపుకోవాలన్నారు. జిల్లా సోలార్ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. పశువులకు నీటి తొట్టెల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీ వి.రత్న, జాయింట్ కలెక్టర్ అభిషేక్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
క్వింటా చింతపండు రూ.20 వేలు
హిందూపురం అర్బన్: మార్కెట్లో చింతపండు ధర తగ్గింది. గురువారం హిందూపురం వ్యవసాయ మార్కెట్కు 770.70 క్వింటాళ్ల చింతపండు రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలం పాట నిర్వహించారు. ఇందులో కరిపులి రకం క్వింటా గరిష్టంగా రూ.20 వేలు, కనిష్టంగా రూ.8 వేలు, సరాసరిన రూ.16 వేల ప్రకారం ధర పలికింది. ఇక ప్లవర్ రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ. 12,200, కనిష్టంగా రూ.5 వేలు, సరాసరిన రూ.8 వేల ప్రకారం ధర పలికింది. 90 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు గోరంట్ల: అర్హులైన చిన్న సన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీతో డ్రిప్, స్ప్రింక్లర్లను అందిస్తామని జిల్లా మైక్రో ఇరిగేన్ పీడీ సుదర్శన్ పేర్కొన్నారు. గురువారం మండలంలో ఆయన పర్యటించారు. ఉద్యానశాఖ ద్వారా రైతులకు అందించిన డ్రిప్, స్ప్రింక్లర్లను పరిశీలించారు. కార్యక్రమంలో డ్రిప్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. హంద్రీనీవా కాలువకు మళ్లీ గండి సోమందేపల్లి: మండల కేంద్రంలోని హంద్రీనీవా కాలువకు గురువారం మరోసారి గండి పడింది. రెండు నెలల కాలంలో మూడుసార్లు కాలువ తెగిపోవడంపై అధికారులు , స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 4 గంటల పాటు కాలువలో నీరు వృథాగా పోయింది. అనంతరం తాత్కాలికంగా గండిని పూడ్చారు. ఎస్ఐ రమేష్బాబు గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. యూరియా అమ్మకాలపై కేసు హిందూపురం: నాణ్యత లేని యూరియా అమ్మకాలపై వ్యవసాయ అధికారులు కేసు నమోదు కావడంతో హిందూపురంలోని బృందావన్ ట్రేడర్స్, చిలమత్తూరులోని సాయికృప ట్రేడర్స్, ఐఎఫ్ఎఫ్సీఓ కంపెనీలపై కోర్టు నుంచి సమాన్లు జారీ అయినట్లు తెలిసింది. మూడేళ్ల క్రితం ఐఎఫ్ఎఫ్సీఓ కంపెనీ సరఫరా చేసిన యురియాను హిందూపురంలోని బృందావన్ ట్రేడర్స్ నిర్వహకులు చిలమత్తూరులోని సాయికృప ట్రేడర్స్కు యూరియా సరఫరా చేసినట్లు సమాచారం. అప్పటి మండల వ్యవసాయ అధికారి చిలమత్తూరు సాయికృప ట్రేడర్స్లో తనిఖీలు చేసి యూరియా నమూనా తీసి పరీక్షల కోసం ల్యాబ్కు పంపారు. ఆ యురియా నాణ్యత లేదని తేలడంతో వ్యవసాయాధికారులు వీరిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ముగ్గురు ఈనెల 22వ తేదీ అనంతపురం కోర్టులో హాజరు కావాలని నోటీసులు వచ్చినట్లు తెలిసింది. -
అనంతపురం నుంచి బెంగళూరుకు రైలు
● మెమూ రైలును అనంతపురం నుంచి నడపాలని నిర్ణయం ● కొత్తగా ఏడు స్టేషన్లలో స్టాపింగ్కు అనుమతి పుట్టపర్తి టౌన్: ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. శ్రీసత్యసాయి జిల్లా ప్రశాంతి నిలయం నుంచి బెంగళూరు వరకు నడిచే మెము రైలును ఇకపై అనంతపురం వరకు పొడిగించారు. దీంతో పాటు అనంతపురం నుంచే బెంగళూరు బయలుదేరేలా దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్వర్వులు కూడా జారీ చేయడంపై అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం–బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు నడపాలని ఎప్పటి నుంచో ఈ ప్రాంత ప్రజలు ప్రజాప్రతినిధులను, అధికారులను కోరుతూ వచ్చారు. వారి విజ్ఞప్తిని అధికారులు ఎట్టకేలకు ఆమోదించారు. త్వరలోనే ఈ రైలు అనంతపురం నుంచి బయలుదేరేలా ప్రణాళిక రచించారు. ప్రశాంతి నిలయం నుంచి బెంగళూరు మధ్య ఇప్పటి వరకు ఉన్న స్టాపింగులతో పాటు అదనంగా ప్రసన్నాయపల్లి, జంగాలపల్లి, చిగిచెర్ల, బాసంపల్లె, కొత్తచెరువు, విదురాశ్వర్థం, సోమేశ్వరలో స్టాపింగ్ సదుపాయం కల్పించారు. సామాన్య ప్రయాణికులతో పాటు విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు రైలు ఎంతో సౌకర్యంగా ఉండనుంది. అతి త్వరలోనే కేంద్ర రైల్వే శాఖ మంత్రి చేతుల మీదుగా అనంతపురం నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతపురం రైల్వేస్టేషన్ నుంచి రోజూ మధ్యాహ్నం 2.10 గంటలకు బయలుదేరి రాత్రి 7 గంటలకు బెంగళూరుకు చేరుకునేలా షెడ్యూల్ రూపొందించారు. -
వైభవంగా జ్యోతుల ఉత్సవం
రొళ్ల: రత్నగిరిలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవి ఉత్సవాల్లో భాగంగా గురువారం జ్యోతుల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రొళ్ల మండలం హనుమంతనపల్లి, వన్నారనపల్లి, హులీకుంట, దొమ్మరహట్టి, కొత్తపాళ్యం, కొడగార్లగుట్ట, కొత్తపాళ్యంతాండ, రొళ్లకొండ, అలుపనపల్లి, ఏ.వడ్రహట్టి, దాసప్పపాళ్యం, క్యాతప్పపాళ్యం, వన్నప్పపాళ్యం, జీఎన్ పాళ్యం, బాజయ్యపాళ్యం, పి.గొల్లహట్టి, గొట్టుగుర్కి, రంగనపల్లి, వెంకటంపల్లి తదితర గ్రామాల్లో ఉత్సవాన్ని జరుపుకున్నారు. మహిళలు పెద్ద ఎత్తున జ్యోతులతో ఆలయానికి చేరుకొని అమ్మవారికి సమర్పించారు. -
వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి
ధర్మవరం: వక్ఫ్ సవరణ చట్టంలో ఎన్నో లోపాలున్నాయి. వెంటనే ఆ చట్టాన్ని రద్దుచేయాలి’ అని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త మక్బూల్ అహ్మద్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని ఉపసంహరించాలన్న డిమాండ్తో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా సంయుక్త మజీద్ కమిటీలు, ముస్లింలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారంతో ఆరో రోజుకు చేరాయి. ఈ దీక్షల్లో ఇక్బాల్, అజహర్, సైపుల్లా, చాంద్బాషా, షరీఫ్, ఘనీ తదితరులు పాల్గొన్నారు. దీక్షలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, మక్బూల్ అహ్మద్ సంఘీభావం తెలిపారు. అంతకు ముందు ర్యాలీగా వచ్చి దీక్షా శిబిరంలో పాల్గొని ప్రసంగించారు. కూటమి నేతల మోసాన్ని గ్రహించాలి.. వక్ఫ్ సవరణ చట్టంలో అనేక లోపాలున్నాయన్నాయని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. వక్ఫ్ సవరణ చట్టం ప్రకారం వక్ఫ్ ఆస్తులకు రిజిస్ట్రర్ పత్రాలు చూపి హక్కులు పొందాలని ఉందని, నాలుగేళ్లు అయిదేళ్లు కిందట తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న రికార్డులే ప్రస్తుతం కనిపించడం లేదని అలాంటిది వందల ఏళ్ల నాటి మజీద్లు, ఆస్తులకు రిజిస్ట్రర్ పత్రాలు తేవడం అసాధ్యమన్నారు. అలాగే వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులు ఉండేందుకు కొత్త చట్టం అనుమతిస్తుండటం ఇబ్బందులకు కారణమవుతోందన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు పూర్తయినా ఇంకా మతం , కులం పేర్లతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. రూ.8 లక్షల కోట్లకు పైగా ఉన్న వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు సవరణ చట్టం తూట్లు పొడుస్తోందన్నారు. కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన సంపూర్ణ మద్దతుతోనే చట్ట సవరణ ఆమోదం జరిగిందన్నారు. రంజాన్కు ముందు వక్ఫ్ సవరణకు తాము మద్దతు తెలపబోమని చెప్పిన సీఎం చంద్రబాబు ఏమొహం పెట్టుకుని మద్దతిచ్చారో చెప్పాలన్నారు. ఇప్పటికై నా ముస్లింలు కూటమి పార్టీల మోసాన్ని గ్రహించాలన్నారు. అవసరాలకు వాడుకోవడంలో చంద్రబాబుకు మించిన మోసగాడు మరొకరు లేరన్నారు. వక్ఫ్ సవరణ చట్టంతో ముస్లింలకు జరిగే అన్యాయాన్ని గ్రహించే వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బిల్లుకు మద్దతు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అలాగే సుప్రీంకోర్టులో చట్ట సవరణ రద్దు కోసం పోరాడుతున్నారన్నారు. ఆమరణ దీక్షకూ వెనుకాడబోం.. వక్ఫ్ సవరణ చట్టంతో ముస్లింలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఈ చట్టాన్ని రద్దు చేసే వరకూ పోరాటం ఉధృతం చేస్తాం. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు వెనుకాబోం అని వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త మక్బూల్ అహ్మద్ కేంద్రాన్ని హెచ్చరించారు. వక్ఫ్ సవరణ విషయంలో ముస్లింలకు అండగా ఉన్న వైఎస్ జగన్కు ముస్లిం సమాజం మొత్తం అండగా ఉంటుందన్నారు. వక్ఫ్ సవరణ విషయంలో కూటమి పార్టీలు మద్దతు తెలపడంతో రానున్న రోజుల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు. ఇప్పటికై న బుద్ధి తెచ్చుకుని వక్ఫ్ సవరణ చట్టంపై ముస్లిం సోదరుల పోరాటానికి కూటమి పార్టీలు మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలన్న డిమాండ్తో కదిరిలో భారీ ర్యాలీ చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మైనార్టీ నాయకులు షేక్ చాంద్బాషా, జాకీర్హుసేన్, సుభాన్, ఎస్పీ బాషా, అత్తార్ జిలాన్, ఇనాయతుల్లా, సాధిక్ వలి, ఉస్మాన్, నాయకులు చందమూరి నారాయణరెడ్డి, మాసపల్లి సాయికుమార్, పెణుజూరు నాగరాజు, సుబ్బారెడ్డి, కత్తెపెద్దన్న, కడప రంగస్వామి, గడ్డం గంగాధర్, చింతా భాస్కర్రెడ్డి, చిగిచెర్ల ప్రభాకర్రెడ్డి, దేవరకొండ రమేష్, చెలిమి రామయ్య, నులక రామయ్య, ఏలకుంట్ల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. కేంద్రం ఆమోదించిన సవరణ చట్టంలో ఎన్నో లోపాలున్నాయి బిల్లు రద్దు చేయాలని ఆందోళనలు జరుగుతున్నా కేంద్రం పట్టించుకోకపోవడం దారుణం ‘కూటమి’ మద్దతుతోనే బిల్లు ఆమోదం పొందింది చంద్రబాబు, పవన్లను ముస్లింలు ఎన్నటికీ క్షమించరన్న కేతిరెడ్డి, మక్బూల్ ముస్లింల రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం -
పోక్సో కేసులపై దృష్టి సారించండి
పుట్టపర్తి టౌన్: పోక్సో కేసులతో పాటు లాంగ్ పెండింగ్, సోషిల్ మీడియా కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ రత్న పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పోలీస్ కార్యాలయంలోని తన చాంబర్లో సబ్ డివిజన్ల వారీగా సమీక్ష నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ మహిళల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మద్యం అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ నేరాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. డీఎస్పీలు విజయకుమార్, నరసింగప్ప, హేమంత్కుమార్, శివన్నారాయణస్వామి, సీఐలు బాలసుబ్రమణ్యంరెడ్డి, శ్రీనివాసులు, లీగల్ అడ్వైజర్ సాయినాథరెడ్డి పాల్గొన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో అన్నదమ్ముల మృతి
ముదిగుబ్బ: ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు వేర్వేరు ప్రమాదాల్లో చనిపోయారు. దీంతో ముదిగుబ్బ మండలం దొరిగిల్లు క్వార్టర్స్లో విషాదఛాయలు అలముకున్నాయి. స్థానికుల వివరాల మేరకు.. దొరిగిల్లు సమీపంలో గురువారం ఓ యువకుడి శవాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దొరిగిల్లుకు చెందిన రమణయ్య (46) బుధవారం వ్యవసాయ పనులకు వెళ్లి పనులు ముగిసిన తరువాత స్నానం చేసేందుకు తోట సమీపంలోని గుర్రాల మడుగులోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదంలో తమ్ముడు.. నాలుగు రోజుల క్రితం రమణయ్య సోదరుడు మునికృష్ణ (45) మొలకలచెరువు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఒకే రోజు అన్నదమ్ములిద్దరూ చనిపోవడంతో దొరిగిల్లులో విషాదఛాయలు అలముకున్నాయి. రమణయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అలాగే మునికృష్ణ భార్య ఇప్పటికే చనిపోగా కుమారుడు ఉన్నారు. కేసు నమదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శివరాముడు తెలిపారు. నీటి మడుగులో ఒకరు.. రోడ్డు ప్రమాదంలో మరొకరు దొరిగిల్లులో విషాదం -
● చౌడేశ్వరీ నమోస్తుతే
అమడగూరు: చల్లని తల్లి చౌడేశ్వరమ్మ జ్యోతుల వెలుగుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అమడగూరులో వెలసిన చౌడేశ్వరీదేవి వార్షిక ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆలయ ధర్మకర్త, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పొట్టా పురుషోత్తమరెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జ్యోతి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. జ్యోతి ఉత్సవంలో అమ్మవారిని దర్శించుకుంటే అంతా శుభమే జరుగుతుందని భక్తుల నమ్మకం. దీంతో కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలనుంచి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో, అమ్మవారిని మల్లెపూలతో ప్రత్యేకంగా అలంకరించారు. జ్యోతిదర్శనంతో పులకించిన భక్తజనం ఉత్సవంలో భాగంగా తొలుత అమ్మవారి విగ్రహాన్ని పూలపల్లకీపై కొలువుదీర్చి ఆలయం నుంచి గ్రామ నడిబొడ్డున ఉన్న ఉట్టి వరకూ ఊరేగింపుగా తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి పల్లకీ ముందు జ్యోతిని రగిలించారు. జ్యోతిముందు వెళ్తుండగా...ఆ వెలుగుల్లో అమ్మవారు భక్తులను దర్శనమిచ్చారు. ఈ క్రమంలో జ్యోతిని చూడటానికి భక్తులు ఎగబడ్డారు. డప్పు, మంగళ వాయిద్యాలు, బాణాసంచా పేలుళ్ల మధ్య యువకులు చిందులేస్తూ ఆడి, పాడారు. భక్తుల కాలక్షేపం కోసం ఏర్పాటు చేసిన కోలాటలు, భజనలు, హరికథలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. చీకిరేవులపల్లి యూత్ సభ్యులు భక్తులకు అన్నదానం చేశారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు గురువారం అశ్వవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. కనుల పండువగా జ్యోతుల ఉత్సవం వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు -
వేరుశనగకు రూ.38 వేలు
అనంతపురం అగ్రికల్చర్: ఈ ఏడాది వేరుశనగ ఎకరాకు రూ.38 వేల ప్రకారం పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు ఆదేశాలు వచ్చాయి. ఖరీఫ్, రబీలో పంటల వారీగా రైతులకు ఎంత మొత్తంలో రుణాలు ఇవ్వాలనే దానిపై గరిష్ట రుణ పరిమితి (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) ఖరారైనట్లు బ్యాంకర్లు తెలిపారు. గతేడాది కన్నా పంట పెట్టుబడులను బట్టి 10 నుంచి 20 శాతం పెంచారు. జిల్లాలోని బ్యాంకుల్లో రైతులకు సంబంధించి ఖరీఫ్ పంట రుణాల రెన్యూవల్స్, కొత్త రుణాల పంపిణీ ప్రారంభమైనట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్కు అదనంగా 15 శాతం అధికంగా ఇచ్చే వెసులుబాటు కల్పించినట్లు సమాచారం. పంటల వారీగా ఇలా: వర్షాధారంగా సాగు చేసే వేరుశనగ ఎకరాకు రూ.38 వేలు, నీటి వసతి కింద అయితే రూ.41 వేలు ప్రకారం పంట రుణం ఇవ్వనున్నారు. కంది పంట వర్షాధారంగా ఎకరాకు రూ.29 వేలు, నీటి వసతి కింద రూ.30 వేలు, ఆముదం రూ.22 వేలు, పప్పుశనగ రూ.37 వేలు, పత్తి రూ.51 వేల నుంచి రూ.55 వేలు, విత్తనోత్పత్తి పత్తి రూ.1.60 లక్షలు, వరి రూ.52 వేలు, విత్తన వరి రూ.55 వేలు, జొన్న రూ.25 వేలు, రాగి రూ.22 వేల నుంచి రూ.25 వేలు, సజ్జ రూ.21 వేల నుంచి రూ.24 వేలు, కొర్ర రూ.17 వేల నుంచి రూ.21 వేలు, వర్షాధారంగా మొక్కజొన్న రూ.31 వేలు, నీటి వసతి కింద రూ.47 వేలు, విత్తన మొక్కజొన్నకు రూ.50 వేలుగా నిర్ణయించారు. ఉద్యాన, కూరగాయల పంటలకు.. పచ్చిమిరపకు రూ.1.10 లక్షలు, ఎండుమిరప రూ.1.75 లక్షలు, టమాట ట్రెల్లీస్ లేకుండా రూ.41 వేలు, ట్రెల్లీస్ టమాట రూ.65 వేలు, హైబ్రీడ్ టమాట రూ.78 వేలు, ట్రెల్లీస్ హైబ్రీడ్ టమాట రూ.1.25 లక్షలు, వంకాయ రూ.54 వేలు, హైబ్రీడ్ వంకాయ రూ.67 వేలు, బెండ రూ.36 వేలు, హైబ్రీడ్ బెండ రూ.50 వేలు, ఉల్లి రూ.60 వేలు, మునగ రూ.49 వేలు, వర్షాధారంగా బేబీకార్న్కు రూ.28 వేలు, నీటి వసతి కింద రూ.44 వేలు, కరివేపాకు రూ.60 వేలు, ధనియాలు రూ.24 వేలు, సోయాబీన్స్ రూ.17 వేలు, అరటి ఎకరా రూ.1.10 లక్షలు, టిష్యూ కల్చర్ అరటి రూ.1.36 లక్షలు, దానిమ్మ రూ.1.60 లక్షలు, చీనీ రూ.71 వేలు, నిమ్మ రూ.85 వేలు, బొప్పాయి రూ.1.20 లక్షలు, మామిడి రూ.55 వేలు, సపోట రూ.43 వేలు, ద్రాక్ష రూ.1.25 లక్షలు, రేగు రూ.34 వేలు, కళింగర రూ.54 వేలు, దోస రూ.66 వేలు, జామ రూ.55 వేలు, అంజూర రూ.42 వేలు, సీతాఫలం రూ.27 వేలు, డ్రాగన్ఫ్రూట్ రూ.77 వేలు, చింత రూ.27 వేలు, కొబ్బరి రూ.70 వేలు, మల్లెపూల తోటల సాగుకు రూ. లక్ష, రోజాపూలు రూ.43 వేల నుంచి రూ.66 వేలు, బంతిపూలు రూ.55 వేలు, చామంతి రూ.60 వేలు, కనకాంబరాలు రూ.39 వేలు, గడ్డి సాగు రూ.36 వేలు, మల్బరీ సాగుకు రూ.1.20 లక్షల మేర స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఖరారు చేశారు. 10 నుంచి 20 శాతం పెరిగిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ప్రారంభమైన పంట రుణాల రెన్యూవల్స్ -
జగన్ను ఎదుర్కోలేకే కూటమి కుట్రలు
సోమందేపల్లి: వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజల్లో ఉన్న ఆదరణచూసి ఓర్వలేక, ఆయన్ను ఎదుర్కొనే ధైర్యం లేక కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ అన్నారు. బుధవారం ఆమె సోమందేపల్లిలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ నాయకుల చేతిలో హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి ఈనెల 8న వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తే పోలీసులు భద్రత కల్పించలేకపోయారన్నారు. ప్రజాభిమానం మెండుగా ఉన్న నాయకుడు కాబట్టే అభిమానులు భారీగా తరలివచ్చారన్నారు. హెలిప్యాడ్ వద్ద పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే అభిమానులు చుట్టుముట్టారని, ఈ క్రమంలోనే హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతినిందన్నారు. తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు కూటమి ప్రభుత్వం.. ఆ నెపాన్ని ఇతరులపై తోసివేసేందుకు సిద్ధమైందన్నారు. ఈ క్రమంలోనే విచారణ పేరుతో పైలెట్లను రప్పించిందన్నారు. వైఎస్ జగన్ రాష్ట్రంలో పర్యటించకుండా కట్టడి చేసేందుకు ప్రైవేట్ ఛాపర్ యజమానులను బెదిరిస్తోందని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా... జన సునామీని ఆపలేరన్నారు. సనాతన ధర్మ పరిరక్షకుడని చెప్పుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుపతిలో గోమాతల మృతిపై ఎందుకు స్పందించలేదన్నారు. వైఎస్ జగన్మోహన్న్రెడ్డిపై టీడీపీ శ్రేణులు అసభ్యకరంగా మాట్లాడితే వారిని వదిలి... ప్రశ్నించిన వారిపై కక్షగట్టి అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమన్నారు. హిందూపురం నియోజకవర్గ నాయకుడు వేణురెడ్డితో పాటు మరికొందరు వైఎస్సార్ సీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేసి పరిగి పోలీస్ స్టేషన్కు తరలించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ గజేంద్ర, జెడ్పీటీసీ సభ్యుడు అశోక్, సర్పంచ్ అంజినాయక్, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు మంజు, సింగిల్ విండో చైర్మన్లు ఆదినారాయణరెడ్డి, సూర్యప్రకాష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ -
మద్యం మత్తులో గొడవ
● ఇటుకతో బాదడంతో వ్యక్తి మృతి హిందూపురం: మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు గొడవపడ్డారు. ఓ వ్యక్తి సహనం కోల్పోయి ఇటుక పెళ్లతో బాదడంతో సుబ్బరాయప్ప(65) అనే వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన హిందూపురం మండలం గోళాపురం గుడ్డంపల్లిలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గోళాపురం గుడ్డంపల్లి కర్ణాటక సరిహద్దున ఉండటంతో పాటు గ్రామంలో బెల్టుషాపులు నిర్వహిస్తుండడంతో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే బంధువులైన సుబ్బరాయప్ప, నంజేగౌడ మంగళవారం పూటుగా మద్యం సేవించారు. ఒకచోట కూర్చొని మాట్లాడుకుంటున్న సమయంలో కుటుంబ విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. దీంతో పరస్పరం వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన నంజేగౌడ ఇటుక పెళ్లతో సుబ్బరాయప్ప తలపై బలంగా కొట్టాడు. తీవ్ర గాయమైంది. అతన్ని బంధువులు హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమంగా మారడంతో రాత్రి మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరుకు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఈ మేరకు బెంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. హతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపడుతున్నట్లు హిందూపురం రూరల్ సీఐ ఆంజనేయులు తెలిపారు. ‘కియా’ ఇంజిన్ల దొంగల అరెస్ట్ ● 8 మందిని రిమాండ్కు పంపిన పోలీసులు పెనుకొండ: కియా కార్ల పరిశ్రమలో సుమారు 900 ఇంజిన్లను అపహరించిన దొంగలను పెనుకొండ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి..రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళితే... కియా కార్ల పరిశ్రమలో 900 ఇంజిన్లు మాయమైనట్లు యాజమాన్యం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ఇంజిన్ల మాయం వెనుక ఇంటిదొంగలే ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే గతంలో కియా కార్ల పరిశ్రమలో పని చేసిన పటాన్ సలీం, వినాయక మూర్తి, మణికంఠ, ఆర్ముగం, అర్జున్ తదితర ఎనిమిది మంది ఉద్యోగులను తమిళనాడులో అరెస్టు చేశారు. నిందితులను బుధవారం రాత్రి పెనుకొండ జడ్జి ఎదుట హాజరుపర్చి రిమాండ్కు తరలించారు. అనంతరం న్యాయమూర్తి అనుమతితో పోలీసులు నిందితులను కస్టడీకి తీసుకుని విచారణ చేయనున్నారు. నిందితులు దొంగలించిన కియా కార్ల ఇంజిన్లను పడవలు, చెరుకు రసం మిషన్ల కోసం విక్రయించినట్లు తెలిసింది. పోలీసు కస్టడీ అనంతరం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. పండ్లను కృత్రిమంగా మాగబెడితే చర్యలు ● జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ హెచ్చరిక ప్రశాంతి నిలయం: ఇంకా పక్వానికి రాని పండ్లను కృత్రిమ రసాయనాలు వినియోగించి మాగబెట్టి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ హెచ్చరించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లోని తన చాంబర్లో ‘ఆహార సంరక్షణ, ప్రమాణాల చట్టం–2006’ అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. మామిడి, అరటి, బొప్పాయి, దానిమ్మ పండ్లను క్యాల్షియం కార్బైడ్తోపాటు ఇతర హానికర రసాయనాలతో కృత్రిమంగా మాగబెట్టి విక్రయించడం వల్ల వాటిని తినే వారు రోగాల బారిన పడుతున్నారన్నారు. చిన్నారులు, వృద్ధులు ఎక్కువగా జీర్ణకోశ వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. అందువల్ల ఎవరూ పండ్లను కృత్రిమంగా మాగబెట్టకూడదన్నారు. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రూ.లక్ష వరకూ జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఎవరైనా పండ్లను రసాయనాలతో మాగబెడుతుంటే 9441463315 నంబరుకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. సమావేశంలో ఫుడ్ సేఫ్టీ అధికారి రామచంద్ర, తస్లీమ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారావు, ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
పరిశ్రమల స్థాపనతోనే ఆర్థిక ప్రగతి
ప్రశాంతి నిలయం: పరిశ్రమల స్థాపనతోనే ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని, అందువల్ల ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు తగిన సహకారం అందించి పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పారిశ్రామిక ప్రగతిపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం ఉందన్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలన్నారు. పారిశ్రామిక అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక పాలసీకి అనుగుణంగా జిల్లా అర్థిక అభివృద్ధికి దోహదపడేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పరిశ్రమల స్థాపన కోసం అందిన దరఖాస్తుల్లో పెండింగ్లో ఉన్న వాటిని వెంటనే పరిశీలించి ఆమోదం తెలపాలన్నారు. కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలని, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించాలని పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తిని ఆదేశించారు. అనంతరం జిల్లాలో సీఎస్ఆర్ కార్యకలాపాలను సమీక్షించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నాగరాజు, ఏసీఐఐసీ జోనల్ మేనేజర్ సోనీ సహాని, డీపీఓ సమత, ఎల్డీఎం రమణకుమార్, పరిశ్రమల శాఖ అధికారి కె.కృష్ణమూర్తి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి హేమంత్రెడ్డి, సీపీఓ విజయ్కుమార్, నాబార్డ్ అధికారి అనురాధ, గ్రామ/వార్డు సచివాలయాల నోడల్ అధికారి సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘మన మిత్ర’పై అవగాహన కల్పించాలి వాట్సాప్ గవర్నెన్స్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన వాల్పోస్టర్లను కలెక్టర్కు బుధవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో విడుదల చేశారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ‘మన మిత్ర’ పేరిట వాట్సాప్ గవర్నెన్స్ను అమల్లోకి తెచ్చిందన్నారు. దీని ద్వారా ప్రస్తుతం 210 సేవలు అందిస్తోందన్నారు. రానున్న రోజుల్లో 350 సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ సేవలు ప్రజలు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఇందుకోసం ఏప్రిల్ 15 నుంచి ‘ప్రతి ఇంటికి మన మిత్ర’ కార్యక్రమం నిర్వహించాలన్నారు. ప్రతి పౌరుడి ఫోన్లో 9552300009 నంబర్ సేవ్ చేయించాలన్నారు. పౌరులకు కావాల్సిన ధ్రువపత్రాలు కూడా వాట్సాప్ ద్వారా పొందే అవకాశం ఉందన్నారు. జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేయాలి అధికారులకు కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశం -
చాలా ఆనందంగా ఉంది
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన నేను 978 మార్కులు సాధించాను. స్టేట్ టాపర్ల సరసన నిలవడం ఆనందంగా ఉంది. రెండు, మూడేళ్లుగా జూనియర్ కళాశాలల్లో సౌకర్యాలు బాగా మెరుగుపడ్డాయి. అధ్యాపకులు కూడా బాగా బోధిస్తున్నారు. ‘నాడు–నేడు’ పనులతో మా కళాశాల రూపురేఖలు మారాయి. ప్రోత్సహిస్తే ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు కూడా సత్తా చాటుతారనేందుకు నేనే ఉదాహరణ. – నీరుగంటి వాణి, హిందూపురం జూనియర్ కళాశాల ఇబ్బందులు లేవు.. అందుకే రాణించా నేను ఇంటర్లో హెచ్ఈసీ చదివాను. ఇటీవల వచ్చిన ఫలితాల్లో 851 మార్కులు సాధించాను. మా కళాశాలలో సౌకర్యాలు చాలా బాగున్నాయి. మాకు ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో చదువుపై దృష్టి సారించగలిగాను. అందుకే ప్రైవేటు కళాశాలల విద్యార్థులకు దీటుగా రాణించాను. అధ్యాపకులు, తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించారు. ప్రభుత్వ విద్య బలోపేతం చేసేందుకు కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు. – నీరుగంటి హరిత, కొత్తచెరువు జూనియర్ కళాశాల -
అంతర జిల్లా చైన్స్నాచర్ల అరెస్ట్
అనంతపురం: ఒంటరిగా వెళ్లే మహిళల్ని టార్గెట్ చేసి వారి మెడలోని బంగారు గొలుసులను లాక్కొని ఉడాయించే అంతర జిల్లా చైన్స్నాచర్ల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి మొత్తం రూ.32.40 లక్షల విలువ చేసే 36 తులాల బంగారం, నగదు, మూడు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో అనంతపురం శివారులోని రాజీవ్ కాలనీకి చెందిన కె.పంపాచారి అలియాస్ నరేష్, రాయల్ నగర్కు చెందిన షేక్ షాకీర్, ప్రియాంకనగర్ నివాసి షేక్ ఫజిల్ అహమ్మద్ అలియాస్ షేక్ ఫజిజ్ అహమ్మద్, శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ నివాసి కంబం నాగార్జున అలియాస్ చిన్నా ఉన్నారు. బుధవారం డీపీఓలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను అనంతపురం జిల్లా ఎస్పీ పి.జగదీష్ వెల్లడించారు. అందరూ 24 నుంచి 30 ఏళ్ల లోపు వారే పట్టుబడిన నిందితులందరూ 24 నుంచి 30 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. కె.పంపాచారి కార్పెంట్ వృత్తితో పాటు డ్రైవింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. పేకాట, క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడి సంపాదన మొత్తం వ్యసనాలకే ఖర్చు పెట్టేవాడు. ఇతనికి నాలుగు నెలల క్రితం కంబం నాగార్జున పరిచయమయ్యాడు. నాగార్జున సొంతూరు శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడ కాగా, ఏడాదిన్నర క్రితం కుటుంబంతో సహా అనంతపురానికి వలస వచ్చి సుఖ్దేవ్నగర్లో నివాసముంటున్నాడు. డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. పంపాచారి పరిచయమైన తర్వాత ఇద్దరూ కలసి పేకాట, ఆన్లైన్ జూదం ఆడుతూ సంపాదన మొత్తం పోగొట్టుకుని అప్పుల పాలయ్యారు. రాయల్ నగర్కు చెందిన షేక్ షాకీర్... కార్పెంటర్గా పనిచేసేవాడు. ఈ క్రమంలో సొంతంగా ఓ ఫర్నీచర్ షాప్ ఏర్పాటు చేసుకుని అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చే మార్గం కోసం అన్వేషిస్తుండగా పంపాచారి, నాగార్జున పరిచయమయ్యారు. ముగ్గురు కలసి వ్యక్తిగత అవసరాలకు, అప్పులు తీర్చేందుకు చైన్స్నాచింగ్లకు సిద్ధమయ్యారు. అనంతరం వీరందరూ కలసి బృందాలుగా విడిపోయి చైన్స్నాచింగ్కు పాల్పడేవారు. ప్రైవేట్ వాహన డ్రైవర్గా పనిచేస్తున్న షేక్ ఫజిల్ అహమ్మద్ సైతం ఆన్లైన్ బెట్టింగ్, పేకాట తదితర వ్యసనాలకు బానిసై అప్పుల పాలయ్యాడు. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో పాటు ఇటీవల పెళ్లి సంబంధం కూడా ఖాయమైంది. పెళ్లి ఖర్చులకు డబ్బు లేకపోవడంతో చైన్స్నాచర్గా మారాడు. ఒంటిరిగా వెళ్లే మహిళలే లక్ష్యంగా..పంపాచారి ద్విచక్ర వాహనంపై ఒక్కడే వెళుతూ శివారు కాలనీలు, నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడలోని బంగారు నగలను లాక్కొని అదే టూవీలర్పై ఉడాయించేవాడు. 2023 నుంచి కురుగుంట, మన్నీల, రాప్తాడు, అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డు, గణేష్ నగర్, లలితానగర్, ఒకటో రోడ్డు, తదితర ప్రాంతాల్లో 10 చైన్ స్నాచింగ్లు చేశాడు. అనంతరం షేక్ షాకీర్తో కలసి బైక్పై వెళుతూ కళ్యాణదుర్గం రోడ్డు, ద్వారకా విల్లాస్లో రెండు స్నాచింగ్లు, కంబం నాగార్జునతో కలసి హెచ్చెల్సీ రోడ్డు, స్టాలిన్ నగర్, బుక్కరాయసముద్రం, బి.కొత్తపల్లి గ్రామాల్లో నాలుగు స్నాచింగ్లు చేశాడు. మొత్తం 16 కేసుల్లో పంపాచారి నిందితుడు. ఇందులో రెండు కేసుల్లో షేక్ షాకీర్, నాలుగు కేసుల్లో కంబం నాగార్జున నిందితులుగా ఉన్నారు. షేక్ ఫజిల్ అహమ్మద్ ఎవరూ గుర్తుపట్టకుండా తలకు ఎరుపు రంగు క్యాప్ పెట్టుకుని, ముఖానికి ఖర్చీఫ్ కట్టుకుని చైన్స్నాచింగ్లకు పాల్పడేవాడు. అనంతపురంలోని శ్రీశ్రీ నగర్, హెచ్చెల్సీపై ఒంటరిగా వెళ్తున్న సచివాలయ మహిళా ఉద్యోగిని వెంబడించి ఆమె మెడలో ఉన్న బంగారు చైన్ అపహరణ, ఇతర మూడు కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. నిందితులు నలుగురూ పోలీసులకు వేర్వేరుగా పట్టుబడ్డారు. చైన్స్నాచర్ల అరెస్ట్లో చొరవ చూపిన అనంతపురం రూరల్ సీఐ ఎన్.శేఖర్, నాల్గో పట్టణ సీఐ కె.సాయినాథ్, సీసీఎస్ సీఐలు ఇస్మాయిల్, జయపాల్రెడ్డి, ఎస్బీ ఎస్ఐ రాజశేఖర్రెడ్డి, రూరల్ ఎస్ఐ కె.రాంబాబును ఎస్పీ జగదీష్ అభినందించారు. రూ.32.40 లక్షల విలువ చేసే 36 తులాల బంగారం, నగదు, మూడు బైక్ల స్వాధీనం వ్యసనాలతో అప్పులపాలై చైన్స్నాచర్లుగా మారిన యువకులు -
మహిళ హత్య కేసులో వీడిన మిస్టరీ
ధర్మవరం రూరల్: మండలంలోని రేగాటిపల్లి పొలాల్లో గత నెల 16న దారుణ హత్యకు గురైన చిట్రా అక్కమ్మ (57) కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. వివరాలను బుధవారం స్థానిక పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధర్మవరం రూరల్ పీఎస్ సీఐ ఎన్.ప్రభాకర్ వెల్లడించారు. రావులచెరువు గ్రామానికి చెందిన చిట్రా అక్కమ్మకు 30 సంవత్సరాల క్రితం మేడాపురం గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. దాదాపు 27 ఏళ్ల క్రితం అక్కమ్మ తన భర్త, పిల్లలను వదిలేసి ధర్మవరంలోని తిక్కస్వామి నగర్లో అద్దె ఇంటికి మకాం మార్చింది. ఈ క్రమంలో బతుకు తెరువు కోసం కళాజ్వోతి సర్కిల్లో వ్యభిచారం సాగిస్తుండేది. గత నెల 16న సాయంత్రం కళాజ్వోతి సర్కిల్లో విటుల కోసం వేచి ఉన్న ఆమెను స్థానిక శాంతినగర్కు చెందిన ఆటో డ్రైవర్ కట్టుబడి షెక్షావలి, టీచర్స్ కాలనీలోని చౌడమ్మ గుడి వద్ద నివాసముంటున్న తలారి లోకేంద్ర ఆటోలో ఎక్కించుకుని రేగాటిపల్లి పొలాల్లోకి తీసుకెళ్లారు. అక్కడ అక్కమ్మతో లోకేంద్ర లైంగిక కోరిక తీర్చుకుంటున్న సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో షెక్షావలి సాయంతో అక్కమ్మ తలపై లోకేంద్ర రాయితో కొట్టి గాయపరిచాడు. అనంతరం తన వద్ద ఉన్న కత్తితో ఆమె గొంతు కోసి హతమార్చాడు. మృతదేహాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు కత్తితో ముఖంపై ఉన్న చర్మాన్ని తొలగించి అక్కడ నుంచి ఉడాయించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు డీఎస్పీ హేమంత్కుమార్ నేతృత్వంలో దర్యాప్తు చేపట్టి పక్కా ఆధారాలతో నిందితులను గుర్తించారు. బుధవారం ఉదయం సీతారంపల్లి వద్ద జాతీయ రహదారిపై తచ్చాడుతున్న షెక్షావలి, లోకేంద్రను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. కాగా, నిందితుల అరెస్ట్లో చొరవ చూపిన సీఐ ఎన్.ప్రభాకర్, ఎస్ఐ శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు బాబ్జాన్, రాజప్ప, షాకీర్, అనిల్కుమార్, రాఘవేంద్ర, బాలకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ చత్రూనాయక్, రామాంజినేయులను ఎస్పీ రత్న, డీఎస్పీ హేమంత్కుమార్ అభినందించారు. -
ప్రజారోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దు
● పరిగి, ఊటుకూరు పీహెచ్సీలను తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ ● కొడిగెనహళ్లి ఏపీఆర్ఎస్లో భోజన గది పరిశీలన పరిగి: ప్రజారోగ్యంపై అశ్రద్ధ వహించకుండా సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సిబ్బందిని వైద్య, ఆరోగ్యాధికారి డాక్టర్ ఫైరోజ్ బేగం ఆదేశించారు. బుధవారం పరిగి మండలంలో ఆమె విస్తృతంగా పర్యటించారు. తొలుత స్థానిక పీహెచ్సీని పరిశీలించారు. పలు రిజిస్టర్లు తనిఖీ చేశారు. ఎండాకాలంలో వడదెబ్బ బారిన పడిన వారికి అందిస్తున్న చికిత్సలపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది సకాలంలో ఆస్పత్రిలో రోగులకు అందుబాటులో ఉండాలన్నారు. అనంతరం ఊటుకూరులో నూతనంగా ఏర్పాటైన పీహెచ్సీని తనిఖీ చేశారు. అలాగే కొడిగెనహళ్లిలోని ఏపీఆర్ఎస్ పాఠశాలను తనిఖీ చేశారు. మద్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు శుచి, శుభ్రతతో కూడిన నాణ్యమైన భోజనాన్ని అందించడంతో పాటు పాఠశాల పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని ఉపాధ్యాయులకు సూచించారు. దోమకాటు జబ్బుల వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ స్వరూపరెడ్డి, నవీన, సురేష్, రూబీ, సీహెచ్ఓ వన్నప్ప, పీహెచ్ఎన్ వెంకమ్మ, వైద్యారోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఉపాధ్యాయుడిపై కేసు నమోదు కదిరి టౌన్: స్థలం పేరుతో మహిళను వంచనకు గురి చేసిన కేసులో ఓ ఉపాధ్యాయుడితో పాటు ఆయన కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు సీఐ నారాయణరెడ్డి బుధవారం వెల్లడించారు. స్థానిక అడపాలవీధిలో నివాసముంటూ టైలరింగ్తో జీవనం సాగిస్తున్న షేక్ భానుకు అదే వీధికి చెందిన ఉపాధ్యాయుడు మేకల ఓబులేసు, ఆయన కుమారుడు కరేజ్కుమార్.. స్థలం ఇస్తామంటూ ఆశ చూసి రూ.13 లక్షలు తీసుకున్నారు. అయితే స్థలం ఇవ్వకపోవడంతో తన డబ్బు తిరిగి ఇవ్వాలని ఆమె కోరింది. ఆ సమయంలో ఇద్దరూ బెదిరింపులకు పాల్పడుతూ దౌర్జన్యం చేశారు. ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు ఓబులేసు, ఆయన కుమారుడు కరేజ్కుమార్పై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పాఠశాలలో ఆకతాయిల విధ్వంసం ఉరవకొండ: స్థానిక 8వ వార్డు పాతపేటలోని మండల పరిషత్ ప్రాథమిక సెంట్రల్ పాఠశాలలో ఆకతాయిలు, తాగుబోతులు మంగళవారం రాత్రి విధ్వంసానికి పాల్పడ్డారు. తొలుత పాఠశాల గ్రౌండ్ ప్లోర్లోని వరండా ఇనుప గ్రిల్ తలుపును విరగొట్టి లోపలికి ప్రవేశించారు. తరగతి గదిలోని రెండు సీలింగ్ ఫ్యాన్లు తొలగించి పక్కన పడేశారు. అనంతరం విద్యుత్ స్విచ్ బోర్డుతో పాటు నీటి మోటార్కు చెందిన స్టార్టర్ బోర్డును పగులగొట్టారు. ప్లోరింగ్ టైల్స్ బండరాళ్లతో ధ్వంసం చేశారు. తరగతి గదిలోనే మద్యం తాగి అక్కడే సీసాలు పగులగొట్టి, మూత్ర విసర్జన చేశారు. బుధవారం ఉదయం పాఠశాలకు చేరుకున్న ఉపాధ్యాయులు అక్కడి విధ్వంసాన్ని గుర్తించి ఎంఈఓ ఈశ్వరప్ప దృష్టికి తీసుకెళ్లారు. క్షేత్రస్థాయిలో ఎంఈఓ పరిశీలించిన అనంతరం హెచ్ఎం నసీరాబేగంతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
వృద్ధుడి అదృశ్యం
రాప్తాడురూరల్: వాకింగ్ కోసం వెళ్లిన ఓ వృద్ధుడు అదృశ్యమైన ఘటన అనంతపురం రూరల్ మండలం పాపంపేటలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాపంపేట శివారులోని ఓవీఆర్ కాలనీకి చెందిన నల్లపరెడ్డి మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి వాకింగ్ కోసమని బయటకు వెళ్లాడు. తిరిగి రాలేదు. రాత్రయినా ఇంటికి రాకపోయే సరికి కంగారుపడిన కుటుంబ సభ్యులు సమీప ప్రాంతాల్లో వెతికారు. అయినా లాభం లేకపోయింది. ఈ క్రమంలో బుధవారం కుమారుడు హరినాథరెడ్డి రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కొడిగెనహళ్లిలో భారీ చోరీ
● ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రవేశించిన దుండగులు ● 30 తులాల బంగారం అపహరణ పరిగి: మండలంలోని కొడిగెనహళ్లిలో భారీ చోరీ జరిగింది. వివరాలు.. కొడిగెనహళ్లి విద్యానగర్లో నివాసముంటున్న శంకరప్ప గత శనివారం ఇంటికి తాళం వేసి తన కుటుంబసభ్యులతో కలసి కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లాడు. తాళం వేసిన ఇంటిని గమనించిన దుండగులు మంగళవారం అర్దరాత్రి దాటిన తర్వాత ఇంట్లోకి చొరబడ్డారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమయ్యాయి. బుధవారం ఉదయం ఇంటికి చేరుకున్న శంకరప్ప.. తలుపులు తీసి ఉండడం గమనించి నివ్వెరపోయాడు. వాకిళ్లను ధ్వంసం చేసి, లోపల ఉన్న బీరువాల్లోని 30 తులాల బంగారంతో పాటు రూ.40 వేల నగదును అపహరించుకెళ్లినట్లుగా గుర్తించి, సమాచారం ఇవ్వడంతో డీఎస్పీ నర్సింగప్ప, ఎస్ఐ రంగడు, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. శంకరప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏరియా ఆస్పత్రి వైద్యుల అవినీతిపై విచారణ కదిరి అర్బన్: స్థానిక ఏరియా ఆస్పత్రిలో పనిచేస్తున్న ఇద్దరు గైనకాలజిస్టుల అవినీతిపై బుధవారం ప్రత్యేక వైద్యాధికారుల బృందం విచారణ చేపట్టింది. బృందంలో కర్నూలుకు చెందిన డాక్టర్ మాధవీలత, విజయవాడ డీసీహెచ్ వెంకట్రామయ్య, నంద్యాల ఏఓ శైలాజాదేవి ఉన్నారు. ఫిర్యాదుదారుడిని పిలిపించి గత నెల 7న వారికి జరిగిన అన్యాయంపై రాతపూర్వక విశ్లేషణను తీసుకున్నారు. అలాగే బాధితునితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు డాక్టర్లను వేర్వేరుగా విచారించారు. విచారణ నివేదికను రూపొందించి ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు. కాగా, గైనకాలజిస్టుల అవినీతిపై విచారణ జరుగుతున్న సమయంలోనే స్థానిక సీపీఎం నేతలు అక్కడకు చేరుకుని ఆస్పత్రిలో స్కానింగ్ యంత్రాలున్నా.. కమీషన్ల కోసం ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లకు రెఫర్ చేస్తున్న గైనకాలజిస్టులపై చర్యలు తీసుకోవాలంటూ విచారణ బృందానికి వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రం సమర్పించిన వారిలో సీపీఎం పట్టణాధ్యక్షుడు జీఎం నరసింహులు, నాయకులు ముస్తాక్, రామ్మెహన్ ఉన్నారు. -
నేర పరిశోధనలో జిల్లాకు రెండో స్థానం
పుట్టపర్తి టౌన్: నేరాల పరిశోధనలో సాధించిన పురోగతికి సంబంధించి ప్రతి మూడు నెలలకు ఒకసారి రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా ప్రకటిస్తున్న ఏబీసీడీ ర్యాంకింగ్లో జిల్లాకు రెండో స్థానం దక్కింది. బుధవారం విజయవాడలోని తన కార్యాలయంలో డీజీపీ హరీష్కుమార్ గుప్త, సీఐడీ అడిషనల్ డీజీపీ రవిశంకర్, లాఅండ్ ఆర్డర్ ఐజీ మధుసూదన్రెడ్డి చేతుల మీదుగా ఎస్పీ రత్నతో పాటు సిబ్బంది సన్మానం అందుకున్నారు. మడకశిర తాలూకా దిన్నేహట్టి గ్రామంలో 1998, అక్టోబర్ 2న తిప్పేస్వామి తన బార్యపై ఉన్న అనుమానంతో అరునెలల బాబు (శివలింగమయ్య)ను గొంతు నులిమి హత మార్చిన విషయం తెలిసిందే. బాబు తల్లి ఫిర్యాదు మేరకు గుడిబండ పోలీసులు కేసు నమోదు చేసినా నిందితుడి ఆచూకీని గుర్తించలేకపోయారు. ఎస్పీ రత్న బాధ్యతలు తీసుకున్న తర్వాత డీజీపీ ఆదేశాల మేరకు పాత కేసుల దర్యాప్తును వేగవంతం చేశారు. ఇందు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. గత ఏడాది నవంబర్లో బాలుడి హత్యపై పల్లె నిద్ర కార్యక్రమంతో ఆరా తీయడంతో కొంత సమాచారం దొరికింది. దీని ఆధారంగా పెళ్లి పత్రిక ఽఆధారంగా కేసును ఛేదించి నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. 26 ఏళ్ల తర్వాత నిందితుడిని గుర్తించిన ఎస్పీ బృందానికి ఏబీసీడీ ర్యాంకింగ్లో రెండో స్థానం దక్కింది. అవార్డు అందుకున్న వారిలో ఎస్పీ రత్నతో పాటు పెనుకొండ సబ్ డివిజన్, మడకశిర సర్కిల్ పోలీసులు ఉన్నారు. ఎస్పీ రత్నకు అవార్డు అందజేసిన డీజీపీ -
పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి
పరిగి: పోలీసులు రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని వైఎస్సార్ సీపీ హిందూపురం నియోజకవర్గ నాయకుడు వేణురెడ్డి కోరారు. అధికార కూటమి ప్రభుత్వం ట్రాప్లో పడొద్దన్నారు. మంగళవారం ఆయన పరిగి పోలీసు స్టేషన్ ఎదుట విలేకరులతో మాట్లాడారు. పోలీసులు తమ పార్టీకి చెందిన దళిత నాయకుడు, వాల్మీకి వర్గానికి చెందిన మరో నాయకుడిని తీవ్రవాదుల్లా చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లడాన్ని నిరసిస్తూ మంగళవారం శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చామన్నారు. అయితే పోలీసులు ఉదయమే తనతో పాటు మరో ముగ్గురు నేతలను అరెస్టు చేశారన్నారు. పోలీస్ వ్యవస్థపై తమకు గౌరవముందన్నారు. అందుకే వారికి ఎప్పుడూ సహకరిస్తామన్నారు. పోలీసులు కూడా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా అందరినీ సమానంగా చూడాలన్నారు. ఎవరో చెప్పారని అక్రమ కేసులు బనాయించకుండా నిజానిజాల కోసం విచారణ జరపాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జబీవుల్లా, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
సాయి సహస్రనామ హారం ప్రారంభం
ప్రశాంతి నిలయం: సత్యసాయి శతజయంతి వేడుకలను పురస్కరించుకుని ప్రశాంతి నిలయంలో ‘సాయి సహస్రనామ హారం–ప్రేమామృత సారం’ కార్యక్రమం ప్రారంభమైంది. సహస్ర నామ హారంలో భాగంగా 1,008 సత్యసాయి నామాలతో భక్తిగీతాలను ఆలపించనున్నారు. వారం రోజుల పాటు సాగే కార్యక్రమంలో 21 భజన బృందాలు, 900 మంది సంగీత కారులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు, సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ చైర్మన్ చక్రవర్తి ప్రారంభించారు. అనంతరం భక్తులు సత్యసాయిని కీర్తిస్తూ భక్తిగీతాలను ఆలపించారు. -
● అనంతపురం నగరానికి చెందిన రంగనాథ్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. వయసు 32 ఏళ్లు. మూడేళ్ల క్రితం పెళ్లయింది. ఎందుకో అనుమానమొచ్చి ఇటీవల ఆస్పత్రిలో పరీక్ష చేయించుకోగా షుగర్ ఉన్నట్లు తేలింది. దీంతో ఒక్కసారిగా అతను ఖిన్నుడయ్యాడు.
● నగరానికి చెందిన మటన్ వ్యాపారి గౌస్మొహిద్దీన్కు 37 ఏళ్లు కూడా లేవు. ఇద్దరు పిల్లలున్నారు. సరైన వ్యాయామం లేక ఒత్తిడికి గురై బీపీ, షుగర్ రెండూ వచ్చాయి. ఇటీవల సరిగా నిద్రపట్టడం లేదని బాధితుడు వాపోతున్నాడు. వీరే కాదు.. ఉమ్మడి జిల్లాలో మధుమేహం, రక్తపోటు బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంత పురం జిల్లాలో మధుమేహ జబ్బు చాపకింద నీరులా విస్తరిస్తోంది. జనాభా పెరుగుదల రేటుతో పోల్చి చూస్తే డయాబెటిక్ బారిన పడుతున్న వారే ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. యువకులు సైతం జీవనన శైలి జబ్బుల బారిన పడుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. గతంలో 40 ఏళ్లు నిండిన వారిలో ఎక్కువగా ఆయా జబ్బుల బారిన పడేవారు. కానీ, ఇటీవల 30 ఏళ్లు దాటని వారూ వీటి కోరల్లో చిక్కుతున్నారు. ఈ విషయం వైద్యులను కూడా విస్మయానికి గురి చేస్తోంది. గ్రామీణులూ బాధితులే.. మధుమేహం, రక్తపోటు తదితర జబ్బులతో బాధపడే వారు ఒకప్పుడు పట్టణాలు, నగరాల్లోనే ఎక్కువగా ఉండేవారు. పని ఒత్తిడితో సతమతమవడం కారణంగా వీటి బారిన పడేవారు. కానీ, ఇప్పుడు ఆయా రోగాలు పల్లెలకూ విస్తరించడం గమనార్హం. ఈ క్రమంలోనే డయాబెటిక్, బీపీ మందుల ధరలు పెరగడం సామాన్యులకు కొరకరాని కొయ్యగా మారింది. అవగాహన లేకే.. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో హైపర్ టెన్షన్ (అధిక రక్తపోటు) బాధితులు 27 శాతం పైగానే ఉన్నట్టు తేలింది. పట్టణాల్లో అయితే ఇది 30 నుంచి 32 శాతం కూడా ఉన్నట్టు తాజా సర్వేలో వెల్లడైంది. ఇక.. షుగర్, హైపర్టెన్షన్ జబ్బులు నియంత్రణలో లేనివారు ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో శరీరంలో ఇతర అవయవాలపై ప్రభావం పడి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జబ్బుల నియంత్రణపై అవగాహన లేకపోవడం అనర్థాలకు దారి తీస్తోంది. సమస్యలెన్నో.. షుగర్ నియంత్రణలో లేకుంటే కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి. కంటిచూపుపై దుష్ప్రభావం పడుతుంది. శరీరంలో గాయాలైనప్పుడు మానడం చాలా కష్టం. మధుమేహం అదుపులో లేకపోతే గుండె జబ్బులొచ్చే అవకాశాలు ఎక్కువ. అధిక రక్తపోటు వల్ల బ్రెయిన్ స్ట్రోక్కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. నరాల వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది. అలవాట్లు మార్చు కోవాలి ఉమ్మడి అనంతలో చాపకింద నీరులా విస్తరిస్తున్న షుగర్ వ్యాధి 22 శాతానికి పైగా బాధితులు వందలో 28 మందికి రక్తపోటు అవగాహన లేక గ్రామీణులూ బాధితులవుతున్న వైనం మధుమేహం, హైపర్ టెన్షన్ ఉన్న వారు జాగ్రత్తలు తీసుకోవాలి. బాధితులు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లేని ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకుంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు. పొగ తాగడం చాలా ప్రమాదకరం. –డా.సుధాకర్రెడ్డి, గుండె వైద్య నిపుణులు -
అక్రమ కేసులతో భయపెట్టలేరు
● వేణురెడ్డిపై పోలీసులది ముమ్మాటికీ కక్ష సాధింపే ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పెనుకొండ రూరల్: అక్రమ కేసులు బనాయించినంత మాత్రాన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను భయపెట్టలేరని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ అన్నారు. పోలీసులు ఎంతగా వేధించినా వెనక్కుతగ్గేది లేదని, ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటామన్నారు. మంగళవారం ఆమె పెనుకొండలో విలేకరులతో మాట్లాడారు. హిందూపురం పోలీసులు ఇద్దరు వైఎస్సార్ సీపీ కార్యకర్తల చేతులకు బేడీలు వేసి ఉగ్రవాదుల్లా రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్లడం దుర్మార్గమన్నారు. దీనిపై ప్రశ్నించినందుకే గుడ్డంపల్లి వేణురెడ్డిపై పోలీసులు కక్షగట్టారన్నారు. శాంతియుత నిరసన తెలియజేసే హక్కునూ కాలరాస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని కూటమి పార్టీల నేతలతో పాటు పోలీసులూ గమనించాలన్నారు. చట్ట ప్రకారం నడుచుకోకపోతే భవిష్యత్లో తప్పక మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అక్రమ అరెస్ట్లతో వైఎస్సార్ సీపీ శ్రేణుల గొంతు నొక్కలేరని గుర్తుంచుకోవాలన్నారు. జిల్లాకు వర్షసూచన బుక్కరాయసముద్రం: ఉమ్మడి జిల్లాలో రానున్న 5 రోజుల్లో చిరు జల్లులు పడే అవకాశం ఉన్నట్లు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ శంకర్బాబు, వాతావరణ విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణస్వామి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పగటి ఉష్ణోగ్రతలు 40.2 నుంచి 41.3 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందన్నారు. -
● చంద్రప్రభపై చౌడేశ్వరీదేవి
అమడగూరు: చౌడేశ్వరీ దేవి వార్షిక ఉత్సవాల్లో భాగంగా నాల్గో రోజు మంగళవారం అమ్మవారు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అమడగూరుకు చెందిన బ్రాహ్మణ, శెట్టి బలిజ సంఘం సభ్యులు చంద్రప్రభ ఉత్సవాన్ని వైభవంగా జరిపించారు. అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. విశేష అలంకరణలో చంద్రప్రభపై కొలువుదీరిన అమ్మవారిని గ్రామమంతా ఊరేగించి గ్రామ నడిబొడ్డున ఉన్న ఉట్టి ఎదుట కొలువుదీర్చారు. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారికి కొబ్బరికాయలను సమర్పించి భజన చేశారు. కాగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళాకారుల నృత్యాలు, డప్పు వాయిద్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారికి బోనాలు.. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లో అమ్మవారికి బోనాలు సమర్పించారు. చీకిరేవులపల్లి, గంగిరెడ్డిపల్లి, రెడ్డివారిపల్లి, బలకవారిపల్లి, అమడగూరు గ్రామాల్లో మహిళలు బోనాలు తీసుకువెళ్లి చౌడేశ్వరీ అమ్మవారికి సమర్పించి పూజలు చేశారు. ఆయా గ్రామాల్లో పెద్దత్తున జంతుబలులను అర్పించారు. బంధుమిత్రులతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకుంది. ఉత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీజ్యోతి ఉత్సవం నిర్వహించనున్నారు. -
స్వల్పంగా పెరిగిన స్కేల్ ఆఫ్ రిలీఫ్
అనంతపురం అగ్రికల్చర్: వరదలు, ఈదురుగాలులు, వడగండ్ల వాన, అకాల వర్షాలు తదితర ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఆస్తి, పంట నష్టం, అలాగే పశువులు, జీవాలు, కోళ్లు నష్టం తదితర వాటికి వర్తింపజేసే ఎక్స్గ్రేషియా (స్కేల్ ఆఫ్ రిలీఫ్) స్వల్పంగా పెంచుతూ రాష్ట్ర ప్రకృతి విపత్తుల విభాగం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్డీఆర్ఎఫ్) నిబంధనల ప్రకారం ప్రతి రెండు, మూడు సంవత్సరాలకు స్కేల్ ఆఫ్ రిలీఫ్ ఖరారు చేస్తారు. ఈ క్రమంలో తాజాగా పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు. పెరిగిన స్కేల్ ఆఫ్ రిలీఫ్ 2024 ఆగస్టు నుంచి వర్తిస్తుందని పేర్కొన్నారు. ● పాడి ఆవు లేదా గేదె చనిపోతే రూ.50 వేలు, ఎద్దుకు రూ.40 వేలు, దూడలకు రూ.25 వేలు, గొర్రెలు, మేకలకు రూ.7,500, ఒక్కో కోడికి రూ.100 ప్రకారం గరిష్టంగా రూ.10 వేలు, పశువుల పాక నష్టానికి రూ.5 వేల ప్రకారం పరిహారం వర్తింపజేశారు. ● మనిషి చనిపోతే రూ.5 లక్షలు, ఇళ్లు కూలినా, దెబ్బతిన్నా రూ. 10 వేలు, కిరాణా కొట్టుకు రూ.25 వేలు, రూ.40 లక్షల వార్షిక టర్నోవర్ కలిగిన కుటీర పరిశ్రమలకు రూ.50 వేలు, రూ.1.50 కోట్ల లోపు టర్నోవర్ కలిగిన వాటికి రూ.లక్ష, రూ.ఒకటిన్నర కోట్లకు పైగా టర్నోవర్ కలిగిన వాటికి రూ.1.50 లక్షలు, ద్విచక్రవాహనాలకు రూ.3 వేలు, త్రిచక్ర వాహనాలకు రూ.10 వేలు, తోపుడు బండ్లకు రూ.20 వేలు, చేనేతలకు రూ.25 వేలు, పాక్షికంగా బోట్లు దెబ్బతింటే రూ.9 వేలు, వలలకు రూ.5 వేలు, బోట్లు, వలలు పూర్తిగా దెబ్బతింటే రూ.20 వేలు, మోటార్ బోట్లు, వలలు దెబ్బతింటే రూ.25 వేలు, చేపల చెరువుకు రూ.18 వేలు, పట్టు రైతులకు 25 వేలు ప్రకారం నష్ట ఉపశమనం వర్తింపజేస్తారు. ● వేరుశనగ, పత్తి, వరి, చెరకు హెక్టారుకు రూ.25 వేల ప్రకారం లెక్కకట్టి ఇస్తారు. సజ్జ, మినుము, పెసర, మొక్కజొన్న, రాగి, కంది, కుసుమ, సోయాబీన్, పొద్దుతిరుగుడు, పొగాకు, ఆముదం, కొర్ర, సామ, జూట్ పంటలు హెక్టారుకు రూ.15 వేల ప్రకారం స్కేల్ ఆఫ్ రిలీఫ్ ఖరారు చేశారు. ● అరటి, మామిడి, దానిమ్మ, జామ, ఉసిరి, సపోటా, రేగు, డ్రాగన్ఫ్రూట్, జీడిపప్పు, కాఫీ, పసుపు, మిరప హెక్టారుకు రూ.35 వేలు, కళింగర, కర్భూజా, దోస, బొప్పాయి, టమాటా, పూలు, ఉల్లి, ధనియాలు, కూరగాయలకు రూ.25 వేలు, సెంటు విస్తీర్ణంలో ఉన్న ఆకుతోటలకు రూ.300 ప్రకారం గరిష్టంగా రూ.75 వేల వరకు ఇస్తారు. కర్రపెండలం రూ.10 వేలు, ఒక్కో కొబ్బరి చెట్టుకు రూ.1,500 ప్రకారం స్కేల్ ఆఫ్ రిలీఫ్ ఖరారు చేశారు. -
జిల్లా జడ్జికి ఘన సన్మానం
అనంతపురం: ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీనివాస్ సేవలు ప్రశంసనీయమని అనంతురం జిల్లా ఎస్పీ పి.జగదీష్ కొనియాడారు. బదిలీపై వెళ్తున్న జడ్జి జి.శ్రీనివాస్ను మంగళవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ.. న్యాయమూర్తి జి.శ్రీనివాస్ మార్గదర్శకంలో జిల్లా పోలీసు, న్యాయశాఖలు పరస్పర సహకారంతో బాధితులకు న్యాయం చేకూరేలా పనిచేశాయన్నారు. కఠిన నేరాల్లో ముద్దాయిలకు కఠిన శిక్షలు వేయడాన్ని గుర్తు చేసుకున్నారు. నేడు బీఎస్ఎన్ఎల్లో వినియోగదారుల సేవా శిబిరం పుట్టపర్తి టౌన్: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) వినియోగదారుల సమస్యల పరిష్కార శిబిరం బుధవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ శాఖ డివిజనల్ ఇంజినీర్ ప్రసాద్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కస్టమర్ సర్వీస్ మాసంలో భాగంగా పుట్టపర్తిలోని ఎస్బీఏ రోడ్డులో ఉన్న బీఎస్ఎన్ఎల్ టెలీఫోన్ భవన్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం నిర్వహించనున్నారు. మొబైల్ సిమ్ సేవలు, ఎఫ్టీటీహెచ్(ఫైబర్ ఇంటర్నెట్), ఇతర సేవలకు సంబంధించిన సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవచ్చు. -
ధర్మవరం యువకుడికి జాతీయ పురస్కారం
ధర్మవరం అర్బన్: ధర్మవరం పట్టణానికి చెందిన రజినీ ట్రస్ట్, రక్తబంధం ట్రస్ట్ వ్యవస్థాపకుడు కన్న వెంకటేష్కు జాతీయ ఉత్తమ సేవారత్న పురస్కారం దక్కింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా విజయవాడలోని సిద్దార్థ కాలేజ్ ఆడిటోరియంలో జనసేవా సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో నాలుగు రాష్ట్రాల్లో నిస్వార్థంగా సమాజానికి సేవలు అందిస్తున్న సేవకులను గుర్తించి అవార్డులను అందించారు. ఇందులో కన్న వెంకటేష్ ఉన్నారు. విజయవాడ ఎమ్మెల్యే సుజనాచౌదరి, కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసులు చేతులమీదుగా ఆయన పురస్కారాన్ని అందుకున్నారు. 17న విద్యా వైజ్ఞానిక యాత్ర పుట్టపర్తి అర్బన్: విద్యాశాఖ, సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 17న చేపట్టిన విద్యా వైజ్ఞానిక యాత్రలో పాల్గొని శాసీ్త్రయ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని డీఈఓ కృష్ణప్ప పిలుపునిచ్చారు. యాత్రకు సంబంధించిన పోస్టర్లను మంగళవారం తన కార్యాలయంలో ఆయన విడుదల చేశారు. కార్యక్రమంలో విద్యాశాఖ సిబ్బంది రామకృష్ణ, లాజరు, ఉపాధ్యాయులు ఇర్షాద్, వలి, సురేష్, చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. జిల్లాలో ఎంపికై న 120 మంది విద్యార్థులతో కలిసి ఈ నెల 16వ తేదీ రాత్రి మడకశిర, ధర్మవరం, కదిరి నుంచి ప్రత్యేక బస్లతో ఉపాధ్యాయులు బయలుదేరుతారన్నారు.17న శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం, కుప్పంలోని అగస్త్య ఫౌండేషన్ను సందర్శిస్తారన్నారు. విద్యార్థులు సమరూప దుస్తులు ధరించి రావాలన్నారు. అలాగే తల్లిదండ్రుల అంగీకార పత్రం తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. బాలికలు మహిళా ఉపాధ్యాయుల సంరక్షణలో, బాలురు పురుష ఉపాధ్యాయుల సంరక్షణలో ఉంటారన్నారు. కళ్లలో కారం చల్లి.. రాళ్లతో దాడి ధర్మవరం అర్బన్: ద్విచక్ర వాహనం రుణం కంతులు సక్రమంగా కట్టాలని హితవు పలికినందుకు సొంత బావ, అక్క కారం పొడి చల్లి రాళ్లతో దాడి చేసిన ఘటన సంచలనం రేకెత్తించింది. పోలీసులు తెలిపిన మేరకు... ధర్మరంలోని కేతిరెడ్డి కాలనీ ఎల్2కు చెందిన దాసరి సురేష్ తన భార్య పేరుపై ద్విచక్ర వాహనాన్ని ఫైనాన్స్ కింద తీసి బావమరిది రామాంజనేయులు ఇచ్చాడు. అయితే రుణం కంతులు సక్రమంగా కట్టకపోవడంతో ఆ భారం సురేష్పై పడుతూ వచ్చింది. దీంతో సోమవారం రాత్రి రామాంజనేయులును సురేష్, ఆయన భార్య నిలదీశారు. దీంతో రామాంజనేయులు, ఆయన భార్య ఉష నేరుగా సురేష్ ఇంటి వద్దకెళ్లి గొడవపడ్డారు. కళ్లలో కారం పొడి చల్లి, రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఫెయిల్ భయం.. విద్యార్థిని బలవన్మరణం ధర్మవరం రూరల్: మండలంలోని గొట్లూరు గ్రామానికి చెందిన సాకే కృష్ణయ్య కుమార్తె వైష్ణవి (15) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. ధర్మవరంలోని ఏపీ మోడల్ స్కూల్లో పదో తరగతి చదివిన వైష్ణవి ఇటీవల పరీక్షలు రాసి ఇంటికి చేరుకుంది. అయితే పరీక్షలు తాను సక్రమంగా రాయలేదని, ఫెయిల్ అవుతాననే భావనతో మానసికంగా కుదేలైంది. ముభావంగా ఉండడంతో తల్లిదండ్రులు అసలు విషయం తెలుసుకుని సర్దిచెప్పారు. ఫెయిల్ అయినా పర్వాలేదులే అంటూ ధైర్యం చెప్పారు. ఈ నేపథ్యంలో తీవ్ర మానసిక సంఘర్షణకు లోనైన వైష్ణవి... మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పైకప్పు కొక్కికి తల్లి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పనిపై బయటకు వెళ్లిన తల్లిదండ్రులు మధ్యాహ్నం 1 గంట సమయంలో ఇంటికి చేరుకున్నారు. అప్పటికే ఉరికి విగతజీవిగా వేలాడుతున్న కుమార్తెను చూసి స్థానికుల సాయంతో ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే వైష్ణవి మృతి చెందినట్లు నిర్దారించారు. ఘటనపై రూరల్ పీఎస్ ఎస్ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేశారు. -
సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలకు చెక్
మడకశిర: సీసీ కెమెరాల ఏర్పాటుతో అన్ని రకాల నేరాలకు చెక్ పెట్టవచ్చని ఎస్పీ వి.రత్న అన్నారు. నేరాలను అదుపు చేయడంలో సీసీ కెమెరాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు. మడకశిరలో దాతల సహకారంతో 32 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ను మంగళవారం ఎస్పీ ప్రారంభించి, మాట్లాడారు. మడకశిర నియోజకవర్గంలోని పోలీస్స్టేషన్లు అన్నీ కర్ణాటక సరిహద్దులో ఉన్న నేపథ్యంలో సరిహద్దులో నేరాలను అదుపు చేయడానికి సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. మడకశిర పట్టణంలో ముఖ్యమైన కూడళ్లు, విద్యాలయాలు, ప్రార్థనా మందిరాలు, జనసంచారమున్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు దాతలను అభినందిస్తూ సత్కరించారు. కార్యక్రమంలో పెనుకొండ డీఎస్పీ నరసింగప్ప, ట్రైనీ డీఎస్పీ ఉదయపావని, సీఐలు నాగేష్, రాజ్కుమార్, ఎస్ఐలు పాల్గొన్నారు. ఎస్పీ రత్న -
ఆర్టీసీ ఉద్యోగుల్లో అభద్రతా భావం
కదిరి అర్బన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగుల్లో అభద్రతాభావం నానాటికీ పెరిగిపోతోంది. 2019లో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం 1–2019 సర్క్యులర్ జారీ చేసి ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ భద్రతకు భరోసా కల్పించింది. అంతేకాక ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేస్తూ కార్మికులను ఉద్యోగులుగా పరిగణించింది. దీంతో ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యం పెరిగి నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ వచ్చారు. ఫలితంగా సంస్థ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ను అటకెక్కించింది. దీంతో తమ ఉద్యోగాలకు భద్రత లేకుండా పోతోందని ఆర్టీసీ కార్మికులు వాపోతున్నారు. ఈ క్రమంలో తరచూ ఏదో ఒక డిపో పరిధిలో కార్మికులు నిరసన బావుటా ఎగురవేస్తూనే ఉన్నారు. దశలవారీ ఉద్యమ కార్యాచరణతో కదిరి డిపో పరిధిలోని నేషనల్ మజ్దూర్ యూనియన్ పోరుబాటకు సిద్ధమైంది. ఇప్పటికే రెండు సార్లు ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలిపారు. అలాగే మరో రెండు పర్యాయాలు గేట్ మీట్లతో ధర్నా నిర్వహించారు. రోడ్డున పడనున్న కుటుంబాలు జిల్లాలో వ్యాప్తంగా మొత్తం ఆరు డిపోల పరిధిలో ఆర్టీసీ, అద్దె బస్సులు రెండు కలిపి 410 వరకు ఉన్నాయి. ఈ ఆరు డిపోల్లో 1,600 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ అమలు కాకపోవడంతో ఇప్పటి వరకూ సుమారు 50 మంది డ్రైవర్లు, కండక్టర్లు సర్వీస్లో నుంచి రిమూవ్ అయినట్లు సమాచారం. ఇదే బాటలో మరికొందరు ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఉద్యోగాలు కోల్పోయిన వారి కుటుంబాలు రోడ్డున పడనున్నాయి. గత ప్రభుత్వంలో నో టెన్షన్ చిన్న పాటి తప్పిదాలకే ఉద్యోగం నుంచి తొలగిస్తున్న కూటమి ప్రభుత్వం రోజూ భయపడుతూ విధులు నిర్వర్తించలేమంటున్న ఉద్యోగులుఉద్యోగ భద్రత కోసం పోరాడతాం ఆర్టీసీలో విధులు నిర్వర్తించేందుకు ఉద్యోగులు చాలా భయపడతున్నారు. చిన్నపాటి తప్పిదాలకు సర్వీసు నుంచి తొలగిస్తూ ఉద్యోగుల ఆత్మస్తైర్యం దెబ్బతినేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఉద్యోగ భద్రతా సర్క్యులర్ అమలు చేసే వరకూ పోరాటాలు సాగిస్తాం. – ఎన్వీ రమణ, నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కదిరి డిపో మా పరిధిలో లేదు ఉద్యోగ భద్రతా సర్క్యులర్ 1–19 అమలు అనేది మా పరిధిలోని అంశం కాదు. ఇది పెద్దవాళ్లు చూసుకుంటారు. దీనిపై నేను ఏమీ మాట్లాడకూడదు. – మధుసూదన్, జిల్లా ప్రజారవాణా అధికారిఏపీఎస్ఆర్టీసీలో 1963లో ఏర్పాటు చేసుకున్న కాండక్ట్, క్లాసిఫికేషన్, అప్పీల్ మేరకు చిన్న చిన్న తప్పులకు సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు భారీ శిక్షలు వేసేవారు. ఎవరైనా టికెట్టు లేకుండా ప్రయాణిస్తున్నట్లుగా తనిఖీ అధికారి గుర్తిస్తే తక్షణమే కండక్టర్ను ఉద్యోగం నుంచి తొలగిచేవారు. అలాగే తన ప్రమేయం లేకుండా ప్రమాదం చోటు చేసుకుంటే డ్రైవర్ను బాధ్యుడిని చేస్తూ విధుల నుంచి తొలగించేవారు. 2019 వరకూ ఈ నిరంకుశ ధోరణి కొనసాగుతూ వచ్చింది. రాష్ట్రంలో 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడగానే తొలుత ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేస్తూ, 52 వేల మంది కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలనే ఉద్దేశ్యంతో సంస్థలో పని చేస్తున్న కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు, అసిస్టెంట్ మేనేజర్ ర్యాంక్ వరకు విధివిధానాలను రూపొందిస్తూ ఎన్ఏంయూ నాయకులతో అప్పటి మేనేజింగ్ డైరెక్టర్ సురేంద్రబాబు సంప్రదించి సర్కులర్ 1–19ని తీసుకువచ్చారు. దీంతో 2024 వరకు ఉద్యోగులు ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ వచ్చారు. తప్పు చేసి పట్టుబడిన కండక్టర్లు, డ్రైవర్లకు ఇంక్రిమెంట్లుతో కోతలు విధించడం తప్ప వారిని ఉద్యోగాల నుంచి తొలగించకపోవడం గమనార్హం. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సర్కులర్ 1–19ని అటకెక్కించింది. ఫలితంగా కదిరి డిపోలో పనిచేస్తున్న ఓ కండక్టర్, డ్రైవర్ చిన్నపాటి తప్పిదానికి తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది. ఇది ఉద్యోగుల్లో అభద్రతా భావాన్ని పెంచింది. -
9, 10 తరగతుల సిలబస్ తగ్గించాలి
పుట్టపర్తి అర్బన్: తొమ్మిది, పదో తరగతుల సిలబస్ను తగ్గించాలంటూ డీఈఓ కృష్ణప్పకు జిల్లా ఆంగ్ల ఉపాధ్యాయుల ఫోరం తరపున నాయకులు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... 9, 10వ తరగతుల్లో ఒక్కో తరగతిలో 9 యూనిట్లు, అదనంగా సప్లిమెంటరీ, వర్క్ బుక్లు ఉన్నాయని, అధిక సిలబస్ కారణంగా పాఠ్యాంశాల బోధనకు ఉపాధ్యాయులు, అభ్యసనకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పాఠ్యాంఽశాల్లోని అన్ని విషయాలను పూర్తి స్థాయిలో బోధించడానికి సమయం సరిపోవడం లేదన్నారు. ఒక్కో తరగతిలో 6 యూనిట్లు ఉండేలా సిలబస్ సవరించాలని కోరారు. కార్యక్రమంలో ఆంగ్ల ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ, నాగభూషణ, రవిచంద్రారెడ్డి, వెంకట్రాముడు, రేష్మాభాను, రామమూర్తి, బాబు, ఎల్వీ రమణ, వాసు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. మార్చురీ అటెండర్ ఆత్మహత్యాయత్నం ● మెడికల్ ఆఫీసర్ వేధింపులే కారణం?గోరంట్ల: మెడికల్ ఆఫీసర్ వేధింపులు తాళలేక మార్చురీ అటెండర్ ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాలు... గోరంట్లలోని సామాజిక ఆరోగ్య కేంద్రం మార్చురీలో ఔట్ సోర్సింగ్ విధానంలో అటెండర్గా వివాహిత రాధ పనిచేస్తున్నారు. మార్చురీ విభాగానికి సంబంధించిన పరికరాలు, సిబ్బంది సరిగా లేకపోవడంతో అటెండర్ రాధను నర్సింగ్ అటెండర్గా పనిచేయాలని మెడికల్ అపీసర్ డాక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. ఈ క్రమంలో పనితీరుపై వైద్యాధికారి, రాధ మధ్య తరచూ గొడవ పడేవారు. దీంతో రాధ సెలవులో వెళ్లింది. సోమవారం సెలవులు పూర్తి కావడంతో ఆమె విధులకు హాజరయ్యారు. దీంతో ఆమెను నైట్ డ్యూటీకి వేశారు. తనకు చిన్న వయసున్న కుమారుడు ఉన్నాడని, నైట్డ్యూటీ వద్దని డాక్టరును రాధ ప్రాధేయపడింది. అయినా డాక్టర్ స్పందించకపోవడంతో మనస్తాపం చెందిన ఆమె మంగళశారం ఆస్పత్రిలోని మందులు మోతాదుకు మించి మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. అంతకు ముందు ఇదే అంశంపై డీఎంహెచ్ఓకు ఆమె ఫిర్యాదు చేసింది. దీనిపై డీసీఎచ్ఎస్ తిపేంద్రనాయక్ మంగళవారం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. మరో వైపు తనను బ్లాక్మెయిల్ చేయడానికి రాధ ఆత్మహత్యాయత్నం చేసిందంటూ పోలీసులకు డాక్టర్ వినోద్ కుమార్ ఫిర్యాదు చేశారు. వ్యక్తి దుర్మరణం గోరంట్ల: కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పెనుకొండ మండలం గోనిపెంటకు చెందిన దూబేనాయక్ (50) గోరంట్ల మండలం మిషన్ తండాలోని బంధువులను పలకరించేందుకు మంగళవారం రాత్రి బస్సులో వచ్చాడు. మిషన్ తండా వద్ద బస్సు దిగి జాతీయ రహదారి దాటుతుండగా బెంగళూరు వైపు నుంచి దూసుకొచ్చిన కారు ఢీకొంది. ఘటనలో దూబేనాయక్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇంటర్ విద్యార్థిని అదృశ్యంధర్మవరం అర్బన్: స్థానిక గుట్టకిందపల్లికి చెందిన ఇంటర్ విద్యార్థిని కనిపించడం లేదు. ఈ మేరకు ధర్మవరంలో రెండో పట్టణ పీఎస్ సీఐ రెడ్డప్ప మంగళవారం వెల్లడించారు. గుట్టకిందపల్లికి చెందిన విద్యార్థిని అనంతపురంలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదివింది. ఇటీవల పరీక్షలు రాసిన అనంతరం ఇంటికి చేరుకున్న ఆమె మంగళవారం మధ్యాహ్నం బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
భారీ పేలుళ్లతో బెంబేలు
పుట్టపర్తి రూరల్: భారీ పేలుళ్లతో జిల్లా కేంద్రంలో మంగళవారం భూమి కంపించింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వివరాలు.. ఎనుములపల్లి, బ్రాహ్మణపల్లి, బీడుపల్లి గ్రామాల మీదుగా 342వ జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా అడ్డుగా ఉన్న కొండలను చదును చేసే క్రమంలో కాంట్రాక్టరు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు వినియోగిస్తున్నారు. మంగళవారం చేపట్టిన పేలుళ్ల ధాటికి ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న సత్యసాయి సూపర్ ఆస్పత్రి, సత్యసాయి ఎయిర్పోర్టు కార్యాలయం, జిల్లా కేంద్రంలోని అన్ని కార్యాలయాలతో పాటు వేలాది గృహ సముదాయాలు, బహుళ అంతస్తుల భవనాలు కంపించాయి. ఆ సమయంలో భూకంపం వచ్చిందనే భయం అందరిలోనూ వ్యక్తమైంది. ఎనుములపల్లిలో శిల్పారామం, బీడుపల్లి, బ్రాహ్మణపల్లిలో గృహ సముదాయాల గోడలు బీటలు వారాయి. మోతాదుకు మించి మందు గుండు సామగ్రి వినియోగించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పుట్టపర్తి ప్రశాంతతకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. జాతీయ రహదారి నిర్మాణం ఎంత అవసరమో... అంతకు మంచి ప్రజల భద్రత కూడా అవసరమని గుర్తించాలని కోరారు. గుండె ఆగినంత పనైంది ఒక్కసారిగా భూమి కంపించడంతో గుండె ఆగినంత పనైంది. వృద్ధులు, గుండె జబ్బు బాధితులు ఇంతటి శబ్ద కాలుష్యాన్ని ఎలా భరిస్తారు. ఒక్కసారి పేలుడు సంభవిస్తే ఆకాశమంత ఎత్తుకు ధూళి ఎగిసి పడుతోంది. జాతీయ రహదారి అవసరమే... అయితే నిర్మాణంలో ఇలాంటి పేలుళ్లతో భయానక వాతావరణం సృష్టించడం సరికాదు. – జగన్నాథ, ఎనుములపల్లి పరుగులు తీశాం మంగళవారం ఉదయం అందరూ ఇంట్లోనే ఉన్నాం. ఆ సమయంలో ఇల్లు ఒక్కసారిగా కంపించింది. భూకంపం వచ్చిందనుకుని అందరమూ బయటకు పరుగు తీశాం. హైవే పనుల కోసం కొండలు పేల్చడంతో భూమి కంపించినట్లుగా తెలిసింది. పుట్టపర్తి ప్రశాంతతకు భంగం కలిగించేలా చేపట్టిన పేలుళ్లపై అధికారులు చర్యలు తీసుకోవాలి. – చంద్రశేఖర్, బ్రాహ్మణపల్లి పుట్టపర్తిలో భయాందోళనకు గురైన ప్రజలు -
వైఎస్సార్ సీపీ కార్యకర్తపై ‘తమ్ముళ్ల’ దాడి
● వాట్సాప్ స్టేటస్లో జగన్ పాట పెట్టాడని దౌర్జన్యం ● అడ్డువచ్చిన భార్యనూ అసభ్యపదజాలంతో దూషణ ● మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించిన బాధితుడు ధర్మవరం: వైఎస్సార్ సీపీ కార్యకర్త తన వాట్సాప్ స్టేటస్లో వైఎస్ జగన్ పాట పెట్టడాన్ని జీర్ణించుకోలేని టీడీపీ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేశారు. అడ్డువచ్చిన అతని భార్యనూ అందరి ముందు అసభ్యపదజాలంతో దూషించారు. అవమానంగా భావించిన బాధితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ముదిగుబ్బలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... ముదిగుబ్బ గేట్ కొట్టాల వద్ద నివాసం ఉంటున్న బాబ్జాన్ వైఎస్సార్ సీపీ కార్యకర్త. టైల్స్ పరిచే పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వాడు. ఇటీవల బాబ్జాన్ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ పాటలను తన వాట్సాప్ స్టేటస్గా పెట్టుకుంటున్నాడు. దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ కార్యకర్తలు బాజ్జాన్ను పిలిపించి మరోసారి జగన్ పాట స్టేటస్ పెడితే ఊరుకునేది లేదంటూ ఇటీవల హెచ్చరించారు. ఆ తర్వాత కూడా బాబ్జాన్ వైఎస్ జగన్ చిత్రాలు, పాటలను వాట్సాప్ స్టేటస్గా పెట్టేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి బాబ్జాన్ పీర్ల చావిడి వద్ద ఉండగా.. పూటుగా మద్యం సేవించి అక్కడికి వచ్చిన నలుగురు టీడీపీ కార్యకర్తలు అతనిపై గొడవకు దిగారు. తాము చెప్పినా వినకుండా మళ్లీ జగన్ పాటను వాట్సాప్ స్టేటస్ పెడతావా... అంటూ దాడి చేశారు. అక్కడికి వచ్చిన బాబ్జాన్ భార్యను అసభ్యపదజాలంతో దూషించారు. దీన్ని అవమానంగా భావించిన బాబ్జాన్ ఇంటికి వెళ్లి తలకు పూసుకునే వాస్మోల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని కదిరి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఇప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం గమనార్హం. -
ఖాద్రీశా.. గోవిందా
● ఖాద్రీశుని దర్శనానికి పోటెత్తిన భక్తులు కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సోమవారం స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి, వారాంతపు సెలవులు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు స్వామి దర్శనం కోసం భారీగా తరలివచ్చారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచే కాకుండా కర్ణాటక, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల నుంచి తరలి వచ్చిన భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఖాద్రీశున్ని స్మరిస్తూ గోవింద నామ స్మరణ చేయగా..ఆ ప్రాంతం మార్మోగింది. ఆలయ కమిటీ భక్తులకు అన్నదానం చేసింది. సాయంత్రం వేళ మహిళలు దీపాలు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. -
కమనీయం.. మహాలక్ష్మీ రథోత్సవం
రొళ్ల: రత్నగిరి గ్రామంలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవి రథోత్సవం సోమవారం కనుల పండువగా జరిగింది. వార్షిక ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయాన్నే అర్చకులు అమ్మవారి మూలవిరాట్కు పట్టు వస్త్రాలు, వెండి, బంగారు ఆభరణాలు, వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అభిషేకం, అంకురార్పణ, కుంకుమార్చన, తులసీపూజ చేశారు. ఆలయ ఆవరణలో ఉంచిన రథాన్ని వివిధ పుష్పాలతో అలంకరించి శాంతి, నవగ్రహ హోమం, గణపతి పూజ చేశారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని అలంకరించి మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి రథంలో కొలువుదీర్చారు. మహాలక్ష్మీ నమోస్తుతే.. రథంపై కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందారు. మహాలక్ష్మీ నమోస్తుతే అంటూ కీర్చించారు. అనంతరం రథాన్ని ఆలయ ప్రాంగణం నుంచి సమీపాన ఉన్న ప్రధాన రోడ్డు వరకు లాగారు. ఈ సందర్భంగా భక్తులు రథంపైకి అరటి పండ్లు, పూలు, తమలపాకులు తదితర వాటిని విసిరి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామానికి చెందిన బ్రహ్మణ కులస్తులు రాజవంశీకులతో కలిసి జ్యోతులను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన గ్రామస్తులతో పాటు కర్ణాటక ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రత్నగిరి సంస్థాన రాజవంశీకుడు దొర రంగప్పరాజు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నేడు గంగ పూజ.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారికి గంగ పూజ చేయనున్నట్లు రాజవంశీకుడు దొర రంగప్పరాజు, గ్రామ పెద్దలు తెలిపారు. గంగ పూజ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. -
బడుగులపై పచ్చ బలుపు
ఆధిపత్యం కోసం అకృత్యాలకు దిగుతున్నారు. తమ బలం చూపించేందుకు బడుగులపై దాడులు చేస్తూ బలి తీసుకుంటున్నారు. నిన్న కురుబ లింగమయ్య, తాజాగా ఆనంద్.. ఇద్దరిపైనా దాడి చేసింది ‘పరిటాల’ వర్గమే. పట్టుకోసం అటు రాప్తాడు, ఇటు ధర్మవరంలో హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నాపారు. ముఖ్యనేతల జోలికెళ్లే ధైర్యం లేక అమాయకులైన బీసీలపై దాడులు చేస్తూ భయకంపితులను చేస్తున్నారు.ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అండతో ఆయన అనుచరులు నానా హంగామా చేస్తున్నారు. బీజేపీ నాయకులను భయపెట్టేందుకు బీసీ కులాలను టార్గెట్ చేసుకుని దాడులకు దిగుతున్నారు. మద్యం దుకాణాల నిర్వహణ మొదలుకుని.. ఫీల్డ్ అసిస్టెంట్లు, రేషన్ డీలర్ల నియామకం.. ఇలా ప్రతి విషయంలో బీజేపీ నేతల పెత్తనాన్ని ఎక్కడికక్కడ.. ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ వస్తున్నారు. ఎక్కడైనా ఎదురుతిరిగితే దాడులకు తెగబడుతున్నారు. ఈ క్రమంలోనే తాడిమర్రి మండలంలో మద్యం దుకాణం నిర్వహణలో బీజేపీ నేతలను రెండు నెలల పాటు పరిటాల శ్రీరామ్ అనుచరులు అడ్డగించిన సంగతి తెలిసిందే.పాపిరెడ్డిపల్లి తరహాలోనే.. పరిటాల శ్రీరామ్ అండతో టీడీపీ గూండాలు రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ఉగాది రోజున కురుబ లింగమయ్యపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. అదే తరహాలో పెద్దకోట్లలో కురుబ కులానికి చెందిన ఆనంద్పై దాడికి దిగినట్లు తెలిసింది. పాపిరెడ్డిపల్లి తరహాలోనే పెద్దకోట్లలో కూడా ‘పరిటాల’ సామాజిక వర్గానికి చెందిన వారే దాడికి దిగడం గమనార్హం. పరిటాల శ్రీరామ్ అనుచరుల బెదిరింపులతో రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో బీసీ కులాల నేతలు భయభ్రాంతులకు గురవుతున్నారు.నెల రోజుల క్రితం ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ వాహనంపై పరిటాల శ్రీరామ్ అనుచరులు దాడికి దిగారు. ఒకే కూటమిలో ఉన్నప్పటికీ ఇరు పార్టీల మధ్య సఖ్యత లేదనే విషయం బహిర్గతమైంది. తాజాగా తాడిమర్రి మండలం పెద్దకోట్ల గ్రామంలో బీసీ కులానికి చెందిన ఆనంద్ను టీడీపీ నేతలు చితకబాదారు. ఆదివారం సాయంత్రం గొడవ జరగడంతో అదేరోజు రాత్రి ధర్మవరం ఆస్పత్రిలో చేరాడు. అయితే విషయం బయటకు పొక్కుతుందని భావించిన టీడీపీ నేతలు ఆస్పత్రిలో ఉన్న ఆనంద్కు వార్నింగ్ ఇవ్వగా..రాత్రికి రాత్రే ఆయన డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నాడు.బీసీ నేతలే టార్గెట్..సాక్షి, టాస్క్ఫోర్స్: కూటమి పార్టీల నేతలు పైన పొత్తులో కనిపిస్తున్నా.. లోన కత్తులు నూరుతున్నారు. మంత్రి సత్యకుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో తరచూ టీడీపీ, బీజేపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. నియోజకవర్గంలో బీజేపీ పెత్తనాన్ని టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు. ఈ క్రమంలో ఆధిపత్యం కోసం బీజేపీ నేతలపై తరచూ దాడులకు తెగబడుతున్నారు. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాల నేతలనే టార్గెట్ చేస్తున్నారు. ఓటు బ్యాంకు ఆధారంగా ప్రాధాన్యం ఇవ్వాలని ‘తెలుగు తమ్ముళ్లు’ డిమాండ్ చేస్తుండగా.. ఎమ్మెల్యే మావాడు...మాకే ప్రాధాన్యం ఇవ్వాలని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి.ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా?ఆర్వేటి ఆనంద్పై టీడీపీ నేతల దాడి దుర్మార్గందుండగులపై చర్యలు తీసుకోవాలిబీజేపీ, కురుబ సంఘం నాయకుల డిమాండ్ధర్మవరం/తాడిమర్రి: తమ అక్రమాలను ప్రశ్నిస్తే ప్రాణాలు తీసేందుకు కూడా టీడీపీ నేతలు వెనుకాడటం లేదని బీజేపీ, కురుబ సంఘం నాయకులు మండిపడ్డారు. తమ దురాగతాలను బయటపెట్టినందుకే బీజేపీకి చెందిన కురుబ ఆర్వేటి ఆనంద్పై టీడీపీ నాయకులు దాడి చేశారన్నారు. మండలంలోని పెద్దకోట్ల గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు కురుబ ఆర్వేటి ఆనంద్పై ఆదివారం టీడీపీ నాయకులు దాడి చేశారు. సోమవారం బాధితుడిని పరామర్శించిన బీజేపీ మండల నాయకులు, కురుబ సంఘం నాయకులు అనంతరం ధర్మవరం బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ధర్మవరం మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కొంకా నాగార్జున మాట్లాడుతూ.. తాడిమర్రి మండలం బీజేపీ ప్రధాన కార్యదర్శి పెద్దకోట్లకు చెందిన కురుబ ఆర్వేటి ఆనంద్ గ్రామానికి చెందిన మత్స్యకారుల సొసైటీలో సభ్యుడిగా ఉన్నారన్నారు. మత్స్యకార సొసైటీలోని కొందరు సభ్యులు మత్స్య సంపదను రాజమండ్రికి చెందిన కాంట్రాక్టర్కు అప్పజెప్పాలని నిర్ణయించారన్నారు. దీనివల్ల గ్రామానికి గానీ, స్థానిక మత్స్యకారులకు ఎలాంటి ఆదాయం రాదన్నారు. దీంతో ఆర్వేటి ఆనంద్ టీడీపీ నేతల నిర్ణయానికి అడ్డుచెప్పారన్నారు. దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు ఆదివారం మద్యం సేవించి వచ్చి మరణాయుధాలతో ఆర్వేటి ఆనంద్పై దాడి చేశారన్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బత్తలపల్లి జెడ్పీటీసీ కోటి సుధ, కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ కాటమయ్య, బీజేపీ నాయకులు దేవర రామ్మోహన్, వీరనారప్ప, బిల్లే శ్రీనివాసులు, గొట్లూరు అనీల్ పాల్గొన్నారు. -
దేశానికే దిక్సూచి అంబేడ్కర్
పుట్టపర్తి టౌన్/ప్రశాంతి నిలయం: ప్రపంచంలోనే గొప్పదైన రాజ్యాంగాన్ని అందించిన అంబేడ్కర్ దేశానికి దిక్సూచిలా నిలిచారని జాయింట్ కలెక్టర్ అభిషేక్కుమార్ పేర్కొన్నారు. సోమవారం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పుట్టపర్తి పట్టణంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో డాక్టర్ అంబేడ్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలకు జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే సింధూరారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ...దేశంలోని అన్నివర్గాల అభ్యున్నతికి అంబేడ్కర్ కృషి చేశారన్నారు. భారత రాజ్యాంగం ద్వారా సమాజంలోని అన్ని వర్గాలకు సమానమైన అవకాశాలు కల్పించేలా చూశారన్నారు. ఏ అంశంౖపైనెనా సరే నేడు ప్రతి ఒక్కరూ ధైర్యంగా తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారంటే అది అంబేడ్కర్ కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ వల్లేనన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగం వల్లే నేడు సామాన్యులు, బడుగు, బలహీన వర్గాల వారు చట్టసభల్లో అడుగుపెట్టి ప్రజల గొంతును వినిపించగలుగుతున్నారన్నారు. ఆ మహనీయుడి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, ఉమ్మడి అనంతపురం జిల్లా ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధర్, సాంఘిక సంక్షేమ శాఖాధికారి శివరంగప్రసాద్, డీఆర్డీఏ పీడీ నరసయ్య, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, ఉద్యానవన శాఖ అధికారి చంద్రశేఖర్, గిరిజన సంక్షేమశాఖ అధికారి మోహన్రామ్, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ తిప్పన్న, మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డితోపాటు అధికారులు, నాయకులు పాల్గొన్నారు అంబేడ్కర్ స్ఫూర్తితో ముందుకు సాగుదాం.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంత్యుత్సవాలను కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ స్ఫూర్తితో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఆర్ఓ విజయసారథి, కలెక్టరేట్ ఏఓ వెంకటనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. జయంతి వేడుకల్లో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ -
క్వింటా చింతపండు రూ.25 వేలు
హిందూపురం అర్బన్: చింతపండు ధరలు మార్కెట్లో నిలకడగా కొనసాగుతున్నాయి. సోమవారం హిందూపురం వ్యవసాయ మార్కెట్కు 1024.20 క్వింటాళ్ల చింత పండు రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలం పాట నిర్వహించారు. ఇందులో కరిపులి రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ.25 వేలు, కనిష్టంగా రూ.8 వేలు, సరాసరిన రూ.12 వేల ప్రకారం ధర పలికింది. ఇక ప్లవర్ రకం క్వింటా గరిష్టంగా రూ. 12,500, కనిష్టంగా రూ.4 వేలు, సరాసరిన రూ.11 వేల ప్రకారం ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి చంద్రమౌళి తెలిపారు. మార్కెట్కు నాణ్యమైన చింతపండు తీసుకువచ్చి అధిక ధర పొందాలని కార్యదర్శి రైతులకు సూచించారు. హెచ్ఎం పదోన్నతుల సీనియార్టీ జాబితా సిద్ధం అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జిల్లా పరిషత్, మునిసిపాలిటీ, అనంతపురం కార్పొరేషన్లో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించేందుకు సీనియార్టీ జాబితాను తయారు చేశారు. deoananthapuramu.blogspot. com వెబ్సైట్లో ఉంచినట్లు డీఈఓ ప్రసాద్బాబు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జాబితాపై ఏవైనా అభ్యంతరాలుంటే ఆధారాలతో ఈనెల 19లోపు ఫిర్యాదు చేయాలని డీఈఓ సూచించారు. ఎస్పీని కలిసిన డీఎస్పీ పుట్టపర్తి టౌన్: పెనుకొండ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నరసింగప్ప సోమవారం ఎస్పీ రత్నను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పెనుకొండ సబ్ డివిజన్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని డీఎస్పీకి ఎస్పీ సూచించారు. ముఖ్యంగా మట్కా, పేకాటను పూర్తిగా అరికట్టాలన్నారు. సమస్యాత్మక గ్రామాలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. -
పేదల నెత్తిన గుదిబండ
ప్రశాంతి నిలయం: జిల్లా వాసులపై వంట గ్యాస్ రూపంలో అదనపు భారం పడింది. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానికి అంటుతుండడంతో అవస్థలు పడుతున్న సామాన్యులకు వంట గ్యాస్ సిలిండర్పై రూ.50 ధర పెంచి కూటమి సర్కార్ షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై ఏ మాత్రం చిత్తశుద్ధి చూపని పాలకులు.. నిత్యావసర సరుకుల ధరలు, వంట గ్యాస్, ఇంధన ధరలను పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 32 మండలాల పరిధిలో ఐఓసీ, హెచ్పీసీ, బీపీసీ కంపెనీల ద్వారా 39 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటి పరిధిలో జిల్లా వ్యాప్తంగా సాధారణ గృహ వినియోగ సిలిండర్లు 8,08,489 ఉన్నాయి. మరో 7,737 నాన్ డొమెస్టిక్ కనెక్షన్లు ఉన్నాయి. ఏటా రూ.24.25 కోట్ల భారం.. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్పై రూ.50 అదనంగా పెంచడంతో జిల్లా వాసులపై ఏటా రూ.24.25 కోట్ల భారం పడనుంది. జిల్లాలో 8,08489 గ్యాస్ కనెక్షన్లు ఉండగా ఒక్కో కనెక్షన్ ద్వారా ఏడాదికి 6 సిలిండర్లు చొప్పున 48,50,934 సిలిండర్లు వినియోగిస్తున్నారు. గతంలో 14.20 కిలోల సిలిండర్ ధర జిల్లా కేంద్రంలో రూ.870 ఉండగా పెంచిన తర్వాత రూ.930కి చేరింది. రవాణా చార్జీల రూపంలో దూరాన్ని బట్టి మరో రూ.30 నుంచి రూ.50ను, డెలివరీ చేసినందుకు అంటూ బాయ్స్ మరో రూ.20 వరకు వసూలు చేస్తున్నారు. దీంతో గృహ వినియోగదారులు సిలిండర్ కొనుగోలు చేయాలంటే రూ.1000 వరకు వెచ్చించాల్సి వస్తోంది. ధర తగ్గించాలి కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడుస్తున్నా ఎన్నికల హామీలను ఏ మాత్రం నెరవేర్చడం లేదు. పైగా నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగినా పట్టించుకోవడం లేదు. నెలసరి ఖర్చుల భారం మోయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడేమో గ్యాస్ సిలిండర్పై రూ.50 ధర పెంచడం తగదు. వెంటనే పెంచిన సిలిండర్ రేటును వెంటనే తగ్గించాలి. – సాయిలీల, ప్రశాంతి గ్రామ్ పేదలపై భారం నిత్యావసరాల ధరల పెరుగుదలతో కొనుగోలు శక్తి లేక చాలా మంది పేదలు ఇబ్బంది పడుతున్నారు. ఇంధన ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచిందనే సాకు చూపి వంట గ్యాస్ సిలిండర్పై రూ.50 పెంచడం సబబు కాదు. పెంచిన ధరను వెంటనే తగ్గించి పేదలకు న్యాయం చేయాలి. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే ఏ ప్రభుత్వానికై నా పతనం తప్పదు. – కవిత, గోకులం, పుట్టపర్తి ఒక్కో వంట గ్యాస్ సిలిండర్పై అదనంగా రూ.50 పెంపు జిల్లా వినియోగదారులపై ఏటా రూ.24.25 కోట్ల అదనపు భారం -
మందు అడిగితే ఇవ్వలేదని వ్యక్తిపై దాడి
యాడికి: తాగేందుకు మందు ఇవ్వలేదన్న అక్కసుతో ఖాళీ మద్యం బాటిళ్లతో వ్యక్తిపై దాడి చేసిన ఘటన యాడికిలో సంచలనం రేకెత్తించింది. బాధితుడు తెలిపిన మేరకు.. యాడికి మండలం కోనుప్పలపాడు గ్రామానికి చెందిన మంగల గంగాధర్ సోమవారం వ్యక్తిగత పనిపై మండల కేంద్రానికి వచ్చాడు. మధ్యాహ్నం కుంటకు వెళ్లే మార్గంలో ఉన్న బ్రాందీ షాపులో మద్యం బాటిల్ కొనుగోలు చేసి, ఆ పక్కనే మిగిలిన వారితో కలసి తాగుతూ కూర్చొన్నాడు. అదే సమయంలో గంగాధర్తో ఎలాంటి ముఖపరిచయం లేని యాడికి గ్రామానికి చెందిన మహేష్ అక్కడకు చేరుకుని తనకూ తాగేందుకు మద్యం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇందుకు గంగాధర్ నిరాకరించడంతో మహేష్ వాగ్వాదానికి దిగాడు. దుర్భాషలాడుతూ ఆ పక్కనే పడి ఉన్న ఖాళీ మద్యం గాజు బాటిల్ తీసుకుని గంగాధర్ తలపై బలంగా బాదాడు. దీంతో గంగాధర్ తలకు తీవ్ర రక్తగాయమైంది. సమాచారం అందుకున్న గంగాధర్ సమీప బంధువు అక్కడకు చేరుకుని వెంటనే క్షతగాత్రుడిని స్థానిక పీహెచ్సీకి తీసుకెళ్లి చికిత్స చేయించాడు. విషయం తెలుసుకున్న యాడికి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దాడికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహేష్ను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. మాజీ సైనికుడి మృతిహిందూపురం అర్బన్: స్థానిక న్యూ హస్నాబాద్లో నివాసముంటున్న మాజీ సైనికుడు ఎ.ఆదినారాయణ (86) సోమవారం అనారోగ్యంతో కన్నుమూసారు. ఆయనకు భార్య గ్రేస్ ఆదిలక్ష్మీదేవి, కుమార్తె సుమలత, కుమారులు కామేష్, నాగేంద్రకుమార్ (ఎస్డీజీఎస్ కళాశాల ప్రిన్సిపాల్), స్టీఫెన్రాజ్, మనవలు, మనుమరాళ్లు ఉన్నారు. 24 ఏళ్లపాటు సైన్యంలో పనిచేసిన ఆయన 1971లో జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి శత్రుసైనికులను దేశంలో చొరబడకుండా అడ్డుకున్నారు. ఆదినారాయణ మృతి చెందిన విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆయన మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. గంజాయి విక్రేతల అరెస్ట్ కదిరి టౌన్: తనకల్లు మండలం గోవిందువారిపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి తెలిపారు. స్థానిక రూరల్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు. సోమవారం ఉదయం గోవిందవారిపల్లి వద్ద నలుగురు అనుమానాస్పదంగా తచ్చాడుతుండగా గమనించిన తనకల్లు ఎస్ఐ గోపి వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఆ సమయలో వారు అక్కడి నుంచి పారిపోతుండడంతో అనుమానం వచ్చి కానిస్టేబుళ్లు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 7 ప్లాస్టిక్ ప్యాకెట్లలో ఉన్న గంజాయి, 4 సెల్పోన్లు, రూ.1,100 నగదు స్వాధీనం చేసుకుని డిప్యూటీ తహసీల్దార్ సమక్షంలో పంచనామా చేయించారు. నిందితులను బాలంగిరి జిల్లా నూంహాడ్ గ్రామానికి చెందిన తులసీ పరదు, అన్మమయ్య జిల్లా ముదివేడు మండలం గుట్టమీదసాహెబుల పల్లికి చెందిన రెడ్డి బాషా, మొలకలచెరువు మండలం ఎపురకోటకు చెందిన కె.నరసింహులు, అన్నమయ్య జిల్లా బాలసముద్రం గ్రామానికి చెందిన సురేందర్గా గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. ముగిసిన రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు తాడిపత్రి: ఆలూరు కోన రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాల ఆఖరి రోజు సోమవారం స్వామి వారికి కోనలో తీర్థవాది, వసంతోత్సవం, చక్రస్నానం వంటి కార్యక్రమాలు అర్చకులు జరిపించారు. అనంతరం స్వామి వారికి పుష్పయాగ కార్యక్రమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రాత్రికి రంగనాథస్వామి వారు హంసవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. -
నాటుసారా తయారు చేస్తే చర్యలు
పుట్టపర్తి టౌన్: జిల్లా వ్యాప్తంగా నాటు సారా తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని ప్రొహిబిషన్ ఎక్పైజ్ జిల్లా అధికారి గోవిందనాయక్ హెచ్చరించారు. నవోదయం 2.0 భాగంగా నాటు సారా నిర్మూలకు సోమవారం బుక్కపట్నం మండలం నార్శింపల్లి తండాలో జిల్లా అధికారులలో కలసి దాడులు నిర్వహి ంచారు. 540 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసి, 4 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. నార్శింపల్లి తండాకు చెందిన అలివేలుబాయి, కిరణ్నాయక్, శ్రీరాములు నాయక్పై కేసు నమోదు చేశారు. పుట్టపర్తి రూరల్ మండలం వెంగలమ్మచెరువు గ్రామంలో దాడులు నిర్వహించి 90 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి, గంగులయ్యపై కేసు నమోదు చేశారు. దాడుల్లో అసిస్టెంట్ ప్రొహిబిషన్ అధికారి నరసింహులు, సీఐ నాగరాజు, ఎస్ఐ ఉమామహేశ్వర్రాజుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. బెల్లపు ఊట ధ్వంసం కదిరి అర్బన్: బాలప్పగారిపల్లి తండా సమీపంలోని కొండగుట్టల్లో సోమవారం ఎకై ్సజ్ పోలీసులు దాడులు నిర్వహించి, అక్రమంగా నిల్వ ఉంచిన 452 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. దాడుల్లో అనంతపురం ఎన్ఫోర్స్మెంట్ సీఐ అలీ, ఎకై ్సజ్ సీఐ శ్రీధర్, బాబు, దత్తాత్రేయతో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రాణం పోసిన మెడిసిన్ వైద్యులు
అనంతపురం మెడికల్: ప్రాణాపాయ స్థితిలో చికిత్స ఆస్పత్రికి చేరుకున్న రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందించడం ద్వారా అతని ప్రాణాలను ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని మెడిసిన్ విభాగం వైద్యులు కాపాడారు. కంబదూరు మండలం ఒంటిరెడ్డిపల్లికి చెందిన 34 ఏళ్ల వయసున్న నాగేంద్ర.. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఉన్నఫళంగా కాళ్లు చేతులు పడిపోయి, మాట రాకపోవడంతో ఈ నెల 7న కుటుంబసభ్యులు సర్వజనాస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు అక్యూట్ మెడికల్ కేర్లో అడ్మిట్ చేసుకుని మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ భీమసేనాచార్ నేతృత్వంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పావని తదితరులు చికిత్స మొదలు పెట్టారు. గులియన్ బరీ సిండ్రోమ్తో బాధపడుతున్నట్లుగా నిర్ధారణ అయిన తర్వాత పీజీ వైద్యులు, స్టాఫ్నర్సులు నాగేంద్రకు రౌండ్ ద క్లాక్ సేవలందించారు. రూ.7వేలు విలువ చేసే ఇంజెక్షన్లను క్రమం తప్పకుండా 20కి పైగా అందించాల్సి వచ్చింది. వెంటిలేటర్పై ఉన్న నాగేంద్ర కోలుకోవడంతో వార్డుకు షిప్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. తమకు ముగ్గురు పిల్లలున్నారని, ఆస్పత్రి వైద్యులు తన భర్తకు ఊపిరి పోశారని, వారి మేలును ఎన్నడూ మరవనంటూ వైద్యులు, స్టాఫ్నర్సులు, తదితర సిబ్బందికి భార్య సుకన్య కృతజ్ఞతలు తెలిపింది. ప్రైవేట్గా ఈ తరహా వైద్యం పొందాలంటే రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చు అవుతుందని ఆస్పత్రి వైద్యులంటున్నారు. -
19న వివాహం... యువతి బలవన్మరణం
రాప్తాడు రూరల్: పెళ్లి భజంత్రీ మోగాల్సిన ఇంట కాబోయే పెళ్లికూతురు బలవన్మరణంతో తీవ్ర విషాదం నెలకొంది. అనంతపురం రూరల్ మండలం పూలకుంటలో సోమవారం జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన మేరకు... పూలకుంట గ్రామానికి చెందిన కురుబ నారాయణస్వామికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్దమ్మాయికి వివాహమైంది. రెండో అమ్మాయి రేణుక (24) ఆకుతోటపల్లి–1 సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్గా పని చేస్తోంది. ఈమెకు ఓ ప్రభుత్వ ఉద్యోగితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఈ నెల 19న పెళ్లి జరగాల్సి ఉంది. ఇందుకోసం ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నాయి. కుటుంబసభ్యులు ఓవైపు పెళ్లి పత్రికల పంపిణీ చేస్తూనే మరోవైపు పెళ్లికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటికి బంధువుల రాక కూడా మొదలైంది. పెళ్లంటే ఇష్టం లేక.... అయితే రేణుకకు పెళ్లంటే ఇష్టం లేదు. ఇదే విషయాన్ని పలుమార్లు సచివాలయంలో సహచర ఉద్యోగులతో చెప్పేది. ‘పెళ్లి చేసుకున్న తర్వాత జీవితం ఎలా ఉంటుందో...అత్త మామలు ఎలా ఉంటారో....ఇప్పుడున్నట్లు పెళ్లి చేసుకున్న తర్వాత ఉండేందుకు ఉండదు... కొత్తగా పెళ్లి చేసుకున్న వారి కాపురాలు చాలా చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి ఎందుకు చేసుకోవాలో?’ అని చర్చించేది. మరోవైపు పెళ్లి తేదీ దగ్గరకు వస్తుండడంతో హడావుడి పెరిగిపోయింది. ఇక పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని, తల్లిదండ్రులకు చెప్పుకోలేక తీవ్ర ఆందోళనకు గురైన ఆమె సోమవారం ఉదయం మేడపై ఉన్న గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని ఫ్యానుకు ఉరి వేసుకుంది. ఎంతసేపటికీ కిందకు రాకపోవడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు పైకి వెళ్లి చూడగా ఉరికి విగతజీవిగా వేలాడుతున్న కుమార్తె కనిపించింది. సమాచారం అందుకున్న ఇటుకలపల్లి ఎస్ఐ విజయ్కుమార్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పెళ్లి భజంత్రీ మోగాల్సిన ఇంట విషాదం మృతురాలు సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ -
భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణ
కదిరి అర్బన్: మండలంలోని కుమ్మరవాండ్లపల్లి నుంచి కదిరి కొండ చుట్టూ సోమవారం శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహాస్వామి భక్తులు గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించారు. లక్ష్మీనరసింహాస్వామి జన్మ నక్షత్రం సందర్భంగా మహిమ గల ఖాధ్రీ కొండకు గిరి ప్రదక్షిణ చేస్తే సకల పాపాలు హరించుకుపోతాయని భక్తుల నమ్మకం. అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన తప్పనిసరి ● జిల్లా అగ్నిమాపక శాఖాధికారి హేమంత్రెడ్డి పుట్టపర్తి టౌన్: అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా అగ్నిమాపక శాఖాధికారి హేమంత్రెడ్డి అన్నారు. అగ్నిమాపక వారోత్సవాలను సోమవారం స్థానిక ఫైర్ స్టేషన్లో ఆయన ప్రారంభించి, మాట్లాడారు. విఽధి నిర్వహణలో అమరవీరులైనా ఫైర్మెన్లకు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. 1944, ఏప్రిల్ 14న ముంబైలో జరిగిన అగ్నిప్రమాదంలో (బాంబే డాక్ ఫైర్) మొత్తం 800 మంది మృత్యవాత పడ్డారు. ఇందులో 66 మంది అగ్నిమాపక సిబ్బంది ఉన్నారన్నారు. అప్పటి నుంచి విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన అమర వీరులను స్మరించుకుంటూ అగ్నిమాపక వారోత్సవాలను జరుపుకుంటున్నట్లు గుర్తు చేశారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాల నివారణపై వారం రోజుల పాటు ప్రజలకు వివిధ రూపాల్లో అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. 15న జనసంచారిత ప్రాంతాల్లో, విద్యాసంస్థల్లో, గ్యాస్ గోడౌన్లు, పెట్రోల్ బంక్లలో వారం రోజుల పాటు అగ్నిప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఏడీఎఫ్ఓలు, నాగరాజునాయక్, శంకర్ప్రసాద్, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు. -
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవు
పుట్టపర్తి టౌన్: సామాజిక మాధ్యమాల వేదికగా కులమతాలు, వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యాఖ్యలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రత్న హెచ్చరించారు. సోషల్ మీడియా పోస్టింగ్లపై సోమవారం డీపీఓలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కదిరి డీఎస్పీ శివన్నారాయణస్వామితో కలసి ఎస్పీ మాట్లాడారు. కదిరి ఆర్ఐ మున్వర్బాషా దొంగ పట్టాలు సృష్టించి ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకున్న అంశంలో 6 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇందులో రెండు కేసుల్లో ఆయన యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారన్నారు. అనంతరం కదిరి ఇన్స్పెక్టర్ను మున్వర్బాషా రెచ్చగొట్టేలా మాట్లాడారన్నారు. అలా మాట్లాడడం మంచిది కాదని చెప్పినా వినకుండా మొత్తం అంశాన్ని రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారన్నారు. వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరించిన మున్వర్బాషాపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇలాగే హిందూపురంలోనూ ఓ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సమావేశంలో సోషల్ మీడియా సీఐ తిమ్మారెడ్డి, ఎస్బీ ఎస్ఐ ప్రదీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నాయకులపై కేసు నమోదు తాడిమర్రి: తమ విధులకు ఆటంకం కలిగించారంటూ శివంపల్లికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు అల్లే సాయినాథ్రెడ్డి, దామోదర్రెడ్డి, హరినాథ్రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. శనివారం తాడిమర్రిలో లక్ష్మీ చెన్నకేశవస్వామి రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డీజేలో ఆ పార్టీకి చెందిన పాటలు వేయడాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఎవరికీ ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటామని వైఎస్సార్సీపీ నాయకులు కోరినా పోలీసులు వినలేదు. తమ విధులకు ఆటంకం కలిగించారంటూ కేసు నమోదు చేశారు. సత్తా చాటిన కస్తూరిబా విద్యార్థినులు పుట్టపర్తి అర్బన్: ఇటీవల ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లాలోని 30 కస్తూరిబా కళాశాలల విద్యార్థినులు సత్తా చాటారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో 877 మంది పరీక్షలు రాయగా, 599 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 641 మంది పరీక్షలు రాయగా 557 మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరంలో 68 శాతం, రెండో సంవత్సరంలో 87 శాతం ఫలితాలు సాధించినట్లు సమగ్ర శిక్ష జిల్లా కో–ఆర్డినేటర్ దేవరాజ్ తెలిపారు. జాతీయ హోమియో వైద్యుల సంఘంలో జిల్లా వాసులకు చోటు అనంతపురం మెడికల్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి ఫిజీషియన్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీలో ఉమ్మడి జిల్లా వాసులకు చోటు దక్కింది. ఈ నెల 13న గుంటూరులో అఖిల భారత హోమియో వైద్యుల సంఘం 18వ రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జిల్లాకు చెందిన సీనియర్ హోమియోపతి వైద్యుడు డాక్టర్ పోగుల కుమారయ్య, రాష్ట్ర విభాగం కో ఆర్డినేటర్గా డాక్టర్ ఎం.శాంతిప్రియకు అవకాశం దక్కింది. డాక్టర్ పోగుల కుమారయ్య మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో హోమియో వైద్యం ప్రాముఖ్యత, నూతన ఆవిష్కరణలు, సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. -
పరిస్థితి దారుణంగా ఉంది
అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో చీనీ తోటలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో 93 వేల ఎకరాలు, శ్రీ సత్యసాయి జిల్లాలో 37,250 ఎకరాల భారీ విస్తీర్ణంలో చీనీ పంట సాగవుతోంది. వాటి ద్వారా ఏటా 7.20 లక్షల టన్నుల మేర దిగుబడి వస్తోంది. ఏటా సరాసరి రూ.2,000 కోట్ల నుంచి రూ.2,200 కోట్ల టర్నోవర్ ఉన్నట్లు ఉద్యానశాఖ గణాంకాలు చెబుతున్నాయి. అనంతపురం జిల్లాలోని గార్లదిన్నె మండలంలో 18 వేల ఎకరాలు, యల్లనూరు 11,296, కూడేరు 9,300, పామిడి 5,300, నార్పల 5,200, పుట్లూరు 5 వేలు, ఆత్మకూరు 4,200, అనంతపురం 3,900, పెద్దపప్పూరు 3,500 ఎకరాల్లో చీనీ తోటలు ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో తాడిమర్రి, బత్తలపల్లి, ధర్మవరం, ముదిగుబ్బ, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి తదితర మండలాల్లో చీనీ అత్యధికంగా సాగులో ఉంది. ఢిల్లీ, ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి.. ఉమ్మడి జిల్లాలో పండించే చీనీలో 70 నుంచి 80 శాతం వరకు ఢిల్లీలో ఉన్న అజాద్పూర్ మార్కెట్కు, ఆ తర్వాత రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. అయితే ఈ సారి మహారాష్ట్ర, తెలంగాణ నుంచి ఎక్కువ దిగుబడి రావడంతో వ్యాపారులు అక్కడికి వెళుతున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ, పరిసర ప్రాంతాల మార్కెట్లకు సరుకు విపరీతంగా వెళుతుండటంతో సమస్య ఉత్పన్నమవుతోందని మార్కెట్యార్డు ఉన్నతశ్రేణి సెక్రటరీ కె.గోవిందు తెలిపారు. ఇటీవల జిల్లా నుంచి అక్కడకు వెళ్లిన 50 నుంచి 70 లారీల సరుకు ఇంకా అన్లోడ్ కాలేదని, దీంతో ధరలు పెరగడం లేదని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా.. సాధారణంగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో గరిష్ట ధరలు పలికేవి. కానీ, ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ధరలు పెరగడం అటుంచి తగ్గుదల కనిపిస్తుండటంతో అన్నదాతలు దిక్కులు చూస్తున్నారు. ఏప్రిల్లో టన్ను రూ.40 వేలకు పైగా పలకాల్సివుండగా... గత రెండు నెలలుగా టన్ను రూ.20 వేల నుంచి రూ.25 వేలకు మించి పలకడం లేదు. అనంతపురం వ్యవసాయ మార్కెట్యార్డుకు ఇటీవల నిత్యం 1,000 నుంచి 1,500 టన్నుల సరుకు వస్తోంది. ఈ క్రమంలో శనివారం టన్ను గరిష్ట ధర రూ.20 వేల లోపే పలికింది. సరాసరి ధర రూ.13 వేలు మాత్రమే పలకడంతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. దీనికి తోడు శనివారం మార్కెట్యార్డులో జీవాల సంత ఉండటంతో చీనీ అమ్మకాలకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది. చాలా వాహనాల్లోని చీనీ సరుకును కిందికి దించి అమ్మకాలు చేసేందుకు కూడా వీలు లేకుండా పోయింది. ఇలా రోజురోజుకు కష్టాలు ఎక్కువ అవుతుండటంతో చీనీ రైతులు భారీ నష్టాలు చవిచూస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ‘అనంత’ రైతులకు ఒకప్పుడు లాభాల తీపి పంచిన చీనీ ఇప్పుడు చేదెక్కింది. మంచి ధర కోసం వారాలు, నెలల తరబడి కాయలు కోయకుండా ఎదురుచూసినా ఫలితం కానరాకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. మార్కెటింగ్ పరిస్థితి దారుణంగా ఉన్నా కూటమి సర్కారు నుంచి స్పందన లేకపోవడంతో రైతుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. ధరలు మరింత పతనం గతంలో ఎన్నడూ లేని విధంగా దారుణ పరిస్థితులు రైతుల్లో తీవ్ర ఆందోళన గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి చీనీ రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. రంజాన్, ఉగాది, హోలీ పండుగలు అన్నీ వెళ్లినా... ధరలు మాత్రం పెరగడం లేదు. తోటల్లోనే టన్ను రూ.25 వేలకు మించి అడగడం లేదు. దానికి డబుల్ సూట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే నెల పాటు కాయలు కోయకుండా ధరల కోసం ఎదురుచూసినా ఫలితం కానరాలేదు. నాకు ఏడెకరాల చీనీ తోట ఉంది. దిగుబడి బాగానే ఉన్నా ధరలు చూస్తే ఏం చేయాలో అర్థం కావడం లేదు. టన్ను రూ.40 వేలు అటుఇటుగా పలికితే తప్ప గిట్టుబాటు కాదు. గతంలో కన్నా ఈ సారి చీడపీడల తాకిడి ఎక్కువ కావడంతో పురుగుల మందుల ఖర్చు బాగా పెరిగింది. – కుళ్లాయిరెడ్డి, చీనీ రైతు, కునుకుంట్ల గ్రామం, తాడిమర్రి మండలం -
ఉయ్యాలసేవలో చౌడేశ్వరీదేవి
అమడగూరు: చౌడేశ్వరీదేవి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం శీతిరెడ్డిపల్లి గ్రామస్తులు అమ్మవారికి ఉయ్యాలసేవ నిర్వహించారు. గ్రామ పెద్దలు, యువకులు ఆలయం నుంచి అమ్మవారిని డప్పు వాయిద్యాల నడుమ బెళ్ల్లీ రథంలో ఊరేగింపుగా గ్రామానికి తీసుకొచ్చారు. అనంతరం పురవీధుల గుండా అమ్మవారిని ఊరేగించారు. యువత రంగునీళ్లు జల్లుకొంటూ సంతోషంగా ముందుకు సాగారు. తర్వాత కోదండరామస్వామి ఆలయ ప్రాంగణంలోకి అమ్మవారిని తీసుకొచ్చారు. అనంతరం ఈ ఏడాది నూతనంగా తయారు చేయించిన ఉయ్యాలలో అమ్మవారిని కొలువుదీర్చి పాటలు పాడుతూ ఊయలూపారు. మహిళలంతా ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు. రాత్రి ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బంధువర్గాలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఉత్సవాల్లో భాగంగా సోమవారం సూర్యప్రభ ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త పొట్టా పురుషోత్తమరెడ్డి పేర్కొన్నారు. -
కొల్హాపురి మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
● అర్ధరాత్రి అమ్మవారికి జలధి ఉత్సవం ● నేడు బ్రహ్మ రథోత్సవం రొళ్ల: చారిత్రక రత్నగిరిలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజులపాటు ఉత్సవాలు సాగుతాయి. తొలిరోజు సాయంత్రం అమ్మావారి మూలవిరాట్తో పాటు ఉత్సవ విగ్రహానికి అంకురార్పణ, కుంకుమార్చన, అభిషేక పూజలు చేశారు. అనంతరం పట్టు వస్త్రాలు, వెండి, బంగారు ఆభరణాలు, పూలతో అలంకరించి మహామంగళహారతి ఇచ్చారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో వేదపండితుల సమక్షంలో గణపతి పూజ చేసి కలశ స్థాపన చేశారు. రాత్రి అమ్మావారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయ ప్రాంగణం చుట్టూ మేళతాళాలతో పురవీధుల్లో ఊరేగించారు. తిరిగి ప్రధాన ఆలయ ప్రాంగణంలో పట్టం కూర్చోబెట్టి అర్ధరాత్రి అక్కడి నుంచి సమీపాన గల పాలబావి వద్దకు మేళతాళాల నడుమ చేరుకున్నారు. ఉత్సవ విగ్రహానికి ప్రధాన అర్చకులు గంగాజలంతో శుద్ధి చేసి పట్టువస్త్రాలు, గాజులు, వడి బియ్యం కట్టి, పూలు, పండ్లు ఉంచి, హారతి ఇచ్చిన తర్వాత బావిలోకి నైవేద్యం సమర్పించారు. పాలబావిలో అమ్మవారికి గంగా జలంతో శుద్ధి చేసిన అనంతరం పూజలు నిర్వహిస్తే పిల్లలు లేని వారికి సంతాన భాగ్యం, పెళ్లికాని యువతులకు పెళ్లిల్లు జగురుతాయని, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి స్వస్థత చేకూరుతుందని భక్తుల నమ్మకం. చుట్టు పక్కల గ్రామస్తులతో పాటు కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో రత్నగిరి సంస్థానం దొర రంగప్పరాజు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నేడు బ్రహ్మరథోత్సవం రత్నగిరిలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవి ఉత్సవాల్లో సోమవారం మధ్యాహ్నం బ్రహ్మరథోత్సవం నిర్వహించనున్నట్లు రాజవంశీకుడు దొర రంగప్పరాజు, గ్రామ పెద్దలు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని వారు కోరారు. -
సాగునీరు అందించడంలో ఘోర వైఫల్యం
చిలమత్తూరు: ఆయకట్టుకు సాగునీరందించడంలో కూటమి ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక మండిపడ్డారు. ఆదివారం హిందూపురంలోని ఆంబేడ్కర్ భవనంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ఆద్వర్యంలో ‘సాగునీటి ప్రాజెక్ట్లు – విభజన హామీలు’ అంశంపై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్ దీపిక మాట్లాడుతూ హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పనులు చేపట్టడం ద్వారా ఆయకట్టు పరిధిలోని భూములకు సమాధి కడుతున్నారన్నారు. రానున్న రోజులు నీటి కోసం యుద్ధాలు చేయాల్సి వస్తుందన్నారు. సాగునీటి ప్రాజెక్ట్లను కాపాడుకోవడం, వాటికి నీటిని తెప్పించడం కోసం రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం పలువురు ప్రముఖులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విభజన హామీలను తుంగలో తొక్కాయన్నారు. రైతులకు మేలు చేకూర్చే సాగునీటి ప్రాజెక్ట్లపై నిర్లక్ష్యంగా ఉన్నాయన్నారు. ప్రాజెక్ట్ల కోసం వచ్చిన నిధులను మళ్లిస్తూ రాష్ట్ర భవిష్యత్ను ప్రశ్నార్థకంలోకి నెడుతున్నారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వాలు చిత్తశుద్దితో పనిచేయాలని హితవు పలికారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు శ్రీరాములు, చైతన్య గంగిరెడ్డి, శ్రీనివాసులు, శంకరయ్య, సిద్దారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నేతల అక్రమ నిర్బంధం సాక్షి టాస్క్ ఫోర్స్:కేసుతో సంబంధం లేకపోయినా ముగ్గురు వైఎస్సార్సీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం, రహస్య ప్రదేశంలో అక్రమంగా నిర్బంధించడం కలకలం రేపుతోంది. అధికార టీడీపీ నేతల డైరెక్షన్లోనే ఇదంతా సాగుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం హిందూపురం పట్టణంలోని ముద్దిరెడ్డిపల్లికి చెందిన మోహన్ అనే టీడీపీ కార్యకర్త మాజీ సీఎం వైఎస్ జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియో విడుదల చేయడాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. నిందితుడిపై కేసు నమోదు చేయాలని వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. అయితే టీడీపీ కార్యకర్త అనుచిత వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ కేసును అడ్డం పెట్టుకొని ఎటువంటి సంబంధం లేని వైఎస్సార్సీపీ బూత్ కమిటీ జిల్లా అధ్యక్షుడు వాల్మీకి లోకేష్, అంబేద్కర్ నవీన్, షేక్షా శుభకార్యంలో పాల్గొనేందుకు అనంతపురం జిల్లాకు వెళ్తుండగా శనివారం హిందూపురం టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి నిర్బంధించడం కలకలం రేపుతోంది. టీడీపీ నేతల ఒత్తిళ్ల మేరకే పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ ముగ్గురిని ఎక్కడికి తీసుకువెళ్లారు.. ఏమి చేయబోతున్నారో అని వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వీరి అక్రమ నిర్బంధంపై వైఎస్సార్సీపీ నేత వేణురెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అరెస్ట్ చేస్తే రిమాండ్కు తరలించాలని, అలా రహస్యంగా ఎక్కడో ఉంచడం ఏంటని ప్రశ్నించారు. వృద్ధ దంపతుల ఆత్మహత్య అనంతపురం: అనారోగ్యంతో మనస్తాపం చెందిన వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అనంతపురం త్రీటౌన్ సీఐ కే.శాంతిలాల్ తెలిపిన మేరకు.. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వీవర్స్ కాలనీ చెందిన దేవా శివానంద (70), దేవా శాంతమ్మ (60) దంపతులు. వీరికి దేవా గోపాల్, దేవా చంద్రశేఖర్ సంతానం కాగా, హిందూపురంలో కుమారులు ఒక చోట, తల్లిదండ్రులు మరో చోట నివాసం ఉంటున్నారు. ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా పనిచేసి పదవీ విరమణ పొందిన శివానందకు ఇటీవల షుగర్ ఎక్కువైంది.కిడ్నీ కూడా దెబ్బతినడంతో అనంతపురం సవేరా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అయినప్పటికీ ఆరోగ్యం కుదుటపడలేదు. శాంతమ్మ కూడా షుగర్ వ్యాధితో బాధపడేవారు. ఈ క్రమంలోనే ఈ నెల 11న దంపతులిద్దరూ ఇంటికి తాళం వేసి అనంతపురం చేరుకున్నారు. నగర సమీపంలోని నేషనల్ పార్కు వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయారు. గుర్తించిన స్థానికులు వెంటనే ఇద్దరినీ అనంతపురం ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించగా, చికిత్స ఫలించక శివానంద అదే రోజు ప్రాణాలు విడిచారు. శాంతమ్మ ఆదివారం మృతి చెందింది. -
ఉట్టిపడిన తమిళ సాంస్కృతిక శోభ
ప్రశాంతి నిలయం: సత్యసాయి సన్నిధిలో తమిళ సత్యసాయి భక్తులు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో భక్తకోటిని మైమరపించారు. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన తమిళనాడు సత్యసాయి యూత్ సభ్యులు శనివారం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం తమిళనాడు సత్యసాయి యూత్ బృందం సంగీత కచేరీ నిర్వహించింది. సత్యసాయిని కీర్తిస్తూ నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను ఆలరించింది. సాయంత్రం శివభక్తుడైన నందనార్ ఆధ్యాత్మిక చింతన, శివుడిపై అపారమైన భక్తిని వివరిస్తూ బాలవికాస్ చిన్నారులు ‘నందనార్’ పేరుతో నృత్య రూపకం ప్రదర్శించారు. శివుడి దర్శన భాగ్యం కోసం నందనార్ పరితపించిన తీరును చక్కగా వివరించారు. చివరకు నందనార్ భక్తికి మెచ్చిన శివుడు దర్శన భాగ్యం కల్పించిన తీరును కళ్లకు కట్టారు. అనంతరం తమిళ భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. -
మేమున్నామని.. మీకేం కాదని
రాప్తాడురూరల్: టీడీపీ నాయకుల చేతిలో హత్యకు గురైన రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కురుబ లింగమయ్య కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. ఈ నెల 8న వారి కుటుంబాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఆదేశాలతో బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఈ మేరకు శనివారం అనంతపురంలోని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి నివాసంలో లింగమయ్య భార్య రామాంజనమ్మ, కుమారులు హరి, శ్రీనివాసులుకు చెక్కును అందజేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి చేతుల మీదుగా చెక్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు రామగిరి ఆదిరెడ్డి, కాటిగానికాలువ జనార్దన్రెడ్డి, బిల్లే మంజునాథ్ పాల్గొన్నారు. చెక్కును అందజేస్తున్న మాజీ మంత్రి ఉషశ్రీచరణ్, తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి లింగమయ్య కుటుంబానికి వైఎస్సార్సీపీ అండ రూ. 5 లక్షల ఆర్థిక సాయం -
రమణీయం.. రథోత్సవం
తాడిమర్రి: చెన్నకేశవ స్వామి నామస్మరణతో తాడిమర్రి మార్మోగింది. లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి రథోత్సవం రమణీయంగా సాగింది. మరగాళ్ల విన్యాసాలు, కీలు గుర్రాల నృత్యాలు, చక్క భజన, కోలాటం ప్రదర్శిస్తూ భక్తులు రథం ముందు సాగుతుండగా...దేవేరులతో కలిసి రథంపై కొలువైన లక్ష్మీచెన్నకేశవుడు భక్తులకు దర్శనమిచ్చారు. యాగంతో ప్రారంభం.. ఆలయ అర్చకులు మామిళ్లపల్లి జయరామయ్యశర్మ, సంతోష శర్మ శనివారం ఉదయం బ్రహ్మ ముహూర్థంలో యాగం నిర్వహించి శ్రీవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను అందంగా అలంకరించిన రథంలో ఉంచారు. ఉదయం 9.30 గంటలకు రథోత్సవాన్ని ప్రారంభించారు. భక్తుల గోవింద నామస్మరణ మధ్య కన్యకాపరమేశ్వరి ఆలయం వరకు మడుగు తేరును లాగారు. అనంతరం సాయంత్రం 3.30 నుంచి భక్తాదులు గోవిందా...చెన్నకేశవస్వామి, వెంకటేశ్వర నామస్మరణ చేస్తూ తాడిమర్రి ప్రధాన వీధులలో రథాన్ని లాగారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు కొబ్బరి కాయలు సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ తాడిమర్రి చంద్రశేఖర్రెడ్డి, గ్రామపెద్దల ఆధ్వర్యంలో నిర్వహించిన రథోత్సవంలో మోదుగులకుంట, శివంపల్లి, మద్దుల చెరువు. నిడిగల్లు, పిన్నదరి, ఆత్మకూరు, పుల్లా నారాయణపల్లి, పెద్దకోట్ల, తదితర గ్రామాలతో పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఆలయ కమిటీ కమిటీ సభ్యులు అన్నదానం ఏర్పాటు చేశారు. అంగరంగ వైభవంగా లక్ష్మీ చెన్నకేశవస్వామి ఉత్సవాలు -
వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో చోటు
అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో ఉమ్మడి జిల్లా నుంచి ఐదుగురు నేతలకు చోటు దక్కింది. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కమిటీని పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరించారు. నూతనంగా నియమితులైన పీఏబీ సభ్యులను ప్రకటించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఉమ్మడి జిల్లా నుంచి మాజీ మంత్రులు డాక్టర్ సాకే శైలజానాథ్, మాలగుండ్ల శంకర్ నారాయణ, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య, ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వర రెడ్డి, అహుడా మాజీ చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్ కమిటీలో ఉన్నారు. క్రమశిక్షణ కమిటీ సభ్యుడిగా ప్రకాష్ రెడ్డి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వైఎస్సార్ సీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. జిల్లా నుంచి గతంలో ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వర రెడ్డి ఈ స్థానంలో ఉండేవారు. తాజాగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డికి అవకాశం కల్పించారు. వైభవం.. శ్రీగిరి రఽథోత్సవం పుట్టపర్తి టౌన్: పౌర్ణమిని పురస్కరించుకుని ఆనవాయితీ ప్రకారం శనివారం సాయంత్రం పట్టణంలో సత్యసాయి శ్రీగిరి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా అందంగా అలంకరించిన రథంలో సత్యసాయి చిత్రపటాన్ని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రశాంతి నిలయం ముఖద్వారం నుంచి రథాన్ని లాగుతూ ఊరేగింపుగా ప్రశాంతి నిలయం, విద్యాగిరి, గోకులం, ఎనుములపల్లి ,గణేష్ కూడలి, పెట్రోల్బంక్, చింతతోపు, గోవిందయ్యపేట, పెద్దబజార్ మీదుగా తిరిగి ప్రశాంతి నిలయానికి చేర్చారు. ఉత్సవంలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారితో పాటు విదేశీ భక్తులు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రేపు పీజీఆర్ఎస్ రద్దు పుట్టపర్తి టౌన్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని ఈ నెల 14వ తేదీ (సోమవారం) రద్దు చేశారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న శనివారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. తల్లిని తిట్టి.. కొడుకును కొట్టి.. ● రేషన్ డీలర్ నిర్వాకంధర్మవరం రూరల్: రావులచెరువు గ్రామంలో నాగేంద్రమ్మ తన కుమారుడు కార్తీక్తో కలిసి శనివారం రేషన్ కోసం స్టోర్కు వెళ్లారు. బియ్యం అందరికీ వేసేశామని, ఇప్పుడు వస్తే ఎలా అంటూ డీలర్ చెన్నారెడ్డి తన తల్లి నాగేంద్రమ్మను బూతులు తిడుతూ... తన చెంపచెల్లుమనిపించాడని కార్తీక్ తెలిపాడు. రేషన్ సక్రమంగా వేసేదిపోయి.. కార్డుదారులపై దురుసుగా ప్రవర్తించడమేంటని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. -
అట్టహాసం..చౌడేశ్వరీ ఉత్సవం
అమడగూరు: చౌడేశ్వరీ దేవి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు శనివారం కుంభకూడు కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ ఏడాది కూడా చీకిరేవులపల్లికి చెందిన పళ్లెం నరసింహప్ప, చంద్రకళ, అలాగే దాసరి శివప్ప, రాధమ్మ దంపతులతో పాటుగా తొగటవీర సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎప్పటిలాగే రాత్రి ముత్యాల జొన్నలతో వండిన కూడును ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి ఎదురుగా పెద్ద ఎత్తున కుంభం వలె రాశిగా పోసి పూల కుచ్చును ఏర్పాటు చేశారు. అనంతరం ఆనవాయితీ ప్రకారం జంతువులను బలిగా ఇచ్చారు. పూజలన్నీ ముగిసిన తర్వాత రుధిరంతో తడిసిన జొన్నల కూడును, పూలకుచ్చును తీసుకెళ్లడానికి భక్తులు పోటీపడ్డారు. ఈ కుంభకూడును తీసుకెళ్లి నివాస గృహాలపైన, పంటపొలాల్లో, పశువులపై చల్లితే ఎటువంటి కీడు జరగదని భక్తుల నమ్మకం. కుంభకూడు కార్యక్రమానికి వివిధ ప్రాంతాల భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఆకట్టుకున్న జ్యోతుల ఊరేగింపు.. కుంభకూడును పురస్కరించుకుని చీకిరేవులపల్లి తొగటవీర క్షత్రియ సంఘం సభ్యులతో కలసి ధర్మవరానికి చెందిన 20 మంది అమ్మవారికి జ్యోతులు సమర్పించారు. తొలుత ప్రత్యేకంగా తయారుచేసిన జ్యోతులతో బోనాలు తయారు చేసుకుని చీకిరేవులపల్లి వీధుల గుండా ఊరేగారు. అనంతరం జ్యోతులను తలమీద పెట్టుకుని అమ్మవారి ఖడ్గ పద్యాలు చదువుతూ, పాటలు పాడుకుంటూ అమడగూరుకు వెళ్లి సమర్పించారు. సీఐ నరేంద్రరెడ్డి, ఎస్ఐ మల్లికార్జునరెడ్డి, ఏఎస్ఐ వెంకటరాముడు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పురుషోత్తమరెడ్డి, కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తొలిరోజు కుంభకూడుకు కిక్కిరిసిన భక్తజనం -
‘టాప్’ లేపిన ఆటోడ్రైవర్ కుమార్తె
పుట్టపర్తి: ఇంటర్ ఫలితాల్లో జిల్లా ర్యాంకులు మారలేదు. గతంతో పోలిస్తే ఉత్తీర్ణత శాతంతో పాటు రాష్ట్ర ర్యాంకు కూడా తగ్గాయి. శనివారం ఉదయం ఫలితాలు విడుదల కాగా, ప్రథమ సంవత్సరం ఫలితాల్లో ఈసారి 57 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితంగా ప్రథమ సంవత్సరం ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో 22వ స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 11,173 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాయగా 6,368 మంది ఉత్తీర్ణత సాధించారు. గత సంవత్సరం 58 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అయితే వివిధ గ్రూపుల్లో ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు కార్పొరేట్, ప్రైవేట్కు పోటీ పడుతూ మార్కులు సాధించారు. సీనియర్ ఇంటర్లోనూ అంతే... ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో గతేడాది 76 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈ సారి రెండు శాతం పెరిగి 78కి చేరింది. దీంతో రాష్ట్రంలోనే జిల్లా 18వ స్థానంలో నిలిచింది. మొత్తం 8,952 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 6,986 మంది ఉత్తీర్ణులయ్యారు.ఒకేషనల్ కోర్సుల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి 2,457 మందికి గానూ 1,536 మంది పాసయ్యారు. మెరిసిన గ్రామీణ విద్యార్థులు.. ● కదిరి బాలుర ఉన్నత పాఠశాలలోని జూనియర్ కళాశాలలో చదువుతున్న ప్రకాశ్ ఎంపీసీ గ్రూపులో 961 మార్కులు సాధించాడు. ● కొత్తచెరువు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూపులో గారికోట క్షితిరెడ్డి 470 మార్కులకు గాను 450 మార్కులు సాధించి సత్తా చాటింది. ● లేపాక్షిలోని మహాత్మాజ్యోతిరావు పూలే ఏపీ గురుకుల పాఠశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 130 మంది పరీక్ష రాయగా, 109 (84 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 125 మంది పరీక్షలు రాయగా, 124 మంది (99.2 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం ఇంటర్ విద్యార్థి దివాకర్ (ఎంపీసీ) 984 మార్కులు, జి.శ్రీశాంత్ (బైపీసీ) 959 మార్కులు సాధించినట్టు ప్రిన్సిపాల్ సుందరరాజు తెలిపారు. ఫస్ట్ ఇయర్ టాపర్గా టేకులోడు విద్యార్థిని మేఘన 440 మార్కులకు గాను 435 మార్కులు సాధించిన విద్యార్థిని సీనియర్ ఇంటర్లో బిందుకు 980 మార్కులు 15 నుంచి పరీక్ష ఫీజు చెల్లించొచ్చు మే 12 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ధర్మవరం అర్బన్: ఇంటర్లో ఫెయిల్ అయిన విద్యార్థులు, ఇంప్రూవ్మెంట్ రాయాలనుకున్న విద్యార్థులు ఈనెల 15వ తేదీ పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ విద్య జిల్లా అధికారి రఘునాథ్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 22వ తేదీ వరకూ ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంటుందని, విద్యార్థులు తాము చదివే కళాశాలల్లోనే ఫీజు చెల్లించాలని సూచించారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 12 నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయన్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేయించాలనుకునే వారు ఈనెల 13వ తేదీ నుంచి www.bie.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రీకౌంటింగ్ ఫీజు ఒక పేపర్కు రూ.260, రీవెరిఫికేషన్ కోసం రూ.1,300 చెల్లించాల్సి ఉంటుందన్నారు. చిలమత్తూరు: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో మండల పరిధిలోని టేకులోడు మహాత్మాజ్యోతిబా పూలే బాలికల గురుకుల కళాశాల విద్యార్థిని మేఘన సత్తా చాటింది. గురుకుల కళాశాల విభాగంలో టాపర్గా నిలిచింది. రొద్దం మండలం కలిపి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ వేణుగోపాల్ కుమార్తె జి. మేఘన ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 440 (బైసీపీ) మార్కులకు గాను 435 మార్కులు సాధించి టాపర్గా నిలిచింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శోభారాణి, అధ్యాపకులు మేఘనను అభినందించారు. ఇక అదే కళాశాలలో జూనియర్ ఇంటర్కు చెందిన కె.భవాని (ఎంపీసీ) 470 మార్కులకు 462, దీప్తి 500 (ఎంఈసీ) మార్కులకు 484 మార్కులు సాధించారన్నారు. కాగా జూనియర్ ఇంటర్లో మొత్తం 162 మంది పరీక్షలకు హాజరు కాగా 132 మంది ఉత్తీర్ణత (81.48) సాధించారు. సీనియర్ ఇంటర్లోనూ 152 మంది (96 శాతం) ఉత్తీర్ణులయ్యారు బి. హర్షిత (ఎంపీసీ) 961, పి. హర్షిత (బైపీసీ) 957, భవ్యశ్రీ (సీఈసీ) 950, అక్షయ (ఎంఈసీ) 927 మార్కులు సాధించినట్టు ప్రిన్సిపాల్ తెలిపారు. సీనియర్ ఇంటర్లో టాపర్గా బిందు.. సీనియర్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో చిలమత్తూరు జూనియర్ కళాశాల విద్యార్థిని బిందు సత్తా చాటింది. చిలమత్తూరు మండల పరిధిలోని తుమ్మలకుంటకు చెందిన రైతు భాస్కర్రెడ్డి, సరితల కుమార్తె పూలకుంట బిందు ఎంపీసీలో 980 మార్కులు సాధించి టాపర్గా నిలిచింది. సామాన్య రైతు కుటుంబానికి చెందిన బిందు అసాధారణ ప్రతిభ కనబరిచి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతూ అత్యధిక మార్కులు సాధించింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ భీముడు నాయక్తో పాటు అధ్యాపకులు విద్యార్థిని బిందును అభినందించారు. ఇక ప్రథమ సంవత్సరం ఫలితాల్లో ఎం. శ్వేత (బైపీసీ) 422, శృతి (బైపీసీ) 405, పల్లవి (ఎంపీసీ) 416, సౌజన్య (హెచ్ఈసీ) 427 మార్కులు సాధించారు. అలాగే ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో శ్రావణి (బైపీసీ) 957, అక్షయ (బైపీసీ) 920 మార్కులు సాధించినట్టు ప్రిన్సిపాల్ తెలిపారు. ఇంజినీర్ అవుతా ఇంటర్ ఫలితాల్లో మంచి మార్కులు వచ్చి టాపర్గా నిలవడం చాలా సంతోషంగా ఉంది. మా నాన్న భాస్కర్రెడ్డి, అమ్మ సరితల ప్రోత్సాహంతో బాగా చదువుకున్నా. రానున్న రోజుల్లో బీటెక్ పూర్తి చేసి ఇంజినీర్ కావాలన్నది నా లక్ష్యం. మా అధ్యాపకులు బాగా ప్రోత్సహించారు. వారందరికీ నా కృతజ్ఞతలు. – పూలకుంట బిందు, ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని -
పేదలకు సేవ చేస్తే దేవునిగా కీర్తిస్తారు
బత్తలపల్లి: పేదల కోసం ఎవరైతే పాటుపడతారో వారిని గుండెల్లో పెట్టుకుని దేవునిలా కీర్తిస్తారని ఆర్డీటీ మహిళా సాధికారిత డైరెక్టర్ విశా ఫెర్రర్ అన్నారు. శనివారం మాల్యవంతం ఎస్సీ కాలనీవాసులు ఏర్పాటు చేసిన ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ కాంస్య విగ్రహాన్ని విశా ఫెర్రర్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరువు పీడిత ఉమ్మడి అనంతపురం జిల్లాలోకి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ అడుగుపెట్టినపుడు వెనక్కు వెళ్లిపోవాలని కొందరు అడ్డుపడ్డారన్నారు. పేదల సంక్షేమం కోసం ఆయన చేపట్టిన కార్యక్రమాలు, వివిధ రంగాల్లో ప్రోత్సహించిన తీరును చూసి దేవుడని కొనియాడుతున్నారని గుర్తు చేశారు. మనం ఒకరికి సాయం చేయాలన్న ఆశయంతో ముందుకు వెళ్లారని, ఆయన బాటలోనే పలువురు ఈరోజు ముందుకు వస్తున్నారని తెలిపారు. మాల్యవంతంలో పలువురు ఆర్డీటీ సహకారంతో అభివృద్ధి సాధించారని వివరించారు. అలాంటి వారందరూ కలిసిమెలిసి ఉండి ఆర్డీటీ, ప్రభుత్వం అందించే పోత్రాహకాలను పొందుతూ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. అంతకు ముందు విశా ఫెర్రర్కు ఎస్సీ కాలనీ వాసులు ఘనస్వాగతం పలికారు. ఆర్డీటీ సహకారంతో ఉన్నత చదువులు చదివి బెంగళూరులో సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న తమ పిల్లల తరఫున తల్లిదండ్రులు ఓబుళమ్మ, కుళ్లాయప్ప ‘స్పందించు– సాయం అందించు’ కార్యక్రమానికి రూ.50 వేలను విశా ఫెర్రర్కు అందించారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో రీజనల్ డైరెక్టర్ ప్రమీల, ఏటీఎల్ క్రిష్ణ, ఎస్టీఎల్ వెంకటేష్, కావేరి, మధు, సీఓ నాగరాజు, సీబీటీ వీరనారప్ప, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
కారు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
● కుక్కను తప్పించే క్రమంలో ఘటన పరిగి: కారు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మడకశిర మండలం మణూరు గ్రామానికి చెందిన లక్ష్మీనరసింహ(28) కారు బాడుగకు నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. గత శుక్రవారం బెంగళూరుకు బాడుగ వెళ్లాడు. అక్కడి నుంచి విజయ్కుమార్, బాలచంద్ర అనే ఇద్దరు మిత్రులతో కలిసి మడకశిరకు తిరుగుపయనమయ్యాడు. శనివారం వేకువజామున మూడు గంటలు దాటాక పరిగి వద్దకు చేరుకున్నారు. మడకశిర వైపు వెళ్తుండగా ఉన్నపళంగా కుక్క అడ్డుగా రావడంతో దాన్ని తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న నాగులకట్టను ఢీకొట్టి ఆ పక్కనే ఉన్న రేకుల షెడ్డులోకి దూసుకెళ్లింది. లక్ష్మీనరసింహతో పాటు ఇద్దరు మిత్రులు గాయపడ్డారు. వీరిని స్థానికులు 108 వాహనంలో హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే లక్ష్మీనారాయణ మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. మిగిలిన ఇద్దరు చికిత్స పొందుతున్నారు. కారులో ప్రయాణిస్తున్న విజయ్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్కానిస్టేబుల్ శ్రీనివాసులు తెలిపారు. కాగా లక్ష్మీనరసింహకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సస్పెండైన ఆర్ఐపై కేసు కదిరి అర్బన్: సోషల్ మీడియాలో మాటలు వక్రీకరించి పోస్టులు పెట్టి పోలీసులకు, ఇతరులకు మధ్య శాంతియుత వాతావరణం దెబ్బతినేలా చేస్తున్నాడని కానిస్టేబుల్ గోవర్దన్ ఫిర్యాదు మేరకు ఓడీసీలో సస్పెండైన ఆర్ఐ మున్వర్బాషాపై కదిరి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ మేరకు సీఐ నారాయణరెడ్డి శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. క్రిమినల్ కేసుల్లో నిందితునిగా ఉన్న మున్వర్బాషా హైకోర్టు బెయిల్ ఉత్తర్వులతో మార్చి 24న పట్టణ పోలీస్స్టేషన్కు హాజరయ్యారు. ఆ సమయంలో తనపై కేసులు పెట్టినవారంతా దొంగలే అంటూ కానిస్టేబుల్ గోవర్దన్, సీఐ నారాయణరెడ్డిని ఉద్దేశించి మీరు ఇక్కడ ఉద్యోగం ఎలా చేస్తారో చూస్తాను అని బెదిరింపులకు పాల్పడ్డారు. అనంతరం సోషల్ మీడియాలో వక్రీకరించిన మాటలతో పోస్ట్ పెట్టి పోలీసులు, ఇతరుల మధ్య శాంతియుత వాతావరణం దెబ్బతినేలా చేశారని పేర్కొన్నారు. వక్రీకరించిన వాయిస్ను వైరల్ చేస్తున్న వారందరికీ చట్ట ప్రకారం నోటీసులిచ్చి విచారణ చేస్తామని సీఐ తెలిపారు. వృద్ధునిపై పోక్సో కేసు ముదిగుబ్బ: మండల కేంద్రం ముదిగుబ్బలో ఓ వృద్ధునిపై పోక్సో కేసు నమోదైంది. శనివారం ఇంటి సమీపంలో ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికను వృద్ధుడు దగ్గరకు తీసుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. అనంతరం విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వృద్ధునిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వృద్ధునిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ శివరాముడు తెలిపారు. -
పల్లె అనుచరులతో ప్రాణహాని
పుట్టపర్తి టౌన్: మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఓ దినపత్రిక పాత్రికేయుడు ఉద్దండం చంద్రశేఖర్ పుట్టపర్తి అర్బన్ పోలీస్ స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు. పల్లెకు వ్యతిరేకంగా వార్తలు రాస్తావా అంటూ ఆయన అనుచరుడు, టీడీపీ నల్లమాడ మండల నాయకుడు సలామ్ తనపై దాడులు చేస్తామని, ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిస్తూ పంపిన వీడియోను పరిశీలించి, తనకు రక్షణ కల్పించాలని కోరారు. నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆగడాల గురించి పత్రికలో ప్రచురిస్తున్నందుకు తనను టార్గెట్ చేశారని పేర్కొన్నారు. వార్తలు రాయడం ఆపకపోతే నియోజకవర్గంలో తిరగకుండా చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పీఆర్ఓ సంతోష్రెడ్డి నుంచి కూడా వాట్సాప్ గ్రూప్ ద్వారా బెదిరింపు మెసేజీలు వచ్చాయని పేర్కొన్నారు. ఉద్దండం వెంట వచ్చిన వారిలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు పుల్లయ్య, ప్రధాన కార్యదర్శి బాబు, సాక్షి స్టాఫర్ రాజేష్, జర్నలిస్టులు మురళి, రమణ, సోముశేఖర్ తదితరులు ఉన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన పాత్రికేయుడు -
హోరాహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు
తాడిమర్రి: మండల కేంద్రం తాడిమర్రిలో శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శనివారం డీసీఎంఎస్ మాజీ చైర్మన్ తాడిమర్రి చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో రాతి దూలం లాగుడు పోటీలు నిర్వహించారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఎనిమిది జతల వృషభాలు పాల్గొన్నాయి. హోరాహోరీగా సాగిన పోటీల్లో అనంతపురం జిల్లా యాడికి మండలం యంగన్నగారిపల్లి వాసుదేవరెడ్డి వృషభాలు నిర్ణీత 20 నిమిషాల్లో 1,550 అడుగులు లాగి ప్రఽథమ స్థానంలో నిలిచాయి. సోమలదొడ్డి గ్రామానికి చెందిన రామసుబ్బారెడ్డి వృషభాలు 1,500 అడుగులు లాగి ద్వితీయ స్థానంలో నిలిచాయి. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన నాగరాజు యాదవ్ వృషభాలు 1,250 అడుగులు లాగి తృతీయ స్థానంలో నిలిచాయి. అనంతరం విజేత వృషభాల యజమానులకు ప్రథమ బహుమతి కింద రూ.70వేలు, ద్వితీయ బహుమతి కింద రూ.50 వేలు, తృతీయ బహుమతి కింద రూ.30 వేలుతో పాటు నాలుగో బహుమతి కింద రూ.20వేలు, ఊదో బహుమతి కింద రూ.10 వేలు చొప్పున అందజేశారు. ముదిగుబ్బ రూరల్ సీఐ శ్యామరావు, ఎస్ఐ క్రిష్ణవేణి తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువ నాయకులు తాడిమర్రి మనోజ్రెడ్డి, చెన్నారెడ్డి, ఎంపీపీ పాటిల్ భువనేశ్వర్రెడ్డి, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు విజయభాస్కర్రెడ్డి, వైటీ చంద్రశేఖర్రెడ్డి, సాయినాథ్రెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు. -
అగ్ని ప్రమాదం.. అప్రమత్తతే ప్రధానం
పుట్టపర్తి టౌన్: వేసవిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరుగుతుంటాయి. చిన్న నిప్పు రవ్వ పడినా మంటలు వ్యాపిస్తాయి. ఆకతాయి చేష్టలకు, ఏమరపాటుకు గడ్డి వాములు, అడవులు దగ్ధమతున్నాయి. ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు తగ్గించి ప్రాణాలు, ఆస్తులను కాపాడేందుకు అగ్నిమాపక శాఖ మాక్డ్రిల్స్ నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించనున్నారు. 14న అమరవీరులకు నివాళి, 15ప బహిరంగ ప్రదేశాలు, కూడళ్లు అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు కల్పిస్తారు. 16న అపార్టుమెంట్లు, 17న విద్యాసంస్థలు, 18న గ్యాస్ గోడౌన్లు, ఆయిల్ ఫాంలు, 19న ఆస్పత్రుల్లో అవగాహన కల్పిస్తారు. 20న అన్ని వర్గాల ప్రజలకు ఫైర్ సేఫ్టీపై వర్క్షాప్ నిర్వహించి వారోత్సవాలు ముగిస్తారు. అందుబాటులో ఫైర్ సేవలు.. జిల్లాలో పుట్టపర్తి, ధర్మవరం, కదిరి, పెనుకొండ, హిందూపురం, మడకశిర అగ్నిమాపక కార్యాలయాలు ఉన్నాయి. ఆరుగురు ఫైర్ అధికారులతో పాటు జిల్లాలో 100 మంది సిబ్బంది, 24 మంది హోంగార్డులు ఉన్నారు. ప్రమాదాల నివారణకు అవసరమైన అడ్వాన్స్డ్ వాటర్ టెండరింగ్ ఫైర్ ఇంజిన్, రెస్క్యూ ఫైర్ ఇంజిన్, ట్రూప్ క్వారియర్, ఫైర్ బుల్లెట్ బైక్, మిస్ట్ జీప్లు అందుబాటులో ఉన్నాయి. కాలం చెల్లిన ఇంజిన్ల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. జిల్లాలో ఒక అగ్నిమాపక అధికారి, ఇద్దరు సహాయక అధికారులు జిల్లా వ్యాప్తంగా వాహనాలను అగ్నిమాపక అధికారి కాని, సహాయక అధికారి గాని తనిఖీ చేస్తుంటారు. అప్రమత్తంగా ఉండాలని ప్రమాదాలు ఎదుర్కొవడానికి సిధ్ధంగా ఉండాలని అధికారులకు సూచనలు సలహాలు ఇస్తున్నారు. జాగ్రత్తలు పాటించాలి.. చిన్న పిల్లలకు అగ్గిపెట్టెలు, లైటర్లు, టపాసులు వంటివి ఇవ్వకూడదు. దుస్తులకు నిప్పు అంటుకుంటే పరిగెత్తకుండా దుప్పటి చుట్టుకోవాలి. వంట గదిలో కిరోసిన్, డీజిల్, పెట్రోల్, అదనపు గ్యాస్ సిలిండర్ వంటివి ఉంచకూడదు. మండుతున్న పొయ్యిపై వస్తువులను దూరం నుంచి అందుకోవాలని ప్రయత్నించకూడదు. మండుతున్న స్టవ్పై కిరోసిన్ పోయడం ప్రమాదకరం. చెడిపోయిన గ్యాస్ ట్యూబ్ స్థానంలో ఐఎస్ఐ మార్కుగల కొత్త ట్యూబ్ అమర్చాలి. రేపటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన మాక్డ్రిల్స్కు అగ్నిమాపక శాఖ సర్వం సిద్ధం ప్రణాళికతోనే ప్రమాదాల నివారణ ఎండలు మండుతున్న నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జాగ్రత్తలు కూడా తప్పకుండా పాటించాలి. ప్రణాళికతో అగ్నిప్రమాదాలు నివారించవచ్చు. సిబ్బందితో పాటు అవసరమైన పరికరాలు, యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. అగ్నిమాపక వారోత్సవాల ద్వారా ప్రజలను అప్రమత్తం చేసేలా అవగాహన కార్యక్రమాలు చేపడతాం. – హేమంత్రెడ్డి, డీఎఫ్ఓ -
క్వింటా ఎండుమిర్చి రూ.14 వేలు
హిందూపురం అర్బన్: ఎండుమిర్చి ధర తగ్గింది. శుక్రవారం హిందూపురం మార్కెట్లో క్వింటా గరిష్టంగా రూ.14 వేలు మాత్రమే పలికింది. మార్కెట్కు 47.70 క్వింటాళ్ల మిర్చి రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలంపాట నిర్వహించారు. ఇందులో క్వింటా ఎండు మిర్చి గరిష్టంగా రూ.14 వేలు, కనిష్టంగా రూ.7 వేలు, సరాసరిన రూ.12,600 ప్రకారం ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. మార్కెట్కు వచ్చే సరుకు బాగా తగ్గుతున్నట్లు ఆయన వెల్లడించారు. జీవీఎస్ పాఠశాల ఘటనపై అధికారుల విచారణ ధర్మవరం: పట్టణంలోని జీవీఎస్ పాఠశాలలో ముగ్గురు విద్యార్థులను ఉపాధ్యాయురాలు చెప్పుతో కొట్టిన ఘటనపై శుక్రవారం ఎంఈఓలు రాజేశ్వరిదేవి, గోపాల్నాయక్ విచారణ చేపట్టారు. పాఠశాలకు వెళ్లిన వారు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాన్ని విచారించారు. అనంతరం ఎంఈఓలు విలేకరులతో మాట్లాడారు. జీవీఎస్ పాఠశాలలో గతంలో జరిగిన ఘటనలు, తాజాగా విద్యార్థులను చెప్పుతో కొట్టిన ఘటనపై సమగ్ర నివేదిక రూపొందించి జిల్లా విద్యాశాఖాధికారికి పంపిస్తామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులను కొట్టడం, తిట్టడం, లైంగిక వేధింపులకు గురిచేయడం విద్యా హక్కు చట్టం ప్రకారం నేరమన్నారు. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎంఈఓలు హెచ్చరించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పనిచేస్తాయి ప్రశాంతి నిలయం: నేడు రెండో శనివారం అయినప్పటికీ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ కార్యాలయాలు పనిచేస్తాయని జిల్లా రిజిస్టార్ కృష్టకుమారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 11 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని సబ్ రిజిస్టార్ కార్యాలయాలు, జిల్లా రిజిస్టార్ కార్యాలయాలు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ కార్యాలయాలు పని చేస్తాయన్నారు. ప్రజలు సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. బడుగుల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే ● జయంతి వేడుకల్లో కలెక్టర్ టీఎస్ చేతన్ పుట్టపర్తి టౌన్/ప్రశాంతి నిలయం: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన జ్యోతిరావ్ పూలే ఆయా వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచారని కలెక్టర్ టీఎస్ చేతన్ కొనియాడారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పుట్టపర్తిలోని అబ్దుల్ కలాం షాదీమహల్లో జ్యోతిరావ్ పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమాధికారి నిర్మలాజ్యోతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి కలెక్టర్ టీఎస్ చేతన్ ముఖ్య అతిథిగా హాజరై పూలే చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమానత్వం కోసం, సామాజిక వివక్షపై పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావ్పూలే అన్నారు. విద్యా వికాసంతోనే వివక్ష నిర్మూలన సాధ్యమని నమ్మిన గొప్ప వ్యక్తి జ్యోతిరావ్ పూలే అన్నారు. అలాంటి వ్యక్తి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని యువత ముందకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఎస్పీ విజయకుమార్, ఎల్డీఎం రమణమూర్తి, కురుబ సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసులు, వాల్మీకి సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులుతోపాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో వేడుకలు.. మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంత వేడుకలు శుక్రవారం కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి కలెక్టర్ చేతన్, పలువురు అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే జిల్లా పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్పీ రత్న పూలే చిత్రపటానికి పూల మాల వేసి పుష్పాంజలి ఘటించారు. -
బీసీల ద్రోహి చంద్రబాబు
పరిగి: ‘‘ఓట్ల కోసం బీసీ జపం చేసే చంద్రబాబు, కూటమి పార్టీల్లోని నేతలు ఏనాడూ బీసీల అభ్యున్నతికి కృషి చేయలేదు. పైగా బీసీలను అణగదొక్కేందుకు, అంతంచేందుకు ప్రయత్నించారు. కానీ బీసీలంటే ఎనలేని ప్రేమ చూపే జగనన్న బీసీ అంటే బ్యాక్బోన్ క్యాస్ట్ అని చెప్పడంతో పాటు తన హయాంలో పదవులిచ్చి పాలనలో భాగస్వామ్యం చేశారు. రాష్ట్రంలో బీసీ పక్షపాతి ఎవరైనా ఉన్నారంటే అది జగనన్నే. అందుకే కురుబ లింగమయ్య హత్యతో ఆయన చలించిపోయారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చారు. ఇలా చేయగలిగిన కూటమి నేత ఎవరైనా ఉన్నారా..కనీసం బీసీ మంత్రిగా ఉన్న సవిత అయినా ఆ కుటుంబాన్ని పరామర్శించరా’’ అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ ప్రశ్నించారు. శుక్రవారం ఆమె మండలంలోని కొడిగెనహళ్లి పంచాయతీ పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డిపల్లిలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల రామగిరి మండలంలో పాపిరెడ్డిపల్లిలో టీడీపీ గూండాల చేతిలో గాయపడి మృతి చెందిన కురుబ లింగమయ్య కుటుంబాన్ని కూటమి పార్టీల్లోని ఒక్క బీసీ ప్రజాప్రతినిధి అయినా కనీసం పరామర్శించారా.. అని ప్రశ్నించారు. పైగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు తామంతా బాధిత కుటుంబానికి అండగా నిలిబడితే దాన్ని కూడా తప్పుపడుతూ విమర్శలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి పార్టీల నేతలకు బీసీలపై ఉన్న ప్రేమకు ఈ ఘటనే నిదర్శనమన్నారు. బీసీ మంత్రిగా ఉన్న కురుబ సామాజిక వర్గానికి చెందిన సవితకు హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించే తీరక లేదా అని ప్రశ్నించారు. ఎంపీపీ పదవి కోసం దిగజారి రాజకీయం రామగిరి ఎంపీపీ ఎన్నికలోనూ కూటమి నాయకులు దిగజారి రాజకీయం చేశారన్నారు. వైఎస్సార్సీపీ తరఫున 9 మంది గెలిస్తే ఒక్క ఎంపీటీసీతో ఎంపీపీ సీటు కైవసం చేసుకునేందుకు మంత్రి సవిత, ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ వ్యవహరించిన తీరు చూసి సభ్య సమాజం తలదించుకుంటుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రామగిరి ఎస్ఐ సుధాకర్యాదవ్ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని అధికారులు గమనించి మసలుకోవాలని సూచించారు. తమ స్థాయి గుర్తించి మాట్లాడితే అందరికీ మంచిదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ నరసింహమూర్తి పాల్గొన్నారు. లింగమయ్య మృతిపై నేటికీ స్పందించక పోవడం దుర్మార్గం బాధిత కుటుంబాన్ని జగనన్న పరామర్శించినా తట్టుకోలేకపోతున్నారు లింగమయ్య హత్యను కూటమి పార్టీల్లోని బీసీ నేతలూ ఖండించాలి మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ -
పంగుణి ఉత్సవం..ఆధ్యాత్మిక సౌరభం
హిందూపురం: దశాబ్దాల క్రితం వచ్చి హిందూపురంలో స్థిరపడిన తమిళ, కేరళీయులు శుక్రవారం నిర్వహించిన పంగుణి ఉత్సవంతో పట్టణంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివెరిసింది. తమ ఆరాధ్య దైవమైన సుబ్రహ్మణేశ్వర స్వామి రథయాత్రను కేరళ, తమిళీయులు ఎంతో వైభవంగా నిర్వహించారు. ఉత్తర ఫాల్గుణి నక్షత్రాన్ని పురస్కరించుకుని పళనీ క్షేత్రంలో సుబ్రహ్మణేశ్వరుడికి పెద్ద ఎత్తున ఉత్సవాలు చేస్తారు. అదేరోజు స్థానికంగా స్థిరపడిన తమిళ, కేరళీయులు కూడా పంగుణి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ క్రమంలో శుక్రవారం బెంగళూరు రోడ్డులోని పళనీనగర్, ఇందిరానగర్లో స్థిరపడిన వారంతా పంగుణి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలోని మూలవిరాట్ సుబ్రహ్మణేశ్వరస్వామికి విశేష పూజలు చేశారు. అనంతరం 14 రోజులుగా సుబ్రహ్మణ్యస్వామి మాలధరించిన వారంతా దవడల్లో శూలాలు గుచ్చుకుని, శరీరానికి కొక్కేలు తగిలించుకుని పుర వీధుల్లో ఊరేగింపుగా వెళ్లారు. మరికొందరు శరీరానికి గుచ్చుకున్న కొక్కేలతో విలక్కులు, ఆటోలను లాగారు. పళనీనగర్ నుంచి ఊరేగింపుగా బయలుదేరి బెంగళూరు రోడ్డు, చిన్నమార్కెట్, గాంధీ సర్కిల్, మెయిన్రోడ్డు గుండా పొట్టిశ్రీరాములు సర్కిల్, ఆర్పీజీటీ రోడ్డు, అంబేడ్కర్ సర్కిల్, మెయిన్ బజార్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకున్నారు. ప్రధాన వీధుల్లో ఊరేగింపుగా వస్తున్న భక్తులు, ప్రజలకు దాతలు చల్లని నీరు, మజ్జిగ, పానీయాలు అందించారు. టూటౌన్ సీఐ అబ్దుల్ కరీం ఆధ్వర్యంలో పోలీసులు గట్టి పోలీస్ బందోబస్తు నిర్వహించారు. వైఎస్సార్సీపీ నాయకుల పూజలు.. సుబ్రమణేశ్వర షష్టి సందర్భంగా వైఎస్సార్సీపీ నియోజకవర్గ నాయకుడు గుడ్డంపల్లి వేణురెడ్డి పార్టీ నేతలతో కలిసి బెంగళూరురోడ్డులోని సుబ్రహ్మణేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. మాలాధారణ పూజల్లో పాల్గొన్నారు. వేణురెడ్డి వెంట పార్టీ నాయకులు మనోజ్, శివ, మురుగన్, భాస్కర్, నవీన్, హరి ఉన్నారు. -
ప్రతి ఒక్కరూ ఖండించాలి
కూటమి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను కాలరాస్తోంది. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డితో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం. పల్నాడు జిల్లాలో ఓ వృద్ధుడు పింఛను తీసుకునేందుకు వస్తే టీడీపీ నాయకులు దారుణంగా హత్య చేశారు. ఈ ఉదంతాన్ని సాక్షి పత్రిక ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించింది. దీన్ని ఓర్వలేక ఎడిటర్పై కేసు నమోదు చేయడం దారుణం. ఈ చర్యను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ధర్మవరం -
జర్నలిస్ట్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి
● పెనుకొండలో జర్నలిస్టుల డిమాండ్ పెనుకొండ రూరల్: ‘సాక్షి’ ఎడిటర్ ఆర్. ధనుంజయరెడ్డితో పాటు మరో ఆరుగురు జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని పెనుకొండ జర్నలిస్ట్లు డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై కూటమి ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసులను నిరసిస్తూ శుక్రవారం పెనుకొండలోని పలువురు జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఏఓ గిరిధర్కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ.. పల్నాడు జిల్లాలో జరిగిన ఓ హత్యకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాలతో ‘సాక్షి’ వార్త ప్రచురించిందన్నారు. దీన్ని సహించలేని టీడీపీ నేతలు జర్నలిస్టులపై కేసులు పెట్టారన్నారు. ఇది ముమ్మాటికీ పత్రికాస్వేచ్ఛపై దాడేనన్నారు. అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సాక్షి జర్నలిస్టులు మల్లికార్జున, గోవిందు, జాకీర్, మురళీ (సాక్షి టీవీ), రామకృష్ణ (వార్త), ఆదినారాయణ (విశాలాంధ్ర), రామాంజి (సీమవార్త), హరి (రాజ్ న్యూస్), ఉదయ భాను (హెచ్ఎం టీవి), మహేష్ (ఆర్టీవీ) తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ కేసులు పత్రికా స్వేచ్ఛను హరించలేవు ●
● చిలమత్తూరులో పాత్రికేయుల నిరసన చిలమత్తూరు: సాక్షి ఎడిటర్ ఆర్. ధనుంజయరెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్షతో బనాయించిన కేసు అక్రమమని పాత్రికేయులు మండిపడ్డారు. నిజాలను నిష్పక్షపాతంగా ప్రచురించే పత్రికలను అణచివేయాలని చూడటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డితో పాటు మరో ఆరుగురు పాత్రికేయులపై నమోదు చేసిన అక్రమ కేసులను కొట్టివేయాలని డిమాండ్ చేశారు. అక్రమ కేసులు పత్రికా స్వేచ్ఛను హరించలేవన్నారు. ఉన్నవి ఉన్నట్టు రాస్తే ఇలా కేసులు బనాయించి ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లేలా చేస్తారా అంటూ ప్రశ్నించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ జగన్నాథ్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మండల పాత్రికేయ సంఘం అధ్యక్షుడు గంగరాజు, ఆంజనేయులు(ఆంధ్రప్రభ), శంకర్ (ప్రజాశక్తి), సురేంద్రరెడ్డి( ది జర్నలిస్ట్) విశ్వనాథ్(బిగ్ టీవీ), నాగార్జున(కాకతీయ) నారాయణస్వామి( సూర్య న్యూస్), రామాంజనేయులు, వెంకటేష్(ఆర్టీఐ) తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ కేసులు సరికాదు
నిజాన్ని నిర్భయంగా వేలికి తీసే జర్నలిస్ట్లపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేయడం సరికాదు. ఇది పత్రికా స్వేచ్ఛను హరించడమే. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పాలకులే అందుకు విరుద్ధంగా వ్యవహరించడం దుర్మార్గం. కూటమి నియంతృత్వ పాలనలో రాష్ట్రంలోని జర్నలిస్టులకు భద్రత కరువైంది. ఇప్పటికై నా జర్నలిస్టులపై వేధింపులు, అక్రమ కేసులు ఆపాలి. లేకపోతే జర్నలిస్టులతో కలిసి ఈ ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తాం. – ఉషశ్రీచరణ్, జిల్లా అధ్యక్షురాలు, వైఎస్సార్ సీపీ -
ప్రజాస్వామ్యానికి ముప్పు
కూటమి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛపై హరిస్తోంది. నిజాలు నిర్భయంగా రాసే జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించి భయపెట్టాలని చూస్తోంది. నిజంగా ఇది దారుణం. పత్రికా స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్యానికే ముప్పు. ప్రజాస్వామ్యవాదులంతా ఇలాంటి చర్యలను ఖండించాలి. పాలకులు ఇప్పటికై నా మేల్కోవాలి. వెంటనే సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డితో పాటు మిగిలిన ఆరుగురు జర్నలిస్టులపై బనాయించిన కేసులను ఉపసంహరించుకోవాలి. – దుద్దుకుంట శ్రీధర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పుట్టపర్తి -
జగన్ను విమర్శించే స్థాయి నీకెక్కడిది?
ఉరవకొండ: జనంలో అత్యంత ప్రజాదరణ కలిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే స్థాయి రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్కు లేదని శాసనమండలి ప్రివిలైజ్ కమిటీ చైర్మెన్/ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి అన్నారు. వజ్రకరూరు మండలం కొనకొండ్లలోని తన స్వగృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో టీడీపీకి తొత్తులుగా మారిన కొందరు పోలీసులను ఉద్దేశించి తప్పు చేసిన పోలీసులైన చట్టం ముందు సమానమేనని, వారి యూనిఫాం తీసేయిస్తామని వైఎస్ జగన్ వ్యాఖ్యానిస్తే... దానిని కూటమి ప్రభుత్వం వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలుగా చంద్రబాబు, లోకేష్, పవన్కళ్యాణ్కు పటిష్ట భద్రతను అప్పటి సీఎం వైఎస్ జగన్ కల్పించారని గుర్తు చేశారు. ఈ అంశంపై అప్పట్లో ఒక్క ఆరోపణ కూడా లేదన్నారు. కూటమి ప్రభుత్వంలో అడుగడుగునా భద్రతా వైపల్యం కనిపిస్తోందన్నారు. వైఎస్ జగన్ పాపిరెడ్డిపల్లి పర్యటనలో 1,100 మంది పోలీసులను, 200 మందిని హెలిప్యాడ్ వద్ద ఏర్పాటు చేసినట్లుగా పేర్కొంటూ భద్రతా వైపల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కేవలం అభిమానులను, కార్యకర్తలను ఆపడానికి పోలీసులను మోహరించారు కానీ, మాజీ సీఎం భద్రతకు కాదనే విషయం క్షేత్ర స్థాయిలో బట్టబయలైందన్నారు. వైఎస్ భారతిపై ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఏ పార్టీలోనైనా మహిళల వ్యక్తిత్వాన్ని తప్పు పట్టేలావ్యాఖ్యలు చేయడం తగదని, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎస్ఐ సుధాకర్ యాదవ్పై ఎమ్మెల్సీ శివరామిరెడ్డి మండిపాటు తప్పు చేస్తే పోలీసులైనా చట్టం ముందు సమానమే నేర నిరూపణ అయితే యూనిఫాం తీసేసి శిక్ష అనుభవించాల్సిందే -
కలల సాకారానికి తొలిమెట్టు.. ఈ–సెట్
అనంతపురం: ఉన్నత కలలకు ఏపీ ఈ–సెట్ తొలిమెట్టుగా నిలుస్తోంది. పేరెన్నికగల కళాశాలల్లో బీటెక్, బీఈ పూర్తి చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అదే ఏపీ ఈఏపీసెట్ (ఎంసెట్) ద్వారా గణనీయమైన ర్యాంకు సాధిస్తే ఈ కలను సాకారం చేసుకోవచ్చు. అయితే ఈఏపీసెట్కు పోటీ అధికంగా ఉంటుంది. కానీ, మంచి కళాశాలల్లో ఇంజినీరింగ్ సీటు దక్కించుకునేందుకు ఏపీ ఈ–సెట్ మరో చక్కటి మార్గం. ఏపీ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఈ–సెట్)లో సత్తా చాటితే నేరుగా బీటెక్ సెకండియర్లో అడ్మిషన్ పొందవచ్చు. డిప్లొమా పూర్తి చేసిన వారు, బీఎస్సీ(మేథమేటిక్స్) పూర్తి చేసినవారు ఇందుకు అర్హులు. ఫార్మసీ కోర్సుల్లో సైతం అడ్మిషన్లు పొందడానికి ఈ–సెట్ దోహదపడుతుంది. యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలల్లోనూ సీట్లు దక్కించుకోవచ్చు. మొత్తం సీట్లలో 10 శాతం ఈ–సెట్ ర్యాంకర్లకు కేటాయిస్తున్నారు. దీంతో ఈ–సెట్ అనేది డిప్లొమా విద్యార్థులకు వరంలా మారింది. క్రేజీ కంప్యూటర్ సైన్సెస్.. ఇంజినీరింగ్లో కంప్యూటర్ సైన్సెస్కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో బీటెక్ కంప్యూటర్ సైన్సెస్ కోర్సుల్లో అడ్మిషన్ పొందాలంటే ఏపీఈఏపీ సెట్లో గణనీయమైన ర్యాంక్ను సాధించాల్సి ఉంటుంది. అదే డిప్లొమో కంప్యూటర్ సైన్సెస్ పూర్తి చేసిన వారు ఈ–సెట్ ద్వారా మంచి కళాశాలల్లో కంప్యూటర్ సైన్సెస్ కోర్సు దక్కించుకోవచ్చు. గతేడాది కంటే ఈ ఏడాది ఈ–సెట్ కంప్యూటర్ సైన్సెస్ బ్రాంచ్కు దరఖాస్తులు పెరగడమే ఇందుకు కారణం. లేటరల్ ఎంట్రీ ద్వారా అవకాశం.. ఇంజినీరింగ్ కోర్సులో లేటర్ ఎంట్రీ ద్వారా రెండో సంవత్సరంలోకి అడ్మిషన్ పొందడానికి అవకాశం కల్పిస్తూ నిర్వహిస్తున్న ఏపీ ఈ–సెట్–2025కు భారీగా దరఖాస్తులు అందాయి. ఈ ఏడాది మొత్తం 33,454 మంది దరఖాస్తు చేసుకున్నారు. అగ్రికల్చర్ ఇంజినీరింగ్ విభాగానికి–143, బీఎస్సీ(మేథమేటిక్స్) –41, సిరామిక్ టెక్నాలజీ–3, కెమికల్ ఇంజినీరింగ్ –290, సివిల్ ఇంజినీరింగ్ –2,874, కంప్యూటర్ సైన్సెస్–10,639, ఈఈఈ–5492, ఈసీఈ–9,024, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ –54, మెకానికల్ ఇంజినీరింగ్ –4,424, మెటలార్జీ –97, మైనింగ్–66, ఫార్మసీ విభాగానికి –307 చొప్పున మొత్తం 33,454 దరఖాస్తులు అందాయి. దరఖాస్తు చేసుకునేందుకు గడువును మరింత పెంచడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఈ నెల 12వ తేదీ వరకు రూ.వెయ్యి అపరాధ రుసంతో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే 17వ తేదీ వరకు రూ.2వేలు, 24వ తేదీ వరకు రూ.4వేలు, 28వ తేదీ వరకు రూ.10 వేల అపరాధ రుసుంతో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారికి మే 6వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. జేఎన్టీయూకు అవకాశం.. ఏపీ ఈ–సెట్ను ఇప్పటి వరకూ 8 దఫాలుగా నిర్వహించే అవకాశం జేఎన్టీయూ (ఏ)కు దక్కింది. 2015 నుంచి 2020 వరకు ఏపీ ఈసెట్ను రాష్ట్ర కన్వీనర్గా ప్రొఫెసర్ పీఆర్ భానుమర్తి , 2021లో ప్రొఫెసర్ సి. శశిధర్, 2024లో ప్రొఫెసర్ పీఆర్ భానుమూర్తి విజయవంతంగా నిర్వహించారు. తాజాగా ప్రొఫెసర్ దుర్గాప్రసాద్ను ఈసెట్ కన్వీనర్గా నియమించారు. ఇంజినీరింగ్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా సెకండియర్లోకి అడ్మిషన్ డిప్లొమా, బీఎస్సీ మ్యాథ్స్ విద్యార్థులకు సువర్ణ అవకాశం జేఎన్టీయూ(ఏ) ఆధ్వర్యంలో ఏపీ ఈసెట్ నిర్వహణ -
ఉద్యాన రైతులూ అప్రమత్తంగా ఉండండి
అనంతపురం అగ్రికల్చర్: వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు, పెను గాలులు, వడగండ్లు, అకాల వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో ఉద్యాన తోటలు సాగు చేస్తున్న రైతులు అప్రమత్తంగా ఉండాలని రెండు జిల్లాల ఉద్యానశాఖ అధికారులు జి.చంద్రశేఖర్, జి.ఫిరోజ్ఖాన్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రధానంగా పంట చేతికివచ్చే సమయం కావడంతో చీనీ, మామిడి, అరటి, బొప్పాయి, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అరటి, బొప్పాయి పంటలు నేలవాలకుండా సరైన పోట్లు ఏర్పాటు చేసుకుంటే నష్ట తీవ్రత బాగా తగ్గుతుందని తెలిపారు. తోట చుట్టూ వెలుపలి ప్రాంతంలో నీటి తడి ఇస్తే సుడిగాలి తీవ్రత బాగా తగ్గిపోతుందన్నారు. పెను గాలులకు దెబ్బతిన్న తోటల్లో వెంటనే కాయలు, గెలలు తొలగించి, కొమ్మలను బయట పడేయాలన్నారు. చీడపీడల బారి నుంచి రక్షించుకునేందుకు లీటర్ నీటికి 2.5 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి పిచికారీ చేయాలన్నారు. నిల్వ ఉన్న వర్షపు నీరు ఆవిరైన తర్వాత పైపాటుగా ఎకరాకు 10 కిలోల యూరియా చల్లుకోవాలన్నారు. తోటల చుట్టూ అవిశె, సుబాబుల్ లాంటి రక్షణ పంటలు వేసుకుంటే పెనుగాలుల బారి నుంచి పంటలను కాపాడుకోవచ్చన్నారు. అవకాశం ఉన్న రైతులు కొన్ని మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే వేసవి సమస్యల నుంచి గట్టెక్కవచ్చని పేర్కొన్నారు. -
రేపటి నుంచి కొల్హాపురి మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాలు
రొళ్ల: మండలంలోని రత్నగిరి గ్రామంలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాలు ఈ నెల 13న (ఆదివారం) సాయంత్రం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రత్నగిరి సంస్థాన రాజవంశీకుడు దొర రంగప్పరాజు శుక్రవారం సాయంత్రం వెల్లడించారు. ఆదివారం సాయంత్రం అమ్మవారి మూల విగ్రహంతో పాటు ఉత్సవ విగ్రహానికి అంకురార్పణ, కుంకుమార్చన, అభిషేక పూజలు నిర్వహించనున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వేదపండితుల సమక్షంలో గణపతి పూజ చేసి కలశ స్థాపనతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయన్నారు. అదే రోజు రాత్రి ఉత్సవ విగ్రహాన్ని గ్రామ పురవీధుల గుండా ఊరేగించి మధ్య రాత్రి అక్కడి నుంచి సమీపంలోని పాలబావి వద్దకు మేళతాళాలతో తీసుకెళ్లి గంగాజలంతో శుద్ధి చేసి పట్టువస్త్రాలు, గాజులు, వడి బియ్యం సమర్పించి, పూలు, పండ్లు నివేదించిన అనంతరం హారతి ఇచ్చి నైవేధ్యంగా బావిలోకి సమర్పిస్తామన్నారు. 13న జలధి ఉత్సవం, కలశస్థాపన, 14న బ్రహ్మరథోత్సవం, ధూళోత్సవం, 15న జలధి, కలశ ఉత్సవం, గంగపూజ, 16 నుంచి 19వ తేదీ వరకు జ్యోతుల ఉత్సవాలు, 20న అమ్మవారికి పుష్పాలంకారణ, పోతులరాజుల విశేష పూజ, 21న పోతులరాజు బండారు కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఒకే ఇంట్లో రెండు గిన్నిస్ రికార్డులు ధర్మవరం: స్థానిక రాజేంద్రనగర్కు చెందిన ఉపాధ్యాయుడు సోమిశెట్టి రమేష్బాబు, శ్యామల కుమార్తెలు కావ్య, ప్రణతి లక్ష్మికు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది. జాతీయ సాంస్కృతిక శాఖ, కేంద్ర సంగీత నాటక అకాడమి సంయుక్తంగా ఈ ఏడాది జనవరి 24న న్యూఢిల్లీలో నిర్వహించిన విభిన్న రాష్ట్రాల్లోని 53 జానపద కళారూపాల ప్రదర్శనలో 5,194 మంది కళాకారులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ తరపున వీరిద్దరూ ప్రదర్శించిన జానపద నృత్యాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు చేశారు. దీంతో వీరి పేర్లతో నమోదైన సర్టిఫికెట్లు శుక్రవారం అందడంతో అక్కాచెల్లెలు సంతోషం వ్యక్తం చేశారు. కంది పంట రాబడిని అపహరించిన సైబర్ నేరగాళ్లు బెళుగుప్ప: ఆరుగాలం శ్రమించి సాధించిన కంది పంట రాబడిని సైబర్ నేరగాళ్లు అపహరించారు. వివరాలు. బెళుగుప్పకు చెంది మహిళా రైతు నిర్మలమ్మ తనకున్న పొలంలో కంది పంట సాగు చేశారు. ఈ క్రమంలో పంట చేతికి రాగా, మార్కెట్లో విక్రయించగా వచ్చిన రూ.1.34 లక్షలను స్థానిక ఎస్బీఐ శాఖలోని తన ఖాతాలో జమ చేశారు. ఈ నెల 9న అర్థరాత్రి వరుసగా మూడు మెసేజ్లు రావడంతో ఆమె పరిశీలించారు. రూ.24,500, రూ.24,960, రూ.50వేలు చొప్పున మొత్తం రూ.99,460 నగదు విత్డ్రా అయినట్లుగా తెలుసుకున్న ఆమె కంగుతిని, మరుసటి రోజు ఉదయమే బ్యాంక్కు వెళ్లి ఆరా తీశారు. ఖాతాలో లావాదేవీలను పరిశీలించిన బ్యాంక్ అధికారులు... న్యూఢిల్లీలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్లోని ఓ ఖాతాకు బదిలీ అయినట్లు తెలిపారు. ఇది సైబర్ నేరగాళ్ల పనిగా నిర్ధారించడంతో శుక్రవారం పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేశారు. వ్యక్తి మృతదేహం లభ్యం నల్లచెరువు: మండలంలోని నడింపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. గ్రామ శివారులోని పాడుపడిన బావిలో తేలియాడుతున్న మృతదేహాన్ని వెలికి తీయించారు. దాదాపు 35 ఏళ్ల వయస్సు ఉంటుందని, మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. బెల్లపు ఊట ధ్వంసం వజ్రకరూరు: మండలంలోని బోడిసానిపల్లి తండాలో 150 లీటర్ల బెల్లపు ఊటను శుక్రవారం ధ్వంసం చేసినట్లు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ శివసాగర్ తెలిపారు. గోపాల్నాయక్, శంకర్నాయక్పై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. 13న రెడ్డి వివాహ పరిచయ వేదిక రాప్తాడురూరల్: రాయలసీమ రెడ్డి జన సంఘం ఆధ్వర్యంలో ఈనెల 13న ఉచితంగా రెడ్డి వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు సంఘం వ్యవస్థాపకుడు రొద్దం సురేష్రెడ్డి, గౌరవాధ్యక్షుడు చంద్రమౌళిరెడ్డి, కార్యదర్శి దుబ్బా కిషోర్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అనంతపురం రూరల్ పాపంపేటలోని సంఘం కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఈ పరిచయ వేదిక జరుగుతుందని పేర్కొన్నారు. పిల్లలకు వివాహాలు చేయాలనుకునే రెడ్డి కులస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యువతీ, యువకుల బయోడేటాలు తీసుకురావాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 94415 75641, 93902 84296, 94907 67224 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
సందర్భం : నేటి నుంచి చౌడేశ్వరీ దేవి ఉత్సవాలు
అమడగూరు: ఉమ్మడి జిల్లాలోనే అతి పెద్ద ఉత్సవాలకు పేరొందిన అమడగూరు చౌడేశ్వరీ దేవి ఉత్సవాలకు వేళైంది. దాదాపు ఎనిమిది శతాబ్దాల క్రితం అమరావతిగా పిలువబడిన అమడగూరులో వెలసిన చౌడేశ్వరీ ఆలయానికి ఎంతో విశిష్ట చరిత్ర ఉంది. భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో ఏటా ఛైత్ర మాసంలో ఆలయ కమిటీ సభ్యులు, అమడగూరు, చీకిరేవులపల్లి, గుండువారిపల్లి గ్రామ పంచాయతీ ప్రజల ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవాలను 8 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఉత్సవాలకు ఉమ్మడి జిల్లా నుంచే కాక.. ఏపీలోని పలు రాష్ట్రాలకు చెందిన భక్తులు, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారు. అమ్మవారి ఉత్సవాల వివరాలు.. ఏటా ఛైత్ర మాసంలో ఉగాది పండుగ సందర్భంగా అమ్మవారిని 16 గ్రామాల ఊరేగింపునకు తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఆ తర్వాత వచ్చే పున్నమితో ఎప్పటి లాగానే సంప్రదాయ బద్ధంగా నిర్వహించే అమ్మవారి ఉత్సవాలు ఈ ఏడాది కూడా శనివారంతో ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల వివరాలను ఆలయ ధర్మకర్త, మాజీ జెడ్పీటీసీ పొట్టా పురుషోత్తమరెడ్డి వెల్లడించారు. 12న కుంభకూడు, 13న ఊయల సేవ, 14న సూర్యప్రభ, 15న చంద్రప్రభ, 16న శ్రీజ్యోతి ఉత్సవం, 17న అశ్వ వాహనం, 18న సింహ వాహనం, 19న హంస వాహన సేవలు ఉంటాయి. ఉత్సవాలకే తలమానికంగా.. అమ్మవారి ఉత్సవాలలో భాగంగా ఈ నెల 16న నిర్వహించే శ్రీజ్యోతి ఉత్సవానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ఉత్సవాన్ని ఏటా కొత్తపల్లికి చెందిన దంపతులు మాజీ జెడ్పీటీసీలు పొట్టా పురుషోత్తమరెడ్డి, ఉమాదేవి కుటుంబసభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాన్ని చూసేందుకు 4 రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఆ రోజు ఉట్టి వద్ద నుంచి తీసుకొచ్చే జ్యోతి దర్శనంతో సకల పాపాలు తొలగి మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్నదానంతో పాటు కాలక్షేపానికి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న చౌడేశ్వరీదేవి 16న శ్రీజ్యోతి ఉత్సవం భక్తుల కోర్కెలు తీరుతాయి నమ్మకంతో అమడగూరు చౌడేశ్వరమ్మతో కొలిచే భక్తుల కోర్కెలు తీరుతాయి. ఇందుకు ఎన్నో ఘటనలు ఉన్నాయి. కోర్కెలు తీరిన భక్తులు ఇక్కడి అమ్మవారిని తమ ఇలవేల్పుగా కొలుస్తున్నారు. గత మూడేళ్లుగా ఆలయాన్ని చాలా అభివృద్ధి చేశాం. ముఖ్యంగా దాతల చేయూత, కమిటీ సభ్యుల సహకారం మరువలేం. త్వరలో ఆలయం వద్ద రోడ్డు విస్తరణ పనులు కూడా పూర్తి చేస్తాం. భక్తుల స్నానమాచరించడానికి కోనేరు నిర్మాణం, విశ్రాంత గదులు, పార్కింగ్ సౌకర్యం తొందర్లోనే ఏర్పాటు చేయనున్నాం. – పొట్టా పురుషోత్తమరెడ్డి, ఆలయ ధర్మకర్త -
సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలి
ప్రశాంతి నిలయం: ప్రజలకు పాదర్శకంగా సేవలు అందిస్తూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ రెవెన్యూ, సర్వే అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో రెవెన్యూ సేవలపై రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు, సర్వే అధికారులలో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్, రెవెన్యూ అంశాలు, రీ సర్వే, ఆర్ఓఆర్ కేసుల నమోదు, వాటి పరిష్కారం, మ్యుటేషన్ ఆడిట్, అసైన్మెంట్ భూముల సమస్యలు, సర్వేయర్ల శిక్షణ తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ... నిర్దిష్ట గడువులోపు భూ సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే దరఖాస్తులు గడువులోపు నాణ్యతగా పరిష్కరించేలా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ సమస్యలను నాణ్యతగా పరిష్కారం చేయాలని, రీ సర్వే ప్రక్రియలో పురోగతి సాధించాలన్నారు. పీ–4 సర్వేకి సంబంధించిన పనులను మొబైల్ యాప్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని, ప్రీ హోల్డ్ రెండో విడత రీసర్వే పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈనెల 15 నుంచి జిల్లాలో రీ సర్వే రెండో విడత ప్రారంభించాలని తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్ఓ విజయసారథి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణ రెడ్డి, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి, పెనుకొండ ఆర్డీఓలు సువర్ణ, మహేష్, శర్మ, ఆనంద్కుమార్, సర్వే అండ్ ల్యాండ్ జిల్లా అధికారి విజయశాంతి బాయి, జిల్లాలోని 32 మండలాల తహసీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు. -
తల్లిదండ్రులకు విద్యార్థుల అప్పగింత
ధర్మవరం అర్బన్: సరదాగా రైలు ఎక్కిన తప్పిపోయిన ఇద్దరు విద్యార్థుల ఆచూకీని పోలీసులు గుర్తించి తల్లిదండ్రుల వద్దకు సురక్షితంగా చేర్చారు. వివరాలు.. ధర్మవరంలోని కొత్తపేట మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జస్వంత్, విజయ్కుమార్ గురువారం స్థానిక రైల్వే స్టేషన్లో సరదాగా రైలు ఎక్కిన విషయం తెలిసిందే. అయితే విద్యార్థులు ఎక్కిన సమయంలో రైలు ముందుకు కదలడంతో వారు కిందకు దిగలేకపోయారు. పిల్లలు ఎంతకూ ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆరా తీయడంతో అసలు విషయం వెలుగు చూసింది. దీంతో వారి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన రెండో పట్టణ సీఐ రెడ్డప్ప.. చొరవ తీసుకుని ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో కర్నూలు రైల్వే స్టేషన్లో తచ్చాడుతున్న ఇద్దరు విద్యార్థులను గుర్తించిన ధర్మవరం పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున పిలుచుకొచ్చారు. కౌన్సెలింగ్ అనంతరం విద్యార్థులను తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రమాదంలో వ్యక్తి మృతి పావగడ: వాహనం ఢీకొన్న ఘటనలో ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. వివరాలు... పావగడ తాలూకా నాగలమడక హోబళి గ్యాదికుంటె గ్రామానికి చెందిన బాబు (45)కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గురువారం వ్యక్తిగత పనిపై పొరుగున ఉన్న శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలానికి వెళ్లాడు. రాత్రి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన ఆయన అదే మండలం తిమ్మాపురం–కొండాపురం గ్రామాల మధ్య ప్రయాణిస్తుండగా వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన వాహనం ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. బాబు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా దూసుకెళ్లిపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
కిడ్నీ బాధితుడికి ఆర్థికసాయం
ధర్మవరం అర్బన్: స్థానిక మహాత్మాగాంధీ కాలనీలో నివాసముంటున్న కిడ్నీ బాధితుడు మల్లిపోగుల శ్రీనివాసులు చికిత్సకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ భరోసానిచ్చారు. రెండు కిడ్నీలు చెడిపోయి మంచానికే పరిమితమైన శ్రీనివాసులు దుస్థితిపై ఈ నెల 10న ‘తండ్రి కోసం తనయ పోరాటం’ శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం తెలిసిందే. దీనిపై మంత్రి సత్యకుమార్ స్పందించారు. ఆయన ఆదేశాలతో బీజీపీ నియోజకవర్గ నేత హరీష్బాబు శుక్రవారం బాధితుడు శ్రీనివాసులును కలసి మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం బాధితుడికి రూ.10వేల ఆర్థిక సాయాన్ని బీజేపీ నాయకులు కృష్ణాపురం జమీర్, షాన్షా అందజేశారు. మరికొందరు బీజేపీ నాయకులు రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించారు. మంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ఏ ఆస్పత్రిలోనైనా శ్రీనివాసులుకు వైద్యం చేయిస్తామని హరీష్బాబు హామీనిచ్చారు. కార్యక్రమంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మల, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గీతామాధురి, లక్ష్మీప్రసన్న, చిగురుపాటి లక్ష్మి, పట్టణ అధ్యక్షుడు జింకా చంద్రశేఖర్, బిల్లే శ్రీనివాసులు, పోతుకుంట రాజు, కుంచపు నారప్ప, పెద్ద లింగమయ్య తదితరులు పాల్గొన్నారు. -
మద్యం డిపో ప్రారంభం
గోరంట్ల: మండల పరిధిలోని పాలసముద్రం సమీపంలో ఆంధ్రప్రదేశ్ బెవరేజస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన మద్యం డిపో (ఐఎంఎఫ్ఎల్)ను గురువారం రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి కొల్లు రవీంద్ర.. బీసీ సంక్షేమశాఖ మంత్రి సవితతో కలసి ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, ప్రిన్సిపల్ సెక్రెటరీ ముఖేష్కుమార్మీనా, రాష్ట్ర ఎకై ్సజ్శాఖ డైరెక్టర్ నిశాంత్కుమార్, రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్శర్మ తదితరులు పాల్గొన్నారు. ప్రతి మహిళా ఆర్థికంగా ఎదగాలి పుట్టపర్తి అర్బన్: ప్రతి మహిళా కొంత సొమ్మును పొదుపు చేయడం ద్వారా ఆర్థికంగా ఎదగాలని ఎల్డీఎం రమణకుమార్ పేర్కొన్నారు. పుట్టపర్తి వెలుగు కార్యాలయంలో ఆదర్శ రూరల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించే బ్యాంకులు అందించే సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సేవింగ్స్ ఖాతా, ఫిక్స్డ్ డిపాజిట్లు, రెకరింగ్ డిపాజిట్లు, కరెంట్ అకౌంట్లు , ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన పథకం అందుబాటులో ఉందన్నారు. ప్రతి మహిళా కొంత సొమ్మును పొదుపు చేస్తే భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రసాద్, ఆదర్శ సంస్థ అధ్యక్షురాలు లక్ష్మీదేవి, కార్యదర్శి శివానంద, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
ఆస్పత్రిని పరిశీలించిన కాయకల్ప బృందం
హిందూపురం టౌన్: పట్టణంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిని కాయకల్ప బృందం గురువారం పరిశీలించింది. విజయవాడ నుంచి కాయకల్ప బృందం డాక్టర్లు రామారావు, నరేష్, క్వాలిటీ కంట్రోలర్ సుబ్రహ్మణ్యం పాల్గొని ఆస్పత్రిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జాతీయ ఆరోగ్య మిషన్ ఏటా కాయకల్ప అవార్డు అందిస్తుంది. ఇంటర్నల్ అసెస్మెంట్లో భాగంగా బృందం సభ్యులు ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించి స్వచ్ఛత, సదుపాయాలు, బయోమెడికల్ వేస్టేజ్, ల్యాబ్, మందుల నిర్వహణ, పరిశుభ్రత, సిబ్బంది పనితీరు, బెడ్స్ నిర్వహణ, వార్డులో రికార్డుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పలు అంశాలను మెరుగుపరుచుకవాలని బృందం సభ్యులు ఆస్పత్రి సూపరింటెండెంట్కు సూచించారు. -
మడకశిరలో దాహం.. దాహం
గుడిబండ: మడకశిర నియోజకవర్గంలో తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోజూ ఏదో ఒక చోట రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ గుడిబండ మండల పరిధిలోని బూదిపల్లి తండా గ్రామ ప్రజలు గురువారం రాస్తారోకో చేపట్టారు. జంబులబండ పంచాయతీ బూదిపల్లి తండాలో సుమారు 28 కుటుంబాలు నివసిస్తున్నాయి. కొన్ని రోజులుగా తాగునీరు సరఫరా కావడం లేదు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఖాళీ బిందెలతో మడకశిర – అమరాపురం రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. జంబులబండ పంచాయతీ కార్యదర్శి చక్రవర్తి సంఘటనా స్థలానికి చేరుకుని ప్రజలతో చర్చించారు. తాగునీటి సరఫరాకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఇదిలా ఉండగా నియోకవర్గ వ్యాప్తంగా ఎన్నో గ్రామాల్లో తాగునీటి సమస్య కోసం ప్రజలు రోడ్డెక్కుతున్నా సమస్యను పరిష్కరించడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. రోజూ ఏదో ఒక చోట నీటి కోసం రోడ్డెక్కుతున్న జనం పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు -
తల్లీ బిడ్డల క్షేమమే ముఖ్యం
పుట్టపర్తి అర్బన్: గర్భిణులకు తల్లీ బిడ్డల సంరక్షణపై పూర్తి అవగాహన కల్పించివారి పరిరక్షణకు తోడ్పాటు అందించాలని డీఎంహెచ్ఓ ఫైరోజాబేగం ఆదేశించారు. మాతా శిశు మరణాలకు సంబంధించి జిల్లా స్థాయి సబ్ కమిటీ మీటింగ్ను గురువారం స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయంలో నిర్వహించారు. డీఎంహెచ్ఓ జిల్లాలో మార్చి నెలలో శిశు మరణాలు 3, ఒక మాతృ మరణం సంభవించాయన్నారు. ప్రతి నెలా జరిగే రివ్యూ ద్వారా సిబ్బంది అవగాహన పెంచుకోవాలని తద్వారా గర్భిణీలకు అవగాహన పెంచవచ్చన్నారు. గర్భిణులకు ప్రతి నెలా 9న జరిగే శిక్షణలో అవగాహన కల్పించాలని సూచించారు. గర్భిణుల గ్రూపును తయారు చేసి ఆరోగ్య విద్యను అందించాలన్నారు. ఏ తల్లీ .. బిడ్డకు జన్మనిస్తూ చనిపోకూడదని, ఏ బిడ్డ జన్మిస్తూ చనిపోరాదన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ తిప్పేంద్రనాయక్, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్ఓలు మంజువాణి, సెల్వియాసాల్మన్, నాగేంద్రనాయక్, వైద్యులు సునీల్, శ్రీలత, నీరజ, కార్తీక్, ఐసీడీఎస్ పీడీ శారద , డీపీహెచ్ఎన్ఓ వీరమ్మ, 108 ఈఓ అబ్దుల్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు. -
నిలకడగా చింతపండు ధర
హిందూపురం అర్బన్: చింతపండు ధర మార్కెట్లో నిలకడగా కొనసాగుతోంది. గురువారం హిందూపురం వ్యవసాయ మార్కెట్కు 1,000 క్వింటాళ్ల చింత పండు రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలంపాట నిర్వహించారు. ఇందులో కరిపులి రకం క్వింటా గరిష్టంగా రూ.25 వేలు, కనిష్టంగా రూ.8 వేలు, సరాసరిన రూ.14 వేలు పలికింది. ఇక ప్లవర్ రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ.14,500, కనిష్టంగా రూ.4,300, సరాసరిన రూ.7 వేల ప్రకారం ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. అంధుల స్కూల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం పరిగి: మండలంలోని కొడిగెనహళ్లి పంచాయతీ పరిధిలోని సేవామందిరంలో ఉన్న ప్రభుత్వ బాల బాలికల అంధుల ఆశ్రమ పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాజేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యాసంవత్సరానికిగానూ పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి వరకూ ప్రవేశం కోసం అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అన్ని తరగతులకు పాఠశాలలో 150 సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఇందులో ప్రస్తుతం 58 మంది విద్యార్థులు ఉండగా మిగిలిన 98 ఖాళీలను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామన్నారు. 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసున్న విద్యార్థులంతా ఆయా తరగతుల్లోకి అర్హత ఆధారంగా ప్రవేశానికి అర్హులన్నారు. ముఖ్యంగా 40 శాతం అంధత్వం కలిగి వైద్యులచే ధ్రువీకరించబడిన సర్టిఫికెట్ పొందిన వారు మాత్రమే ప్రవేశానికి అర్హులని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు 80088 89815, 81434 61585, 94900 71392, 94907 37661, 80081 71524 సెల్ ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభంగోరంట్ల: స్థానిక నాల్గవ వార్డులోని సచివాయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని గురువారం బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత ప్రారంభించారు. మహిళలు కుట్టు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకు ముందు గోరంట్లలోని చౌడేశ్వరీ కాలనీలో ప్రజల దాహార్తిని తీర్చడం కోసం నూతన బోరుబావి తవ్వేందుకు రింగ్ ఏర్పాటు చేయగా మంత్రి సవిత అక్కడ పూజ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ మారుతీప్రసాద్, ఎంపీడీఓ నరేంద్ర, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. పరిసరాల శుభ్రతే లక్ష్యం నల్లచెరువు: పంచాయతీ అధికారులు పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా పంచాయతీ అధికారి సమత పేర్కొన్నారు. మండల పరిధిలో అల్లుగుండు, నల్లచెరువు పంచాయతీల్లోని చెత్త సంపద కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రాల్లో తయారయ్యే వర్మీ కంపోస్టు, విడి విడిగా సేకరించిన పలు రకాల చెత్తలను పరిశీలించారు. అలాగే మండల పరిషత్ కార్యలయంలో తనకల్లు, నల్లచెరువు పంచాయతీ కార్యదర్శులతో పరిశుభ్రత– పారిశుధ్యంపై సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామంలో పారిశుధ్య కార్మికులు ప్రతి ఇంటికీ వెళ్లి తడి పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి సంపద కేంద్రాలకు తరలించాలన్నారు. పంచాయతీ అధికారులు గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్ట సారించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎల్పీఓ అంజనప్ప, ఎంపీడీఓ రఘునాథ గుప్తా, ఈఓఆర్డీ శకుంతల, సర్పంచ్ పంచరత్నమ్మ, పంచాయతీ కార్యదర్శులు నరేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
సక్రమంగా పనిచేసినా తప్పేనా?
● ఓ అసిస్టెంట్కు.. మెడికల్ ఆఫీసర్లకు తగాదా ● కలెక్టర్, హెల్త్ కమిషనర్కు వద్దకు చేరిన పంచాయితీ ● అసిస్టెంట్ను తీసేయాలని మంత్రి సత్యకుమార్కు మెడికల్ ఆఫీసర్ల వినతి సాక్షి, పుట్టపర్తి: జిల్లాలో వైద్యారోగ్యశాఖ పరువు బజారు పడుతోంది. జిల్లా అధికారిని ఓవర్టేక్ చేస్తూ వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది మంత్రిని కలవడం, డీహెచ్కు మెయిల్ ద్వారా సమాచారం చేరవేయండం, హెల్త్ కమిషనర్ వద్ద పంచాయితీ పెట్టడం గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయాయి. అయితే పంచాయితీ ఎలాంటి ఫలితం ఇవ్వకపోవడంతో అధికారులు – సిబ్బంది మధ్య అనారోగ్యకర పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఫలితంగా వైద్య ఆరోగ్యశాఖ పంచాయితీ గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ అందరి నోటా చర్చకు దారి తీసింది. వైద్య ఆరోగ్యశాఖ జిల్లా అధికారి దృష్టికి తీసుకెళ్లకుండా.. మెయిల్స్ ద్వారా విజయవాడకు సమాచారం చేరవేయడం కలకలం రేపింది. ఫలితంగా వైద్య – ఆరోగ్య శాఖలో పలు లోపాలు బహిర్గతం అయ్యాయి. గొడవకు కారణం ఇదేనా? కర్ణాటక సరిహద్దున ఉన్న కొన్ని పీహెచ్సీల్లో పని చేసే మెడికల్ ఆఫీసర్లు ప్రైవేటు క్లినిక్లు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఎఫ్ఆర్ఎస్ (ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్) పలు లొకేషన్ల నుంచి వేయడం సమస్యగా మారి కోల్డ్వార్కు దారి తీసింది. నిబంధనల ప్రకారం పనిచేసే చోట నుంచే బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాల్సి ఉంది. దీని వల్ల వారు పనిచేస్తున్న ప్రాంతంతో పాటు ఎన్నిగంటలకు విధులకు వస్తున్నారో కూడా సులువుగా తెలిసిపోతుంది. ఈ నేపథ్యంలోనే పీహెచ్సీ పరిధి నుంచి ఎఫ్ఆర్ఎస్ ఉంటేనే అప్రూవ్ చేస్తానని జిల్లా కేంద్రంలో ఉండే సీనియర్ అసిస్టెంట్ వాదించడాన్ని మెడికల్ ఆఫీసర్లు తప్పుబడుతున్నారు. సీనియర్ అసిస్టెంట్ స్థాయి మరచి మాట్లాడుతున్నారని మాటల యుద్ధం మొదలుపెట్టారు. ఆ తర్వాత పదే పదే సమస్య ఉత్పన్నం కావడంతో రెండు నెలల క్రితం ఎఫ్ఆర్ఎస్ విధుల నుంచి సదరు సీనియర్ అసిస్టెంట్ను తప్పించారు. అయితే ఆ సీనియర్ అసిస్టెంట్ను జిల్లా నుంచి బదిలీ చేయించాలని కొత్తగా యూనియన్ ఏర్పాటు చేసిన సభ్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గుర్తింపు లేని యూనియన్తో.. ఉద్యోగ సంఘాలు చాలానే ఉన్నాయి. అయితే ఎలాంటి గుర్తింపు లేని ఓ యూనియన్ను ఏర్పాటు చేసుకుని.. తాము సిబ్బంది తరఫున పోరాటం చేస్తున్నామని ఆ యూనియన్ సభ్యులు చెబుతున్నారు. సీనియర్ అసిస్టెంట్ వ్యవహార శైలి బాగాలేదని అంటున్నారు. ఆరు పీహెచ్సీల్లో ఏర్పడిన సమస్యపై ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు లీడ్ తీసుకుని.. సదరు సీనియర్ అసిస్టెంట్ను బదిలీ చేయించాలని కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా ఆ సీనియర్ అసిస్టెంట్ కదలికలపై దృష్టి సారించి.. ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో చూపిస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. వ్యక్తిగత కక్షలతో వాట్సాప్ స్టేటస్లోని విషయాలను కూడా ఫిర్యాదులో పేర్కొనడం విశేషం. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన వైద్యశాఖలో సిబ్బంది మధ్య అనారోగ్య వాతావరణం ఏర్పడింది. కొరవడిన సమన్వయంతో ఉద్యోగుల మధ్య కోల్డ్వార్ సాగుతోంది. ఆఖరికి వీరి పంచాయితీ బెజవాడ వరకూ వెళ్లింది. తప్పు వారిదేనని ఒకరు.. కాదు ఆయనదేనని వారందరూ వాదిస్తున్నారు. విచారణ చేస్తున్నాం నేను వాట్సాప్లో నాకు ఇష్టం వచ్చినట్లు స్టేటస్ పెట్టుకుంటా. ఆ మాత్రం స్వేచ్ఛ లేదా? సమాజానికి ఇబ్బంది కలిగేలా నేనెప్పుడూ ప్రవర్తించలేదు. డ్యూటీలో భాగంగా నేను చేయాల్సిన పని చేస్తున్నా. పీహెచ్సీలలో ఎఫ్ఆర్ఎస్లు మాత్రమే అనుమతించాలనే నిబంధన ఉంది. ఆ మేరకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఎఫ్ఆర్ఎస్లను తిరస్కరించా. ఉన్నతాధికారుల సూచన మేరకు నా డ్యూటీ నేను చేస్తున్నాను. అవతలి వాళ్ల తప్పిదాలను కప్పిపెట్టాల్సిన అవసరం నాకు లేదు. నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఉన్నతాధికారులు విచారణ చేయిస్తే తప్పొప్పులు తేలతాయి. – సీనియర్ అసిస్టెంట్, పుట్టపర్తి ప్రభుత్వ జీతం.. ప్రైవేటు వైద్యం.. మెడికల్ ఆఫీసర్లకు మర్యాద ఇవ్వకుండా మాట్లాడే.. సీనియర్ అసిస్టెంట్ను తక్షణమే బదిలీ చేయాలంటూ పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు గుర్తింపు పొందని ఓ యూనియన్ తరఫున పోరాటం మొదలుపెట్టారు. వివరాలపై ఆరా తీస్తే ఆ మెడికల్ ఆఫీసర్లు అందరూ ప్రైవేటు క్లినిక్లకే పరిమితం అవుతున్నట్లు తెలిసింది. హిందూపురం కేంద్రంగా ప్రైవేటు వైద్య వ్యాపారం మొదలుపెట్టి.. పీహెచ్సీలకు డుమ్మా కొడుతున్నట్లు తేలింది. ఈ క్రమంలో తమ అనధికారిక డ్యూటీలను బయటపెట్టిన సీనియర్ అసిస్టెంట్ను తీసేయాలని పట్టుబట్టినట్లు సమాచారం. మెడికల్ ఆఫీసర్లు, సీనియర్ అసిస్టెంట్ మధ్య ఉన్న సమస్య నా దృష్టికి వచ్చింది. వెంటనే ఎఫ్ఆర్ఎస్ బాధ్యతల నుంచి సీనియర్ అసిస్టెంట్ను తప్పించి.. ఆ పనులను వేరొకరికి అప్పగించాము. కమిషనర్కు మెయిల్స్ ద్వారా పంపించిన విషయంపై విచారణ చేస్తున్నాం. ఎవరు పంపించారనే విషయం తేలలేదు. అవన్నీ తప్పుడు ఫిర్యాదులు, ఫేక్ మెయిల్స్గా అనుమానం ఉంది. మెడికల్ ఆఫీసర్లు పీహెచ్సీల నుంచి ఎఫ్ఆర్ఎస్ ఉంటేనే పరిగణనలోకి తీసుకుంటాం. పని వేళల్లో కచ్చితంగా పీహెచ్సీల్లో ఉండాలి. లేదంటే అధికారికంగా సెలవులో ఉండాలి. డ్యూటీకి డుమ్మా కొట్టే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాం. ఎవరినీ ఉపేక్షించేది లేదు. – ఫైరోజాబేగం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి -
సంఘాలను బలోపేతం చేస్తాం
తనకల్లు: మహిళా సంఘాలను బలోపేతం చేయనున్నట్లు డీఆర్డీఏ పీడీ నరసయ్య తెలిపారు. స్థానిక చౌడేశ్వరీ మహిళా సమాఖ్య కార్యాలయంలో గురువారం రైతు ఉత్పత్తిదారుల ఎఫ్పీజీ లీడర్ల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ... చిరుధాన్యాల సాగును ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. వేరుశనగ పంటకు మార్కెట్ సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘం పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇందిరానగర్లోని కల్పన మహిళా సంఘం యాక్షన్ ప్లాన్ గురించి సభ్యులతో మాట్లాడారు. వివిధ రకాల జీవనోపాధులకు అవకాశం ఉండేలా యాక్షన్ ప్లాన్ను తయారు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీహెచ్ఓ చంద్రశేఖర్, డీపీఎంఎల్హెచ్ రామమోహన్, ఏపీఓ మరియమ్మ, ఏపీఎం జయంతి, హెచ్ఓ లావణ్య, ఎఫ్పీఎం ఏపీఎం రమణప్ప, సీసీ, పలువురు సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
మోతుకపల్లిలో టీడీపీ నేత దౌర్జన్యం
చిలమత్తూరు: హిందూపురం పట్టణ పరిధిలోని మోతుకపల్లిలో టీడీపీ నేత చంద్రమోహన్ దౌర్జన్యాలకు అంతు లేకుండా పోతోంది. ఏకంగా రోడ్డును ఆక్రమించి ప్రహరీ నిర్మించిన అడ్డుకునే అధికారి లేకపోయాడు. తమ ఇంటికి వెళ్లేందుకు దారి లేకుండా రోడ్డును చంద్రమోహన్ ఆక్రమించాడంటూ మున్సిపల్ అధికారులకు అదే గ్రామానికి చెందిన గొల్ల పవన్కుమార్ ఫిర్యాదు చేయడంతో టీడీపీ నేత కబ్జా పర్వం బయట పడింది. దీంతో అప్పటి వరకూ కబ్జాపై ఉదాసీనంగా వ్యవహరిస్తూ వచ్చిన అధికారుల్లో చలనం మొదలై ఈ నెల 3న క్షేత్ర స్థాయిలో పరిశీలించి, ఆక్రమణ నిజమని నిర్ధారించుకుని సదరు టీడీపీ నేతకు నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లోపు తొలగించాలని ఆదేశించినా టీడీపీ నేత లెక్క చేయకుండా ప్రహరీని అలాగే ఉంచాడు. ప్రహరీని కూల్చరాదంటూ అధికారులపై ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ ఒత్తిడి తీసుకెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో మళ్లీ అధికారులు మిన్నకుండిపోయారు.రాగి పంట పరిశీలనచిలమత్తూరు/లేపాక్షి: మండలంలోని టేకులోడు, లేపాక్షి మండలం కల్లూరు గ్రామాల్లో రైతులు సాగు చేసిన రాగి పంటను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ (ఏపీఎస్ఓపీసీఏ) ఎవాల్యూటర్ బి.వెంకటేష్ గురువారం పరిశీలించారు. ఐఎన్డీజీఏపీ సర్టిఫికేషన్ కోసం కంబాలరాయుడు పరస్పర సహాయక సహకార సంఘం లిమిటెడ్ ద్వారా నమోదు చేసుకున్న హిందూపురం డివిజన్కు సంబంధించి 20 మందికి అవగాహన కల్పించారు. రసాయన ఎరువులు, పురుగు మందులను సిఫార్సు మేరకు మాత్రమే వాడాలని రైతులకు సూచించారు. విత్తన ధ్రువీకరణ ప్రాముఖ్యతను వివరించారు. పురుగు మందుల అవశేషాల పరీక్ష నిమిత్తం రాగి విత్తన నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపారు. కార్యక్రమంలో సీఈఓ హరి, ఏఓ శ్రీలత, వంశీకృష్ణ, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.గరుడ వాహనంపై శ్రీవారుతాడిపత్రి: ఆలూరు కోనలో వెలసిన శ్రీరంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు గురువారం దేవేరులతో కలసి గరుడవాహనంపై భక్తులకు శ్రీరంగనాథుడు దర్శనమిచ్చారు. ఉదయం మూలవిరాట్కు అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకుని స్వామిని దర్శించుకున్నారు. రాత్రి గరుడ వాహన సేవను అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
లైన్మెన్పై దాడి
లేపాక్షి: విద్యుత్ బిల్లు చెల్లించాలన్న లైన్మెన్పై ఓ వినియోగదారుడు దాడికి తెగబడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు.. లేపాక్షి మండలం పులమతి పంచాయతీ పరిధిలోని ఎస్ఆర్ఎంయూ కాలనీకి చెందిన ఆసీఫ్, షాహీనా విద్యుత్ బిల్లు చెల్లించలేదు. గడువు మించి పోవడంతో విద్యుత్ కనెక్షన్ను కట్ చేశారు. గురువారం ఉదయం ఎప్పటి లాగానే విద్యుత్ బిల్లు చెల్లించాలని లైన్మెన్ శివారెడ్డి వెళ్లి అడిగాడు. దీంతో ఆగ్రహానికి గురైన హసీఫ్, షాహీనా లైన్మెన్పై కట్టెతో దాడి చేయడమే కాక, ఆయన ద్విచక్ర వాహనాన్ని కిందకు పడేసి పగుల గొట్టారు. అక్కడున్న కొందరు స్పందించి ఇరువురుని సర్దిచెప్పి పంపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. డ్రిప్పు పరికరాల చోరీ కేసులో నిందితుడి అరెస్ట్ బత్తలపల్లి: మండలంలోని సంజీపురం గ్రామానికి చెందిన రైతు అవినేని సూర్యనారాయణ దానిమ్మ తోటలో డ్రిప్పు పరికరాలను అపహరించుకెళుతున్న తలారి నాగరాజును అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ సోమశేఖర్ తెలిపాడు. గురువారం ఆయన మాట్లాడుతూ.. బాధిత రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన సిబ్బందితో నిఘా ఉంచామన్నారు. ఈదుల ముష్టూరుకు చెందిన తలారి నాగరాజు.. డ్రిప్పు వైరు కట్టలను ద్విచక్ర వాహనంలో ధర్మవరంలో విక్రయించడానికి తీసుకెళ్లుతుండగా వేల్పుమడుగు క్రాస్ వద్ద అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు వివరించారు. గోకులం పాఠశాలను పరిశీలించిన డీఈఓ పుట్టపర్తి: మండల కేంద్రంలోని గోకులం ప్రాథమిక పాఠశాలను డీఈఓ కృష్ణప్ప గురువారం తనిఖీ చేశారు. తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడారు. పాఠాలు బోధించారు. ఈ పాఠశాలను ఆదర్శ పాఠశాలగా మారుస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పాఠశాలలో విద్యార్థులను చేర్పించేలా తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని ఉపాధ్యాయుడు పీవీ రమణారెడ్డి, పాఠశాల సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓలు ఖాదర్వలి, ప్రసాద్ పాల్గొన్నారు. సరదాగా రైలు ఎక్కి.. కనిపించకుండా పోయారు ధర్మవరం అర్బన్: స్థానిక కొత్తపేట మున్సిపల్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థులు జస్వంత్, విజయ్కుమార్ గురువారం రైలు ఎక్కి వెళ్లిపోయారు. వారు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు టూ టౌన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. పోతుకుంట గ్రామానికి చెందిన మల్లికార్జున కుమారుడు జస్వంత్, అతని స్నేహితుడు విజయ్కుమార్ ఇద్దరు కొత్తపేట ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. ఇద్దరు ఉదయం రైల్వేస్టేషన్కు వెళ్లి సరదాగా రైలు ఎక్కారు. ఈ లోపు రైలు ముందుకు కదలడంతో కిందకు దిగలేకపోయారు. బాలురు ఆచూకీ తెలిసిన వారు 63058 00429, 93458 63219, 63029 67673కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. కలెక్షన్ సెంటర్లను వినియోగించుకోండి ● ఇక్రిసాట్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ పూర్ణచంద్రరావు శింగనమల: రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్కేవీవై) నిధులతో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన కలెక్షన్ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు ఇక్రిసాట్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ కె.పూర్ణచంద్రరావు పిలుపునిచ్చారు. శింగనమల మండలం వెస్ట్ నరసాపురం, శింగనమల గ్రామాల్లో దొనరామేశ్వర రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు నిర్మించిన కలెక్షన్ సెంటర్లను థర్డ్ పార్టీ వెరిఫికేషన్ కింద గురువారం ఆయన పరిశీలించారు. రైతు సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు. ఎఫ్పీఓ గ్రూప్ పరిధిలోని గ్రామాలు, సభ్యుల వివరాలు, పండించే ఉద్యాన, వ్యవసాయ పంటలపై ఆరా తీశారు. పంట ఉత్పత్తునలు గ్రేడింగ్ చేసుకుని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసుకునేందుకు కలెక్షన్ సెంటర్లు దోహదపడతాయన్నారు. పంట కోత అనంతరం ఉత్పత్తులను మార్కెట్లో డిమాండ్ వచ్చే వరకూ నిల్వ చేసుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో ఏడీఏ రామచంద్ర, ఉద్యానాధికారి శైలజ, రైతు సేవా కేంద్రం సిబ్బంది ఉమాదేవి, అనూష, పవన్కుమార్, అమరేష్, రైతులు పాల్గొన్నారు. వివాహిత ఆత్మహత్య గోరంట్ల: మండలంలోని బూదిలి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు విజయ్కుమార్ నాయక్ భార్య అనంతబాయి (49) చేసుకుంది. మార్నింగ్ స్కూల్ కావడంతో గురువారం ఉదయం విజయ్కుమార్ నాయక్ పాఠశాలకు వెళ్లిపోయారు. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న అనంతబాయి యాసిడ్ తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన ఇరుగుపొరుగు వారి సమాచారం మేరకు బంధువులు వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. -
ఎస్ఐ సుధాకర్పై చర్యలు తీసుకోండి
మడకశిర: పోలీసు శాఖ ప్రతిష్టను దిగజారుస్తూ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతకు ఏజెంట్లా మారిన రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్పై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు నరసింహమూర్తి డిమాండ్ చేశారు. లేకపోతే పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుందన్నారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా మాజీ సీఎంను ఏకవచనంతో సంబోధించడాన్ని ఆయన ఆక్షేపించారు. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ ఓ రాజకీయ పార్టీకి కొమ్ము కాయడం ఎస్ఐ సుధాకర్యాదవ్కు తగదన్నారు. గతంలో చంద్రబాబు, ఇతర టీడీపీ నాయకులు పోలీసులను ఏకవచనంతో దూషించిన రోజు ఎందుకు వారిని విమర్శించలేదని ప్రశ్నించారు. పరిటాల రవి కుటుంబీకులు చెప్పిన విధంగానే తాను పనిచేస్తానంటూ వృత్తి ధర్మాన్ని విస్మరించిన సుధాకర్ యాదవ్.. పోలీస్ ఉద్యోగానికి అనర్హుడని, తక్షణమే ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకుని శాఖ ప్రతిష్టను కాపాడాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు. వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు నరసింహమూర్తి -
‘కలలు కనండి..ఆ కలలను సాకారం చేసుకోండి’ అంటూ యువతలో చైతన్యాన్ని రగిలించిన మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, దివంగత రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తి వృథా కాలేదు. నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగి... తాము కన్న కలలను సాకారం చేసుకున్నారు ఇద్దరు యువ
ఇస్రో శాస్త్రవేత్తగా ఎంపికై న పూజారి నాగప్రదీప్ ఓఎన్జీసీలో ఉద్యోగం పొందిన పూజారి నాగసాయికనగానపల్లి: మండల కేంద్రానికి చెందిన పూజారి నాగభూషణ ఓ సాధారణ వ్యవసాయ కూలీ. వ్యవసాయ పనులు ఉంటే పూట గడుస్తుంది. ఈ క్రమంలో గ్రామంలో వ్యవసాయ పనులు సరిగా లేకపోవడంతో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తన కష్టం పిల్లలకు రాకూడదని భావించిన ఆయన... కేవలం చదువులు ఒక్కటే వారి జీవన గమనాన్ని మారుస్తాయని గుర్తించాడు. ఆ దిశగా పిల్లల చదువు కోసం అహర్నిశం శ్రమించాడు. తండ్రి ఆశయానికి అనుగుణంగా.. పూజారి నాగభూషణకు నాగప్రదీప్, నాగసాయి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఓ వైపు ఆటో నడుపుతూనే రోజూ సమీపంలో ఉన్న ధర్మవరం పట్టణానికి పిల్లలను తీసుకెళ్లి ఓ ప్రైవేట్ పాఠశాలలో వదిలి వచ్చేవాడు. తిరిగి పాఠశాల వేళలు ముగిసే వరకూ ఆటో నడుపుతూ వచ్చే ఆదాయంలో మొదట పిల్లల చదువులకు కొంత మొత్తాన్ని పక్కన తీసిపెట్టేవాడు. తండ్రి ఆశయాన్ని గుర్తించిన పిల్లలు సైతం చదువులపై ఆసక్తి పెంచుకున్నారు. పేదరికపు సవాళ్లను అధిగమిస్తూ ఈ పదో తరగతి, ఇంటర్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. ఆ తర్వాత ప్రభుత్వ, దాతల సహకారంతో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం నాగప్రదీప్ బెంగుళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ యూనివర్సిటీలో ఎంటెక్ పూర్తి చేశాడు. ఆ సమయంలో సైన్స్ పరిశోధనల్లో ప్రతిభ చూపటంతో ప్రొఫెసర్ల ప్రోత్సాహంతో జాతీయ స్థాయిలో నిర్వహించిన బోర్డు పరీక్షలు రాసి ఆల్ ఇండియా స్థాయిలో 72వ ర్యాంకు సాధించాడు. దీంతో ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేసే అవకాశం దక్కింది. ప్రస్తుతం ఆయన శ్రీహరికోటలోని ఇస్రోలో గ్రూపు– ఏ గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగానికి అర్హత సాధించాడు. జాతీయ స్థాయిలో మెరిసిన మరొకరు.. నాగప్రదీప్తో పాటు గేట్లో మంచి ర్యాంకు సాధించిన సోదరుడు నాగసాయి కూడా జాతీయ స్థాయి ఓఎన్జీసీ సంస్థలో ఏఈఈ ఉద్యోగం సాధించాడు. బీటెక్ పూర్తి కాగానే చిరుప్రాయంలోనే ఈ ఉద్యోగం సాఽధించడం గమనార్హం. దీంతో తన ఆశయానికి అనుగుణంగా కుమారులిద్దరూ జాతీయ స్థాయి సంస్థల్లో మంచి ఉద్యోగాలు సాధించినందుకు ఆటో డ్రైవర్ నాగభూషణ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. తల్లిదండ్రుల కష్టాన్ని వమ్ము చేయకుండా పిల్లలిద్దరూ బాగా చదువుకొని ఉన్నతస్థాయి ఉద్యోగాలు సాధించినందుకు వారిని గ్రామస్తులు అభినందించారు. ఇస్రో శాస్త్రవేత్తగా ఎదిగిన ఆటో డ్రైవర్ కుమారుడు జాతీయ స్థాయి సంస్థలో మరో కుమారుడికి ఉద్యోగం -
వాహనం ఢీ – బైక్ రైడర్ మృతి
పెద్దవడుగూరు: వాహనం ఢీకొన్న ఘటనలో బెంగళూరు నగరానికి చెందిన ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... బెంగళూరులోని హెబ్బాల్లో వినాయక్నగర్ ఫోర్త్క్రాస్లో నివాసముంటున్న మహేష్కుమార్ (47)కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. బైక్ రైడింగ్పై ఆసక్తి ఉన్న ఆయన వారం రోజుల క్రితం తన స్నేహితులతో కలసి ద్విచక్ర వాహనాలపై సిక్కింకు వెళ్లారు. ఈ క్రమంలో తిరుగు ప్రయాణమై ఈ నెల 9న హైదరాబాద్కు చేరుకున్నాడు. ఇదే విషయాన్ని కుటుంబసభ్యులకు ఫోన్ చేసి తెలిపారు. బుధవారం వేకువజామున హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఒంటరిగా ద్విచక్ర వాహనంపై బయలుదేరిన ఆయన గురువారం ఉదయం పెద్దవడుగూరు మండలం గుత్తి అనంతపురం గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొనడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన పడి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పెద్దవడుగూరు పీఎస్ ఎస్ఐ ఆంజనేయులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద లభ్యమైన ఆధారాలను బట్టి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి, సమాచారం అందజేశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
కాంట్రాక్టర్ బలవంతపు వసూళ్లు
సోమందేపల్లి: గ్రామ పంచాయతీ పరిధిలో వారపు సంతకు సంబంధించి అధిక రుసుం వసూలు చేస్తున్న కాంట్రాక్టర్ వైఖరిని నిరసిస్తూ వ్యాపారులు గురువారం ధర్నా నిర్వహించారు. పంచాయతీ కార్యాలయం ఎదుట చేపట్టిన ఈ ధర్నాలో పలువురు మాట్లాడుతూ.. గతంలో వారపు సంతలో దుకాణం నిర్వహణకు రూ.150 చెల్లిస్తుండగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుంకం వసూలుదారులు ఏకంగా రూ.300 నుంచి రూ.400 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. దీంతో రోజంతా తాము కష్టపడి సంపాదించిన సొమ్ము కాంట్రాక్టర్ల పాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై ్క ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆదాయం సమకూరుతున్నా మార్కెట్లో కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. అధికారులు ఎంతకూ స్పందించక పోవడంతో వ్యాపారస్తులు అక్కడి నుంచి వెళ్లి పోయారు. విషయం తెలుసుకున్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్దన్న మాట్లాడుతూ.. నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమంగా వసూళ్లు చేయడాన్ని తప్పుబట్టారు. ఈ అంశంపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పంచాయతీ కార్యాలయం ఎదుట వ్యాపారుల ధర్నా -
వైభవంగా పోతులరాజు మహోత్సవం
గుడిబండ: మండల కేంద్రానికి కూతవేటు దూరంలో వెలసిన తుమ్మల మారెమ్మదేవి ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం పోతులరాజు పుష్పాలంకరణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తొలుత తుమ్మల మారెమ్మదేవి మూలవిరాట్కు ప్రత్యేక పూజలు చేసి మహంకాళి రూపంలో అలంకరణ చేశారు. అనంతరం గ్రామ నడిబొడ్డును వెలసిన వీరభద్రస్వామి ఆలయం నుంచి పోతులరాజులు ప్రత్యేకంగా అలంకరించుకుని పురవీధుల గుండా నృత్యం చేస్తూ మారెమ్మదేవి ఆలయం వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం సమీపంలో పోతులరాజు పుష్పాలంకరణ మహోత్సవాన్ని నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాలతో పాటు కర్ణాటక ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు జనసంద్రమయ్యాయి. భక్తులకు గ్రామస్తుల ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. కొడికొండ చెక్పోస్ట్లో చైన్స్నాచింగ్ చిలమత్తూరు: మండలంలోని కొడికొండ చెక్పోస్ట్లో ఓ మహిళ మెడలోని బంగారం గొలుసును దుండగులు అపహరించుకెళ్లారు. ఎస్ఐ మునీర్ అహమ్మద్ తెలిపిన మేరకు... గురువారం ఉదయం చెక్పోస్టులోని ఓ దుకాణం వద్దకు వెళ్లిన ఇద్దరు యువకులు కూల్డ్రింక్ కావాలని అడిగారు. ఆ సమయంలో దుకాణ నిర్వాహకురాలు ఫ్రిడ్జ్ నుంచి కూల్ డ్రింక్ బాటిళ్లు తీస్తుండగా ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కొని ఉడాయించారు. ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పెనుగాలులకు నేలకొరిగిన అరటి కూడేరు: మండలంలోని మరుట్ల–1వ కాలనీలో గురువారం పెనుగాలుల ధాటికి కౌలు రైతు బెస్త ఎర్రిస్వామి సాగు చేసిన అరటి చెట్లు విరిగిపడ్డాయి. కోత దశలో ఉన్న దాదాపు 1500 అరటి చెట్లు విరిగిపోవడంతో రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయాడు. -
తండ్రి కోసం తనయ పోరాటం
కుటుంబాన్ని పోషించేందుకు ఆ తండ్రి రెక్కలు ముక్కలు చేసుకుని బండరాళ్లు కొట్టాడు. మండుటెండలో పునాది రాళ్లను కొడుతూ అహర్నిశలు శ్రమించాడు. నాలుగు రాళ్లు సంపాదించి కుమార్తెలకు పెళ్లిళ్లు చేయాలనే తపనతో ఆకలి దప్పికలు మరిచాడు. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచింది. విధి వక్రీకరించి మంచానపడ్డాడు. ఏనాడూ గడప దాటి ఎరుగని కుమార్తె.. నేడు తండ్రి వైద్యం ఖర్చులు, కుటుంబ పోషణ కోసం పలువురి ఇళ్లలో పనులకు వెళుతోంది. మెరుగైన వైద్యం అందిస్తే తన తండ్రి మామూలు మనిషిగా మారుతాడని, అయితే వైద్యానికి అయ్యే ఖర్చు తమ తలకు మించిన భారం కావడంతో ఆపన్నహస్తమందించాలని నిరుపేద కుటుంబం వేడుకుంటోంది. ధర్మవరం అర్బన్: స్థానిక మహాత్మాగాంధీ కాలనీకి చెందిన మల్లిపోగుల శ్రీనివాసులు, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇంటి పునాదులకు అవసరమైన రాళ్లను కొడుతూ కుటుంబాన్ని శ్రీనివాసులు పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో అరకొర సంపాదనలోనే దాచుకుంటూ వచ్చిన డబ్బుతో పెద్ద కుమార్తె శిరీషకు పెళ్లి చేసి, అత్తారింటికి పంపారు. చిన్న కుమార్తె జ్యోతిని పదో తరగతి వరకు చదివించగలిగారు. అపై చదువులకు పంపే ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఇంటి పట్టునే ఉంచేశారు. సాధారణ జబ్బు కాదది నెల రోజుల క్రితం మహాశివరాత్రి పండుగను సంతోషంగా జరుపుకునేందుకు శ్రీనివాసులు కుటుంబం సిద్ధమైంది. ఉదయం తలంటి స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజలు చేసుకుని ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా శ్రీనివాసులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. పరిస్థితి గమనించిన భార్య లక్ష్మి, కుమార్తె జ్యోతి వెంటనే అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం శ్రీనివాసులుకు రెండు కిడ్నీలు చెడిపోయాయని వైద్యులు నిర్ధారించారు. పరిస్థితి విషమిస్తుండడంతో వెంటనే కర్నూలులోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డయాలసిస్ చేయడంతో కాస్త ఉపశమనం దక్కింది. ఈ క్రమంలో ఎడమ కాలికి ఇన్ఫెక్షన్ సోకి సెఫ్టిక్ కావడంతో పెద్ద గాయమైంది. దీంతో శ్రీనివాసులు కనీసం కూర్చొనే పరిస్థితి కూడా లేకపోయింది. ఇంటి వద్ద మంచానికే పరిమితం ఎడమ కాలికి కట్టు కట్టిన తర్వాత కర్నూలు ఆస్పత్రి నుంచి వైద్యులు డిశ్చార్జ్ చేసి, ఇంటికి పంపారు. ఈ నేపథ్యంలో మరోసారి డయాలసిస్ అవసరం కావడంతో ఆస్పత్రికి తీసుకెళితే.. శ్రీనివాసులు పరిస్థితిని గమనించిన వైద్యులు డయాలసిస్ చేయడానికి సాధ్యం కాదని వెనక్కు పంపారు. అప్పటి నుంచి ఇంట్లోనే మంచానికే ఆయన పరిమితమయ్యాడు. ఈ మొత్తం ప్రక్రియలో ఇంట్లో చిన్న కుమార్తె పెళ్లికని దాచిన డబ్బు మొత్తం శ్రీనివాసులు చికిత్స కింద ఖర్చయి.. మరికొంత తెలిసిన వారి వద్ద అప్పులు చేయాల్సి వచ్చింది. నిరుపేద కుటుంబం కావడంతో రోజూ పనికి వెళితే తప్ప పూట గడవని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇంటి వద్ద భర్తకు సపర్యలు చేయడంలోనే భార్య లక్ష్మికి సమయం సరిపోతోంది. దీంతో ఏనాడు గడప దాటి ఎరుగని చిన్న కుమార్తె జ్యోతి.. తండ్రి ఆరోగ్యం మెరుగుపడాలనే తపనతో తొలిసారిగా ఇల్లు విడిచి బయట కూలి పనులకు సిద్ధమైంది. ఇంటింటికీ తిరిగి వారికి అవసరమైన పనులు చేసి పెట్టి, వారిచ్చిన కొద్ది పాటి డబ్బుతో తండ్రికి అవసరమైన మందులు, కాలికి డ్రస్సింగ్ చేసేందుకు అవసరమైన మందులు, డయపర్స్ కొనుగోలు చేస్తోంది. వీరి దుస్థితిని గమనించిన చుట్టుపక్కల వారు అప్పుడప్పుడు చిన్నపాటి సాయం అందిస్తున్నారు. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు. తన తండ్రి మంచాన పడటంతో కుటుంబ పోషణ భుజాల మీదకు వేసుకున్న జ్యోతి ఇంటి పనులతో కుటుంబానికి ఆసరాగా నిలుస్తోంది. అయితే తన సంపాదనతో తండ్రి ఆరోగ్యం ఎన్నటికీ బాగుపడదని గుర్తించిన ఆమె ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది. తన తండ్రికి మెరుగైన వైద్యానికి ఆర్థిక సాయం అందించాలని దాతలను వేడుకుంటోంది. అనారోగ్యంతో మంచానపడ్డ తండ్రి సపర్యలు, ఇంటి పనుల్లో నిమగ్నమైన తల్లి కుటుంబ పోషణ, తండ్రి వైద్యం కోసం ఇళ్ల పనికి వెళ్తున్న కుమార్తె మెరుగైన వైద్యం కోసం ఆపన్న హస్తమందించాలని వేడుకోలుసాయం చేయదలిస్తే... పేరు :మల్లిపోగుల లక్ష్మి బ్యాంకు పేరు : ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు, ధర్మవరం బ్రాంచ్ ఖాతా నెంబరు : 9103 349 4823 ఐఎఫ్ఎస్సీ కోడ్ : APGB0001029 సంప్రదించాల్సిన నంబర్ : 78424 68672 -
సుధాకర్.. ఓ అక్రమాల పుట్ట
చిలమత్తూరు: ‘మాజీ సీఎం వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత, స్థాయి రెండూ రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్కు లేవు. ఆయనో అక్రమాల పుట్ట’ అంటూ చిలమత్తూరు మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. బుధవారం హిందూపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేవంలో ఆయన మాట్లాడారు. సుధాకర్ యాదవ్ నీతి, నిజాయితీ గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. చిలమత్తూరు పంచాయతీ తుమ్మలకుంట సమీపంలో సుధాకర్ యాదవ్ తన భార్య పేరిట 3.71 ఎకరాల భూమి కొనుగోలు చేశారని, రూ.కోట్లు విలువ చేసే ఆ భూమిని ఎలా కొనుగోలు చేశారో సమాధానమివ్వాలన్నారు. ఇదే భూమిలో రూ.కోట్ల ఖర్చుతో కోళ్ల ఫారం ఎలా నిర్మిస్తున్నారో కూడా సమాదానం చెప్పాలన్నారు. విద్యుత్ కనెక్షన్ కోసం ఏకంగా రూ.16 లక్షలు ఖర్చు పెడుతున్నారంటే సుధాకర్ యాదవ్ అక్రమ సంపాదన ఏపాటిదో అర్థం చేసుకోవచ్చునన్నారు. ఉపాధి నిధులతో అక్రమంగా తన భూమిలో రోడ్డు వేయించుకున్నాడని ఆరోపించారు. తమ భూమి చదును చేయించుకునేందుకు లేపాక్షి నాలెడ్జి భూముల్లో మట్టిని అక్రమంగా తోలించుకున్న సుధాకర్ యాదవ్పై పత్రికల్లో పలు కథనాలు వెలువడినా అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదంటే ఆయన వెనుక ఎవరున్నారో అర్థమవుతోందన్నారు. ఇన్ని లోటుపాట్లు పెట్టుకుని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ను ఏకవచనంతో సంబోధించడం సిగ్గుచేటన్నారు. అధికార టీడీపీ నేతలను అడ్డు పెట్టుకుని అక్రమ దందాలతో సామాన్య ప్రజలను ఇక్కట్లు పెట్టే ఎస్ఐ సుధాకర్ యాదవ్పై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కేవలం వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పురమాయించడం ఆయన అధికార దుర్వినియోగానికి నిదర్శనమన్నారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రోద్బలంతో విచక్షణ కోల్పోయి మాజీ సీఎంను లక్ష్యంగా చేసుకుని దుర్మార్గంగా మాట్లాడితే సహించబోమన్నారు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయని, కాలం ఒకేలా ఉండదనే విషయాన్ని ఇప్పటికై నా ఆయన గుర్తించాలన్నారు. రూ.కోట్ల విలువైన భూమి ఎలా కొన్నావ్? భారీ ఎత్తున కోళ్లఫారం నిర్మాణం ఎలా చేపట్టావ్? భూమి చదును కోసం లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూముల నుంచి మట్టిని అక్రమంగా తోలుకోలేదా? చిలమత్తూరు మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ రామకృష్ణారెడ్డి ధ్వజం -
ఆటో బోల్తా – మహిళా కూలీ మృతి
పుట్టపర్తి అర్బన్: ఆటో బోల్తాపడిన ఘటనలో ఓ మహిళా కూలీ మృతి చెందారు. పలువురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. పుట్టపర్తి రూరల్ పీఎస్ ఏఎస్ఐ ప్రసాద్ తెలిపిన మేరకు... పుట్టపర్తి మండలం పెడపల్లి గ్రామానికి చెందిన రైతు జలీల్ పొలంలో వేరుశనగ పంట తొలగించేందుకు రోజూ లాగే బుధవారం ఉదయం 9 గంటలకు ఏడుగురు కూలీలతో ఆటో బయలుదేరింది. తమ సొంత ఆటోలోనే కూలీలను తీసుకుని జలీల్ కుమారుడు ఫారూక్ బయలుదేరాడు. గ్రామ శివారుకు చేరుకోగానే 342వ జాతీయ రహదారి మలుపు వద్ద వేగాన్ని నియంత్రించుకోలేక దూసుకెళ్లడంతో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్ పక్కనే కూర్చున్న మహిళా కూలీ రాధ (32) ఆటో కింద పడడంతో కాలు, చెయ్యి విరిగాయి. ఫారూక్ తల్లి షేక్ మౌసిన్భాను తలకు తీవ్ర గాయమైంది. చెయ్యి విరిగింది. మరో కూలీ లక్ష్మీదేవి చెవి తెగిపడింది. సుకన్య, సరస్వతి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను పెడపల్లిలోని ఓ ఆర్ఎంపీ వద్ద ప్రథమ చికిత్స చేయించి, ప్రైవేట్ కారులో అనంతపురానికి తరలిస్తుండగా రాధా పరిస్థితి విషమించింది. దీంతో ఆమెను ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. మౌసిన్భానును అనంతపురానికి తరలించారు. లక్ష్మీదేవికి గోరంట్లలో వైద్యం అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పుట్టపర్తి రూరల్ పీఎస్ సిబ్బంది అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలు రాధ భర్త తలారి లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్ఐ కల్లూరు ప్రసాద్ తెలిపారు. కాగా, రాధాకు ఇద్దరు కుమారులు ఉన్నారు. న్యాయం చేయాలని బాధితుల ధర్నా.. రాధ మృతిపై బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తూ బుధవారం రాత్రి ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లి ప్రమాదానికి కారణమైన ఫారూక్ ఇంటి ఎదుట ఉంచి దాదాపు 3 గంటల పాటు ధర్నా చేపట్టారు. ఆటో నడపడం తెలియని ఫారూక్ అతి వేగమే ప్రమాదానికి కారణమని ఆరోపించారు. ఆటోకు ఇన్సూరెన్స్ లేదని, ఫారూక్కు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అక్కడకు చేరుకుని సద్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా బాధితులు వినలేదు. ప్రమాదం జరిగిన వెంటనే టీడీపీ నేత ఆశ్రయించి అజ్ఞాతంలోకి వెళ్లిన ఫారూక్, ఆయన కుటుంబసభ్యులతో కనీసం మాట్లాడే ప్రయత్నం కూడా పోలీసులు చేయకపోవడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబసభ్యుల ధర్నా -
ముగిసిన ‘పది’ మూల్యాంకనం
పుట్టపర్తి: పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం (స్పాట్) బుధవారం ముగిసింది. కొత్తచెరువులోని బాల బాలికల ఉన్నత పాఠశాలలో ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన మూల్యాంకనం బుధవారం ప్రశాంతంగా ముగియడంతో విద్యాశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తంగా 891 మంది ఉపాధ్యాయులు, సిబ్బందితో మూల్యాంకనంలో పాల్గొన్నారని డీఈఓ కృష్ణప్ప తెలిపారు. పరీక్షలు, స్పాట్ విధుల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. నేడు జిల్లాకు మంత్రి కొల్లు రవీంద్ర ప్రశాంతి నిలయం: రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రబాబు గురువారం జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం అనంతపురంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి... మధ్యాహ్నం 2.25 గంటలకు రోడ్డుమార్గంలో గోరంట్ల మండలంలోని పాలసముద్రం చేరుకుంటారన్నారు. అక్కడ నూతనంగా నిర్మించిన ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ (ఏపీఎస్బీసీఎల్) పరిపాలన భవనాన్ని ప్రారంభిస్తారన్నారు. అక్కడి నుంచి ‘నాసిన్’కు వెళతారని, సాయంత్రం 4 గంటలకు పాలసముద్రం నుంచి బయలుదేరి బెంగళూరు వెళతారని కలెక్టర్ పేర్కొన్నారు. రేపు పుట్టపర్తిలో పూలే జయంతి వేడుకలు ప్రశాంతి నిలయం: జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 11న మహాత్మా జ్యోతిబా పూలే జయంత్యుత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఆ శాఖ జిల్లా అధికారి నిర్మలాజ్యోతి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు గణేష్ సర్కిల్లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం షాధీఖానాలో పూలే జయంతి వేడుకలు ఉంటాయన్నారు. రాష్ట్ర మంత్రి సత్యకుమార్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లు వెల్లడించారు. పూలే జయంత్యుత్సవంలో మేధావులు, ప్రజలు, ప్రభుత్వ అధికారులు పాల్గొనాలని కోరారు. గాలీవాన బీభత్సం కణేకల్లు: మండలంలో బుధవారం సాయంత్రం గాలీవాన బీభత్సం సృష్టించింది. కణేకల్లు, కె.కొత్తపల్లి, పుల్లంపల్లి, పూలచెర్ల, కణేకల్లు క్రాస్, యర్రగుంట తదితర గ్రామాల్లో సుమారు 250 ఎకరాల్లో మొక్కజొన్న పంట తీవ్రంగా దెబ్బతింది. వారం, పది రోజుల్లో కోత కోయాల్సిన తరుణంలో గాలీవాన పంటను దెబ్బతీసింది. ఎకరా మొక్కజొన్న సాగుకు రూ.25 వేల వరకు పెట్టుబడులు పెట్టామని, వర్షానికి మొత్తం తుడిచి పెట్టుకుపోయిందంటూ బాధిత రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. -
జెడ్పీలో 10 మందికి పదోన్నతి
అనంతపురం సిటీ: జిల్లా పరిషత్ పరిధిలో పని చేస్తున్న పది మంది జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి లభించింది. వీరికి ఉత్తర్వులను బుధవారం తన చాంబర్లో జెడ్పీసీఈఓ రామచంద్రారెడ్డితో కలసి చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అందజేశారు. అనంతపురంలోని జెడ్పీ కార్యాలయంలో పరిచేస్తున్న డి.మాధవి చౌదరికి పదోన్నతి కల్పిస్తూ తిరిగి జెడ్పీనే కేటాయించారు. ఇదే కార్యాలయంలో పని చేసే బి.సుశీలాదేవిని పెనుకొండలోని పీఆర్ క్యూసీ సబ్ డివిజన్కు, కె.రమాదేవిని చిలమత్తూరు మండల పరిషత్ కార్యాలయానికి, విజయవాడలో డిప్యూటేషన్పై పనిచేస్తున్న ఎం.అరుణశ్రీని యల్లనూరు మండల పరిషత్ కార్యాలయానికి కేటాయించారు. తొగరకుంట హైస్కూల్లో పని చేస్తున్న పి.షాహీనా బేగంను రొద్దం మండల పరిషత్ కార్యాలయానికి, పుట్టపర్తి మండల పరిషత్ కార్యాలయంలో పని చేసే జి.రవీంద్రను పుట్టపర్తి పీఆర్ అనుబంధం పీఐయూ సబ్ డివిజన్కు, సిద్ధరాంపురం జెడ్పీహెచ్ఎస్లో పని చేసే జె.సుబ్రహ్మణ్యంను లేపాక్షి మండల పరిషత్ కార్యాలయానికి పోస్టింగ్ ఇచ్చారు. ఎద్దులపల్లి జెడ్పీహెచ్ఎస్లో పని చేసే పి.ఉమామహేశ్వరరెడ్డిని గుత్తిలోని ఆర్డబ్ల్యూఎస్ సబ్ డివిజన్కు, నాగసముద్రం జెడ్పీహెచ్ఎస్లో పని చేసే వి.విశ్వనాథ్ను మడకశిర పీఆర్ఐ సబ్ డివిజన్కు, రాయదుర్గం మండల పరిషత్ కార్యాలయంలో పని చేసే పి.మహేష్ ను కణేకల్లు మండల పరిషత్ కార్యాలయానికి పదోన్నతిపై బదిలీ చేస్తూ ఉత్తర్వులు అందజేశారు. -
మూడు నెలలుగా నీటి సరఫరా బంద్
గాండ్లపెంట: ఎన్పీకుంట, గాండ్లపెంట మండలాల్లోని గ్రామాలకు ‘సత్యసాయి మంచినీరు’ మూడు నెలలుగా సరఫరా కావడం లేదు. దీంతో ఈ రెండు మండలాల్లోని 68 గ్రామాల్లో తాగునీటి సమస్య జటిలంగా మారింది. ఆయా గ్రామాలకు సత్యసాయి నీరు సరఫరా చేసేందుకు సీఈఆర్ నుంచి కాళసముద్రానికి అక్కడి నుంచి కుటాగుళ్లకు అక్కడి నుంచి కమతంపల్లికి నీరు సరఫరా చేస్తారు. ఇందుకోసం కమతంపల్లిలో 8.5 లక్షల లీటర్ల సామర్థ్యంతో రెండు సంపులు నిర్మించారు. కానీ మూడు నెలలుగా నీరు సరఫరా చేయడం లేదు. దీంతో గాండ్లపెంట, ఎన్పీకుంట మండలాల్లోని జనం తాగునీటికి అల్లాడుతున్నారు. -
13న యూపీఎస్సీ ఫ్లాగ్షిప్ పరీక్ష
అనంతపురం అర్బన్: ‘యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆధ్వర్యంలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావెల్ అకాడమీ, కంబైన్డ్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించి ఈనెల 13న ఉమ్మడి అనంతపురం జిల్లా అభ్యర్థులకు ఫ్లాగ్షిప్ పరీక్ష జరగనుంది. రెండు కేంద్రాల్లో జరగనున్న పరీక్షకు 363 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. యూపీఎస్సీ నిబంధనలను అనుసరించి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టండి’ అని అనంతపురం కలెక్టర్ వినోద్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లుగా జరుగుతాయన్నారు. ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రానికి ఇన్స్పెక్టింగ్ అధికారిగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎ.రామ్మోహన్, రూట్ ఆఫీసర్గా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జునుడు, కేఎస్ఎస్ డిగ్రీ, పీజీ కళాశాల పరీక్ష కేంద్రానికి ఇన్స్పెక్టింగ్ అధికారిగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిప్పేనాయక్, రూట్ అధికారిగా వి.మల్లికార్జునరెడ్డిని నియమించామన్నారు. కేంద్రం వద్ద ఒక ఎస్ఐ, ఇద్దరు పురుష, ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను నియమించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలని, వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్ష వేళలకు అనుకూలంగా బస్సులు నడపాలని ఆదేశించారు. 144 సెక్షన్ పకడ్బందీగా అమలు చేయాలన్నారు. పరీక్ష సమయాలు ఇలా... ● ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్ష జరుగుతుంది. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు పేపర్–2, 3 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పేపర్–3 పరీక్ష జరుగుతుంది. ● కేఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ మహిళ కళాశాల పరీక్ష కేంద్రంలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావెల్ అకాడమీ పరీక్షకు సంబంధించి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్–1, 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పేపర్–2 జరుగుతుంది. ● అభ్యర్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలి. ● ఈ–అడ్మిట్ కార్డుతో పాటు ఏదేని గుర్తింపు కార్డు, పాస్పోర్టు సైజ్ ఫొటోలు, పెన్, పెన్సిల్ తీసుకువాల్సి ఉంటుంది. ● మొబైల్ ఫోన్లు, డిజిటల్, స్మార్ట్ గడియారాలు, బ్లూటూత్ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు. -
నీటి ఎద్దడి నివారణకు చర్యలు
ధర్మవరం: వేసవి తీవ్రతరమవుతున్న నేపథ్యంలో జిల్లాలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మైనర్ ఇరిగేషన్ శాఖ ద్వారా ధర్మవరం నియోజకవర్గంలోని చెరువుల అభివృద్ధికి ఎంతమేర నిధులు అవసరమో నివేదికలు సిద్ధం చేయాలన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మైనర్ ఇరిగేషన్, పంచాయతీరాజ్శాఖ, గ్రామీణ నీటి పారుదల శాఖ, ఎన్టీఆర్ హౌసింగ్ నిర్మాణాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... నియోజకవర్గంలో 85 చెరువుల అభివృద్ధికి 96 పనులు ఆమోదించి రూ.179.9 లక్షలు అవసరమని ప్రభుత్వానికి నివేదికలు పంపామన్నారు. అలాగే త్రిబుల్ ఆర్ ద్వారా 21 చెరువుల అభివృద్ధికి రూ.795 లక్షలు అవసరమని కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు సమర్పించామన్నారు. హెచ్ఎన్ఎస్ఎస్, పీఏబీఆర్ కాలువల ద్వారా 14 చెరువులకు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముదిగుబ్బ మండలంలోని యోగివేమన రిజర్వాయర్ ప్రాజెక్టును రూ.60 లక్షలతో పనులు చేపట్టాలని ఆదేశించారు. అలాగే నియోజకవర్గంలో తాడిమర్రి, ముదిగుబ్బ, ధర్మవరం అర్బన్లో తీవ్ర నీటి ఎద్దడి నివారణ కోసం చర్యలు తీసుకోవాలన్నారు. ధర్మవరం మున్సిపాలిటీలోని శ్మశాన వాటికను హైదరాబాద్లోని మహాప్రస్థానంలా తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. నిరుపేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రానున్న ఐదేళ్లలో అర్హులైన వారందరికి ఇళ్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. అందులో భాగంగా ఇప్పటికే నియోజకవర్గంలో 15,830 ఇళ్ల నిర్మాణాలకు ఆమోదం తెలిపామని, అర్బన్ ప్రాంతాల్లో 13 వేల ఇళ్ల నిర్మాణ పనులు దశల వారీగా జరుగుతున్నాయని తెలిపారు. సమావేశంలో ఆర్డీఓ మహేష్, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్కుమార్, మైనర్ ఇరిగేషన్ అధికారి విశ్వనాథ్రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ అధికారి మల్లికార్జునప్ప, హౌసింగ్ అధికారి శంకరయ్య, ఉద్యనశాఖ, జాతీయ రహదారులు, రోడ్లు భవనాల శాఖ అధికారులు పాల్గొన్నారు. ధర్మవరంలో శ్మశాన వాటిక అభివృద్ధికి ప్రణాళికలు వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ -
‘పరిటాల’ పతనం ప్రారంభమైంది
రామగిరి: కురుబ లింగమయ్య హత్యతో పరిటాల కుటుంబం రాజకీయ పతనం ప్రారంభమైనట్లేనని విశ్రాంత జిల్లా జడ్జి ఎం.కృష్ణప్ప అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ బద్ధంగా రాజకీయాలను ఎదుర్కోలేక హత్యా రాజకీయాలను ప్రోత్సహించడం కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం సబబు కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల టీడీపీ గూండాల చేతిలో దారుణ హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబ సభ్యులను కురుబ సంఘం నాయకులు బుధవారం పాపిరెడ్డిపల్లికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా లింగమయ్య కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. కురుబలు రాజకీయంగా ఎదగడాన్ని ఓర్వలేక హత్యలకు తెగబడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. అనంతరం విశ్రాంత జడ్జి కృష్ణప్ప మాట్లాడుతూ.. లింగమయ్య హత్య కేసు పక్కదోవ పట్టించకుండా నిష్పక్షపాతంగా విచారణ చేసి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఏకపక్ష వైఖరి వీడి.. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. చట్టం ఎవరి చుట్టం కాదని.. చట్టానికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి పోలీసుపై ఉందన్నారు. లింగమయ్య హత్య కేసును సీబీ సీఐడీకి బదిలీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రామగిరి ఎస్ఐ సుధాకర్యాదవ్కు మాజీ సీఎం వైఎస్ జగన్ను విమర్శించే స్థాయి లేదన్నారు. ఎస్ఐ తన పరిధి మేరకు.. తాను చేసే వృత్తిలో నిబంధనల మేరకు విధులు నిర్వర్తిస్తే మంచిదని సూచించారు. సుధాకర్ యాదవ్ సక్రమంగా విధులు నిర్వర్తించి ఉంటే లింగమయ్య హత్య జరిగేది కాదని జనం నోట నానుతోందన్నారు. కురుబల జోలికొస్తే ఖబడ్దార్.. కురుబ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజహంస శ్రీనివాసులు మాట్లాడుతూ.. కురుబల జోలికొస్తే ఎంతటి వారినైనా వదిలేది లేదన్నారు. ప్రశాంత వాతావరణంలో వ్యవసాయం చేసుకునే రైతు లింగమయ్యను హత్య చేయడం దారుణమన్నారు. రామగిరిలో ఏ రాజ్యాంగం అమలులో ఉందో అర్థం కావడం లేదన్నారు. హత్యారాజకీయాలను ప్రోత్సహించడం రాజకీయం కాదని హితవు పలికారు. కురుబ కులస్తులు సౌమ్యులని.. ఎవరి జోలికీ పోరని.. అలా అని రాజకీయం అంటగట్టి హత్యలకు తెగబడితే ఖబడ్దార్ అని హెచ్చరించారు. లింగమయ్యను హత్య చేసిన వారికి కఠిన శిక్ష పడే వరకు పోరాడతామన్నారు. అంతకుముందు లింగమయ్య భార్య రామాంజినమ్మ, పెద్దకుమారుడు మనోహర్, ఆయన భార్య రేణుక, చిన్న కుమారుడు శ్రీనివాసులు, కుమార్తె ప్రమీలతో పాటు ఇతర కుటుంబ సభ్యులను కురుబ సంఘం నాయకులు పరామర్శించారు. కురుబ లింగమయ్య హత్య దుర్మార్గం పాపిరెడ్డిపల్లిలో విశ్రాంత జిల్లా జడ్జి ఎం.కృష్ణప్ప కురుబల జోలికొస్తే ఖబడ్దార్ హెచ్చరించిన కురుబ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజహంస శ్రీనివాసులు -
రైలు ఢీకొని వృద్ధుడి మృతి
ధర్మవరం అర్బన్: స్థానిక సత్యసాయినగర్కు చెందిన శంకర్ గోవిందు (70) ప్రమాదవశాత్తు రైలు ఢీకొని మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం సిద్దయ్యగుట్టలో ఉన్న తన తల్లిని పలకరించి, రాత్రి సమయంలో ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యంలో పట్టాలపై వస్తున్న రైలును గమనించకుండా రైల్వే గేటు దాటే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య చౌడమ్మ, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న హిందూపురం జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ ఎర్రిస్వామి బుదవారం ఘటనాస్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు.వ్యక్తి దుర్మరణంఅగళి: ద్విచక్ర వాహన చోదకులు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు... మడకశిర మండలం వడ్రుపాలెం గ్రామానికి చెందిన ఆంజనేయులు (42) శిర నుంచి స్వగ్రామానికి వెళుతుండగా అగళి మండలం వడగుంటనహళ్లి గ్రామ సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా దొక్కలపల్లి గ్రామానికి చెందిన రాకేష్, రంగనాథ్ వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొంది. ఘటనలో రోడ్డు పక్కన కిందపడిన ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన రాకేష్, రంగనాథ్ను స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా కర్ణాటకలోని శిర ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
హాకీ టోర్నీ విజేత ‘కాకినాడ’
ధర్మవరం: స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానం వేదికగా హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరుగుతున్న 15వ రాష్ట్రస్థాయి బాలుర జూనియర్ హాకీ టోర్నీ విజేతగా కాకినాడ జిల్లా జట్టు నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో వైఎస్సార్ జిల్లా జట్టుతో తలపడిన కాకినాడ జట్టు ఆది నుంచి ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ 2–0 గోల్స్ తేడాతో విజేత ట్రోఫీని కై వసం చేసుకుంది. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సత్యకుమార్.. విజేత జట్టును అభినందిస్తూ ట్రోఫీని అందజేశారు. రెండో స్థానంలో నిలిచిన వైఎస్సార్ జిల్లా జట్టుకు ధర్మవరం షిరిడి సాయిబాబా సేవా సమితి అధ్యక్షుడు వీరనారాయణ, మూడో స్థానంలో నిలిచిన అన్నమయ్య జిల్లా జట్టుకు చేనేత నాయకురాలు జయశ్రీ బహుమతులు, ట్రోఫీలను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ధర్మవరంలో జాతీయ స్థాయి హాకీ టోర్నీ నిర్వహణకు కృషి చేస్తానని భరోసానిచ్చారు. కార్యక్రమంలో హాకీ ఆంధ్రప్రదేశ్ ట్రెజరర్ థామస్ పీటర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యప్రకాష్, ఉపాధ్యక్షుడు గౌరీప్రసాద్, ఉడుముల రామచంద్ర, ఊకా రాఘవేంద్ర, మహమ్మద్ అస్లాం, ట్రెజరర్ అంజన్న, హాకీ కోచ్ హసేన్ తదితరులు పాల్గొన్నారు. ధర్మవరంలో జాతీయ స్థాయి హాకీ టోర్నీ నిర్వహణకు కృషి : మంత్రి -
భూగర్భ జలమట్టం పడిపోవడం.. నీటి పథకాలు పనిచేయకపోవడంతో చుక్కనీటి కోసం గ్రామీణులు దిక్కులు చూస్తున్నారు. రోజుల తరబడి తాగునీరు సరఫరా కాక దాహం కేకలు వేస్తున్నారు. స్పందించాల్సిన పాలకులు చోద్యం చూస్తుండగా ఊరూరా మహిళలు ఖాళీ బిందెలతో రోడ్లెక్కుతున్నారు. తాగునీరివ
గ్రామీణ నీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) విభాగం ఆధ్వర్యంలో ఈ ఏడాది వేసవికి సంబంధించి రూ.5.87 కోట్లతో 284 పనులను చేపట్టినట్లు ఆ శాఖాధికారులు పేర్కొన్నారు. అయితే ఏ గ్రామంలో చేపట్టారో.. ఎక్కడ సమస్య పరిష్కరించారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇందులో 85 చోట్ల బోరుబావుల తవ్వకానికి రూ.85 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. కానీ ఆ పనులెక్కడా కనిపించడం లేదు. జిల్లాలోని 51 గ్రామాలు వాల్టా చట్టం పరిధిలో ఉండగా ఆయా గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి. కానీ ఆ దిశగా యంత్రాంగం చర్యలు తీసుకోలేదు. పాలకులూ కనీసం పట్టించుకోలేదు. ఇక ఇతర ప్రాంతాల్లో కొత్తగా బోర్లు వేసే అవకాశం ఉన్నా...ఎవరూ స్పందించడం లేదు. కేవలం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే నీటి సమస్యకు కారణమని జనం అంటున్నారు. ముఖ్యంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ రూపొందించడంలో యంత్రాంగం విఫలమైందంటున్నారు. సాక్షి, పుట్టపర్తి వేసవి ఆరంభంలోనే తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది తగినంత వర్షాలు కురవక పోవడం.. భూగర్భ జలమట్టం పడిపోవడంతో బోరుబావులు ఎండిపోయాయి. దీంతో రక్షిత మంచినీటి పథకాలు అలంకార ప్రాయంగా మారాయి. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా సాగు, తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఏ గ్రామంలో చూసినా నీటి సమస్య వెంటాడుతోంది. ‘నీళ్లో రామచంద్రా’ అంటూ జనం నిట్టూరుస్తున్నారు. తాగునీటి కోసం రోడ్లెక్కి ఆందోళనకు దిగుతున్నారు. అధికారులు సమస్యకు తాత్కాలిక పరిష్కారం చూపుతుండగా... వారం రోజుల్లోనే మళ్లీ నీటి కష్టాలు పునరావృతమవుతున్నాయి. దీనికి తోడు ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందస్తు చర్యలు లేకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పుట్టపర్తి, బుక్కపట్నం, ఓడీ చెరువు, లేపాక్షి, మడకశిర, హిందూపురం, రొళ్ల, అగళి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో ఇప్పటికే ప్రజలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. అయినా పాలకుల్లో చలనం రాలేదు. ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కిన రోజు మాత్రం రెండు నీటి ట్యాంకర్లను పంపించి చేతులు దులుపుకుంటున్నారు. జిల్లా కేంద్రం పుట్టపర్తిలో తాగునీటి సమస్య తీవ్రతరమైంది. ఇక్కడ బహుళ అంతస్తుల భవనాలు ఉండగా...తాగునీటి సమస్యతో జనం అల్లాడిపోతున్నారు. మూడు, నాలుగు ఫోర్లలో ఉంటున్న వారు నీరు రాక నరకం చూస్తున్నారు. ముఖ్యంగా మున్సిపల్ కార్యాలయం వెనుక సందులో రెండురోజులకోసారి అర్ధరాత్రి వేళ మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కుతున్నారు. జిల్లా కేంద్రమైనప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని.. సమయానికి నీళ్లు రావడం కష్టంగా మారిందని వాపోతున్నారు. శ్రీసత్యసాయి తాగునీటి పథకం ఉన్నప్పటికీ.. ఉద్యోగులకు ప్రభుత్వం సమయానికి జీతాలు ఇవ్వకపోవడంతో సమస్య జఠిలమైంది. పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని బుక్కపట్నం మండలం చిలకలగడ్డపల్లిలోనూ తాగునీటి ఎద్దడి తీవ్రమైంది. తాగునీటి కోసం మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఓడీ చెరువు మండలంలోనూ రక్షిత తాగునీటి పథకాలు పనిచేయకపోవడంతో ప్రజలు వ్యవసాయ బోర్ల వద్ద నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. సీఎం చంద్రబాబు బావమరిది, సినీనటుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో నెలరోజుల ముందే నీటి కష్టాలు మొదలయ్యాయి. ఏ వార్డులో చూసినా నీటి సమస్య వెంటాడుతోంది. ట్యాంకర్ రూ.500 వెచ్చించి నీరు కొనుగోలు చేసి వినియోగిస్తున్న దుస్థితి ఏర్పడిందని ప్రజలు వాపోతున్నారు. ఎమ్మెల్యే చుట్టపు చూపుగా వచ్చి వెళ్తారని.. సమస్యలు పరిష్కరించే వారే లేరని చెబుతున్నారు. లేపాక్షి మండలంలోనూ తాగునీటి కోసం ఇటీవల మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. గుక్కెడు తాగునీరివ్వలేని పాలకుల తీరును నిరసించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మవరం పట్టణంలో నీటి సమస్య వేధిస్తోంది. సరైన సమయానికి నీరు రావడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రతరం కాగా, రెండు రోజుల కిందట ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. మంత్రి సత్యకుమార్ నియోజకవర్గంలో నెలకొన్న నీటి సమస్య పరిష్కరించడంలో విఫలం అవుతున్నారని విమర్శించారు. గడిచిన ఐదేళ్లలో ఏనాడూ నీటి సమస్య కనిపించలేదని ప్రజలే చెబుతున్నారు. కర్ణాటక సరిహద్దున ఉన్న మడకశిర నియోజకవర్గ వ్యాప్తంగా నీటి సమస్య ప్రజలను వేధిస్తోంది. ఏ గ్రామంలో చూసినా తాగునీటి కష్టాలే కనిపిస్తున్నాయి. దీనికి తోడు చాలా గ్రామాలు వాల్టా చట్టం పరిధిలో ఉండటంతో సమస్య మరింత తీవ్రంగా మారింది. పాలకులు గ్రామాలకు నీళ్లు ఇవ్వక.. ప్రజలు బోర్లు వేసుకోలేక.. నానా అవస్థలు పడుతున్నారు. మడకశిర, రొళ్ల, అగళి మండలాల్లో ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. పొలాల్లోని బోర్ల వద్ద నీటి కోసం యుద్ధాలకు దిగుతున్నారు. 12.9 మీటర్లు ప్రస్తుతం జిల్లా భూగర్భ జలమట్టం రూ.5.87 కోట్లు ఆర్డబ్ల్యూస్ ద్వారా కేటాయించిన నిధులు ఆర్డబ్ల్యూఎస్ పనులెక్కడ? ముందస్తు చర్యలేవీ? ఊరూరా నీటికష్టాలు జిల్లాలో తీవ్రమైన తాగునీటి సమస్య రోజూ ఏదో చోట రోడ్డెక్కుతున్న ప్రజలు పుట్టపర్తి, హిందూపురం, మడకశిరలో దాహం కేకలు ధర్మవరంలోనూ సరిపడా అందని తాగునీరు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలో అధికారుల విఫలం ప్రజల నీటి సమస్యలు పట్టించుకోని అధికారులు, పాలకులు 51 వాల్టా చట్టం కింద ఉన్న గ్రామాలు 284 సమ్మర్ యాక్షన్ ప్లాన్ కింద ఆర్డబ్ల్యూస్ ద్వారా చేపట్టిన పనులు పుట్టపర్తిని వెంటాడుతోన్న దాహార్తి.. మంత్రి ఇలాకాలో తీరని కష్టాలు.. బాలయ్య అడ్డాలో దాహం.. దాహం మడకశిర వ్యాప్తంగా నీటియుద్ధాలు.. -
పరికరాలు లేవంటున్నారు
నేను కంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా. సదరం స్లాట్ బుక్ చేసుకోవడమంటే ఓ యుద్ధం చేసినట్లవుతోంది. ఆన్లైన్లో సైట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో కూడా అర్థం కావడం లేదు. అష్టకష్టాలు పడి ఎప్పుడో బుక్ చేసుకుంటే ఇప్పుడు పరీక్షలకు అవకాశం వచ్చింది. ఇక్కడకు వస్తే కంటి వైద్య పరీక్షలకు సంబంధించి ఒక్క పరికరం కూడా లేదంటున్నారు. పరికరాలు లేనప్పుడు సదరం క్యాంప్ నిర్వహణకు ఎలా అనుమతిచ్చారు. మాకెలా సమాచారం ఇచ్చారు. దివ్యాంగులంటే ఇంత చులకనా? – శ్రీనివాసులు, రాప్తాడు, అనంతపురం జిల్లా -
అధికారుల నిర్లక్ష్యం.. దివ్యాంగులకు శాపం
తాడిపత్రి రూరల్: దివ్యాంగులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు దక్కాలంటే సదరం సర్టిఫికెట్ తప్పనిసరి అయింది. దీంతో సదరం క్యాంప్లో వైద్య పరీక్షలు చేయించుకునే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతుండడంతో స్లాట్ విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ విధానం ద్వారా ముందుగా స్లాట్ బుక్ చేసుకున్న వారికి తేదీ, సదరం క్యాంప్ నిర్వహించే ఆస్పత్రి ఖరారు చేసి సమాచారాన్ని అందజేస్తారు. ఈ విధానం దివ్యాంగులకు ఎంతో సౌలభ్యంగా మారింది. అయితే ఇటీవల ఆర్థో, కంటి పరీక్షలకు సంబంధించి స్లాట్ బుక్ చేసుకున్న వారికి తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రిని కేటాయిస్తూ మంగళవారం సదరం క్యాంప్ నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో జిల్లాతో పాటు వైఎస్సార్, శ్రీసత్యసాయి, కర్నూలు జిల్లాల నుంచి వందలాది మంది దివ్యాంగులు వారి సహాయకులతో కలసి వచ్చారు. అయితే వైద్య పరీక్షలు చేసేందుకు ఎలాంటి పరికరాలు లేవని తెలియడంతో దివ్యాంగులు అయోమయంలో పడ్డారు. పరికరాల్లేవు.. పరీక్షలు చేయలేం ఆర్థో, కంటి వైద్య పరీక్షలు చేసేందుకు తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రిలో ఎలాంటి వైద్య పరికరాలు లేవు. అర్థోకు అరకొరగా పరికరాలు ఉన్నా కంటి పరీక్షలకు సంబంధించి ఒక్క పరికరమూ లేదు. తమకందిన సమాచారంతో మంగళవారం ఉదయం 8 గంటలకే వందలాది మంది దివ్యాంగులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఉదయం 11గంటలైన పరీక్షలు మొదలు పెట్టకపోవడంతో విసుగెత్తి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డేవిడ్ను నిలదీశారు. దీంతో కంటి డాక్టర్ వసంత, ఆర్థో వైద్యుడు హరిప్రసాద్ను డాక్టర్ డేవిడ్ పిలిపించుకుని మాట్లాడారు. సదరం క్యాంప్కు హాజరైన దివ్యాంగులకు అన్ని రకాల పరీక్షలు చేయడానికి అవసరమైన పరికరాలు లేవని వారు చేతులేత్తేయడంతో విషయాన్ని వెంటనే డీసీహెచ్ డాక్టర్ పాల్ రవికుమార్ దృష్టికి సూపరింటెండెంట్ తీసుకెళ్లారు. బయటి నుంచి పరికరాలు తీసుకొచ్చి పరీక్షలు నిర్వహించాలంటూ ఆయన సలహా ఇచ్చి ఫోన్ పెట్టేశారు. వెంటనే మరోసారి డీసీహెచ్కు డాక్టర్ డేవిడ్ ఫోన్ చేయడంతో ఆయన మంత్రి సత్యకుమార్ పర్యటనలో ఉన్నారంటూ కింది స్థాయి ఉద్యోగి తెలిపి ఫోన్ పెట్టేశారు. ఈ విసయం తెలియగానే దివ్యాంగులు మండిపడుతూ సూపరింటెండెంట్తో వాగ్వాదానికి దిగారు. రాప్తాడుకు చెందిన దివ్యాంగుడు విషయాన్ని వెంటనే వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయనకే నేరుగా ఫోన్ చేశారు. అయితే మంత్రి మీటింగ్లో ఉన్నారని పీఏ హర్ష తెలిపి, ఆస్పత్రి సూపరింటెండెంట్తో మాట్లాడారు. చివరకు పరికరాలే లేనప్పుడు వైద్య పరీక్షలు చేయడం సాధ్యం కాదంటూ చేతులెత్తేయడంతో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పరీక్షల కోసం పిల్లాపాపలు, వృద్దులతో కలసి వచ్చిన వారు నిరాశతో వెనుదిరిగారు. వైద్య పరీక్ష పరికరాలు లేకున్నా తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి సదరం స్లాట్ ఖరారు జిల్లాతో పాటు వైఎస్సార్, శ్రీసత్యసాయి, కర్నూలు జిల్లాల నుంచి తరలివచ్చిన దివ్యాంగులు -
హోరాహోరీగా ఉట్టి ఉత్సవం
గాండ్లపెంట: విశ్వకవి యోగివేమన ఉత్సవాల్లో భాగంగా మూడోరోజు మంగళవారం గాండ్లపెంట మండలం కటారుపల్లిలో నిర్వహించి ఉట్టి ఉత్సవంలో యువకులు హోరాహోరీగా తలపడ్డారు. ఆలయ ఎదుట ఇనుప స్తంభం ఏర్పాటు చేసి స్తంభానికి పై భాగాన తాంబూలంతో ఆలయ పీఠాధిపతి నందవేమారెడ్డి ఆధ్వర్యంలో రూ.10,116 నగదు ఉట్టి కట్టారు. ఉట్టిని అందుకునేందుకు దాసరిండ్లు, కటారుపల్లి, మద్దివారిగొంది గ్రామాలకు చెందిన యువకులు పలుమార్లు ప్రయత్నించి.. చివరకు మద్దివారిగొందికి చెందిన జట్టు సభ్యులు అందుకున్నారు. కార్యక్రమంలో ఖాద్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.శేష వాహనంపై శ్రీరంగనాథుడుతాడిపత్రి: మండలంలోని ఆలూరు కోనలో వెలసిన రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3 వ రోజు మంగళవారం దేవేరులతో కలసి శేషవాహనంపై భక్తులకు శ్రీవారు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలోని శ్రీదేవి భూదేవి సమేత శేషతల్ప రంగనాథస్వామి మూలవిరాట్కు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి విశేష అలంకరణ చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. రాత్రి శేషవాహన సేవలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
జానపద కళాకారిణికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు
ధర్మవరం అర్బన్: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ధర్మవరం పట్టణానికి చెందిన జానపద కళాకారిణి సోమిశెట్టి సరళకు చోటు దక్కింది. ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్ను మంగళవారం ఆమె అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఏడాది జనవరి 26న ఢిల్లీలో జరిగిన పరేడ్లో ఆంధ్రప్రదేశ్ తరఫున టీం లీడర్ గాయత్రి ప్రసాద్ వర్మ ఆధ్వర్యంలో తన బృందంతో గరగ నృత్య ప్రదర్శన ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఈ ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కేలా చేసిందన్నారు. వివాహిత బలవన్మరణం కనగానపల్లి: మండలంలోని మామిళ్లపల్లికి చెందిన మురళి భార్య నీలమ్మ (32) ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో జీవితంపై విరక్తి చెందిన ఆమె సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, భర్త మురళి వేధింపులే తమ కుమార్తె ఆత్మహత్యకు కారణమంటూ మృతురాలి తల్లిదండ్రులు చేసిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్త చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ● గోరంట్ల: మండలంలోని పుట్టగుండ్లపల్లి గ్రామానికి చెందిన వివాహిత వడ్డే సరస్వతి (33) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... వడ్డే సరస్వతిని తరచూ భర్త, అత్త అనుమానంతో వేధింపులకు గురి చేసేవారు. వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి సోదరుడు ఆనంద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ శేఖర్ తెలిపారు. దొంగను పట్టించిన రైతులు బత్తలపల్లి: వ్యవసాయ తోటల వద్ద రైతులు పండించిన పంటను అపహరించుకెళుతున్న ఓ యువకుడిని రైతులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన బత్తలపల్లి మండలం సంజీవపురం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన మేరకు... సంజీవపురం గ్రామానికి చెందిన రైతు శ్రీధర్ దానిమ్మ పంటను సాగు చేశారు. పంట చేతికి రావడంతో పొలంలో సోమవారం రాత్రి కాపలా కాస్తుండగా ఈదుల ముష్టూరు బీసీ కాలనీకి చెందిన నాగరాజు తన ద్విచక్రవాహనంలో పొలం వద్దకు చేరుకున్నాడు. అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో గమనించిన రైతు వెంటనే గ్రామస్తులకు, సన్నిహితులకు సమాచారం చేరవేశాడు. వారు పొలం వద్దకు చేరుకుని నాగరాజును పట్టుకున్నారు. ద్విచక్రవాహనంతో సహా పోలీసులకు అప్పగించారు. విచారణలో దానిమ్మ కాయలను కోసుకెళ్లేందుకు వచ్చినట్లుగా నిందితుడు అంగీకరించినట్లు వెల్లడైంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ కొనసాగిస్తున్నారు. తోటకు నిప్పు ముదిగుబ్బ: మండల కేంద్రంలోని ఐఏఎస్ రామాంజినేయులు తోటకు మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో రూ.2 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధితురాలు మంజుల తెలిపారు. తోటకు సమీపంలో ఉన్న ఎండుగడ్డికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పురాజేయడంతో మంటలు వ్యాపించి తోటను చుట్టుముట్టినట్లు వివరించారు. పొలం చుట్లూ ఉన్న 100 టెంకాయ చెట్లతో పాటు 70 చీనీ చెట్లు కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసింది. -
ప్రమాదంలో వీఆర్ఏ మృతి
ముదిగుబ్బ: మండలంలోని ఎనుములవారిపల్లి వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో రెడ్డిపల్లి వీఆర్ఏ ప్రసాద్(38) దుర్మరణం పాలయ్యారు. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు... విధులకు హాజరయ్యేందుకు మలకవేమల క్రాస్ నుంచి రెడ్డిపల్లికి ద్విచక్ర వాహనంపై వెళుతున్న ప్రసాద్ను నల్లమాడ వైపు నుంచి వస్తున్న బొలెరో వాహనం ఢీకొంది. తలకు తీవ్ర గాయమై ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.రెడ్డిపల్లిలో విషాదఛాయలునల్లమాడ: వీఆర్ఏ ప్రసాద్ ఆకస్మిక మృతితో ఆయన స్వగ్రామం నల్లమాడ మండలం రెడ్డిపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. కదిరి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని రెడ్డిపల్లికి తీసుకొచ్చారు. భార్య, ఇద్దరు కుమార్తెలు రోదించిన తీరు అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది. తహసీల్దార్ రంగనాయకులు, కార్యాలయ సిబ్బంది, వీఆర్ఏలు రెడ్డిపల్లికి చేరుకుని ప్రసాద్ మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.