Aadhaar Link
-
మీ ఆధార్పై ఎన్ని సిమ్ కార్డులున్నాయి? ఇలా తెలుసుకోండి
టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో.. సైబర్ నేరాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. డిజిటల్ ప్రపంచంలో ఎంత తెలిసినవారైనా తప్పకుండా మోసపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే సిమ్ కార్డును కొనుగోలు చేసే సమయంలో తప్పకుండా చెల్లుబాటు అయ్యే చిరునామా, గుర్తింపు రుజువు అవసరం. దీనికి ఆధార్ కార్డును ఉపయోగిస్తారు. ఈ ఆధారాలను ఉపయోగించి కొందరు ఆర్ధిక నేరాలకు పాల్పడుతున్నారు.ఆన్లైన్ మోసాలు పెరుగుతున్న సమయంలో.. ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజానికి సిమ్ కార్డు ఆధార్ కార్డ్కు లింక్ అయి ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) నిర్దేశించిన నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి పేరుతో తొమ్మిది సిమ్ కార్డులను తీసుకోవచ్చు.ఆర్ధిక నేరాలను తగ్గించడానికి.. ఆధార్ సమాచారాన్ని దుర్వినియోగం కాకుండా చూడటానికి, డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ (DoT) టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ (TAF-COP) అనే కొత్త ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. దీని ద్వారా మీ ఆధార్ కార్డ్కి ఎన్ని సిమ్ కార్డులు లేదా ఫోన్ నెంబర్లు లింక్ అయ్యాయో తెలుసుకోవచ్చు.ఆధార్ కార్డుకు ఎన్ని సిమ్ కార్డ్లు లింక్ అయ్యాయో చెక్ చేయడం ఎలా?సంచార్ సతి అధికారిక వెబ్సైట్ (www.sancharsaathi.gov.in) ఓపెన్ చేయాలి.వెబ్సైట్ను కిందికి స్క్రోల్ చేస్తే.. సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ కనిపిస్తుంది. దానికి కింద మొబైల్ కనెక్షన్లను చూడటానికి ఆప్షన్ ఎంచుకోవాలి.మొబైల్ కనెక్షన్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తరువాత.. మీకు మరో పేజీ ఓపెన్ అవుతుంది.అక్కడ మీ 10 అంకెల మొబైల్ ఫోన్ నంబర్ను ఎంటర్ చేయాలి.దానికి కింద అక్కడ కనిపించే క్యాప్చా కోడ్ను నమోదు చేయాలి.క్యాప్చా ఎంటర్ చేసిన తరువాత మీ ఫోన్ నెంబరుకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి.ఓటీపీ ఎంటర్ చేసిం తరువాత మీ ఆధార్ కార్డ్కి ఎన్ని నెంబర్స్ లింక్ అయ్యాయో డిస్ప్లే మీద కనిపిస్తాయి.అక్కడ మీరు అనవసరమైన నెంబర్లను బ్లాక్ చేసుకోవచ్చు.సర్వీస్ ప్రొవైడర్లు ఇచ్చే ఆఫర్లకు ఆకర్షితులై ఒక్కొక్కరు నాలుగైదు సిమ్ కార్డులు కొనేసి.. వినియోగించిన తరువాత పడేస్తుంటారు. ఇలాంటి నెంబర్లను కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. గతంలో విజయవాడకు చెందిన ఒకే వ్యక్తి కార్డుతో 658 సిమ్ కార్డులు యాక్టివేట్ అయినట్లు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసింది. టెలికామ్ అధికారులు వీటిని మొత్తం బ్లాక్ చేశారు.ఇదీ చదవండి: అకౌంట్లోకి రూ.5000.. క్లిక్ చేస్తే అంతా ఖాళీ!సిమ్ కార్డులను ఉపయోగించిన తరువాత, ఎక్కడపడితే అక్కడ పడేయడం మంచిది కాదు. వాటిని కొంతమంది మోసపూరిత కార్యకలాపాలకు ఉపయోగించే అవకాశం ఉంది. అంతే కాకుండా మీ ఆధార్ కార్డు లేదా ఇతర డాక్యుమెంట్స్ ఉపయోగించే తెలియనివారికి ఎట్టిపరిస్థితుల్లో సిమ్ కార్డులను కొనుగోలు చేసి ఇవ్వొద్దు. వారు ఏదైనా నేరాలకు పాల్పడితే.. దాని ప్రభావం మీ మీద పడే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి. -
ఉచిత ఆధార్ అప్డేట్ గడువు పొడిగింపు
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఆధార్ ఉచిత అప్డేట్ గడువును వచ్చే ఏడాదికి పొడిగించింది. గతంలో తెలిపిన విధంగా ఉచిత ఆధార్ అప్డేట్కు ఈ రోజు చివిరి తేదీ. కానీ దాన్ని వచ్చే ఏడాది జూన్ 14 వరకు పొడిగిస్తున్నట్లు యూఐడీఏఐ ప్రకటన విడుదల చేసింది. ఈమేరకు ఆధార్ అధికారిక ఎక్స్ లింక్లో వివరాలు పోస్ట్ చేసింది.యూఐడీఏఐ వెల్లడించిన గడువు (2025, జూన్ 14) లోపు ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేసుకుంటే.. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఆధార్ సెంటర్కు వెళ్లి అప్డేట్ చేసుకుంటే మాత్రం.. రూ.50 అప్లికేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.#UIDAl extends free online document upload facility till 14th June 2025; to benefit millions of Aadhaar Number Holders. This free service is available only on #myAadhaar portal. UIDAl has been encouraging people to keep documents updated in their #Aadhaar. pic.twitter.com/wUc5zc73kh— Aadhaar (@UIDAI) December 14, 2024ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేసుకోవడం ఎలా?● మైఆధార్ పోర్టల్ ఓపెన్ చేయండి● లాగిన్ బటన్ మీద క్లిక్ చేసి.. మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, దానికింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.● నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసిన తరువాత లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి.● రిజిస్టర్ మొబైల్ నెంబరుకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.● అక్కడే డాక్యుమెంట్స్ అప్డేట్, అడ్రస్ అప్డేట్ వంటివన్నీ కనిపిస్తాయి.● మీరు ఏది అప్డేట్ చేయాలనుకుంటున్నారో.. దానిపైన క్లిక్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు. అయితే దీనికి అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.● అవసరమైనవన్నీ అప్డేట్ చేసుకున్న తరువాత మీరు సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ పొందుతారు. దీని ద్వారా డాక్యుమెంట్ అప్డేట్ను ట్రాక్ చేయవచ్చు. -
EPFO Update: ఆధార్ లేకుండానే ఈపీఎఫ్ క్లెయిమ్!
కొంత మంది ఉద్యోగులకు పెద్ద ఊరటనిస్తూ ఫిజికల్ క్లెయిమ్లను సెటిల్ చేయడానికి ఇకపై తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)తో ఆధార్ను లింక్ చేయాల్సిన అవసరం లేదని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ప్రకటించింది. ఇటీవలి సర్క్యులర్లో పేర్కొన్న కొత్తగా సవరించిన విధానంలో భాగంగా ఈ మార్పు చేసింది.అయితే మినహాయింపు అందరికీ కాదు. భారతదేశంలో తమ అసైన్మెంట్ పూర్తి చేసి, ఆధార్ పొందకుండా స్వదేశానికి తిరిగి వెళ్లిన అంతర్జాతీయ వర్కర్లు, విదేశాలకు వలస వెళ్లి, అక్కడి పౌరసత్వం పొందిన ఆధార్ లేని భారతీయులకు ఈ మినహాయింపు వర్తిస్తుంది. అలాగే ఈపీఎఫ్&ఎంపీ చట్టం ప్రకారం "ఉద్యోగులు"గా అర్హత పొంది ఆధార్ లేకుండా భారత్ వెలుపల నివసిస్తున్న నేపాలీ, భూటాన్ పౌరులు కూడా మినహాయింపును వినియోగించుకోవచ్చు. ఇదీ చదవండి: EPFO 3.0: భారీ సంస్కరణలు.. అధికంగా పీఎఫ్ సొమ్ము!వీరంతా ఆధార్ స్థానంలో పాస్పోర్ట్లు లేదా పౌరసత్వ గుర్తింపు ధ్రువీకరణ పత్రాలు వంటి పత్రాలను ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలుగా ఉపయోగించవచ్చు. "డ్యూ డిలిజెన్స్" ప్రక్రియలో భాగంగా, మినహాయింపులు క్లెయిమ్ చేస్తున్న ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలను తనిఖీ చేయాలని, పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ రూ. 5 లక్షలకు మించి ఉంటే సంబంధిత యాజమాన్యాలతో వివరాలను ధ్రువీకరించాలని ఈపీఎఫ్వో అధికారులకు సూచించింది. సెటిల్మెంట్ సొమ్మును నెఫ్ట్ ద్వారానే బదిలీ చేయనున్నట్లు పేర్కొంది. -
ఆధార్, పాన్ లింకింగ్: ఆలస్యానికి రూ.600 కోట్లు..
ఆధార్, పాన్ కార్డు లింకింగ్ అనేది చాలా అవసరం. బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయాలన్నా.. పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా.. ఇది తప్పనిసరి. అయితే ఈ లింకింగ్ కోసం కేంద్రం గడువును 2024 డిసెంబర్ 31 వరకు పెంచినట్లు సమాచారం. ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేయకపోతే.. పాన్ కార్డులు డీయాక్టివేట్ అవుతాయి.నిజానికి 2023 జూన్ 30 నాటికి ఆధార్, పాన్ కార్డు లింకింగ్ గడువు ముగిసింది. గడువు లోపల లింక్ చేసుకొని వారు ఫెనాల్టీ కింద రూ.1,000 చెల్లించి మళ్ళీ యాక్టివేట్ చేసుకోవాల్సి వచ్చింది. జనవరి 29, 2024 నాటికి ఆధార్తో లింక్ చేయని పాన్ల సంఖ్య 11.48 కోట్లు అని ఫిబ్రవరిలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటుకు తెలియజేశారు.దీంతో 2023 జులై 1 నుంచి 2024 జనవరి 31 వరకు ఆధార్, పాన్ కార్డు లింకింగ్ కోసం ఫెనాల్టీ కింద కేంద్రం 601.97 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. పాన్ కార్డ్ డియాక్టివేట్ అయితే.. తరువాత లావాదేవీలలో ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా దాన్ని మళ్లీ యాక్టివేట్ చేయడం కూడా కొంత కష్టమే.ఇదీ చదవండి: 'ఆఫీసు నుంచి లేటుగా వెళ్తున్నా.. రేపు ఆలస్యంగా వస్తా': ఉద్యోగి మెసేజ్ వైరల్వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించే లక్ష్యంతో.. పాన్ ద్వారా వ్యక్తిగత వివరాల యాక్సెస్ను పరిమితం చేయాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదాయపు పన్ను శాఖను ఆదేశించింది. కాబట్టి తప్పకుండా పాన్, ఆధార్ లింకింగ్ చేసుకోవాలి. దీని కోసం అధికారిక వెబ్సైట్ సందర్శించి.. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 234H కింద రూ. 1,000 ఫెనాల్టీ చెల్లించాలి. -
పాన్ కార్డ్ కొత్త రూల్.. డిసెంబర్ 31లోపు తప్పనిసరి!
ఆర్థిక మోసాలను అరికట్టేందుకు పాన్ కార్డుదారులందరికీ భారత ప్రభుత్వం కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. వచ్చే డిసెంబర్ 31 లోపు పాన్ కార్డులను ఆధార్ కార్డులతో లింక్ చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. లేకపోతే ఆయా పాన్ కార్డ్ డియాక్టివేట్ కావడంతోపాటు ఇతర సమస్యలకు దారి తీస్తుంది.ఇదీ చదవండి: డిసెంబర్ 14 డెడ్లైన్.. ఆ తర్వాత ఆధార్ కార్డులు రద్దు!పలు ఫిన్టెక్ సంస్థలు వినియోగదారు అనుమతి లేకుండానే కస్టమర్ ప్రొఫైల్లను రూపొందించడానికి వారి పాన్ సమాచారాన్ని ఉపయోగిస్తున్నాయి. దీంతో గోప్యతా సమస్యలతోపాటు ఆర్థిక మోసాల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించే లక్ష్యంతో పాన్ ద్వారా వ్యక్తిగత వివరాల యాక్సెస్ను పరిమితం చేయాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదాయపు పన్ను శాఖను ఆదేశించింది.లింక్ చేయకపోతే ఏమౌతుంది? డిసెంబరు 31 లోపు ఆధార్ కార్డ్ని పాన్ కార్డ్తో లింక్ చేయకపోతే తీవ్ర పరిణామాలు సంభవించవచ్చు. రెండు కార్డ్లను లింక్ చేయడంలో విఫలమైతే పాన్ కార్డ్ డియాక్టివేట్ అవుతుంది. తదుపరి లావాదేవీలలో ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా దాన్ని మళ్లీ యాక్టివేట్ చేయడం కూడా కష్టం. ఆన్లైన్లో వ్యక్తిగత డేటాను బహిర్గతం చేసేటప్పుడు డేటా గోప్యతా చట్టాల గురించి తెలుసుకోవడం, జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. -
ఆధార్ - రేషన్ కార్డు లింక్.. మరో అవకాశం
ఆధార్ - రేషన్ కార్డు ఇంకా లింక్ చేసుకోని వారికి కేంద్ర ప్రభుత్వం మరో అవకాశమిచ్చింది. వాస్తవానికి వీటిని లింక్ చేసుకోవడానికి గడువు జూన్ 30తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ గడువును గడువును మరో మూడు నెలలు అంటే సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది.రేషన్ కార్డులు దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో అవకతవకలను అడ్డుకోవడానికి ఆధార్ - రేషన్ కార్డును తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని కేంద్రం గతంలో ఆదేశించింది. వీటి అనుసంధానం వల్ల అర్హులకు ఆహార ధాన్యాలు అందడంతో పాటు నకిలీ రేషన్ కార్డులకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది.సమీపంలోని రేషన్ షాప్ లేదా కామన్ సర్వీస్ సెంటర్కు వెళ్లి ఆధార్ - రేషన్ కార్డు లింక్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో పాటు అవసరమైన పత్రాలను అందించి బయోమెట్రిక్ వెరిఫికేషన్తో లింక్ పూర్తి చేసుకోవచ్చు. ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా ఆధార్ - రేషన్ కార్డు లింక్ చేయవచ్చు. -
ఆధార్ కార్డ్ గడువు మరో వారం రోజులు మాత్రమే..
-
8 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి యూపీఐ, ఆధార్ కీలకం.. ఎలాగో తెలుసా..
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ), ఆధార్ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐలు) వల్ల 2030 నాటికి ఇండియా ఆర్థిక వ్యవస్థ 8 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడంలో కీలకంగా పనిచేయనున్నాయని నివేదికలు చెబుతున్నాయి. యూపీఐ, డీపీఐల ద్వారానే ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఎకానమీ లక్ష్యాన్ని సాధించగలదని నాస్కామ్ ఇటీవల విడుదల చేసిన నివేదిక తెలియజేస్తుంది. గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ ఆర్థర్ డి.లిటిల్తో కలిసి నాస్కామ్ ఈ రిపోర్ట్ను రూపొందించింది. ఈ నివేదికలోని వివరాల ప్రకారం.. డీపీఐలు భారతదేశ జనాభాలో 97 శాతం మందిపై ప్రభావం చూపుతున్నాయి. మెచ్యూర్డ్ డీపీఐల వల్ల 31.8 బిలియన్ డాలర్ల సంపద సృష్టి జరిగింది. ఇది 2022లో భారతదేశ జీడీపీలో 0.9 శాతానికి సమానం. ఇదీ చదవండి: ప్లేస్టోర్కు పోటీగా ఫోన్పే యాప్ స్టోర్..? ప్రత్యేకతలివే.. డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ విధానంలో ఆధార్ను పరిచయం చేయడం ద్వారా దాదాపు 15.2 బిలియన్ డాలర్ల విలువైన ఆర్థిక ప్రయోజనాలు దక్కాయి. యూపీఐ వల్ల నగదు లావాదేవీలు, పేపర్ వాడకం తగ్గింది. దాంతో కాలుష్యమూ తగ్గినట్లు నివేదికలో తేలింది. పేపర్వాడకం తగ్గడం వల్ల లాజిస్టిక్స్, రవాణా రంగంలో 2022లో 3.2 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గాయి. -
ఇప్పటికీ మీరు ఆధార్ ను అప్డేట్ చేసుకోలేదా..?
-
ఆన్లైన్లోకి.. ప్రజాపాలన దరఖాస్తులు
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ పరిధిలోని జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, కార్వాన్, గోషామహల్, మెహిదీపట్నం సర్కిళ్ల పరిధిలో రోజూ 30 కేంద్రాల ద్వారా అభయహస్తం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అభయహస్తం కింద మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత కింద సాయం చేసేందుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ► బస్తీలు, కాలనీల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ సర్కిల్–18 పరిధిలో ఈ నెల 5వ తేదీ నాటికి 50 వేల అభయహస్తం దరఖాస్తులు తీసుకున్నారు. ► జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ పరిధిలో ఈ నెల 6వ తేదీ నాటికి 3.80 లక్షల దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ► వచి్చన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసేందుకు ప్రత్యేకంగా 60 మంది డీటీపీ ఆపరేటర్లను నియమించారు. ► వీరికి ఖైరతాబాద్ జోనల్ కార్యాలయంలో శుక్రవారం శిక్షణ ఇచ్చారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలోనే దరఖాస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియ చేపట్టనున్నారు. ► ఇప్పుడు ఉన్న డీటీపీ ఆపరేటర్లు సరిపోకపోతే ప్రైవేటు వాళ్లను నియమించాలని ఆదేశాలు అందాయి. ఈ నెల 17వ తేదీ వరకు నమోదు పూర్తి చేయాలని గడువు నిర్దేశించారు. ► పలు పథకాలకు వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. అందులో నుంచి అర్హులైన వారిని ఎలా ఎంపిక చేస్తారనే మార్గదర్శకాలు ఇంకా వెలువడలేదు. ► వచ్చేనెల నుంచి మహిళలకు రూ. 2,500లు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల పరిధిలో వేలాది మంది మహిళల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ► అధికారులు అర్జీల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిస్తారు. అయితే ఈ సర్వే ఎప్పుడు చేస్తారు.. లబ్ధిదారులు ఎప్పుడు ఎంపిక చేస్తారు.. దీనికి ప్రాతిపదిక ఏమిటీ.. ఏయే అర్హతలు చూస్తారు.. ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డుల్లో దేనిని పరిగణలోనికి తీసుకుంటారనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ► దరఖాస్తు చేసుకున్నవారంతా తమకు లబ్ధి చేకూరుతుందనే నమ్మకంతో ఉన్నారు. మరోవైపు దరఖాస్తులు 80 శాతం తెల్లరేషన్కార్డు కోసమే పెట్టుకోగా, ఆ తర్వాత స్థానం రూ. 500 గ్యాస్ సిలిండర్ కోసం పెట్టుకున్నారు. ► అయితే తెల్ల రేషన్కార్డు లేనివారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఒకవేళ తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటే తమకు పథకాలు అందవేమోనన్న ఆందోళన వారిలో కనిపిస్తుంది. గడువులోగా నమోదు పూర్తిచేస్తాం ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియలో భాగంగా శుక్రవారం డీటీపీలకు జోనల్ కార్యాలయంలో శిక్షణ ఇవ్వడం జరిగింది. వీరు ప్రజలు ఇచి్చన దరఖాస్తులను ఎలా నమోదు చేయాలనే విషయంపై అవగాహన పెంచుకుంటారు. దానికి సంబంధించిన పోర్టల్ గురించి శిక్షణ ఇవ్వడం జరిగింది. శనివారం నుంచే నమోదు ప్రక్రియ మొదలవుతుంది. ఈ నెలత 17వ తేదీ లోపు పూర్తిచేయాలనే ఆదేశాలు ఉండగా నిరీ్ణత సమయంలో పూర్తిచేస్తాం. ఇందుకోసం రెండు రోజుల నుంచే పూర్తి సన్నద్ధంగా ఉన్నాం. ఇప్పుడున్న ఆపరేటర్లతో పాటు కొత్తగా వచి్చన వారితో నమోదు ప్రక్రియను ముమ్మరంగా చేపడతాం. – ప్రశాంతి, డీసీ, జీహెచ్ఎంసీ జూబ్లీహిల్స్ సర్కిల్ -
ఆరు గ్యారంటీలకు ఈ నంబర్తో లింక్
హైదరాబాద్: ప్రభుత్వం తలపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలకు అర్హత సాధించేందుకు ‘ఆధార్’ తప్పనిసరిగా కావడంతో కొత్తగా నమోదు, అప్డేషన్ కోసం ఉరుకులు పరుగులు ప్రారంభమయ్యాయి. ఆధార్ అనుసంధానం గుర్తింపులో ఎటువంటి ఇబ్బందులూ రాకుండా, సులభంగా ప్రక్రియ పూర్తి అయ్యేందుకు అప్డేషన్ చేయాల్సిందే. దీంతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఆధార్ కేంద్రాల ఎదుట భారీ సంఖ్య జనం బారులు తీరుతున్నారు. వివాహం కావడం, ఇంటి పేరు, కేరాఫ్, చిరునామా, ఉద్యోగ, ఉపాధి రీత్యా, నివాసం, మొబైల్ నంబర్ మారడంతో అప్డేషన్ ఆవశ్యకత ఎదురైంది. తాజాగా ఆరు గ్యారంటీల నేపథ్యంలో ఆధార్ నవీకరించుకునేందుకు పోటెత్తుతున్నారు. అన్నింటికీ ఇదే ఆధారం.. అన్నింటికీ ‘ఆధార్’ ఆధారమవుతోంది. పూరి గుడిసెల్లో నివసించే నిరుపేదల నుంచి విలాసవంతమైన భవంతుల్లో జీవించే సంపన్నుల వరకు తప్పనిసరిగా మారింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ తప్పకుండా కావాల్సింది ఆధార్ కార్డు. ఎందుకంటే.. ప్రతి పౌరుడికి భారత ప్రభుత్వం కేటాయించే విశిష్ట గుర్తింపు సంఖ్య ఉంటుంది. అది బహుళ ప్రయోజనకారిగా మారి ప్రతిదానికీ ఆధారంతో పాటు అనుసంధానమవుతోంది. ప్రభుత్వ పనులైనా.. ప్రైవేటు పనులు ముందుకు సాగాలంటే ఆధార్ నంబర్ ఉండాల్సిందే.. ప్రతి కుటుంబానికి నిత్యవసరమైన వంట గ్యాస్, మొబైల్ సిమ్ కనెక్షన్ నుంచి పిల్లల స్కూల్లో అడ్మిషన్, స్థిర, చర ఆస్తుల రిజి్రస్టేషన్లు. ప్రభుత్వ పథకాలైన రేషన్ కార్డు, సామాజిక పింఛ¯న్, స్కాలర్ షిప్తో పాటు బ్యాంకింగ్, బీమా తదితర అన్నింటికీ ఆధార్ తప్పనిసరి. పన్నులు తదితర పనులకూ ఆధార్ అవసరమే.. అంచనా జనాభా కంటే.. విశ్వనగరంగా విస్తరిస్తున్న హైదరాబాద్లో అంచనా జనాభా కంటే ఆధార్ నమోదు సంఖ్య దాటింది. ఇతర రాష్ట్రాలు నుంచి బతుకుదెరువు కోసం వలస వచ్చి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్న వారితో ఆధార్ నమోదు సంఖ్య ఎగబాకుతోంది. మహా నగరంలో ఏటా జనాభా వృద్ధి రేటు 8 నుంచి 12 శాతానికిపైగా పెరుగుతోంది. 2023 చివరి నాటికి అంచనా జనాభా ప్రకారం 1.50 కోట్లకు చేరగా.. దానికి మించి ఆధార్ నంబర్లు సంఖ్య జారీ అయినట్లు యూఐడీఏఐ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మహానగరానికి వలస వస్తున్నవారిలో సుమారు 34 శాతం ఇక్కడే స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో జనాభాకు అనుగుణంగా ఆధార్ నమోదు సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. గతేడాది కాలంగా ఆధార్ నమోదు సంఖ్య బాగా ఎగబాకింది. ఆధార్ విశిష్ట గుర్తింపు సంఖ్య పొందిన వారిలో మహిళలు పురుషులతో సమానంగా ఉన్నట్లు యూఐడీఏఐ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. -
ఆధార్పై ప్రశ్నలకు భారీ స్పందన..
ఆన్లైన్లో ఆధార్ వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ(యూఐడీఏఐ) ఇటీవల మార్చి 14, 2024 వరకు గడువును పొడిగించిన విషయం తెలిసిందే. అయితే యూఐడీఏఐ ఆధార్ను ప్రవేశపెట్టి చాలా ఏళ్లు అయింది. దాంతో ఎలాంటి అవసరంలేని వారికి అది కేవలం ఒక గుర్తింపు కార్డుగానే ఉంటుంది. కానీ నిజంగా ఏదైనా అవసరానికి ఆధార్ వినియోగించే క్రమంలో చాలా ప్రశ్నలు వస్తూంటాయి. అందుకు సంబంధించి ‘సాక్షి’లో డిసెంబర్ 13న ‘ఆధార్పై ప్రశ్నలా..?’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. అందులో పాఠకులు ఆధార్కు సంబంధించి ఏదైనా ప్రశ్నలు ఉంటే info@sakshi.com కు పంపించాలని కోరగా చాలా మంది స్పందించారు. వారందరికీ ధన్యవాదాలు. ‘సాక్షి బిజినెస్’టీమ్ సంబంధిత అధికారులతో మాట్లాడి కొంతమంది పాఠకుల ప్రశ్నలకు సమాధానాలు సేకరించారు. ప్రశ్న: ఆధార్ ఎందుకు, ఎలా అప్డేట్ చేసుకోవాలి? అందుకు ఎంత ఖర్చు అవుతుంది, దానికి ఏయే డాక్యుమెంట్లు అవసరం అవతాయి? శైలజ, వరంగల్. జవాబు: నిబంధనల ప్రకారం ఆధార్ తీసుకుని 10 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు దాన్ని అప్డేట్ చేసుకోవాలి. ఆధార్ డేటాబేస్లో మీ వివరాలు అప్ టు డేట్ ఉండాలి. దాంతో ఆధార్తో లింక్ అయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో మీ తాజా వివరాలు ఉంటే మేలు. మీ ఆధార్లో ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే వెంటనే చేసుకోవాలి. ప్రభుత్వం ప్రకటించిన తేదీలోపు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. అందుకోసం పాఠశాల టీసీ, పదో తరగతి మెమో, పాన్కార్డు, రేషన్కార్డు, పాస్పోర్ట్, ఓటర్ఐడీ, కిసాన్ ఫొటో పాస్బుక్, డ్రైవింగ్ లైసెన్స్.. వంటి ఫొటో గుర్తింపు కార్డులు తీసుకెళ్లాలి. వీటిలో అందుబాటులో ఉన్న డాక్యుమెంట్లను దగ్గర్లోని ఆధార్ కేంద్రానికి వెళ్లి సంబంధించిన ఫారమ్ నింపి బయోమెట్రిక్, ఐరిస్ గుర్తులతో అప్డేట్ చేస్తారు. ప్రశ్న: బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డును ఆధార్తో లింక్ చేస్తే ఏదైనా సమస్యలు వస్తాయా? కార్తిక్, శ్రీకాకుళం. జవాబు: లేదు. మీ బ్యాంక్ సమాచారాన్ని బ్యాంక్ యాజమాన్యం ఎవరితోనూ పంచుకోదు. మీ ఆధార్ నంబర్ను తెలుసుకోవడం ద్వారా బ్యాంక్ ఖాతా గురించి సమాచారాన్ని పొందలేరు. అలాగే, యూఐడీఏఐతోపాటు ఏ సంస్థ వద్ద మీ బ్యాంక్ ఖాతా గురించి ఎలాంటి సమాచారం ఉండదు. ఉదాహరణకు, మీరు మీ మొబైల్ నంబర్ను బ్యాంక్, పాస్పోర్ట్ అధికారులు, ఆదాయపు పన్ను శాఖలు మొదలైన వివిధ అధికారులకు ఇస్తారు. కానీ మీరు ఉపయోగిస్తున్న టెలికాం కంపెనీకి మీ బ్యాంక్ సమాచారం, ఆదాయపు పన్ను రిటర్న్లు వంటి సమాచారం గురించి తెలియదు. అదేవిధంగా మీరు వివిధ సర్వీస్ ప్రొవైడర్లకు ఆధార్ నంబర్ను ఇచ్చినపుడు మీ వివరాలు వారి వద్దే ఉంటాయి. మీ వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం, యూఐడీఏఐతో సహా ఏ సంస్థ కూడా యాక్సెస్ చేయలేదు. ప్రశ్న: నా ఆధార్, బ్యాంక్ అకౌంట్ నంబర్ తెలిసిన ఎవరైనా ఆధార్ లింక్ చేసిన బ్యాంక్ ఖాతా నుంచి డబ్బును విత్డ్రా చేయవచ్చా? సులోచన, విజయవాడ. జవాబు: కేవలం మీ బ్యాంక్ ఖాతా నంబర్, ఆధార్ నంబర్ను తెలుసుకోవడం ద్వారా ఆధార్ లింక్ అయిన బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు తీసుకోలేరు. డబ్బును విత్డ్రా చేయడానికి మీ సంతకం, డెబిట్ కార్డ్, పిన్, ఓటీపీ అవసరం అవుతాయి. మీ బ్యాంక్ ఖాతా నుంచి ఆధార్ ద్వారా డబ్బును విత్డ్రా చేయడానికి మీ వేలిముద్ర, ఐరిస్ లేదా ఓటీపీ నంబరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రశ్న: ఆధార్ను ఎక్కడైనా ఉపయోగించవచ్చని చెబుతున్నారు. మరి యూఐడీఏఐ ప్రజలు తమ ఆధార్ నంబర్ను సోషల్ మీడియా లేదా పబ్లిక్ డొమైన్లో పెట్టవద్దని ఎందుకు సూచిస్తోంది? కేతన్, నిజామాబాద్. జవాబు: మీరు పాన్ కార్డ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, బ్యాంక్ చెక్లను అవసరమైన చోటే ఉపయోగిస్తారు. అయితే ఈ వివరాలను ఇంటర్నెట్, ఫేస్బుక్, ఎక్స్(ట్విట్టర్) మొదలైన సామాజిక మాధ్యమాల్లో బహిరంగంగా ఉంచరుకదా. ఆధార్ విషయంలో కూడా ఇదే లాజిక్ని ఉపయోగించాలి. మీ వ్యక్తిగత వివరాలు అనవసరంగా పబ్లిక్ డొమైన్లో ఉంచవద్దు. ప్రశ్న: ఆధార్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? శరణ్య, అనంతపురం జిల్లా. జవాబు: ఆధార్ను చాలా ప్రభుత్వ పథకాల్లో ఉపయోగిస్తారు. ఉదాహరణకు.. ప్రజా పంపిణీ వ్యవస్థ, ఆహార భద్రత, మధ్యాహ్న భోజనం, సమగ్ర శిశు అభివృద్ధి పథకం. ఉపాధి-మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, స్వర్ణజయంతి గ్రామ స్వరోజ్గార్ యోజన, ప్రధానమంత్రి ఉపాధి హామీ కార్యక్రమం. జననీ సురక్ష యోజన, ఆదిమ తెగల సమూహాల అభివృద్ధి, జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం. ఆరోగ్య సంరక్షణ – రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన. ఆస్తి లావాదేవీలు, ఓటర్ఐడీ, పాన్కార్డ్ మొదలైన ఇతర ప్రయోజనాల కోసం ఆధార్ కావాల్సి ఉంటుంది. ప్రశ్న: యూఐడీఏఐ అనుసరిస్తున్న డేటా భద్రత చర్యలు ఏమిటి? సుశీల, హైదరాబాద్. జవాబు: ప్రజల నుంచి సేకరించిన డేటాకు భద్రత కల్పించే బాధ్యత యూఐడీఏఐకు ఉంది. యూఐడీఏఐ సమగ్ర భద్రత విధానాన్ని కలిగి ఉంది. పటిష్ఠమైన సెక్యూరిటీ స్టోరేజ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఏదైనా సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తే క్రిమినల్ చట్టాలకు లోబడి చర్యలు తీసుకుంటారు. ఇదీ చదవండి: ఏజెంట్లకు భారీగా గ్రాట్యుటీ పెంచిన ఎల్ఐసీ.. ఎంతంటే.. -
ఆధార్ కార్డ్ వినియోగదారులకు శుభవార్త!
ఆధార్ కార్డ్ వినియోగదారులకు శుభవార్త. ఆన్లైన్లో ఆధార్ వివరాల్ని ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు ఇచ్చిన సమయాన్ని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (UIDAI) మరోసారి పొడిగించింది. వాస్తవానికి ఆధార్ ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు డిసెంబర్ 14 వరకే ఇచ్చింది. అయితే తాజాగా ఆ గడువును 2024 మార్చి 14 వరకు పొడిగించింది. మరోవైపు, ఆధార్ కార్డ్ తీసుకుని 10 ఏళ్లు పూర్తి చేసుకున్న వినియోగదారులు వారి ఆధార్ కార్డ్లోని వివరాల్ని అప్డేట్ చేయాలని కోరిన విషయం తెలిసిందే. తద్వారా, పౌరుల సమాచారం సీఐడీఆర్ వద్ద ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుందని, ఇది కచ్చిత సమాచారం నిక్షిప్తమవడానికి దోహదం చేస్తుందని తెలిపింది. -
ఉచిత ఆధార్ అప్డేట్కు ఇదే చివరి తేది!
ఆధార్ తీసుకుని పదేళ్లు దాటితే అప్డేట్ చేయాలని కేంద్రం నిబంధనలు విడుదల చేసింది. అయితే ఇప్పటివరకు ఒక్కసారి కూడా అప్డేట్ చేయని వారు 2023 డిసెంబర్ 14లోపు అప్డేట్ చేసుకోవాలని విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (యూఐడీఏఐ) తెలిపింది. త్వరలో గడువు ముగియనుండడంతో ఈ ప్రకటన విడుదల చేసింది. గడువు తర్వాత అప్డేట్ చేసుకోవాలంటే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు కోసం పేరు నమోదు చేసుకున్నప్పటి నుంచి పదేళ్లు పూర్తయిన వారు తగిన ధ్రువపత్రాలు సమర్పించి అప్డేట్ చేసుకోవాలని ఉడాయ్ సూచించింది. ఇకపై ప్రతి ఒక్కరూ కనీసం పదేళ్లకోసారి గుర్తింపుకార్డు, చిరునామా ధ్రువీకరణ పత్రాలు సమర్పించి కేంద్ర గుర్తింపు సమాచార నిధి (సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపాజిటరీ-సీఐడీఆర్)లోని వివరాలను అప్డేట్ చేసుకోవాలని పేర్కొంది. ఈ ప్రక్రియ వల్ల పౌరుల సమాచారం సీఐడీఆర్ వద్ద ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుందని, ఇది కచ్చిత సమాచారం నిక్షిప్తమవడానికి దోహదం చేస్తుందని తెలిపింది. ఇదీ చదవండి: ఆ తేదీల్లో ఎక్కువ.. ఈ తేదీల్లో తక్కువ పుట్టినరోజులు! ఆధార్ తీసుకుని పదేళ్లు పూర్తయిన వారు తమ డెమోగ్రఫిక్ వివరాలు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఉడాయ్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి లేటెస్ట్ గుర్తింపు కార్డు, అడ్రస్ వివరాలను నమోదు చేయాలి. రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, కిసాన్ ఫొటో పాస్బుక్, పాస్పోర్ట్ వంటివి గుర్తింపు, చిరునామా రెండింటికీ ధ్రువీకరణ పత్రాలుగా వినియోగించుకోవచ్చు. టీసీ, మార్క్షీట్, పాన్/ఇ-ప్యాన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి గుర్తింపు ధ్రువీకరణ పత్రంగా ఉపయోగపడతాయని ఉడాయ్ తెలిపింది. విద్యుత్, నీటి, గ్యాస్, టెలిఫోన్ బిల్లులను (మూడు నెలలకు మించని) చిరునామా ధ్రువీకరణ పత్రంగా వాడుకోవచ్చని ఉడాయ్ పేర్కొంది. -
దాదాపు 81 కోట్ల భారతీయుల వ్యక్తిగత వివరాలు బహిర్గతమయ్యాయి
-
స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. మీ సర్టిఫికెట్లు అన్నీ ఇకపై,, 'అపార్' కార్డులోనే..
సాక్షి, నిర్మల్: ‘ఆధార్’ తరహాలో విద్యార్థుల కోసం ప్రత్యేక గుర్తింపు కార్డు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు అపార్(ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) పేరుతో ’వన్ నేషన్–వన్ ఐడీ’ కార్డును అందుబాటులోకి తేనున్నారు. వెంటనే ప్రక్రియ ప్రారంభించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర విద్యావనరులశాఖ తాజాగా ఆదేశించింది. అపార్ ఐడీ కార్డును దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు అందజేయనున్నారు. ఈ అపార్ సంఖ్యనే విద్యార్థి జీవితకాల ఐడీగా పరిగణిస్తారు. ఇందులో విద్యార్థి అకడమిక్ జర్నీ, విద్యా ప్రయాణం, విజయాలు నిక్షిప్తమై ఉంటాయి. అవసరమైన సమయంలో ట్రాక్ చేయొచ్చని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారి సమ్మతి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని పాఠశాలలను కోరింది. ఈ అపార్ ఐడీ ప్రాముఖ్యతను వివరించాలని చెప్పింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించాలని సూచించింది. ఇందుకు ఓకే చెప్పిన తల్లిదండ్రులు ఆతర్వాత ఎప్పుడైనా దాన్ని ఉపసంహరించుకోవచ్చని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ప్రయోజనం ఏమిటి? విద్యార్థి కేజీ నుంచి పీజీ వరకు చదివిన, చదువుతున్న సమగ్ర వివరాలు ఒకే గొడుగు కిందకు వస్తాయి. ఎల్కేజీలో చేరినప్పట్నుంచి విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు గుర్తించేందుకు వీలుగా ఈ కార్డు ఉపయోగపడనుంది. ఈ కొత్త కార్డును ఆధార్ సంఖ్యతో పాటు ‘అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ (ఏబీసీ)’ అనే ఎడ్యులాకర్కు అనుసంధానించబడి ఉంటుంది. పాఠశాల విద్యలోని పిల్లలకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇచ్చే విధానాన్ని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ‘చైల్డ్ ఇన్ఫో’ పేరిట ఒక్కో విద్యార్థికి, ఒక్కో సంఖ్య విధానాన్ని కొన్నేళ్లుగా అమలు చేస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ అమలు చేయబోతున్న ఈ విధానం ద్వారా దేశవ్యాప్తంగా 1 నుంచి 12వ తరగతి వరకు దాదాపు 26 కోట్ల మంది విద్యార్థులకు 12 అంకెలున్న సంఖ్యను కేటాయిస్తారు. ‘అపార్’ నిర్వహణ ఇలా.. కేంద్ర విద్యాశాఖ పరిధిలోని నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరంకు ఈ బాధ్యతను అప్పగించింది. దీనికి చైర్మన్గా ఏఐసీటీఈ మాజీ చైర్మన్ ఆచార్య సహస్రబుద్దే వ్యవహరిస్తున్నారు. ఆధార్తో అనుసంధానం చేసిన ప్రత్యేక సంఖ్యను నమోదుచేస్తే విద్యార్థి కుటుంబ వివరాలు, మార్కుల సర్టిఫికెట్లు, నైపుణ్యాలు, పొందిన స్కాలర్షిప్స్, తదితర వివరాలన్నీ తెలుసుకునే వీలుంటుంది. వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందే సమయంలోనూ ధ్రువీకరణ పత్రాలను భౌతికంగా కాకుండా డిజిటల్లో పరిశీలించి సీటు ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రవేశ పరీక్షల దరఖాస్తుల్లోనూ ఈ సంఖ్యను నమోదుచేస్తే సరిపోతుందని ఏఐసీటీఈ వర్గాలు వెల్లడిస్తున్నాయి. నమోదు ప్రక్రియ.. తల్లిదండ్రుల సమ్మతితో పాఠశాలలో నమోదు ప్రక్రియ నిర్వహించబడుతుంది, వారు ఏ సమయంలోనైనా వారి సమ్మతిని ఉపసంహరించుకోవచ్చు. అవసరమైతే సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీలతో మాత్రమే డేటాను పంచుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. పాఠశాలల ద్వారా ప్రతీ విద్యార్థిపై సేకరించిన డేటా జిల్లా సమాచార పోర్టల్లో నిల్వ చేయబడుతుంది. ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4 వేలకుపైగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, దాదాపు 200కు పైగా ఇంటర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 4 లక్షలకు పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాల విద్యార్థులకు విద్యాశాఖ స్థాయిలో చైల్డ్ ఇన్ఫో ద్వారా ఇప్పటికే రాష్ట్రస్థాయిలో ఐడీ నంబరు కేటాయించబడింది. కళాశాల స్థాయిలో మరో గుర్తింపు సంఖ్య ఉంటుంది. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న అపార్ ఐడీ కార్డు ద్వారా మొత్తం ఒకే కార్డులో పూర్తి విద్య ప్రగతి, సమాచారం నిక్షిప్తమై అందుబాటులోకి రానుంది. విద్యార్థులకు సౌలభ్యం! విద్యార్థి తన విద్యాభ్యా స దశలో వివిధ రకాల ప్రాంతాల్లో అభ్యసిస్తా డు. వీటన్నింటిని ఒకే గొడుగు కిందికి తేవడం అనేది శుభ పరిణామం. ఈ అపార్ ఐడీ విధానం విద్యార్థులకు సౌలభ్యంగా ఉంటుంది. పదేపదే టీసీలు, బోనఫైడ్, పత్రాలు సేకరించడం వంటి సమస్యలు తీరుతాయి. విద్యార్థి ప్రగతి నైపుణ్యాలు ఒకేచోట నిక్షిప్తం చేయబడతాయి. – జిలకరి రాజేశ్వర్, తపస్ జిల్లా గౌరవ అధ్యక్షుడు, నిర్మల్ ప్రయోజనకరంగా ఉంటుంది విద్యార్థులకు సంబంధించిన పూర్తి సమాచారం ఏకీకృతంగా అపార్ కార్డు ద్వారా అందుబాటులోకి రావడం ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థికి సంబంధించిన సమాచారం ఒకే ఐడీ నంబర్ ద్వారా నిక్షిప్తమై ఉంటుంది. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించిన తర్వాత వారి అనుమతితేనే విద్యాశాఖ ముందుకెళ్తుంది. – డాక్టర్ రవీందర్రెడ్డి, డీఈవో, నిర్మల్ -
Blue Aadhaar Card: బ్లూ ఆధార్ ఎందుకో తెలుసా? పూర్తి వివరాలు..
దేశంలో ఆధార్ కార్డుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, సంక్షేమ పథకాలు, సబ్సిడీలు ఇలా ఎక్కడ పని జరగాలన్నా ఆధార్ తప్పనిసరైంది. అందుకే దీన్ని అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డుగా పరిగణిస్తారు. పూర్తి పేరు, శాశ్వత చిరునామా, పుట్టిన తేదీ వంటి ప్రాథమిక సమాచారమంతా 12 అంకెల సంఖ్యకు అనుసంధానించి ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ)’ ఆధార్ కార్డును జారీ చేస్తోంది. ఆధార్ కార్డులు సాధారణంగా తెలుపురంగులో ఉండడం గమనించే ఉంటాం. ఇవి వయోజనుల కోసం జారీ చేసే కార్డులు. కానీ, యూఐడీఏఐ పిల్లల కోసం ప్రత్యేకంగా నీలం రంగులో ఉండే ఆధార్ కార్డుల (బ్లూ ఆధార్)ను జారీ చేస్తోంది. వీటిని బాల ఆధార్ కార్డుగా వ్యవహరిస్తున్నారు. ఇవి 5 ఏళ్లలోపు పిల్లల కోసం జారీ చేస్తారు. వీరికి వేలిముద్రలు, కంటిపాప వంటి బయోమెట్రిక్ వివరాలు సేకరించకుండానే కార్డు అందజేస్తారు. అన్ని వివరాలు వెరిఫై చేసిన తర్వాత 60 రోజులలోపు బ్లూ ఆధార్ కార్డ్ జారీ అవుతుంది. కేవలం ఫొటో, పేరు, చిరునామా, తల్లిదండ్రుల పేరు వంటి ప్రాథమిక సమాచారం అందులో ఉంటుంది. ఈ కార్డుని తల్లిదండ్రుల ఆధార్తో అనుసంధానిస్తారు. బాల ఆధార్ కార్డు కాలపరమితి పిల్లల వయసు ఐదేళ్లు వచ్చే వరకే. తర్వాత వేలి ముద్రలు, కంటిపాప వంటి వివరాలను అందజేసి ఆధార్కార్డుని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే, కార్డు చెల్లదు. 15 ఏళ్లు నిండిన తర్వాత వేలిముద్రలు, కంటిపాప వివరాలతో మరోసారి ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకోవాలి. నవజాత శిశువుల కోసం తల్లిదండ్రులు బాల్ ఆధార్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనన ధ్రువీకరణ పత్రం లేదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన పత్రం వంటి డాక్యుమెంట్లు అందజేస్తే సరిపోతుంది. లేదా పిల్లల పాఠశాల ఐడెంటిటీ కార్డుని కూడా ఉపయోగించుకోవచ్చు. ఉపయోగాలివీ.. బ్లూ ఆధార్ కార్డును పిల్లలకు గుర్తింపు రుజువుగా వినియోగించవచ్చు. దీని సహాయంతో పిల్లలు అర్హత కలిగిన ప్రభుత్వ సబ్సిడీ పథకాలను పొందవచ్చు. పిల్లలకు మధ్యాహ్న భోజన స్కీమ్ పొందటానికి వీలవుతుంది. నకిలీ విద్యార్థుల వివరాలను గుర్తించేందుకు ప్రభుత్వం ఈ వివరాలను వినియోగించుకుంటుంది. అడ్మిషన్ ప్రక్రియ కోసం తల్లిదండ్రులు బ్లూ ఆధార్ కార్డులను అందించాలని అనేక పాఠశాలలు పట్టుబడుతున్నాయి. -
పాన్కార్డు పనిచేయడం లేదా? మరి జీతం అకౌంట్లో పడుతుందా?
PAN - Aadhar link: ప్రతిఒక్కరి దైనందిన జీవితంలో పాన్ కార్డ్ ఓ భాగమైపోయింది. ఆర్థిక లావాదేవీలన్నింటికీ పాన్ కార్డ్ చాలా అవసరం. ఈ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీనికి గడువు 2023 జూన్ 30తో ముగిసింది. ఆ తర్వాత ఆధార్తో లింక్ చేయని పాన్ కార్డులు పనిచేయకుండా (ఇనాపరేటివ్) పోయాయి. ఇప్పటికీ పాన్-ఆధార్ లింక్ చేయనివారు కొంతమంది ఉన్నారు. దీంతో వారి పాన్ కార్డులు ఇనాపరేటివ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అలాంటి పాన్ కార్డులున్నవారికి జీతం అకౌంట్లో క్రెడిట్ అవుతుందా అనే సందేహం తలెత్తింది. (ఎస్బీఐలో అద్భుత పథకం! గడువు కొన్ని రోజులే...) ఆధార్తో లింక్ చేయకపోవడంతో పాన్ కార్డులు ఇనాపరేటివ్గా మారడం వల్ల ఆర్థిక లావాదేవీల్లో కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ జీతం బ్యాంక్ ఖాతాకు జమ కాకుండా ఆపదు. అయితే ఈ పనిచేయని పాన్ కార్డును ఎక్కడా ఉపయోగించడానికి వీలుండదు. కానీ జీతాలు జమ చేసేది యాజమాన్యాలు కాబట్టి బ్యాంకులు ఎలాంటి ఆంక్షలు పెట్టలేవు. ఇదీ చదవండి: నిమిషాల్లో లోన్.. ఆర్బీఐ ప్రాజెక్ట్ అదుర్స్! ఆనంద్ మహీంద్రా ప్రశంస మొదట ఉచితంగా పాన్-ఆధార్ లింకింగ్కి 2022 మార్చి 31 వరకు ప్రభుత్వం గడవు విధించింది. ఆ తర్వాత రూ. 500 జరిమానాతో 2022 జూన్ 30 వరకు గడువును పొడిగించింది. అనంతరం రూ. 1000 జరిమానాతో 2023 మార్చి 31 వరకు, చివరిసారిగా 2023 జూన్ 30 వరకు గడవులు పొడిగించుకుంటూ వచ్చింది. తర్వాత మరోసారి గడువును ప్రభుత్వం పొడించలేదు. దీంతో 2023 జూన్ 30 తర్వాత ఆధార్తో లింక్ చేయని పాన్ కార్డులు ఇనాపరేటివ్గా మారిపోయాయి. -
దెబ్బకు 10 కోట్ల పాన్ కార్డులు క్లోజ్ - ఐటీ శాఖ రిప్లై ఇలా..!
Aadhaar Pan Link: గత కొన్ని రోజులుగా ఆధార్-పాన్ లింకింగ్ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. 2023 జూన్ 30 లింకింగ్ చివరి గడువు అంటూ పలుమార్లు సంబంధిత శాఖలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. కాగా ఇప్పుడు ఆధార్ & పాన్ లింకింగ్ గడువు ముగిసింది. అయినప్పటికీ ఆదాయపన్ను శాఖ వినియోగదారుల నుంచి ప్రశ్నలను స్వీకరిస్తూనే ఉంది. ఇందులో భాగంగా ఒక వ్యక్తి ట్విటర్ వేదికగా దాదాపు 10 కోట్లకు పైగా ఎన్ఆర్ఐ పాన్ కార్డులు పనిచేయడం లేదని, భారతదేశంలో వారి పెట్టుబడులు, బ్యాంక్ బ్యాలన్స్ వంటివి ఫ్రీజ్ అయినట్లు వెల్లడించాడు. ఎన్ఆర్ఐ అందించిన పిర్యాదు మేరకు ఆదాయ పన్ను శాఖ స్పందిస్తూ.. గతంలో వెల్లడించిన విధంగానే పాన్ కార్డుతో ఆధార్ నెంబర్ లింక్ చేయకుండా పోతే.. పాన్ పనిచేసే అవకాశం లేదని, ఈ కారణంగా తప్పకుండా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే 10 కోట్ల పాన్ కార్డులు క్లోజ్ అయ్యాయా? లేదా? అనే దానిపైన ఎటువంటి అధికారిక వివరాలు వెల్లడి కాలేదు. (ఇదీ చూడండి: జీఎస్టీ కౌన్సిల్ సమావేశం - ధరలు తగ్గేవి & పెరిగేవి ఇవేనా?) నిబంధనల ప్రకారం.. ఎవరైతే ఎన్ఆర్ఐ లేదా ప్రవాస భారతీయులు ఉంటారో వారు ముందుగా వారి స్టేటస్ ఆదాయ పన్ను శాఖకు తెలియజేసినట్లయితే వారికి పాన్-ఆధార్ లింక్ నుంచి మినహాయింపు లభిస్తుంది. కావున వారికి ఎటువంటి సమస్య ఉండదని ఆదాయపన్ను శాఖ క్లారిటీ ఇచ్చింది. Dear @secureyoursites, It may be noted that non-linking of PAN with Aadhaar makes a PAN inoperative and not inactive, consequences of which have already been specified vide Press Release in https://t.co/N1IRieLOfr The NRIs who had intimated their NRI status to the Department are… — Income Tax India (@IncomeTaxIndia) July 10, 2023 అంతే కాకుండా ఇప్పటి వరకు ఎవరైనా ప్రవాస భారతీయులు తమ ఎన్ఆర్ఐ స్టేటస్ చెప్పకుండా.. పాన్ కార్డు పని చేయలేదని నిర్దారించుకుంటారో, అలాంటి వారు ఆన్లైన్ ద్వారా జ్యూరిస్డిక్షనల్ అసెస్సింగ్ ఆఫీసర్ (JAO)ని సంప్రదించవలసిందిగా వెల్లడించింది. ఇందులో భాగంగా వారి పాస్పోర్ట్ కాఫీ వంటివి వారికి అందించాల్సిన అవసరం కూడా ఉందని తెలిపింది. ఆలా కాకుంటే పాన్ కాఫీ, సంబంధిత డాక్యుమెంట్స్ adg1.systems@incometax.gov.in లేదా jd.systems1.1@incometax.gov.in అనే ఇమెయిల్కి కూడా పంపవచ్చని ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. -
ఆధార్-ప్యాన్ లింక్ చేశారుగా? ఐటీ శాఖ కీలక ప్రకటన
ఆధార్ కార్డ్-పాన్ లింకింగ్కు గడువు నిన్నటి(జూన్ 30)తో ముగిసిన నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆధార్-పాన్ లింకింగ్ కోసం పెనాల్టీ చెల్లించిన తరువాత చలాన్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. తన అధికారిక ట్విటర్ హ్యాండిల్లో సమాచారాన్ని పోస్ట్ చేసింది. అంతేకాదు మరోసారి గడువు పెంపు ఉంటుందనే ఊహాగానాలకు ఆదాయపు పన్ను శాఖ చెక్ పెట్టింది. ప్యాన్-ఆధార్లో లింకింగ్లో పాన్ హోల్డర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఆధార్-పాన్ లింకింగ్ కోసం రుసుము చెల్లించిన తర్వాత చలాన్ డౌన్లోడ్ చేయడంలో పాన్ హోల్డర్లు ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రసీదు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని, అయితే ఇ-పే ట్యాక్స్ ట్యాబ్లో చలాన్ చెల్లింపు వివరాలను చెక్ చేసుకోవచ్చని సూచించింది. అయితే ఇ-పే ట్యాక్స్లో ఇబ్బందులున్నాయని కొంతమంది యూజర్లు ట్విటర్లో ఫిర్యాదు చేశారు. (ధోనీ ఎంత పని చేశాడు: సత్య నాదెళ్ల ‘క్రష్’ కూడా అదేనట!) పాన్ను ఆధార్తో లింక్ చేయడడం 2017 జులై 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆధార్తో పాన్ను లింక్ చేయడానికి గడువును కేంద్రం చాలాసార్లు పొడిగించింది.జూన్ 30వ తేదీ లోపు పాన్ను ఆధార్ కార్డ్తో లింక్ చేయకపోతే, లింక్ కాని పాన్ కార్డులు చెల్లుబాటు కావడం ఆదాయపన్ను శాఖ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది. Kind Attention PAN holders! Instances have come to notice where PAN holders have faced difficulty in downloading the challan after payment of fee for Aadhaar-PAN linking. In this regard, it is to be informed that status of challan payment may be checked in ‘e-pay tax’ tab of… — Income Tax India (@IncomeTaxIndia) June 30, 2023 -
ఈ రోజే లాస్ట్.. ఆధార్ - పాన్ లింక్ చేయలేదా!
PAN-Aadhaar Linking: పాన్ - ఆధార్ లింక్ గురించి గత కొన్ని రోజులుగా వింటూనే ఉన్నాము. అయితే ఇప్పుడు ఈ లింకింగ్ గడువు ఈ రోజు కొన్ని గంటలలో ముగియనుంది. రేపటి నుంచి (జులై 01) ఆధార్తో అనుసంధానం చేయని పాన్ ఖాతాలు పనిచేయవని ఇప్పటికే ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. గతంలో దీని కోసం అనేక మార్లు గడువు పెంచడం కూడా జరిగింది. మరో సారి పొడిగిస్తుందో.. లేదో ప్రస్తుతానికి తెలియదు. నిజానికి పాన్ - ఆధార్ లింక్ గడువు ఎప్పుడో ముగిసింది. అయితే 2023 మార్చి 31 వరకు రూ. 1000 ఫైన్తో అదనపు గడువు కల్పించారు. ఆ కూడా జూన్ 30 వరకు పొడిగించారు. ఆ గడువు కాస్త ఈ రోజుతో ముగియనుంది. ఇంకో సారి పెంచే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నా.. దీనిపైనా ఎటువంటి స్పష్టత లేదు. ఆధార్ - పాన్ లింక్ చేయకపోతే ఏమవుతుంది.. ఆధార్ - పాన్ గడువు లోపలు చేయకుండా ఉంటే వారి బ్యాంకింగ్ సర్వీసులు, డెబిట్, క్రెడిట్ కార్డుల వాడకం మాత్రమే కాకుండా.. ఆన్లైన్ చెల్లింపులు, యూపీఐ చెల్లింపులు, మొబైల్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసేందుకు వీలుండదు, పెండింగ్ రిటర్నుల ప్రాసెస్ కూడా నిలిచిపోతుంది. (ఇదీ చదవండి: మీ పాన్ నెంబర్తో ఆధార్ లింక్ అయిందా? ఈ సింపుల్ టెక్నిక్స్తో తెలుసుకోండి) ఆధార్ - పాన్ లింక్ అనేది కొన్ని కేటగిరీకు సంబంధించిన వ్యక్తులకు తప్పనిసరి కాదని సీబీడీటీ (CBDT) తెలిపింది. ఇందులో 80 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు, ఆదాయపు పన్ను చట్టం ప్రకారం భారత నివాసి కాని వారు & భారత పౌరులు కాని వ్యక్తులు ఉన్నారు. ఇలాంటి వ్యక్తులకు ఆధార్ - పాన్ లింక్ అవసరం లేదు. -
ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ మర్చిపోయారా? డోంట్ వర్రీ.. ఇలా తెలుసుకోండి!
న్యూఢిల్లీ: ఆధార్కు లింక్ అయిన ఈమెయిల్, మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ధ్రువీకరించే సదుపాయాన్ని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ (యూఐడీఏఐ) ప్రకటించింది. ఆధార్ వెబ్సైట్, మొబైల్ యాప్ నుంచే వీటి ధ్రువీకరణకు అవకాశం కల్పించినట్టు పేర్కొంది. కొంత మంది యూజర్లకు తమ మొబైల్ నంబర్లలో ఏది ఆధార్తో సీడ్ అయిందనే విషయమై అవగాహన ఉండడం లేదని యూఐడీఏఐ గుర్తించింది. దీంతో ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘ఆధార్ ఓటీపీ వేరొక మొబైల్ నంబర్కు వెళుతుందని కొందరు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ప్రకటించిన సదుపాయంతో ఆధార్కు ఏ మొబైల్ నంబర్ సీడ్ అయిందో తెలుసుకోవచ్చు. ఆధార్ అధికారిక వెబ్సైట్ లేదా ఎంఆధార్ యాప్లో ‘వెరిఫై ఈమెయిల్/మొబైల్ నంబర్’ను క్లిక్ చేయడం ద్వారా ఈ సదుపాయం పొందొచ్చు’’అని యూఐడీఏఐ పేర్కొంది. ఏదైనా మొబైల్ నంబర్ సీడ్ అవ్వకపోతే అదే విషయాన్ని సూచిస్తుందని, దాంతో మొబైల్ నంబర్ అప్డేషన్కు చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. అప్పటికే మొబైల్ నంబర్ ధ్రువీకరించి ఉంటే, అదే విషయం తెలియజేస్తుందని వెల్లడించింది. ఆధార్ తీసుకునే సమయంలో ఏ నంబర్ ఇచ్చామో గుర్తు లేనివారు, సంబంధిత మొబైల్ నంబర్ చివరి మూడు నంబర్లను నమోదు చేయడం ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొంది. ఒకవేళ ఈ మెయిల్/ మొబైల్ నంబర్ లింక్ చేసుకోవాలంటే సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించొచ్చని సూచించింది. ఆధార్ ధ్రువీకరణ చేపట్టేందుకు 22 సంస్థలకు అనుమతి కాగా క్లయింట్ల ధ్రువీకరణను ఆధార్ ఆధారితంగా నిర్ధారించుకునేందుకు 22 ఆర్థిక సేవల సంస్థలకు అనుమతి లభించింది. ఈ 22 కంపెనీలు ఇప్పటికే మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద రిపోర్టింగ్ ఎంటెటీలుగా (కేంద్ర ప్రభుత్వ విభాగాలకు సమాచారం అందించేవి)గా ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ తన నోటిఫికేషన్లో పేర్కొంది. (ఇదీ చదవండి: ఒక్క హాయ్ మెసేజ్.. రూ. 10 లక్షలు లోన్ - ట్రై చేసుకోండి!) ఇవి తమ క్లయింట్ల గుర్తింపు ధ్రువీకరణను ఆధార్ సాయంతో చేపట్టేందుకు అనుమతించినట్టు ప్రకటించింది. ఇలా అనుమతులు పొందిన వాటిల్లో గోద్రేజ్ ఫైనాన్స్, అమెజాన్ పే (ఇండియా), ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ ఫైనాన్స్ సొల్యూషన్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, మహీంద్రా రూరల్ హౌసింగ్ ఫైనాన్స్ ఉన్నాయి. బ్యాంకులు తమ కస్టమర్ల గుర్తింపును ఆధార్ సాయంతో ధ్రువీకరించేందుకు ఇప్పటికే అనుమతి ఉంది. -
పాన్ - ఆధార్ లింక్లో కొత్త అప్డేట్
పాన్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలని, ఈ ప్రక్రియ 2023 జూన్ 30 చివరి నాటికి పూర్తి చేసుకోవాలని గతంలోనే చాలా కథనాల్లో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు పాన్ కార్డు - ఆధార్ లింకింగ్లో కొత్త అప్డేట్ వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పాన్ కార్డు లింక్ చేసేందుకు రూ.1000 పెనాల్టీ చెల్లించి కూడా చేసుకోవచ్చు. అయితే డబ్బు చెల్లించడానికి ముందు ఆదాయపు పన్ను శాఖ అసెస్మెంట్ ఇయర్ ఆప్షన్ ఎంచుకోవాలి. గతంలో పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోవానికి మార్చి 31 చివరి గడువుగా ప్రకటించారు. అయితే ఈ గడువు ప్రస్తుతం పొడిగించారు. కావున అసెస్మెంట్ ఏడాదిని 2023 - 24గా కాకుండా, అసెస్మెంట్ ఇయర్ను 2024-25గా ఎంచుకోవాలి. పేమెంట్ చేయడానికి అదర్ రిసిప్ట్స్ (500) అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. ఈ మార్పుని డబ్బు చెల్లించడానికి ముందే గమనించాలి. ఆలా కాకుండా దావుబ్బు చెల్లిస్తే కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139 ఏఏ ప్రకారం పాన్ కార్డు ఉన్న వారు తప్పనిసరిగా ఆధార్ నంబర్తో లింక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా మంది లింక్ చేసుకుని ఉంటారు. అలాంటి వారు ఓసారి స్టేటస్ చెక్ చేసుకుని పాన్-ఆధార్ లింక్ అయిదో లేదో చూసుకోవడం మంచింది. ఇప్పటివరకు పాన్-ఆధార్ లింక్ చేయకపోతే ఎలా లింక్ చేయాలో ఇక్కడ చూడవచ్చు: మొదట https://www.incometax.gov.in/iec/foportal/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి హోమ్ పోజీలో క్విక్ లింక్స్లో లింక్ ఆధార్ అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకుని పాన్ నంబర్, ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. పేమెంట్ కోసం ఆప్షన్ ఎంచుకున్న తరువాత ఈ-పే ట్యాక్స్ పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో పాన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తరువాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత అసెస్మెంట్ ఇయర్ 2024-25 సెలెక్ట్ చేసి, అదర్ రిసిప్ట్స్ (500) ఆప్షన్ క్లిక్ చేసి పేమెంట్ ప్రాసెస్ పూర్తి చేయాలి ఆ తర్వాత చలాన్ జనరేట్ అవుతుంది. పేమెంట్ చేసిన 4 లేదా 5 రోజుల తర్వాత పాన్-ఆధార్ లింక్ చేయాలి. -
ఆధార్తో 90 కోట్ల మొబైల్ నంబర్స్ అనుసంధానం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆధార్తో ఒక కోటికిపైగా మొబైల్ నంబర్స్ అనుసంధానం అయ్యాయి. జనవరిలో ఈ సంఖ్య 56.7 లక్షలు నమోదైందని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) వెల్లడించింది. ఆధార్తో పాన్ నంబర్ను అనుసంధానించడం ఈ పెరుగుదలకు కారణం అని వివరించింది. ఇప్పటి వరకు 90 కోట్ల మంది ఆధార్తో తమ మొబైల్ నంబర్ను అనుసంధానించినట్టు అంచనా. ఆధార్ను ప్రామాణికంగా చేసుకుని నమోదైన లావాదేవీలు జనవరిలో 199.62 కోట్లు, ఫిబ్రవరిలో 226.29 కోట్లకు చేరుకున్నాయి. 2023 ఫిబ్రవరి వరకు ఇటువంటి లావాదేవీలు 9,255 కోట్లు నమోదు కావడం గమనార్హం. ఈ–కేవైసీ లావాదేవీలు ఫిబ్రవరిలో 26.79 కోట్లు కాగా ఇప్పటి వరకు ఇవి మొత్తం 1,439 కోట్లుగా ఉన్నాయి. -
కేంద్రం కీలక నిర్ణయం!..రేషన్ కార్డు దారులకు గుడ్న్యూస్!
రేషన్ కార్డ్ హోల్డర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. రేషన్ కార్డుకు ఆధార్ లింక్ చేసే గడువును మార్చి 31 నుంచి జూన్ 30,2023కి పొడిగించింది. ఈ పొడిగింపుపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ విభాగానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ (డీఎఫ్పీడీ) అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిత్యవసర వస్తువుల్ని రేషన్ కార్డు ద్వారా సబ్సీడీగా పొందవచ్చు. దీంతో పాటు పాస్పోర్ట్, పాన్ కార్డ్ ఎలా గుర్తింపు కార్డ్గా వినియోగించుకుంటామో.. ఈ రేషన్ కార్డ్ను అలాగే ఉపయోగించుకునేందుకు వీలుంది. అయితే దేశంలో నిజమైన రేషన్ కార్డ్ లబ్ధి దారుల్ని గుర్తించేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డ్కు ఆధార్ కార్డ్ను జత చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తద్వారా ఒకటి కంటే ఎక్కువ రేషన్ కార్డ్లు ఉంటే వాటిని రద్దు చేయడం, ఎక్కువ ఆదాయం అర్జిస్తూ రేషన్ కార్డు వినియోగిస్తుంటే ఆ రేషన్ కార్డ్లను క్యాన్సిల్ చేయనుంది. నిజమైన లబ్ధిదారులకు నిత్యవసర వస్తువుల్ని అందించనుంది. రేషన్ కార్డ్కు ఆధార్ లింక్ ఇలా చేయండి ♦ ముందుగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్(పీడీఎస్)వెబ్సైట్ను సందర్శించాలి. ♦ అందులో ఆధార్ కార్డ్ నెంబర్,రేషన్ కార్డ్ నెంబర్ తో పాటు ఫోన్ నెంబర్ వంటి వివరాల్ని నమోదు చేయాలి. ♦ అనంతరం కంటిన్యూ ఆప్షన్పై ట్యాప్ చేయాలి ♦ కంటిన్యూ ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే మీ రిజిస్ట్రర్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ♦ ఓటీపీ ఎంటర్ చేస్తే రేషన్ కార్డ్కు ఆధార్ లింక్ అవుతుంది ఆఫ్లైన్లో రేషన్ కార్డ్ - ఆధార్ లింక్ ఇలా చేయండి ♦ కుటుంబసభ్యుల ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీలు, రేషన్ కార్డ్ జిరాక్స్లు, బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డ్ లింక్ చేయకపోతే బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ కాపీలు, కుటుంబ సభ్యుల పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో రేషన్ కార్యాలయానికి వెళ్లాలి ♦ అక్కడ ఆధార్ కార్డ్ డేటా బేస్లో మీ వివరాలని గుర్తించేలా ఫింగర్ ప్రింట్స్ ఇవ్వాలి ♦ ఆధార్ డేటా బేస్లో ఉన్న మీ వివరాలు మ్యాచ్ అయితే ఎస్ఎంఎస్ వస్తుంది. ♦ అనంతరం రేషన్ కార్డ్కు ఆధార్ కార్డ్ను జత చేస్తారు. చదవండి👉 కేంద్రం కీలక నిర్ణయం.. పాన్, ఆధార్ కార్డ్ ఉన్న వారికి గుడ్ న్యూస్! -
కేంద్రం శుభవార్త .. ఓటర్ ఐడీకి ఆధార్ కార్డ్ లింక్ చేశారా?
ఓటర్ ఐడీ,ఆధార్ కార్డ్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఓటర్ ఐడీకి ఆధార్ లింక్ చేసే సమయాన్ని ఏప్రిల్1, 2023 నుంచి మార్చి 31,2024 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చట్టం న్యాయ మంత్రిత్వ శాఖ (Ministry of Law and Justice) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది జూన్ 17న న్యాయ మంత్రిత్వ శాఖ ఓటర్ ఐడీకి ఆధార్ కార్డ్ను ఏప్రిల్ 1, 2023 లోపు లింక్ చేయాలని అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నోటిఫికేషన్ తర్వాత ఎన్నికల సంఘం ఆగస్టు 1 న నమోదైన ఓటర్ ఐడిలతో ఆధార్ కార్డ్ లింక్ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇక ఓటర్ ఐడీకి ఆధార్ని లింక్ చేసే గడువు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కాగా, ఓటర్ ఐడీకి ఆధార్ కార్డును లింక్ చేసుకోవడం ద్వారా బోగస్ ఓట్లను గుర్తించొచ్చు. అంటే ఒకే వ్యక్తికి ఒకటి కన్నా ఎక్కువ చోట్ల ఓటర్ కార్డులు ఉంటే.. అవి రద్దు అవుతాయి. దీని వల్ల పారదర్శకత వస్తుందని కేంద్రం ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. Centre extends the deadline for linking Aadhaar number with voter ID to March 31, 2024 from April 1, 2023.#Aadhaar pic.twitter.com/YRDseimiPp — Live Law (@LiveLawIndia) March 22, 2023 -
ఆధార్ అప్డేట్: జూన్ 14 లాస్ట్ డేట్
ఆధునిక కాలంలో ఆధార్ కార్డు చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. ప్రభుత్వ పథకాలు, బ్యాంక్ అకౌంట్స్ మొదలైన వాటికోసం ఆధార్ తప్పనిసరి అయిపోయింది. కావున ఆధార్ కార్డు వినియోగంలో ఎటువంటి అసౌకర్యం ఎదుర్కోకుండా ఉండాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం అప్డేట్ చేసుకోవాలి. గతంలో ఆధార్ అప్డేట్ చేయడానికి రూ. 25 చెల్లించాల్సి ఉండేది, అయితే ప్రస్తుతం 2023 జూన్ 14 వరకు ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు. ఈ సర్వీస్ కేవలం myAadhaar పోర్టల్లో మాత్రమే ఉచితం. ఇతర ఆధార్ సెంటర్ల వద్ద పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటివి అప్డేట్ చేయాలనుకుంటే రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. నిజానికి ఆధార్ అప్డేట్ గడువు ఈ నెల చివరి వరకు మాత్రమే అని తెలిపారు. కాగా ఇప్పుడు ఈ గడువు మూడు నెలలకు పెంచడం జరిగింది. 'యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా' ఆధార్ కార్డుని ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చేయడానికి అనుమతించింది. కావున మార్చి 15 నుంచి జూన్ 14 వరకు ఆధార్ తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి. (ఇదీ చదవండి: బైక్ ప్రేమికులారా ఊపిరి పీల్చుకోండి.. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి కొత్త బైక్స్ వస్తున్నాయ్) ఆధార్ ఎన్రోల్మెంట్, అప్డేట్ రెగ్యులేషన్స్, ఆధార్ నంబర్ హోల్డర్, ఆధార్ కోసం ఎన్రోల్మెంట్ చేసిన తేదీ నుండి ప్రతి 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అడ్రస్ ప్రూఫ్ (POI) సమర్పించడం ద్వారా కనీసం ఒక్కసారైనా ఆధార్లో తమ సపోర్టింగ్ డాక్యుమెంట్లను అప్డేట్ చేయవచ్చు. ఇది భవిష్యత్తులో కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. ''ఒకవేళా పాన్ కార్డ్ ఆధార్తో లింక్ చేయబడిందా.. లేదా అని తెలుసుకోవడానికి, అదే సమయంలో పాన్ కార్డ్ని ఆధార్ కార్డ్తో లింక్ చేయాలనుకునేవారు'' ఈ లింకుపై క్లిక్ చేసి మరింత సమాచారం తెలుసుకోవచ్చు. -
ఆధార్ కార్డ్లో మీ వివరాలు అప్డేట్ చేయాలా? ఇలా సింపుల్గా చేయండి!
ఆధార్ కార్డ్(Aadhaar Card).. ప్రస్తుతం ఈ పేరు చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఆధార్ అనేది కేవలం గుర్తింపు కార్డు మాత్రమే కాకుండా సంక్షేమ పథకాలు విషయంలో, ఆర్థిక వ్యవహరాల్లో కీలకంగా మారింది. దీంతో కొందరు ఆధార్ కార్డ్ని దుర్వినియోగం చేయడం మొదలుపెట్టారు.ఈ క్రమంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) సంస్థ ఈ కార్డ్ విషయంలో అక్రమాలను అరికట్టేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల 10 ఏళ్లకోసారి ఆధార్ వివరాలు అప్డేట్ చేయాలన్న వార్తలు బలంగానే వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆధార్ కార్డ్ వివరాలను అప్డేట్ చేయడం తప్పనిసరి కాకపోయినా, చేయడం వల్ల కొన్ని ఉపయోగాలున్నాయి. ఇటీవల ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ స్కీం లాంటి ప్రభుత్వ పథకాలతో పాటు ప్రభుత్వ అందిస్తున్న సేవలకు ఆధార్ నెంబర్ తప్పనిసరిగా మారింది. ఇక ఆర్థిక వ్యవహారాల్లోనూ ఆధార్ నెంబర్ కీలక పాత్ర పోషిస్తోంది.ఈ తరుణంలో ఆధార్ కార్డ్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం లబ్ధిదారులకు చాలా ముఖ్యమనే విషయాన్ని గమనించాలి. కేవలం అప్డేట్తో పాటు అందులో తప్పులు ఉంటే మార్చుకోవాలి. కార్డులోని పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ ఆన్లైన్లోనే అప్డేట్ చేసుకునే వెసలుబాటు ఉంది. వీటిని అప్డేట్ చేయడానికి ఆధార్ సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు. మరి ఆన్లైన్లో ఈ వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు. పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ ఆప్షన్స్లో మీరు అప్డేట్ చేయాలనుకుంటున్న ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. మీ వివరాలు అప్డేట్ చేసి అందుకు కావాల్సిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అనంతరం ఈ సేవకు అవసరమయ్యే పేమెంట్ చేసి ప్రాసెస్ పూర్తి చేయాలి. ఎంఆధార్ యాప్ ఉన్నవాళ్లు ఆధార్ అప్డేట్ కోసం ఇవే స్టెప్స్ ఫాలో కావచ్చు. పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ లాంటి వివరాలు కాకుండా మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, రిలేషన్షిప్ స్టేటస్, ఐరిస్, ఫింగర్ప్రింట్, ఫోటో అప్డేట్ చేయాలంటే తప్పనిసరిగా ఆధార్ సెంటర్కు వెళ్లాల్సి ఉంటుంది. అప్డేట్ ఇలా చేసుకోండి - ఆధార్ SUP పోర్టల్ uidai.gov.inని సందర్శించండి, ఆన్లైన్లో అప్డేట్ చిరునామాను ఎంచుకోండి - మీ ఆధార్ నంబర్ లేదా VIDని నమోదు చేయండి - మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు పంపే సెక్యూరిటీ కోడ్ OTP వస్తుంది - మీరు అందుకున్న OTPని నమోదు చేయండి - "చిరునామా" ఎంపికను ఎంచుకుని, సబ్మిట్ చేయండి - మీ అన్ని అడ్రస్ వివరాలను జాగ్రత్తగా నమోదు చేసి, సబ్మిట్ బటన్ను నొక్కి, ఆపై చివరగా నిర్ధారించుకోండి - సపోర్టింగ్ డాక్యుమెంట్ రంగు స్కాన్ చేసిన కాపీని అటాచ్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి - పత్రం సరైనదని నిర్ధారించుకోండి. అన్నీ సరైనవే అయితే ఎస్ బటన్ ఎంచుకోండి - BPOని ఎంచుకుని, సబ్మిట్పై క్లిక్ చేయండి - మీ అప్డేట్ రిక్వెస్ట్ ఇప్పుడు సబ్మిట్ చేయండి - అనంతరం మీ URN నంబర్ మీ రిజిస్టర్ మొబైల్ నంబర్తో పాటు మీ ఈమెయిల్కి కూడా వస్తుంది. - మీరు మీ URN స్థితిని ఆన్లైన్లో కూడా తనిఖీ చేయవచ్చు -
ఆధార్ అనుసంధానం గడువు పొడిగింపు
సాక్షి, చెన్నై: విద్యుత్ కనెక్షన్లకు ఆధార్ అనుసంధానం గడువును ఆ శాఖ తాజాగా పొడిగించింది. శనివారం అధికారులతో జరిగిన సమావేశం అనంతరం మంత్రి సెంథిల్ బాలాజీ ఈమేరకు వివరాలను వెల్లడించారు. వివరాలు.. రాష్ట్రంలో విద్యుత్ కనెక్షన్లకు ఆధార్ నంబర్ అనుసంధానాన్ని తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఆధార్ కార్డు లింక్ చేసిన వారికే విద్యుత్ బిల్లుల చెల్లింపునకు అవకాశం కల్పిస్తామని తొలుత ప్రకటించారు. దీంతో విద్యుత్ వినియోగదారులలో ఆందోళన నెలకొంది. అదే సమయంలో సాంకేతిక సమస్యలు, ఆన్లైన్లో నమోదులో జాప్యం వంటి సమస్యలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. డిసెంబరు 31వ తేదీ వరకు వినియోగదారులకు గడువు ఇచ్చారు. అయితే శుక్రవారం నాటికి 1.63 కోట్ల మంది వినియోగదారులు మాత్రమే తమ ఆధార్ను అనుసంధానం చేసినట్లు వెలుగు చూసింది. దీంతో జనవరి 31వ తేదీ వరకు మరో గడువు ఇస్తున్నట్లు విద్యుత్ శాఖమంత్రి సెంథిల్ బాలాజీ ప్రకటించారు. ఇదే చివరి అవకాశం అని, ఈ నెలాఖరులోపు ఆధార్ను అనుసంధానించ ని పక్షంలో ఆ తదుపరి చర్యలకు వినియోగదారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. చదవండి: న్యూ ఇయర్ గిఫ్ట్ అంటూ..పాముతో కాటు వేయించుకుని మరీ చనిపోయాడు -
ఆధార్తో లింకేజీ లేకుంటే పాన్కార్డు నిష్ఫలమే
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మార్చి 31వ తేదీనాటికి ఆధార్తో అనుసంధానంకాని పర్మినెంట్ అకౌంట్ నంబర్(పాన్) కార్డులు క్రియాశీలకంగా ఉండబోవని ఆదాయ పన్ను శాఖ ఒక బహిరంగ ప్రకటనలో పేర్కొంది. ‘ఆదాయపన్ను చట్టం–1961 ప్రకారం ఎలాంటి మినహాయింపుల పరిధిలోకిరాని పాన్ కార్డు వినియోగదారులు తమ కార్డును ఆధార్తో వచ్చే ఏడాది మార్చి 31వ తేదీకల్లా అనుసంధానం చేయడం తప్పనిసరి. ఆధార్తో అనుసంధానించని పాన్ కార్డులు ఏప్రిల్ ఒకటోతేదీ నుంచి మనుగడలో ఉండవు. వాటిని ఇన్ఆపరేటివ్గా భావించాలి’ అని ఐటీ శాఖ ఆ బహిరంగ ప్రకటనలో స్పష్టంచేసింది. పాన్ కార్డు మనుగడలో లేకపోతే ఐటీ చట్టం ప్రకారం సంబంధిత కార్డు హోల్డర్ చట్టపరంగా పలు సమస్యలు ఎదుర్కొనే ప్రమాదముందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) మార్చి 30న ఒక సర్క్యులర్లో పేర్కొనడం తెల్సిందే. క్రియాశీలకంగాలేని పాన్ కార్డుతో ఐటీ రిటర్న్లు దాఖలుచేయడం వీలుకాదు. పెండింగ్లో ఉన్న రీఫండ్లు తిరిగిరావు. కట్టాల్సిన పన్నులకు మించి అధికంగా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. నో యువర్ కస్టమర్(కేవైసీ) తప్పనిసరి అయిన బ్యాంక్లు, ఆర్థిక సంబంధ వెబ్సైట్లలో పాన్కార్డు ఖచ్చితం చేసిన నేపథ్యంలో ఇకపై వారు వాటి ద్వారా నగదు బదిలీ, ఆర్థిక లావాదేవీలు జరపడం దాదాపు అసాధ్యం. సాధారణంగా ఐటీ శాఖకు సంబంధించిన విధానపర నిర్ణయాలను సీబీడీటీనే నిర్ణయిస్తుంది. 2017 మే నెలలో కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన ఒక నోటిఫికేషన్లో ఆ ‘మినహాయింపు కేటగి రీ’ని పేర్కొంది. అస్సాం, జమ్మూకశ్మీర్, మేఘాల యలో ఉండేవారికి ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఐటీ చట్టం–1961 ప్రకారం స్థానికే తరులు, 80 ఏళ్లు దాటిన వారు, భారతపౌరులు కాని వారికి ఈ మినహాయింపు ఉంది. -
పాన్కార్డుపై కీలక నిర్ణయం తీసుకోనున్న కేంద్రం!
పాన్ కార్డ్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రజలు జరుపుతున్న కొన్ని ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డ్ అవసరాన్ని పక్కన పెట్టనుంది. ఈ అంశమై రాబోయే బడ్జెట్ 2023 లో కొన్ని మార్పులు చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం, పాన్ కార్డ్ వివరాలు అందించని ఆర్థిక లావాదేవీలకు 20% టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. అన్నింటికి పాన్ అక్కర్లేదు.. త్వరలో నిర్ణయం! ప్రస్తుతం దాదాపు బ్యాంకు అకౌంట్లన్నీ ఆధార్తో లింక్ అయినవేనని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. కనుక ఈ నేపథ్యంలో పాన్ వివరాలు తప్పనిసరి అవసరం లేదని బ్యాంకులు భావిస్తున్నాయి. దీనికి సంబంధించి సమాచారం అందిందని, వాటిని పరిశీలిస్తున్నామని, బడ్జెట్ సందర్భంగా ఈ అంశంపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. బ్యాంకుల నుంచి రుణాలకు సంబంధించి కూడా కొన్ని సమస్యలు తలెత్తుతున్నందున, ఆదాయపు పన్ను చట్టంలో సవరణలు చేయాలని కొందరు రుణదాతలు సూచించినట్లు అధికారి తెలిపారు. అయితే రాబోయే కేంద్ర బడ్జెట్ 2023-24లో, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధార్ మద్దతుతో ఆర్థిక లావాదేవీలకు అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు కేంద్రం అంగీకారం తెలిపితే కొన్ని లావాదేవీలకు పాన్ నెంబర్ అవసరం ఉండకపోవచ్చు. దీంతో పాన్ కార్డ్ లేనివారికి, కాస్త ఊరట లభించనుంది. అయితే దీనిపై పూర్తి సమాచారం, నియమ నిబంధనలు వంటివి వచ్చే బడ్జెట్లో తెలిసే అవకాశం ఉంది. చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్! -
అన్నింటికీ ఆధార్ లింక్ తప్పని సరి
సాక్షి, చెన్నై: రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాయితీలు ఇతర సేవలకు ఇక ఆధార్ అనుసంధానాన్ని తప్పని సరి చేశారు. ఆధార్ కార్డు నంబర్ల ఆధారంగానే ఇక నుంచి లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలను అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో విద్యుత్ కనెక్షన్లకు ఆధార్ను లింక్ చేయాలని ఇటీవల ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. దీంతో ఇప్పటి వరకు కోటి 9 లక్షల మంది తమ కనెక్షన్లకు ఆధార్ నంబర్ను అనుసంధానించారు. మరో కోటి మందికి పైగా ఈ ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం బాటలో పయనించే విధంగా తాజాగా రాష్ట్రంలోనూ సంక్షేమ పథకాలు, రాయితీలు తదితర ప్రభుత్వ సేవలకు ఆధార్ అనుసంధానాన్ని తప్పని సరి చేశారు. ఇందులో భాగంగా ట్రెజరీల ద్వారా వేతనం, పదవీ విరమణ పెన్షన్, ఇతర పెన్షన్లు పొందుతున్న వారందరూ ఆధార్ నంబర్ను లింక్ చేయాలని స్పష్టం చేశారు. కొత్త లబ్ధిదారులు సైతం ఇకపై దరఖాస్తుతో పాటు ఆధార్ నంబర్ను తప్పనిసరిగా నమోదు చేయాలని పేర్కొన్నారు. చదవండి: స్పోర్ట్స్ మీట్లో అపశ్రుతి.. విద్యార్థి గొంతులోకి దూసుకెళ్లిన జావెలిన్.. ఐసీయూలో చికిత్స -
ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానంపై కేంద్రం క్లారిటీ
న్యూఢిల్లీ: ఎన్నికల గుర్తింపు కార్డుతో ఆధార్ అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఓటర్ కార్డుతో ఆధార్ లింక్ చేయకపోయినా ఓటర్ల జాబితాలో వారి పేరు కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. అనుసంధానం పూర్తిగా ఐచ్ఛికమని పేర్కొంది. శుక్రవారం లోక్సభలో ఒక ప్రశ్నకు బదులుగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు ఈ మేరకు బదులిచ్చారు. ఎగ్జిట్ పోల్స్పై నిషేధం యోచన లేదు దేశంలో ఎగ్జిట్ పోల్స్పై నిషేధం విధించాలన్న ప్రతిపాదన కేంద్రం పరిశీలనలో లేదని మరొక ప్రశ్నకు బదులుగా రిజిజు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: జడ్జీల నియామకం ప్రభుత్వ హక్కు -
ఆధార్ ఈకేవైసీ లావాదేవీలు 25 కోట్లు
న్యూఢిల్లీ: ఆధార్ ఆధారిత ఈకేవైసీ లావాదేవీలు సెప్టెంబర్ నెలకు 25.25 కోట్లుగా నమోదయ్యాయి. ఆగస్ట్ నెలతో పోలిస్తే ఇవి 7.7 శాతం పెరిగినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. నో యువర్ కస్టమర్ (కేవైసీ) అన్నది అన్ని ముఖ్య లావాదేవీలకు అవసరమని తెలిసిందే. పేపర్లతో సంబంధం లేకుండా ఆధార్ బయోమెట్రిక్తో ఈకేవైసీ విధానం పలు చోట్ల అమల్లో ఉన్న విషయం గమనార్హం. ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) సైతం ఆర్థిక సేవల విస్తృతికి కీలకమని ఈ ప్రకటన పేర్కొంది. ‘‘ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఏఈపీఎస్, మైక్రో ఏటీఎంల ద్వారా మారుమూల ప్రాంతాల్లో మొత్తం మీద 1,594 కోట్ల బ్యాంకింగ్ లావాదేవీలు నమోదయ్యాయి. సెప్టెంబర్ నెలలోనే 21.03 కోట్ల ఏఈపీఎస్ లావాదేవీలు దేశవ్యాప్తంగా జరిగాయి’’అని వెల్లడించింది. ఆధార్ ద్వారా సెప్టెంబర్ నెలలో 175.41 కోట్ల ధ్రువీకరణ లావాదేవీలు నమోదయ్యాయి. చదవండి: షాపింగ్ బంద్, యూపీఐ లావాదేవీలు ఢమాల్.. ఏమయ్యా విరాట్ కోహ్లీ ఇదంతా నీ వల్లే! -
ఆధార్ కార్డ్లో ఆ అప్డేట్ చాలా ముఖ్యం, చేయకపోతే చిక్కులు తప్పవండోయ్!
ఆధార్ కార్డ్.. ఇటీవల ప్రజలకు ఇది గుర్తింపు కార్డ్లా మాత్రమే కాకుండా జీవితంలో ఓ భాగమైందనే చెప్పాలి. ఎందుకంటే బ్యాంకు అకౌంట్ తెరవడం, పర్సనల్, ఇంటి రుణాల కోసం, సంక్షేమ పథకాల కోసం, ఉద్యోగం కోసం.. ఇలా చెప్తూ పోతే పెద్ద జాబితానే ఉంది. ఆర్థిక లావాదేవీలలో ముఖ్యమైన బ్యాంక్, పాన్ కార్డ్లకు ఆధార్ కార్డ్ని అనుసంధానించిన తర్వాత దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది. అందుకే ఈ కార్డులో ఏ తప్పులు లేకుండా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా కార్డుదారులు ఆఫర్లు, సర్వీస్లను, లేదా మొబైల్ పోయిన తరచూ ఫోన్ నెంబర్లను మారుస్తుంటారు. ఆ తర్వాత ఏదో పనిలో పని కొత్త నెంబర్ను ఆధార్లో అప్డేట్ చేయడం మరిచిపోతుంటారు. ఆపై భవిష్యత్తులో డిజిటల్ బ్యాంక్ అకౌంట్స్, డీమ్యాట్ అకౌంట్స్ వంటితో పాటు ఆర్థిక లావాదేవీలకు సంబందించిన వాటిలో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ఇబ్బందులు రాకుండా ఆధార్లో ఫోన్ నంబర్ ఈ విధంగా ఈజీగా అప్డేట్ చేసేయండి. 1: ముందుగా, మీరు అధికారిక UIDAI వెబ్సైట్ లేదా మీ సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రాన్ని వెళ్లాల్సి ఉంటుంది. 2: ఆపై ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్లో అధికారిక ఎగ్జిక్యూటివ్ని కలిసి అతని వద్ద నుంచి ఆధార్ ఎన్రోల్మెంట్ ఫారంని తీసుకోవాలి. 3: ఎగ్జిక్యూటివ్కు ఆధార్ ఎన్రోల్మెంట్ ఫారంను నింపి, సమర్పించాలి. 4: ఎగ్జిక్యూటివ్ బయోమెట్రిక్ సమాచారం ద్వారా మీ వివరాలను ధృవీకరిస్తారు. 5: మీ కొత్త ఫోన్ నంబర్ వివరాలు, లేదా మీరు కోరిన విధంగా మార్పులు చేస్తాడు. 6: ఈ మార్పులను ఆధార్ అధికారిక సైట్లలో అప్డేట్ చేశాక, ఈ సేవకు రుసుము చెల్లించాలి. 7: మీరు సంబంధిత అధికారి నుంచి అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ పొందుతారు. ఆ స్లిప్లో ఒక అప్డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN) ఉంటుంది. దీని ద్వారా మీ ఆధార్ కార్డు రిక్వెస్ట్ స్టేటస్ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు. చివరగా మీ ఫోన్ నంబర్ అప్డేట్ లేదా మీ వివరాలు అప్డేట్ అయిన తర్వాత, మీరు అధికారిక UIDAI వెబ్సైట్ నుంచి ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆపై రుసుము చెల్లించి ఆధార్ కార్డ్ PVC ప్రింట్ను కూడా ఆర్డర్ చేయవచ్చు. చదవండి: దీపావళి కళ్లు చెదిరే అఫర్లు.. కారు కొంటే రూ.లక్ష తగ్గింపు! -
ఓటరు జాబితాతో ఆధార్ అనుసంధానం
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితాల సవరణలకు సంబంధించి ఆగస్టు ఒకటి నుంచి నూతన మార్గనిర్దేశకాలు అమల్లోకి రానున్నాయని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా తెలిపారు. ఓటరు నమోదు, సవరణ పత్రాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం పలు కీలక మార్పులు చేసిందని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 17 ఏళ్లు నిండినవారు కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడంతోపాటు, ఇప్పటికే నమోదైన వారు ఆధార్ నంబరును అనుసంధానం చేయాల్సి ఉంటుందని తెలిపారు. నూతన చట్ట సవరణలను అనుసరించి ఇప్పటికే నమోదై ఉన్న ఓటర్లు 2023 ఏప్రిల్ ఒకటోతేదీ నాటికి తమ ఆధార్ నంబరు తెలియజేయాలని పేర్కొన్నారు. అయితే ఇది పూర్తిగా స్వచ్ఛందమని, ఆధార్ నంబరు ఇవ్వని వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించరని స్పష్టం చేశారు. ఇప్పటికే ఓటర్లుగా ఉన్న వారి ఆధార్ నంబరు కోసం నూతనంగా ఫారం 6బీ ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. ఈసీఐ, ఇరోనెట్, గరుడ, ఎన్వీఎస్పీ, వీహెచ్ఏ తదితర వెబ్సైట్లలో ఈ నెలాఖరు నాటికి నూతన దరఖాస్తు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. త్వరలోనే ఇంటింటికి తిరిగి ఆధార్ నంబరును అనుసంధానించే ప్రక్రియను చేపడతామని, ఆన్లైన్ ద్వారా కూడా ఆధార్ నంబరును అనుసంధానం చేయవచ్చని తెలిపారు. 6బీ ఇవ్వని వారు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్న 11 ప్రత్యామ్నాయాల్లో ఒకదాన్ని సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఆధార్ వివరాలను అత్యంత గోప్యంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఫారం 6తో నియోజకవర్గం మార్పు కుదరదు ఫారం 6 ఇకపై కొత్త ఓటర్ల నమోదు కోసం మాత్రమే నిర్దేశించారని, ఓటరు నియోజకవర్గం మారడానికి ఫారం 6లో దరఖాస్తు చేసేందుకు అవకాశం లేదని తెలిపారు. జాబితాలో పేరు తొలగింపునకు ఉపయోగించే ఫారం 7 విషయంలో ఇకపై మరణ ధ్రువీకరణపత్రాన్ని జతచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఫారం 8 విషయంలో కీలక మార్పులు జరిగాయని తెలిపారు. ఇప్పటివరకు దీన్ని ఓటర్ల జాబితాలో నమోదు చేసిన వివరాల సవరణ కోసం వినియోగిస్తుండగా, ఇకపై విభిన్న అంశాలకు వినియోగించనున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గ పరిధిలోనేగాక, ఇతర నియోజకవర్గాలకు ఓటరు మార్పు, నూతన ఓటరు గుర్తింపు కార్డు జారీ, వైకల్యం ఉన్న వ్యక్తిని గుర్తించడం వంటి అంశాలకు కూడా ఫారం 8 వినియోగించవచ్చని ఆయన వివరించారు. -
ఈ-కేవైసీ నమోదులో కొత్త సమస్యలు.. ఆధార్కు లింకు కాని ఫోన్ నంబర్లు
నర్వ (నారాయణ్పేట్ జిల్లా): రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ.6 వేలను మూడు విడతల్లో అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో నమోదైన రైతులు తప్పనిసరిగా ఈ నెలాఖరులోగా ఈకేవైసీని చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో బోగస్ పేర్లను లబ్ధిదారులుగా నమోదు చేసుకుని గత సీజన్లలో నిధులను కాజేసిన వైనాన్ని కేంద్రం గుర్తించగా.. ఈ సీజన్లో అర్హులను గుర్తించేందుకు ఈకేవైసీని తప్పనిసరి చేసింది. కాగా గడువు ఈ నెల 31 వరకే ముగుస్తున్నా జిల్లాలో ఈకేవైసీ నామమాత్రంగా సాగుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో కేవలం 10 శాతం మాత్రమే నమోదైంది. ఈకేవైసీని పూర్తి చేసిన రైతులకు మాత్రమే ప్రస్తుతం రూ.2 వేల చొప్పున చెల్లింపులు చేయాలని లేదా నమోదు పూర్తికాకుంటే ఈ సీజన్ నుంచి నిధులను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి జాన్సుధాకర్ తెలిపారు. చదవండి👉 ‘ఇలాంటి ఫథకం దేశంలో ఎక్కడా లేదు’ అనుసంధానం ఇలా.. రైతులు ముందుగా పీఎం కిసాన్ పథకం వివరాలిచ్చిన తమ బ్యాంకు ఖాతాకు ఆధార్కార్డును అనుసంధానించుకోవాలి. తదుపరి ఆధార్ కార్డుకు ఫోన్ నంబర్ను అనుసంధానించాలి. అనంతరం పీఎం కిసాన్ పోర్టల్లో ఆధార్ ఆధారితంగా ఈకేవైసీ చేస్తున్నప్పుడు ఫోన్ నంబర్కు వచ్చే ఓటీపీ సంఖ్యను తిరిగి నమోదు చేస్తేనే ఈకేవైసీ పూర్తవుతుంది. సెల్ఫోన్లో పీఎం కిసాన్ యాప్ ద్వారా లేదా కంప్యూటర్లో పోర్టల్ ద్వారా రైతులే ఈకేవైసీని చేసుకోవచ్చు. లేదా కామన్ సర్వీస్ సెంటర్లలో సైతం ఈకేవైసీని పూర్తి చేయించాలి. ఆధార్ ద్వారా ఈ కేవైసీని పూర్తి చేసిన అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలకు నిధులు విడుదల చేస్తారు. బోగస్ రైతులు జాబితా నుంచి తొలగించబడతారు. 2018లో పథకం ప్రారంభించిన దగ్గర నుంచి 10 విడతలుగా నిధులను విడుదల చేయగా ప్రస్తుతం ఏప్రిల్లోనే 11వ విడతకు సంబంధించి ఈ దఫా నిధులు ఇవ్వాల్సి ఉండగా ఈకేవైసీతో ఈ నెలాఖరులోగా లేదా జూన్ మొదటి వారంలో నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. అవగాహన కల్పించరూ.. ఆధార్ అనుసంధానం, ఈకేవైసీ చేసుకోవడం గురించి చాలా మంది రైతులకు తెలియదు. ఇవి చేసుకోలేకనే ఎంతో మంది రైతులు ఇప్పటికీ ఎన్నో ప్రభుత్వ పథకాలకు నోచుకోలేకపోతున్నారు. తాజాగా ఈకేవైసీ తప్పనిసరి చేసింది. కానీ, క్షేతస్థ్రాయిలో ఈ విషయమే చాలా మంది రైతులకు తెలియదు. తెలిసిన వారు వెళ్లినా మీ సేవా కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు, ఆధార్కు ఫోన్ నంబర్ లింకు లేకపోవడం వంటి కారణాలతో మళ్లీ మళ్లీ తిరగాల్సి వస్తుంది. ప్రస్తుతం వ్యవసాయాధికారులు ధాన్యం నాణ్యత ధ్రువీకరణ పనుల్లో నిమగ్నమై ఉండగా ఈకేవైసీని పూర్తిచేయించేందుకు రైతులకు అవగాహన కల్పించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈకేవైసీని పూర్తి చేయని రైతులకు నిధులు నిలిచిపోనున్నందున రైతులందరూ ఈకేవైసీని పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చదవండి👉🏻 గడువు 31 వరకే.. ఈ–కేవైసీ తప్పనిసరి.. ఇలా నమోదు చేసుకోండి నమోదు చేసుకోండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోసం రైతులు ఈ నెల 31లోగా నమోదు చేసుకోవాలి. ఇప్పటి వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో ఈకేవైసీ నమోదు చాలా తక్కువగా ఉంది. ఆయా మండలాల ఏఈఓలు నమోదును వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టాలని ఒత్తిడి తీసుకొస్తున్నాం. రైతులకు గ్రామాల్లో గడువులోగా ఈకేవైసీ నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలి. పీఎం కిసాన్ లబ్ధి రైతులే కాకుండా మిగిలిన రైతులు కూడా ఈకేవైసీ చేసుకుంటే మంచిది. – జాన్సుధాకర్, జిల్లా వ్యవసాయాధికారి ఇప్పటి వరకు రాలే.. ఇప్పటి వరకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు రాలేదు. అనేకసార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకపోయింది. ఇప్పుడు ఈకేవైసీ చేసుకోవాలని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఈ నెల 31 వరకు గడువు ఉన్నందు వల్ల వెంటనే చేసుకుంటాను. – గోవిందరెడ్డి, రైతు, పెద్దకడ్మూర్ గ్రామం -
పాన్ - ఆధార్ లింక్ గడువు పొడిగించమని సెబీని కోరిన ఏఎన్ఎంఐ
ఇన్వెస్టర్లు తమ పాన్ను ఆధార్తో లింక్ చేసుకోవడానికి మరింత సమయం ఇవ్వాలని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ)ని అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఎక్స్ఛేంజ్ మెంబర్స్ ఆఫ్ ఇండియా (ఏఎన్ఎంఐ) కోరింది. చాలా మంది పెట్టుబడిదారులు తమ పాన్ను ఆధార్తో ఇంకా లింక్ చేయకపోవడం వల్ల చాలా మంది పెట్టుబడిదారులు మార్కెట్లలో ట్రేడ్ చేయలేరని ఎఎన్ఎంఐ హైలైట్ చేసింది. "పాన్ను ఆధార్తో లింక్ చేయకపోవడం వల్ల కొత్త & పాత ఇన్వెస్టర్లు ట్రేడ్ చేయలేకపోవడంతో పాటు వారి డీమ్యాట్ ఖాతాలను కూడా సస్పెండ్ చేయాల్సి ఉంటుంది" అని సెబీకి రాసిన లేఖలో ఏఎన్ఎంఐ పేర్కొంది. పాన్ను ఆధార్తో అనుసంధానం చేసుకునేందుకు తుది గడువు మార్చి 31. మార్చి 31 లోపు కూడా అనుసంధానం చేసుకోకపోతే పాన్ కార్డు చెల్లదు. రూ.10వేల వరకు జరిమానా కట్టి మళ్లీ పాన్ను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే పాన్ - ఆధార్ లింక్ తుది గడువును ప్రభుత్వం చాలాసార్లు పొడిగించింది. ప్రస్తుతానికి ఈ ఏడాది మార్చి 31 ఆఖరు తేదీగా ఉంది. ప్రభుత్వం మరోసారి తుదిగడువు పొడిగిస్తుందో లేదో స్పష్టత లేదు. అందుకే ఇంతవరకు పాన్ కార్డుకు ఆధార్ లింక్ చేసుకోని వారు.. ఎంత వీలైతే అంత త్వరగా చేసుకుంటే మంచిది. పెద్ద సంఖ్యలో ఖాతాదారులు తమ పాన్ను ఆధార్తో లింక్ చేయలేకపోవడంతో క్లయింట్ ఖాతాలను నిలిపివేయడం వల్ల మార్కెట్ మీద భారీ ప్రభావం ఉంటుందని ఏఎన్ఎంఐ తెలిపింది. అందువల్ల, ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఏఎన్ఎంఐ సెబీని కోరింది. ఒకవేళ గడువును పొడిగించలేకపోతే పాన్ను ఆధార్తో లింక్ చేయకపోవడం వల్ల కలిగే చిక్కులకు పరిష్కార మార్గాన్ని ఆలోచించాలని, తద్వారా ఖాతాల సస్పెన్షన్ను 6 నెలల పాటు వాయిదా వేయాలని సెబీని ఏఎన్ఎంఐ కోరింది. (చదవండి: మీ పాన్ కార్డ్ పోయిందా..! వెంటనే ఇలా చేయండి..!) -
రేషన్ కార్డుదారులకు కేంద్రం శుభవార్త.. వాటి లింక్ గడువు పొడిగింపు!
న్యూఢిల్లీ: దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా రేషన్ కార్డు కలిగిన వారికి శుభవార్త అందించింది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు అనుసంధానానికి గడువును పొడిగించింది. దీంతో, ఇంకా ఆధార్ కార్డుతో లింక్ కానటువంటి రేషన్ కార్డుదారులకు కూడా రేషన్ సరుకులు లభించనున్నాయి. దీని వల్ల చాలా మందికి ఊరట కలగనుంది. ఆధార్ కార్డులను రేషన్ కార్డుతో అనుసంధానించే గడువును ప్రభుత్వం మార్చి 31 నుంచి జూన్ 30 వరకు పొడగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారుల సౌలభ్యం కోసం పలు రకాల నిర్ణయాలు తీసుకుంటుంది. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకం కూడా ఇందులో భాగమనే చెప్పుకోవచ్చు. దీని వల్ల లక్షల మందికి ప్రయోజనం కలుగుతోంది. మరీ ముఖ్యంగా వలస కూలీలకు, కార్మికులకు ఈ పథకం వల్ల ప్రయోజనం లభిస్తోంది. దేశంలో ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులు పొందొచ్చు. అయితే ఈ ప్రయోజనాలు పొందాలని భావించే వారు కచ్చితంగా రేషన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేసుకోవాలి. అధికారిక నివేదికల ప్రకారం, ఈ పథకం కింద 80 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఫిబ్రవరి మధ్య నాటికి, 96 శాతం మంది లబ్ధిదారులు ఓఎన్ఓఆర్సీ కింద నమోదు చేసుకున్నారు. ఆధార్-రేషన్ కార్డు లింక్ గడువును డిసెంబర్ 31, 2021 నుంచి మార్చి 31, 2022 వరకు పొడిగించారు. ఇప్పుడు, మరల కేంద్రం జూన్ 30, 2022 వరకు పొడగించింది. (చదవండి: కలిసొచ్చిన రష్యా-ఉక్రెయిన్ వార్..! తొలిసారి టాప్-5 క్లబ్లోకి భారత్..!) -
గడువులోగా పాన్-ఆధార్ లింక్ చేయకపోతే.. భారీ జరిమానా కట్టాల్సిందే!
మీకు పాన్ కార్డు ఉందా? అయితే, మీకు ఒక ముఖ్య గమనిక. కేంద్రం ప్రభుత్వం గత ఏడాదికి సంబంధించి ఒక కొత్త నిబంధనను అమలులోకి తీసుకొని వచ్చింది. ఈ కొత్త నిబంధన ప్రకారం.. కేంద్ర పేర్కొన్న గడువు తేదీలోగా మీ పాన్ కార్డ్ నంబర్ను ఆధార్ నంబర్తో లింకు చేయాల్సి ఉంటుంది. అయితే, గత ఏడాది ఆర్థిక శాఖకు చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) పాన్-ఆధార్ లింక్ గడువు తేదీని 2022 మార్చి 31 వరకు పొడగించినట్లు పేర్కొంది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు గడువు తేదీని పొడగించినట్లు అప్పట్లో ఒక ప్రకటన విడుదల చేశారు. రూ. 10వేల జరిమానా..! పాన్ కార్డ్ హోల్డర్లు మార్చి 31 లోపు ఆధార్ కార్డ్ నంబర్తో లింక్ చేయాల్సి ఉంటుంది. ఇచ్చిన గడువులోగా లింక్ చేయడంలో విఫలమైతే ఆయా పాన్ కార్డ్ హోల్డర్ల పాన్ కార్డ్ చెల్లుబాటు కాదు. ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 272ఎన్ ప్రకారం.. సదరు వ్యక్తిపై 10 వేల జరిమానాను అసెస్సింగ్ అధికారి విధిస్తారు. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్లు, బ్యాంక్ ఖాతా తెరవడం మొదలైన వాటిలో తప్పనిసరిగా పాన్ కార్డ్ను కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో ఇలా లింక్ చేయండి ముందుగా ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్ https://www.incometax.gov.in/ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలోనే Link Aadhaar లింక్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత పాన్ నెంబర్, రెండో కాలమ్లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఆధార్ కార్డులో ఉన్నట్టుగా మీ పేరు నమోదు చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీ ఆధార్ కార్డుపై పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటే I have only year of birth in Aadhaar card సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత I agree to validate my Aadhaar details సెలెక్ట్ చేసుకొని Link Aadhaar క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి Validate పైన క్లిక్ చేయాలి. మీ పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది. ఒకవేళ మీ పాన్, ఆధార్ నెంబర్ ముందే లింక్ అయితే Your PAN is already linked to given Aadhaar అనే మెసేజ్ కనిపిస్తుంది. (చదవండి: ఫోక్స్వ్యాగన్కి సవాల్ విసిరిన ఎలన్మస్క్) -
పాన్కార్డు హోల్డర్లకు హెచ్చరిక..! వెంటనే..?
పాన్ కార్డ్ నంబర్తో ఆధార్ అనుసంధానానికి గడువు తేదీని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆర్థిక శాఖకు చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఈ మేరకు గడువు తేదీని 2022 మార్చి 31 వరకు పొడిగించింది. కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ తేదీని సవరిస్తూ మీడియా, టెక్నికల్ పాలసీ ఇన్కం ట్యాక్స్ కమిషనర్ సురభి అహ్లువాలియా అప్పట్లో ఒక ప్రకటన విడుదల చేశారు. రూ. పదివేల జరిమానా..! పాన్ కార్డ్ హోల్డర్లు మార్చి 31 వరకు ఆధార్ కార్డ్ నంబర్తో లింక్ చేయాల్సి ఉంటుంది. ఇచ్చిన గడువులోగా లింక్ చేయడంలో విఫలమైతే ఆయా పాన్ కార్డ్ హోల్డర్ల పాన్ కార్డ్ చెల్లుబాటు కాదు. దాంతో పాటుగా రూ. 1,000 రుసుము జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా లావాదేవీలను చేసే సమయంలో ఆధార్తో లింక్ కానీ పాన్ కార్డ్ను అందజేస్తే ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 272ఎన్ ప్రకారం... సదరు వ్యక్తిపై 10 వేల జరిమానాను అసెస్సింగ్ అధికారి విధిస్తారు. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్లు, బ్యాంక్ ఖాతా తెరవడం మొదలైన వాటిలో తప్పనిసరిగా పాన్ కార్డ్ను కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. చదవండి: రూ. 200 లిమిట్..! నగదు చెల్లింపులపై ఆర్బీఐ కొత్త ఫ్రేమ్వర్క్..! -
మీ ఆధార్ నెంబర్ ఎన్ని బ్యాంక్ ఖాతాలకు లింకు అయ్యిందో తెలుసుకోండిలా..!
భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు తప్పనిసరి కలిగి ఉండాల్సిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఆధార్ కార్డు కేవలం ఒక ఐడెంటిటీ ప్రూఫ్, చిరునామా గుర్తింపు పత్రంగా మాత్రమే కాకుండా అనేక పథకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరి చేస్తున్నాయి. ఒక బ్యాంక్ ఖాతా, పాన్ కార్డు తీసుకోవాలన్న ఆధార్ కార్డు తప్పనిసరి. కొద్దీ రోజుల క్రితం ఎస్బీఐ ఒక కీలక ప్రకటన కూడా చేసింది. ఖాతాదారులు తప్పనిసరిగా తమ ఖాతాలకు ఆధార్ కార్డు నెంబర్ ను లింక్ చేసుకోవాలని ఎస్బీఐ కోరింది. ఈ కరోనా మహమ్మరి సమయంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేక కొత్త సేవలను ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా మరో కొత్త సేవలనును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త సర్విస్ ద్వారా పౌరులు తమ ఆధార్ నెంబర్ ఎన్ని బ్యాంకు ఖాతాలకు లింక్ చేశారో ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎన్ని బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ లింక్ అయిందో కూడా తెలుసుకోవచ్చు. ఇందుకోసం యూఐడీఏఐ(https://uidai.gov.in/) వెబ్సైట్ లో ప్రత్యేకంగా ఓ లింక్ అందుబాటులో ఉంచింది. ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా పౌరులు తమ ఆధార్ నెంబర్ ఎన్ని బ్యాంక్ ఖాతాలకు లింక్ అయిందో క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఆధార్, బ్యాంక్ ఖాతా లింక్ స్టేటస్: ముందుగా యూఐడిఏఐ https://uidai.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. తర్వాత హోమ్ పేజీలో 'ఆధార్ సర్వీసెస్' పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు కనిపించే "చెక్ ఆధార్ బ్యాంక్ లింకింగ్ స్టేటస్" పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీ ఎంటర్ చేయాలి. ఇప్పుడు సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి "సెండ్ ఓటీపీ" పైన క్లిక్ చేయాలి. ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ వస్తుంది. మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటీపీ నమోదు చేసి "సబ్మిట్" పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ఆధార్ నెంబర్తో లింక్ అయి ఉన్న బ్యాంకు అకౌంట్ వివరాలు కనిపిస్తాయి. (చదవండి: ఫ్రీగా మీ క్రెడిట్ స్కోర్ను తెలుసుకోండి ఇలా..!) -
Hyderabad: ఉచిత నీటి పథకానికి సమీపిస్తున్న గడువు
సాక్షి, హైదరాబాద్: నగరంలో నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటిని పొందేందుకు వినియోగదారులు తమ కనెక్షన్ నంబరుకు ఆధార్ అనుసంధానం చేసుకునేందుకు జలమండలి ఈ నెల 31 చివరి గడువు విధించిన విషయం విదితమే. మహానగరంలో మొత్తం 9.84 లక్షల నల్లాలు ఉండగా ఈ నెల 17 వరకు సుమారు 50 శాతం మంది మా త్రమే నమోదు ప్రక్రి యను పూర్తిచేసుకున్నారు. వారం రోజులుగా అన్ని డివిజన్లలో కలిపి సుమారు 20 వేల మంది అనుసంధానం పూర్తి చేసుకున్నట్లు జలమండలి వర్గాలు తెలిపాయి. ఈ నెల 31తో గడువు తీరనుండడంతో ఎంత మంది ముందుకొస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఉచితానికీ బద్ధకమేనా.. ► నెలకు 20 వేల లీటర్ల ఉచిత నీటి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి జలమండలి 13 నెలల సమయమిచ్చినా సిటీజన్లు ముందుకు రాకపోవడం గమనార్హం. నగరంలో అపార్ట్మెంట్లు, ఫ్లాట్లున్న పలువురు వినియోగదారులు వాటిని అద్దెకిచ్చి ఇతర రాష్ట్రాలు, దేశాల్లో నివాసం ఉంటున్నారు. వీరికి అనుసంధానం చేసుకునే విషయంలో పలు ఇబ్బందులున్నాయి. ► వాణిజ్య నల్లాలు మినహా సుమారు 4.10 లక్షల మంది వినియోగదారులు ఈ పథకం కోసం నమోదు చేసుకోవాల్సి ఉంది. ఈ నెల 31తో గడువు ముగియనుండడంతో అర్హత కలిగిన వారంతా దరఖాస్తు చేసుకోవాలని జలమండలి సూచించింది. లేని పక్షంలో ఈ 13 నెలల నీటి బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ► ఈ బిల్లుపై పెనాల్టీ, వడ్డీ మాత్రం విధించబోమని బోర్డు స్పష్టం చేసింది. ఒకేసారి వేలల్లో నీటి బిల్లు చూసి వినియోగదారులు బెంబేలెత్తకుండా నాలుగు వాయిదాల్లో 13 నెలల బిల్లును చెల్లించే వెసులుబాటు ను కల్పించనున్నట్లు తెలిపింది. ► ఉచిత నీటిపథకానికి వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పటి నుంచే సదరు వినియోగదారులు నెలకు ఉచితంగా 20 వేల లీటర్ల నీటిని పొందుతారు. అప్పటివరకు నీటి బిల్లు చెల్లించాల్సిందే. (చదవండి: జీహెచ్ఎంసీ పరిధిలో ఇది అతి పెద్ద ఫ్లైఓవర్..) మీటర్లు తప్పనిసరి... ప్రతి గృహవినియోగ నల్లాకూ నీటి మీటరును సైతం వినియోగదారులు ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పటికే మీటర్లు ఉంటే అవి పని చేసే స్థితిలో ఉండాల్సిందే. ఈ మీటరు రీడింగ్ ఆధారంగా నెలకు 20 వేల లీటర్ల కంటే అధిక వినియోగం ఉన్న వినియోగదారుల నుంచి నీటిబిల్లు విధిగా వసూలు చేయనున్నారు. అపార్ట్మెంట్లలో ఉన్న అన్ని ఫ్లాట్ల యజమానులు అనుసంధానాన్ని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఆయా ఫ్లాట్ల వినియోగదారులకు నీటి బిల్లులు తథ్యం. (చదవండి: ఈ విషయంలో ముంబైని వెనక్కి నెట్టనున్న హైదరాబాద్) -
ఆధార్– ఓటర్ ఐడీ అనుసంధానానికి లోక్సభ ఓకే
న్యూఢిల్లీ: ఓటర్ ఐడీని ఆధార్ నెంబర్తో అనుసంధానించడం సహా పలు ఎన్నికల సంస్కరణలు పొందుపరిచిన బిల్లుకు లోక్సభ సోమవారం ఆమోదం తెలిపింది. బిల్లును హడావుడిగా తీసుకురావడంపై అసహనం వ్యక్తం చేసిన విపక్షాలు, దీన్ని స్టాండింగ్ కమిటీ (లా అండ్ జస్టిస్) పరిశీలనకు పంపాలని డిమాండ్ చేశారు. చివరకు మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం లభించింది. ఎన్నికల చట్ట సవరణ బిల్లు –2021ను సోమవారం న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో ప్రవేశపెట్టారు. ఓటర్ ఐడీ– ఆధార్ను లింక్ చేయడం వల్ల బోగస్ ఓట్లను ఏరివేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది. అయితే దీనివల్ల పౌరుల వ్యక్తిగత గోపత్యకు భంగం కలుగుతుందని, దేశ పౌరులు కాని వారు కూడా ఓటేసే ప్రమాదం ఉంటుందని కాంగ్రెస్ ఆరోపించింది. ఆధార్ లింకింగ్తో పాటు కొత్త ఓటర్ల నమోదుకు నాలుగు కటాఫ్ డేట్లను (జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1) నిర్ణయించడం, సర్వీసు ఓటర్ నిబంధనలో మార్పును బిల్లులో పొందుపరిచారు. మరోవైపు ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో అదనంగా మరో రూ. 3.73 లక్షల కోట్లను వ్యయం చేసుకునేందుకు వీలుకల్పించే సప్లిమెంటరీ గ్రాంట్స్కు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ మొత్తంలో రూ.62 వేల కోట్లను ఎయిర్ఇండియాకున్న పాత అప్పులు, ఇతరత్రా బకాయిలను చెల్లించడానికి, రూ. 58 వేల కోట్లను ఎరువుల సబ్సిడీకి, రూ. 53 వేల కోట్లను ఎగుమతుల ప్రోత్సాహక బకాయిలను చెల్లించడానికి, రూ. 22 వేల కోట్లను గ్రామీణాభివృద్ధికి వెచ్చిస్తారు. ఒమిక్రాన్పై పోరుకు సిద్ధం కరోనా కొత్త వేరియంట్పై పోరుకు భారత్ సిద్ధంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి మన్సుఖ్ మాండవీయ రాజ్యసభలో చెప్పారు. రాబోయే రెండు నెలల్లో దేశ టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 45 కోట్ల డోసులకు పెంచుతామని తెలిపారు. ఎలాంటి సంక్షోభాన్నైనా ఎదుర్కొనేందుకు అవసరమైన ఔషధాలు, ఆక్సిజన్ను సిద్ధంగా ఉంచామన్నారు. దేశంలో ఇంతవరకు 161 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయన్నారు. మరోవైపు మీడియేషన్ (మధ్యవర్తిత్వ) బిల్లును స్టాండింగ్ కమిటీకి, బయోడైవర్సిటీ బిల్లును జాయింట్ కమిటీకి పంపేందుకు ప్రభుత్వం అంగీకరించింది. సోమవారం రాజ్యసభ ఎన్డీపీఎస్ చట్టానికి ఆమోదం తెలిపింది. సభ్యుల ఆందోళనలతో రాజ్యసభ పలుమార్లు వాయిదా పడింది. ఎందుకింత హడావుడి? ఎన్నికల చట్ట సవరణల బిల్లును మధ్యాహ్నం 12 గంటలకు సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లు పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని, సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తోందని విపక్షాలు దుయ్యబట్టాయి. విపక్ష సభ్యుల ఆందోళనతో సభ వాయిదా పడింది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభవ్వగానే ఈ బిల్లుపై చర్చకు స్పీకర్ అనుమతించారు. అయితే విపక్ష ఎంపీలు మరోసారి ఆందోళన చేపట్టడంతో మరో 45 నిమిషాల పాటు సభ వాయిదా పడింది. అనంతరం 2.45గంటలకు లోక్సభ మళ్లీ సమావేశమైంది. బిల్లును తీసుకురావడంలో ప్రభుత్వం తొందరపాటు చూపిందని, తగిన నిబంధనలు పాటించలేదని ప్రతిపక్షాలు విమర్శించాయి. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని కోరాయి. అయితే పుట్టుస్వామి కేసులో వ్యక్తిగత గోపత్య ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు లోబడే ఈ బిల్లును తెచ్చామని, దీనివల్ల ఎవరైనా ఒక్కచోట మాత్రమే ఓటరుగా నమోదు చేసుకోగలరని, ఒక్కరే వేర్వేరు నియోజకవర్గాల్లో ఓటరుగా నమోదై ఉంటే... అలాంటివి గుర్తించి ఏరివేయవచ్చని మంత్రి రిజిజు వివరణ ఇచ్చారు. తద్వారా పారదర్శక ఎన్నికలు జరపవచ్చని అన్నారు. సుప్రీం జడ్జిమెంట్లో పేర్కొన్న అన్ని అంశాలకు అనుగుణంగానే బిల్లు రూపొందిందన్నారు. అలాగే ఆధార్తో అనుసంధానం స్వచ్ఛందమని స్పష్టం చేశారు. ఆధార్తో లింక్ చేయలేదని ఏ ఒక్కరి ఓటునూ తొలగించడం జరగదన్నారు. లా అండ్ పర్సనల్ స్టాండింగ్ కమిటీ సిఫార్సులను ఇప్పటికే బిల్లులో చేర్చినందున మరలా దీన్ని స్టాడింగ్ కమిటీకి పంపాల్సిన పనిలేదన్నారు. ప్రతిపక్షాల ఆందోళనల నడుమే మూజువాణి ఓటుతో బిల్లును లోక్సభ ఆమోదించింది. అయితే బిల్లులో ‘‘ఆధార్ నెంబరు ఇవ్వలేకపోతున్నందువల్ల (నిర్దేశించే సముచిత కారణాన్ని చూపితే)... కొత్తగా ఓటరు నమోదు కోసం వచ్చే ఏ ఒక్క దరఖాస్తును తిరస్కరించ కూడదు, ఓటరు జాబితాలోని ఏ ఒక్క పేరునూ తొలగించడానికీ వీల్లేదు’’ అని మెలిక ఉండటం అనుమానాలకు తావిస్తోంది. అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడింది. -
ఇంజనీరింగ్లో ఇక నిఖార్సైన బోధన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్ కాలేజీల్లో ఈ నెల 16 తర్వాత ఆధార్ అనుసంధానిత బయోమెట్రిక్ హాజరును జేఎన్టీయూహెచ్ తప్పనిసరి చేయనుంది. అన్ని కాలేజీలతో అనుసంధానమవుతూ హాజరు పర్యవేక్షణకు ఇప్పటికే ప్రత్యేక సాప్ట్వేర్ను సిద్ధం చేసింది. దీనివల్ల సంబంధిత సబ్జెక్టులను అర్హులైన అధ్యాపకులే బోధించాల్సి రానుంది. దీంతో ఇప్పటివరకు చాలా కాలేజీలు అనర్హులతో చేపడుతున్న విద్యా బోధనకు తెరపడనుంది. అలాగే అధ్యాపకులకు కాలేజీలు నిర్దిష్ట సమయంలోనే వేతనాలు చెల్లించాల్సి రానుంది. నిజానికి బయోమెట్రిక్ అటెండెన్స్ను ఈ నెల ఒకటి నుంచే ప్రారంభిస్తామని జేఎన్టీయూహెచ్ గత నెలలోనే ప్రకటించింది. అయితే ఈ విధానాన్ని పక్కాగా అమలు చేయాలని భావించడంతో కొంత జాప్యమైనట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ఏళ్ల తరబడి మోసం... జేఎన్టీయూహెచ్ పరిధిలో 145 ఇంజనీరింగ్, 70 ఫార్మసీ, 10 మేనేజ్మెంట్ కాలేజీలు ఉండగా వాటిల్లో 30 వేల మంది అధ్యాపకులు పనిచేస్తున్నారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిబంధనల ప్రకారం అధ్యాపకుడు తప్పనిసరిగా ప్రొఫెసర్ అయి ఉండాలి. అలాగే ప్రిన్సిపాల్ విధిగా పీహెచ్డీ చేసి ఉండాలి. కానీ చాలా కాలేజీలు ఫ్యాకల్టీ విషయంలో విద్యార్థులను మోసం చేస్తున్నాయి. అర్హత లేని వారితో బోధన కొనసాగిస్తున్నాయి. దీనివల్ల విద్యాప్రమాణాలు పడిపోతున్నాయి. గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఇంజనీరింగ్లో నాణ్యమైన విద్యను అందుకుంటున్న వాళ్లు 40 శాతం మందే ఉన్నారు. మిగతా విద్యార్థులు ఉపాధి కోసం అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. చాలా మంది బ్యాక్లాగ్స్తో నెట్టుకొస్తున్నారు. దీన్ని అడ్డుకోవడానికే బయోమెట్రిక్ తెచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. నిబంధనల మేరకు బయోమెట్రిక్ అమలు చేస్తున్నా ఇందులో లొసుగులున్నాయని జేఎన్టీయూహెచ్ క్షేత్రస్థాయి అధ్యయనంలో గుర్తించింది. ఆధార్ లింక్ తప్పనిసరి ఆధార్ అనుసంధానిత బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి కానుండటంతో అధ్యాపకుడు ఉదయం, సాయంత్రం బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. ఇది జేఎన్టీయూహెచ్కు అనుసంధానమై ఉంటుంది కాబట్టి అధికారులు ప్రతిరోజూ పర్యవేక్షించేందుకు అవకాశం లభించనుంది. అధికారులు బయోమెట్రిక్ నమోదు వివరాలను ఆయా కాలేజీల సమయాలతో సరిపోల్చుకొనేందుకు మార్గం ఏర్పడనుంది. అలాగే అధ్యాపకుల ఆధార్ నంబర్లను బయోమెట్రిక్ విధానానికి అనుసంధానించనుండటం వల్ల వారి వేతన వివరాలు తేలికగా తెలిసిపోతాయి. కాలేజీల నుంచి వేతనం అందుతోందా? వారు మరెక్కడైనా పనిచేస్తున్నారా? అనే వివరాలు తెలుస్తాయి. దీనివల్ల నకిలీ వ్యక్తులను రికార్డుల్లో చూపించడం కుదరదని అధికారులు అంటున్నారు. బయోమెట్రిక్తో ఉద్యోగాలు నిలబడతాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ను అధికారులు నిక్కచ్చిగా అమలు చేస్తే దాదాపు 30 వేల మంది అధ్యాపకులకు వేతనాలు సక్రమంగా అందుతాయి. దీనివల్ల ఇంజనీరింగ్లో నాణ్యమైన విద్య అందుతుంది. కాలేజీల మోసాలకు కళ్లెం పడుతుంది. – అయినేని సంతోష్కుమార్ (రాష్ట్ర స్కూల్స్, టెక్నికల్ కాలేజీల అసోసియేషన్ అధ్యక్షుడు) విద్యార్థులకు మేలు బయోమెట్రిక్ హాజరుతో ఆధార్ను అనుసంధానిస్తే అర్హత ఉన్న అధ్యాపకుడే బోధన చేయడం అనివార్యమవుతుంది. ఇది విద్యార్థులకు మేలు చేస్తుంది. ఆధార్ను లింక్ చేయాలన్న లక్ష్యంతోనే ఈ ప్రక్రియలో కొంత జాప్యం జరిగింది. – ప్రొఫెసర్ నర్సింహారెడ్డి, జేఎన్టీయూహెచ్, వీసీ -
మార్చిలోగా పాన్–ఆధార్ అనుసంధానం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాన్ కార్డ్ నంబర్తో ఆధార్ అనుసంధానానికి గడువు తేదీని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. ఆర్థిక శాఖకు చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఈ మేరకు గడువు తేదీని 2022 మార్చి 31 వరకు పొడిగించింది. పాన్ నంబర్తో అనుసంధానానికి ఆధార్ వివరాలను ఆదాయపు పన్ను శాఖకు సమరి్పంచాల్సిన గడువు తేదీ వాస్తవానికి ఈ ఏడాది సెపె్టంబర్ 30. కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ తేదీని సవరిస్తూ మీడియా, టెక్నికల్ పాలసీ ఇన్కం ట్యాక్స్ కమిషనర్ సురభి అహ్లువాలియా ఒక ప్రకటన విడుదల చేశారు. ఆదాయపు పన్ను చట్టం–1961 కింద జరిమానా విచారణలు పూర్తి చేయడానికి గడువు కూడా 2022 మార్చి 31 వరకు పొడిగించారు. -
ఆ ఈపీఎఫ్ఓ చందాదారులకు కేంద్రం శుభవార్త!
న్యూఢిల్లీ: ఈపీఎఫ్ఓ చందాదారులకు కేంద్రం శుభవార్త తెలిపింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) ఈశాన్య సంస్థలు, కొన్ని ప్రత్యేక కేటగిరీ సంస్థలకు ఆధార్ నెంబర్తో యుఏఎన్ లింకు గడువును డిసెంబర్ 31, 2021 వరకు పొడగించింది. ఈశాన్య ప్రాంతంలో ఇంకా చాలా మంది ఆధార్ నెంబర్తో యుఏఎన్ లింకు చేయకపోవడంతో గడువు పొడగించినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఈపీఎఫ్ఓ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వెల్లడించింది. 220 మిలియన్లకు పైగా ఖాతాలు, ₹12 లక్షల కోట్ల కార్పస్ నిధి గల ఈపీఎఫ్ఓ ప్రపంచంలోని అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. (చదవండి: ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై స్పష్టతనిచ్చిన ఆపిల్..!) ఈపీఎఫ్ ఖాతా యుఏఎన్ నెంబర్తో ఆధార్ ను లింక్ చేయడం తప్పనిసరి చేసింది. దీని కోసం, ఈపీఎఫ్ఓ సామాజిక భద్రత కోడ్ 2020 సెక్షన్ 142లో కొన్ని కీలక మార్పులు చేసింది. ఇక నుంచి పీఎఫ్ మెంబర్లు సోషల్ సెక్యూరిటీ కోడ్ కింద ఏదైనా ప్రయోజనాన్ని పొందాలంటే ఆధార్ నంబర్-యుఏఎన్ లింకింగ్ తప్పనిసరి అని పేర్కొంది. రెండింటిని లింక్ చేయనివారికి పీఎఫ్ కంట్రిబ్యూషన్ అందకపోవడమే కాదు.. ఇతర ఈపీఎఫ్ఓ సేవలు ఆగిపోతాయని సంస్థ పేర్కొంది. పెన్షన్ ఫండ్ నుంచి డబ్బు తీసుకోవడం కూడా కష్టమవుతుంది. వాస్తవానికి, గతంలో ఈపీఎఫ్ఓ ఉద్యోగులందరికీ ఆధార్ నెంబర్తో యుఎఎన్ ను లింక్ చేయడానికి చివరి తేదీగా సెప్టెంబర్ 1, 2021 అని పేర్కొంది. కానీ ఇప్పుడు డిసెంబర్ 31 వరకు పొడగించింది. Deadline for Aadhaar linking of UAN extended till 31.12.2021 for Establishments in NORTH EAST and certain class of establishments. Please check the circular here: pic.twitter.com/x4ZSGG5cy1 — EPFO (@socialepfo) September 11, 2021 -
ఆ వ్యాఖ్యలు నేను చేయలేదు: రతన్ టాటా
సోషల్ మీడియాలో ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు కొన్నిసార్లు వక్రీకరించబడతాయి. అసలు మాట్లాడకున్నా.. వారు స్వయంగా స్పందించి వ్యాఖ్యలు చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతాయి. అందుకు ఎవ్వరూ అతీతులు కారు. తాజాగా పారిశ్రామిక దిగ్గజం.. టాటా సంస్థల అధినేత రతన్ టాటా వాఖ్యలు చేసినట్లు ఓ స్క్రీన్ షాట్ సందేశం సోషల్ మీడియాలో వైరల్గా మరీ పెద్దఎత్తున షేర్ అయింది. ‘మద్యం అమ్మకాలకు ఆధార్ను అనుసంధానం చేయాలి. మద్యం కోనుగోలు చేసేవారికి ఆహార సబ్సీడీ నిలిపివేయాలి. మద్యం కొనుగోలు చేసే సౌకర్యం ఉన్నవారు కచ్చితంగా ఆహారాన్ని కొనుగోలు చేస్తారు. ఉచిత ఆహారం ఇచ్చినప్పుడు వారు మద్యం కొనుగోలు చేస్తారు’ అని ఆయన పేర్కొన్నట్లు పలు సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అయింది. అయితే తన పేరుతో సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న వార్తలపై ఆయన స్పందించారు. చదవండి: సన్నీలియోన్ అరుదైన ఫీట్.. తన ఎన్ఎఫ్టీ కలెక్షన్స్తో వేలం ‘ఆ వ్యాఖ్యలను నేను చేయలేదు. ఇది పూర్తిగా నకిలీ వార్త’ అని రతన్ టాటా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు. అయితే గతంలో కూడా ఆయన మాటాలు సోషల్ మీడియలో వక్రీకరించబడ్డాయి. ‘కరోనా వైరస్ సమయంలో దేశ ఆర్థిక పరిస్థితులు చాలా దిగజారుతున్నాయి’ అని ఆయన వ్యాఖానించినట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఆయన వెంటనే దానిపై కూడా స్పందించి ఆ వ్యాఖ్యలు చేయలేదని స్పష్టతనిచ్చారు. ‘ఏదైనా నేను చెప్పాలనుకుంటే.. నా అధికారిక చానల్ ద్వారానే వెల్లడిస్తాను’ అని రతన్ టాటా క్లారిటీ ఇచ్చారు. చదవండి: నోయిడా ట్విట్ టవర్ల కూల్చివేత.. ‘రేరా’ ఎక్కడ విఫలమవుతోంది? -
స్టాక్ మార్కెట్,నెలాఖరులోగా పాన్–ఆధార్ లింక్ చేసుకోవాలి
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లు సెప్టెంబర్ 30 నాటికి తమ పాన్ను ఆధార్తో అనుసంధానించుకోవాలని సెబీ కోరింది. తద్వారా లావాదేవీలు సాఫీగా నిర్వహించుకునేందుకు వీలుంటుందని పేర్కొంది. పాన్–ఆధార్తో లింక్ చేసుకోవాలని కేంద్ర సర్కారు ఎప్పటి నుంచో కోరుతోంది. కాకపోతే కరోనా వల్ల ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో గడువును పొడిగిస్తూ వచ్చింది. ఈ నెల 30 వరకు పాన్–ఆధార్ అనుసంధానానికి గడువు ఉంది. గడువులోపు లింక్ చేసుకోకపోతే పాన్ పనిచేయదు. పాన్ పనిచేయనప్పుడు కేవైసీ అసంపూర్ణంగా మారుతుంది. పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలకు కేవైసీ తప్పనిసరి అని తెలిసిందే. దీంతో పాన్ బ్లాక్ చేయడం వల్ల ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోలేని, కొత్తగా పెట్టుబడులు చేయలేని పరిస్థితి ఎదురవుతుంది. ‘‘సెక్యూరిటీస్ మార్కెట్లో అన్ని లావాదేవీలకు పాన్ ఏకైక గుర్తింపు సంఖ్య. సీబీడీటీ నోటిఫికేషన్ నిబంధనలను సెబీ నమోదిత సంస్థలు అమలు చేయాలి. సెప్టెంబర్ 30 తర్వాత కొత్త ఖాతాల ప్రారంభానికి ఆపరేటివ్ పాన్నే అనుమతించాలి’’ అని సెబీ తన ప్రకటనలో పేర్కొంది. చదవండి: స్పెషల్ ఎకనామిక్ జోన్, 2.15 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు -
పాన్ కార్డు హోల్డర్లకు హెచ్చరిక!
మీ దగ్గర పాన్ కార్డు ఉందా? ఇంకా మీరు పాన్ కార్డును ఆధార్ కార్డుతో ఇంకా లింక్ చేయలేదా? అయితే, వెంటనే లింక్ చేయండి. ఒకవేళ మీరు లింక్ చేయకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేగాకుండా రూ.1000 జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ సమాచారాన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు తెలియజేస్తున్నాయి. పాన్ ఆధార్ లింక్ గడువు సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. అంటే మీరు వచ్చే నెల చివరి వరకు కచ్చితంగా రెండింటినీ అనుసంధానం చేసుకోవాలి లేకపోతే మీ పాన్ కార్డు చెల్లుబాటు కాదు. దీంతో మీరు పాన్ కార్డును అవసరం ఉన్న చోట ఉపయోగించలేరు. గతంలోనే జూన్ 30 వరకు ఉన్న పాన్-ఆధార్ లింక్ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడగించింది. ఇప్పుడు మరోసారి పొడగించే అవకాశాలు కూడా తక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే ముందే మీరు లింక్ చేసుకోవడం మంచిది. మీ పాన్ను ఆధార్తో లింక్ చేయకపోతే బ్యాంకింగ్ లావాదేవీల విషయంలో అసౌకర్యానికి గురి అయ్యే అవకాశం అవకాశం ఉంటుంది. ఇంకా పెన్షన్, స్కాలర్షిప్, ఎల్పీజి సబ్సిడీ వంటి పథకాలకు ద్రవ్య ప్రయోజనాలను పొందేటప్పుడు పాన్ తప్పనిసరి.(చదవండి: పాన్ కార్డును ఆధార్తో లింక్ చేయడం ఎలా..?) -
మీ పేరు మీద ఎన్ని మొబైల్ నంబర్లున్నాయో తెలుసా?!
మన పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్లు తీసుకున్నామో గుర్తించేందుకు ప్రభుత్వ టెలికాం సంస్థ 'TAF-COP' అనే పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చింది. ఆ పోర్టల్ సేవలపై పేటీఎం అధినేత విజయ్ శేఖర్ శర్మ ప్రశంసల వర్షం కురిపించారు. ఆధార్ తప్పని సరి దేశ పౌరులందరికీ ఆధార్ కార్డు తప్పనిసరి అన్న సంగతి తెలిసిందే. ఆధార్ కార్డు కేవలం ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ మాత్రమే కాకుండా అనేక పథకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరి చేస్తున్నాయి. అదే సమయంలో ఆధార్కు ఫోన్ నెంబర్ యాడ్ చేయడం తప్పని సరి చేశాయి. ఆధార్ నెంబర్కు మొబైల్ నెంబర్ లింక్ చేయడం ద్వారా ఆథెంటికేషన్ సులువు అవుతోంది. ఈ విధానం ఫోన్ వినియోగదారులకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. మన పేరుమీద ఎన్ని ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఉంటే వాటిలో ఏ నెంబర్ ను ఆధార్ కు యాడ్ చేశామనే విషయాన్ని గుర్తించడం కష్టతరం అవుతుంది. చదవండి : అంబానీ తెలివి.. రెండూ లాభాలిచ్చేవే! వెబ్సైట్ ను ప్రారంభించిన టెలికాం సంస్థ సైబర్ నేరస్తులు ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్ ద్వారా నేరాలకు పాల్పడుతున్నారు. ఆ నేరాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండడంతో కేంద్రం వెబ్ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ (TAF-COP) అని పిలిచే ఈ పోర్టల్లో లాగిన్ అయితే మన ఆధార్ కార్డ్ మీద ఏ ఫోన్ నెంబర్ ను యాడ్ చేశాం. మన పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్లు ఉన్నాయనే విషయాన్ని ఈజీగా గుర్తించవచ్చు. ప్రశంసల వర్షం TAF-COP వెబ్ పోర్టల్ వినియోగంపై పేటీఎం అధినేత విజయ్ శేఖర్ శర్మ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. “ @TRAI/ DOT ద్వారా చాలా ఉపయోగకరమైంది. ఈ సైట్ లో మీ ఫోనెంబర్ను ఎంట్రీ చేస్తే.. మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంట్రీ చేస్తే సిమ్ కార్డ్ వివరాలు వెలుగులోకి వస్తాయి. ఉపయోగంలో లేని సిమ్ కార్డ్ లను బ్లాక్ చేయవచ్చు. సైబర్ నేరస్తుల నుంచి సురక్షితంగా ఉండొచ్చు. ఈ వెబ్ సైట్ ఐడియా బాగుందంటూ ట్వీట్లో పేర్కొన్నారు. Very useful service launched by @TRAI / DOT ! Open the below site and type in your mobile number and you will know the mobile numbers of all the SIM cards purchased with your Aadhaar number as soon as you enter the OTP. You can ban any of them. https://t.co/EdomPmQlXf — Vijay Shekhar Sharma (@vijayshekhar) August 26, 2021 -
మీ ఆధార్ బయోమెట్రిక్ సేఫ్గా ఉండాలంటే ఇలా చేయండి
బ్యాంక్ అకౌంట్లలో ఉన్న డబ్బుల్ని కాజేసేందుకు కేటుగాళ్లు ఆధార్ కార్డ్ను అస్త్రంగా ఉపయోగించుకుంటుంటారు. అయితే అలాంటి వారి నుంచి సురక్షితంగా ఉండేలా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఎప్పటికప్పుడు సెక్యూరిటీ అప్డేట్లను అందుబాటులోకి తెస్తోంది. ఈనేపథ్యంలో 12 అంకెల ఆధార్ కార్డ్ దుర్వినియోగం కాకుండా, సురక్షితంగా ఉండేలా మరో ఫీచర్ను వినియోగదారులకు పరిచయం చేసింది ఈ ఫీచర్ ద్వారా ఆధార్ కార్డు బయోమెట్రిక్ లాక్/ అన్ లాక్ చేసేలా డిజైన్ చేసింది. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎలా చేయాలో తెలుసుకుందాం.ఆధార్ కార్డ్ సురక్షితంగా ఉండేలా బయో మెట్రిక్ ఆప్షన్ను వినియోగించుకోవాలి. మీ ఆధార్ను లాక్/అన్లాక్ చేయడానికి mAadhaar యాప్ లేదా https://resident.uidai.gov.in/aadhaar-lockunlock పైన క్లిక్ చేయాలి. ఇందుకోసం మీ ఐడీ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. ప్రాసెస్ ఎలా చేయాలి? ► https://resident.uidai.gov.in/aadhaar-lockunlock వెబ్ సైట్ లోకి వెళ్లాలి ► అనంతరం Secure UID Authentication Channel సెక్షన్లోకి వెళ్లి Lock UID లేదా Unlock UID ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి. ► అలా చేసిన తరువాత మీరు మీ 12అంకెల ఆధార్తో పాటు సంబంధిత వివరాల్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ► ఫైనల్ గా మీఫోన్ నెంబర్ కు వన్ టైమ్ పాస్వర్డ్ వస్తుంది. ► ఆ ఓటీపీని యాడ్ చేస్తే మీ ఆధార్ బయోమెట్రిక్ లాక్ అవుతుంది. చదవండి: రూ.93,520 కోట్ల బకాయిలు, సుప్రీంకోర్ట్కు ఎయిర్టెల్-వొడాఫోన్ -
మీ ఆధార్ నకిలీదా లేదా నిజమైందా తెలుసుకోండిలా?
మన దేశంలో ఆధార్ అత్యంత ముఖ్యమైన పత్రాలలో ఒకటి. భారత దేశ పౌరులకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడీఎఐ) ఆధార్ ఉచితంగా జారీ చేస్తుంది. ఇప్పుడు, మోసగాళ్లకు వ్యతిరేకంగా ముందు జాగ్రత్తగా, ఆధార్ ఇటీవల తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఆన్ లైన్, ఆఫ్ లైన్ పద్ధతుల్లో ఆధార్ ను ఎలా ధృవీకరించాలో ట్వీట్ చేసింది. తదుపరి వివరాల కోసం uidai.gov.in ఆధార్ అధికారిక వెబ్ సైట్ కు లాగిన్ చేయవచ్చు అని పేర్కొంది. "ఏదైనా ఆధార్ ను ఆన్ లైన్/ఆఫ్ లైన్ ద్వారా ధృవీకరించవచ్చు. ఆఫ్ లైన్ లో వెరిఫై చేయడం కొరకు, #Aadhaarపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. ఆన్ లైన్ లో వెరిఫై చేయడం కొరకు, లింక్(link: https://resident.uidai.gov.in/verify)లో 12 అంకెల ఆధార్ నమోదు చేయండి" అని ట్విటర్ లో పేర్కొంది. మీ ఆధార్ నకిలీదా లేదా నిజమైందా గుర్తించండి ఇలా? మొదట resident.uidai.gov.in/verify లింకు మీద క్లిక్ చేయాలి ఇచ్చిన స్థలంలో ఆధార్ నెంబరు, కాప్చాను నమోదు చేయాలి. తర్వాత 'Proceed to Verify' అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ఆధార్ కార్డు ఒరిజినల్ అయితే, మీ వయస్సు, జెండర్, రాష్ట్రం, మొబైల్ నెంబర్ వివరాలు కనిపిస్తాయి. ఒకవేల అది నకిలీది అయితే ఈ వివరాలు కనిపించవు. పైన పేర్కొన్న పద్దతులు ద్వారా మీ ఆధార్ నకిలీదా లేదా నిజమైందా తెలుసుకోవచ్చు. #BewareOfFraudsters Any Aadhaar is verifiable online/offline. To verify offline, scan the QR code on #Aadhaar. To verify online, enter the 12-digit Aadhaar on the link: https://t.co/cEMwEa1cb4 You can also do it using the #mAadhaar app#AadhaarAwareness pic.twitter.com/5Z2enlYrTn — Aadhaar (@UIDAI) July 9, 2021 -
మరోసారి పాన్-ఆధార్ లింక్ గడువు పొడగింపు
పాన్-ఆధార్ లింకింగ్ గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడగించింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో గడువును మూడు నెలలు సెప్టెంబర్ 30 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన గడువు జూన్ 30తో దగ్గర పడుతున్న వేళ కేంద్రం ఈ కీలక ప్రకటన చేసింది. మొదట పాన్-ఆధార్ లింకు గడువును మార్చి 31 పేర్కొన్నారు. తర్వాత కూడా కరోనా మహమ్మరి వల్లనే జూన్ 30 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు తాజాగా మరోసారి మూడు నెలల పాటు పొడగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ప్రవేశ పెట్టిన ఆర్ధిక బిల్లులో ప్రభుత్వం ఒక సవరణను కూడా చేసింది. కొత్త నిబందనల ప్రకారం ఒక వ్యక్తి పాన్ ను ఆధార్ తో లింక్ చేయకపోతే రూ.1000 వరకు ఆలస్యం రుసుము కింద ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పాన్-ఆధార్ లింకింగ్ పొడగింపు నిర్ణయంతో పాటు మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగి కొవిడ్ చికిత్సకు కంపెనీలు చెల్లించే మొత్తానికి పన్ను మినహాయింపు వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. Relief to Income Tax Payer ✅Time to invest in residential house for tax deduction extension for more than 3 months. ✅PAN Aadhar Linking Extension of 3 months ✅Vivad se Vishwas Payment without interest - extension by 2 months from 30th June to 31st August https://t.co/xRz1SxfzKS pic.twitter.com/hEOLqXzGHh — Anurag Thakur (@ianuragthakur) June 25, 2021 అలాగే, కొవిడ్తో మరణించిన ఉద్యోగి కుటుంబాలకు కంపెనీలు చెల్లించే పరిహారానికి కూడా ఈ మినహాయింపు ఇచ్చినట్లు పేర్కొంది. వివాద్ సే విశ్వాస్ పథకం గడువును మరో రెండు నెలలు (ఆగస్టు 31 వరకు) పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఫారం-16 గడువును జులై 15 నుంచి జులై 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. అలాగే నిబందనల ప్రకారం మొదటిసారి ఇల్లును కొనుగోలు చేస్తే దానిపై పెట్టె పెట్టుబడిపై పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇప్పుడు ఈ గడువును జూన్ 30 నుంచి మరో 3 నెలలు పొడగించింది. చదవండి: పీఎఫ్ ఖాతాలో బ్యాంక్ ఖాతా వివరాలు అప్ డేట్ చేయండి ఇలా? -
అలర్ట్: దగ్గర పడుతున్న ఆధార్ పాన్ లింక్ గడువు
పాన్ కార్డుదారులకు అలర్ట్. గతంలో మార్చి 31 వరకు ఉన్న ఆధార్-పాన్ లింకు గడువును కేంద్రం కరోనా మహమ్మారి నేపథ్యంలో జూన్ 30 వరకు పొడగించింది. ఒకవేల ఈ గడువు లోపు లింక్ చేయకపోతే రూ.1000 ఆలస్య రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు 2021 ఆర్థిక బిల్లులో ప్రభుత్వం కొత్త సెక్షన్ 234 హెచ్ను ప్రవేశపెట్టింది. గతంలో మాదిరి ఈసారి పొడగించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. బ్యాంకు సంబంధిత పనులు, ఆదాయపు పన్ను సంబంధిత కార్యకలాపాల కోసం ఆధార్-పాన్ లింక్ చేయడం తప్పనిసరి. పాన్ ప్రధానంగా ఎక్కడ అవసరం? మోటార్ వేహికల్ లేదా టూ వీలర్ కాకుండా ఏదైనా వేహికల్ ని అమ్మలన్న లేదా కొనాలన్న ఆధార్ తప్పనిసరి. బ్యాంకింగ్ కంపెనీ/సహకార బ్యాంకులో ఖాతా తెరవడం. క్రెడిట్ లేదా డెబిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి. డిపాజిటరీ, పార్టిసిపెంట్, సెక్యూరిటీల కస్టోడియన్ లేదా డీమ్యాట్ ఖాతాతెరవడం కోసం పాన్ తప్పనిసరి. ఒక హోటల్ లేదా రెస్టారెంట్ లో రూ.50,000 కంటే ఎక్కువ బిల్లు చెల్లించాలంటే. ఏ విదేశీ దేశానికైనా సంబంధించి రూ.50,000 మించి నగదు రూపంలో చెల్లించాలంటే. డిబెంచర్లు లేదా బాండ్లను కొనుగోలు చేయడానికి ఒక కంపెనీ లేదా సంస్థకు రూ.50,000 కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి వస్తే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన బాండ్లను కొనుగోలు చేయడానికి రూ.50,000 కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి వస్తే. బ్యాంకు డ్రాఫ్ట్ లు, పే ఆర్డర్లు లేదా బ్యాంకింగ్ కంపెనీ లేదా కో ఆపరేటివ్ బ్యాంక్ నుంచి బ్యాంకర్ చెక్కుల కొనుగోలు కొరకు ఏదైనా ఒక రోజులో రూ. 50,000 కంటే ఎక్కువ మొత్తానికి నగదు రూపంలో చెల్లించడం కోసం ఆధార్ తప్పనిసరి. చదవండి: పాన్ కార్డును ఆధార్తో లింక్ చేయడం ఎలా..? -
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త!
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) తన ఖాతాదారులకు శుభవార్త అందించింది. ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్స్(ఈసీఆర్) ఫైలింగ్కు సంబంధించి యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యుఎఎన్)తో ఆధార్ నెంబర్ లింక్ గడువును కరోనా మహమ్మారి కారణంగా పొడిగించింది. గతంలో జూన్ 1 వరకు ఉన్న యుఎఎన్ - ఆధార్ లింకింగ్ గడువును తాజాగా ఈపీఎఫ్ఓ సెప్టెంబర్ 1 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈసీఆర్ దాఖలు చేయడానికి కచ్చితంగా యూఏఎన్ నెంబర్తో ఆధార్ నెంబర్ను లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన అధికారులకు ఈ విషయాన్ని ఇప్పటికే తెలియజేసింది. దీంతో ఇప్పటివరకు యూఏఎన్తో ఆధార్ లింక్ చేయకపోయినా కూడా ఇప్పుడు ఈసీఆర్ దాఖలు చేయొచ్చు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తమ ఉద్యోగులకు ఆధార్ నెంబర్ను పీఎఫ్ ఖాతాలు లేదా యుఎఎన్ తో లింక్ చేయడానికి యజమానులకు ఎక్కువ సమయం లభించింది. ఈపీఎఫ్వో సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020లోని సెక్షన్ 142లో కొన్ని మార్పులు చేసింది. ఈసీఆర్ దాఖలు చేసే నియమాలు, విధానంలో సవరణలు చేసింది. ఒకవేల ఆధార్ తో మీ ఖాతా లేదా యుఎఎన్ నెంబర్ లింకు చేయకపోతే మీ ఖాతాలో కంపెనీలు అందజేసే ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ను నిలిపివేసే అవకాశం ఉంది. చదవండి: హోప్ ఎలక్ట్రిక్: సింగిల్ ఛార్జ్ తో 125 కి.మీ. ప్రయాణం -
పాన్ కార్డును ఆధార్తో లింక్ చేయడం ఎలా..?
పాన్ కార్డును ఆధార్తో అనుసంధానించేందుకు చివరి తేదీ జూన్ 30. గతంలో మార్చి 31 వరకు ఉన్న గడువును ఈ నెల చివరి వరకు కరోనా మహమ్మారి కారణంగా పొడగించింది. ఇంకో సారి ఈ గడువును పొడగించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేల ఈ గడువు లోపు లింక్ చేయకపోతే రూ.1000 ఆలస్య రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు 2021 ఆర్థిక బిల్లులో ప్రభుత్వం కొత్త సెక్షన్ 234 హెచ్ను ప్రవేశపెట్టింది. ఇంతవరకు పాన్- ఆధార్ లింక్ చేయని వారు ఈ నెలాఖరు లోపు లింక్ చేయడం మంచిది. పాన్ కార్డుతో, ఆధార్ను ఎలా లింక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. పాన్ కార్డును ఆధార్తో ఎలా లింక్ చేయాలి? మొదట https://www.incometax.gov.in/iec/foportal/ వెబ్ సైట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు క్రిందికి స్క్రోల్ చేసి, పోర్టల్ హోమ్పేజీలోని 'లింక్ ఆధార్' ఆప్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత మరో క్రొత్త వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. మీకు కనిపించే బాక్స్ లలో పాన్, ఆధార్ నంబర్, పేరు, మొబైల్ నంబర్ వంటి వివరాలను నమోదు చేయండి. ఒప్పందం అవసరమైన పెట్టెలను గుర్తించి, లింక్ ఆధార్పై క్లిక్ చేయండి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వచ్చిన ఆరు-అంకెల ఓటీపీ ఎంటర్ చేస్తే లింకింగ్ ప్రాసెస్ను ధృవీకరించండి. చదవండి: 10 నిమిషాల యాత్ర కోసం రూ.205 కోట్లు ఖర్చు -
పాన్ - ఆధార్ లింకు గడువు కొద్ది రోజులే!
మీ దగ్గర పాన్ కార్డు ఉందా? ఇంకా మీరు పాన్ కార్డును ఆధార్ కార్డుతో ఇంకా లింక్ చేయలేదా? అయితే, వెంటనే లింక్ చేయండి. ఒకవేళ మీరు లింక్ చేయకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంతేకాకుండా రూ.1000 జరిమానా కూడా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ సమాచారాన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు తెలియజేస్తున్నాయి. పాన్ ఆధార్ లింక్ గడువు జూన్ 30తో ముగుస్తుంది. అంటే మీరు ఈ నెలలో చివరి వరకు కచ్చితంగా రెండింటినీ అనుసంధానం చేసుకోవాలి. లేకపోతే మీ పాన్ కార్డు చెల్లుబాటు కాదు. దీంతో మీరు పాన్ కార్డును అవసరం ఉన్న చోట ఉపయోగించలేరు. గతంలోనే మార్చి 30 వరకు ఉన్న పాన్-ఆధార్ లింక్ గడువును జూన్ 30 వరకు పొడగించింది. ఇప్పుడు మరోసారి పొడగించే అవకాశాలు కూడా తక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే ముందే మీరు లింక్ చేసుకోవడం మంచిది. మీ పాన్ను ఆధార్తో లింక్ చేయకపోతే మీ పాన్ కార్డ్ పనిచేయదు. అలాగే బ్యాంకింగ్ లావాదేవీల విషయంలో అసౌకర్యాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇంకా పెన్షన్, స్కాలర్షిప్, ఎల్పీజి సబ్సిడీ వంటి పథకాలకు ద్రవ్య ప్రయోజనాలను పొందేటప్పుడు పాన్ తప్పనిసరి. మీరు ఆధార్ - పాన్లను పలు మార్గాల్లో లింక్ చేయవచ్చు. పాన్-ఆధార్ లింక్ను ఆన్లైన్ (https://www.incometax.gov.in/iec/foportal/)లో చేయవచ్చు. చదవండి: పూచీకత్తు లేకుండానే రూ.5 లక్షల పర్సనల్ లోన్ -
ఉచిత నీటి పథకానికి తప్పని తిప్పలు!
సాక్షి, హైదరాబాద్: ఉచిత నీటి సరఫరా పథకం కింద లబ్ధి పొందేందుకు అవసరమైన ‘నల్లా కనెక్షన్–ఆధార్’ అనుసంధానం నగరంలో ప్రహసనంగా మారింది. ముఖ్యంగా 20 వేల లీటర్ల ఉచిత నీటి సరఫరా పథకాన్ని పొందేందుకు అపార్ట్మెంట్లలో ప్రతీ ఫ్లాట్ యజమాని విధిగా నల్లా కనెక్షన్కు ఆధార్ నెంబరు అనుసంధానం చేసుకోవాలన్న నిబంధన కష్టతరంగా మారింది. గ్రేటర్ పరిధిలో సుమారు లక్ష వరకు ఫ్లాట్స్ యజమానులున్నారు. వీరంతా తమ ఆధార్ నెంబరును అనుసంధానం చేసుకునే క్రమంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధార్ కార్డులో ఉన్న ఫోన్ నెంబరును ప్రస్తుతం చాలా మంది వినియోగించని కారణంగా ఓటీపీ పాత నెంబరుకు వెళ్లడం.. పలు అపార్ట్మెంట్లలో ప్రస్తుతం ఉన్న బల్క్ నల్లా కనెక్షన్ బిల్డర్ పేరిట ఉండడం..కొన్ని చోట్ల అపార్ట్మెంట్లో అప్పటికే నల్లా కనెక్షన్ నెంబరుకు అనుసంధానమైన ఒక ఫ్లాట్ యజమానికి ఓటీపీ వెళుతోంది. సదరు వ్యక్తి అందుబాటులో లేని పక్షంలో సమస్యలు తలెత్తుతున్నాయి. మరోవైపు వెబ్సైట్లో తరచూ తలెత్తుతోన్న సాంకేతిక సమస్యలు వినియోగదారులకు చుక్కలు చూపుతుండడం గమనార్హం. వినియోగదారుల సౌకర్యార్థం ఈ ప్రక్రియను జలమండలి క్షేత్రస్థాయి సిబ్బంది ఆధ్వర్యంలో లేదా మీ సేవా కేంద్రాల్లో పూర్తిచేసుకునే అవకాశం కల్పించాలని వినియోగదారులు కోరుతున్నారు. ఆధార్ అనుసంధానం తప్పనిసరి.. జలమండలి పరిధిలో మొత్తంగా 9.80 లక్షల నల్లాలున్నాయి. వీటిలో ఇప్పటివరకు సుమారు 2 లక్షల మంది మాత్రమే తమ ఆధార్ నెంబరును నల్లా కనెక్షన్ నెంబరు(క్యాన్)కు అనుసంధానం చేసుకోవడం గమనార్హం. మెజార్టీ వినియోగదారులు ఈ ప్రక్రియను పూర్తిచేసుకోకపోవడంతో మున్సిపల్ పరిపాలన శాఖ అనుమతితో జలమండలి ఏప్రిల్ 30 వరకు గడువును పొడిగించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అన్ని రకాల ఉచిత పథకాలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరన్న నిబంధన విధించడంతో ఈమేరకు చర్యలు తీసుకున్నట్లు జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఫ్లాట్స్ వినియోగదారుల ఆధార్ అనుసంధానం ఇలా.. ► అపార్ట్మెంట్ వాసులు ముందుగా జలమండలి వెబ్సైట్..https://bms.hyderabadwater.gov.in/20kl/ను సంప్రదించాలి. ఇందులో ఉచిత నీళ్ల పథకం..ఆధార్ అనుసంధానం అన్న ఆప్షన్పై క్లిక్ చేయాలి. ► ముందుగా తమ అపార్ట్మెంట్కున్న నల్లా కనెక్షన్ (క్యాన్)కు అనుసంధానమైన మొబైల్ నెంబరుకు ఓటీపీ వెళ్తుంది. ► ఈ ఓటీపీని ఎంటర్ చేస్తేనే ఎక్స్ఎల్ షీట్ ఓపెన్ అవుతుంది. ► ఇందులో ఫ్లాట్ యజమాని పేరు, ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ (పీటీఐఎన్) నెంబరు, ఆధార్ నెంబరును నమోదు చేయాలి. ► ఆధార్ నెంబరుకు లింక్చేసిన మొబైల్ నెంబరుకు మరో ఓటీపీ మెసేజ్ వెళుతుంది. దీన్ని ఎంటర్చేస్తేనే ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తవుతుంది. ► ప్రతీ ఫ్లాట్ వినియోగదారుడూ విధిగా ఈ ప్రక్రియను వేర్వేరుగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ► సుమారు 50 ఫ్లాట్స్ ఉన్న అపార్ట్మెంట్ వాసులు అందరూ ఒకేసారి కాకుండా రోజుకు పది మంది చొప్పున ఈప్రక్రియను చేపడితేనే అనుసంధానం సులువు అవుతుంది. ► ఈ సమస్యలో ఇబ్బందులుంటే జలమండలి క్షేత్రస్థాయి కార్యాలయాలు లేదా 155313 కాల్సెంటర్ నెంబరును సంప్రదించాలని జలమండలి సూచించింది. -
అపార్ట్మెంట్ వాసులూ.. మేల్కోండి!
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వం ప్రకటించిన నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటిని పొందాలనుకునే అపార్ట్మెంట్లలోని ప్రతి ఫ్లాట్ వినియోగదారుడూ విధిగా నల్లా కనెక్షన్ నంబరుకు ఆధార్ను అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను జలమండలి వెబ్సైట్ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. హైదరాబాద్ వాటర్.జీఓవీ.ఐఎన్’ను సంప్రదించి పూర్తిచేసుకోవాలి. సాధారణంగా ప్రతి అపార్ట్మెంట్కూ ఒకే నల్లా కనెక్షన్ (బల్క్) ఉంటుంది. కానీ ఫ్లాట్స్ మాత్రం 10 నుంచి 100 వరకు ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రతీ ఫ్లాట్ వినియోగదారుని ఆధార్ను కూడా నల్లా కనెక్షన్ నంబరుకు అనుసంధానించాల్సి ఉంటుందని జలమండలి స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ తాజాగా ప్రారంభమైంది. అట్లయితే అనర్హులే.. నెలకు 20 వేల లీటర్ల ఉచిత మంచినీటి సరఫరా పొందాలనుకున్న ప్రతీ వినియోగదారుడు ఈ నెల 31లోగా తమ నల్లా కనెక్షన్కు ఆధార్ను అనుసంధానం చేసుకోవాల్సిన విషయం విదితమే. మురికివాడలు మినహా ఇతర గృహ వినియోగదారులు సైతం నల్లా కనెక్షన్ నంబరుకు ఆధార్ను మీ సేవ కేంద్రాల్లో అనుసంధానించుకోవాల్సి ఉంటుంది. ప్రతి గృహ వినియోగదారుడూ తమ నల్లాకున్న మీటర్ పని చేస్తుందో లేదో తనిఖీ చేసుకోవాలి. లేని పక్షంలో కొత్త మీటరును ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మీటరు పని చేయని పక్షంలో ఉచిత నీటి పథకానికి అనర్హులని జలమండలి ప్రకటించింది. ఆధార్ అనుసంధానం ఇలా.. అపార్ట్మెంట్ వాసులు ముందుగా జలమండలి వెబ్సైట్.. ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. హైదరాబాద్ వాటర్.జీఓవీ.ఐఎన్’ను సంప్రదించాలి. ఇందులో ఆధార్ అనుసంధానం అన్న ఆప్షన్పై క్లిక్ చేయాలి. ముందుగా తమ అపార్ట్మెంట్కున్న నల్లా కనెక్షన్ (క్యాన్)కు అనుసంధానమైన మొబైల్ నంబరుకు ఓటీపీ వెళుతుంది.ఓటీపీని ఎంటర్ చేస్తేనే ఎక్స్ఎల్ షీట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఫ్లాట్ యజమాని పేరు, ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటికేషన్ (పీటీఐఎన్)నంబరు, ఆధార్ను నమోదు చేయాలి.ఆధార్ నంబరుకు లింక్ చేసిన మొబైల్ నంబరుకు మరో ఓటీపీ మెసేజ్వెళుతుంది. దీన్ని ఎంటర్ చేస్తేనే ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తవుతుంది. ప్రతి ఫ్లాట్ వినియోగదారుడూ విధిగా ఈ ప్రక్రియను వేర్వేరుగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. సుమారు 50 ఫ్లాట్స్ ఉన్న అపార్ట్మెంట్ వాసులు అందరూ ఒకేసారి కాకుండా రోజుకు పది మంది చొప్పున ఈ ప్రక్రియను చేపడితేనే అనుసంధానం సులువవుతుంది. ఈ సమస్యలో ఇబ్బందులుంటే జలమండలి క్షేత్రస్థాయి కార్యాలయాలు లేదా 155313 కాల్సెంటర్ నంబరులో సంప్రదించాలని జలమండలి అధికారులు సూచించారు. -
డ్రైవింగ్ లైసెన్సు లేదు.. సార్!
సాక్షి, అమరావతి: గత రెండు నెలల్లో జరిపిన వాహనాల తనిఖీల్లో 22,130 మంది వద్ద డ్రైవింగ్ లైసెన్సులు లేనట్లు రవాణా శాఖ అధికారులు తేల్చారు. కానీ రాష్ట్రంలో మొత్తం 1.08 కోట్ల మందికి డ్రైవింగ్ లైసెన్సులున్నట్లు రవాణా శాఖ వద్ద గణాంకాలున్నాయి. అదే సమయంలో ద్విచక్ర వాహనాలు కాకుండా భారీ వాహనాలు నడిపే దాదాపు 10 వేల మంది కూడా లైసెన్సులు లేవని చెప్పడంతో రవాణా శాఖ అధికారులు విచారణ చేపట్టగా.. కొత్త విషయం వెల్లడైంది. కేవలం లైసెన్సు సస్పెన్షన్ నుంచి తప్పించుకునేందుకే.. తనిఖీల్లో పట్టుబడినప్పుడు ఈ విధంగా చెబుతున్నారని తేల్చారు. ప్రతి వంద మంది వాహనదారుల్లో 70 మంది ఇలాగే చెబుతున్నట్లు వెల్లడైంది. డ్రైవింగ్ లైసెన్స్లేదని చెప్పడంతో రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు జరిమానా విధించి వదిలేస్తున్నారు. అదే లైసెన్సు ఉందని చెబితే సస్పెండ్ చేస్తున్నారు. దీని వల్ల తమకు ఉపాధి పోతుందని భారీ వాహనాలు నడిపే డ్రైవర్లు చెబుతున్నారు. ఆధార్తో లింక్ చేస్తే తేలిపోతుంది.. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కూడా రవాణా సేవలన్నింటికీ ఆధార్ లింక్ను అనుమతించింది. రాష్ట్రంలో రవాణా శాఖ కూడా ఈ ప్రక్రియను ప్రారంభించింది. ఇటీవల కాలంలో అన్ని జిల్లాల్లో కలిపి సుమారు 20 వేల వరకు లైసెన్సులను సస్పెండ్ చేసినట్లు రవాణా శాఖ చెబుతోంది. సస్పెండ్ చేసిన లైసెన్సులను ఆధార్తో లింక్ చేయడం వల్ల వాహనదారుడు ఎట్టి పరిస్థితిలోనూ పోగొట్టుకున్నానని చెప్పేందుకు వీలుండదు. కొత్త కార్డు పొందేందుకూ అవకాశముండదు. అలాగే ఆధార్తో లింక్ చేస్తే వాహనదారుడికి అసలు లైసెన్సు ఉందా? లేదా? అన్నది కూడా తేలిపోతుంది. ఈ నేపథ్యంలో ఆధార్తో లైసెన్సు డేటాను పరిశీలించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు రవాణా శాఖ అదనపు కమిషనర్ ప్రసాదరావు ‘సాక్షి’కి తెలిపారు. -
ఎంఆధార్ వినియోగదారులకు తీపికబురు
కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియాను ప్రోత్సహించడానికి యూఐడీఏఐ ఆధ్వర్యంలో ఎంఆధార్ యాప్ను 2017లో రూపొందించింది. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న వినియోగదారులు తమ ఆధార్ డేటా తస్కరించ ఉండటానికి ఆధార్ ప్రొఫైల్ కి లాక్ వేయవచ్చు. తాజాగా మరో ఫీచర్ ను ఎంఆధార్ వినియోగదారుల కోసం యూఐడీఏఐ అందుబాటులోకి తీసుకొనివచ్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఎంఆధార్ యాప్లో మరో ఐదుగురి ఆధార్ కార్డు ప్రొఫైల్లను జత చేసుకునే వెసులుబాటు కల్పించింది. యూఐడీఏఐ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. ఇంతకముందు ఎంఆధార్ యాప్లో గరిష్టంగా మూడు ప్రొఫైల్లను చేర్చే అవకాశం ఉండేది. ఇప్పడు ఐదు ప్రొఫైల్ జత చేసుకోవచ్చు. ఆధార్కు సంబంధించిన ఏదైనా సేవను ఆధార్ లాక్/అన్లాక్, బయోమెట్రిక్ లాక్/అన్లాక్, విఐడి జెనరేటర్, ఇకెవైసి మొదలైన వాటిని ఎంఆధార్ మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా పొందవచ్చు. మీరు ప్రతి ప్రొఫైల్ను జతచేయాలి అనుకున్నప్పుడు ఆధార్ నెంబర్ ధృవీకరించడం కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఈ యాప్లో వినియోగదారుల పేరు, పుట్టిన తేదీ, లింగం మరియు చిరునామా, ఫోటో, ఆధార్ నంబర్ లింక్లను కలిగి ఉంటుంది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు వారి ప్రొఫైల్ డేటాను కూడా అప్డేట్ చేసుకోవచ్చు. You can add up to 5 Aadhaar profiles in your #mAadhaar app. OTP for authentication is sent to the registered mobile number of the Aadhaar holder. Download and install the #NewmAadhaarApp from: https://t.co/62MEOf8J3P (Android) https://t.co/GkwPFzM9eq (iOS) pic.twitter.com/gapv443q72 — Aadhaar (@UIDAI) February 12, 2021 చదవండి: ఆపిల్ కంప్యూటర్ ఖరీదు రూ.11కోట్లు? ప్రపంచంలో చవకైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం -
గుడ్న్యూస్: పాన్- ఆధార్ గడుపు పెంపు
న్యూఢిల్లీ : పాన్- ఆధార్ కార్డ్ లింక్ గడువును పొడగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే చాలా సార్లు దీని గడువును పొడిగించిన కేంద్రం.. తాజాగా సోమవారం మరోసారి పొడగించింది. రేపటితో (మంగళవారం) గడువు ముగుస్తుండగా.. వచ్చే ఏడాది (2021) మార్చి 31 వరకు పొడిగించింది. దేశంలో కరోనా వైరస్ దృష్ట్యా ఆదాయపు పన్నుశాఖ నిర్ణయం తీసుకుంది. కాగా పాన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డుతో కచ్చితంగా అనుసంధానం చేసుకోవాల్సిందే. దీనిని ఈ ఏడాది ఏప్రిల్లో కేంద్రం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. లేకుంటే పాన్ కార్డు చెల్లదని ఐటీశాఖ ప్రకటించింది. -
పాన్ - ఆధార్ లింకింగ్ : మరోసారి ఊరట
సాక్షి, ముంబై: ఆధార్తో పాన్ వివరాలను లింక్ చేయని వారికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) వారికి శుభవార్త అందించింది. పాన్ - ఆధార్ లింకింగ్ తేదీని పొడిగిస్తూ ఆదాయపు పన్ను శాఖ సోమవారం రాత్రి ట్వీట్ చేసింది. నేటితో( డిసెంబర్ 31, 2019) గడువును దీనిని మరో మూడు నెలల పాటు పొడిగించింది. ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 139ఏఏ లోని ఉప-సెక్షన్ 2 కింద పేర్కొన్న విధంగా పాన్ను ఆధార్తో అనుసంధానించడానికి వచ్చే ఏడాది (2020) మార్చి 31వ తేదీ వరకు దీనిని పొడిగించింది. పాన్-ఆధార్ లింకింగ్ను ఇప్పటికే పలుమార్లు పొడిగించిన సీబీడీటీ తాజాగా గడువును పొడిగించడం ఇది ఎనిమిదోసారి. పాన్-ఆధార్ అనుసంధానం ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కేంద్రం తప్పనిసరి చేసింది. ఇటీవల ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారికి తప్పనిసరి అయింది. డిసెంబర్ 31వ తేదీలోపు ఆధార్ అనుసంధానం చేయకపోతే పాన్ కార్డు చెల్లదని ఐటీ శాఖ తెలిపింది. -
పాన్– ఆధార్ లింకింగ్ గడువు తేదీ డిసెంబర్ 31
న్యూఢిల్లీ: పాన్ కార్డ్ను ఆధార్తో అనుసంధానం చేసేందుకు ఈ నెల 31 గడువు తేదీగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం (సీబీడీటీ) ప్రకటించింది. ఆదాయ పన్ను సేవలు మరింత పారదర్శకంగా కొనసాగడం కోసం ఈ రెండింటి అనుసంధాన్ని తప్పనిసరి చేసినట్లు పేర్కొంది. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 139 ఏఏ (2) ప్రకారం 2017 జూలై 1 నాటికి పాన్ కార్డును పొంది ఉండి, ఆధార్ పొందడానికి అర్హులైన ప్రతి వ్యక్తి, సంస్థ తమ ఆధార్ నంబర్ను ఆదాయ పన్ను శాఖకు వెల్లడించాల్సి ఉంటుంది. ఈ సెక్షన్లోని అంశానికి గడువు తేదీని ఇంతకుముందు ఈ ఏడాది సెప్టెంబర్ 30గా ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఆ హక్కు ప్రభుత్వానికి ఉందా?
న్యూఢిల్లీ: ఫేస్బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లోని పౌరుల సమాచారాన్ని తెలుసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందా అనే కీలక అంశంపై విచారణ జరపాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. అదేవిధంగా, సామాజిక మాధ్యమాలకు ఆధార్ నంబర్ను అనుసంధానించడంపైనా విచారణ జరపనుంది. ఇందుకు సంబంధించి వేర్వేరు హైకోర్టుల్లో పెండింగ్లో ఉన్న పిటిషన్లను సుప్రీంకోర్టు తనకు తానుగా బదిలీ చేసుకుంది. ఈ అంశంపై మంగళవారం విచారణ చేపట్టిన జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్ల ధర్మాసనం.. సోషల్ మీడియా దురి్వనియోగాన్ని అడ్డుకట్టవేసేందుకు, మెసేజీలను డీక్రిప్ట్ చేసే బాధ్యతను ఇంటర్మీడియరీస్ (ఇంటర్నెట్ సరీ్వస్ ప్రొవైడర్లు, సెర్చ్ ఇంజిన్లు, సామాజిక మాధ్యమాల వేదికలు)దే అనడంలో విశ్వసనీయతపై జనవరి 15వ తేదీలోగా నివేదిక సమరి్పంచాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటరీ్మడియరీస్ గైడ్లైన్స్(సవరణ) చట్టం–2018 రూపకల్పనకు 90 రోజుల గడువు కావాలంటూ కేంద్రం చేసిన వినతిపై ఈ మేరకు సానుకూలత వ్యక్తం చేసింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ఇది జాతి సమగ్రత, దేశ భద్రత పరిరక్షణకు మాత్రమే ఈ వెసులుబాటు ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిందంటూ ఒక ఉగ్రవాది వాదించలేడని ఈ సందర్భంగా అటార్నీ జనరల్ పేర్కొన్నారు. ఒక మెసేజి గానీ, సమాచారం గానీ వాస్తవంగా ఎక్కడి నుంచి వచ్చిందో ఇంటరీ్మడియరీస్ బహిర్గతం చేయడం తప్పనిసరి చేసేందుకు, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేందుకు కేంద్రం ప్రయతి్నస్తోందన్న వాదనను సొలిసిటర్ జనరల్ తోసిపుచ్చారు. తమిళనాడు తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ హాజరై..వాట్సాప్, ఫేస్బుక్ల్లోని అధికారులు కోరిన ఏదైనా సమాచారాన్ని వెల్లడించాల్సిందేనంటూ ఐటీ చట్టంలోని సెక్షన్–69 చెబుతోందని, ఇందుకు విరుద్ధంగా చేస్తున్న వాదనలు భారతీయ చట్టాల ప్రకారం అంగీకారయోగ్యం కాదని పేర్కొన్నారు. ‘అయితే, ఈ విషయంలో వారిని బలవంతం చేయగలమా? ఆ సమాచారాన్ని డీక్రిప్ట్ చేసి ఇవ్వడం లేదా అందుకు అవసరమైన సాంకేతికతను మీకు అందించడం ఇంటరీ్మడియరీస్ది బాధ్యత అయి ఉండాలి’అంటూ ధర్మాసనం స్పందించింది. అదే సమయంలో తమిళనాడు ప్రభుత్వం కోరిక మేరకు.. సుప్రీంకోర్టుకు పెండిం గ్ పిటిషన్ల బదిలీని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నట్లు వేణుగోపాల్ తెలిపారు. దీంతో దాదాపు ఇదే అంశంపై మద్రాస్ హైకోర్టులో రెండు, బోంబే, మధ్యప్రదేశ్ హైకోర్టుల్లో ఒక్కోటి చొప్పున పెండింగ్లో ఉన్న పిటిషన్లను సుప్రీంకు బదిలీ చేయాలంటూ ఫేస్బుక్ చేసిన వినతిని కోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్లను 2020 జనవరి చివర్లో తగు ధర్మాసనం విచారణ చేపట్టేందుకు వీలుగా ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఏదైనా నేర విచారణకు సంబంధించి అధికారులు కోరిన సమాచారాన్ని సరీ్వస్ ప్రొవైడర్లు అందించాలా వద్దా అనేది సుప్రీంకోర్టు మాత్రమే నిర్ణయించాలని ఫేస్బుక్ తన పిటిషన్లో కోరింది. -
పాన్–ఆధార్ లింక్ చేశారా?
సాక్షి, ప్రకాశం: నేడు ఆర్థికపరమైన లావాదేవీలకు పాన్కార్డు అనేది ప్రతి ఒక్కరికీ అవసరంగా మారింది. ఏ లావాదేవీలకైనా పాన్కార్డు నంబర్ను తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ ప్రకారం పాన్కార్డు, ఆధార్కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా రెండింటిని అనుసంధానం చేసుకోవాలి. అలాగే ఇన్కం ట్యాక్స్ రిటర్న్ల ఫైలింగ్కు ఆధార్ నంబర్ కూడా అవసరం. పాన్కార్డు లేనివారు ఆధార్తో ఐటీ రిటరŠన్స్ దాఖలు చేయొచ్చు. ఈ నేపథ్యంలో ఆధార్ సంఖ్యను పాన్కార్డుతో అనుసంధానం ఆన్లైన్లోనూ, ఎస్ఎంఎస్ ద్వారా చేసుకోవచ్చు.\ లాగిన్ అయ్యేది ఇలా.. పన్ను చెల్లింపుదారులు ఇన్కం ట్యాక్స్ ఇ–ఫైలింగ్ వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాలి. ఇదివరకే యూజర్ ఖాతా కలిగి ఉన్నవారు నేరుగా ఇ–ఫైలింగ్ పోర్టర్లో లాగిన్ కావచ్చు. లాగిన్ అయ్యేందుకు గతంలో క్రియేట్ చేసుకున్న యూజర్ ఐడీ, పాస్వర్డ్, కోడ్ నంబర్ను ఎంటర్ చేయాలి. దీంతో ఆధార్, పాన్ సంఖ్యల లింక్ వివరాలు తెలుసుకోవచ్చు. కొత్తగా లింక్ ఇలా.. ఆదాయపన్ను శాఖ ఇ–ఫైలింగ్ వెబ్సైట్ www.incometaxindiaefiling.gov.in లో లాగిన్ అయి ప్రొఫైల్ సెట్టింగ్స్లోకి వెళ్లాలి. అక్కడ కనిపించే ముఖచిత్రంలో ఎడమ భాగంలో లింక్ ఆధార్ న్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఒక విండో ఓపెన్ అవుతుంది. అక్కడ పాన్కార్డు సంఖ్య, ఆధార్కార్డు సంఖ్య, పేరు వివరాలను పూర్తి చేయాలి. ఆదాయపన్ను శాఖ ఈ వివరాలను సరిచూస్తుంది. క్రాస్ చెక్ పూర్తి అయిన తర్వాత మీ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. వ్యాలిడేషన్ పూర్తయిన తర్వాత పాన్కార్డుతో ఆధార్ అనుసంధానం జరుగుతుంది. వివరాలన్నీ సరిపోతేనే ఈ అనుసంధాన ప్రక్రియ సజావుగా జరుగుతుంది. అనుసంధానం పూర్తయితే మీకు సమాచారం అందుతుంది. ఎస్ఎంఎస్ ద్వారా.. యూఐడీపీఏఎస్ అని ఆంగ్ల అక్షరాల్లో టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆధార్ నంబర్ ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి పాన్ నంబర్ ఎంటర్ చేసి 567678కు ఎస్ఎంఎస్ పంపాలి. ఆధార్కార్డుతో లింక్ అయిన మొబైల్ నంబర్తోనే ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. అనుసంధానం ఎందుకు.. ఆదాయపన్ను శాఖ రిటర్న్స్ దాఖలు చేసినప్పుడు మీ మొబైల్కు వచ్చే ఓటీపీ మీ ఆధార్ అనుసంధానం అయిన సెల్ నంబర్కు ఇక నుంచి వస్తుంది. అలాగే ఆ శాఖ ఇ–వెరిఫికేషన్ మరింత సులువవుతుంది. పాన్తో పాటు ఆధార్ అనుసంధానం చేయని పక్షంలో సెప్టంబర్ 30 తర్వాత పాన్కార్డు నిరుపయోగంగా మారుతుందని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. ఆదాయపన్ను రిటర్నులు చేసేవారు ఆధార్ను పాన్కు అనుసంధానించడం మంచిది. ఇన్కం ట్యాక్స్ వెబ్సైట్లో ఆధార్ అనుసంధానం జరిగి ఉంటే వీరు ఐటీఆర్–5ను ప్రింట్ తీసి పంపాల్సిన అవసరం ఉండదు. దీంతో పన్ను రిటర్నుల ప్రక్రియ త్వరితగతిన జరుగుతుంది. -
టెక్నాలజీ కొంపముంచుతోంది
న్యూఢిల్లీ: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తోందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని స్పష్టం చేసింది. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా గ్రామ్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలను నియంత్రించడానికి మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఎప్పట్లోగా మార్గదర్శకాలను రూపొందిస్తారో మూడు వారాల్లోగా సుప్రీంకోర్టుకు తెలియజేయాలని ఆదేశించింది. సోషల్ మీడియాలో వినియోగదారుల అకౌంట్లకు ఆధార్ లింకప్కు సంబంధించి వివిధ హైకోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులన్నింటినీ సుప్రీంకోర్టుకు బదలాయించాలన్న పిటిషన్పై విచారణ జరిపే సమయంలో న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో, ఆన్లైన్లో వచ్చే నకిలీ వార్తలు ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలుసుకోలేకపోతున్నారని బెంచ్ పేర్కొంది. ‘స్మార్ట్ఫోన్ వాడను’ సోషల్ మీడియా విస్తృతి పెరగడం, ఇంటర్నెట్ నెట్టింట్లోకి రావడంతో ఎన్నో అనర్ధాలు జరుగుతున్నాయని సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ దీపక్ గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం హద్దులు దాటిపోయి ఎంతటి ప్రమాదకారిగా మారుతోందో అర్థమవుతుంటే స్మార్ట్ ఫోన్ వాడటం ఆపేసి, బేసిక్ ఫోన్కు మారాలని ఉందని జడ్జి అన్నారు. -
ఇళ్లను మించిపోయాయి..
సాక్షి, బలిజిపేట (విజయనగరం): ప్రజా సాధికారిత సర్వే.. ఇంటింటా సర్వే... మరుగుదొడ్ల నిర్మాణ సమయంలో గ్రామాలు, పట్టణాలలో సర్వేలు... ఇలా ఎన్ని సర్వేలు నిర్వహించినా ఇళ్ల కంటే తెలుపు రంగు రేషన్కార్డులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో రేషన్కార్డుల మంజూరులో నియంత్రణ లేకపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో నివాస గృహాలకు మించి రేషన్కార్డులు ఉన్నప్పటికీ.. ఎలా పుట్టుకొస్తున్నాయనే దానిపై అధికారులు స్పందించకపోవడం విశేషం. ఇల్లు ఒకటే ఉన్నా కార్డులు మాత్రం ఒకటి కంటే ఎక్కువగా ఉంటున్నాయి. గత ప్రభుత్వం సంక్షేమ పథకానికి తెలుపు రేషన్కార్డు అర్హతగా నిర్ణయించడంతో లెక్కకు మించి తెలుపు రంగు కార్డులు సృష్టించబడ్డాయనే విమర్శలు విని పిస్తున్నాయి. తెలుపు రేషన్కార్డు కావాలంటే టీడీపీ ప్రభుత్వంలో 1100 నంబర్కు డయల్ చేసి చెప్పాల్సి రావడంతో స్థానికంగా అధికారుల ప్రమేయం లేకుండా పోయింది. అనర్హుడుకి కార్డు వచ్చినా దానిని తొలగించేందుకు అధికారులకు ఎటువంటి అధికారం లేకుండా పోయింది. దీంతో పదేసి ఎకరాలున్నవారికి కూడా తెలుపు కార్డులు మంజూరయ్యాయి. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు వారి తల్లిదండ్రుల పేరు మీద కార్డులు పొందడం విశేషం. కార్డుదారులు మృతిచెందినా వారి కార్డులు తొలగించకపోవడం తదితర కారణాల వల్ల కార్డులు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. తెలుపు రేషన్కార్డుకు అర్హులు.. గ్రామంలోనే నివాసముండాలి. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు. ఇన్కమ్టాక్స్ పరిధిలోకి రాకూడదు. పెద్దపెద్ద వాహనాలు ఉండకూడదనే నిబంధనలున్నాయి. ఇన్ని నిబంధనలున్నా కార్డులు విపరీతంగా మంజూరయ్యాయి. అందుకు కారణం స్థానికంగా ఉండే అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే అని చెప్పుకోవచ్చు. సంక్షేమ పథకాలకు తప్పనిసరి ఇల్లు, పింఛన్, కార్పొరేషన్ రుణాలు పొందాలన్నా.. ఇతరత్రా ఎటువంటి సంక్షేమ పథకం అయినా పొందాలంటే తెలుపు రంగు రేషన్కార్డు ఉండాల్సిందే. దీంతో ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నవారు కూడా అప్పటికప్పుడు కార్డులో ఉన్న పేర్లు తొలగించుకుని కొత్తగా రేషన్కార్డులు పొందారు. ఒక దశలో భార్యాభర్తలు వేర్వేరుగా ఉన్నట్లు కూడా 1100కు డయల్ చేసి తెలుపు కార్డులు పొందిన సంఘటనలున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సన్న, చిన్నకారు రైతులకే కాకుండా భూస్వాములకు సైతం తెలుపు రేషన్ కార్డులు కేటాయింపులు జరగడం విశేషం. అదనంగా ఉండవు రేషన్కార్డుకు ఆధార్ లింక్ అవుతుంది కనుక అదనపు కార్డులు అనేవి ఎక్కడా ఉండవు. కుటుంబాల సంఖ్య పెరిగినందున కార్డులు ఎక్కువుగా కనిపిస్తున్నాయి. ఆన్లైన్ విధానం అయినందున ఎక్కడా పొరపాట్లు జరిగే అవకాశాలు లేవు. – సుబ్బరాజు, డీఎస్ఓ, విజయనగరం -
ఆధార్–పాన్ లింకేజ్ గడువు పెంపు
న్యూఢిల్లీ: ఆధార్–పాన్ కార్డుల అనుసంధానం గడువును కేంద్రం ఆరోసారి పెంచింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30లోగా పాన్కార్డును ఆధార్తో అనుసంధానం చేసుకోవాలని తెలిపింది. ఈ విషయమై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోరు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ..‘గతేడాది జూన్లో కేంద్ర ప్రభుత్వం పాన్కార్డును ఆధార్తో లింక్ చేసుకునేందుకు 2019, మార్చి 31ని గడువుగా నిర్ణయించింది. తాజాగా ఈ గడువును మరో ఆరు నెలలు అంటే సెప్టెంబర్ 30 వరకూ పొడిగించింది. ఆధార్కు అనుసంధానం చేయని పాన్ కార్డులను రద్దుచేస్తారన్న వార్తల నేపథ్యంలో తాజాగా గడువును పెంచింది’ అని తెలిపారు. ప్రభుత్వం ప్రత్యేకంగా మినహాయిస్తే తప్ప అందరూ ఆధార్–పాన్ అనుసంధానం చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఏప్రిల్ 1 నుంచి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలుచేసే వారు తప్పనిసరిగా ఆధార్ నంబర్ను ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆధార్ చట్టం రాజ్యాంగబద్ధమైనదేనని ఐదుగురు సుప్రీంకోర్టు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం గతేడాది తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గతేడాది సెప్టెంబర్ వరకూ 41 కోట్ల పాన్ కార్డులు జారీకాగా, వీటిలో 21 కోట్ల పాన్ కార్డులు ఆధార్తో అనుసంధానమయ్యాయి. -
ఆధార్తో రూ. 90వేల కోట్ల ఆదా..
న్యూఢిల్లీ: అర్హులైన లబ్ధిదారులకే ప్రభుత్వ పథకాల సబ్సిడీలను అందించేందుకు తోడ్పడుతున్న ఆధార్తో గణనీయంగా ఆదా అవుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. నకిలీ లబ్ధిదారులు, అనర్హులను ఏరివేయడం ద్వారా గతేడాది మార్చి ఆఖరు దాకా చూస్తే సుమారు రూ. 90,000 కోట్లు ఆదా అయినట్లు ఆయన వివరించారు. ‘ఆధార్ ప్రయోజనాలు’ అంశంపై సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్లో చేసిన ఒక పోస్టులో ఈ విషయాలు పేర్కొన్నారు. ఆధార్ వినియోగం ద్వారా భారత్ ఏటా రూ. 77,000 కోట్లు ఆదా చేసుకోగలదంటూ ప్రపంచ బ్యాంకు ఒక నివేదికలో పేర్కొన్నట్లు ఆయన వివరించారు. ‘ఆధార్తో ఆదా అయ్యే నిధులతో ఆయుష్మాన్ భారత్ స్థాయిలో మూడు పథకాలను అమలు చేయొచ్చు’ అని జైట్లీ తెలిపారు. కుటుంబానికి ఏటా రూ. 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీనిచ్చే ఆయుష్మాన్ భారత్ – ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద.. దాదాపు 10.74 కోట్ల పైగా పేద కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది. గతేడాది సెప్టెంబర్లో ప్రవేశపెట్టినప్పట్నుంచి ఇప్పటిదాకా 7 లక్షల మంది పేద పేషెంట్లు.. ఉచిత వైద్య చికిత్స పొందినట్లు జైట్లీ పేర్కొన్నారు. 122 కోట్ల ఆధార్ నంబర్ల జారీ.. 2016లో ఆధార్ బిల్లును జారీ చేసినప్పట్నుంచీ 28 నెలల వ్యవధిలో 122 కోట్ల ఆధార్ నంబర్లను జారీ చేయడం జరిగిందని జైట్లీ తెలిపారు. 18 ఏళ్ల పైబడిన వయోజనుల్లో 99 శాతం మందికి ఆధార్ జారీ అయ్యిందని పేర్కొన్నారు. ‘ఆధార్ ఆధారంగా ఇప్పటిదాకా లబ్ధిదారులకు బదలాయించిన సబ్సిడీల విలువ దాదాపు రూ. 1,69,868 కోట్ల మేర ఉంటుంది. మధ్యవర్తుల ప్రమేయం తగ్గిపోవడం వల్ల ప్రయోజనాలు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి చేరతాయి. ఇది భారత్లో మాత్రమే అమలవుతున్న ప్రత్యేక టెక్నాలజీ’ అని వివరించారు. -
ఆధార్ నమోదులో చేతివాటం
జ్యోతినగర్(రామగుండం): నేడు ఆధార్ అంటే అందరికీ అవసరమైన కార్డు ..ఏ అవసరానికైనా మొదటగా ఉపయోగపడేది ఆధార్ కార్డు అంటే అతిశయోక్తి కాదు. దీనిని పొందడానికి ప్రభుత్వం నిర్ణయించిన ధరలు మాత్రం ఎక్కడా అమలు కావడం లేదు. సేవలు చేయడానికే అంటూ బోర్డులు ఏర్పాటు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా వసూళ్లలకు పాల్పడుతున్నారు. చదువు రాని వారు వస్తే చాలు ఇక ఎంత వీలుంటే అంతా లాగేసుకోవడమే..ఇలా అమాయకుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయం ఎవరికి చెప్పాలన్నా ఆధారాలుండవు. దీంతో పోనీలే అనుకుంటున్నారు వినియోగదారులు. కానీ సిబ్బంది మాత్రం రోజుల తరబడి ఇదే పనిలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. గోదావరిఖని ప్రాంతంలో కొత్త ప్రాజెక్టుల నిర్మాణ పనులకు వచ్చిన ఇతర రాష్ట్రాల వారి వద్ద నుంచి అందినకాడికి దండుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు దీనిపై దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వినియోగదారులు కోరుతున్నారు. గుర్తింపును ధ్రువీకరించే పత్రాలు రేషన్కార్డు, పాస్పోర్టు, పాన్ కార్డు, ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాస్పోర్టు ప్రభుత్వ ఫొటో గుర్తింపు కార్డు, జాబ్ కార్డు, గుర్తింపు పొందిన విద్యా సంస్థచే జారీ చేయబడిన కార్డు, ఆయుధాల లైసెన్సు, ఫొటో ఉన్న బ్యాంకు ఏటీఎం, పింఛన్దారు కార్డు, స్వాతంత్య్ర సమరయోధుల కార్డు, కిసాన్ ఫొటో పాస్బుక్, ఇసీహెచ్ఎస్ ఫొటో కార్డు, తపాల శాఖ జారీ చేసిన పేరు, ఫొటో కలిగిన కార్డు, గ్రూఫ్–ఏ గెజిటెడ్ అధికారి తన లెటర్ హెడ్పై జారీ చేసిన ఫొటో ఉన్న గుర్తింపు పత్రం. చిరునామా ధ్రువీకరించే పత్రాలు.. గ్రామపంచాయతీ అధికారి లేదా హోదా కలిగిన అధికారి లెటర్ హడ్పై జారీ చేసిన నివాస ధ్రువీకరణ పత్రం, వాహన రిజిస్ట్రేషన్ పత్రంతో పాటు పలు ధ్రువీకరణ పత్రాలు. పుట్టిన తేదీ ధ్రువీకరించే పత్రాలు.. పేరు, పుట్టిన తేదీ ఉన్న వివరాలు కలిగిన ధ్రువీకరణ పత్రం, జనన ధ్రువీకరణ పత్రం, ఎస్ఎస్ఎల్సీ, పదో తరగతి పత్రం, పాస్పొర్టు, గ్రూఫ్(ఏ) అధికారి లెటర్ హెడ్ మీద జారీ చేసిన పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం. -
ఆధార్ అవస్థలు ఎన్నాళ్లో..?
వికారాబాద్ అర్బన్ : కొత్త ఆధార్ కార్డు పొందాలన్నా, ఉన్న దాంట్లో మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి ఆధార్ తప్పనిసరి లింక్ చేయడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఆధార్ కార్డు ప్రవేశపెట్టిన మొదట్లో తీసుకున్న చాలా మందికి వారి ఫోన్ నెంబర్ ఆధార్ కార్డుకు లింక్ లేదు. ఓటీపీ నెంబర్ తెలుసుకునేందుకు ఆధార్ కేంద్రం నిర్వాహకులే వారి నెంబర్లు ఇచ్చి అప్పటికి పని ముగించారు. ఇటీవల బ్యాంకుల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పకుండా సొంత ఫోన్ నెంబర్ ఆధార్ లింకు ఉండాలని చెబుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన చాలామంది మార్పులు చేర్పుల కోసం ఆధార్ కేంద్రాల చుట్టూ రోజుల తరబడి తిరుగుతున్నారు. మార్పులు చేర్పులకు దరఖాస్తు చేసినా సకాలంలో పని జరగడంలేదు. కొత్తగా కార్డు తీసుకోవాలనుకునే వారు రెండింతలు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల డిగ్రీ ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించేందుకు కూడా ఆధార్కు ఫోన్ నెంబర్ లింకు ఉండాలనే నిబంధన పెట్టారు. దీంతో చాలా మంది విద్యార్థుల దరఖాస్తు చేసుకోవడం ఇబ్బందిగా మారింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలన్నా ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ అడుగుతున్నారు. ఇటీవల పోలీసులు రోడ్డుపై వాహనదారులు ఆపి వాహనానికి సంబంధించిన పత్రాలు లేకపోయినా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నా, హెల్మెట్ లేకున్నా పిట్టీ కేసులు నమోదు చేస్తున్నారు. ఈ కేసులకు కూడా ఆధార్ కార్డు అడుగుతున్నారు. దీనికి ఫోన్ నెంబర్ తప్పకుండా లింక్ ఉండాల్సి వస్తోంది. ఇలా ప్రతిదానికి ఆధార్ కార్డు తప్పనిసరి కావడంతో పాటు దానికి ఫోన్ నెంబర్ ఉండాలనడం మరింత ఇబ్బందులకు గురిచేస్తుంది. జిల్లా కేంద్రంలో ఒకేఒక ఆధార్ కేంద్రం ఉండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధార్ కార్డులో మార్పులు చేసుకోవాలన్నా, కొత్త కార్డు తీసుకోవాలన్నా వారం రోజుల సమయం పడుతుంది. ఆధార్ కార్డు విషయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు పరిగణలోకి తీసుకుని అధికారులు మరో ఆధార్ కార్డు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. -
ఎయిర్పోర్టులో మొబైల్ ఆధార్ ఓకే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో ప్రవేశించడానికి ఇకపై మొబైల్ ఆధార్ను చూపిస్తే సరిపోతుందని పౌర విమానయాన భద్రతా సంస్థ తెలిపింది. ఎయిర్పోర్టులో ప్రవేశానికి పాస్పోర్ట్, ఓటర్ కార్డు, ఆధార్ లేదా మొబైల్ ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్లలో ఏదో ఒకటి సమర్పిస్తే చాలంది. పైన పేర్కొన్న వాటితో పాటు ఏదైనా జాతీయ బ్యాంకు జారీచేసిన పాస్ పుస్తకం లేదా పెన్షన్ కార్డు, వైకల్య గుర్తింపు కార్డు, కేంద్ర/రాష్ట ప్రభుత్వాలు ఇచ్చే ఐడీ కార్డులు, ప్రభుత్వ రంగ, స్థానిక, ప్రైవేటు సంస్థలు జారీ చేసే గుర్తింపు కార్డులను స్వీకరిస్తామని తెలిపింది. దివ్యాంగులు వైకల్య ఫొటో గుర్తింపు కార్డును లేదా మెడికల్ సర్టిఫికెట్ను విమానాశ్రయంలోకి వచ్చేముందు సమర్పించాల్సి ఉంటుంది. చివరికి ఇవేవీ లేకున్నా కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ గ్రూప్–1 గెజిటెడ్ అధికారి జారీచేసిన గుర్తింపు కార్డును అంగీకరిస్తామని తెలిపింది. -
‘బంగారు తల్లీ’ ?
బాలిక వివరాలు నమోదు చేసి పాఠశాలకు వెళ్లే వరకు పర్యవేక్షించాలి. పాఠశాలల్లో హెచ్ఎంలు, కళాశాలల్లో చేరిన తర్వాత ప్రిన్సిపాళ్లు వారి వివరాలు నమోదు చేయాలి. బంగారు తల్లి పథకాన్ని ఆధార్కు అనుసంధానం చేశారు. ఆధార్ ద్వారానే కుటుంబాలను గుర్తిస్తారు. బాలికల పేరిట ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానంలో నేరుగా వారి ఖాతాలకే నగదు చెల్లిస్తారు. వీటికి బయోమెట్రిక్ విధానం కూడా పరిగణనలోకి తీసుకుని పంపిణీ మొదలుపెడతారు. ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లులకు ఆధార్ నంబర్లు చాలా మందికి లేవు. అదేవిధంగా కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలకే ఈ పథకం వర్తిస్తుందనే నిబంధన విధించారు. ఇలా ప్రభుత్వ నిబంధనలు, సిబ్బంది నిర్లక్ష్యం ఈ పథకం అమలుకు శాపంగా మారాయి. జిల్లాలో బంగారు తల్లి పథకం క్షేత్రస్థాయి అమలు తీరును ‘న్యూస్లైన్’ బృందం బుధవారం పరిశీలించింది. ఇప్పటి వరకు పథకంలో 7,867 మంది తల్లులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వారిలో 5,493 మందికి మొదటి విడత నగదు అందించారు. 5 వేల మందికి మాత్రమే ఇప్పటి వరకు బంగారు తల్లి బాండ్లు ఇచ్చారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 1597 మంది తల్లులకు ఆధార్ లేదు. దీంతో వారికి మొదటి విడత నగదు మంజూరు కాలేదు. బంగారు తల్లి పథకంలో గత సంవత్సరం మే 1 అనంతరం జన్మించిన ఆడపిల్లలకు రూ. 2,500లను ఖాతాలో జమ చేస్తారు. బాలిక మొదటి పుట్టిన రోజు రూ.1000 చెల్లిస్తారు. బాలికలకు రెండో సంవత్సరం వచ్చే సరికి మరో రూ. 1000లను చెల్లిస్తారు. మూడో సంవత్సరం అంగన్వాడీ కేంద్రంలో చేర్పిస్తే రూ.1500 జమ చేస్తారు. ఇలా 4,5 సంవత్సరాలకు ఒక్కో ఏటా రూ. 1500లు చొప్పున చెల్లిస్తారు. బాలిక మొదటి తరగతి నుంచి ఐదో తరగతి వరకూ ఏడాదికి రూ.2 వేల చొప్పున చెల్లిస్తారు. బాలిక 6,7,8, తరగతులు చదివే వరకూ ఏడాదికి రూ. 2,500 జమచేస్తారు. 9,10 తరగతుల చదివే సమయంలో ఏడాదికి రూ. 3 వేలు చొప్పున చెల్లిస్తారు. బాలిక పదహారో ఏట ఇంటర్ రెండు సంవత్సరాలకు ఏడాదికి రూ. 3500ల చొప్పున జమ చేస్తారు. డిగ్రీలో చేరిన అనంతరం వరుసగా మూడు సంవత్సరాలు రూ. 4 వేలు జమ చేస్తారు. డిగ్రీ పూర్తై తర్వాత మహిళ పేరిట రూ. 1 లక్ష జమ చేస్తారు. -
మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడించిన ఏబీవీపీ, అరెస్ట్
హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్మెంట్ను తక్షణమే చెల్లించాలని, రీయింబర్స్మెంట్కు ఆధార్ కార్డుతో అనుసంధానం చేయవద్దంటూ ఏబీవీపీ విద్యార్థులు డిమాండ్ చేశారు. పెండింగ్ స్కాలర్ షిప్లను చెల్లించాలని డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మినిస్టర్స్ క్వార్టర్స్లోనికి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆందోళన చేస్తున్న ఏబీవీపీ విద్యార్థులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని గోల్కొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. -
ఆధార్...ఉద్యోగుల బేజార్
నెల్లిమర్ల, న్యూస్లైన్ : జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఆధార్తో ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది. ఎన్నాళ్ళో నిరీక్షించిన మీదట ఎట్టకేలకు ప్రభుత్వం ప్రారంభించిన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కు ఆధార్తో లింకు పెట్టడంతో జిల్లాలో సుమారు 16 వేలమంది ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. మొత్తం ఉద్యోగుల్లో సుమారు 75 శాతం మందికి ఆధార్ లేకపోవ డం, ఇప్పటికీ జిల్లాలో ఆధార్ నమోదు కేంద్రా లు ఏర్పాటు చేయకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు. దాదాపు అన్ని కుటుంబాల్లోనూ సభ్యులం దరికీ పూర్తిస్థాయిలో ఆధార్కార్డులు లేకపోవడంతో ఏం చేయాలో తోచక ఆందోళన చెందుతున్నారు. ఓవైపు న్యాయస్థా నం ఏ పథకానికీ ఆధార్తో లింకు పెట్టవద్దని తీర్పు ఇచ్చినా ప్రభుత్వం మాత్రం హెల్త్స్కీమ్ కు ఆధార్ను లింకు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చివరకు గత్యంతరం లేక జిల్లా కేంద్రంలోని ప్రైవేటు కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ప్రభుత్య ఉద్యోగులకు ప్రత్యేకంగా ైవె ద్య సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతనెల 5 నుంచి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకానికి జిల్లాలో సుమారు 16వేల మంది ఉద్యోగులను అర్హులుగా గుర్తించారు. వీరిలో సుమా రు పదివేల మంది ఉపాధ్యాయులే ఉన్నారు. అంతేకాకుండా ఈ ఉద్యోగులపై ఆధారపడిన వారి కుటుంబ సభ్యులు మరో 50 వేల మంది సైతం ఈ పథకం కిందకు వస్తారు. వివరాలన్నింటినీ ఆన్లైన్లో పొందుపరిస్తే అందరికీ తాత్కాలిక కార్డులు అందించాల్సి ఉంది. అయితే హెల్త్స్కీమ్కు ఆధార్కార్డులను లింకు పెట్టడంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. పథకానికి అర్హులైన వారంతా తమ ఆధార్కార్డును జతచేయాలని ప్రకటించడంతో ఆందోళనకు గురవుతున్నారు. 0 నుంచి 5సంవత్సరాల వరకు వయస్సున్న పిల్లలకు మాత్రం జనన ధ్రువీకరణ పత్రాన్ని జతచేస్తే చాలు. మిగిలిన వారందరికీ తప్పనిసరిగా ఆధార్కార్డులు ఉండాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. వాస్తవానికి మొత్తం ఉద్యోగుల్లో 25 శాతం మందికి మాత్రమే ప్రస్తుతం ఆధార్కార్డులున్నాయి. మిగిలిన 75 శాతం మందికి ఆధార్కార్డులకు నమోదు చేసుకోవాల్సి ఉంది. అయితే ఆధార్ తప్పనిసరి చేయడంతో ఇప్పటికీ కార్డులు లేనివారు ఏంచేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. కొంతమంది జిల్లాకేంద్రంలోనున్న రెండు ప్రైవేటు ఆధార్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. అయితే వేలసంఖ్యలో క్యూ కట్టడంతో సదరు కేంద్రాల నిర్వాహకులు డబ్బులు గుంజేందుకు తెగబడుతున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. అంతేగాకుండా కేంద్రాలవద్ద కొంతమంది దళారుల అవతారమెత్తి డబ్బులు గంజుతున్నట్లు వాపోతున్నారు. జిల్లావ్యాప్తంగా ఆధార్నమోదు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అధికారులు ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నారు గానీ ఇప్పటికీ ఏర్పాటు చేయలేదని ఆరోపిస్తున్నారు. దీంతో ఆధార్ లేక చాలామంది ఆరోగ్య పథకానికి అనర్హులుగా మారే అవకాశముందని అంటున్నారు. ఓవైపు న్యాయస్థానం దేనికీ ఆధార్ను లింకు పెట్టవద్దని తీర్పు ఇచ్చినా...ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్పష్టత ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు.